Intel
-
హెచ్పీ సీఈఎస్లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు
టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. టెక్ యుగంలో ల్యాప్టాప్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో సేవలందిస్తున్న హెచ్పీ(HP) కంపెనీ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)-2025లో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇవి కృత్రిమమేధ సాయంతో పని చేస్తాయని కంపెనీ తెలిపింది. దాంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది. 2025వ సంవత్సరానికిగాను సీఈఎస్ లాస్వెగాస్లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది.హెచ్పీ ఎలైట్ బుక్ అల్ట్రా జీ1ఐ: ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్తో 48 టాప్స్ ఎన్పీయూ టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేసే ఏఐ బిజినెస్ నోట్ బుక్ అని కంపెనీ తెలిపింది.హెచ్పీ జెడ్ బుక్ అల్ట్రా జీ 1ఎ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 14 అంగుళాల ల్యాప్టాప్ ఇది. ఏంఎడీ ప్రాసెసర్తో వచ్చే ఈ డివైజ్తో హై-పెర్ఫార్మెన్స్ వర్క్ ఫ్లోలకు ఎంతో సమర్థంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది.హెచ్పీ జెడ్2 మినీ జీ1ఏ: ఏఎండీ రైజెన్ ఏఐ మ్యాక్స్ ప్రో ప్రాసెసర్లు, 6-కోర్/12-థ్రెడ్ నుంచి 16-కోర్/32-థ్రెడ్ కాన్ఫిగరేషన్లతో దీన్ని ఆవిష్కరించారు. ఏఎండీ రేడియన్ 8060ఎస్, 8050ఎస్, 8040ఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయం ఉండేలా దీన్ని తయారు చేశారు.ఇదీ చదవండి: మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!హెచ్పీ జెడ్ క్యాప్టిస్: మెటీరియల్స్ డిజిటలైజ్ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి దీన్ని రూపొందించారు. ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మెటీరియల్ క్యాప్చర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇది ఎన్వీడియోకు చెందిన జెట్సన్ ఏజీఎక్స్ జేవియర్ మాడ్యూల్, ఫోటోమెట్రిక్ కంప్యూటర్ విజన్ సిస్టమ్ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.హెచ్పీ థండర్ బోల్ట్ 4 అల్ట్రా జీ6 డాక్: ఇది డాకింగ్ స్టేషన్గా పని చేస్తుంది. రెండు వెర్షన్లలో ఒకటి 180 వాట్లు, మరొకటి 280 వాట్ల శక్తిని అందిస్తుంది. -
ఇంటెల్ ఉద్యోగుల కోసం మాజీ సీఈవో ఉపవాసం..
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ ఉద్యోగుల కోసం దాని మాజీ సీఈవో పాట్ గెల్సింగర్ ఉపవాసం ఆచరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులనూ కోరుతున్నారు. ఇంతకీ ఉపవాసం ఎందుకు చేస్తున్నారు.. ఇంటెల్ ఉద్యోగులకు ఏమైంది.. ఈయన ఏం చెప్పారన్నది ఇప్పుడు చూద్దాం..ఇంటెల్ సంస్థ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ సీఈవో పాట్ గెల్సింగర్.. సంస్థలో పనిచేస్తున్న లక్ష మందికి పైగా ఉద్యోగుల శ్రేయస్సు, వారి భవిష్యత్తు కోసం లోతైన ఆందోళనను వ్యక్తం చేస్తూ తాను ఆచరిస్తున్న ప్రార్థన, ఉపవాసంలో తనతో చేరాలని సహోద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరుకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు."నేను ప్రతి గురువారం 24 గంటలపాటు ప్రార్థన, ఉపవాసం ఆచరిస్తున్నాను. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న లక్ష మంది ఇంటెల్ ఉద్యోగుల కోసం ప్రార్థనలు, ఉపవాసం చేయడంలో నాతో చేరాలని ఈ వారం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంటెల్, దాని సిబ్బంది పరిశ్రమకు, యూఎస్ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది" అని గెల్సింగర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురుచిప్ మార్కెట్లో ఇంటెల్ ప్రభ తగ్గిపోవడం, మరోవైపు ఎన్విడియా పుంజుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కంపెనీ బోర్డ్ విశ్వాసాన్ని కోల్పోయిన జెల్సింగర్ ఉద్వాసనకు గురయ్యారు. ఇంటెల్ సంస్థను నడిపించడం తనకు లభించిన జీవితకాల గౌరవమని తన పదవీ విరమణ సందర్భంగా గెల్సింగర్ పేర్కొన్నారు.ఇంటెల్లో ఇటీవల గణనీయమైన పునర్వ్యవస్థీకరణ మార్పులు సంభవించాయి. 15% సిబ్బందిని తొలగించింది. 10 బిలియన్ డాలర్ల మేర ఖర్చును తగ్గించుకుంది. కంపెనీ ఇటీవలే ఒక్కో షేరుకు 0.46 డాలర్ల చొప్పున నష్టపోయింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 6.2% క్షీణించి 13.28 బిలియన్ డాలర్లకు తగ్గింది. జెల్సింగర్ నిష్క్రమణ తరువాత డేవిడ్ జిన్స్నర్, మిచెల్ జాన్స్టన్ హోల్తాస్లు తాత్కాలికంగా సహ సీఈవోలుగా నియమితులయ్యారు. శాశ్వత సీఈవో కోసం ఇంటెల్ తీవ్రంగా అన్వేషిస్తోంది.Every Thursday I do a 24 hour prayer and fasting day . This week I'd invite you to join me in praying and fasting for the 100K Intel employees as they navigate this difficult period. Intel and its team is of seminal importance to the future of the industry and US.— Pat Gelsinger (@PGelsinger) December 8, 2024 -
హెచ్సీఎల్ నుంచి డేటా ట్రస్ట్ షీల్డ్
న్యూఢిల్లీ: ఐటీ రంగ సంస్థ హెచ్సీఎల్టెక్ తాజాగా యూఎస్కు చెందిన చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ సహకారంతో డేటా ట్రస్ట్ షీల్డ్ పేరుతో ఎంటర్ప్రైస్ డేటా సెక్యూరిటీ సర్వీసులను ప్రారంభించింది. క్లౌడ్ వ్యవస్థలో సున్నిత సమాచార రక్షణను ఇది మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది.ఇంటెల్ ట్రస్ట్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ (ఇంటెల్ టీడీఎక్స్), ఇంటెల్ ట్రస్ట్ అథారిటీ వంటి విశ్వసనీయ సాధనాలను ఉపయోగించడం ద్వారా క్లౌడ్ కార్యకలాపాల సమయంలో సున్నిత సమాచారాన్ని భద్రపరచడానికి డేటా ట్రస్ట్ షీల్డ్ రూపొందించినట్టు వివరించింది. ఈ సొల్యూషన్ గూగుల్ క్లౌడ్లో పరీక్షించామని, భవిష్యత్తులో ఇతర భారీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానిస్తామని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్సిగ్నల్ఈ సేవలు డేటా భద్రతలో ఒక ప్రధాన ముందడుగు అని, అధిక స్థాయి రక్షణను అందిస్తుందని హెచ్సీఎల్టెక్ ఈవీపీ ఆనంద్ స్వామి వివరించారు. ఇంటెల్ అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఈ సొల్యూషన్ డిజిటల్ ఆస్తులను సురక్షితం చేస్తుందని, క్లౌడ్ వ్యవస్థపై విశ్వాసం పెంచుతుందని అన్నారు. -
ఇంటెల్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఆ సౌకర్యాలు మళ్లీ..
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబ్బందికి ఉచితంగా కాఫీ, టీ వంటి పానీయాలు అందించే సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శ్రామికశక్తిని ఉత్తేజపరిచే ఈ నిర్ణయం అంతర్గత సందేశాల ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది.వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్ దాదాపు ఏడాది తర్వాత తమ కార్యాలయ సంస్కృతిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్ పేర్కొంది."ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము." అని వివరించింది.ఫ్రీ ఫ్రూట్స్కు నోఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఉచితంగా పండ్లు అందించే సౌలభ్యాన్ని మాత్రం కంపెనీ పునఃప్రారంభించడం లేదు. కంపెనీ నిరంతర వ్యయ-తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్ సిద్ధపడలేదు. -
ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!
ప్రముఖ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ తమ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. పని ప్రదేశాల్లో సిబ్బందికి అందించే టీ, కాఫీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పరిణామంతో సంస్థలో పని చేస్తున్న మరింత మంది తమ కొలువులను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇజ్రాయెల్లోని ఇంటెల్ కంపెనీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు టీ, కాఫీ, పండ్లు వంటి సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కాస్ట్కటింగ్ పేరిట ఇప్పటికే దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రకటనతో కంపెనీ పరిస్థితిపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఉద్యోగులకు కాంప్లిమెంటరీగా అందించే కాఫీ, టీ, పండ్లకు పెద్దగా ఖర్చవ్వదు. అలాంటిది సంస్థ వాటిని అందించేందుకు కూడా ఇంతలా ఆలోచిస్తుందంటే పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో మరింత మందికి లేఆఫ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే కంపెనీలోని మొత్తం శ్రామికశక్తిలో 15 శాతానికిపైగా ఉద్యోగులను కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ పేరుతో తొలగించారు.కొత్తగా మళ్లీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన లేఖలను జారీ చేయడానికి మేనేజర్లు సమావేశాలను షెడ్యూల్ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ వారం నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీలను సైతం అందించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!ఇదిలా ఉండగా, సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ గతంలో వెల్లడించారు. ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించింది. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి. -
15 వేల మంది తొలగింపు ప్రకటన.. షేర్లు భారీ పతనం
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పోరేషన్ భారీగా నష్టపోయింది. భారీ వృద్ధి అంచనాతో 15,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆ కంపెనీ షేర్లు 40 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.శుక్రవారం న్యూయార్క్లో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత షేర్లు 26% పైగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 32 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్లూమ్బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, కనీసం 1982 నుంచి కంపెనీ స్టాక్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని ఇది సూచిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని కంపెనీ గురువారం తెలిపింది. బ్లూమ్బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం విశ్లేషకులు సగటున 14.38 బిలియన్ డాలర్లు అంచనా వేశారు. కానీ ఇంటెల్ ఒక్కో షేరు 3 సెంట్ల చొప్పున నష్టపోయాయి. ఇంటెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 15% మందికిపైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇంటెల్ తాజాగా తెలిపింది. -
భారీ ఉద్యోగాల కోత!.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం
2024లో కూడా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ చిప్ తయారీ సంస్థ 'ఇంటెల్' (Intel) కూడా చేరింది.ఇంటెల్ లాభాలు గణనీయంగా తగ్గడం.. మార్కెట్ వాటాను కోల్పోయిన తర్వాత, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ వారంలోనే వేలాదిమంది ఉద్యోగులను తొలగించున్నట్లు సమాచారం. అయితే ఎంతమందిని తొలగిస్తుందనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. ఉద్యోగుల తొలగింపులు ఈ వారంలోనే ఉండొచ్చని సమాచారం.ఇంటెల్ కంపెనీ సుమారు లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే ఇది అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 2023 మధ్య భారీగా ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?చిప్ తయారీ రంగంలో ఖర్చులను తగ్గించి రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఇంటెల్ పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఈఓ పాట్రిక్ పీ గెల్సింగర్ వెల్లడించారు. కంపెనీ ల్యాప్టాప్లు, డెస్క్టాప్ల కోసం చిప్లను తయారుబ్ చేస్తోంది. ఇతర కంపెనీల కోసం కూడా సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయడానికి ఫ్యాక్టరీలను నిర్మించడంపై దృష్టి సారించింది. సంస్థ ఇటీవల తన తయారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నాగ చంద్రశేఖరన్ను నియమించుకుంది. -
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
యూఎస్ ఆధారిత సైబర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ అమెరికన్ చిప్ తయరీ సంస్థ ఇంటెల్ సహకారంతో డీప్ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీను రూపొందిస్తుంది. మీడియా సంస్థల కథనం ప్రకారం.. మెకాఫీ డీప్ఫేక్ డిటెక్టర్ సింథటిక్ కంటెంట్ను గుర్తించడానికి ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లలోని న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్పీయూ)ను వాడుకుంటూ ఏఐ అల్గారిథమ్లను అమలు చేస్తుంది.డీప్ఫేక్ ప్రాసెసింగ్ కోసం వ్యక్తిగత డేటాను క్లౌడ్కు పంపాల్సిన అవసరం లేకుండా విశ్లేషణ మొత్తం డివైజ్లోనే జరుగుతుందని మెకాఫీ తెలిపింది. ఈ ప్రక్రియ వినియోగదారు గోప్యతకు ప్రధాన్యం ఇస్తుందని చెప్పింది. ఈ టెక్నాలజీ పనితీరును 300 శాతం మెరుగుపరిచేలా కొత్త విధానం ఉపయోగపడుతుందని తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో డీప్ఫేక్ సంబంధించిన వీడియోలను కనుగొనేందుకు మరిన్ని ల్యాంగ్వేజీలను వినియోగించనున్నట్లు చెప్పింది.మెకాఫీ డీప్ ఫేక్ డిటెక్టర్ ఏఐ ఆధారిత డిటెక్షన్ టెక్నిక్లను వినియోగిస్తుంది. ఏఐ ట్రాన్స్ఫామ్ ఆధారిత ‘డీప్ న్యూరల్ నెట్వర్క్’ మోడల్లతో ఇది పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మెకాఫీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్టీవ్ గ్రోబ్మాన్ మాట్లాడుతూ..‘ఇంటెల్తో కలిసి పనిచేయడం గొప్పఅనుభవాన్నిస్తుంది. ఏఐ రూపొందించిన డీప్ఫేక్ల్లో నకిలీ వాటిని గుర్తించేలా కొత్త టెక్నాలజీను వాడుతున్నాం. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ టెక్నాలజీకు చెందిన ఎన్పీయూను ఉపయోగిస్తున్నాం. దాంతో వినియోగదారులకు శక్తివంతమైన ఏఐ డీప్ఫేక్ డిటెక్షన్ సామర్థ్యాలను అందించనున్నాం’ అన్నారు. -
ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ మృతి.. సైకిల్పై వెళ్తుండగా ఏమైందంటే..
ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(68) మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్షిప్లో కన్నుముశారు. ఆయన సైకిల్పై వెళుతుండగా వేగంగా వచ్చిన క్యాబ్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..బుధవారం తెల్లవారుజామున 5:50 గంటలకు సైనీ తన సహచరులతో కలిసి నెరుల్ ప్రాంతంలోని పామ్ బీచ్ రోడ్డులో సైకిల్పై వెళుతున్నారు. వేగంగా వస్తున్న క్యాబ్ సైనీ సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే కిందపడిన సైకిల్ ఫ్రేం క్యాబ్ ముందు చక్రాల కింద ఇరుక్కుపోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో సైనీకి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి సైక్లిస్టులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు చెప్పారు. ఇదీ చదవండి: ఆన్లైన్లో ఆవులు.. ఊరించిన ఆఫర్.. తీరా చూస్తే.. సైనీ ఇంటెల్ 386, 486 మైక్రోప్రాసెసర్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కంపెనీ పెంటియమ్ ప్రాసెసర్ రూపకల్పనకు ఆయన నాయకత్వం వహించారు. ఇంటెల్ దక్షిణాసియా విభాగానికి డైరెక్టర్గా వ్యవహరించారు. ఆయన సతీమణి మూడేళ్ల క్రితమే చనిపోయారు. కుమార్తె, కుమారుడు అమెరికాలో నివాసముంటున్నారు. సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
‘అప్పుడే అయిపోలేదు’..ఇంటెల్ ఉద్యోగులకు భారీ షాక్..!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. తాజాగా చేపట్టిన 5వ రౌండ్ తొలగింపుల్లో సుమారు 235 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్ధిక మాద్యం మందస్తు భయాలు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా సంస్థలు వర్క్ ఫోర్స్ను తగ్గించుకుంటున్నాయి. ఇంటెల్ సైతం అదే దారిలో ఉన్నట్లు సమాచారం. అమెరికా కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో రీసెర్చ్, డెవలప్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది చిప్ తయారీ సంస్థ ఇంటెల్ 2025 నాటికి కాస్ట్ కటింగ్ చేసి సుమారు 10 బిలియన్ డాలర్లను ఆదా చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఇందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ‘ఇంటెల్ సంస్థ పలు విభాగాల్లో ఉద్యోగుల తొలగింపుతో ఖర్చుల్ని తగ్గించుకునే వ్యూహంతో పనిచేస్తుందని’అని కంపెనీ ప్రతినిధి అడీ బర్ శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ నివేదికలో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపులు అప్పుడే అయిపోలేదని.. వచ్చే ఏడాది మరిన్ని తొలగింపులు ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా, గతంలో జరిగిన ఉద్యోగుల తొలగింపుల్లో ఇంటెల్ దాని ఫోల్సమ్ క్యాంపస్లో 549 మందికి పింక్ స్లిప్ జారీ చేసింది. -
భారత్లో ఆఫీస్ను అమ్మేస్తున్న ఇంటెల్.. వేలాది మంది ఉద్యోగుల్ని..
మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ కంపెనీలకు భిన్నంగా టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్థిక మాంద్యం రాబోతుందన్న అంచనాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులకు అందించే జీత భత్యాల్లో ఇంటెల్ కోత విధించింది. తాజాగా, భారత్లోని బెంగళూరు ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 250,000 స్కైర్ ఫీట్ కార్యాలయాన్ని ఇంటెల్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రూ.450 కోట్ల విలువైన ఆఫీస్ బిల్డింగ్ను అమ్మేందుకు కొనుగోలు దారుల్ని బిడ్డింగ్ ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్లో పాల్గొనేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్ల లీజ్కు అయితే, అమ్మకం పూర్తయిన త్వరాత అదే ఆఫీస్ కార్యాలయాన్ని మూడేళ్ల పాటు ఇంటెల్ లీజుకు తీసుకోనుంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ మోడల్ను అమలు చేయనుంది. నిజమే.. అమ్ముతున్నాం బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్న ఆఫీస్ను అమ్ముతున్నారనే నివేదికపై ఇంటెల్ ప్రతినిధులు స్పందించారు. అమ్మకం నిజమేనని, హైబ్రిడ్ ఫస్ట్ కంపెనీగా, మా ఉద్యోగులు ఆన్ సైట్లో పనిచేస్తున్నప్పుడు వారి కోసం వర్క్స్పేస్లను రూపొందించేలా స్పేస్ వినియోగాన్ని అంచనా వేస్తున్నాం. అదే సమయంలో ఖర్చుల్ని తగ్గించుకుంటున్నామని చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. 14,000 మంది ఉద్యోగులు బెంగళూరు ఇంటెల్ కార్యాలయంలో 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వారు ఉన్నారు. కంపెనీ చరిత్రలోనే భారీ నష్టం కోవిడ్-19 కారణంగా మహమ్మారి సంక్షోభ సమయంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు గిరాకీ అమాంతం పెరిగింది. కంపెనీలు తిరిగి తెరుచుకుంటుండడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పీసీలకు గిరాకీ పడిపోయింది. వెరసీ ఆ ప్రభావం ఇంటెల్ క్యూ1 ఫలితాల పడింది. ఇంటెల్ ప్రతి షేర్ ఆదాయంలో 133 శాతం వార్షిక తగ్గింపు నమోదు కాగా, ఆదాయం సంవత్సరానికి దాదాపు 36 శాతం పడిపోయి 11.7 బిలియన్లకు పడిపోయిందని సీఎన్బీసీ నివేదిక తెలిపింది. ఈ పరిణామాలతో ఇంటెల్ ఎంత వీలైతే అంతే ఖర్చును తగ్గించుకుంటుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న సొంత ఆఫీస్ బిల్డింగ్ను అమ్మేసి.. లీజుకు తీసుకుంటుందని సమాచారం. చదవండి👉 29 ఏళ్ల తర్వాత.. ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ రాజీనామా! -
29 ఏళ్ల తర్వాత.. ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ రాజీనామా!
ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా చిప్ తయారీ సంస్థ ఇంటెల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటెల్ ఇండియా అధినేతగా, వివిధ హోదాల్లో 29 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన నివృతి రాయ్ ఇంటెల్కు రాజీనామా చేశారు. త్వరలో, ‘ఇన్వెస్ట్ ఇండియా’ అధినేతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొంత కాలం క్రితం ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట్గా కొనసాగుతున్న దీపక్ బగ్లా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని రాయ్ భర్తీ చేయనున్నారు. ఇక రాయ్ రాజీనామాని ఇంటెల్ యాజమాన్యం ధృవీకరించింది. ‘రాయ్ నాయకత్వంలో ఇంటెల్ ఇండియా గణనీయమైన వృద్దిని సాధించిందని కొనియాడింది. ఆర్ధిక సేవల విభాగంలో చేరడంపై అభినందనలు తెలిపింది. రాయ్ 1994లో అమెరికా ఇంటెల్లో డిజైన్ ఇంజినీర్గా తన కెరియర్ను ప్రారంభించారు. 2005లో భారత్కు తిరిగి వచ్చిన ఆమె ఆ సంస్థ చిప్సెట్ ఇంజినీరింగ్ అండ్ ఐపీ డెవెలప్మెంట్ గ్రూప్ సీనియర్ డైరెక్ట్గా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార మెళుకువలు, అపారమైన అనుభవం కారణంగా 2016 నాటికి ఇంటెల్ ఇండియా అధినేత స్థాయికి చేరుకున్నారు. తాజాగా, ఇంటెల్కు రాజీనామా చేసి ఇన్వెస్ట్ ఇండియాలో చేరనున్నారు. నారీ శక్తి పురస్కారం.. ఇంటెల్ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. 2021 నుంచి ఇంటెల్ ఇండియా స్కిల్ ట్రైనింగ్, రూరల్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ్యంగా, 20లక్షల మంది పిల్లలకు, 5,000 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులకు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించింది.ప్రపంచ స్థాయిలో మహిళా వ్యవస్థాపకత, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన అత్యుత్తమ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమెకు నారీ శక్తి పురస్కారాన్ని అందజేశారు. Congrats to @rnivruti of @IntelIndia on being awarded the #NariShaktiPuraskar by Hon’ble President Shri Ramnath Kovind ji for developing power efficient semiconductor chips & new rural connectivity solutions for cost-effective & high-speed broadband connection.@rashtrapatibhvn https://t.co/e4AKR3rEHH — Basavaraj S Bommai (@BSBommai) March 8, 2022 రాజీనామా.. ఇంటెల్లో చర్చాంశనీయం కోవిడ్-19తో పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరగడం.. వర్క్ ప్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చిప్ కొరత నెలకొంది. చిప్లు, సెమీ కండక్టర్ల కొరతతో స్మార్ట్ ఫోన్ల లాంచింగ్, కార్ల ఆవిష్కరణలు.. జాప్యం అవుతున్నాయి. కార్ల డెలివరీ కూడా ఆలస్యం అవుతున్నది. ఇలా ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ విభాగాలతో పాటు మొత్తం 169 రకాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఇంటెల్ లాంటి చిప్ తయారీ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ తరుణంలో నివృతి రాయ్ ఇంటెల్ ఇండియాకు రాజీనామా చేయడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 మోదీ ‘హై - టెక్ హ్యాండ్ షేక్’.. భారత్కు పెట్టుబడుల వరద! -
విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత
న్యూయార్క్: అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడుగోర్డాన్ మూరే (94)కన్నుమూశారు. శనివారం హవాయిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఇంటెల్ కార్పొరేషన్ తన సహ వ్యవస్థాపకుడికి నివాళులర్పించింది. ఆయన చిరస్మరణీయం.. గొప్ప విజనరీని కోల్పోయమంటూ ట్వీట్ చేసింది. మూరే దూరదృష్టి హైటెక్ యుగానికి వేదికైంది అంటూ వ్యాపార వర్గాలు నివాళులర్పించాయి. యాపిల్, ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలకు ఆగమనానికి ఆద్యుడు మూరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. Today, we lost a visionary. Gordon Moore, thank you for everything. pic.twitter.com/bAiBAtmd9K — Intel (@intel) March 25, 2023 మూరే ఎప్పుడూ 'యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూర్' అని తనను తాను పిలుచుకునేవారు. ఎందుకంటే ఆయన టీచర్ కావాలనుకునేవారట. కానీ ఎలక్ట్రానిక్స్ను ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా మార్చి సరికొత్త విప్లవానికి నాంది పలికారు. మైక్రోచిప్ పరిశ్రమలో 500 డాలర్ల పెట్టుబడితో బిలియనీర్గా అవతరించారు. 1960లలో కంప్యూటర్ చిప్ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన కాలిఫోర్నియా సెమీకండక్టర్ చిప్ మేకర్ ఇంటెల్.. సిలికాన్ వ్యాలీకి ఆ పేరు రావడానికి దోహదపడింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, గతంలో అమెరికన్ విస్తారమైన ఉక్కు పారిశ్రామిక ఆధిపత్యానికి బ్రేక్ వేసింది ఇంటెల్. ఇంటెల్ ఆవిష్కారం మూరే అతని దీర్ఘకాల సహచరుడు రాబర్ట్ నోయ్స్ జూలై 1968లో ఇంటెల్ను స్థాపించారు. వందల మిలియన్ల మందికి ల్యాప్టాప్ కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత, టోస్టర్ ఓవెన్లు, బాత్రూమ్ స్కేల్స్ , టాయ్ ఫైర్ ట్రక్కుల నుండి టెలిఫోన్లు, ఆటోమొబైల్స్ ,ఎయిర్క్రాఫ్ట్ దాకా తమ మైక్రోప్రాసెసర్లతో అరుదైన ఘనతను మూరే దక్కించుకున్నారు. 1975లో ఇంటెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికంటేముందు మూరే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు 1979లో బోర్డ్ ఛైర్మన్, సీఈవోగా నియమితుడయ్యారు. 1987లో సీఈవోగా పదవి నుంచి వైదొలగి ఛైర్మన్గా ఉన్నారు. మరో విశేషమేమిటంటే, 1990ల నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన 80శాతం కంప్యూటర్లలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్లే. ఫలితంగా చరిత్రలో అత్యంత సంపన్నమైన సెమీ కండక్టర్ వ్యాపారంగా నిలిచింది. (ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్బర్గ్) గొప్ప దాత మూరే మూరే, అతని భార్య బెట్టీ మూరేతో కలిసి విస్తృత దానాలు చేశారు. 2001లో వీరిద్దరూ కలిస బెట్టీ మూరే ఫౌండేషన్ను స్థాపించారు. 175 మిలియన్ ఇంటెల్ షేర్లను విరాళంగా ఇచ్చారు. 2001లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 600 మిలియన్ డాలర్లతో ఒక విశ్వ విద్యాలయానికి అందించిన ఏకైక గొప్ప బహుమతినిచ్చిన గౌరవాన్ని దక్కించుకున్నారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) మూర్స్ లా కంప్యూటర్ విప్లవం ప్రారంభమవడానికి రెండు దశాబ్దాల ముందే కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్ ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతాయని మూరే ముందే ఊహించాడు. ఆ తర్వాత దీన్ని ప్రతి రెండేళ్లకు అని సవరించారు. దీన్నే మూర్స్ లా అని పిలుస్తారు. -
ఏపీ విద్యార్థికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ‘ఇంటెల్’లో ఉద్యోగం
ఆత్మకూరు రూరల్(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు యువకుడికి యునైటెడ్ స్టేట్స్ ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఖరక్పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు -
ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితుల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల మెడపై ఉద్వాసనల కత్తి వేలాడుతోంది. తాజాగా చిప్మేకర్ ఇంటెల్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల జీతం లేని సెలవులతో వేలాదిమంది పారిశ్రామిక కార్మికులను ఇంటికి పంపిస్తోంది. క్లిక్ చేయండి: పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్ తప్పదు! డెడ్లైన్ ఎపుడో తెలుసా? తాజా మీడియా నివేదికల ప్రకారం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇంటెల్ కాలిఫోర్నియాలో 201 మంది ఉద్యోగులపై వేటు వేసింది. "వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ల" ప్రకారం 111 మంది ఉద్యోగులను తొలగించగా, 90 మంది ఉద్యోగులను కంపెనీ హెడ్ క్వార్టర్ శాంటా క్లారా లొకేషన్ నుంచి బయటికి పంపింది. 2023 జనవరి 31 నుండి తొలగింపులు ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి, ఇంటెల్ సంవత్సరానికి 8-10 బిలియన్ల డాలర్లమేర ఆదా చేయాలని భావిస్తోందట. (మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!) ప్రస్తుత వాతావరణానికి తగినట్టుగా ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అక్టోబరులో కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాల కాల్ సందర్భంగా, ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పీసీ విక్రయాలు పడిపోవడంతో ఇంటెల్ వేలాదిమందిని తొలగించనుందని గతంలోనే నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. (5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్లో అదరిపోయే ఆఫర్లు) కాగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 853 కంప్యూటర్ వ్యాపార సంస్థలు దాదాపు 137,492 మంది కార్మికులను తొలగించాయి. రానున్న ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మెటా, ట్విటర్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ సహా అనేక ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపులో ముందంజలో ఉన్నాయి. -
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త
ఈ వారం టెక్నాలజీ మార్కెట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు హాట్ టాపిగ్గా మారాయి. ముఖ్యంగా యాపిల్, శాంసంగ్ 5జీకి సపోర్ట్ చేసేలా తమ ఫోన్లలో సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తాయని ప్రకటించాయి. దీంతో పాటు మెటా సంస్థ తన క్వెస్ట్ ప్రో విఆర్ హెడెసెట్ను ఆవిష్కరించింది. హై-ఎండ్ విఆర్ యాక్సెసరీ మార్కెట్లో అడుగు పెడుతున్నట్లు హింట్ ఇచ్చింది. వీటితో పాటు మిగిలిన టెక్నాలజీ వార్త విశేషాల గురించి తెలుసుకుందాం. 40 శాతం డేటా గల్లంతు 40శాతం పైగా భారతీయ వినియోగదారుల డేటా ఆన్లైన్లో లీకైంది. దేశ ఐటీ వ్యవహారాలపై దృష్టి సారించిన అంతర్జాతీయ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఐఎస్ఎస్పీఏ) మన దేశానికి చెందిన 41 శాతం మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరస్తులు దొంగిలించినట్లు వెల్లడించింది. 5జీ అప్డేట్స్ దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలైన యాపిల్, శాంసంగ్తో పాటు ఇతర సంస్థలు 5జీ సపోర్ట్ చేసేలా తమ ఫోన్లలో ఓవర్-ది- ఎయిర్ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తామని తెలిపాయి. ఉద్యోగులపై వేటు ద్రవ్యోల్బణం, సప్లయి అండ్ డిమాండ్ తగ్గిపోవడంతో టెక్ దిగ్గజం ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 113,000 మంది ఉద్యోగులు ఇంటెల్లో పనిచేస్తుండగా.. వారిలో 20 శాతం మంది ఉద్యోగులకు వేటు వేయనున్నట్లు బ్లూం బెర్గ్ నివేదించింది. వీఆర్ హెడ్సెట్ ఆవిష్కరణ సోషల్ మీడియా దిగ్గజం మెటా వీఆర్ యాక్సెసరీ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన కొత్త క్వెస్ట్ ప్రో విఆర్ హెడ్సెట్ను ఆవిష్కరించింది. దీని ధర 1500 డాలర్లు ఉంది. ఈ ట్యాక్సీ గాల్లో ఎగురుతుంది చైనాకు చెందిన టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్ పెంగ్ దుబాయ్లో తన ఫ్లయింగ్ టాక్సీ మోడల్ను పరీక్షించింది. మానవరహిత విమానంపై ట్రయల్స్ నిర్వహించిన ఎక్స్పెంగ్.. గతంలో మానవ సహిత విమానాలను పరీక్షించినట్లు పేర్కొంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ టైప్- సీ పోర్టులను మార్కెట్లో విడుదల చేయనుంది.ఇందులో భాగంగా 2024 నాటికి ఎయిర్ పాడ్స్, మ్యాక్ యాక్ససరీస్కు సపోర్ట్ చేసేలా టైప్-సీ సపోర్ట్ పోర్టులను తయారు చేసి వాటిని అందుబాటులోకి తేనుంది. -
భారీగా ఉద్యోగులపై వేటు..ఇంటెల్ చరిత్రలోనే తొలిసారి!!
ప్రముఖ సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఇంటెల్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ డిమాండ్ తగ్గడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. బ్లూం బెర్గ్ విడుదల చేసిన జులై రిపోర్ట్లో ఇంటెల్ మొత్తం ఉద్యోగులు 113,700 మంది పనిచేస్తున్నారు. అయితే తాజాగా పీసీ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా ఇంటెల్ 20శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు, వారిలో సేల్స్, మార్కెటింగ్ బృంద సభ్యులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నో కామెంట్ ఉద్యోగుల తొలగింపుపై ఇంటెల్ నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా.. జులై నెలలో ఆ సంస్థ ప్రకటించిన సేల్స్ గణాంకాలే కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాల ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్న ద్రవ్యోల్బణం, దీనికి తోడు కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోవడం, స్కూల్స్ ఓపెన్ కావడం, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాల నుంచి విధులు నిర్వహించడం వంటి ఇతర కారణాల వల్ల పీసీల వినియోగం తగ్గిపోయింది. చదవండి👉 'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్! చైనా- ఉక్రెయిన్ వార్ సెమీ కండక్టర్ల తయారీ సంస్థలకు కీలకమైన పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్ చైనాలో కోవిడ్-19 ఆంక్షలు, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం సప్లయి చైన్ సమస్యలు డిమాండ్పై ప్రభావంపై పడింది.అందుకే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఇంటెల్ కార్యకలాపాల్ని కొనసాగించాలని భావిస్తోంది. కాబట్టే ఉద్యోగుల్ని తొలగించడంపై దృష్టిసారించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 బెటర్డాట్ కామ్ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి! -
రూ.76వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వ పథకం, ప్రధాని మోదీతో ఇంటెల్ సీఈఓ భేటీ!
న్యూఢిల్లీ: గ్లోబల్ చిప్ దిగ్గజం ఇంటెల్ సీఈవో ప్యాట్ జెల్సింగర్తో సమావేశం సంతృప్తికరంగా సాగినట్లు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. దేశీయంగా చేపట్టిన సెమీకండక్టర్ ప్రోగ్రామ్, మొబిలిటీ, టెక్నాలజీ, ఆటో ఇన్నోవేషన్లపై వ్యూహాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. జెల్సింగర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలసినట్లు పీఎంవో పేర్కొంది. టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్పై చర్చలు జరిగినట్లు తెలియజేసింది. కాగా.. జెల్సింగర్తో సమావేశంలో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణా, జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సైతం హాజరైనట్లు రాజీవ్ వెల్లడించారు. సెమీకండక్టర్, డిస్ప్లే తయారీకి మద్దతుగా ప్రభుత్వం రూ.76,000 కోట్లతో పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇంటెల్ సీఈవో దేశీ పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం ద్వారా హైటెక్ ప్రొడక్షన్కు గ్లోబల్ కేంద్రంగా ఆవిర్భవించాలని ప్రభుత్వం లక్షిస్తోంది. చిప్ తయారీ దిగ్గజాలను ఆకట్టుకునే యోచనలో ఉంది. -
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ను లాంచ్ చేసిన ఇంటెల్..!
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డెస్క్టాప్( 12 జెన్ i9-12900KS) ప్రాసెసర్ను లాంచ్ చేసింది. ఇంటెల్ i9-12900KS ప్రాసెసర్ ఏకంగా 5.5GHz ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది. ఈ ప్రాసెసర్ మునుపటి i9 చిప్సెట్లకు కొనసాగింపుగా రానుంది. ఇంటెల్ i9-12900KS ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ ప్రాసెసర్ ఇంటెల్ థర్మల్ వెలాసిటీ బూస్ట్తో గరిష్టంగా 5.5 GHz వరకు టర్బో ఫ్రీక్వెన్సీతో పనిచేయనుంది. ఇది మెరుగైన గేమింగ్ పనితీరు కోసం ఇంటెల్ అడాప్టివ్ బూస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. 30MB ఇంటెల్ స్మార్ట్ కాచీతో పాటు మొత్తం 16 కోర్స్, 24 థ్రెడ్స్ను కల్గి ఉంది. 150W ప్రాసెసర్ బేస్ పవర్, PCle Gen 5.0 అండ్ 4.0కి సపోర్ట్ చేస్తుంది. DDR5 4800 MT/s వరకు మరియు DDR4 3200 MT/s మద్దతును అందిస్తోంది. Intel కోర్ i9-12900KS ఇప్పటికే ఉన్న Z690 మదర్బోర్డులకు అనుకూలంగా ఉండనుంది. ధర ఏంతంటే...? ఇంటెల్ తన కొత్త i9-12900K ప్రాసెసర్ను ఏప్రిల్ 5, 2022 నుంచి అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాసెసర్ ధర 739 డాలర్లు(సుమారు రూ. 55,937)గా ఉంది. ఈ ప్రాసెసర్ను ప్రపంచవ్యాప్తంగా అన్ని రిటైలర్ల వద్ద బాక్స్డ్ ప్రాసెసర్గా కనుగొనవచ్చు. చదవండి: అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా -
ఇంటెల్కు షాక్.. శాంసంగ్ దెబ్బ మామూలుగా లేదు!
ఒకవైపు సెమీకండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ రంగం, డివైజ్ తయారీ రంగం ఘోరంగా దెబ్బ తిన్నాయి. కొత్త మోడల్స్ సంగతి ఏమోగానీ.. ప్రొడక్టివిటీని పెద్ద మొత్తంలో చేయలేకపోతున్నాయి. ఈ తరుణంలో ఈ గ్యాప్లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ దూసుకొచ్చింది. ఏకంగా చిప్ దిగ్గజం ‘ఇంటెల్’కు ఎసరు పెట్టి.. తొలి స్థానాన్ని అధిగమించింది. 2021లో లాజిక్ ఐసీ, మెమరీ చిప్ సెగ్మెంట్లలో ఉత్పత్తి అధికంగా జరగడంతో శాంసంగ్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీలో ఉపయోగించే డైనమిక్ ర్యాన్డమ్-యాక్సెస్ మెమరీ (DRAM), NAND ఫ్లాష్ మార్కెట్ ఫర్ఫార్మెన్స్ సైతం ఇంటెల్ కంటే మెరుగైన బిజినెస్ చేయడం విశేషం. వాస్తవానికి కిందటి ఏడాది రెండో త్రైమాసికం వద్దే ఇంటెల్ను శాంసంగ్ అధిగమించింది. అయితే అది కొన్ని విభాగాల్లో మాత్రమే కావడం గమనార్హం. ఇప్పుడు పూర్తి కేటగిరీల్లో ఇంటెల్ను శాంసంగ్ డామినేట్ చేసేసింది. స్మార్ట్ఫోన్ ఎస్వోసీ (సిస్టమ్ ఆన్ చిప్), జీపీయూ అమ్మకందారులు కూడా యాభై శాతం అధిక ఆదాయాన్ని చవిచూసినట్లు కౌంటర్పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. తద్వారా అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ ఇంటెల్ను.. దక్షిణ కొరియా శాంసంగ్ అన్నింటా అధిగమించినట్లయ్యింది. ఈ పోటీలో శాంసంగ్ను ఇంటెల్ ఇప్పట్లో అధిగమించకపోవచ్చనే భావిస్తున్నారు నిపుణులు. అదనంగా టాప్ 15 అమ్మకందారుల్లో.. 27 శాతం ఆదాయ వృద్ధిని గమనించినట్లు రీసెర్చ్ అనలిస్ట్ విలియమ్ లీ వెల్లడించారు. ఇదిలా ఉంటే చిప్ కొరత సమస్య 2023 వరకు తీరేది కాదని ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ చెప్తున్నారు. మరోవైపు చిప్ కొరతను క్యాష్ చేసుకునే ఉద్దేశంలో శాంసంగ్ ఉంది. సుమారు 17 బిలియన్ల డాలర్లతో సెమీకండక్టర్ కంపెనీని ఆస్టిన్ బయట నెలకొల్పుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత వార్త: చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్ -
ఒమిక్రాన్ ఎఫెక్ట్..! మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం..! గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే...
ప్రపంచదేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు కేసులు గణనీయంగా పెరగడంతో ఆయా దేశాలు లాక్ డౌన్ను విధించే ఆలోచనలో ఉన్నాయి. కాగా ఒమిక్రాన్ ప్రభావం దిగ్గజ టెక్ కంపెనీలపై కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే..! 2022 జనవరి అమెరికా లాస్వెగాస్లో జరిగే టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ ఇప్పటికే పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. వారి బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా పయనిస్తోంది. సీఈఎస్-2022 షోలో పాల్గొనట్లేదని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తాత్కలికంగా టెక్ కాన్ఫరెన్స్ను వాయిదా వేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. లాస్ వెగాస్లో జనవరి 5,6,7,8 తేదీల్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగనుంది. 40కు పైగా కంపెనీలు లెనొవొ, టీ-మొబైల్స్, ఏటీ అండ్ టీ, మెటా, ట్విటర్, అమెజాన్, టిక్టాక్, పింట్రెస్ట్, ఆల్ఫాబెట్కు చెందిన వేమో వంటి 40కి పైగా బడా టెక్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ సదస్సుకు హాజరు కావాల్సి ఉండగా....వీరు కూడా సీఈఎస్-2022 షోలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ షోలో సుమారు 2200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు పాల్గొనున్నాయి. అంతర్జాతీయ సదస్సులు వాయిదా..! అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది.కాగా మరోవైపు ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12) కూడా వాయిదా పడింది. చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..! -
నో వ్యాక్సిన్.. నో శాలరీ.. నో జాబ్!
ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఈ విషయంలో జీతాల కోతల నుంచి అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. తాజాగా వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల్ని.. ఇంటికి సాగనంపాలని గూగుల్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో పయనించేందుకు కంపెనీలన్నీ సిద్ధపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఇతర కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు అలర్ట్. వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. ఆ సర్టిఫికెట్ను కంపెనీల్లో సమర్పించండి. లేకుంటే జీతాల కట్టింగ్.. అవసరమనుకుంటే ఊస్టింగ్కు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ నిర్ణయం ప్రకటించాక.. తర్వాత మరో ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయమే ప్రకటించింది. సెమీకండక్టర్లు తయారు చేసే ఇంటెల్ కంపెనీ తాజాగా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 4లోపు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్-వివరాల్ని సమర్పించాలని.. లేనిపక్షంలో వేతనం లేని సెలవుల మీద ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్ను దూరంగా ఉంటున్న ఉద్యోగాలు మినహాయింపుల కోసం సరైన ధృవపత్రాల్ని సమర్పించాలని కోరింది. మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణిస్తామని, ఇతర కారణాలను అంగీకరించబోదని మెమోలో పేర్కొంది ఇంటెల్. ఇందుకోసం మార్చి 15, 2022 డెడ్లైన్ విధించారు. ఇక వ్యాక్సినేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. మూడు నెలలపాటు జీతాలు ఇవ్వమని, అప్పటికీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోతే తొలగింపు దిశగా ఆలోచిస్తామని ఇంటెల్ హెచ్ఆర్ హెడ్ క్రిస్టీ పాంబియాంచీ వెల్లడించారు. ఇక గూగుల్, ఇంటెల్ లాగే మరో 100 కంపెనీలు (మైక్రోసాఫ్ట్, మెటాలతో పాటు భారత్కు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి) ఈ నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లోనూ! వ్యాక్సినేషన్కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్కు ‘హై రిస్క్’ ట్యాగ్ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావిస్తున్నారు. తద్వారా వ్యాక్సినేషన్లో పాల్గొంటున్నారు. నో రిక్రూట్మెంట్ ఇక ఉద్యోగాల విషయంలోనే కాదు.. వాటి భర్తీ విషయంలోనూ కఠినంగా వ్యాక్సినేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారు. వ్యాక్సినేషన్కు దూరంగా ఉంటే.. వాళ్లకు ఉద్యోగాలు కష్టంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఐటీ, కార్పొరేట్, రియల్టి, ఫ్యాకల్టీ రంగాల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పణ కాలం తప్పనిసరిగా ఉంటోంది. చాలా కంపెనీల్లో హెచ్ఆర్లు.. ఇంటర్వ్యూ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అడుగుతుండడం విశేషం. చదవండి: ఒమిక్రాన్ అలజడి! భారత్ను కుదిపేయనుందా? -
టాటా గ్రూప్ భారీ ప్లాన్.. చైనాకు వేల కోట్ల నష్టం!
దేశంలో సెమీకండక్టర్ల తయారీ కోసం టాటా గ్రూప్ భారీ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చీప్ కొరత ఉంది. ఈ అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని టాటా చూస్తుంది. సెమీకండెక్టర్ల అసెంబ్లీ & టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 300 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టాటా గ్రూప్ మూడు రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల తెలిపాయి. సెమీకండెక్టర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు కొన్నాళ్ల క్రితం టాటా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్చలు గనుక సఫలం అయితే, ఈ 3 రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ & టెస్టింగ్ (ఓఎస్ఏటీ) ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ఓఎస్ఏటీ ప్లాంట్లో తయారైన సిలికాన్ వేఫర్లను అసెంబ్లింగ్, పరీక్షలు, ప్యాకింగ్ వంటివి చేస్తారు. ఇక్కడే అవి పూర్తి స్థాయి సెమీకండెక్టర్లు రూపొందుతాయి. వచ్చే నెల చివరి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ప్రదేశాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు తెలిపాయి. టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' డ్రైవ్ను బలపరుస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణాసియా దేశాన్ని స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో రెండవ అతిపెద్ద సెమీకండెక్టర్స్ తయారీదారుగా మార్చడానికి సహాయపడింది. చైనాకు వేల కోట్లలో నష్టం ప్రస్తుతం చైనాలో భారీగా సెమీకండెక్టర్ చిప్స్ తయారు అవుతున్నాయి. ఇక్కడి నుంచి అనేక దేశాలకు చిప్స్ ఎగుమతి అవుతున్నాయి. అయితే, టాటా గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టు వల్ల చైనాకు వేల కోట్లలో నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. టాటా ఓఎస్ఏటీ వ్యాపారం కోసం ఇంటెల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఎఎమ్డి), ఎస్ టి మైక్రోఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలతో చర్చలు జరుపుతుంది. ఈ కర్మాగారం వచ్చే ఏడాది చివరలో కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, 4,000 మంది కార్మికులను నియమించుకొనున్నట్లు సమాచారం. -
భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా?
Semiconductor Manufacturing: కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చైనాకు భారీగా నష్టాలు కలిగించే అవకాశాలు ఉన్నాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కొరతను అధిగమించడానికి భారత్ ప్రయత్నిస్తుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి భారతదేశం మెగా మల్టీ-బిలియన్-డాలర్ క్యాపిటల్ సపోర్ట్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్ను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చిప్ కొరత కారణంగా అన్నీ రంగాలలోని పరిశ్రమలు భారీ ఉత్పత్తి కోతలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. టీఓఐ నివేదికప్రకారం, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), ఇంటెల్, ఎఎమ్డీ, యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్ప్, ఫుజిట్సు వంటి కొన్ని అగ్ర సెమీకండక్టర్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. సెమీకండక్టర్ తయారీదారులను వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలనే ప్రధానమంత్రి కార్యాలయం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. కంపెనీలను దేశంలోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన విధానంతో ముందుకు రావాలని బహుళ మంత్రిత్వ శాఖలు ఆదేశించింది. ప్రత్యేక ప్రోత్సాహకాలు సెమీకండక్టర్ తయారీదారులకు దిగుమతి వస్తువులపై సుంకం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ & సెమీకండక్టర్(ఎస్ఎసీఎస్), తయారీని ప్రోత్సహించే పిఎల్ఐ స్కీం వంటి పథకాల నుంచి కూడా ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను అందించాలని చూస్తుంది. దేశంలో సెమీకండక్టర్లను తయారు చేయకపోవడంతో దేశంలోని డిమాండ్ తీర్చడం కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. భారతదేశంలో సెమీకండక్టర్ల డిమాండ్ 2025 నాటికి ప్రస్తుతం ఉన్న 24 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకొనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. చైనాకు దెబ్బ సెమీకండక్టర్ తయారీదారులను దేశానికి ఆకర్షించడానికి ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, రక్షణ & ఆటో వంటి ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అవసరాలు కంపెనీలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు దేశంలో పెట్టుబడులు వస్తే మాత్రం చైనాకు దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ల ఎగుమతి దేశంగా చైనా ఉంది. మన దేశంలో ఏర్పాటు కాబోయే ఈ పరిశ్రమ వల్ల ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. -
డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటులో ఇంటెల్
న్యూఢిల్లీ: పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఎలక్ట్రానిక్ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ వచ్చే ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రాంగణాల్లో డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 100 పైచిలుకు యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ’ఉన్నతి’ ప్రోగ్రాంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ తెలిపారు. ఈ ల్యాబ్స్ ఏర్పాటుకయ్యే వ్యయాలను ఆయా విద్యా సంస్థలు భరించనుండగా, సాంకేతిక.. నాలెడ్జ్ భాగస్వామిగా ఇంటెల్ తోడ్పాటు అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉన్నతి ప్రోగ్రాం కింద జట్టు కట్టే విద్యా సంస్థలు తమ బడ్జెట్, సాంకేతిక, మౌలిక సదుపాయాల అవసరాలకు అనుగుణంగా ల్యాబ్స్ను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి ల్యాబ్లో ఇంటెల్ సూచించే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కోర్స్ కంటెంట్ మొదలైనవి ఉంటాయి. విద్యార్థులకు కో–బ్రాండెడ్ సరి్టఫికెట్లు లభిస్తాయి. -
గూగుల్, యాపిల్.. అంతా గప్పాలేనా?
యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, టెస్లా, బైడూ.. ఈ కంపెనీలకు ఏమైంది? ఒక పక్క చిప్ల కొరత, మరోపక్క సొంతంగా తయారు చేసుకుంటామని ప్రకటనలు. ఈ ప్రకటనలు ఆచరణలోకి వచ్చేది ఎప్పుడు?..అమలయ్యేది ఎప్పుడు? పాత ప్రకటనలను తెర మీదకు తెచ్చి.. కొత్తగా డబ్బా కొడుతున్న టెక్ కంపెనీలు ఎందుకంత హడావిడి చేస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలన్నీ సొంతంగా చిప్ తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయన్న వార్తలు ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్, యాపిల్లు ఈ రేసులో ముందున్నాయని, ‘గూగుల్బుక్ ల్యాప్ట్యాప్’ కోసం గూగుల్ సొంతంగా సీపీయూలను తయారు చేయడంలో చివరి దశకు చేరుకుందని ప్రకటనలు వెలువడుతున్నాయి. కానీ, ఏ లెక్కన చూసినా ఈ ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేది 2023 చివరికే. క్లిక్ చేయండి: ఫేస్ కాదు ఫేక్ బుక్ అయితే సొంత చిప్ తయారీ వ్యవహారం అంత సులువు కాదని, చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని టెక్ నిపుణులు చెప్తున్నారు. తాజాగా టీఎస్ఎంసీ కంపెనీ తైవాన్లో అత్యాధునిక చిప్ల ఫ్యాక్టరీ పెట్టనున్నట్లు ప్రకటించింది. సుమారు పది బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ ఫ్యాక్టరీ.. పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కోసం ఎన్నేళ్లు పడుతుందో కచ్చితంగా చెప్పడం లేదు. ఈ లెక్కన టెక్ దిగ్గజాలేవీ ఇప్పటికిప్పుడే చిప్ తయారీలోకి స్వయంగా దిగే అవకాశాలేవని, ప్రకటనలన్నీ ఉత్త ప్రకటనలేనని అభిప్రాయపడుతున్నారు. ఆగమేఘాల మీద ప్రకటనలు.. పీసీ, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్, టీవీ, ఆటోమొబైల్స్ రంగాల్లో మైక్రోప్రాసెసర్ల(సెమీ-కండక్టర్)ను ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో వీటికి హై డిమాండ్ ఉంది. అయితే కరోనా టైం నుంచి చిప్ షార్టేజీ మొదలైంది. చాలా వరకు కంపెనీలు బాగా నష్టపోయాయి. ఆ ప్రభావంతో ఉత్పత్తి తగ్గి.. రేట్లు ఆకాశానికి అంటాయి. ప్రత్యేకించి కొన్ని బ్రాండ్లు ప్రొడక్టివిటీ ఉన్నా.. ఎక్కువ రేట్లకు అమ్మేస్తుండడంతో కంపెనీలకు అసహనం పెరిగిపోతోంది. అందుకే సొంతంగా చిప్ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. వరుసగా ఒక్కో కంపెనీలు చిప్ ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి. అయితే ఇలాంటి ప్రకటనల ద్వారా అవతలి కంపెనీలను దిగొచ్చి చేసే స్రా్టటజీ కూడా అయ్యి ఉండొచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. సొంత ఆలోచన మంచిదే ఒకవేళ కంపెనీలు నిజంగా సొంత చిప్ తయారీ రంగంలోకి అడుగుపెట్టినా.. అది మంచి ఆలోచనే అంటున్నారు ‘డైలాగ్ సెమీకండక్టర్’(యూకే) మాజీ బాస్ రస్ షా. ప్రస్తుతం మార్కెట్లో ఒకేరకమైన చిప్స్ ఉన్నాయి. ఇవి కాకుండా తమ డివైజ్లకు తగ్గట్లుగా చిప్స్ తయారీ చేసుకోవాలనేది టెక్ కంపెనీల ఉద్దేశం. తద్వారా డివైజ్ల సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ కూడా వాళ్ల నియంత్రణలో ఉంటుంది. పైగా చీప్గా వర్కవుట్ అయ్యే వ్యవహారమని, డివైజ్లకు అందే ఎనర్జీని కూడా తక్కువగా తీసుకుంటుందని, స్మార్ట్ ఫోన్లు అయినా.. క్లౌడ్ సర్వీసెస్లకైనా ఒకేలా పని చేస్తాయని రస్ షా చెబుతున్నారు. పాత ప్రకటనలే! సొంత చిప్ల ప్రకటనలు వరుసగా చేస్తున్న బడా కంపెనీలు.. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. నిజానికి నవంబర్ 2020లోనే యాపిల్.. ఇంటెల్ ఎక్స్86 తరహా సొంత ప్రాసెసర్ను తయారు చేయబోతున్నట్లు ప్రకటించింది. కానీ, ఆ ప్రయత్నాలు అసలు మొదలుకాలేదు. ఇక టెస్లా ఏమో ఆరు నెలల కిందటే డేటా సెంటర్ల్లోని అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ కోసం ‘డోజో’ చిప్ను తయారు చేయనున్నట్లు ప్రకటించుకుంది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్లౌడ్ సర్వీసులు ఉన్న అమెజాన్.. నెట్వర్కింగ్ చిప్ను రూపొందించే పనిలో చాలాకాలం నుంచే ఉంది. ఫేస్బుక్ రెండేళ్ల క్రితమే అర్టిఫీషియల్ సొంత చిప్ ప్రకటన చేసింది. గూగుల్ కూడా సేమ్ ఇదే తీరు. ఒకవేళ నిజంగా వీళ్లు రంగంలోకి దిగినా.. డిజైనింగ్ వరకే పరిమితం అవుతారని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క కంపెనీ కూడా చిప్ తయారీ రంగంలోకి దిగే పరిస్థితులు లేవని కరాఖండిగా చెప్తున్నారు. ఒకవేళ ధైర్యం చేస్తే.. తడిసి మోపెడు అవ్వడం ఖాయమంటున్నారు. చదవండి: అసలు చిప్లు ఏం చేస్తాయి? వివాదాలు ఎందుకంటే.. -
షావోమీ నుంచి సైబర్ డాగ్.. దీని ప్రత్యేక ఇదే
CyberDog : బడ్జెట్ స్మార్ట్ ఫోన్గా ఎంటరై మార్కెట్ లీడర్లకే ముచ్చెమటలు పట్టించిన షావోమీ మరో సంచలనానికి తెర లేపింది. బడా కంపెనీలకే సాధ్యం కాని దానిని సుసాధ్యం చేసింది. నిత్య జీవితంలో ఉపయోపడే రోబోలను సైతం తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. క్వాడ్రుపెడ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్లో తనకు తానే సవాల్ విసురుకుంది. మార్కెట్లో ఉన్న మిగిలిన కంపెనీలు విస్మయం చెందే తీరులో సైబర్ డాగ్ పేరుతో క్వాడ్రుపెడ్ రోబోని తయారు చేసింది. నాలుగు కాళ్లపై నడిచే ఈ రోబోకి సంబంధించిన కీలక అంశాలను ఎంఐ ప్యాడ్ 5 రిలీజ్ సందర్భంగా షావోమీ వెల్లడించింది. సైబర్డాగ్ స్పెషాలిటీస్ ఇంట్లో మనుషులకు పనుల్లో సహాయకారిగా ఉండేలా ఈ సైబర్డాగ్ని షావోమీ రూపొందించింది. కచ్చితత్వానికి మరో పేరుగా ఈ క్వాడ్రుపెడ్ పని చేస్తుందంటూ షావోమీ ట్వీట్ చేసింది. ఇంటెల్ రియల్ సెన్స్కి ప్రాసెసర్ని ఇందులో ఉపయోగించారు. ఈ క్వాడ్రపెడ్ రోబో సెకనుకి 3.2 మీటర్లు కదులుతుంది. గరిష్టంగా 3 కేజీల బరువు మోయగలదు. నివిడియా సూపర్ కంప్యూటర్ శ్రేణికి చెందిన చిప్సెట్ అమర్చారు. కేవలం వెయ్యి మాత్రమే ప్రయోగాత్మకంగా తొలుత కేవలం వెయ్యి సైబర్ డాగ్ రోబోలను తయారు చేయాలని షావోమీ నిర్ణయించింది. తొలుత వీటిని చైనాలో విడుదల చేసి అక్కడ వచ్చిన స్పందన ఆధారంగా ఇతర దేశాల్లో అందుబాటులోకి తేనుంది. ఈ క్వాడ్రుపెడ్ రోబో ధర చైనా మార్కెట్లో 9,999 యువాన్లుగా ఉంది. మన కరెన్సీలో రూ. 1,14,737 ఉండవచ్చని అంచనా. From the in-house developed high-performance servo to the centimeter-scale obstacle avoidance and navigation, here’s everything that makes #XiaomiCyberDog a true beast. pic.twitter.com/T7JFj9V94X — Xiaomi (@Xiaomi) August 10, 2021 -
చిప్ల తయారీలోకి ఆపిల్, గూగుల్.. ఏమిటీ వివాదం?
ఎవరనుకున్నారు...???? అమెరికా అమలాపురాలను ఒక్క ఫోన్ కాల్ కలిపేస్తుందని! ఆఫీసు, ఇల్లు, సినిమాహాలు, ఒలింపిక్ క్రీడలు... అరచేతిలో ఇమిడిపోతాయని!! గుడిలో, బడిలో.. వాషింగ్మెషీన్లో.. నడిపే వాహనంలో, తళుకుల బల్బుల్లో.. ఇందుగలదందు లేదన్న సందేహంబు వలదన్నట్టు... చిప్లు చేరిపోతాయనీ.. సుఖసౌఖ్యాలను మన దరికి చేరుస్తాయని!! మనిషి మేధకు తాజా తార్కాణమా అన్నట్లు.. యాభై ఏళ్ల క్రితం మొదలైన మైక్రోప్రాసెసర్ ప్రస్థానం... గతం... ప్రస్తుతం.. భవిష్యత్తు...!!! ‘‘స్పర్ధయా వర్ధతే విద్య’’ అంటుంది ఓ సంస్కృత నానుడి. పోటీ ఉంటేనే విద్యలో రాణించగలం అని అర్థం. మరి.. పోటీ వ్యాపారంలో ఉంటే? ఇంకొన్నేళ్లలో మనకు ఇది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటారా? పీసీ, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్లకు అత్యంత కీలకమైన మైక్రోప్రాసెసర్ల తయారీలో ఇప్పుడు పోటీ నెలకొంది కాబట్టి! మైక్రోప్రాసెసర్ల గతం... ప్రస్తుతం.. భవిష్యత్తుల గురించి తెలుసుకునే ముందు ఆసక్తికరమైన ఈ పోటీ సంగతేమిటో అర్థం చేసుకుందాం. సాక్షి, హైదరాబాద్: నిన్న మొన్నటివరకూ మైక్రోప్రాసెసర్ అంటే.. ఇంటెల్. ఇంటెల్ అంటే మైక్రోప్రాసెసర్ అదీ పరిస్థితి. కాలక్రమంలో సాంసంగ్, టీఎస్ఎంసీ, క్వాల్కామ్, మీడియాటెక్ వంటివి పీసీ, స్మార్ట్ఫోన్ మైక్రోప్రాసెసర్ల తయారీ రంగంలోకి దిగినా ఆధిపత్యం మాత్రం ఇంటెల్దే కొనసాగింది. కానీ ఆ పరిస్థితులిప్పుడు మారిపోతున్నాయి. దిగ్గజం ఇంటెల్ను తోసిరాజని ఒకవైపు ఆపిల్ ఇంకోవైపు గూగుల్ రెండూ తమదైన మైక్రోప్రాసెసర్లను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్ఫోన్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న క్వాల్కామ్కూ చెక్ పెట్టేందుకు ఆపిల్, గూగుల్లు రెండూ పావులు కదుపుతూండటం విశేషం. ఆపిల్ ఇప్పటికే పీసీ, స్మార్ట్ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్లు తయారు చేసుకుంటున్నా... క్వాల్కామ్, ఇంటెల్ వంటి సంస్థల చిప్లను కూడా కొంతమేరకు ఉపయోగిస్తోంది. త్వరలోనే దీనికీ స్వస్తి చెబుతామని ఆపిల్ ప్రకటించింది. మరోవైపు గూగుల్ కూడా తన స్మార్ట్ఫోన్లు ‘పిక్సెల్ –6’, ‘పిక్సెల్ –6 ప్రో’లకు సొంతంగా మైక్రోప్రాసెసర్లు తయారు చేసుకుంటామని ప్రకటించింది. ఈ పరిణామం కాస్తా.. మరింత సమర్థమైన ఫోన్లు, క్రోమ్బుక్లు చౌకధరల్లో వినియోగదారుడికి అందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గూగుల్ కూడా 2016లో క్వాల్కామ్ సరఫరా చేసే చిప్లతో పిక్సెల్ బ్రాండు స్మార్ట్ఫోన్లను తయారు చేస్తూండగా.. వీటి ధరల విషయంలో పలు విమర్శలు వచ్చాయి. సొంతంగా చిప్లు తయారు చేసుకుంటే తాము అనుకున్న ఫీచర్లను స్మార్ట్ఫోన్ల ద్వారా అందించే వీలుంటుందని కంపెనీ భావిస్తోంది. కృత్రిమ మేధ, రియల్టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి కొత్త కొత్త టెక్నాలజీలను తమ చిప్ల ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏమిటీ వివాదం కంప్యూటర్లకు మాత్రమే కాదు.. స్మార్ట్ఫోన్లకు, ట్యాబ్లెట్లకు, ఇతర ఆపిల్ ఉత్పత్తులకు కొంతకాలం క్రితం వరకూ ఇంటెల్, క్వాల్కామ్లే అందించేవి. అయితే ఆపిల్, గూగుల్ల అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ సామర్థ్యంతో ఉన్న చిప్లను తయారు చేయడంలో ఇంటెల్ కొన్నేళ్లుగా వెనుకబడటం, ఇతర కంపెనీల చిప్లను వాడటంలో ఉన్న కొన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఆపిల్, గూగుల్ రెండూ సొంతంగా చిప్లు తయారు చేసుకోవాలని తీర్మానించుకున్నాయి. పీసీ, స్మార్ట్ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్లు తయారు చేసుకున్న ఆపిల్ స్మార్ట్ఫోన్లలోని మెడెమ్లు, ఇతర పరికరాల కోసం మాత్రం క్వాల్కామ్పైనే ఆధారపడుతోంది. కానీ ధరలు ఎక్కువగా ఉండటం, కొన్ని గుత్తాధిపత్య ధోరణిల కారణంగా వీటిని కూడా సొంతంగా తయారు చేసుకోవాలని రెండేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంత సులువా? మైక్రోప్రాసెసర్ల తయారీ అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతాయి. ఇసుక నుంచి సిలికాన్ను తయారు చేసే ఫౌండ్రీలను ఏర్పాటు చేయడం మొదలుకొని మిల్లీమీటర్ల సైజున్న చిప్లలో వెయ్యికోట్లకుపైగా ట్రాన్సిస్టర్లను ఇమడ్చేలా డిజైన్లు తయారు చేయాలంటే ఏళ్లుపూళ్లవుతాయి. ఆపిల్ పీసీ చిప్ల తయారీలో విజయం సాధించినా స్మార్ట్ఫోన్లతో వ్యవహారం అంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. ఇంటెల్ నుంచి కొను గోలు చేసిన మోడెమ్ తయారీ కేంద్రం సాయంతో సొంత తయారీ మొదలుపెట్టనుంది. కాకపోతే చిప్ల తయారీతోపాటు క్వాల్కామ్ స్మార్ట్ఫోన్ టెక్నాలజీలపై విస్తృత పరిశోధనలు, పరీక్షలు చేస్తూండటం, ప్రమాణాలను నిర్ణయించడంలో చాలా ముందున్న కారణంగా 5జీ ఫోన్ల విషయంలో మాత్రం క్వాల్కామ్పై ఆధారపడాల్సి ఉంటుందని అంచనా. ఏతావాతా.. ఆపిల్ తనదైన స్మార్ట్ఫోన్ చిప్లను తయారు చేసుకునేందుకు మరికొంత సమయం పట్టనుందన్నమాట. లక్షల కోట్ల వ్యవహారం! మైక్రోప్రాసెసర్ తయారీ మార్కెట్ విలువ ఎకాఎకిన కొన్ని లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇంటెల్, మోటరోలా, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఐబీఎం, సన్ మైక్రోసిస్టమ్స్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి దిగ్గజాలు కొన్ని వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టడమే కాకుండా.. పోటాపోటీగా మరింత సమర్థమైన, మెరుగైన ఫీచర్లు ఉన్న మైక్రోప్రాసెసర్లను అందుబాటు లోకి వెచ్చాయి. యాభై ఏళ్ల క్రితం నాటి తొలి మైక్రోప్రాసెసర్లో కేవలం 2300 ట్రాన్సిస్టర్లు ఉంటే.. తాజాగా ఈ సంఖ్య 1600 కోట్లకు చేరిపోయిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చూ. అది కూడా ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యంలోనే ఇన్ని కోట్ల ట్రాన్సిస్టర్లను ఇమడ్చేందుకు ఎంత సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్, పరికరాలు అవసరమవుతాయో ఊహించుకోవచ్చు. ఇలా తయారైన మైక్రోప్రాసెసర్లు పీసీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లతోపాటు పరిశ్రమల్లో, వాహనాల్లో, దైనందిన వాడకంలో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాల్లోకీ చేరిపోయాయి. ఇంత విస్తృత వాడకం ఉన్న కారణంగానే మైక్రోప్రాసెసర్ల మార్కెట్ విలువ ఏడాదికి దాదాపు రూ.6.75 లక్షల కోట్లు ఉంది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది వృద్ధి 6.4 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. 2021 చివరకల్లా మార్కెట్ రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లదే హవా.. మైక్రోప్రాసెసర్ల రంగంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో వేగంగా వృద్ధి కనపడుతోంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉండటం, ప్రజల వద్ద ఖర్చు పెట్టేందుకు ఉండే ఆదాయం పెరుగుతూండటం నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల విక్రయాలు పెరుగుతూండటం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు 2019లో సగటు అమెరికన్ చేతిలో ఖర్చు పెట్టేందుకు సగటున 15 వేల డాలర్లు ఉంటే అది గత ఏడాది అక్టోబరు నాటికి 47,673 డాలర్లకు చేరినట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. భారత్, చైనా వంటి దేశాల్లోనూ మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలపై పెడుతున్న ఖర్చు ఎక్కువవుతూండటం మైక్రోప్రాసెసర్ రంగానికి వరంగా మారుతోంది. ఒక్క భారత్లోనే వచ్చే ఏడాదికల్లా స్మార్ట్ఫోన్లు ఉన్న వారి సంఖ్య 82 కోట్లకు చేరుతుందని అంతర్జాతీయ సంస్థ కేపీఎంజీ లెక్కకడుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడకం పెరిగిన కొద్దీ అందులోనూ చిప్ల వాడకం ఉన్న కారణంగా మైక్రోప్రాసెసర్ రంగం వృద్ధి వేగంగా సాగుతుందని అంచనా. దిగ్గజ తయారీదారులు వీరే... మైక్రోప్రాసెసర్ల తయారీలో తైవాన్కు చెందిన మీడియాటెక్, దక్షిణ కొరియాకు చెందిన సాంసంగ్, జపాన్లోని తోషిబాలు కలసి అమెరికా బయట ఆధిపత్యం కనబరుస్తున్నాయి. మొత్తమ్మీద చూస్తే అమెరికన్ కంపెనీ ఇంటెల్దే తొలిస్థానం. మార్కెట్ దీని షేర్ 19.5 శాతంగా ఉంది. తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 11.25 శాతంతో రెండో స్థానంలోనూ, దాదాపు 10 శాతంతో మూడోస్థానంలో క్వాల్కామ్ ఉన్నాయి. సాంసంగ్ సెమీ కండక్టర్, బ్రాడ్కామ్, ఫ్రీస్కేల్ సెమీ కండక్టర్, ఎన్విడియా, ఏఎండీ, స్ప్రెడ్ట్రమ్, టీఐ, ఆపిల్, ఐబీఎం, ఆట్మెల్, టీఎస్ఎంసీ, లీడ్కోర్, ఆమ్లాజిక్, నూఫ్రంట్, ఇన్జెనిక్ వంటి కొన్ని కంపెనీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మైక్రో ప్రాసెసర్ సెగ్మెంట్ను స్థూలంగా మూడు భాగాలుగా విడదీయవచ్చు. ఆర్మ్, ఎక్స్–86 ఆధారిత ఎంపీయూలు ఒక వర్గమైతే.. అప్లికేషన్ల ఆధారంగా చేసే వర్గీకరణ (పీసీలు, సర్వర్లు, ట్యాబ్లెట్లు, సెల్ఫోన్లు, ఎంబెడెడ్ ఎంపీయూలు) రెండోది. ఉపయోగించే రంగం ఆధారంగా జరిగే మూడో వర్గీకరణలో సమాచారం, కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటివి ఉంటాయి. స్మార్ట్ఫోన్లలో మాత్రం క్వాల్కామ్ పెత్తనం కొనసాగుతోంది. 2020 లెక్కల ప్రకారం స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ప్రాసెసర్ రంగంలో క్వాల్కామ్ 32 శాతం ఆదాయాన్ని దక్కించుకుంది. చైనాకు చెందిన హైసిలికాన్ 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆపిల్ 19 శాతంతో మూడో స్థానంలో ఉండగా.. మిగిలిన అన్ని సంస్థలు కలిసి 27 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
5జీ కోసం జతకట్టిన ఎయిర్టెల్, ఇంటెల్
న్యూఢిల్లీ: 5జీ నెట్వర్క్ అభివృద్ధి కోసం ఇంటెల్ తో ఎయిర్టెల్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల దేశంలో 5జీ వేగం విస్తృతంగా పెరగనుంది. 5జీ నెట్వర్క్ వల్ల ఇండస్ట్రీ 4.0, ఐఓటి(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అప్లికేషన్లలలో, టెలి మెడిసిన్, క్లౌడ్ గేమింగ్, టెలి ఎడ్యుకేషన్, ఆగ్యుమెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయ మానిటరింగ్ వంటి వాటిలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. భారతదేశంలో మొదటి టెలికామ్ ఆపరేటర్ ఎయిర్టెల్ ప్రధాన నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోందని ఐఏఎన్ఎస్ నివేదిక తెలిపింది. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. మొబైల్ ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్వర్క్ స్లైసింగ్ కోసం ఒక బలమైన పునాదిని నిర్మించడానికి ఎయిర్టెల్ నెట్వర్క్ ఇంటెల్ తాజా మూడవ తరం జియోన్ స్కేలబుల్ ప్రాసెసర్లు, ఎఫ్ పీజిఏ, ఈఏఎస్ఐసీలు, ఈథర్నెట్ 800 సిరీస్ వాడనుంది. ఓ-ఆర్ఎఎన్ నెట్వర్క్ లో భాగస్వాములైన ఎయిర్టెల్, ఇంటెల్ మేక్ ఇన్ ఇండియా 5జీ అభివృద్ధి కోసం స్థానిక భాగస్వాముల ద్వారా భారతదేశంలో ప్రపంచ స్థాయి టెలికామ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి పనిచేస్తున్నాయి. -
ఇంటెల్లో జాబ్ వదిలి.. 20 ఆవులతో మొదలై.. రూ. 44 కోట్ల సంపాదన
బెంగళూరు: మన పెద్దలు ఓ మాట చెప్తుంటారు. బుర్ర చెప్పింది వింటే బాగుంటాం.. మనసు చెప్పింది వింటే సంతోషంగా, సంతృప్తిగా బతుకుతామని. ఈ మాటని నిజం చేసి చూపాడు ఓ వ్యక్తి. ఐఐటీలో చదివి.. ప్రతిష్టాత్మక ఇంటెల్ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్ దాన్ని వదిలేసుకుని.. తనకు ఎంతో ఇష్టమైన పని చేయడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం అతడు సంతృప్తిగా బతకడమే కాక మరో 100 మందికి పైగా ఉపాధి చూపుతున్నాడు. ఇంతకు అతడు ఏం చేస్తున్నాడంటే.. ఉద్యోగం వదిలి 20 ఆవులతో పాల వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ఏకంగా ఏడాదికి 44 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడి విజయ గాథ వివరాలు.. కర్ణాటకకు చెందిన కిశోర్ ఇందుకూరి అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మాస్టర్స్, పీహెచ్డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంటెల్ కంపెనీలో ఆరేళ్లు పని చేశాడు. ఉద్యోగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికి అతడికి సంతృప్తి లేదు. దాంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పుడే అతడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. ఓ సారి పని నిమిత్తం కిశోర్ హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో అతడు నగరవాసులు స్వచ్ఛమైన పాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని గ్రహించాడు. ఆ సమయంలో కిశోర్కి వచ్చిన ఓ ఆలోచన అతడి జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పింది. దానిలో భాగంగా కిశోర్ జాబ్ వదిలేసి 20 ఆవులు కొని సొంత డెయిరీ ప్రారంభించాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్వచ్ఛమైన పాలను వినియోగదారుల గుమ్మం వద్దకే తీసుకెళ్లసాగాడు. ఇక పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండేలా చల్లబర్చి, నిల్వ చేసే విధానాన్ని ఉపయోగించాడు కిశోర్. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2018 నాటికి డెయిరీ విస్తరించింది. దానికి తన కుమారుడు సిద్దార్థ్ పేరు మీద “సిద్ ఫార్మ్” అని పేరు పెట్టాడు కిశోర్. ప్రస్తుతం అతడు 6 వేల మందికి పాలు పోస్తున్నాడు. ఇక షాబాద్లో విస్తరించిన ఇతడి ఫామ్లో ప్రస్తుతం 120 మంది పని చేస్తున్నారు. ఇక కిశోర్ కేవలం పాలు మాత్రమే కాక సేంద్రీయ పాల ఉత్పత్తులైన పెరుగు, నెయ్యిని విక్రయిస్తాడు. సిద్ ఫామ్ ఇప్పుడు రోజుకు దాదాపు 10,000 మంది వినియోగదారులకు తన ఉత్పత్తులను అందిస్తుంది. ఇక ఈ డెయిరీ మీద అతడు సంవత్సరానికి 44 కోట్లు ఆర్జిస్తున్నాడు. చదవండి: 67 ఏళ్ళ వయసులో ‘గేట్’ సాధించాడు! -
జియోలో మరో భారీ పెట్టుబడి
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో భారీ పెట్టుబడిని సాధించింది. జియో ప్లాట్ఫామ్లలో ఇంటెల్ క్యాపిటల్ 1,894.50 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. వరుస పెట్టుబడులతో రికార్డు సాధిస్తున్న ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్కు చెందిన జియో ప్లాట్ఫామ్లలో 0.39 శాతం ఈక్విటీ వాటా ఇంటెల్కు దక్కనుంది. ఈక్విటీ విలువ 4.91 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజ్ విలువ 5.16 లక్షల కో'ట్ల రూపాయలుగా ఉండనుంది. గత 11 వారాల్లో 12 దిగ్గజ సంస్థల నుంచి భారీ పెట్టుబడులను జియో సొంతం చేసుకుంది. ఈ మొత్తం పెట్టుబడి విలువ 117,588.45 కోట్లకు చేరింది. (అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ) ఈ డీల్పై ఇరు సంస్థలు ఆనందాన్ని వెలిబుచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఇంటెల్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న నిజమైన పరిశ్రమ లీడర్ ఇంటెల్ అని అంబానీ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వినూత్న సంస్థలలో పెట్టుబడులు పెట్టడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5జీ వంటి అంశాలపై దృష్టి సారించామని ఇంటెల్ క్యాపిటల్ తెలిపింది. జియో కూడా వినూత్నంగా, వృద్ధి కోసం పెట్టుబడులు పెడుతోందని కంపెనీ ప్రకటించింది. డిజిటల్ సౌకర్యం, డేటా సేవలు, వ్యాపారాన్ని, సమాజాన్ని మెరుగ్గా మార్చగలవని తాము విశ్వసిస్తున్నామని ఇంటెల్ క్యాపిటల్ ప్రెసిడెంట్ వెండెల్ బ్రూక్స్ పేర్కొన్నారు. -
రిలయన్స్ జియోలో ఇంటెల్- జియోమీట్ యాప్
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియోలో మరో విదేశీ దిగ్గజం ఇన్వెస్ట్ చేస్తోంది. గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ కార్ప్.. రిలయన్స్ జియోలో 0.39 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్, టెలికం విభాగమైన రిలయన్స్ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయిందని విశ్లేషకులు తెలియజేశారు. ఇప్పటిపకే రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99 శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 43,574 కోట్లు వెచ్చించింది. 100 మందికి వీలుగా రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ వీడియో కాన్ఫరెన్సింగ్కు వీలు కల్పించే యాప్ను ప్రవేశపెట్టింది. జియోమీట్ పేరుతో వీడియో కాలింగ్ యాప్ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ప్లే స్టోర్తోపాటు యాప్ స్టోర్లోనూ జియోమీట్ అందుబాటులో ఉంటుందని తెలియజేసింది. ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ యాప్ ద్వారా 100 మందివరకూ వీడియో కాన్ఫరెన్సింగ్లో పాల్గొనవచ్చని తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ల ద్వారా ఉచితంగా ఈ యాప్ను వినియోగించుకోవచ్చని వివరించింది. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ ద్వారా వినియోగదారులు వీడియో కాన్ఫరెన్సింగ్కు హాజరుకావచ్చని తెలియజేసింది. 11 వారాల్లో 12 కంపెనీలు గత 11 వారాల్లో రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో మొత్తం 12 కంపెనీలు పెట్టుబడులకు క్యూ కట్టాయి. తద్వారా జియో ప్లాట్ఫామ్స్ మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం 25.09 వాటాను విక్రయించింది. వెరసి రూ. 1,17,588 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఇటీవల జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలలో జనరల్ అట్లాంటిక్, సిల్వర్లేక్ పార్టనర్స్, విస్టా, ముబడాలా, కేకేఆర్, సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్ పీఐఎఫ్ తదితరాలు చేరాయి. -
ఇంటెల్కు త్వరలో యాపిల్ గుడ్బై?
ముంబై: టెక్ దిగ్గజాలు ఇంటెల్, యాపిల్ సంయుక్తంగా ప్రపంచానికి ఎన్నో కొత్త ఆవిష్కరణలు అందించాయి. ప్రస్తుతం కంప్యూటర్ తయారీలో యాపిల్ సంస్థ ఇంటెల్ మైక్రోప్రాసెసర్లను ఉపయోగిస్తుంది. అదే విధంగా యాపిల్ సంస్థ అత్యాధునిక చిప్లను రూపొందిస్తుంది. సొంతంగా ఎదగాలనే వ్యూహంతో మరో టెక్ దిగ్గజాం ఇన్టెల్తో విడిపోవాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా త్వరలో యాపిల్ సంస్థ రూపొందించే సరికొత్త ఆవిష్కరణల ప్రణాళికను వివరిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా విభిన్న ఫీచర్లతో అత్యాధునిక స్మార్ట్ఫోన్(ఐఫోన్)లను రూపొందించి కోట్లాది వినియోగదారులను యాపిల్ ఆకట్టుకుంది. కానీ యాపిల్ సంస్థ సొంతంగా నిలదొక్కుకునే వ్యూహాలు రచిస్తుంది. ఇటీవల ట్రక్కుల తయారీలో ఈకామర్స్ దిగ్గజం అమోజాన్ ప్రవేశించిన విషయం విదితమే. మరోవైపు అన్ని దేశాల సాంకేతికతలను ఉపయోగించుకొని సరికొత్త ఆవిష్కరణలకు యాపిల్ సంస్థ వ్యూహాలు రచిస్తుంది. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్లకు సరికొత్త చిప్ల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. మరోవైపు అత్యాధునిక సాంకేతికతతో దిగ్గజ కంపెనీలు సొంతంగా ఎదగాలనే వ్యూహాలు రచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: శాంసంగ్కు బై, ఆపిల్కు సై : వారెన్ బఫెట్) -
హైదరాబాద్లో ఇంటెల్ డిజైన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో దీనిని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిబ్బంది పరంగా కొత్త సెంటర్ ఏడాదిలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుందని ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా ఎం కోడూరి ఈ సందర్భంగా తెలిపారు. ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ అభివృద్ధిలో హైదరాబాద్ కేంద్రం పాలు పంచుకుంటుందని కూడా వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ యూఎస్లో 2021లో, భారత్లో 2022లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. మూడు లక్షల ఉద్యోగాలు.. వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ‘ఇప్పటికే ఈ రంగంలో 30,000 పైచిలుకు మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు రెండూ నిండిపోయాయి. మరో భారీ తయారీ క్లస్టర్ కోసం కేంద్రాన్ని కోరాం. అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టి– వర్క్స్ మూడు నాలుగు నెలల్లో ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రంగ కంపెనీలు తమ ఆవిష్కరణల తాలూకు నమూనాలను రూపొందించుకోవచ్చు’ అని వివరించారు. -
హైదరాబాద్లో ఇంటెల్ అభివృద్ధి కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన చిప్ల తయారీ కంపెనీ ఇంటెల్ హైదరాబాద్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మాదాపూర్లోని సాలార్పూరియా సత్త్వా నాలెడ్జ్ సిటీలో సాంకేతికత అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. 5–6 అంతస్తుల్లో, సుమారు 3 లక్షల చ.అ.ల్లో ఉండే ఈ కేంద్రాన్ని వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ కేంద్రం సీటింగ్ కెపాసిటీ 1,500 కాగా.. తొలి దశలో సుమారు వంద మంది ఇంజనీర్లను ఎంపిక చేసుకోనున్నారు. ఈ కేంద్రంలో ఎస్ఓసీ (సిస్టమ్ ఆన్ చిప్) సాంకేతికత మీద పని చేస్తుంది. -
ఒంటరిగా భోజనం..ఊహించని అతిధి
ముంబై : ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ మధుర ఘటన నెటిజన్ల ముఖాలపై నవ్వులు పూయిస్తోంది. ముంబై హోటల్లో అక్కడి సిబ్బంది తాను ఒక్కడినే భోజనం చేస్తుండటంతో వారు ఏం చేసింది వివరిస్తూ ఇంటెల్ ఇండియా ఎండీ ప్రకాష్ మాల్యా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇటీవల ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో భోజనానికి వెళ్లగా తాను ఒక్కడినే తినడం పసిగట్టిన సిబ్బంది తనకు కంపెనీ ఇచ్చేందుకు ఓ క్యూట్ గెస్ట్ను తీసుకువచ్చారని వారి ఆతిథ్యాన్ని మెచ్చుకున్నారు. తనకు కంపెనీగా ఓ గోల్డ్ ఫిష్ను అక్కడ ఉంచారని ఆయన ట్వీట్ చేశారు. ఫిష్ ఫోటోను షేర్ చేసిన మాల్యా హోటల్ సిబ్బంది ఆలోచనపై ప్రశంసలు కురిపించారు. తాను ఎన్నోసార్లు పలు ప్రాంతాలు సందర్శించినా ఎక్కడా తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు. ఆన్లైన్లో ఈ పోస్ట్కు ఇప్పటివరకూ 1400 వరకూ లైక్లు రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రయాణాల్లో తమకు ఎదురైన అనుభవాల గురించి వారు కామెంట్స్లో పేర్కొన్నారు. -
ఇంటెల్పై సీసీఐ విచారణ
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలకు సంబంధించి చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. బెంగళూరుకు చెందిన వేలాంకని ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదుతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వేలాంకని సంస్థ.. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల డిజైనింగ్, తయారీ కార్యకలాపాలు సాగిస్తోంది. వీటికి కీలకమైన ప్రాసెసర్స్, చిప్సెట్స్, మదర్బోర్డు/సర్వర్ బోర్డులు మొదలైన వాటిని ఇంటెల్ తయారు చేస్తోంది. అయితే, ప్రధానమైన రిఫరెన్స్ డిజైన్ ఫైల్స్ను ఇచ్చేందుకు ఇంటెల్ నిరాకరించిందని, తద్వారా సర్వర్ బోర్డులను రూపొందించకుండా తమను నిరోధించినట్లయిందని వేలాంకని ఆరోపించింది. ఫలితంగా మార్కెట్లో తమ అవకాశాలను దెబ్బతీసినట్లయిందని పేర్కొంది. -
హైదరాబాద్లో ఇంటెల్ టెక్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. దేశంలో కంపెనీ విస్తరణ కార్యకలాపాలకు సంస్థ నగరాన్ని ఎంపిక చేసుకుంది. టెక్నాలజీ సెంటర్ కోసం ఇంటెల్ 1,500 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులను నియమించుకోనుంది. భవిష్యత్లో ఉద్యోగుల సంఖ్య 5 వేల వరకు పెరిగే అవకాశముంది. ఇంటెల్ ఇండియా అధిపతి నివృత్తి రాయ్ శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశమై టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీకి ఉన్న అనుకూల పరిస్థితులపై చర్చించారు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత్లో ఇంటెల్ విస్తరణకు అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధి బృందం తెలియజేసింది. నగరానికి ఇంటెల్ రావడంతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ పరిశ్రమల అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడతాయన్నారు. తమ కార్యకలాపాల కోసం నగరాన్ని ఎంచుకోవడం పట్ల ఇంటెల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో ఉన్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ పరికరాల తయారీకి అవసరమైన అనుబంధ పరిశ్రమల తయారీ సామర్థ్యం, అందుబాటులో ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా ఇంటెల్ కంపెనీ బృందం చర్చించింది. త్వరలో ఇంటెల్ గ్లోబల్ సీఈఓతో కేటీఆర్ భేటీ.. ఈ ప్రాజెక్టు విషయమై త్వరలో ఇంటెల్ గ్లోబల్ సీఈఓతో మంత్రి కేటీఆర్ సమావేశమై చర్చలు జరుపుతారని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ నెల 15న బెంగళూరులోని ఇంటెల్ ప్రాంగణంలో జరిగే సంస్థ 20వ వార్షికోత్సవ సంబరాలకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ను ఇంటెల్ ఇండియా అధిపతి నివృత్తి రాయ్ ఆహ్వానించా రు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్, టీ–వర్క్స్, రాష్ట్రం లోని ఇతర స్టార్టప్ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఇంటెల్ కంపెనీ సుముఖంగా ఉందని తెలిపారు. -
ఇంటెల్ సీఈవో రాజీనామా
ఇంటెల్ సీఈవో బ్రియాన్ క్రజానిక్ రాజీనామా చేశారు. క్రజానిక్ కంపెనీకి రాజీనామా చేసిన విషయాన్ని ఇంటెల్ గురువారం ప్రకటించింది. ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. క్రజానిక్ స్థానంలో తాత్కాలిక సీఈవోగా చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రాబర్ట్ స్వాన్ను నియమించినట్టు కంపెనీ వెల్లడించింది. ఇంటెల్ ఉద్యోగినితో ఆయన రిలేషన్షిప్(సంబంధం) కొనసాగించడంతో, క్రజానిక్పై కంపెనీ వేటు వేసింది. మేనేజర్లందరికీ వర్తించే కంపెనీ నాన్-ఫ్రటర్నైజేషన్ పాలసీని ఉల్లంఘించిన కారణంగా క్రజానిక్పై అంతర్గత, బహిరంగ విచారణ కూడా జరుపుతోంది కంపెనీ. ఫ్రటర్నైజేషన్ పాలసీ అంటే సంస్థల్లో ఆధిపత్య స్థానంలో ఉన్నవారు, వారికంటే తక్కువ స్థానంలో ఉన్నవారితో రొమాంటిక్ సంబంధాన్ని కలిగి ఉండటం. ఉదాహరణకు సూపర్వైజర్, సబార్డినేట్తో సంబంధాన్ని కొనసాగించడం లాంటిది. ఇంటెల్ సీఈవో రాజీనామాను వెంటనే ఆమోదించామని, దీంతో ఉద్యోగులందరూ ఇంటెల్ విలువలకు, సంస్థ ప్రవర్తన నియమావళికి కట్టుబడి ఉండాలని సూచిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటెల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రస్తుతం కొత్త సీఈవోను వెతకడం ప్రారంభించారని పేర్కొంది. సంస్థ లోపల, వెలుపల అభ్యర్థులలో ఒకరిని కంపెనీకి శాశ్వత సీఈవోగా నియమించనున్నట్టు చెప్పింది. ఇంటెల్ ఎగ్జిక్యూటివ్గా క్రజానిక్ గత దశాబ్దం కాలంగా ఉంటున్నారు. 2013లో ఆయన సీఈవో బాధ్యతలను చేపట్టారు. 1982లో క్రజానిక్ ఇంటెల్లో చేరారు. ఈ ఉదయమే ఇంటెల్ తన వెబ్సైట్ నుంచి క్రజానిక్ బయోగ్రఫీని కూడా తొలగించింది. క్రజానిక్, ఉద్యోగినితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారని తెలియగానే, ఆయన్ని తన పదవి నుంచి దిగిపోవాలని కంపెనీ ఆదేశించింది. గతేడాదే క్రజానిక్, కంపెనీలో తను కలిగి ఉన్న సుమారు 39 మిలియన్ విలువైన షేర్లను అమ్మేశారు. అయితే క్రజానిక్ ఆధ్వర్యంలో కంపెనీ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగింది. ఇంటెల్ను పీసీ సెంట్రిక్ కంపెనీ నుంచి డేటా సెంట్రిక్ కంపెనీగా ఆయనే రూపుదిద్దారు. కంపెనీ స్టాక్ కూడా 120 శాతం ఎగిసింది. -
ఇంటెల్ యూజర్లకు వార్నింగ్
ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కార్ప్ వినియోగదారులను విస్మయానికి గురిచేసే వార్త చెప్పింది. ఇటీవల రిలీజ్ చేసిన సిస్టం అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. తాము విడుదల చేసిన అప్డేటెడ్ పాచెస్లో లోపాలు ఉన్నట్టు వెల్లడించింది. తన చిప్లో రెండు హై-భద్రతా ప్రమాదాలను పరిష్కరించేందుకు విడుదల చేసిన పాచెస్ ప్రమాదకరమైనవని, కనుక అప్డేట్ చేసుకోవద్దని హెచ్చరించింది. వీటిని ఇన్స్టాల్ చేసుకోవద్దంటూ వినియోగదారులు, కంప్యూటర్ తయారీదారులు, క్లౌడ్ ప్రొవైడర్లకు కీలక సూచనలు జారీ చేసింది. చిప్ మేకర్ వెబ్సైట్లో ఇంటెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నవిన్ షెనోయ్ ఈ విషయాన్ని ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెల్ యూజర్లకు క్షమాపణలు చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నామని హామీ ఇచ్చారు. దీనికోసం 24 గంటలుపనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటెల్ వైఫ్యలం కంప్యూటర్ల వ్యాపారంపై ప్రభావం పడనుందని ఐడీసీ ఎనలిస్ట్ మారియో మోరేల్స్ వ్యాఖ్యానించారు. సంబంధిత పాచ్ను విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం కొనుగోళ్లపై పడుతుందన్నారు. స్పెక్ట్రే అండ్ మెల్ట్డౌన్ అని పిలవబడే ఫాల్టీ పాచెస్ ప్రభావానికిగురైన తన చిప్లో లోపాలు ఉన్నాయని ధృవీకరించిన దాదాపు మూడు వారాల తరువాత ఈ హెచ్చరిక చేసింది. అలాగే కొత్త వెర్షన్ను పరీక్షించాలని టెక్నాలజీ ప్రొవైడర్లను కోరింది. -
చిప్స్ కింగ్కు శాంసంగ్ చెక్
సియోల్ : కంప్యూటర్ చిప్స్ విభాగంలో అగ్రగామిగా, రెండు దశాబ్దాలకు పైగా తన హవా చాటుతున్న సిలికాన్ సెమీకండక్టర్ ఇంటెల్కు దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ చెక్ పెట్టింది. కంప్యూటర్ చిప్స్ విభాగంలో ఇంటెల్ను వెనక్కి నెట్టేసి శాంసంగ్ రారాజుగా నిలిచింది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో శాంసంగ్ లాభాలు రికార్డు స్థాయిలో జంప్ చేశాయి. దీంతో ఇంటెల్కు శాంసంగ్ చెక్ పెట్టినట్టు విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఇంటెల్ను శాంసంగ్ పక్కకు నెట్టేసినట్టు పేర్కొన్నారు. శాంసంగ్ మొత్తం 17.6 ట్రిలియన్(రూ.1,01,284కోట్ల) రెవెన్యూల నిర్వహణ ఆదాయాల్లో సెమికండక్టర్ బిజినెస్ల నుంచే 8 ట్రిలియన్లు(రూ.46,157కోట్లకు పైగా) వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఇంటెల్ కూడా నేడే ఫలితాలను ప్రకటించనుంది. కానీ దీని క్వార్టర్లీ రెవెన్యూలు 14.4 బిలియన్ డాలర్లుగానే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అంటే రూ.92,314 కోట్లు మాత్రమేనని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వార్షికంగా ఇంటెల్ విక్రయాలను శాంసంగ్ అధిగమించినట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మొబైల్ డివైజ్లు, డేటాలో శాంసంగ్ ఆధిపత్య స్థానంలో ఉంది. ఈ కంపెనీ చీఫ్ జైలుకి వెళ్లినప్పటికీ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ శాంసంగ్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తన హవా కొనసాగిస్తూనే ఉంది. గతేడాది గెలాక్సీ నోట్7 దెబ్బతో భారీ నష్టాలను ఎదుర్కొని, పరువు ప్రతిష్టలు కోల్పోయిన ఈ సంస్థ మళ్లీ రికవరీ అయింది. దశాబ్దం పైన నుంచి శాంసంగ్, ఇంటెల్ సెమీకండక్టర్ మార్కెట్లో తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్లకు ప్రాసెసర్లను అందించడంలో ఇంటెల్ కంపెనీనే ఆధిపత్యంలో ఉంది. 1992 నుంచి ఈ కంపెనీనే ప్రపంచపు అతిపెద్ద సెమీ కండక్టర్ కంపెనీగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఆ స్థానాన్ని శాంసంగ్ లాగేసుకున్నట్టు తెలిసింది. కంప్యూటర్లకు బదులు టాబ్లెట్లు, పీసీలు, స్మార్ట్ఫోన్లను ఎక్కువగా వాడుతుండటంతో, శాంసంగ్ లాంటి కంపెనీలు పైకి ఎగుస్తున్నట్టు ఓ సీనియర్ విశ్లేషకుడు చెప్పారు. -
భారత్లో ఇంటెల్ భారీ పెట్టుబడులు
సాక్షి, బెంగళూరు: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ భారత్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆర్అండ్డీపై బెంగళూరులో అత్యాధునిక డిజైన్ హౌస్ నిర్మాణానికి రూ. 1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది. దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పటిష్టం కావడానికి, అపార ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ స్థాయి పెట్టుబడులు దోహదపడగలవని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్య మంత్రి సిద్ధరామయ్య చెప్పారు. -
భారత్లో ఆ చిప్ దిగ్గజం 3వేల ఉద్యోగాలు
బెంగళూరు : ప్రపంచంలో చిప్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఇంటెల్ కార్పొరేషన్ భారత్ లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. బెంగళూరులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లో రూ.1,100 కోట్లను పెట్టుబడులుగా పెడుతున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీనిలో భాగంగా 3వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించనున్నామని పేర్కొంది. వచ్చే 18నెలల్లో ఈ ఉద్యోగాల కల్పించనున్నట్టు చెప్పింది. ఎనిమిది ఎకరాల క్యాంపస్ లో ఈ కొత్త ఆర్ అండ్ డీ సెంటర్ ను ఇంటెల్ ఏర్పాటుచేస్తోంది. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్ డిజైన్ సర్వీసు సౌకర్యాలను కూడా ఇక్కడ కల్పించనుంది. భారత్ లో తమ వ్యాపారాల విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు ఇంటెల్ ఇండియా జనరల్ మేనేజర్ నివృతి రాయ్ న్యూస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ లో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖార్గేలు కూడా పాల్గొన్నారు. ఇంటెల్ 2016 వరకు భారత్ లో పెట్టిన 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఈ కొత్త పెట్టుబడులు అదనం. కంపెనీ భారత సబ్సిడరీలో దాదాపు 7వేల మంది టెక్కీలు తన గ్లోబల్ కస్టమర్ల కోసం పనిచేస్తున్నట్టు ఇంటెల్ తెలిపింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హార్డ్ వేర్ డిజైన్, టెస్టింగ్, కంప్యూటర్ హార్డ్ వేర్ వాలిడేషన్, తర్వాతి తరం డిజిటల్ డివైజ్ లకు సాఫ్ట్ వేర్ ఉత్పత్తులపై కంపెనీ కార్యకలాపాలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయని ఇంటెల్ చెప్పింది. ఇంటెల్ బెంగళూరులో పెట్టుబోయే పెట్టుబడులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని హై-లెవల్ క్లియరెన్స్ కమిటీ 2016 ఫిబ్రవరి 1నే ఆమోదం తెలిపింది. ఈ సెంటర్ స్థాపన కోసం కర్నాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు భూమిని కూడా కేటాయించింది. -
ఇంటెల్ చేతికి మొబైల్ఐ
15 బిలియన్ డాలర్ల డీల్ న్యూయార్క్: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ తాజాగా ఇజ్రాయెల్కి చెందిన సెన్సర్ కంపెనీ మొబైల్–ఐని కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు 15.3 బిలియన్ డాలర్లు. మొబైల్ఐ .. కార్ల తయారీ సంస్థలకు సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ను సరఫరా చేస్తుంది. రెండు కంపెనీల సంయుక్త ప్రకటన ప్రకారం మొబైల్ఐ షేరు ఒక్కింటికి 63.54 డాలర్ల చొప్పున ఇంటెల్ ఆఫర్ చేసింది. శుక్రవారం నాటి మొబైల్ఐ షేరు ధర 47.27 డాలర్లతో పోలిస్తే ఇది 34.5 శాతం అధికం. వచ్చే తొమ్మిది నెలల్లో డీల్ పూర్తి కాగలదని ఇంటెల్ పేర్కొంది. సుమారు 40 సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ కార్ల తయారీకి సంబంధించి ఈ రెండు సంస్థలు ఇప్పటికే జర్మనీ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూతో కలసి పనిచేస్తున్నాయి. 1999లో ఏర్పాటైన మొబైల్ఐ 2007లో గోల్డ్మన్ శాక్స్ సంస్థ నుంచి 130 మిలియన్ డాలర్స్ సమీకరించింది. 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్లో లిస్టయింది. -
మానవుడు సృష్టించిన నక్షత్రాలు!
ఒకటో నంబర్ ఫొటో చూశారుగా... ఏమనిపించింది? ‘ఇంటెల్’ ప్రకటనే కదా.. కొత్తేముంది? అంటున్నారా? ఫొటో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇదేదో కంప్యూటర్/టీవీ స్క్రీన్పై కనిపించే యాడ్ కాదని స్పష్టంగా అర్థమైపోతుంది. విశాలమైన ఆకాశమే బ్యాక్గ్రౌండ్గా ఉన్న విషయమూ అర్థమవుతుంది. అరె... ఇదెలా సాధ్యమైంది? ఇప్పుడు రెండో నంబర్ ఫొటో చూడండి. దీంట్లో ఉన్నది ‘ఇంటెల్’ పేరున్న డ్రోన్. ఇలాంటివి ఓ 500 డ్రోన్లు.. మూడో నంబర్ ఫొటోలో చూపినట్లుగా గాల్లోకి ఎగిరితే తయారైంది ఒకటో నంబర్ ఫొటోలోని ఇంటెల్ ప్రకటన! విషయం ఏమిటంటే... అమెరికాలో ఏటా సూపర్బౌల్ బాస్కెట్బాల్ పోటీలు జరుగుతాయన్నది మీకు తెలిసిందే. ఈ ఏడాది పోటీల ప్రారంభోత్సవం హాఫ్టైమ్లో ఇంటెల్ డ్రోన్లతో ఈ వినూత్న ప్రదర్శన ఇచ్చింది. ఇంటెల్ పేరును చూపేలా మాత్రమే కాకుండా రకరకాల ఆకారాలు, చిత్రాలను ఆకాశంలో ప్రదర్శించింది. మొత్తం ఐదు వందల డ్రోన్ల ఆకారాలు, అక్షరాలకు తగినట్లు నిర్దిష్ట ప్రాంతాల్లో నిలవడం... వెలుగులు చిమ్మడం దీని ప్రత్యేకత. ఇంటెల్ ‘షూటింగ్ స్టార్స్’ పేరుతో ఈ డ్రోన్లను సిద్ధం చేసింది. ఒక్కోటి కేవలం 28 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇరవై నిమిషాలపాటు మాత్రమే ఎగరగలదు. అన్నింటినీ ఒకేసారి నియంత్రించేందుకు ఇంటెల్ ఓ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. ప్రతిదాంట్లో ఉండే ఎల్ఈడీ బల్బు కొన్ని లక్షల రంగులను ప్రదర్శించే సామర్థ్యం కలిగి ఉంది. వీటిన్నింటితో సూపర్బౌల్ ఇంటర్వెల్ టైమ్లో ఓవైపు లేడీ గాగా పాటల కచేరీ నడుస్తూంటే ఇంకోవైపు ఇంటెల్ ఓ లాంచ్ప్యాడ్పై అంగుళం ఎడంగా ఏర్పాటు చేసిన డ్రోన్లను పైకి ఎగరేసింది. ఇంకేముంది.. ఆకాశంలో అద్భుతం సాకారమైంది. తన ప్రకటనల మాదిరిగానే...విన్యాసాలన్నీ ముగిసిన తరువాత డ్రోన్లు ఇంటెల్ అన్న లోగోను ప్రదర్శించాయి. -
టాప్ 5 రిక్రూట్మెంట్ సంస్థలివేనట!
ముంబయి: ప్రఖ్యాత ఐఐటీ ముంబైలో భారీగా రిక్రూట్మెంట్స్ చేసిన సంస్థలో టాప్ లో 5 కంపెనీలు నిలిచాయి. ముఖ్యంగా ఇంటెల్ టెక్నాలజీస్ 29 మంది విద్యార్థులను, శాంసంగ్ ఆర్ అండ్ డి 28మంది , సిటీ కార్పోరేషన్ 20మంది , గోల్డ్మన్ సాచ్స్ 15, క్వాల్కమ్ 13మంది ఐఐటీ విద్యార్థులను ఎంపిక చేశాయి. అలాగే అంతర్జాతీయ ఆఫర్లు పరంగా అతిపెద్ద రిక్రూటర్లుగా యాహూ, ఎన్ఈసీ, మురత, మైక్రోసాఫ్ట్ నిలిచాయని ఐఐటీ ముంబై విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధిక ప్యాకేజీలు అమెరికా సంస్థలు చెల్లించనున్న అత్యధిక వేతన ప్యాకేజీలు ఉబెర్ 110,000డాలర్లు, మైక్రోసాఫ్ట్ 106,000డాలర్లు, ఒరాకిల్ 100,000 డాలర్లు గా ఉన్నాయి. జపనీస్ సంస్థలు వర్క్స్ అప్లికేషన్ ఏడాదికి రూ .60 లక్షలు , యాహూ రూ 37,52 లక్షలు, రాకుటేన్ 37. 20 లక్షలు, టోయో ఇంజనీరింగ్ రూ 35,16 లక్షలు చెల్లించనున్నాయి. దేశీయ కంపెనీల గరిష్ట ప్యాకేజీలు బ్లాక్ స్టోన్ రూ .35 లక్షలు, స్క్లూమ్బర్గర్ రూ 28 లక్షలు, వరల్డ్ క్వాంట్ రూ 25.2 లక్షలు, జిరాక్స్ రీసెర్చ్ రూ .22 లక్షలు గా ఉన్నాయి. అనేక రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, కన్సల్టింగ్, ఫినాన్స్ అండ్ సాఫ్ట్ వేర్ సహా అన్ని రంగాలు సంస్థలు తమ విద్యార్థులను ఎంపిక చేసినట్టు తెలిపింది. ఉబెర్, పేటీఎం, ఓలా లాంటి స్టార్ట్ అప్ ల నుంచి కూడా నియామకాలు జరిగాయనీ, మరికొన్ని ప్రఖ్యాత విద్యాసంస్థలు , యూనివర్శిటీలు ఈ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఐఐటీ ముంబై వివరించింది. -
ఇంటెల్ చేతికి భారత సంతతి వ్యక్తి స్టార్టప్
డీల్ విలువ 40.8 కోట్ల డాలర్లు ! శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటెల్ సంస్థ.. కాలిఫోర్నియాకు చెందిన లెర్నింగ్ స్టార్టప్ నిర్వాణ సిస్టమ్స్ను కొనుగోలు చేసింది. దీంతో చిప్లు తయారుచేసే ఇంటెల్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) రంగంలోకి ప్రవేశించినట్లయింది. ఈ నిర్వాణ సిస్టమ్స్ను భారత సంతతి ఎంటర్ప్రెన్యూర్ నవీన్రావు 2014లో ప్రారంభించారు. డీల్ విలువ నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ, ఈ స్టార్టప్ను 40.8 కోట్ల డాలర్లకు ఇంటెల్ కొనుగోలు చేసిందని టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ రికోడ్ తెలిపింది. -
ఇంటెల్ చేతికి నెర్వాణ సిస్టమ్స్
రానున్న కాలంలో ప్రపంచమంతా ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్గా మారబోతున్న తరుణంలో కంపెనీలన్నీ ఈ టెక్నాలజీస్పై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో దూసుకుపోయేందుకు, అమెరికాకు చెందిన చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్, ఏఐ స్టార్టప్ నెర్వాణ సిస్టమ్స్ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. డేటా సెంటర్లలో ఇంటెల్ పాత్రను విస్తృతం చేయడానికి, ఇంటర్నెట్ అంశాలను విస్తరించుకోవడానికి ఈ స్టార్టప్తో డీల్ కుదుర్చుకుంటున్నట్టు మంగళవారం వెల్లడించింది. అయితే డీల్ ప్రకారం నెర్వాణ సిస్టమ్స్కు ఇంటెల్ ఏ మేరకు చెల్లించనుందో వివరించలేదు. ఒప్పందంలో భాగంగా ఇంటెల్ 350 మిలియన్ డాలర్లకు పైగా(సుమారు రూ.2,333 కోట్లు) మొత్తాన్ని నెర్వాణ సిస్టమ్స్కు చెల్లించనున్నట్టు అమెరికా మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కొనుగోలు డీల్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్లో ఇంటెల్ సంస్థనే ముందంజలో ఉంటుందని నెర్వానా సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవీన్ రావ్ తన బ్లాగ్లో పోస్టు చేశారు. దీంతో కంప్యూటింగ్లో ఇప్పటివరకు ఉన్న పాత రూపురేఖలకు స్వస్తి చెప్పి, కొత్త విధానంలో ముందుకు దూసుకెళ్తామని వెల్లడించారు. రెండేళ్ల కిందట దక్షిణ కాలిఫోర్నియాలో వెలిసిన నెర్వాణ సిస్టమ్స్, హార్డ్వేర్, సాప్ట్వేర్లను కలుపుకుని మానవ మేథస్సు వల్లే ఆలోచించడానికి సాయపడటంలో తన ప్రత్యేకత చాటుకుంటోంది. ఎక్సియాన్, ఎక్సియాన్ ఫి చిప్స్ను మంచిగా హ్యాండిల్ చేయడం, ఇంటర్నెట్ క్లౌడ్లో లోతుగా అధ్యయనం చేయడం వంటి వాటి కోసం నెర్వాణకున్న నైపుణ్యాన్ని ఇంటెల్ ఉపయోగించుకోనుంది. -
ల్యాప్టాప్ ధర రూ.9,999
• మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సహకారం • తెలంగాణలో అసెంబ్లింగ్ ప్లాంటు • ఆర్డీపీ ఫౌండర్ విక్రమ్ రెడ్లపల్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ హార్డ్వేర్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఆర్డీపీ వర్క్స్టేషన్స్ ల్యాప్టాప్ల విపణిలోకి అడుగుపెట్టింది. ఆర్డీపీ థిన్బుక్ పేరుతో 14.1 అంగుళాల ల్యాప్టాప్ను రూ.9,999లకే ప్రవేశపెట్టింది. భారత్లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఉపకరణం ఇదేనని కంపెనీ వెల్లడించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారమిక్కడ దీనిని విడుదల చేశారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సహకారంతో ఈ థిన్బుక్ను రూపొందించారు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ ఆటమ్ ఎక్స్5-జడ్8300 ప్రాసెసర్, అల్ట్రా షార్ప్ హెచ్డీ డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, మైక్రో హెచ్డీఎంఐ, యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0, వీజీఏ కెమెరా, డ్యూయల్ హెచ్డీ స్పీకర్స్, బ్లూటూత్, వైఫై, 128 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ ఇతర విశిష్టతలు. 1.45 కిలోల బరువు, 20 మిల్లీమీటర్ల మందం ఉంది. ట్యాబ్లెట్ పీసీలు సైతం.. సర్వర్ ఆధారిత కంప్యూటింగ్ సేవలు అందిస్తున్న ఆర్డీపీ ప్రస్తుతం ల్యాప్టాప్లను తైవాన్లో తయారు చేయిస్తోంది. సాధారణ టీవీలను కంప్యూటర్గా మార్చే ప్లగ్ పీసీలు 10,000 యూనిట్లకుపైగా విక్రయించింది. ఈ నెలలోనే విండోస్ ట్యాబ్లెట్ పీసీలను రూ.5,500లోపు ధరలో ప్రవేశపెడతామని కంపెనీ ఫౌండర్ విక్రమ్ రెడ్లపల్లి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లింగ్ ప్లాంటు రెడీ అవుతుందని చెప్పారు. ఇందుకు రూ.20 కోట్ల దాకా వ్యయం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఔట్లెట్లలో తమ ఉత్పత్తులు లభిస్తాయని వివరించారు. ఆర్డీపీ.ఆన్లైన్తోపాటు ఇతర ఈ-కామర్స్ సైట్ల ద్వారా కూడా ఉపకరణాలను విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఎక్స్క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. 100 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. -
ఇంటెల్ ను వరించిన యాపిల్ కాంట్రాక్ట్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్ గా పేరొందిన యాపిల్ తన చిప్ సప్లైయర్ ను మార్చుకోబోతోంది. తన స్మార్ట్ ఫోన్లలో అమర్చే చిప్ ల కాంట్రాక్టును ఇంటెల్ కు అప్పజెప్పింది. దీంతో ఇప్పటివరకూ క్వాల్కం ఇంక్ చిప్స్ తో వచ్చిన యాపిల్ ఐఫోన్ లు, ఇకనుంచి ఇంటెల్ కార్పొరేషన్ చిప్ లతో యూజర్ల ముందుకు రానున్నాయి. ఇంటెల్ మోడెమ్ చిప్స్ ను యాపిల్ తన తర్వాతి ఐఫోన్లలో వాడనుందని బ్లూమ్ బర్గ్ నివేదించింది. యాపిల్ ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్ లకు ప్రస్తుత వెర్షన్ కాంపొనెంట్ గా, ముఖ్య కమ్యూనికేషన్ సారిధిగా క్వాల్కమ్ చిప్ పనిచేస్తోంది. అయితే ఈ రిపోర్టుపై స్సందించడానికి ఇతర కంపెనీల ప్రతినిధులు తిరస్కరించారు. నిర్వహణ నష్టాలతో సతమతమవుతున్న ఇంటెల్ చిప్ ప్రోగ్రామ్ కు యాపిల్ నుంచి ఈ ఆర్డర్లు దక్కడం అతిపెద్ద విజయమని బ్లూమ్ బర్గ్ రిపోర్టు పేర్కొంది. దీంతో యాపిల్ వ్యాపారాల నుంచి క్వాల్ కామ్ కొన్ని ఆర్డర్లును కోల్పోయింది. ఈ ఆర్డర్ తో గతకొంతకాలంగా పడిపోతున్నఇంటెల్ షేర్లు, కొంత పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంటెల్ షేర్ 0.7 శాతం పెరిగింది. అయితే క్వాల్ కామ్ షేర్లు మాత్రం పడిపోయాయి. 2.9 శాతం పతనమయ్యాయి. యాపిల్ నుంచి మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి ఐఫోన్ కు 2017 లో ఇన్ ఫినియాన్ టెక్నాలజీస్ ఏజీ మోడమ్ లను సమకూర్చింది. అనంతరం ఇన్ ఫినియాన్ ను ఇంటెల్ కొనుగోలు చేసింది. తర్వాత కొంత కాలానికి యాపిల్ తన చిప్ ప్రొవైడర్ గా క్వాల్ కామ్ ను ఎన్నుకోవడంతో, ఇంటెల్ తన చిప్ కాంట్రాక్టులను కోల్పోయింది. అప్పటినుంచి స్మార్ట్ ఫోన్ చిప్ ల వ్యాపారాల్లో ఇంటెల్ తిరోగమనంలో పడింది. ప్రస్తుతం యాపిల్ మళ్లీ తన చిప్ ప్రొవైడర్ గా ఇంటెల్ ను ఎంచుకోవడంతో, తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు ఇంటెల్ కు ఇది ఓ చక్కని అవకాశంగా ఉపయోగపడనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
12వేల ఉద్యోగాలకు ఇంటెల్ కోత
అమెరికాకు చెందిన చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్ ప్రపంచవ్యాప్తంగా 12వేల ఉద్యోగాల కోత విధించనున్నట్టు ప్రకటించింది. పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది. కొత్తగా టెక్నాలజీ వాడే వినియోగదారులందరూ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతుండడంతో, డెస్క్ టాప్ వ్యాపారాలపై తక్కువగా దృష్టిసారించనున్నట్టు ఇంటెల్ పేర్కొంది. మైక్రోసాప్ట్, హ్యూలెట్ ప్యాకర్డ్ లాంటి కంపెనీలు సైతం పర్సనల్ కంప్యూటర్ పరిశ్రమ నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పీసీల సరుకు రవాణా మొదటి త్రైమాసికంలో 11.5 శాతం పడిపోయిందని టెక్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థగా పేరున్న ఇంటెల్, ఈ ఏడాది ఆర్జించే ఆదాయాలు తక్కువగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఇంటెల్ షేర్లు సైతం 2.2 శాతం తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఇంటెల్ ఫ్యాక్టరీలు ఎక్కువగా అమెరికాలో ఉండటంతో, ఎక్కడ ఉద్యోగుల కోత విధించనున్నారో తెలియాల్సి ఉంది. ఇలా ఉద్యోగాల కోత 2017 మధ్య వరకూ కొనసాగిస్తామని ఇంటెల్ పేర్కొంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్న స్టేసీ స్మిత్కు కంపెనీ ఉత్పత్తి అమ్మకాలు, తయారీ కార్యకలాపాలు నిర్వర్తించే బాధ్యతను అప్పజెప్పింది. కంపెనీకి కొత్త సీఈవోను నియమించే ప్రక్రియ కొనసాగుతుందని ఇంటెల్ తెలిపింది. మార్కెట్లో పడిపోతున్న పీసీ అమ్మకాలను పునరుద్ధరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు స్మిత్ చెప్పారు. -
ఇంటెల్ ఉద్యోగాల్లో కోత!
న్యూయార్క్: అమెరికాకు చెందిన చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్ ఈ ఏడాది ఉద్యోగులకు కోత పెట్టనుంది. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గటం ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది చివరికల్లా 1100 మందికి పైగా ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు వినవస్తోంది. ఈ ఏడాది తొలి ఆర్థిక త్రైమాసిక ఫలితాలను ఈ నెల 19న వెల్లడించనుండటంతో అప్పటికల్లా ఉద్యోగాల కోతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 1,07,000 మంది ఈ సంస్థలో వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ప్రెసిడెంట్ రెనాఈ జేమ్స్ సంస్థను వదిలారు. ఆ స్థానాన్ని ప్రస్తుతం ప్రత్యర్థి సంస్థ క్వాల్కామ్కు చెందిన వెంకట మూర్తి రెండుచింతల భర్తీ చేశారు. -
వేలాది ఉద్యోగులకు బైబై!
న్యూయార్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఇంటెల్.. తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. ఇటీవలే ఇద్దరు ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటీవ్లకు ఉద్వాసన పలికిన ఈ సంస్థ.. ఈ ఏడాది చివరి నాటికి వేల సంఖ్యలో ఉద్యోగులకు బైబై చెప్పనుందని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇంటెల్ ఉత్పత్తులు ఆశించిన మేర అమ్మకాల్లో వృద్ధి సాధించకపోవటంతో ఇప్పటికే అమెరికాలో 1100 మంది ఉద్యోగులను తొలగించింది. 2015 డిసెంబర్ నాటికి ఇంటెల్ సంస్థలో ప్రంపంచ వ్యాప్తంగా 1,07,000 మంది పనిచేస్తున్నారు. అయితే అమెరికాలో మాదిరిగానే ఇతర ప్రాంతాల్లో సైతం భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. కొన్ని చోట్ల సంస్థలోని 10 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించాలని ఇంటెల్ భావిస్తున్నట్లు సమాచారం. ఇంటెల్కు పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లో నిరాశాజనకమైన ఫలితాలు ఎదురౌతున్న నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తోంది. -
వ్యవసాయరంగానికి టెక్నాలజి సొల్యూషన్స్
-
అరచేతిలో ఎన్యూపీసీలు
ఇంటెల్, మైక్రోసాఫ్ట్, డబ్ల్యూపీజీ భాగస్వామ్యం హైదరాబాద్: అరచేతిలో ఇమిడిపోయే ఎన్యూపీసీని ఇంటెల్, మైక్రోసాఫ్ట్, డబ్ల్యూపీజీలు సంయుక్తంగా అందిస్తున్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ రెండు, ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్తో రెండు ఎన్యూపీసీలను అందిస్తున్నట్లు ఈ మూడు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్తో కూడిన 2జీబీ మెమెరీ, 500 జీబీ స్టోరేజ్ ఉన్న ఎన్యూపీసీ ధర రూ.29,000 అని, 4 జీబీ మెమెరీ, టెర్రాబైట్ స్టోరేజ్ ఉన్న దాని ధర రూ.32,999 అని ఇంటెల్ డెరైక్టర్ (సౌత్ ఏషియా సేల్స్) రాజీవ్ భల్లా పేర్కొన్నారు. ఇక ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్తో కూడిన 2 జీబీ మెమెరీ, 500 జీబీ స్టోరేజ్ ఉన్న దాని ధర రూ.18,999 అని, 4 జీబీ మెమెరీ, 1 టెర్రాబైట్ స్టోరేజ్ ఉన్న దాని ధర రూ.21,999 అని ఈ సందర్భంగా వివరించారు. -
స్టార్టప్స్కు తోడ్పాటునిచ్చే చర్యలు కావాలి
నాస్కామ్ ప్రీ-బడ్జెట్ ప్రతిపాదనలు బెంగళూరు: ఔత్సాహిక వ్యాపారవేత్తలు, స్టార్టప్స్ని, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీ-బీపీవో సంస్థల సమాఖ్య నాస్కామ్ కేంద్రాన్ని కోరింది. అలాగే, ఫండింగ్, ట్యాక్సేషన్, కంపెనీ నెలకొల్పడం..మూసివేతకు సంబంధించి నిబంధనలు సడలించడం తదితర అంశాలపై కూడా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ కసరత్తు నేపథ్యంలో పలు విషయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ సోమవారం తెలిపారు. పెద్ద కంపెనీలకు నియంత్రణ సంస్థలపరమైన నిబంధనల్లో కూడా మరింత పారదర్శకత అవసరమని వివరించారు. వీటన్నింటి కోసం ప్రభుత్వం ప్రాథమికంగా రూ. 500 కోట్లు కేటాయించాలని కోరినట్లు ఆయన వివరించారు. ఇటువంటి ఇండియా టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ మిషన్తో 50,000 టెక్నాలజీ స్టార్టప్స్ రాగలవని, 30 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలవని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 2020 నాటికి ఐటీ-బీపీవో రగం 300 బిలియ్ డాలర్లకు చేరుకోనుండగా.. అందులో 100 బిలియన్ డాలర్లు ఈ విభాగం నుంచే రాగలవని అంచనాలు ఉన్నట్లు తెలిపారు. 10,000 స్టార్టప్స్ మూడో దశ.. కొత్త టెక్నాలజీ కంపెనీల కోసం ఉద్దేశించిన 10,000 స్టార్టప్స్ కార్యక్రమంలో భాగంగా మూడో విడత పోటీలను చంద్రశేఖర్ సోమవారం ప్రారంభించారు. వెబ్, మొబైల్, ఈకామర్స్ తదితర అంశాల్లో ఏర్పాటయ్యే స్టార్టప్స్ వివరాలను పొందుపర్చేందుకు టెక్నాలజీ స్టార్టప్ రిజిస్ట్రీ పేరిట రిపాజిటరీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.