Jagananna Vasathi Deevena
-
పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్మెంట్కు ఎసరు
సాక్షి, అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు చూద్దామంటే కుదరదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశ పడొద్దు. అప్పో.. సప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు...’ ఇదీ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి! ‘‘గత ఐదేళ్లు మా పిల్లల చదువులు సాఫీగా సాగిపోయాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద ఫీజులతోపాటు ఏడాదికి హాస్టల్, మెస్ ఖర్చులు వసతి దీవెనతో మా ఖాతాల్లో పడేవి. వెంటనే మేం కళాశాలలకు చెల్లించేవాళ్లం. మా పిల్లలకు సరిగా చదువు చెప్పకున్నా, హాస్టల్ బాగోలేకున్నా గట్టిగా ప్రశ్నించే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన దుస్థితి తప్పదని భయమేస్తోంది’’ తల్లిదండ్రులు ఆవేదన ఇది!పేర్ల మార్చడంలో ఉత్సాహం అమలులో ఏది?రాష్ట్రంలో ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యా రంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు బకాయిలు ఇంతవరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడం, కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆదుర్దా చెందుతున్నారు. ఏ కళాశాలలో చూసినా ఫీజుల గోలే వినిపిస్తోంది. ఇంతకాలం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో(వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు ఊసే విస్మరించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్)గా మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్–మెస్ చార్జీల విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిర్ణీత షెడ్యూళ్ల ప్రకారం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు రూ.1,300 కోట్లు, హాస్టల్–మెస్ చార్జీల కింద ఏడాది చివరిలో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.విద్యార్థుల్లో ‘ఫీజుల’ కలవరంప్రతి పేదింటి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోనే నేరుగా ఫీజుల మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. వారి ద్వారా ఫీజులు చెల్లిస్తుండంతో యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత అనుమతి లభించగా కొంత మంది ఖాతాల్లో నగదు జమైంది. ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేశారు. ఇంకా రూ.605 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విద్యార్థులను కలవరపెడుతోంది. పైగా జూన్లో మూడో విడత(జనవరి–మార్చి) కింద సుమారు రూ.700 కోట్లు ఫీజుల కింద విడుదల చేయాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గత సర్కారు తెచ్చిన పథకాలకు కొత్త ప్రభుత్వం మంగళం పాడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.చదువులపై బాధ్యత లేదా?పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉజ్వల బాటలు వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. వీటి చెల్లింపుల్లో నాటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిల మొత్తాన్ని చెల్లించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్పై మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజురీయింబర్స్మెంట్ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది.చెల్లింపులపై దుష్ప్రచారం..ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ విద్యార్థులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ హయాంలో 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ట్యూషన్ ఫీజులు చెల్లించారు. 25.17 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద హాస్టల్–మెస్ చార్జీల కోసం మరో రూ.4,275.76 కోట్లు అందచేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా దీవెన, వసతి దీవెనల కింద దాదాపు రూ.18,663 కోట్లకుపైగా (పాత బకాయిలతో కలిపి) వెచ్చించారు. ఎన్నికలకు ముందు షెడ్యూల్ ఇచ్చి మరీ నిధులు విడుదల చేసినా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుట్రలు చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో నిధుల విడుదలకు ఒక రోజు సమయం (పోలింగ్కు ముందు) ఇచ్చింది. దీనిపైనా మరోసారి టీడీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణ జరిగేలోపే ఆ ఒక్కరోజు సమయం కాస్తా గడిచిపోయింది. ఫలితంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అనంతరం కొంత మంది ఖాతాల్లో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ జమైంది. మిగిలిన మొత్తంతో పాటు జూన్లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన మొత్తాన్ని చెల్లించే విషయంపై కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోగా గత ప్రభుత్వంపై నెపం వేసే యత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,300 కోట్లు, వసతి దీవెనతో రూ.1,100 కోట్లు చెల్లించకుండా దుష్ప్రచారం చేస్తూ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే విద్యార్థుల కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకుపోయి చదువులు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధివసతి ఖర్చులకు సంబంధించి 2014–19 మధ్య రూ.4 వేల నుంచి రూ.10 వేల స్లాబ్ పెట్టి ఇవ్వగా వైఎస్ జగన్ ఆ విధానాన్ని తొలగించి వసతి దీవెన ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సమానంగా ఆర్థిక సాయం అందించారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2 లక్షలు పరిమితి ఉండగా అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. ఉన్నత విద్యకు అడ్డంకి.. తిరుపతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తయ్యింది. రెండేళ్లుగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన టైమ్ టూ టైమ్ మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. దీంతో సకాలంలో కాలేజీ ఫీజులు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నగదు జమ చేయలేదు. సరి్టఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని యాజమాన్యం చెబుతోంది. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి లోకేశ్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. – పి.శేఖర్, తిరుపతి -
‘ అన్నా.. అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్లారు. అయితే విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సీఎం జగన్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులై ఉన్న సమయంలో ఇద్దరు విద్యాదీవెన లబ్ధిదారులు తమ అనుభవాలను అమూల్యమైన ప్రసంగం ద్వారా పంచుకున్నారు. ‘ మీరు సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం’ అన్నా అనే పదానికి అర్ధం, అమ్మలోని అ, నాన్నలోని న్న కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న, అన్నా మాది మధ్య తరగతి కుటుంబం, నా ఇంటర్ తర్వాత నాన్నకు హార్ట్ ఆపరేషన్, నా చదువు ఎలా కొనసాగించాలా అనుకునే సమయంలో నాకు క్రిష్ణా యూనివర్శిటీలో బీటెక్ సీట్ వచ్చింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను, అమ్మ ఖాతాలో నేరుగా డబ్బు పడుతుంది, నాన్న తను చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్ల చుట్టూ తిరిగేవారన్నారు, నేను ఒక్క ఆఫీస్కు వెళ్ళకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇచ్చారు, మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం, మీరు మా విద్యార్ధులకు అన్నీ ఇస్తున్నారు, మీ వల్ల మాలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారు, ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మా కుటుంబం కూడా చాలా లబ్ధి పొందింది, మేం మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగామంటే మీరే కారణం అన్నా, థ్యాంక్యూ. - శ్రీ షణ్ముక సాయి ప్రియ, విద్యాదీవెన లబ్ధిదారు ‘అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’ మాదొక పేద కుటుంబం.. మా నాన్నగారు ప్రైవేటు ఉద్యోగి. మా నాన్న గారి జీతం మీద మా ఇల్లు నడుస్తోంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను..ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అదే కాలేజ్కి వెళ్లినప్పుడు చదివితే ఇటువంటి కాలేజీలో చదవాలి అనుకున్నాను. కానీ అప్పుడు మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. చదివించేంత డబ్బులు లేవు. అప్పుడు మీరొచ్చారన్నా.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వచ్చారు అన్నా. విద్యా దీవెన పథకం ద్వారా నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నారన్నా. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తాను చెల్లి అంటూ మీరు మరో అడుగు వేశారన్నా. మీ దీవెనలతోనే నేను ఎక్కడైతే చదవాలని అనుకున్నానో అక్కడే చదవుతున్నాను అన్నా. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లీష్ రైటర్ టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు, మీరు కూడా టెన్థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు, నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్గా నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్ మీద నిలబడి మాట్లాడతానని నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మా యూత్కు మార్గదర్శిగా నిలుస్తున్నారు, అన్నా థ్యాంక్యూ. -దిల్షాద్, విద్యాదీవెన లబ్ధిదారు -
Fact check: అసత్య రాతలు.. తప్పుడు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన’ పథకాలు చింతలేని ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎందరో పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివే అవకాశం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇది ఎల్లో మీడియాకు ఏమాత్రం రుచించట్లేదు. పేదింటి బిడ్డను ప్రభుత్వం ఉన్నత చదువులకు తీసుకెళ్తుంటే ఓర్వలేక దుష్ప్రచారానికి పాల్పుడుతోంది. దీనికి తోడు అసలు ప్రభుత్వ పథకం లక్ష్యం, అది ఎలా అమలవుతోంది కనీస పరిజ్ఞానం లేని కొన్ని ప్రతిపక్షాలు ఈ తప్పుడు వార్తల ఆధారంగా అర్థరహిత విమర్శలు చేస్తున్నాయి. తిరిగి వాటినే మళ్లీ ఎల్లో మీడియా పెద్దపెద్ద హెడ్డింగ్లతో ముద్రిస్తూ పైశాచిక ఆనందం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044కోట్లుగా ఉంది. అప్పట్లో అప్పులు చేసి ఫీజులు కట్టే దుస్థితి గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చదివించాల్సిన దుస్థితి ఉండేది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి రూ.35 వేలలోపు ఇస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3లక్షలకు వరకు చెల్లిస్తూ పేదల విద్యను పట్టం కడుతోంది. జవాబుదారీ తనం పెంచేలా, పారదర్శకంగా తల్లి, విద్యార్థి జాయింట్ బ్యాంకు ఖాతాల్లో ప్రతి త్రైమాసికానికి విద్యాదీవెనను జమ చేస్తోంది. టీడీపీ హయాంలో సగటు చెల్లింపు స్వల్పం.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్మెంట్ కింద సగటున ఏడాదికి రూ.2066 కోట్లు, హాస్టల్ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించేది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.12,141 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వం 2017 నుంచి 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1778 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెడితే.. సీఎం జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా తీర్చింది. ఈ ప్రభుత్వంలో పెరిగిన ఖర్చు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి) చెల్లించింది. ఏడాదికి సగటున విద్యాదీవెన కింద రూ.2835 కోట్లు, వసతి దీవెన కింది అత్యధికంగా రూ.1068.94 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధి గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.10వేల మధ్య స్లాబ్ పెట్టిమరీ ఇచ్చేవారు. కానీ సీఎం జగన్ స్లాబ్ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2లక్షలకు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాలు వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తోంది. -
మా అమ్మగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. జగనన్న విద్యాదీవెన,వసతి దీవెన పథకాలతో చదువుకోగలుగుతున్నాను.
-
ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివేందుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వరం..!
-
మీ భవిష్యత్తుకు బంగారు బాట
-
అనంతపురం: జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం (ఫొటోలు)
-
Andhra Pradesh: చదువే దివ్యాస్త్రం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మనం చదువుకునేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు.. ప్రపంచంతో పోటీపడే అత్యుత్తమ చదువులే మన లక్ష్యం. విద్య ఒక కుటుంబం స్థితిగతులను, సామాజిక అసమానతలను రూపుమాపుతుంది. పేదరికం సంకెళ్లను తెంచాలంటే చదువే పెద్ద అస్త్రం. అందుకే అధికారంలోకి వచ్చాక విద్యా విధానంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. మన చదువులు బతకడానికి మాత్రమే కాదు.. లీడర్లుగా ఎదగడానికి కూడా ఉపయోగపడాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేదలెవరూ పెద్ద చదువులకు దూరం కాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు విద్యార్థులు ఉండటానికి, తినటానికి అవసరమయ్యే వసతి ఖర్చులకు కూడా డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ చదివే ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. బుధవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో ‘జగనన్న వసతి దీవెన’ కింద రూ.912.71 కోట్లను తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ.. నాలుగేళ్లలో రూ.14,223.60 కోట్లు ఈరోజు విడుదల చేస్తున్న జగనన్న వసతి దీవెన నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. 8,61,138 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేస్తున్నాం. మన పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదివేందుకు ఎక్కడా అడ్డంకులు రాకూడదనే విద్యాదీవెనతో పాటు వసతి దీవెన నిధులు ఇస్తున్నాం. ఇప్పటివరకూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద నాలుగేళ్లలో రూ.14,223.60 కోట్లు అందచేశాం. సత్య నాదెళ్ల స్థాయికి అందరూ ఎదగాలి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి మనమంతా చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఒక్కరే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ అండతో చదువుకునే ప్రతి విద్యార్థీ ఆ స్థాయికి వెళ్లాలన్నదే నా తపన. భవిష్యత్తు తరాలకు మేలు జరగాలని పిల్లలను చక్కగా చదివించే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. మనమంతా గత ప్రభుత్వాలను చూశాం. అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. భోజన వసతి లేక పేద పిల్లలు ఎంతో ఇబ్బంది పడేవారు. గత పాలకులు 2017–18, 2018–19కి సంబంధించి రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేస్తూ ఎలాంటి అవినీతికి తావులేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున వసతి దీవెన కింద ఇస్తున్నాం. రెట్టింపు దాటిన జీఈఆర్ గతంలో ఇంటర్ పూర్తయ్యాక చాలామంది విద్యార్థులు కాలేజీలకు వెళ్లలేకపోయేవారు. ఇప్పుడు అలాంటి డ్రాపౌట్స్ తగ్గిపోయాయి. జీఈఆర్ (స్థూల చేరికల నిష్పత్తి) గతంలో 32.4 శాతం ఉండగా ఈ ప్రభుత్వం వచ్చాక 70 నుంచి 80 శాతానికి పెంచేలా చర్యలు తీసుకున్నాం. ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడటం కాకుండా ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేట్ స్కూళ్లే పోటీ పడాల్సిన స్థాయికి తెచ్చాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చాం. 6వ తరగతి నుంచి 30,230 క్లాస్ రూమ్స్లో డిజిటల్ బోధన తెచ్చాం. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాం. 2018–19 నాటికి ప్రభుత్వ స్కూళ్లలో 37 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 40 లక్షల మందికి పెరిగారు. వారికి వాళ్ల అన్న ఉన్నాడనే నమ్మకంతోనే ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. గతంలో 87 వేల మంది ఇంజనీరింగ్ చదువుతుంటే ఈ ప్రభుత్వం వచ్చాక రూ.1.20 లక్షల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. ‘ఉన్నత’ మార్పులతో ఉత్తమ ఉద్యోగాలు అధికారంలోకి రాగానే ఉద్యోగాలకు అనుకూలంగా ఉన్నతవిద్య కరిక్యులమ్లో మార్పులు తీసుకొచ్చాం. 30 శాతం స్కిల్, జాబ్ ఓరియెంటెడ్గా మార్పులు తేవడంతో పాటు 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు, 67 బిజినెస్ ఒకేషనల్ కోర్సులను కరిక్యులమ్లో భాగం చేశాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాం. పిల్లల నైపుణ్యం పెంపొందించేలా అప్ స్కిల్లింగ్ కార్యక్రమాల కోసం దేశంలో తొలిసారిగా ఆన్లైన్ కోర్సులను కరిక్యులమ్లో భాగం చేశాం. ఆన్లైన్ క్రెడిట్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ సంపూర్ణ మార్పులు చేపట్టాం. 1.60 లక్షల మందికి సైబర్ సెక్యూరిటీ, అజూర్ వెబ్ సర్వీసెస్, డైనమిక్ 365 లాంటి కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ, సర్టిఫికెట్స్ ఇప్పించి మెరుగైన ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నాం. మైక్రోసాఫ్ట్ ఒక్కటే కాకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్, సేల్స్ఫోర్స్ లాంటి దిగ్గజ సంస్థల సేవలను అనుసంధానం చేశాం. మన విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మాస్టర్స్ ప్రోగ్రాంపై జర్మనీకి చెందిన యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. బీఎస్సీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్కు సంబంధించి మెల్బోర్న్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుని అడుగులు ముందుకు వేస్తున్నాం. గత సర్కారు పెత్తందారీ పోకడ పేద పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ మనస్తత్వం గత ప్రభుత్వానిది. ప్రతి పేదవాడూ పెద్ద చదువులు చదువుకోవాలి.. కుటుంబ పరిస్థితులు మారాలన్నది మన ప్రభుత్వ సంకల్పం. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో చూడండి. రెండు ప్రభుత్వాలనూ బేరీజు వేయండి. ఈ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందంటే మీరే జగనన్నకు సైనికులుగా నిలబడండి. అబద్ధాలు, మోసాలు లాంటివి రానున్న రోజుల్లో మరిన్ని చూస్తారు. అవేమీ నమ్మకండి. నాకు ఉన్న ధైర్యమల్లా దేవుడి దయ, మీ ఆశీస్సులే. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఉషశ్రీ చరణ్ తదితరులతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విదేశీ విద్యకు ఆర్థిక సాయం.. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే మన విద్యార్థుల కోసం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. టాప్ 50 యూనివర్సిటీల్లో సీటొస్తే రూ.1.25 కోట్ల వరకూ ప్రభుత్వమే భరించి వారిని చదివిస్తుంది. ఇప్పటికే 200 మంది విద్యార్థులను జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివిస్తున్నాం. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నది నిజమే కానీ.. ‘ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్’ అన్నది సత్యం. మన చదువులు బతకడానికి మాత్రమే కాదు.. లీడర్లుగా ఎదగడానికీ ఉపయోగపడాలి. మనలో ఎదగాలన్న తపన, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి ఉంటే ప్రపంచమే మనచుట్టూ తిరుగుతుంది. మా జగనన్న చదివిస్తున్నారు.. అని గర్వంగా చెబుతా మాది ధర్మవరం. మా నాన్న టైలరింగ్ చేస్తారు. అమ్మ గృహిణి. చదువుల దీపాలను వెలిగించే యాగానికి మీరు శ్రీకారం చుట్టారు. మీరు వెలిగించే దీపాలు ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. 2021లో ఇంటర్ పూర్తవగానే జేఎన్టీయూ అనంతపురంలో ఇంజినీరింగ్ సీటు సాధించా. విద్యాదీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నా. మా తల్లిదండ్రులకు భారం కాకుండా వసతిదీవెన ద్వారా హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నా.. మా జగనన్న నన్ను చదివిస్తున్నారని. మా ఇంటికి ఇప్పటివరకు అక్షరాలా రూ.3,06,000 సాయం చేశారు. మా సొంతింటి కల నెరవేరింది. – దివ్యదీపిక, బీటెక్ సెకండియర్, జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల మీరే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం మాది తిరుపతి జిల్లా చెన్నూరు. నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న నేను ఈ రోజు ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నానంటే మీ నవరత్న పథకాలే కారణం. విద్యాదీవెన, వసతిదీవెన లేకపోతే నేను చదువుకు దూరమయ్యేవాడిని. నాలాంటి ఎంతోమంది మీకు రుణపడి ఉంటాం. ప్రతి నెలా మా ఇంట్లో పథకాలు అందుతున్నాయి. మా ఒక్క కుటుంబానికే మీరు రూ.4,59,976 అందజేశారు. మీరే ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను ప్రయోజకుడిని అయి పదిమంది విద్యార్థులకు తోడ్పాటు అందిస్తానని ప్రమాణం చేస్తున్నా. – గోవింద్ చంద్రశేఖర్, బీటెక్ ఫైనలియర్, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల లోకేశ్.. శింగనమల చెరువు వద్దకు వెళ్లి సెల్ఫీ చాలెంజ్ ఎందుకు చేయలేదు? గతంలో శింగనమల నియోజకవర్గంలో కరువు ఉండేది. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండాయి. లాభసాటి వ్యవసాయం చూస్తున్నాం. ఇవన్నీ కేవలం నాలుగేళ్ల పాలనలోనే సాధ్యమయ్యాయి. ఒక్క శింగనమల నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా రూ.1,400 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.320 కోట్లు కేటాయించారు. ఇటీవల శింగనమలలో లోకేశ్ యువగళం కాదు.. గందరగోళం పాదయాత్ర జరిగింది. మీ బాబు హయాంలో ఒక్కసారైనా శింగనమల చెరువు నిండిందా? ఇప్పుడు నాలుగేళ్లుగా నిండే ఉంది. సెల్ఫీ చాలెంజ్ అంటున్న లోకేశ్.. ఆ చెరువు పక్కన సెల్ఫీ ఎందుకు తీసుకోలేదు? – జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల ఎమ్మెల్యే -
చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు: సీఎం జగన్
-
మా చిరునవ్వుకు కారణం మీరే జగనన్న.. నార్పల సభలో విద్యార్థిని భావోద్వేగం..
సాక్షి, అనంతపురం జిల్లా: ‘అన్నా నమస్తే, మా నాన్న టైలరింగ్ చేస్తారు.. మా అమ్మ గృహిణి, మాది ధర్మవరం.. అన్నా మీరు అంటుంటారు ఒక దీపం ఒక గదికి వెలుగులు ఇస్తుంది కానీ చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగులు నింపి ఆ కుటుంబ రూపురేఖలు మార్చేస్తుందని, మీరు విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు.. ఆ చదువుల దీపాలను వెలిగించే యాగానికి మీరు శ్రీకారం చుట్టారు’’ అంటూ అనంతపురం జేఎన్టీయూ కాలేజ్ బీటెక్ సెకండియర్ విద్యార్ధిని దివ్య దీపిక భావోద్వేగానికి గురైంది. నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ‘జగనన్న వసతి దీవెన’ ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో విద్యార్ధులు తమ స్పందన తెలిపారు. ‘జగనన్న వసతి దీవెన గురించి విద్యార్ధిని దివ్య దీపిక మాటల్లోనే.. మీరు వెలిగించే దీపాలు ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. అన్నా నాది 2021లో ఇంటర్ పూర్తవగానే ఇక్కడ జేఎన్టీయూలో సీట్ తెచ్చుకున్నాను. నేను విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నాను. అలాగే మా తల్లిదండ్రులకు భారం కాకుండా వసతి దీవెన ద్వారా హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నా.. మా జగనన్న నన్ను చదివిస్తున్నారని.. లాక్డౌన్ తర్వాత అంతంతగా ఉన్న మా ఆర్ధిక పరిస్ధితిపై మీరు కనుక ఈ పథకాలు పెట్టకపోయి ఉంటే ఎంతో భారం పడేది. మీ చిరునవ్వులో నేను భాగమవుతా.. మీ కుటుంబంలో ఒకడినవుతానని మీరు అంటుంటారు.. మా చిరునవ్వులో భాగమే కాదు చిరునవ్వుకు కారణం కూడా మీరే, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు.. విద్యా కానుక ద్వారా స్కూల్ బుక్స్, బ్యాగ్, ఇలా ప్రతీది అందిస్తున్నారు, ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యం కానిదంతా మీరు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ నాయకుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు. మీరు ప్రతి గుండెలో ఉంటారన్నా.. మా ఇంట్లో చాలా పథకాలు అందుతున్నాయి. మా ఇంట్లో ఇప్పటివరకు అక్షరాలా రూ. 3,06,000 సాయం చేశారు. మా సొంతింటి కల నెరవేరింది.. అన్నొచ్చాడని చెబుతాం, మంచి రోజులు వచ్చాయని చెబుతాం. చదవండి: ఆ పెద్దమనిషి ఇంటర్వ్యూ చూస్తే ముసలి పులి కథే గుర్తొచ్చింది మీరు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారు. మీ పాదయాత్రకు ఏదీ సాటిరాదన్నా. నేను కోరుకుంటున్న ఉన్నతమైన సమాజానికి మీరు పునాదులు వేశారు. ప్రతి గ్రామంలో అన్నీ ఏర్పాటుచేస్తున్నారు. సచివాలయాల ద్వారా అన్నీ అందుతున్నాయి, మీ కష్టాన్ని చరిత్ర కచ్చితంగా గుర్తుంచుకుంటుంది. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ చరిత్ర కొందరినే గుర్తించుకుంటుంది. ఆ చరిత్రలో జగన్ అనే పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. యాదృచ్చికమో లేక దైవ నిర్ణయమో కానీ మీరు సీఎం అయిన తర్వాత కరువుతో అల్లాడే రాయలసీమ కూడా పచ్చగా కళకళలాడుతుంది. అన్నొచ్చేశాడు మన బతుకులు మార్చేశాడు. రాబోయే రోజుల్లో మీరు చదివిస్తున్న ఈ బిడ్డ ఉన్నతస్ధాయికి ఎదిగి మీ ముందుకొచ్చి మాట్లాడుతుంది అన్నా. మీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో నా వంతు పాత్రను నేను పోషిస్తాను, ధ్యాంక్యూ అన్నా. మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం సార్, మాది నిరుపేద కుటుంబం, చెన్నూరు గ్రామం, తిరుపతి జిల్లా. మా నాన్న కూలిపనులు చేస్తారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితుల్లో ఉన్న నేను ఈ రోజు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నానంటే మీ నవరత్న పథకాలే కారణం. విద్యాదీవెన, వసతిదీవెన లేకుండా ఉంటే నేను చదువుకు దూరమయ్యేవాడిని, నాలాంటి ఎంతోమంది విద్యార్ధులకు మీరు సాయం చేస్తున్నారు, మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం, వసతి దీవెన ద్వారా మాకు సాయం అందుతుంది, మాకు చాలా సంతోషంగా ఉంది, చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయే మార్పులు మీరు విద్యారంగంలో చేస్తున్నారు. నాడు నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద, విదేశీ విద్యాకానుక పథకాలు తీసుకొచ్చారు, ప్రతి నెలా మా ఇంట్లో పథకాలు అందుతున్నాయి, మా ఒక్క కుటుంబానికే మీరు రూ. 4,59,976 అందజేశారు, మాలాంటి పేద విద్యార్ధులకు మీరు అండగా నిలిచి ఎప్పుడూ మాకు తోడుగా నిలిచి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం, నేను రాముడి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పుస్తకాలలో చదివాను కానీ ఇప్పుడు జగనన్న పాలనలో మేం అంతే సంతోషంగా ఉన్నాం, నేను మంచి ప్రయోజకుడిని అయి పది మంది విద్యార్ధులకు తోడ్పాటును అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను, నేను మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను సార్, ధన్యవాదాలు. -గోవింద్ చంద్రశేఖర్, బీటెక్ ఫైనలియర్, ఎస్కేడీ యూనివర్శిటీ విద్యార్ధులకు మీరు రోల్మోడల్.. సార్, నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఈ కాంపిటీటివ్ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివించడం అనేది మా తల్లిదండ్రులకు పెద్ద భారం, కానీ మీరు సమాజంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. మీరు మా విద్యార్ధులకు అనేక పథకాలు తీసుకొచ్చారు, దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్లో అనేక కోర్సులు ప్రవేశపెట్టారు, మా విద్యార్ధులకు మీరు రోల్మోడల్గా నిలిచారు.. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మేం కూడా ఉన్నత చదువులు చదివి ప్రయోజకులై భవిష్యత్లో ఉన్నతంగా రాణిస్తాం.. నేను ఈ మధ్య మాల్కం గ్లాడ్వెల్ రచించిన అవుట్లేర్స్ పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో పదివేల గంటల సూత్రం చదివాను, దాని అర్ధం ఏంటంటే ఎవరైనా ఏ రంగంలోనైనా నిష్ణాతులు కావాలంటే పదివేల గంటలు అభ్యసించాలని, మీరు పాదయాత్రలో దానిని నిరూపించారు, ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది, మీరు మనసున్న మారాజులా నిలిచారు, మీరు మా యువతకు గొప్ప స్పూర్తిప్రదాతగా నిలిచారు. మీ పేరు నిలబెట్టేలా మేం ముందుకెళతాం, ధ్యాంక్యూ సార్. -గ్రేసీ, బీటెక్ సెకండియర్ విద్యార్ధిని, జేఎన్టీయూ, అనంతపురం -
అనంతపురం: సీఎం జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. నార్పల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్లో వెళ్లాల్సిన సీఎం.. రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి బుధవారం.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ‘జగనన్న వసతి దీవెన’ పథకం నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. చదవండి: పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు: సీఎం జగన్ -
ఇదీ కదా సీఎం జగన్ విజన్.. ప్రత్యక సాక్షి ఈ అమ్మాయే
-
చంద్రబాబుపై సీఎం జగన్ పులి కథ.. వేరే లెవెల్..
-
అనంతపురం: జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం (ఫొటోలు)
అనంతపురం: జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం (ఫొటోలు) -
పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు: సీఎం జగన్
సాక్షి, అనంతపురం: పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువనే అస్త్రంతోనే సాధ్యమవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. బుధవారం అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు మంచి చేస్తూ.. వాళ్ల తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 912 కోట్ల రూపాయలను నేరుగా జమ చేస్తున్నాం. చదువు ఓ కుటుంబ చరిత్రనే కాదు.. ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే మా తాపత్రయం. ఈ నాలుగేళ్లలో నాణ్యమైన విద్య అందించే విధంగా.. విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు.. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నాం. ఇది జగనన్న విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన అని సీఎం జగన్ పేర్కొన్నారు. పీజు రీయంబర్స్మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం.. పెత్తందారి ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడాలు ప్రజలు గమనించాలని సీఎం జగన్ ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. పేదలకు పెద్ద చదువులు అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం అని సీఎం జగన్ పేర్కొన్నారు. గవర్నమెంట్ విద్యాసంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితి తెచ్చాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. పేద పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలనుకున్న పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. అందుకే బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. ప్రతీ మూడు నెలలకు తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యా రంగంలో డ్రాపవుట్ల సంఖ్య తగ్గిందని సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్లలా ఎదగాలి.. మన పిల్లలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా విద్యా సంస్కరణలు చేశాం. ఈ ప్రయత్నాలు కేవలం ఉద్యోగాలు కోసం కాదు. వాళ్లను లీడర్లుగా వారిని తీర్చిదిద్దడానికి తపన పడుతున్నాం. మన పిల్లలను లీడర్లుగా చేసేందుకు జగనన్న ఆలోచన చేస్తున్నాడు. మన పిల్లలంతా సత్యనాదెళ్లలా(సత్యనాదెళ్ల మూలాలు అనంతపురంవే కావడం గమనార్హం) తయారు కావాలి. ఒక్క సత్యనాదెళ్లకాదు… ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్ల కావాలి. స్కూళ్లలో ఐఎఫ్పీ ప్యానెల్స్ పెడుతున్నామని సీఎం జగన్ వివరించారు. ఇదీ చదవండి: నా జగనన్న నన్ను చదివిస్తున్నాడు -
జగనన్న వసతి దీవెన: నిధులు విడుదల చేసిన సీఎం జగన్
CM Jagan Anantapur District Tour Updates: ► బటన్ నొక్కి రూ.912.71 కోట్లు నిధులు విడుదల చేసిన సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 9,55,662 మంది విద్యార్థుల తల్లుత ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నాం. ► చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబానికి చెందిన సామాజకి వర్గాన్నే మారుస్తుంది. పేదరికం సంకెళ్లు తెంచుకోవడానికి చదువే అస్త్రం. చదువుల వల్ల ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. ► జగనన్న వసతి దీవెన ద్వారా ఐటీఐ చదివే విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. ► గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలి. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. మన ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నాయి. ► గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉన్నత విద్య చదివేవారి సంఖ్య పెరిగింది. గవర్నమెంట్ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ► ఇది విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న వసతిదీవెన. ఫీజురియింబర్స్మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు.. బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ప్రతి 3 నెలలకు తల్లుల ఖాత్లాలో డబ్బులు జమ చేస్తున్నాం. ► నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్యా నాదెళ్లతో పోటీపడే పరిస్థితి రావాలి. యువతను ప్రపంచ స్థాయి లీడర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. ఆత్మవిశ్వాసం, కామన్సెన్స్తో పాటు డిగ్రీ ఉంటే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్.. ఎడ్యూకేషన్ ఈజ్ పవర్. ► రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబును చూసి పంచతంత్రం కథ గుర్తొచ్చింది. వేటాగే శక్తి కోల్పోయిన పులి గుంటనక్కలను వెంటేసుకుని తిరిగినట్టు ఉంది. ► రోజూ రాజకీయాల మధ్య మనం బతుకుతున్నాం. నేను సీనియర్ను ఇప్పుడు మంచోడిని అయ్యాను అని నమ్మించే ప్రయత్నం చేశారు. బంగారు కడియం ఆశచూపి మనుషులను మింగేసే పులి బాపతు వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిఏ ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు. ► రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడు. బాబు వచ్చాడు.. రైతులను నట్టేట ముంచాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయి. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండిచేయి చూపాడు. ► దోచుకో, పంచుకో, తినుకో ఇదే చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వీరికి తోడుగా దత్తపుత్రుడు. ఇది గజదొంగల ముఠా. బాబు అబద్దాలను, మోసాలను నమ్మకండి. ► జగనన్న వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మవిశ్వాసం ప్రజలే. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి. నా అన్న జగనన్న చదివిస్తున్నాడు ఒక దీపం ఒక గదికి వెలుగు ఇస్తుంది. కానీ, చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగును నింపి ఆ కుటుంబాల రూపు రేఖల్ని మారుస్తుందని సీఎం జగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ.. సీఎం జగన్తో ముఖాముఖి అయ్యింది దివ్య దీపిక. అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ సెకండర్ ఇయర్ చదువుతోంది. ధర్మవరానికి చెందిన దివ్య దీపిక.. తండ్రి కొంగాల బాలకృష్ణ టైలర్, తల్లి గృహిణి. విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటోంది. వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు. నా కుటుంబం మీద ఏ ఆర్థిక భారం పడకుండా.. నా అన్న జగనన్న చదవిస్తున్నాడంటూ భావోద్వేగానికి లోనైంది దీపిక. ► జగనన్న పాలనలో పేదల చదువులకు ఢోకా లేదు. నాణ్యమైన చదువుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాల రూపకర్త. అభివృద్దికి దిక్సూచి సీఎం జగన్. విద్యారంగంలో వినూత్న మార్పులు తెస్తున్నారు. 2019లో హిస్టరీ క్రియేట్ చేశాం. 2024లో హిస్టరీ రిపీట్ చేస్తాం.. అని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రసంగించారు. ► జ్యోతి ప్రజ్వలన చేసిన ముఖ్యమంత్రి జగన్. ► దివంగత మహానేత వైఎస్సార్కు నివాళులర్పించిన సీఎం జగన్. ► జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమ సభా ప్రాంగణం వద్ద అప్యాయ పలకరింపుతో ముందుకు సాగుతున్న సీఎం జగన్. ► అపూర్వ స్వాగతం నడుమ.. నార్పల సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్. నార్పల హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్కు ఘన స్వాగతం ► అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మాత్యులు కేవీ ఉషశ్రీ చరణ్, జిల్లా కలెక్టర్ గౌతమి, అనంతపురం డిఐజి ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్,సహాయ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్ లు సీఎం జగన్కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. ► జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా.. లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కార్యక్రమం కోసం అనంతపురం నార్పలకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. ► అనంతపురం నార్పల పర్యటనలో భాగంగా.. పుట్టపర్తి నుంచి శింగనమల నియోజకవర్గం నార్పలకు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. ఆపై నార్పల క్రాసింగ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. ముందుగా విద్యార్థుల తల్లులను, స్థానిక నేతలను పలకరించి.. ఆపై వేదిక వద్దకు చేరుకుంటారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. జగనన్న వసతి దీవెన లబ్ధిని బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేస్తారు. ► జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం కోసం అనంతపురం నార్పలకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు. అక్కడి సభాప్రాంగణం నుంచి ప్రసంగించిన తర్వాత సీఎం జగన్ నిధుల నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ► జగనన్న వసతి దీవెన కింద నిధులు విడుదల కోసం.. తాడేపల్లి నుంచి అనంతపురం జిల్లా నార్పల బయలుదేరిన సీఎం జగన్. ► జగనన్న వసతి దీవెన పథకం ప్రకారం.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ► రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం జిల్లా నార్పల వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. ► సంక్షేమ క్యాలెండర్ అమలు హామీలో భాగంగా పేద విద్యార్థులకు ఆసరా అందిస్తూనే.. గత ప్రభుత్వం 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. ► గతంలోని టీడీపీ ప్రభుత్వం అరకోరగా ఫీజుల కోసం నిధుల్ని విడుదల చేసేది. పెండింగ్ బకాయిల్ని ఉంచింది కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం. -
నేడు జగనన్న వసతి దీవెన
సాక్షి, అమరావతి: చెప్పిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జగనన్న వసతి దీవెన అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం జిల్లా నార్పల వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. విప్లవాత్మక సంస్కరణలు కరిక్యులమ్లో మార్పులు, నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు, తప్పనిసరిగా ఇంటర్న్షిప్ తదితర విప్లవాత్మక కార్యక్రమాలతో విద్యా రంగాన్ని బలోపేతం చేస్తోంది. డిజిటల్ విద్యలో భాగంగా 8 వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు, నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్రూమ్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది. కాగా, బుధవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం నార్పల క్రాస్రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న వసతి దీవెన కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. తిరిగి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
ఈ నెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 26న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘జగనన్న వసతి దీవెన’ కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. బుధవారం ఉదయం8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు సీఎం చేరుకుంటారు. 10.40 – 12.35 గంటల వరకు నార్పల క్రాస్రోడ్స్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగం, అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమం– లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: సీఎం జగన్ను కలిసేందుకు 800కి.మీ సైకిల్ తొక్కుతూ వచ్చిన అభిమాని సీఎం పర్యటనపై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న జిల్లా పర్యటనకు విస్తున్నారని కలెక్టర్ గౌతమి తెలిపారు. సీఎం పర్యటనపై కలెక్టర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలి వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు, లబ్ధిదారులను సమావేశానికి బస్సుల్లో తీసుకురావాలని సూచించారు. వాహనాలు నిలిపేందుకు ప్రజలకు, వీఐపీలకు వేరువేరుగా పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సభాస్థలి గ్యాలరీ వద్ద తాగునీరు, మజ్జిగ, స్నాక్స్ అందుబాటులో ఉంచాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 104, 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. వినతులు స్వీకరించాలి: ముఖ్యమంత్రికి సమస్యలు తెలుపుకొనేందుకు వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని గుంతకల్లు ఆర్డీఓ రవీంద్రకు సూచించారు. ప్రజల నుంచి ముందస్తుగానే అర్జీలు స్వీకరించి డీఆర్ఓకు అందజేయాలని ఆదేశించారు. చదవండి: ఏపీ: జీవో నంబర్-1పై సుప్రీంకోర్టు కీలక సూచన ఏర్పాట్ల పరిశీలన సీఎం పర్యటనకు సంబంధించి నార్పలలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లను ఆదివారం సీఎం కార్యక్రమాల కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ఎస్పీ కంచి శ్రీనివాస్రావు, జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, ఆర్డీఓ మధుసూదన్ పరిశీలించారు. వీరి వెంట ఆర్అండ్బీ అధికారి ఓబుల్రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రఘునాథ్రెడ్డి, అనంతపురం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ నాగేశ్వరావు, వైఎస్సార్సీపీ నాయకులు రఘునాథరెడ్డి, సత్యనారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుళ్లాయప్ప, సొసైటీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి ఉన్నారు. -
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్లు, బూట్లు, సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు, స్కూల్ బెల్ట్, మాస్క్ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. -
ఉన్నత చదువులు చదువుకుంటున్న సామాన్యులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సామాన్యుడికి ఉన్నత చదువు చేరువవుతోంది. బుర్ర నిండా తెలివితేటలు ఉన్నా జేబు నిండా డబ్బు లేకపోవడంతో నిన్నటి తరంలో చాలా మంది ఉన్నత చదువులకు దూరమయ్యారు. కుటుంబ ఆర్థిక స్థితిగతుల మూలాన ఇష్టం లేని కొలువులు, వ్యాపారాలు, చిరుద్యోగాల్లో చేరి సర్దుకుపోయారు. కానీ నేటి తరానికి ఓ ఊతం దొరికింది. ‘నువ్వు చదువుకో.. నేను ఫీజు కడతా’ అంటూ భరోసా ఇచ్చే నాయకుడు దొరికాడు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని పిల్లలకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో వైఎస్ జగన్ సర్కారు కొండంత అండగా నిలుస్తోంది. ఈ సాయంతో చాలా మంది పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. పేదల బతుకుల్లో వెలుగులు జగన్న విద్యా వసతి, విద్యాదీవెన పథకంతో జిల్లాలో పేదల విద్య సాగుతోంది. ఈ పథకం బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితర కులాలకు చెందిన పేద పిల్లలకు అమలవుతోంది. 2020–21లో రెండు విడతల్లో 64,623 మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం కింద రూ. 62.33 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన పథకం కింద 67,940 మంది విద్యార్థులకు గాను రూ.67.27 కోట్లు విడుదల చేశారు. 2021–22 సంవత్సరానికి గాను మూడు విడతల్లో 54,764 మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద రూ.81.61 కోట్లు అందించారు. జగనన్న విద్యాదీవెన కింద 68,913 మంది విద్యార్థులకు రూ.63.52 కోట్లను అందజేశారు. ఈ ఏడాది ఇంకా కొన్ని విభాగాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. అర్హులందరికీ జ్ఞాన భూమి పోర్టల్లో నమోదు చేస్తున్నారు. జగనన్న వసతి, విద్యా దీవెన పథకాలు డబ్బులు నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. విద్యా దీవెన పథకంలో నిర్ణయించిన ఫీజులు చెల్లించగా, వసతి దీవెన పథకం కింద ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నికల్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై తరగతులు చదువుతున్న వారికి రూ.20 వేలు చెల్లిస్తున్నారు. రుణపడి ఉంటాం.. నా పేరు పొదిలాపు పార్వతి. నాది శ్రీకాకుళం మండలం లంకాం గ్రామం. నా భర్త పదేళ్ల కిందటే కాలం చేశారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న పిల్ల దీపిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. పెద్ద పిల్ల గీతిక విశాఖపట్నంలో ఇంజినీరింగ్ చేస్తోంది. మా ఇద్దరు పిల్లలను జగనన్నే చదివిస్తున్నారు. చిన్నపిల్లకు అమ్మ ఒడి వస్తుంది. పెద్ద పిల్లకు విద్యాదీవెన, వసతి దీవెన వస్తుంది. కాలేజీ ఫీజులకు, చదువు పుస్తకాలకు ఖర్చులకు ప్రభుత్వం సాయం మాకు ఎంతో మేలు చేస్తోంది. నేను నా పిల్లలు జగనన్నకు రుణపడి ఉంటాం. నా లాంటి వారికి మేలు నా పేరు పైడి మాధవరావు. మాది శ్రీకాకుళం మండలం వాకలవలస గ్రామం. మాకు స్థిర చరాస్తులు లేవు. కష్టపడి జీవ నం సాగిస్తున్నాం. నేను ఒక ప్రైవేటు వ్యాపారి వద్ద రోజు కూలీగా పనిచేస్తున్నా. నాకు ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. నిజానికి వీరిని పెద్ద చదువులు చదివించే స్థోమత మాకు లేదు. ఇంటర్ చదివేటప్పుడు మా పిల్లలకు అమ్మ ఒడి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరినీ విజయనగరంలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించా. కేవలం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వస్తుందన్న ధైర్యంతోనే వారి చదువులు సాగుతున్నాయి. కళాశాల ఫీజులు, పిల్లల చదువు ఖర్చులు జగనన్న ఇస్తున్నారు. నాలాంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతోంది. (క్లిక్ చేయండి: ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ పాఠాలు) -
AP: ప్రభుత్వ పథకాలతో ఉన్నత చదువులకు విద్యార్థుల మొగ్గు
సాక్షి, అమరావతి: ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణుల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 93.38 శాతం మంది ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడం గమనార్హం. ఇది దేశంలోనే కొత్త రికార్డు సృష్టించింది. జాతీయ సగటుకు మించి ఏపీలో గరిష్ట చేరికల నిష్పత్తి నమోదవుతోంది. ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో మూడున్నరేళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది. టీడీపీ హయాంలో 2018–19లో 20.37 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరలేక డ్రాపౌట్లుగా మిగలగా ప్రస్తుతం 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. గత సర్కారు అరకొర ఫీజులనూ ఇవ్వకుండా రూ.1,800 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోగా వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో పాటు అకడమిక్ అంశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టిన సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయనేది కాదనలేని నిజం. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ సదుపాయాలు మెరుగు పరుస్తుండడం, వివిధ పథకాలతో అడుగడుగునా అండగా నిలుస్తుండటంతో చదువుల నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రానికే ప్రాధాన్యం బయట రాష్టాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గతంలో కన్నా తగ్గి రాష్ట్ర కాలేజీల్లో చేరికలు పెరిగాయి. 2022 – 23లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిన వారు 35.50 శాతం ఉండగా డిగ్రీ కోర్సుల్లో 43.79 శాతం మంది చేరారు. 11.13 శాతం మంది అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో చేరిన వారు 2.96 శాతం మంది ఉన్నారు. మరో 6.62 శాతం మంది మాత్రమే డ్రాపౌట్లుగా మిగిలారు. 2018–19లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారిలో 20.37 శాతం మంది డ్రాపౌట్లుగా మిగిలిపోగా ఈసారి అది 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. 2018 – 19లో టీడీపీ అధికారంలో ఉండగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించినందున మిగతా ఫీజుల భారాన్ని భరించలేక ఇంజనీరింగ్ కోర్సుల్లో 21.77 శాతం మంది మాత్రమే చేరారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండడంతో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరికల శాతం అమాంతం 35.50 శాతానికి పెరగడం గమనార్హం. నాడు.. ప్రైవేట్కే విద్య టీడీపీ హయాంలో ఉన్నత విద్య మొత్తం ప్రైవేట్పరం కావడం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. ఇంటర్ చదువులకే రూ.లక్షలు ధారపోయాల్సిన దుస్థితి నెలకొంది. తూతూ మంత్రంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలైంది. కాలేజీల్లో ఫీజు ఎంతున్నా ఇంజనీరింగ్కు రూ.35 వేలు, ఇతర డిగ్రీ కోర్సులకు రూ.7 వేల నుంచి రూ. 10 వేల లోపు మాత్రమే విదిలించి గత సర్కారు చేతులు దులుపుకొంది. అది కూడా అరకొరగానే ఇవ్వడంతో మిగతా ఫీజుల మొత్తాన్ని తలిదండ్రులే భరించాల్సి వచ్చేది. ఫలితంగా పిల్లల చదువులు పూర్తయ్యేసరికి అప్పుల్లో మునిగిపోయేవారు. ఇలాంటి పరిస్థితి కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్తోనే చదువు ముగించి చిన్నా చితకా ఉద్యోగాలు, కూలి పనుల అన్వేషణలో నిమగ్నమైన పరిస్థితి ఏర్పడింది. నేడు.. సమూల మార్పులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా రంగం పరిస్థితి సమూలంగా మారిపోయింది. పేద విద్యార్థుల చదువులకయ్యే ఫీజు మొత్తాన్ని జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది. చదువులు సాఫీగా సాగేలా వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకు చెల్లిస్తున్నారు. వీటిని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత చదువులపై భరోసా ఏర్పడింది. ఫలితంగా డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. కరోనా ఉన్న రెండేళ్లలోనూ చేరికలు పెరగడం విశేషం. లక్ష ప్లేస్మెంట్స్ లక్ష్యం ► టీడీపీ హయాంలో 2015–16లో ఉన్నత విద్యా కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య 11,25,510 కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2021–22 నాటికి 14,23,952కి చేరుకుంది. చదువుల కోసం నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే మొత్తం ఫీజులను చెల్లిస్తుండటంతో ప్రవేశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ► అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2014–15లో రాష్ట్రంలో ప్లేస్మెంట్లు 56 వేలు కాగా 2021–22లో 78 వేలకు చేరాయి. ప్లేస్మెంట్స్ను లక్షకు పైగా తీసుకెళ్లటాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► జీఈఆర్ (ప్రతి వంద మందిలో కాలేజీల్లో చేరేవారి సంఖ్య)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రాల వారీగా ఆలిండియా ఉన్నత విద్యా సర్వే (ఐష్) పేరిట నివేదికలను వెలువరిస్తుంది. ఐష్ సర్వే ప్రకారం ఏపీలో జీఈఆర్ 2015–16లో 30.8 ఉండగా 2019–20లో 35.2కు పెరిగింది. జాతీయ స్థాయిలో 24.5 నుంచి 27.1కు పెరిగింది. జీఈఆర్ పెరుగుదల జాతీయ స్థాయిలో 3.04 శాతంగా ఉండగా ఏపీలో 8.64 శాతంగా ఉండడం విశేషం. కేరళ 4.86 శాతం, తమిళనాడు 4.89 శాతం, తెలంగాణ –1.65 శాతంగా ఉన్నాయి. -
విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ
విద్యాభివృద్ధి మీదే సమాజాభివృద్ధి అధారపడి ఉంటుంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారం చేపట్టిన వెంటనే ముందు విద్యా రంగంపై దృష్టిపెట్టారు. ‘నాడు–నేడు’లో భాగంగా ప్రభుత్వ బడులలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారు. తొలి దశ క్రింద 15,715 స్కూళ్లలో సదుపాయాలను కల్పించగా... ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. ఈ దశలో స్కూళ్లతో పాటుగా కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, డైట్తో పాటు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రాథమిక తరగతి నుండి ఇంటర్ వరకు ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా విద్యార్థులను పాఠశాలకు రప్పించడానికి ప్రతి విద్యార్థి తల్లికి 15 వేల రూపాయలను ఆమె ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. పాఠశాల ప్రారంభంలోనే ‘జగనన్న విద్యా కానుక’ రూపంలో విద్యార్థులకు బుక్స్, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు ప్రతి విద్యార్థికి అందిస్తోంది. అలాగే ఉన్నత విద్య చదవాలన్న ఆసక్తి కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ‘జగనన్న విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సహాయం అందిస్తోంది. అర్హత ఉన్న విద్యార్థులు అన్ని కోర్సులకు చెల్లించే ఫీజును తిరిగి విద్యార్థులకే చెల్లిం చాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘జగనన్న విద్యాదీవెన’ ద్వారా 24.74 లక్షల మంది విద్యార్థులకు రూ. 8,365 కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లింపులు జరిగాయి. ‘జగనన్న వసతి దీవెన’ కింద 18.77 లక్షల మందికి రూ. 3349.57 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా ఈ మూడేళ్లలో 44.5 లక్షల మంది ఖాతాల్లో రూ. 19617.60 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో 98 శాతం మందికి విద్య అందుబాటులోకి వచ్చిందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో చేస్తున్న అనేక రకాల సంస్కరణల్లో మరొకటి ఇంటర్ విద్యను, పాఠశాల విద్యను కలిపి ‘ప్లస్ 2’ చేయడం. దీనివలన మూడవ తరగతి నుండి ఇంటర్మీ డియట్ వరకు విద్య ఒకే చోట దొరుకుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని మూడు నుంచి ఆరేళ్ల వయస్సుగల పిల్లలకు అందించడంలో ఏపీ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ‘ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్’ (ఈసీఈ) అమలులో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పేద విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో జ్ఞానాన్ని అందించే క్రమంలో ‘విద్యా కానుక’లో భాగంగా ఈ ఏడాది 4.70 లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు, దాదాపు 50 వేల మంది టీచర్లకు 665 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్లను ప్రభుత్వం అందించనున్నది. ఇలా ఏపీ విద్యాసంస్కరణలతో ముందుకు దూసుకు పోతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. - వి.వి. రమణ సామాజిక విశ్లేషకులు -
అది తప్పుడు వార్త
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలపై తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం సీతాయిలంకలోని తుమాటి లత అనే మహిళ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల నిధులు పూర్తిగా అందలేదని ఎమ్మేల్యే సింహాద్రి రమేష్బాబును గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నిలదీసినట్లు ఆ పత్రిక సోమవారం ఒక వార్త ప్రచురించింది. ఆ కార్యక్రమంలో జరిగిన దానికి భిన్నంగా తప్పుడు సమాచారాన్ని వండి వార్చింది. వాస్తవానికి తుమాటి లత బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ. 1.72 లక్షలు జమ చేసినట్లు పేర్కొంటూ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆమెకు కరపత్రాన్ని అందించారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ. 1.40 లక్షల వరకు అందినట్లు, బ్యాంకు అకౌంట్ పుస్తకంలో ఆమేరకు జమ చేసినట్లు అందులో వివరించారు. అయితే ఈ రెండు పథకాల కింద తమకు రూ.82 వేలు మాత్రమే అందినట్లు లత చెప్పడంతో ఆమెకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే 1.72 లక్షల నిధులు లత, ఆమె కుటుంబీకులకు చెందిన ఏయే బ్యాంకు అకౌంట్లలోకి ఏ తేదీల్లో జమ అయ్యాయో వివరంగా చూపించారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన కింద 1.40 లక్షలు ఏయే తేదీల్లో జమ అయ్యాయో రికార్డులు చూపి మరీ చెప్పారు. తన అకౌంట్లో, తన కుమార్తె అకౌంట్లో మొత్తం నిధులు జమ అయ్యాయని, తానే పొరపాటున పూర్తిగా రాలేదని అనుకున్నానని లత వివరించారు. పూర్తి మొత్తం అందించినట్లు బ్యాంకు అకౌంట్లలో జమ అయిన మొత్తాలను చూపి మరీ అధికారులు తమకు వివరించారని చెప్పారు. అయితే, ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్త రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. -
Jagananna Vidya Deevena: విద్యార్థులకు రూ.11,715 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. -
విద్యతోనే వెలుగులు: సీఎం జగన్
మీ బిడ్డల చదువులకు నాదీ భరోసా చదువుకోవాలనే ఆరాటం ఉన్నా పేదరికంతో ఆగిపోయిన పిల్లలను నా పాదయాత్రలో చూశా. పిల్లల చదువుల కోసం అప్పుల పాలైన తల్లిదండ్రులను చూశా. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ ఏ ఒక్క బిడ్డ కూడా పేదరికంతో చదువుకు దూరం కాకూడదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. మన బతుకులు, తలరాతలను మార్చే శక్తి చదువులకే ఉంది. మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ధైర్యంగా చదివించండి. వారి చదువులకు మేనమామగా నాదీ భరోసా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, కర్నూలు: విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) ఒక్క ఏడాదిలోనే 8.64 పెరిగిందని, గత సర్కారు హయాంతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరికలు ఏకంగా ఏడు లక్షలకుపైగా పెరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. నంద్యాలలో జ్యోతి ప్రజ్వలనం చేసి వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు, ఇంగ్లిషు మీడియంతో సర్కారు స్కూళ్ల రూపురేఖలు మారాయని, ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్లు ఇస్తున్నారంటే పరిస్థితిలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానాలు, పథకాలు, విద్యా వ్యవస్థపై నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడతలో భాగంగా రూ.1,024 కోట్లను శుక్రవారం నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నంద్యాలను జిల్లాగా చేసినందుకు శిల్పామోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఫీజులకు తోడుగా వసతి దీవెన.. ప్రతీ పార్లమెంట్ను జిల్లాగా చేస్తానని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తానని ఇదే నంద్యాల వేదికగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మీ ముందుకు వచ్చా. చదువు అనే ఆస్తిని పిల్లలకు ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకు రాలేవు. అందుకే విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేశాం. గత సర్కారు హయాంలో అరకొరగా ఫీజుల విదిలింపులతో ఎంతో మంది చదువులకు గండం ఏర్పడింది. అక్కచెల్లెమ్మలకు జగనన్న వసతి దీవెన చెక్కును అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తూ ఆదుకుంటున్నాం. భోజన, వసతి ఖర్చులు కూడా రూ.వేలల్లోనే ఉంటున్నాయి. వీటికి కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని భావించాం. దివంగత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్తో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా మరోరెండు అడుగులు ముందుకేసి ఫీజుల పథకానికి మార్పులు చేయడంతో పాటు జగనన్న వసతి దీవెన అనే మరో గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం. మీ అన్న తోడుంటాడని మాటిస్తున్నా.. నంద్యాల గడ్డ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 10,68,150 మంది పిల్లల చదువుల కోసం 9,61,140 మంది తల్లుల ఖాతాల్లోకి 2021–22 జగనన్న వసతి దీవెన పథకం రెండో విడతగా రూ.1,024 కోట్లు జమ చేస్తున్నాం. పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్కు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలను భోజనం, వసతి కోసం రెండు విడతల్లో ఇస్తామని చెప్పాం. ఆ ప్రకారం రెండోదఫా డబ్బులు జమ చేస్తున్నాం. కుటుంబంలో ఒకరికే పరిమితం చేసే రోజులు పోయాయి. మీ కుటుంబంలో అందరినీ చదివించండి. మీ అన్న జగన్ మీకు తోడుగా ఉంటాడని ప్రతీ తల్లికి మాట ఇస్తున్నా. జవాబుదారీతనం పెంచేందుకు జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజురీయింబర్స్మెంట్ డబ్బులను తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. వీటిని తల్లులు కాలేజీలకు చెల్లిస్తున్నారు. దీంతో వారు సదుపాయాలపై కాలేజీలను ప్రశ్నించవచ్చు. యాజమాన్యాలలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెస్తే కాలేజీలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా. మూడేళ్లలో సమూల మార్పులు విద్యారంగంలో మూడేళ్లలో సమూల మార్పులు చేశాం. పేద కుటుంబంలో ప్రతీ బిడ్డ మంచి చదువులు చదవాలనే తాపత్రయంతో నాడు–నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. మంచి చదువు మాత్రమే సరిపోదు.. మంచి ఆహారం కూడా అందాలి. పిల్లలు ఏం తీసుకుంటే బాగుంటారు? ఎలాంటి నాణ్యమైన భోజనం అందించాలి? అని బహుశా గతంలో ఏ ముఖ్యమంత్రీ ఆలోచించి ఉండరు. గతంలో పాఠశాలల్లో ఫర్నిచర్, బ్లాక్ బోర్డులకూ కొరతే. వంట గదుల్లో అంతా అపరిశుభ్రత. ఆహ్లాదంగా కనిపించేలా గోడలకు రంగులు లేవు. ఎప్పుడు కూలిపోతాయో తెలియని గదుల్లో బోధించాల్సిన దుస్థితి. నాడు–నేడు ద్వారా ఈ దురవస్థను తొలగిస్తున్నాం. సర్కారు స్కూళ్లకు మంచి రోజులు.. పిల్లలకు ఇంగ్లీషు మీడియంతో ఇబ్బంది లేకుండా మిర్రర్ ఇమేజ్తో ద్విభాషా పాఠ్య పుస్తకాలను తెచ్చాం. పక్కపక్కనే ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పాఠాలను ముద్రించాం. నెమ్మదిగా ఇంగ్లీషు మీడియం వైపు నడిపించేలా ఇవి ఉపయోగపడతాయి. రానున్న 10 నుంచి 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానాన్ని మార్చుతున్నాం. పాఠశాలల నుంచి మొదలైన ఈ మార్పు ద్వారా కాలేజీల వైపు కూడా అడుగులు వేస్తున్నాం. మెడికల్ కాలేజీలు.. స్కిల్ వర్సిటీలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు 16 కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. అందులో ఒకటి ఇదే నంద్యాలలో మీ కళ్లెదుటే ఏర్పాటు కానుంది. ఇక యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. కొత్తగా నైపుణ్య విశ్వ విద్యాలయాలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులను కాలేజీలకు, స్కిల్డెవలప్మెంట్కు అనుసంధానించాం. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను తెచ్చికాలేజీల్లో ఇంటర్న్షిప్ కచ్చితంగా అమలు చేస్తున్నాం. మరిన్ని ప్రత్యేక కోర్సులు కూడా తీసుకొస్తున్నాం. 67 ఒకేషనల్, 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు తీసుకొచ్చాం. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సు కూడా ప్రవేశపెట్టాం. ఎక్కడా లేనివిధంగా అమ్మఒడి బిడ్డలకు మంచి చదువు చెప్పించాలని ప్రతీ తల్లి ఆరాట పడుతుంది. పిల్లలను బడులకు పంపిస్తే చాలు 12 తరగతి వరకూ జగనన్న అమ్మ ఒడి ద్వారా అటెండెన్స్ను జతపరిచి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తున్నాం. 84 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా పేద బిడ్డలకు మేలు చేసే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది? అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచేందుకు అమ్మఒడితోపాటు చాలా అడుగులు వేశాం. హర్షధ్వానాల మధ్య సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న విద్యార్థులు, అక్కచెల్లెమ్మలు వైఎస్సార్ ఆసరా, చేయూతతో పాటు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. సున్నా వడ్డీ రుణాలిస్తున్నాం. ఆర్థిక సాధికారత కోసం రిలయన్స్, హిందుస్తాన్ లీవర్, అమూల్తోపాటు మల్టీ నేషనల్ కంపెనీలు, దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. బ్యాంకులు రుణాలిచ్చేలా తోడ్పాటు అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు బాగుంటే పిల్లలంతా బాగుంటారనే విశ్వాసంతో మూడేళ్లుగా మహిళా సాధికార ప్రభుత్వం అని చెప్పుకునేలా అడుగులు వేశాం. సంపూర్ణ పోషణ.. గోరుముద్ద పిల్లల చదువులపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో శారీరక, మానసిక ఎదుగుదల కోసం కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. తల్లితో పాటు గర్భస్థ శిశువులకు మంచి ఆహారం అందాలనే లక్ష్యంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని తెచ్చాం. గత సర్కారు ఇందుకోసం కనీసం రూ.600 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ తర్వాత స్కూళ్లకు వచ్చే పిల్లల కోసం ‘వైఎస్సార్ గోరుముద్ద’ ప్రవేశపెట్టాం. దీనికి గత సర్కారు ఏటా రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రూ.1,900 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఎక్కడ 500 కోట్లు?.. ఎక్కడ 1900 కోట్లు? ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. విద్యా దీవెన, వసతి దీవెనకు రూ.పది వేల కోట్లు 2017–18, 2018–19కి సంబంధించి గత సర్కారు రూ.1,778 కోట్ల ఫీజు బకాయిలను ఎగ్గొడితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించింది. జగనన్న విద్యాదీవెన కింద త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజులు ఇస్తున్నాం. టీడీపీ సర్కారు బకాయి పడ్డ రూ.1,778 కోట్లతో కలిపి రూ.6,969 కోట్లను జగనన్న విద్యాదీవెన ద్వారా చెల్లించాం. వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు ఖర్చు చేశాం. కేవలం ఈ రెండు పథకాలకే 34 నెలల్లో మన ప్రభుత్వం రూ.10,298 కోట్లు ఖర్చు చేసింది. అక్కచెల్లెమ్మలు, వారి పిల్లల కోసం మేనమామగా చేస్తున్న ఖర్చు ఇది అని సంతోషంగా తెలియజేస్తున్నా. జాతీయ సగటుకు మించి జీఈఆర్ పెరుగుదల వివిధ పథకాల ద్వారా చదువుకునేలా ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యార్థుల డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. ఇంటర్ తర్వాత కాలేజీల్లో 18 – 23 ఏళ్ల వయసు విద్యార్థుల చేరికలకు సంబంధించి జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) గత సర్కారు హయాంలో 2018–19 నాటికి 32.4 ఉంటే 2019–20లో ఒక్క ఏడాదిలోనే మనం తెచ్చిన మార్పులతో 35.2కి పెరిగింది. ఏడాదిలోనే జీఈఆర్ ఏకంగా 8.64 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే జాతీయ స్థాయిలో పెరుగుదల 3.04 శాతం కాగా మన రాష్ట్రంలో 8.64 శాతం పెరిగింది. మహారాష్ట్ర, పశ్చిమ బంగ, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఐదు శాతం కంటే తక్కువే పెరుగుదల నమోదైంది. –1.6 శాతంతో తెలంగాణలో నెగెటివ్ వృద్ధి నమోదైంది. మన రాష్ట్రంలో విద్యార్థినులకు సంబంధించి జీఈఆర్ 11.03 శాతానికి పెరిగింది. అదే జాతీయ స్థాయిలో కేవలం 2.02 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. విద్యారంగంలో మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. గత సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 37 లక్షల మంది కాగా ఇప్పుడు 44.30 లక్షలకు పెరిగారు. అంటే 7.18 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ బడుల్లో చేరిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మంచి మార్పు ఏముంటుంది? మన ఖర్మ కొద్దీ.. ఇవాళ ఇన్ని మంచి మార్పులు జరుగుతుంటే చంద్రబాబుకు, ఆయన పార్టీకి, దత్తపుత్రుడికి, ఎల్లో మీడియాకు కనిపించవు. ఎన్ని మంచి పనులు చేస్తున్నా రోజుకో కట్టుకథ, వక్రీకరణతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. రాష్ట్రంలోచేస్తున్నవి సరిపోవని ఏకంగా పార్లమెంట్ను వేదికగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ బురద జల్లి పరువు తీస్తున్న గొప్ప చరిత్ర వీరిది! ఎక్కడైనా ప్రతిపక్షాలుంటాయి. అన్ని పక్షాలు కలసి పార్లమెంట్లో రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా మాట్లాడాలి. మన ఖర్మ ఏమిటంటే.. దౌర్భాగ్యమైన ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు, దౌర్భాగ్య ఎల్లో మీడియా ఉన్నాయి. కదిలించలేవు.. బెదిరించలేవు ఈ సమస్యలు, కష్టాలు ఎన్ని ఉన్నా.. ఒకటే చెబుతున్నా. ఇవేవీ నన్ను కదిలించలేవు.. బెదిరించలేవు. వీరందరికీ ఒకటే చెబుతున్నా. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చా. మీ దీవెనలు ఉన్నంత వరకూ వారు నా వెంట్రుక కూడా పీకలేరు. దేవుడి దయ, మీ చల్లని దీవెనలు ఇలాగే ఉండాలని, ఇంకా మంచి చేసేలా దీవించాలని మనసారా కోరుతున్నా. నంద్యాలకు రింగు రోడ్డు, మిర్చి యార్డు ‘‘నంద్యాలలో మంచి అభివృద్ధి జరుగుతోందని, మరింత సహకారం కావాలని నా మిత్రుడు, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి అడుగుతున్నారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు నంద్యాలలో రెండు హైవేలను కలిపేలా 12 కిలోమీటర్ల రింగ్ రోడ్డు మంజూరు చేస్తున్నా. ఆటోనగర్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. మిర్చి రైతులు గుంటూరు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే విక్రయించేలా మిర్చి మార్కెట్ ఏర్పాటు చేస్తాం. వైఎస్సార్ నగర్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దుతాం’’ నవరత్నాలన్నీ మా ఇంట్లోనే.. వసతి దీవెన కింద జగనన్న ఏటా అందిస్తున్న రూ.20 వేలు నాలాంటి మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మా నాన్న అర్చకుడిగా పని చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. ప్రతినెలా 1వ తేదీన పాలవారి కంటే ముందుగా వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు. జగనన్న పథకాల వల్ల నేను చదువుకుంటున్నానని ఈ సభ సాక్షిగా చెబుతున్నా. బాగా చదివి న్యాయవాదినై ప్రజలకు సేవ చేస్తా. – కరణం బృహతి మానస, డిగ్రీ విద్యార్థిని మా చదువులు.. మీ చలవే మాది మధ్యతరగతి కుటుంబం. జగనన్న వసతి దీవెనవల్ల చదువుకుని మా కాలేజీలో సీనియర్లు 70 శాతం మంది మంచి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. నా సోదరుడి బీటెక్ చదువంతా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే పూర్తయింది. మా కుటుంబం ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందింది. వైఎస్ జగనన్న ముందుచూపుతో ఇలాంటి పథకాలను ప్రారంభించి చక్కగా అమలు చేస్తున్నారు. – సౌమ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, నంద్యాల -
నంద్యాలలో సీఎం వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
-
మీరు చదివించండి.. నేను తోడుగా ఉంటా..
-
అందరినీ చదివించండి.. బాధ్యత నాది: సీఎం జగన్
సాక్షి, నంద్యాల: పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి చదువేనని, పేదరికం కారణంతో చదువులు ఎట్టిపరిస్థితుల్లో ఆగిపోకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లాలో జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమ సభలో విద్యార్థులు, తల్లులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లాగా చేస్తానని, సుపరి పాలనను ప్రజలకు చేరవేస్తానని నంద్యాలలోనే మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు మళ్లీ మీ వాడిగా వచ్చానంటూ భావోద్వేగంగా ప్రసంగించారు సీఎం జగన్. పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి.. చదువు. ఆ చదువు కోసం తల్లిదండ్రులకు అండగా ఉంటున్నాం. ఇంట్లో ఎంత మంది ఉన్నా పర్వాలేదు.. అందరినీ చదివించండి. తోడుగా మన ప్రభుత్వం ఉందని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పేదరికం కారణంగా చదువులు ఆగిపోకూడదు. చదువు అనే ఆస్తి ఇవ్వకుంటే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకు రాలేవు. ఆ బాధ్యతను కుటుంబ పెద్దగా తాను తీసుకున్నానని, జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లలు, తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు. చదువును తల్లిదండ్రులు ఆర్థిక భారంగా భావించకూడదనేది ఈ పథకం మరో ఉద్దేశమని తెలిపారు. చదువు కోసం దివంగత నేత వైఎస్సార్ హయాంలో పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తే.. జగన్ అనే నేను ఆయన వారసుడిగా రెండు అడుగులు వేస్తున్నానని చెప్పారు. గత ప్రభుత్వం నీరుగారిస్తే.. తమ ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకం ద్వారా మరింత మెరుగులు దిద్దామని తెలిపారు. తల్లులకు ప్రశ్నించే హక్కు వస్తుందని.. కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు సీఎం జగన్. విద్యాసంస్థల్లో వసతులు సైతం మెరుగుపడతాయని, బాగోలేకపోతే ప్రభుత్వం దృష్టికి ఆ తల్లులు తీసుకురావొచ్చని, అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. చదువుతో పాటు మంచి భోజనాన్ని సైతం పిల్లలకు అందించడం గర్వంగా ఉందని సీఎం జగన్ అన్నారు. బైలింగువల్ బుక్స్ ద్వారా క్రమక్రమంగా ఆంగ్ల మాధ్యమం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నామని తెలిపారు సీఎం జగన్. తల్లులు బాగుంటేనే.. పిల్లలూ బాగుంటారన్న ఉద్దేశంతో ఖర్చుకు కూడా వెనకాడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారాయన. -
సీఎం జగన్ నంద్యాల పర్యటన.. అప్డేట్స్
అప్డేట్స్ 1.29PM ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద రెండో విడతలో 10, 68, 150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసిన సీఎం జగన్. 12.45PM పరిపాలను మరింత చేరువ చేస్తానని ప్రజలకు మాటిచ్చాను. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదరికం కారణంగా చదువులు ఆగిపోకూడదు. పూర్తి రీయింబర్స్మెంట్తో విద్యార్థులకు తోడుగా నిలుస్తాం. చదువుకుంటేనే తలరాతలు మారతాయి. పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి-చదువు. నాడు-నేడుతో బడుల రూపు రేఖలు మారుస్తాం. సర్కారీ బడులకు మళ్లీ మంచి రోజులు తెచ్చాం. నేనే పేద పిల్లల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తున్నా. పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు. -సీఎం జగన్ 12:30PM ► నంద్యాలను జిల్లా చేయడం, అంతకు ముందు మెడికల్ కాలేజీ ప్రకటించడం.. ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకోవడంపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి, సీఎం జగన్కు సభా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. 12:21PM ► దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్, పలువురు నేతల నివాళులు. అనంతరం ఆడపచుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయించిన సీఎం జగన్. 12:11 PM ► నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. విద్యార్థులు-తల్లులతో ఆప్యాయ పలకరింపు. ► 2021-22 విద్యాసంవత్సరానికి గానూ రెండు విడత ‘జగనన్న వసతి దీవెన’లో భాగంగా లబ్ధిదారులకు నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. 10:10AM ► క్యాంప్ కార్యాలయం నుంచి నంద్యాలకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ► పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదు.. చదువుల ఖర్చు పేరిట వాళ్ల తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదనే సమున్నత లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం.. జగనన్న వసతి దీవెన. ► జగనన్న వసతి దీవెన రెండో విడతలో భాగంగా.. 10, 68, 150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయల్ని జమ చేయనున్నారు. ► ఉన్నత విద్యకు ఆలంబన లక్ష్యంతో పేద విద్యార్థుల చదువుకు ఫీజుల ఖర్చులను పూర్తిగా భరించడం. భోజన, వసతి ఖర్చులకు కూడా ఇబ్బంది పడకుండా సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న కానుకే ఇది. ------------------------- ► కార్యక్రమం ముగిశాక నంద్యాల నుంచి బయలుదేరి.. తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ► ఈ వేదికగా జగనన్న వసతి దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. ► అటుపై ఎస్పీజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ► అక్కడి నుంచి నంద్యాలలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి చేరుకుని.. ప్రజాప్రతినిధులతో కాసేపు మాట్లడతారు. ► కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ► ఉదయం పది గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సీఎం బయలుదేరుతారు. ► కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రెండో విడత ‘జగనన్న వసతి దీవెన’
సాక్షి, అమరావతి: జగనన్న వసతి దీవెన పథకం కింద శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరానికి రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని బటన్ నొక్కి సీఎం జమ చేస్తారు. ఇందుకు నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ వేదిక కానుంది. నగదు జమ చేశాక సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భోజన, వసతి ఖర్చులకు సైతం.. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదు.. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యాదీవెనను ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తాలను నేరుగా జమ చేస్తోంది. మొన్ననే జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్– డిసెంబర్, 2021 త్రైమాసికానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్గా రూ.709 కోట్లు ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జమ చేశారు. జగనన్న వసతి దీవెన ఇలా.. భోజనం, వసతి ఖర్చులకూ విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకాన్ని అందిస్తోంది. ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. నాడు (గత ప్రభుత్వంలో).. ► ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చుల సంగతి దేవుడెరుగు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ని కూడా ఏళ్ల తరబడి జాప్యం చేసి భారీగా బకాయిలు పెట్టింది. ► 2017–18, 2018–19 సంవత్సరాలకైతే ఏకంగా రూ.1,778 కోట్లు బకాయి పడింది. నేడు (ప్రస్తుత ప్రభుత్వంలో).. ► గత ప్రభుత్వ బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 34 నెలల్లోనే జగనన్న విద్యా దీవెన కింద రూ.6,969 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు అందించింది. ఇలా ఇప్పటివరకు విద్యార్థుల చదువులకు అందించిన మొత్తం ఆర్థిక సాయం అక్షరాలా రూ.10,298 కోట్లు. ► కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తోంది. -
నంద్యాల జిల్లా పర్యటనకు సీఎం జగన్.. పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా ఈనె 8వ తేదీన నంద్యాల జిల్లాకు వస్తున్నారు. ఈసందర్భంగా సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ మనజీర్జిలానీ శామూన్ బుధవారం రాత్రి వెల్లడించారు. విజయవాడ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు శుక్రవారం ఉదయం 10.50 గంటలకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 11.10 గంటలకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడి 11.35గంటలకు బహిరంగ సభ జరిగే ఎస్పీజీ మైదానానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం, పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.40కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వెళ్తారు. ఏర్పాట్ల పరిశీలన నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్, ఎస్పీజీ గ్రౌండ్లో బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్జిలానీ శామూన్, కర్నూలు జిల్లా రేంజ్ డీఐజీ సెంథిల్కుమార్, ఎస్పీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. చదవండి: (మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) ఎయిర్పోర్టులో పటిష్ట బందోబస్తు కర్నూలు(సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదీన నంద్యాల రానున్న నేపథ్యంలో ఓర్వకల్లు ఎయిర్పోర్టులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి, జేసీ ఎస్.రామసుందర్రెడ్డి, ఎయిర్పోర్టు ఇన్చార్జ్ డైరెక్టర్ మధుసూదన్తో కలసి ఎయిర్పోర్టులో ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం గన్నవరం నుంచి విమానంలో ఓర్వకల్లు చేరుకొని హెలికాప్టర్ ద్వారా నంద్యాల వెళ్లనున్నారన్నారు. అలాగే తిరిగి నంద్యాల నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్పోర్టు చేరుకొని విమానంలో గన్నవరం వెళ్లనున్నారని పేర్కొన్నారు. -
AP New Districts: ముహూర్తం 4న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9:05 నుంచి 9:45 గంటల మధ్య 13 కొత్త జిల్లాల అవతరణ ముహూర్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కొత్త జిల్లాల కార్యకలాపాలను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్న వలంటీర్లకు సత్కారాన్ని ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 8వ తేదీన వసతి దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నూతన జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిపాలనా సముదాయాల నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని సూచించారు. కలెక్టర్తోపాటు జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఏర్పాటు చేయాలని, క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవనాల కోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాలని, పది కాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకున్న జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను సమావేశంలో సీఎస్, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతే కలెక్టర్లు సిఫార్సులు చేశారని చెప్పారు. సిబ్బంది విభజన, పోస్టింగుల్లో ఆరు సూత్రాల ఫార్ములా తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారు చేశామని వెల్లడించారు. కొత్త జిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సరి చూసుకునేందుకు చెక్లిస్టు కూడా రూపొందించినట్లు చెప్పారు. సాఫ్ట్వేర్లో మార్పుచేర్పులు.. నూతన వెబ్సైట్లు, యంత్రాంగానికి అనుగుణంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు పూర్తయినట్లు వివరించారు. కొత్త జిల్లాల సమాచారంతో హ్యాండ్ బుక్స్ కూడా సిద్ధం చేశామన్నారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారు చేశామని, ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట్ల ప్రైవేట్ భవనాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నట్లు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయిప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ప్రణాళిక శాఖ కార్యదర్శి వి.విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఖరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు, కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 73 రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ఫైలును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ పర్చువల్ విధానంలో కేబినెట్ ఆమోదానికి బుధవారం పంపించారు. ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులు, చేర్పులతో కూడిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం లభించిన తరువాత ఏప్రిల్ 3వ తేదీన తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే రోజు కొత్త జిల్లాలకు కలెక్టర్లను, జేసీలను, ఎస్పీలను, ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ నెల 4 నుంచి విధుల్లోకి.. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలకు ఒక్కో కలెక్టర్, ఒక్కో జాయింట్ కలెక్టర్, ఒక్కో ఎస్పీని నియమించనున్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లో ఆసరా, సంక్షేమ జాయింట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిని కొత్త జిల్లాలకు జిల్లా రెవెన్యూ అధికారులుగా నియమిస్తారు. ఈ నెల 4న ఉదయం 9.05–9.45 గంటల మధ్య కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు ఆ జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్ల కార్యాలయాల్లో ఉద్యోగులు బాధ్యతలు చేపట్టి పరిపాలన కార్యకలాపాలు ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో పనిచేయాల్సిన ఉద్యోగులు, అధికారుల పంపిణీ కసరత్తును ఇప్పటికే సంబంధిత శాఖలతోపాటు ఆర్థిక శాఖ కూడా పూర్తి చేసింది. ప్రస్తుత జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులనే జనాభా ప్రాతిపదికన కొత్త జిల్లాల్లో పనిచేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన బదిలీ చేయనున్నారు. ఆరు సూత్రాలు, జోన్లకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేవరకు కొత్త జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులు పదోన్నతులు, సీనియారిటీ, స్థానికతలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న సీనియారిటీ, స్థానికత యథాతథంగా ఉంటుంది. మొత్తంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య 10వేల నుంచి 12వేల లోపు ఉంటుందని అధికారులు అంచనా. -
కన్వీనర్ కోటాకు జై..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ప్రభావం ఆయా కోర్సుల సీట్ల భర్తీలో పెను మార్పులను తెస్తోంది. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ చేయడంతో పాటు.. విద్యార్థుల వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకూ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యే సీట్ల శాతం.. గతంలో కన్నా భారీగా పెరిగింది. ఈ సీట్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ పోటీపడుతుండటంతో సీట్ల భర్తీలో గడచిన రెండేళ్లలో ఏకంగా 10 శాతానికి పైగా పెరుగుదల కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ముందు టీడీపీ హయాంలో చూస్తే.. ఇంజనీరింగ్ కోర్సుల్లో 2018లో 61.54 శాతం, 2019లో 51 శాతం మాత్రమే కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత 2020లో, 2021లో 73 శాతం మేర భర్తీ అవుతుండటం విశేషం. ఈడబ్ల్యూఎస్ కోటాలోని వారికి అదనంగా 10 శాతం సీట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రాష్ట్రంలో సీట్ల కేటాయింపు ఇంతకు ముందు నుంచీ ఉంది. అదనపు సీట్లు రాకుండా ఉంటే.. వీరికి కేటాయించిన సీట్లను కూడా కలుపుకొంటే కన్వీనర్ కోటా సీట్ల భర్తీ 2021లో 80.79 శాతం, 2020లో 80.60 శాతం అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్పాట్ అడ్మిషన్లకు ‘సీట్ల’ తగ్గుదల గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేనందున విద్యార్థుల చేరికల్లేక కన్వీనర్ కోటా సీట్లు భారీగా మిగిలిపోయేవి. ఆ తర్వాత వాటిని స్పాట్ అడ్మిషన్ల కింద ఆయా కాలేజీలు భర్తీచేసుకునేవి. ఇప్పుడు కన్వీనర్ కోటా సీట్లు అధిక శాతం భర్తీ అవుతుండటంతో స్పాట్ అడ్మిషన్లకు మిగులు సీట్లు తగ్గాయి. టీడీపీ హయాంలో 2015లో 40,436 సీట్లు, 2016లో 47,735 సీట్లు, 2019లో 45,888 సీట్లు మిగిలిపోయాయి. అదే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలుతో వాటి సంఖ్య 2020లో 28,575, అలాగే 2021లో 30,369 మాత్రమే మిగిలాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను మినహాయిస్తే కనుక ఈ సంఖ్య మరింత తక్కువే. 2021లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో కేవలం రెండు విడతల్లోనే ముగించారు. గతంలో కౌన్సెలింగ్ను నాలుగు విడతల వరకూ కూడా నిర్వహించేవారు. ఈ సారి కూడా అలాగే ఉంటుందని భావించిన పలువురు.. రెండు విడతల్లోనే కౌన్సెలింగ్ ముగియడంతో కన్వీనర్ కోటా సీట్లను దక్కించుకోలేకపోయారు. చేరికలు లేక గతంలో తగ్గిపోతూ వచ్చిన సీట్లు గతంలో రాష్ట్రంలో ప్రమాణాలు లేకున్నా పలు కాలేజీలను కొనసాగించిన దరిమిలా రాష్ట్రం మొత్తంమీద ఇంజనీరింగ్ కాలేజీలు 467 వరకూ ఉండేవి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేక చేరికలు తగ్గి ఆయా కాలేజీలు కోర్సులను రద్దు చేసుకోవడంతో సీట్ల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. 2015 నాటికి రాష్ట్రంలో 467 కాలేజీల్లో 1,13,745 సీట్లుండగా.. 2018 నాటికి 96,857, 2019 నాటికి 95,582 ఉన్నాయి. 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు అదనంగా చేరి మొత్తం సీట్లు 1,06,203కు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రమాణాలు లేని కాలేజీలను ప్రక్షాళన చేయడంతో వాటి సంఖ్య 437కు తగ్గింది. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకొని కన్వీనర్ కోటా సీట్లు 2020లో 1,04,090, 2021లో 1,11,304కు చేరాయి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో కన్వీనర్ కోటా సీట్లలో అత్యధిక శాతం భర్తీ అవుతున్నాయి. ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులతో మెరిట్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ నిరుపేద విద్యార్థులు గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేక అత్యధిక ఫీజులుండే ప్రముఖ కాలేజీల్లో చేరలేకపోయేవారు. కానీ ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రావడంతో వారంతా తమ మెరిట్కు తగ్గ ప్రముఖ కాలేజీల్లో చేరగలుగుతున్నారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో పది శాతం మేర పెరిగిన భర్తీ అయిన సీట్లన్నీ ఇటువంటి పేద విద్యార్థుల చేరికలతోనే అన్నది స్పష్టమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం.. కాలేజీల్లో ఫీజు ఎంత ఉన్నా సరే.. రూ.35 వేలే ఇచ్చేది. దీనివల్ల మిగతా ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి రావడంతో కోర్సు పూర్తయ్యే నాటికి తల్లిదండ్రులకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకూ అప్పులయ్యేవి. -
Andhra Pradesh: 6.53 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానం అందించడం, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటి నుంచే ఆన్లైన్ అభ్యసనం కొనసాగించడానికి వీలుగా ప్రభుత్వం వారికి ఉచిత ల్యాప్టాప్లు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే టెండర్లపై జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలన కూడా పూర్తయ్యింది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ల్యాప్టాప్లను అందించనుంది. విద్యార్థుల అభీష్టం మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్టాప్లను పంపిణీ చేయనుంది. తమకు ల్యాప్టాప్లు కావాలని 6.53 లక్షల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. 2021–22 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న 6,53,144 ల్యాప్టాప్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏపీటీఎస్కు నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు అప్పగించింది. జగనన్న అమ్మఒడి కింద 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 5,42,365 బేసిక్ వెర్షన్ ల్యాప్టాప్లు అందిస్తారు. ఇక ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద ఇస్తారు. వీరికోసం ఒక రకం కాన్ఫిగరేషన్తో 19,853 ల్యాప్టాప్లను, వేరే కాన్ఫిగరేషన్తో మరో 90,926 ల్యాప్టాప్లను అందిస్తారు. చదవండి: (తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ..) బ్రాండెడ్ కంపెనీల ల్యాప్టాప్లు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి కింద 44.48 లక్షల మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు. వీరికి ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో 5.42 లక్షల మందికిపైగా నగదుకు బదులు తమ పిల్లలకు ల్యాప్టాప్లు కావాలని ఆప్షన్ ఇచ్చారు. ఇక జగనన్న వసతి దీవెన కింద ఏటా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద 15.50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ల్యాప్టాప్ల్లో సమస్యలు వస్తే కంపెనీలు వారంలో వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు అందించాలి. లెనోవో, హెచ్పీ, డెల్, ఏసర్ వంటి బ్రాండెడ్ ల్యాప్టాప్లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రభుత్వం అందించనుంది. హైస్కూల్ విద్యార్థులకు అందించే ల్యాప్టాప్ల ప్రత్యేకతలు.. 4జీబీ రామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్ 10 (ఎస్డీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్ వర్డ్, పవర్ పాయింట్) కాన్ఫిగరేషన్లతో మూడేళ్ల వారెంటీతో అందిస్తారు. గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు 9వ తరగతి నుంచే ల్యాప్టాప్లు అందించడం వల్ల విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా పొందొచ్చు. ప్రపంచ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో మేలు. – ఇమంది పైడిరాజు, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్, అడవివరం, విశాఖపట్నం జిల్లా కరోనా వంటి సమయాల్లో చదువులకు ఇబ్బంది ఉండదు కరోనా సమయంలో స్కూళ్లు ఆన్లైన్ పాఠాలను అందించినా ల్యాప్టాప్లు లేక వాటిని అందిపుచ్చుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాప్టాప్లు ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పుతాయి. – వి.సునీత, పేరెంట్, జెడ్పీ హైస్కూల్, చంద్రంపాలెం, చినగదిలి, విశాఖపట్నం జిల్లా డిజిటల్ పాఠాలు అందుబాటులోకి వస్తాయి ల్యాప్టాప్ల వల్ల మాకు డిజిటల్ పాఠాలు అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్లో పాఠాలను అందించినప్పుడు ఫోన్లలో కంటే ల్యాప్టాప్లే అనువుగా ఉంటాయి. – సీహెచ్ జ్యోత్స్న, జెడ్పీహెచ్ఎస్ అనంతవరం డిగ్రీ విద్యార్థులకు అందించే రెండు రకాల మోడళ్ల ప్రత్యేకతలు.. మోడల్–1.. ప్రాసెసర్: ఇంటెల్ పెంటియమ్ సిల్వర్ సిరీస్, ఏఏండీ అథ్లాన్ (3000 సిరీస్) లేదా సమానమైన 4 జీబీ డీడీఆర్ రామ్ ►500 జీబీ హార్డ్ డ్రైవ్ ►14 అంగుళాల హై–డెఫ్ డిస్ప్లే (1366 గీ 768) ►వై–ఫై, బ్లూటూత్ ►వెబ్క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది) ►విండోస్ 10 ఓఎస్ ►ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్ ►మూడేళ్ల వారంటీ (ల్యాప్టాప్, బ్యాటరీ, అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ) ►ఎండీఎం సాఫ్ట్వేర్ ►బ్యాక్ప్యాక్/క్యారీ బ్యాగ్ మోడల్–2.. ప్రాసెసర్: ఇంటెల్ కోర్ ఐ3, ఏఏండీ రైజెన్ 3 (3250) లేదా సమానమైనది. ►8 జీబీ డీడీఆర్ ర్యామ్ ►500 జీబీ లేదా అంతకంటే ఎక్కువ హార్డ్ డ్రైవ్ ►14 అంగుళాల హై–డెఫ్ డిస్ప్లే (1366 గీ 768) ►వై–ఫై, బ్లూటూత్ ►వెబ్క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది) ►విండోస్10 ఓఎస్ ►ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్ ►మూడేళ్ల సమగ్ర వారంటీ (ల్యాప్టాప్, బ్యాటరీ అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ) ►ఎండీఎం సాఫ్ట్వేర్ ►బ్యాక్ప్యాక్/క్యారీ బ్యాగ్ -
యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారు?
-
విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్కు వెళ్తాం..
సాక్షి, అమరావతి: విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్కు వెళ్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందన్నారు. యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు. 40 శాతం మంది యాజమాన్యాలకు చెల్లించట్లేదనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ‘‘కొన్ని కళాశాలల్లో పీఆర్వో వ్యవస్థ విద్యాదీవెన కోసమే అడ్మిషన్లు చేస్తున్నాయి. 75 శాతం అటెండెన్స్ లేకపోతే రెండో విడత రాదు. గతంలో ఇంటర్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించలేదు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్లైన్ విధానం. డిగ్రీ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానం విజయవంతమైందని’’ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇవీ చదవండి: టీడీపీ నేతల సహకారం.. అగ్రిగోల్డ్ భూములు హాంఫట్! ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! -
పేద పిల్లలు.. పెద్ద చదువులు
పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు ఒక్కటే అని గట్టిగా నమ్మిన వ్యక్తిని. అందుకే రెండేళ్లలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. రెండేళ్లలో మొత్తంగా విద్యా రంగంలో 1,62,75,373 మందికి లబ్ధి కలిగిస్తూ రూ.26,677.82 కోట్లు ఖర్చు చేశాం. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు. అందుకే పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ సమూల మార్పు తీసుకువచ్చాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీ వల్లే మహిళలకు ప్రాధాన్యత జగనన్నా.. నేను బీటెక్ సెకండియర్ చదువుతున్నాను. నాకు ఒక అక్క ఉంది. నా బాగోగులు, మంచి చెడ్డలు చూసుకోవడానికి ఒక అన్నయ్య ఉంటే బావుండేది అనుకునే వాళ్లం. కానీ విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో నాలాంటి ఎంతో మంది చెల్లెళ్లు, తమ్ముళ్లకు మీరు ఒక అన్నగా భరోసా ఇస్తున్నారు. నిజంగా మీరు మాకు దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తున్నాం. గతంలో ఎక్కడికి వెళ్లినా మీ నాన్న పేరు.. ఆయన ఫోన్ నంబర్ అని అడిగేవారు. ఇప్పుడు మీ అమ్మ పేరు ఏంటని అడుగుతున్నారు. మీ వల్లే ఈరోజు మహిళలకు ప్రాధాన్యత పెరిగింది. పథకం ఏదైనా సరే అమ్మల ఖాతాల్లో డబ్బు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. – రామ లాహిత్య, విద్యార్థిని, అనంతపురం సాక్షి, అమరావతి: పేద పిల్లలు పెద్ద చదువులు చదివి గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలన్నదే తన తపన, తాపత్రయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తూ.. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామని తెలిపారు. మనసా, వాచా, కర్మణా సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ తోడుగా నిలుస్తున్నామని చెప్పారు. పెద్ద చదువులు చదివితేనే పెద్ద ఉద్యోగాలు వచ్చి ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయట పడతాయని, అప్పుడే వారి తల రాతలు మారతాయని అన్నారు. జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఈ ఏడాది రెండవ విడత దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లను 9,88,437 మంది తల్లుల ఖాతాలకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడు బాగా చదవాలని.. వాళ్లకు మన తరఫు నుంచి ఇవ్వదగ్గ ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే అని తాను చాలా గట్టిగా నమ్ముతానని చెప్పారు. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే మనం చాలా వెనకబాటులో ఉన్నామన్నారు. రాష్ట్రంలో చదువురాని వారు 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం మంది ఉన్నారని, దేశంలో సగటున 27 శాతం మంది మాత్రమేనని తెలిపారు. ఈ లెక్కన దేశ సగటు కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల జమ కార్యక్రమంలో వివిధ జిల్లాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద చదువులతోనే పేదరికానికి చెక్ ► 18 – 23 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు ఇంటర్ పూర్తయ్యాక ఎంత మంది కాలేజీలకు వెళ్తున్నారని చూస్తే.. ఆశ్చర్యకరమైన నంబర్లు కనిపిస్తున్నాయి. మనం బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో పోల్చి చూసుకుంటాం. ఇవన్నీ ఒకే రకమైన ఎకానమీ ఉన్న దేశాలు. ► బ్రెజిల్లో 51.8 శాతం, రష్యాలో 83.4 శాతం, చైనాలో 54.7 శాతం పిల్లలు ఇంటర్ తర్వాత కాలేజీల్లో చేరుతున్నారు. మన దేశంలో కేవలం 27 శాతం మంది మాత్రమే కాలేజీలకు వెళ్తున్నారు. అంటే దాదాపు 73 శాతం మంది పిల్లలు ఇంటర్ తర్వాత కాలేజీల్లో చేరడం లేదు. పిల్లలు పై చదువులు చదవకపోతే, పై స్థాయి ఉద్యోగాలు సాధించలేకపోతే పేదరికాన్ని ఎప్పుడూ పోగొట్టలేం. తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదు ► పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రావాలి. ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదు. అప్పుడే వారి తల రాతలు మారుతాయి. అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి.. పెద్ద జీతాలు వచ్చే అవకాశాలుంటాయి. ► ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి.. అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే.. జగన్ అనే నేను నాలుగు అడుగులు ముందుకు వేశాను. ► ఆ దిశగా అడుగులు వేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ప్రతి పేదవాడికి, ఓసీల్లో ఉన్న పేద పిల్లలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. వారి తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితిని మారుస్తున్నాం. హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు ఇస్తున్నాం. నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ► ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న పిల్లలకు పూర్తిగా నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో రెండో సంవత్సరం కూడా అడుగులు బాగా ముందుకు వేయగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా బకాయిలు లేకుండా, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ► వారు కాలేజీలకు వెళ్లి డబ్బులు కట్టే పరిస్థితి ఉంది. దీనివల్ల దాదాపు 10.97 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఏడాది రెండో విడత కింద రూ.694 కోట్లు విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం.. ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సంవత్సరంలోనే గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన దాదాపు రూ.1,800 కోట్లు తీర్చడమే కాకుండా, రూ.4,207.85 కోట్లు ఇచ్చాం. ఈ ఏడాది ఎలాంటి బకాయిలు లేకుండా ఏప్రిల్ నెలలో మొదటి విడత కింద రూ.671.45 కోట్లు ఇచ్చాం. నేడు (గురువారం) రెండో విడత కింద ఇస్తున్న సుమారు రూ.693.81 కోట్లతో కలిపి ఇప్పటి వరకు నేరుగా మ్తొతం రూ.5,573.11 కోట్లు చెల్లించాం. ఆ తల్లులకు అన్నగా, తమ్ముడిగా, పిల్లలకు మేనమామగా ఈ కార్యక్రమం చేస్తున్నా. ► విద్యా దీవెన కింద మొదటి విడత ఏప్రిల్లో, రెండో విడత ఇవాళ చెల్లించగా, మూడో విడత డిసెంబర్లో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తాం. తల్లుల చేతికే డబ్బు ఇచ్చి, వారే నేరుగా ఫీజులు చెల్లించేలా చేశాం. తద్వారా కాలేజీల్లో వసతులు బాగోలేకపోతే తల్లులు తలెత్తుకుని కాలేజీలను నిలదీసే పరిస్థితి కల్పించాం. వారు డబ్బులు కడుతున్నారు కాబట్టి ఆ హక్కు వారికొస్తుంది. ఏమైనా సమస్యలున్నా, సదుపాయాల లోపం ఉన్నా 1902 కు కాల్చేస్తే ప్రభుత్వం వాటి మీద దృష్టి పెడుతుంది. ► వసతి దీవెన మొదటి విడత ఏప్రిల్లో ఇచ్చాం. మళ్లీ డిసెంబర్లో రెండో విడత ఇస్తాం. వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న వారికి రూ.20 వేలు వసతి, భోజనం కోసం ఇస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన.. రెండు కార్యక్రమాలతో పిల్లలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. అంగన్వాడీల నుంచే చదువుల విప్లవం ► అంగన్వాడీల్లో కూడా పీపీ1, పీపీ2 విధానాన్ని తీసుకొచ్చి అక్కడ కూడా చదువుల విప్లవం తీసుకురావాలని తాపత్రయ పడుతున్నాం. పిల్లలకు, గర్భవతులుగా ఉన్న తల్లులకు మంచి పౌష్టికాహారం అందించాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రూ.1,800 కోట్లు పెట్టాం. ► ప్రతి అడుగులోనూ చదువుకు అత్యంత పెద్దపీట వేసే ప్రభుత్వం మనది. మన పిల్లలు బాగా చదవాలని అంగన్వాడీలను పీపీ1 గా మార్చి అక్కడ నుంచి ఇంగ్లిష్ మీడియంను తీసుకు వచ్చాం. సీబీఎస్ఈ అఫిలియేషన్ను తీసుకు వచ్చాం. పీపీ1 నుంచి డిగ్రీ వరకు అన్ని చదువులు ఇంగ్లిష్ మీడియంలో చదివించే గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టగలిగాం. ఈ కార్యక్రమాలన్నింటికీ దేవుడు దీవించాలని, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ ఘటనతో పరిస్థితి మార్చాలని నిర్ణయం నేను పాదయాత్ర సాగిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇప్పటికీ గుర్తుంది. దారిలో నేను వెళ్తున్నప్పుడు గోపాల్ అనే తండ్రి ఇంటి దగ్గర కొడుకు ఫొటోతో ఫ్లెక్సీ పెట్టాడు. నా వద్దకు వచ్చి ‘ఫీజు లక్ష రూపాయలు అయితే ప్రభుత్వం నుంచి అరకొరగా రీయింబర్స్మెంట్ వస్తోంది. అది కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. ఫీజు కింద రూ.30 వేలు ఇస్తున్నారు.. మిగతా రూ.70 వేలు ఏటా అప్పు చేయాల్సి వస్తోంది. దీన్ని చూసి తట్టుకోలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆ తండ్రి నాకు చెప్పాడు. ఆ ఘటన నా మనసుని ఎంతగానో కలిచి వేసింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలన్న తపన, తాపత్రయంతోనే అడుగులు వేస్తున్నాం. అంబేడ్కర్ మార్గంలో ముందడుగు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆ తర్వాతి ప్రభుత్వాలు తూట్లు పొడిచాయి. మీరు వచ్చాక పూర్తి స్థాయిలో కులాలకు అతీతంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. పాత బకాయిలు కూడా విడుదల చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా తీరును ముందుకు తీసుకెళుతున్నారు. మీ కృషి వల్ల గ్రామీణ విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. మీకు ధన్యవాదాలు. – పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఇంగ్లిష్ మీడియంతో పేదల దశ మారుతుంది అన్నా.. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల వల్ల నాలాంటి విద్యార్థులు ఎందరో మంచి చదువులు చదువుకుంటున్నారు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. నా చదువుకి అయ్యే ఖర్చు గురించి మా నాన్న శ్రమ పడకుండా మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా చదువుకుంటున్నాను. ఇప్పుడు బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంగ్లిష్ మీడియం వల్ల పేద విద్యార్థుల దశ, దిశ మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థులందరి తరఫున మీకు ధన్యవాదాలు. – తేజ ప్రకాష్, భీమవరం, పశ్చిమగోదావరి ఇది మేనమామ గిఫ్ట్ జగనన్నా.. నాకు ఇద్దరమ్మాయిలు. ఒంటరి పోరాటం చేస్తున్నాను. వారిని పెంచి పోషించి, చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. అవమానాలు ఎదుర్కొన్నాను. నా చిన్న కూతురు ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతోంది. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.35 వేలు వచ్చేవి. మిగిలిన డబ్బులకు చాలా ఇబ్బంది పడేదానిని. మీరు సీఎం అయ్యాక పూర్తి ఫీజు ఇస్తున్నారు. పైగా తల్లుల ఖాతాలో వేస్తున్నందుకు చాలా సంతోషం. మేం నేరుగా కాలేజీలకు వెళ్లి బాగోగులు తెలుసుకుంటున్నాం. దీనికితోడు వసతి దీవెన వల్ల మాపై భారం తగ్గింది. ఈ పథకాల వల్ల కలిగే లబ్ధిని పిల్లలు వారి మేనమామ గిఫ్ట్ ఇచ్చినట్లుగా సంతోషపడుతున్నారు. – పి.అంజనాదేవి, విద్యార్థిని తల్లి, గుంటూరు -
వసతి దీవెనకు బదులు ల్యాప్టాప్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు వారి సమ్మతిని అనుసరించి ‘జగనన్న వసతి దీవెన’ స్థానంలో ల్యాప్టాప్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా ల్యాప్టాప్లు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం వారికి భోజన వసతి సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తున్న సంగతి తెలిసిందే. 2021–22 విద్యా సంవత్సరంలో జగనన్న వసతి దీవెన కింద ఇచ్చే నగదుకు బదులు ల్యాప్టాప్లు కావాలని కోరుకొనే వారికి వీటిని అందించనున్నారు. వీరికి రెండు రకాల కంప్యూటర్లను వారి అభీష్టాన్ని అనుసరించి పంపిణీ చేయిస్తారు. వాటిలో ఒకటి బేసిక్ కన్ఫిగరేషన్తో ఉన్నది కాగా రెండోది అడ్వాన్సుడ్ కన్షిగరేషన్తో కూడుకున్నది. ఈ ల్యాప్టాప్ల కొనుగోలుకు సంబంధించి ఏపీటీఎస్ ద్వారా విధివిధానాలు ఖరారు చేయనున్నారు. అలాగే ఈ ల్యాప్టాప్లలో ఏమైనా లోపాలు తలెత్తితే విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో ఆయా కంపెనీలు సమస్యను పరిష్కరించాలి. రెండు రకాల మోడళ్లకు సంబంధించిన కన్ఫిగరేషన్ సమాచారాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) ఉత్తర్వుల్లో పొందుపరిచారు. -
ఏపీ: రెండేళ్లలో విద్యారంగంపై రూ.25,714 కోట్లు ఖర్చు
సాక్షి, అమరావతి: ‘‘ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని, చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడే” అని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోంది. మన విద్యార్ధులు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి గెలవాలనే సమున్నత లక్ష్యంతో జగనన్న అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మనబడి నాడు-నేడులో భాగంగా పాఠశాలల ఆధునికీకరణ, జగనన్న గోరుముద్ద తదితర పథకాల ద్వారా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల్లో ఆర్థిక చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. జగనన్న అమ్మఒడి.. దేశ చరిత్రలోనే తొలిసారిగా తల్లుల గురించి, వారి పిల్లల చదువుల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం ఏపీనే. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో “జగనన్న అమ్మఒడి” పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం... ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులందరికీ ఈ సాయం వర్తింపు... ఈ పథకం క్రింద రెండేళ్లలో 44,48,865 మంది విద్యార్థులకు రూ.13,022.90 కోట్ల సాయం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ. 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి వారి ఆప్షన్ మేరకు నగదు లేదా ల్యాప్ టాప్ అందించనుంది ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా “జగనన్న విద్యాదీవెన” పథకం ద్వారా డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే ఎస్.సి, ఎస్. టి, బి.సి, ఈబిసి, మైనార్టీ, కాపు, దివ్యాంగులు మరియు పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్... కాలేజీల్లో జవాబుదారీతనం పెంచడం, కాలేజీల్లో పరిస్థితులు, సమస్యలు, సదుపాయాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ పెంపొందించడం కోసం అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, ఏ బకాయిలు లేకుండా నాలుగు దఫాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ పథకం క్రింద రెండేళ్లలో 18,80,934 మందికి రూ.4,879.30 కోట్ల లబ్ది చేకూర్చింది ప్రభుత్వం. జగనన్న వసతి దీవెన.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చుల నిమిత్తం “జగనన్న వసతి దీవెన” పథకం ద్వారా ఏటా రెండు విడతల్లో 20వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20వేల చొప్పున కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ వారి తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం నేరుగా జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం క్రింద రెండేళ్లలో 15,56,956 మందికి రూ.2,269.93 కోట్లు జమ చేసింది. జగనన్న విద్యా కానుక.. ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు “జగనన్న విద్యా కానుక” పథకం ద్వారా బడులు తెరవకముందే కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, సాక్స్,షూస్ తో పాటు ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందిస్తుంది ప్రభుత్వం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న మొట్టమొదటి, ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే. ఈ పథకం క్రింద రెండేళ్లలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులకు రూ.781 కోట్లతో లబ్ది చేకూర్చింది.. మనబడి ‘నాడు-నేడు.. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చివేసి మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం మనబడి ‘నాడు-నేడు’. ఈ కార్యక్రమం క్రింద మూడు దశల్లో రూ.16,700 కోట్ల వ్యయంతో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లతో పాటు 28,169 అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు సమూలంగా మారనున్నాయి. మరో 27,438 అంగన్ వాడీలకు కొత్త భవనాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రక్షిత త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, ప్రహారీ గోడలు, తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మతులు, ఫినిషింగ్, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్ లు, ట్యూబ్ లైట్లు, కిచెన్, ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించేలా ఇంగ్లీష్ ల్యాబ్ వంటి మంచి వసతులు కల్పిస్తుంది. జగనన్న గోరుముద్ద.. రాష్ట్రవ్యాప్తంగా 45,854 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 36,88,618 మంది విద్యార్థులకు రూ.1,600 కోట్ల వ్యయంతో “జగనన్న గోరుముద్ద” పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం, ప్రతి రోజూ మెనూ మార్చి రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తుంది. విద్యారంగంలో చేపట్టిన మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలు : పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు పాఠశాలల్లో ప్రాథమికస్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను ప్రవేశపెట్టింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 2021-22 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021-22 విద్యా సంవత్సరం నుండి అన్ని డిగ్రీ కోర్సులలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభించనుంది. అంగన్ వాడీలను “వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు”గా అప్ గ్రేడ్ చేసి పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాసుల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన .... ఆట పాటలతో బోధన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసానికి గట్టి పునాదులు వేస్తోంది ప్రభుత్వం. జూన్ 2019 నుండి ఇప్పటివరకు రెండేళ్లలో విద్యా రంగంపై మొత్తం రూ.25,714 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్ వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం మరో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తోంది. -
తలరాత మార్చేది చదువులే
ఓ మేనమామగా...చదువులకు చేసే ఖర్చంతా నా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి అని గట్టిగా నమ్ముతున్నా. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువులే. విద్యా దీపాలు వెలిగిస్తే భావితరాల తలరాతలు కూడా మారతాయి. కోవిడ్తో ఆర్థిక సమస్యలున్నా తల్లిదండ్రుల ఇబ్బందులే ఎక్కువని భావించి ఓ మేనమామగా ముందడుగు వేస్తున్నా. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: ఉన్నత చదువుల్లో ప్రపంచంతో పోటీపడి మన విద్యార్థులు రాణించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మంచి డిగ్రీ సంపాదిస్తేనే తలరాతలు మారతాయన్నారు. పేదరికంతో ఏ విద్యార్థీ చదువులకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే దుస్థితి రాకూడదనే కోవిడ్ కష్టాల్లోనూ ఇచ్చిన మాట ప్రకారం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికున్న ఇబ్బందుల కన్నా ప్రతీ తల్లిదండ్రి, పిల్లల ఇబ్బందులే ఎక్కువని భావించి అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. వరుసగా రెండో ఏడాది ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ఈ విద్యా సంవత్సరం మొదటి విడతగా 10,89,302 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.1,048.94 కోట్లను సీఎం బుధవారం కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆ వివరాలివీ.. తరతరాలకు చదువుల వెలుగులు.. ఉన్నత చదువులే మనం పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి. చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు భావితరాల తలరాతలు మారతాయని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఇవాళ 10,89,302 మంది తల్లుల ఖాతాల్లో దాదాపు రూ.1,049 కోట్లు జమ చేస్తున్నాం. దేవుడి దయతో ఇంత మంచి కార్యక్రమం చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది. పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యా దీవెనతో పాటు హాస్టల్, మెస్ ఖర్చుల కోసం ‘వసతి దీవెన’ పథకాన్ని అమలు చేస్తున్నాం. వసతి దీవెన ద్వారా ఏటా 2 వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన, ఖర్చుల కోసం కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికి వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన ద్వారా రూ.2,269.93 కోట్లు లబ్ధి చేకూర్చామని ఆ పిల్లలకు మేనమామగా సగర్వంగా తెలియజేస్తున్నా. అక్క చెల్లెమ్మల ఖాతాల్లోనే.. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన కింద సహాయాన్ని అక్క చెల్లెమ్మల ఖాతాల్లోనే జమ చేస్తాం. విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తొలి త్రైమాసికానికి సంబంధించి గత వారమే తల్లుల ఖాతాల్లో రూ.671.45 కోట్లు జమ చేశాం. ప్రతి త్రైమాసికంలో ఆ తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం, వారే ఆ ఫీజులు కట్టడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. వసతులు బాగా లేకపోతే కాలేజీ యాజమాన్యాలను నిలదీయవచ్చు. ఫిర్యాదులుంటే 1902కి ఫోన్ చేస్తే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. డ్రాపవుట్లు తగ్గాయి.. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాల వల్ల విద్యా రంగంలో డ్రాపవుట్లు గణనీయంగా తగ్గాయి. గతంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య, ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారికి సంబంధించిన ‘గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో’ కేవలం 23 శాతమే ఉంది. 1.60 కోట్ల మందికిపైగా ప్రయోజనం జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు–నేడు ద్వారా ఇప్పటి వరకు 1,60,75,373 మంది పిల్లలకు ప్రయోజనం కల్పిస్తూ మనందరి ప్రభుత్వం దేవుడి దయతో ఈ 23 నెలల్లో విద్యా రంగంపై రూ.25,714.13 కోట్లు ఖర్చు చేసిందని అక్కచెల్లెమ్మలకు సగర్వంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాడు–నేడు కింద ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్వాడీల్లో పిల్లలు, తల్లుల పౌష్టికాహారానికి మరో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ► జగనన్న అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వారి ఆప్షన్ మేరకు వచ్చే ఏడాది నుంచి ల్యాప్టాప్లిస్తాం. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాం. ► వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తాం. అంగన్వాడీలు ఇక నుంచి వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారనున్నాయి. వైఎస్సార్ పీపీ 1, పీపీ 2, ఫ్రీ ఫస్ట్ క్లాసు తెస్తూ ఇంగ్లిష్మీడియంలో విద్యాబోధన నిర్వహిస్తాం. ► మనబడి ‘నాడు–నేడు’ పథకం కింద 3 దశల్లో పాఠశాలలు, కాలేజీల ఆధునికీకరణ చేపట్టాం. 27,438 అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలతో పాటు 28,169 కేంద్రాల రూపురేఖలు మారుస్తున్నాం. ► జగనన్న విద్యాకానుక ద్వారా కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్›్ట్స బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్ ఇస్తుండగా ఇకపై ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ కూడా అందచేస్తాం. జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ మెనూ మార్చి నాణ్యమైన పౌష్టికాహారం, రుచికరమైన మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం. గర్భిణులు, పిల్లల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తున్నాం. ► విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తూ ఇప్పటివరకు రూ.4,879.30 కోట్లిచ్చాం. వచ్చే జూలైలో రెండో త్రైమాసికం, డిసెంబర్లో మూడో త్రైమాసికం, 2022 ఫిబ్రవరిలో నాలుగో త్రైమాసికం ఫీజులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం. -
ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసమే..
ప్రతి విద్యార్ధి కోసమే నేను ఆలోచిస్తున్నా... టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుంటే వారి భవిష్యత్తుకే నష్టం. పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పడం చాలా సులభం. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టమే అయినా పిల్లల కోసం కష్టతరమైన మార్గాన్ని ఎంచుకున్నాం. అన్ని జాగ్రత్తలతో బాధ్యతగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రతి తల్లికీ భరోసా ఇస్తున్నా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గి రాజేయడానికి, వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేయడం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పాస్ మార్కుల సర్టిఫికెట్తో ఓ విద్యార్థి బయటపడితే తరువాత వారి భవిష్యత్తు సంగతి ఏమిటని ప్రశ్నించారు. బొటాబొటి మార్కులతో పాసైన వారికి మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయని, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు ఎలా నెగ్గుకు రాగలుగుతారో ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. వరుసగా రెండో ఏడాది ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద తొలివిడతగా 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని తల్లులు, విద్యార్థులు, అధికారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగం వివరాలు ఇవీ... ఒక్కసారి ఆలోచన చేయండి.. పిల్లలు, తల్లిదండ్రులు అంతా ఆలోచించాల్సిన విషయాలు చెబుతా. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తున్న వారికి కూడా చెబుతున్నా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లవాడి భవిష్యత్తు కోసం నాకన్నా ఎక్కువగా ఆలోచించేవారు ఎవరూ ఉండరని చెబుతున్నా. అంతగా మన పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నా, తపిస్తున్నా. వారి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇవాళ మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గి పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాలదే ఆ నిర్ణయం.. ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన పాలసీ లేదు. కేంద్రం కొన్ని నిర్ణయాల బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయి. కేవలం పాస్ సర్టిఫికెట్లతో ఏం ఉపయోగం? ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి నుంచి ఓ విద్యార్థి పాస్ సర్టిఫికెట్తో బయటపడితే.. లేదా కేవలం పాస్ మార్కులతో బయటకు వస్తే ఆ విద్యార్థికి మరో 50 ఏళ్ల పాటు భవిష్యత్తు ఏమిటి? పరీక్షలు నిర్వహించే రాష్ట్రాల విద్యార్థుల మార్కులు గొప్పగా ఉంటే, పరీక్షలు జరపకుండా కేవలం పాస్ మార్కులతో, ఆ సర్టిఫికెట్లతో మన పిల్లలు ఉంటే వారికి గొప్ప కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయన్నది ఒక్కసారి ఆలోచించండి. పరీక్షలు నిర్వహించకపోతే ఉత్తీర్ణులైనట్లు కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తారు. మరి అలాంటప్పుడు పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్న వారితో ఈ విద్యార్థులు ఎలా పోటీ పడతారు? ఈ పిల్లలకు మంచి కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయి? రద్దు చాలా సులభం అయినా.. పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పడం చాలా సులభం. ప్రతి అడుగులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించడం చాలా కష్టం. పిల్లల కోసం కష్టతరమైన మార్గం అయినా కూడా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ పిల్లలకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం. పిల్లలకు మంచి చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మరోసారి తెలియజేస్తున్నా. అన్ని జాగ్రత్తలతో బాధ్యతగా తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని ప్రతీ తల్లికీ భరోసా ఇస్తున్నా. – ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆర్ అండ్ బీ మంత్రి ఎం.శంకరనారాయణ, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా చదువుకుంటున్నారు ఫీజులు కట్టలేక ఆపేద్దామనుకున్నా.. అమ్మ, అన్నయ్య కూలి పనులు చేసి నన్ను చదివిస్తున్నారు. జేఎన్టీయూ అనంతపురంలో సీటు వచ్చింది. ఫీజులు కట్టలేక చదువు ఆపేద్దామనుకున్నా. మీరు నాకు రూ.20 వేలిచ్చారు. వచ్చే ఏడాదికల్లా ల్యాప్టాప్ కూడా అందుతుంది. నాకు నాన్న లేకపోయినా మేనమామలా అన్నీ చేస్తున్నారు. ఆడపిల్లలు మీవల్ల ధైర్యంగా చదువుకుంటున్నారు. – హారిక, బీటెక్, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు అన్నలా.. మేనమామలా.. నేను కూలికి వెళతా. ఇంటర్ తర్వాత పెద్దమ్మాయి చదువు ఆపేద్దామనుకునే సమయంలో మీ పథకాలు ఆదుకున్నాయి. నా భర్త ఆటో డ్రైవర్. వాహనమిత్ర ద్వారా లబ్ధి పొందారు. ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ కూడా చేశారు. నాకు డ్వాక్రా రుణమాఫీ వచ్చింది. మా పిన్ని భర్త చనిపోతే పింఛన్ అందుతోంది. మాకు అన్నలా, మా పిల్లలకు మేనమామలా అన్నీ చేస్తున్నారు. – రమణమ్మ, విద్యార్థిని తల్లి, పేర్నమిట్ట, ప్రకాశం జిల్లా మాకు ఎంతో చేస్తున్నారు.. నా తమ్ముడు, నేను చదువుతున్నామంటే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలే కారణం. గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్, స్కాలర్షిప్ డబ్బులు హాస్టల్ ఖర్చులకు కూడా సరిపోయేవి కాదు. పక్క రాష్ట్రాల విద్యార్ధులు కూడా మీలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు. మీరు దేశంలోనే బెస్ట్ సీఎం. –గుత్తావుల తేజేశ్వరరావు, విద్యార్థి, ఆగూరు గ్రామం, శ్రీకాకుళం -
‘జగనన్న వసతి దీవెన’ నగదు జమ చేసిన సీఎం జగన్
-
‘జగనన్న వసతి దీవెన’ నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1,048.94 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు 2020-2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి తొలి విడత నగదు జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని, విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. తల్లులే నేరుగా ఫీజులు కట్టడం వల్ల జవాబుదారీతనం ప్రతి విద్యార్ధి ప్రపంచంతో పోటీ పడాలని, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో 'జగనన్న వసతి దీవెన' నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్ధులకు సాయం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నామని, తల్లులే నేరుగా ఫీజులు కట్టడం వల్ల జవాబుదారీతనం వస్తుందని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. 10.89లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. అమ్మఒడి పథకం కింద డబ్బు లేదా ల్యాప్టాప్ 'జగనన్న వసతి దీవెన' ద్వారా 2,270 కోట్లు సాయం చేశామని, 'జగనన్న వసతి దీవెన' ద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్లు తగ్గాయని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ను తీసుకొస్తామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 'అమ్మఒడి' పథకానికి ఆప్షన్లు ఇచ్చామని, అమ్మఒడి పథకం కింద డబ్బు లేదా ల్యాప్టాప్ ఇస్తామని తెలిపారు. అంగన్వాడీలను వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నామని వివరించారు. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం’ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా కాలేజీలో సీటు టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం తాను ఆలోచిస్తాని సీఎం జగన్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదన్నారు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా కాలేజీలో సీటు వస్తుందని గుర్తుచేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. కోవిడ్పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి కోవిడ్ కల్లోలంలోనూ దాన్ని తూచా తప్పకుండా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థుల బంగారు భవితే లక్ష్యంగా గత వారం ‘జగనన్న విద్యా దీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్కు మొదటి త్రైమాసికం కింద రూ.671.45 కోట్లు వారి తల్లుల ఖాతాలకు సీఎం జమ చేసిన విషయం తలిసిందే. ఇప్పుడు వసతి, భోజన ఖర్చులకు రూ.1,048.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను చెల్లించేందుకు ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారు. ‘జగనన్న వసతి దీవెన’ పథకం ద్వారా ఇప్పటికే రూ.1,220.99 కోట్లను చెల్లించారు. మొదటి విడతగా రూ.1,048.94 కోట్లను చెల్లించారు. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద రూ.2,269.93 కోట్లు చెల్లించారు. చదవండి: ఆంధ్రప్రదేశ్లో 59,062 కొత్త పింఛన్లు -
నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన నగదు
సాక్షి, అమరావతి: ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని గట్టిగా విశ్వసిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం రూ.1,048.94 కోట్లను జమ చేయనున్నారు. 2020–2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా సీఎం నగదు జమ చేస్తారు. దీనికనుగుణంగా బడ్జెట్ను విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి కోవిడ్ కల్లోలంలోనూ దాన్ని తూచా తప్పకుండా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థుల బంగారు భవితే లక్ష్యంగా గత వారం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్కు మొదటి త్రైమాసికం కింద రూ.671.45 కోట్లు వారి తల్లుల ఖాతాలకు సీఎం జమ చేశారు. ఇప్పుడు వసతి, భోజన ఖర్చులకు రూ.1,048.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను చెల్లించేందుకు జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారు. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఇప్పటికే రూ.1,220.99 కోట్లను చెల్లించారు. బుధవారం మొదటి విడతగా రూ.1,048.94 కోట్లను చెల్లిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద రూ.2,269.93 కోట్లు చెల్లించినట్లు అవుతుంది. -
విద్యారంగం: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యా శాఖమంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సిహెచ్ఈ) ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యారంగంలో మరో కీలక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ►అటానమస్ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు తయారు చేసుకునే విధానం రద్దు ►అన్ని కాలేజీలకీ జేఎన్టీయూ తయారుచేసిన ప్రశ్నపత్రాలే ►అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలకు ఇవే ప్రశ్నపత్నాలు ►వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే ►పరీక్షల్లో అక్రమాల నిరోధానికే చర్యలు అందుకే ఈ నిర్ణయం: సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేమని.. ప్రతి విద్యార్థీ నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలన్నారు. ప్రతికోర్సుల్లో అప్రెంటిస్ విధానం తీసుకురావాలని అందుకే నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. ‘‘కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువ ఏముంటుంది. విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి. కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యావిధానాన్ని పరిశీలించాలని’’ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకువచ్చి.. ఆర్ట్స్లో మంచి సబ్జెక్టులను ఈ కాలేజీలో ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై సీఎం సమీక్ష ♦ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు ♦రీయింబర్స్మెంట్, ఏప్రిల్ 27న వసతి దీవెన విడుదలపై అధికారులతో సీఎం సమీక్ష ♦ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు ♦దాదాపు 10 లక్షలమందికిపైగా విద్యార్థులకు లబ్ధి ♦ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50వేల వరకూ పెరుగుదల వచ్చిందన్న అధికారులు ♦విద్యాదీవెన ద్వారా తల్లిదండ్రుల్లో చదువులకు ఇబ్బంది రాదనే భరోసా వచ్చిందన్న అధికారులు ♦అందుకనే గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7లక్షలకు పెరిగిందని ముఖ్యమంత్రికి వెల్లడించిన అధికారులు పోస్టుల భర్తీపై క్యాలెండర్ ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధంచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదలచేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశించారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. చదవండి: ‘ఉయ్యాలవాడ’ పేరుతో ఓర్వకల్లు ఎయిర్పోర్టు: సీఎం జగన్ సీఎం జగన్ ప్రకటన.. చిరంజీవి హర్షం -
'35వేల మందిని అర్హులుగా గుర్తించాము'
సాక్షి, విజయవాడ : ఉగాది నాటికి అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. కాగా దీని కింద ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గంలో 35 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న వసతిదీవెన ద్వారా రూ. 10వేలు విద్యార్థుల ఖాతాలో జమయ్యాయని వెల్లడించారు. విద్య పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వం వెళ్లాలనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు బస్సు యాత్రలు చేపడుతున్నారని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. -
వసతి దీవేన పథకంపై ఏయూ విధ్యార్ధులు హర్షం
-
విజయవాడలో వసతి దీవేన పథకాన్ని ప్రారంభించిన మాల్లాది
-
అన్న ‘దీవెన’
విజయనగరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న వసతి దీవెన’ పథకం విజయనగరంలో ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిలో జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు, భావి తరాల తలరాతలు మారుతాయని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా అయోధ్య మైదానంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు రాలేదని, ఈ పరిస్థితి మారాలని, పేద కుటుంబాల పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. అందుకే దేశంలోనే ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పరేడ్ మైదానంలో ఘనస్వాగతం తాడేపల్లి నుంచి విశాఖపట్నం మీదుగా నేరుగా విజయనగరం చేరుకున్న సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇక్కడి పోలీస్ బ్యారెక్స్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహన శ్రేణితో బయలు దేరి స్థానిక అయోధ్య మైదానంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. హెలిప్యాడ్నుంచి అయోధ్య మైదానం వరకూ దారిపొడవునా వేలాదిగా జనం థాంక్యూసీఎం సార్ అంటూ చిత్రించిన ప్లకార్డులతో ఘన స్వాగతం పలికారు. అయోధ్య మైదానంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. బహిరంగ సభలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని కంప్యూటర్లో కీ ప్రెస్ చేసి ప్రారంభించారు. అక్కడి నుంచి పోలీసు బ్యారెక్ గ్రౌండ్స్కు చేరుకున్న సీఎం అక్కడి దిశ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. జన జాతరలా స్వాగతం తమ అభిమాననేత ముఖ్యమంత్రిగా బాధ్యత లు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లాకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన వెళ్లే మార్గానికి ఇరువైపు లా బారులు తీరి ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం పదిగంటలకే జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నుంచి అయోధ్య మైదానం వరకు చేరేంతవరకూ అన్ని ప్రధాన జంక్షన్లు జనంతో కిటకిటలాడాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రజలంతా మానవహారంగా ఏర్పడి చేతిలో ప్లకార్డులు పట్టుకుని జై జగన్ నినాదాలతో సందడి చేశారు. వసతి దీవెనకు విద్యల నగరం నుంచే శ్రీకారం విద్యలనగరంగా పేరుగడించిన విజయనగరం నుంచే జగనన్న వసతిదీవెనకు శ్రీకారం చుట్టడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ జిల్లాపై ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే విద్యాభివృద్ధి కోసం పలు పథకాలు అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే విద్యార్థుల వసతి, భోజన ఖర్చులక్సోం కోసం వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వేదికపై నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి అర్హతగల విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తొలి విడతగా రూ.10వేలు చొప్పున నగదును జమచేశారు. ఐడీ కార్డులు, చెక్కులను విద్యార్థులకు అందజేశారు. అనంతరం హరిత విజయనగరం సావనీర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు. దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం: నగర పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి పోలీస్ పరేడ్ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో నిర్మించిన దిశ పోలీస్ స్టేషన్ మొత్తం పరిశీలించారు. కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, జిల్లా ఇన్చార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి సుచరిత, తానేటి వనిత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శంకర నారాయణ, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, గొట్టేటి మాధవి, ఎం.వి.వి. సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, డీజీపీ గౌతమ్సవాంగ్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జి.పాలరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, దిశ ప్రత్యేకాధికారి దీపికాపాటిల్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్షి్మ, పార్టీ పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, జాయింట్ కలెక్టర్ జేసీ కిషోర్కుమార్, జేసీ–2 ఆర్.కూర్మనాథ్, డీసీసీబీ ఛైర్పర్సన్ మరిశర్ల తులసి, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కోలగట్ల శ్రావణి, ఏఎంసీ ఛైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, సబ్ కలెక్టర్ టిఎస్ చేతన్, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్గార్గ్, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు విజయనగరం టౌన్: రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో స్ధానిక అయోధ్య మైదానంలో సోమవారం సభాప్రాంగణంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి సభాప్రాంగణానికి రాకముందు నుంచే విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ చిన్నారులు చేసిన నృత్యప్రదర్శనలు ఆద్యంతం రక్తికట్టించాయి. రామవరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎమ్ వెలమల శ్రీనివాసరావు, యాంకర్ జుహిత(విశాఖ) అద్భుతమైన మాటలతో ఆకట్టుకున్నారు. భగవతీ నృత్యకళామందిర్ చిన్నారులు వినాయక స్తుతితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పద పద పోదాం సర్కారు బడికి అంటూ అమ్మఒడి పథకం గురించి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎమ్.హరిజవహర్లాల్ పాడిన ‘అమ్మలారా.. ఓ అయ్యలారా’, రాజాం కొండ మీద జానపదం వంటి పాటలకు నృత్య రూపకంలో వివరించారు. జామి, చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థులు ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న .. నీ వెంట జనం ప్రభంజనం చూడరన్న’ అంటూ చేసిన ప్రదర్శనలకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థులు ‘మనలో ఒక సైనికుడై మనలో ఒక సేవకుడై కదిలే జన నాయకుడై’ అంటూ చేసిన నృత్యం ఆలోచింప జేసింది. జామి కేజీబీవీ విద్యార్థులు ‘అమ్మఒడి పథకం చదువుకోలేని కుటుంబాల్లో వెలుగు నింపి కిరణమంటూ, నవరత్నాలు సిరివర్ణాలు కళ పండించే తొలి చిహ్నాలు అంటూ ముందుకు వచ్చారు. చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థులు థింసా డ్యాన్స్తో కట్టిపడేశారు. విద్యా కార్యక్రమాలపై గెద్ద వరప్రసాద్ నేతృత్వంలో కళాకారులు అద్భుతంగా పాడారు. పోలీస్ సేవలు భేష్! విజయనగరం క్రైమ్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయడంలో విజయవంతమైంది. దారిపొడవునా ప్రజలందరూ ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన తమ అభిమాన నాయకుడ్ని చూడడానికి బారులుతీరారు. వారిని కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించి పోలీసులు అందరి మన్ననలు పొందారు. హెలీప్యాడ్లో దిగినప్పటి నుంచి సభా ప్రాంగణం చేరుకునే వరకూ దారిపొడవునా పోలీసులు విస్తృతమైన తనిఖీలతో పాటు బాంబ్స్కా్వడ్, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ విస్తృత తనిఖీలు చేపట్టాయి. జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ప్రత్యేక ఆదేశాలతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. హెలీ ప్యాడ్ వద్ద అదనపు ఎస్పి ఎన్.శ్రీదేవీరావు, రూట్ బందోబస్తును పార్వతీపురం ఏఎస్పి డాక్టర్ సుమిత్ గరుడ్, సభాస్ధలం వద్ద బొబ్బిలి ఏఎస్పీ గౌతమీశాలీ, దిశ మహిళా పోలీసు స్టేషన్ వద్ద ఓఎస్డీ జె.రామ్మోహనరావు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. బందోబస్తు నిమిత్తం ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 31 మంది సీఐలు, 98 మంది ఎస్ఐలు, 192 మంది ఏఎస్ఐ,హెచ్సీలు, 600 మంది కానిస్టేబుళ్లు, 85 మంది మహిళా కానిస్టేబుళ్లు, 170 మంది హోంగార్డులు, ఐదు ప్లాటూన్ల ఆర్మ్డ్ రిజర్వు పోలీసు సిబ్బంది, ఐదు స్పెషల్ పార్టీ బృందాలు పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రాంతాలు, రహదారులను డ్రోన్, సీసీ కెమెరాలతో పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనలో సిత్రాలు ►ఉదయం 10 గంటలకే అయోధ్య మైదానంలోని సభా ప్రాంగణంలోని అన్ని గ్యాలరీలు విద్యార్థులు, మహిళలు, యువతతో నిండిపోయాయి. ►ఉదయం 11.50 గంటలకు అయోధ్య మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించేందుకు సిద్ధమైన రాజకీయ కురువృద్ధుడు పెనుమత్స సాంబశివరాజును అప్యాయంగా పలకరించిన జగన్మోహన్రెడ్డి ఆ శాలువతో సాంబశివరాజును సత్కరించారు. ► సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన సమయంలో మహిళా మంత్రులచే జ్యోతి ప్రజ్వలన చేయించారు. ►నెల్లిమర్ల మండలం బొప్పడాం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న అభిమన్యు ఆంగ్లంలో చేసిన ప్రసంగం ఆద్యంతం కరతాళ ధ్వనులను అందుకుంది. ►ముఖ్యమంత్రి ప్రసంగం 19.58 నిమిషాలు సాగింది. ప్రసంగం ఆధ్యంతం విద్యాభివృద్ధికి ప్రభుత్వ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. ► సభా ప్రాంగణం నిండిపోవటంతో మైదానం బయటినుంచే వేలాదిమంది గంటల తరబడి వీక్షించారు. ►ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగతం– సుస్వాగతం బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
చదువే ఆస్తి
-
ఉన్నత విద్య చదివే వారి సంఖ్య పెరగాలి
-
ధీమా పెంచిన దీవెన
సాక్షి, విశాఖపట్నం: జగనన్న వసతి దీవెన! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు తలపెట్టిన నవరత్నాల్లో ఇదొక హామీ! విద్యార్థుల ఉన్నత విద్యోన్నతే ఆయన ఉద్దేశం! ఒక్కరైనా ఉన్నత స్థాయికి ఎదిగితే వారి కుటుంబానికెంతో వెలుగు! పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ‘అమ్మ ఒడి’ అమలైంది. వాస్తవానికి ఉన్నత విద్యాకోర్సులు చదివే వారికే వసతి, భోజన ఖర్చుల నిమిత్తం రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని పాదయాత్రలోనే జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. తద్వారా జిల్లాలో 1,05,709 మందికి లబ్ధి చేకూరుంది. వారికి జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీ కార్యక్రమం జిల్లాలో సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. గ్రామ, వార్డు వలంటీర్లు మంగళవారం నుంచి ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు. వారి తల్లుల బ్యాంకు ఖాతాలో మొత్తం రూ.99.26 కోట్లు జమ అయ్యింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) వర్తిస్తుంది. ఇక జగనన్న వసతిదీవెన పథకం విషయానికొస్తే ప్రతి విద్యారి్థకీ భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందిస్తుంది. తొలి విడతలో 6,802 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.3.40 కోట్లు, అలాగే 12,179 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500 చొప్పున రూ.9.13 కోట్లు, డిగ్రీ ఆపై ఉన్నత విద్యాకోర్సులు చదివే 86,728 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున రూ.86.73 కోట్ల మేర వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. జిల్లావ్యాప్తంగా సందడి... భీమిలి మినహా జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సోమవారం జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. విశాఖ నగర పరిధిలోని తూర్పు, దక్షిణ, ఉత్తర, పశి్చమ, గాజువాక నియోజకవర్గాల పరిధిలోని విద్యార్థులకు కార్డుల అందజేత కార్యక్రమాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డీవీ రమణమూర్తి అధ్యక్షతన గురజాడ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ధ్యేయం అక్షరాంధ్రప్రదేశ్.. బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): రాష్ట్రాన్ని అక్షరాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో సోమవారం ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ‘దీవెన’ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాష్ట్రం పేరు మొదట్లో ఉంటుందని.. చదువులో కూడా అదేస్థానంలో ఉండేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులకోసం 30 శాతం మంది వెళ్తుంటే.. మన రాష్ట్రంలో 25 శాతం మంది మాత్రమే వెళ్తున్నారన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యార్థి తనకు నచ్చిన కోర్సును ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేలా ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అమ్మవడి కోసం రూ.6500 కోట్లు, జగనన్న విద్య, వసతి దీవెన కోసం రూ.600 కోట్లు, ‘నాడు–నేడు’ కోసం రూ.7000 కోట్ల మేరకు బడ్జెట్ కేటాయించామన్నారు. బడ్జెట్లో నాలుగోవంతు విద్య కోసం కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. పారీ్టలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల్ని అందిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యాన్ని పేదలకు చేరువచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు అన్నారు. విశాఖను రాజధాని చేయాల్సిందే... అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది నేతలు రాజకీయం చేస్తున్నారని ఇది సరికాదని మంత్రి ముత్తంశెట్టి ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ప్రయాణించాలంటే విశాఖను రాజధానిగా చేయడమే సరైనదని ఆయన అన్నారు. ఆ సమయంలో విశాఖను రాజధానిగా చేయాలని.. నినదిస్తూ సభా ప్రాంగణం హోరెత్తింది. భారం తగ్గించారు... మాకు ఇద్దరు అమ్మాయిలు. మొదటి అమ్మాయి సుప్రియను అతికష్టం మీద కళాశాలలో చదివిస్తున్నాం. రెండో అమ్మాయి చదువు సంగతి ఏమిటి.. అని ఆలోచిస్తున్న సమయంలో జగనన్న ఈ పథకంతో మాకు గొప్పభరోసా కలి్పంచారు. ఈ భరోసాతోనే ఈ ఏడాది రెండో అమ్మాయిని కళాశాలలో చేర్పించాం. ఆర్థికభారం లేకుండా ఇద్దరి ఆడపిల్లల్ని చదివించగలుగుతున్నామంటే అది సీఎం వైఎస్జగన్ చలవే. రుణపడి ఉంటాం. – పినిశెట్టి దేవి గొప్ప పథకం... వసతి దీవెన మా లాంటి కుటుంబాలకు చాలా ఉపయోగపడుతుంది. ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు ధైర్యాన్ని అందించారు. చదువుకోవాలని ఆకాంక్ష ఉంటే చాలు. ఇలాంటి ప్రభుత్వాల వలన ప్రజలకు మేలు జరుగుతుంది. హ్యాట్సాఫ్ టు జగనన్న. – కొల్లి కుమారి ఉన్నత చదువుకు.. నాడు ముఖ్యమంత్రి గా రాజశేఖరరెడ్డి చదువులకు రీయింబర్స్మెంట్ ఇచ్చి ప్రోత్సహిస్తే నేడు ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి హాస్టల్ ఖర్చులను సైతం ప్రోత్సాహంగా అందించి చదువును మరింతగా ప్రోత్సహించడం నిజంగా గొప్ప విషయం. మా అబ్బాయి పాలిటెక్నికల్ చదువుతున్నాడు. మాకు ట్రెజరీ నుంచి మెసేజ్ వచ్చింది. – గట్రెడ్డి రాణి, కొత్తకోట -
చదువుల విప్లవంతో పేదరికానికి చెక్
మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 45 వేల పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టల్స్, 148 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల రూపురేఖలు మార్చబోతున్నాం. ఈ కార్యక్రమం కోసం దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. అయినా ఫర్వాలేదని, నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువేనని అమలు చేస్తున్నాం. యుద్ధం చేస్తున్నది ప్రతిపక్షంతో కాదు. రాక్షసులు, ఉన్మాదులతో. ఇలాంటి అన్యాయమైన పరిస్థితిలో కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇంటింటా చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి.. ఈ లక్ష్యాల సాధనే ధ్యేయంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేలా మీ బిడ్డను ఆశీర్వదించాలి. ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తుంటే ఇక చంద్రబాబు గురించి మాట్లాడుకునే వారే ఉండరనే భయంతో తప్పుడు రాతలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలు చూపిస్తున్న ఈ చానళ్లను ఏమనాలో ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయడం కోసం ఇంకా ఫోకస్డ్గా అప్రోచ్ కావడానికి కృషి చేస్తుంటే అడ్డుపడుతున్నారు. చివరకు స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషాలో సీట్లు పెంచడానికి కూడా అడ్డు పడుతున్నారు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి విజయనగరం: చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు, భావి తరాల తలరాతలు మారుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబాల పరిస్థితిలో మార్పు లేదన్నారు. పేద కుటుంబాల పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఈ దిశగా అడుగులు వేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో సోమవారం ఆయన జగనన్న వసతి దీవెన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పేదవాడు అప్పుల పాలు కాకుండా ఆ కుటుంబం నుంచి ఓ ఇంజనీర్ లేదా డాక్టర్.. కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పిల్లలు బయటకు రావాలి. ఇది జరగాలంటే ఆ పిల్లాడు బడికి వచ్చి పెద్ద చదువులు చదవాలి. మంచి ఉద్యోగాలు చేయాలి. మంచి జీతాలు సంపాదించాలి. అప్పుడే పేదరికమన్నది మన దగ్గర నుంచి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి ఇంత వరకూ రాలేదు’ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్య చదివే వారి సంఖ్య పెరగాలి ‘స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రంలో ఇవాల్టికీ 33 శాతం మంది చదువు రాని వారు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. చదువు రాని వారి సంఖ్య దేశ సగటు 25 శాతం. అంటే మన రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉంది. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వయసున్న పిల్లలు ఎంత మంది ఇంటర్ తర్వాత కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నారని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంలో మనమెప్పుడూ కూడా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలతో పోల్చుకుంటాం. ఎందుకంటే వాళ్లవి, మనవి ఒకే రకమైన ఎకానమీస్ కాబట్టి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూస్తే రష్యాలో 81 శాతం.. బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో కూడా 50 శాతముంటే, మనదేశంలో కేవలం 23 శాతం మాత్రమే ఉంది. అంటే 77 శాతం మంది పిల్లలు ఇంటర్ అయిపోయాక పూర్తిగా చదువులు మానేస్తున్న పరిస్థితి. ఇలాగైతే మన పిల్లలు ఏ రకంగా పేదరికం నుంచి బయటకు వస్తారు? ఈ పరిస్థితి మార్చాలని, ఆ దిశగా అడుగులు వేస్తూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు ఇక్కడ వసతి దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నా. విజయనగరం సభలో మాట్లాడుతున్న సీఎం జగన్మోహన్రెడ్డి.. సభకు హాజరైన విద్యార్థులు, మహిళలు ప్రపంచంతో పోటీ పడేందుకే ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలన్నీ పూర్తిగా మార్చేందుకు మనబడి నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఇదే విజయనగరం జిల్లాలో ఇప్పటికే స్కూళ్లలో రూపురేఖలు మారుతున్నాయి. మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని స్కూళ్ల రూపు రేఖలు మార్చబోయే కార్యక్రమం ఇది. మధ్యాహ్న భోజనం మెనూలో కూడా పూర్తిగా మార్పులు చేస్తూ.. గోరుముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల అదనంగా దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు ఖర్చవుతున్నా కూడా ఏ మాత్రం లెక్క చేయలేదు. ప్రతి పిల్లాడిని చదివించడమే కాదు.. వారు భావితరంతో పోటీ పడాలి. అంతర్జాతీయంగా పోటీపడే పరిస్థితి రావాలి. అది జరగాలంటే ప్రతి స్కూల్ ఇంగ్లిష్ మీడియం వైపు పరుగెత్తాలి. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ పూర్తిగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నాం. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ మొత్తంగా నాలుగేళ్లలో మన పిల్లలు బోర్డు ఎగ్జామ్ను ఇంగ్లిష్ మీడియంలో రాసే పరిస్థితి కల్పిస్తాం. ఇందులో భాగంగా పిల్లలకు బ్రిడ్జి కోర్సులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. వీటన్నింటితో పాటు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా తీసుకొస్తున్నాం. తమకు అండగా ఉన్నందుకు కృతజ్ఞత తెలుపుతూ సభలో ‘థాంక్యూ సీఎం సార్’ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వంపై రోజూ కొందరు విమర్శలు చేస్తున్నారు. తమను ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారు. ఇటువంటి వారిని ఏమనాలో మీరే ఆలోచించాలని కోరుతున్నాను. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీల్లేదని దాడులు చేస్తున్న మూకలను ఏమనాలి? ఏ తçప్పు చేయకపోయినా, ఏదేదో జరిగిపోతున్నట్లు విపరీతమైన రాతలు, విపరీతంగా చూపిస్తున్న టీవీ చానళ్లు. యుద్ధం చేస్తున్నది ఒక్క ప్రతిపక్షంతోనే కాదు. ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం కాబట్టి దేవుడి దయతో పాటు మీ అన్నకు, మీ బిడ్డకు మీ ఆశీర్వాదం కావాలి. ఇది అందరి గురించి ఆలోచించే ప్రభుత్వం మీ పిల్లలు మీ ఇంటి దీపాలు కావాలి. మీ కుటుంబాలు చల్లగా ఉండాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద, మధ్యతరగతి, ఇతర వర్గాల బాగు కోసం కట్టుబడి ఉన్న ప్రభుత్వం మనది. తల్లుల చేతికిచ్చే ప్రతి రూపాయి పిల్లలకు ఉపయోగపడుతుందని నమ్మి అమ్మఒడి, వసతి దీవెన తీసుకొచ్చాం. మనమివ్వబోతున్న ఆసరా, చేయూత, ఉగాది నాటికి ఇవ్వబోతున్న ఇళ్లపట్టాలు.. ఇవన్నీ అక్కచెల్లెమ్మల సాధికారతకు దోహదపడతాయి. దశల వారీగా మద్యాన్ని కూడా నియంత్రిస్తున్న ప్రభుత్వం మనది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స, పి.విశ్వరూప్, సుచరిత, అవంతి, వెలంపల్లి, ఎం.శంకరనారాయణ, వనిత, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు ఏడాదికి రెండున్నర లక్షలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ఏటా రూ.20 వేల చొప్పున ‘వసతి దీవెన’గా వసతి, భోజన ఖర్చుల కోసం అందించే కార్యక్రమం నేటితో ప్రారంభమవుతుంది. మీ అన్నగా, మీ బిడ్డగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో రూ.10 వేలు.. మొత్తంగా ఏటా రూ.20 వేలు పిల్లల తల్లులకు అందిస్తాం. ఐటీఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.15 వేలు వారి తల్లులకు అందజేస్తాం. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ ఈ సాయం అందిస్తాం. అక్షరాల 11 లక్షల 87 వేల మంది పిల్లలకు ఈ రోజు ఒక బటన్ నొక్కిన వెంటనే ఆ తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ.1,100 కోట్లు నేరుగా పడుతుంది. వసతి దీవెన కింద ఏడాదికి రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. తల్లిదండ్రులు ఆ పిల్లలను చిరునవ్వుతో కాలేజీలకు పంపించే కార్యక్రమంలో భాగంగా ఏటా మరో రూ.3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అమ్మఒడి ద్వారా 1æ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉండాలని, 42 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా ప్రతి తల్లికి రూ.15 వేల చొప్పున రూ.6400 కోట్లు జమ చేశాం. ఈ మూడు పథకాలకు అక్షరాలా రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నా. దేవుడిలా వరాలిస్తున్న సీఎం జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సీహెచ్ అభిమన్యు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. విజయనగరంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అభిమన్యు మాట్లాడుతూ.. ‘మాట తప్పను.. మడమ తిప్పనని జగనన్న పాదయాత్రలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలను నిజం చేశారు. అమ్మఒడి పథకం తీసుకువచ్చారు. అర్హురాలైన ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తల్లులు ఎంతో అదృష్టవంతులు. జగనన్న గోరుముద్ద పథకం.. ఒక అమృతభాండం. ఎంతో రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. మన సీఎం జగన్ విష్ణుమూర్తి లాంటి వారు. మనకు ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. సీఎం జగన్ ఆకాంక్షలను విద్యార్థులు నెరవేరుస్తారని నేను మాట ఇస్తున్నా. నేను బాగా చదివి ఐఏఎస్ అధికారినవుతాను’ అన్నాడు. అనంతరం అభిమన్యును సీఎం జగన్ దగ్గరకు తీసుకుని అభినందించారు. -
పేదలకు పెద్ద చదువులే లక్ష్యంగా జగనన్న వసతి దీవేన
-
‘జగనన్న వసతి దీవెన పథకాన్ని’ ప్రారంభించిన సీఎం జగన్
-
విద్యా విప్లవం
-
‘ప్రపంచాన్ని జయించే ఒకే ఆయుధం విద్య’
సాక్షి, విజయనగరం: అమ్మఒడి, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు వస్తున్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. సోమవారం ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్ను నాలుగో స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. భవిష్యత్లో దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధిస్తుందని విశ్వరూప్పేర్కొన్నారు. (నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..) ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు, ఆలోచనలు, పరిపాలనా తీరు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. నెల్సన్ మండేలా చెప్పినట్టు ప్రపంచాన్ని జయించడానికి ఒకే ఆయుధం విద్య అని ఆమె అన్నారు. అటవంటి విద్యను సాధించేందుకు ఎదురయ్యే అడ్డంకులు తొలగించే విధంగా, విద్యపై ఆసక్తి కలిగేలా విద్య వ్యవస్థలో సీఎం వైఎస్ జగన్ మార్పులు తీసుకు వస్తున్నారని ఆమె తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో విన్నారని.. ఈరోజు ప్రజలకు అండగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అనేక అవరోధాలు దాటి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి చేరే విధంగా ప్రభుత్వం పథకాలను తీసుకొస్తుందన్నారు. (జగనన్న వసతి దీవెన: ప్రసంగంతో అదరగొట్టిన అభిమన్యు!) జిల్లాలో ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లినవారు, అక్కడ ప్రాణాపాయ స్థితుల్లో పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. ఆ పరిస్థితులు అధిగమించేలా విశాఖ పరిపాలన రాజధాని రాబోతుందని పుష్పశ్రీవాణి అన్నారు. సీఎం జగన్ దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అని ఆమె కొనియాడారు. గిరిజన మహిళగా నేల మీద కూర్చుని విద్యను అభ్యసించి, ఉపాధ్యాయునిగా ఉన్న తనకు గొప్ప గౌరవం ఇచ్చిన సీఎం జగన్ అభిమానాన్ని మరచిపోలేనని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ.. గతంలో చంద్రబబాబును ఇచ్చిన ప్రోత్సాహకాల కంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు తన మంది మార్భాలన్ని కాపాపడుకునేందుకు కులం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని శంకర్ నారాయణ అన్నారు. -
సీఎం జగన్ భగవంతుడితో సమానం: విద్యార్థి
సాక్షి, విజయనగరం: ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆరో తరగతి విద్యార్థి అభిమన్యు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. విజయనగరంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అభిమన్యు మాట్లాడుతూ.. విద్యా విధానంలో సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భగవంతుడితో సమానమని అన్నాడు. పేదల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్కు విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు తెలపడం గౌరవంగా భావిస్తున్నానంటూ ఇంగ్లీష్లో ప్రసంగించాడు. ‘‘మాట తప్పను... మడమ తిప్పనని పాదయాత్రలో హామీ ఇచ్చారు. అధికారంలోని వచ్చిన తర్వాత ఆ మాటలను అక్షరసత్యం చేశారు. అమ్మఒడి పథకం తీసుకువచ్చారు. అర్హురాలైన ప్రతీ తల్లికి రూ. 15 వేలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తల్లులు ఎంత అదృష్టవంతులు. ఇక జగనన్న గోరుముద్ద పథకం.. ఒక అమృతభాండం. ఎంతో రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. సీఎం జగన్ ఆకాంక్షలను విద్యార్థులు నెరవేరుస్తారని నేను మాట ఇస్తున్నా. నేను బాగా చదివి ఐఏఎస్ అవుతాను. సీఎం జగన్ విష్ణు భగవానుడి స్వరూపం’’అని జెడ్సీహెచ్ఎస్ విద్యార్థి అభిమన్యు పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన ప్రసంగంతో ఆకట్టుకున్న అభిమన్యును సీఎం జగన్ దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. చదువుల విప్లవం సృష్టిస్తాం: సీఎం జగన్ -
నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..
-
చదువుల విప్లవం సృష్టిస్తాం: సీఎం జగన్
సాక్షి, విజయనగరం: దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదల బతుకు మారలేదని.. నిరుపేదల జీవితాలలో మార్పులు రావాలని ఆకాక్షించారు. పేదల బతుకులు మారాలంటే వారి కుటుంబాలలో ఎవరో ఒకరు ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాలన్నారు. ఇంటర్ తర్వాత కళాశాలలో చేరేవారి సంఖ్య రష్యాలో 81 శాతం, బ్రెజిల్, చైన్ దేశాలలో 50 శాతం ఉండగా ఇండియాలో కేవలం 23 శాతం మాత్రమే ఉందన్నారు. ఇటువంటి పరిస్ధితులు ఉంటే కుటుంబాలు పేదరికం నుంచి ఎలా బయటపడతాయని సీఎం అన్నారు. (‘వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్) ‘పేద విద్యార్థులకు ప్రతి ఏటా రూ.20వేలు వసతి దీవెన అందిస్తాం. డిగ్రీ, పీజీ జరిగే విద్యార్థులకు రెండు విడతలుగా రూ.20వేలు ఇస్తాం వసతి, భోజనం ఖర్చుల కోసం విద్యార్థుల తల్లులకు అందిస్తాం. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఇస్తామని’ సీఎం తెలిపారు. 1 లక్ష 87వేల మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. వసతి దీవెన కింద రూ. 2,300 కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికే ఈ వసతి దీవెన పథకం అని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్లో విద్యా దీవెన పథకం కింద ఏడాదికి 3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ రెండు పథకాలతోనే 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా 6,400 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నామన్నారు. మన బడి- నాడు నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల రూపురేఖలు మారతాయన్నారు. మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే అని సీఎం తెలిపారు. (రూ.600 కోట్లతో ‘జగనన్న విద్యా కానుక’) తెలుగును తప్పనిసరి చేస్తూనే ఈ ఏడాది జూన్ నుంచి ప్రతీ పాఠశాలలో ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించబోతున్నామన్నారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్ధాయిలో పోటీ పడేలా ఉండాలన్నారు. ‘పేద, మధ్యతరగతి పిల్లల కోసం ఆలోచించే ప్రభుత్వం మనది. మహిళా సాధికారికతకు కట్టుబడిన ప్రభుత్వం మనది. దశల వారీ మద్య నిషేధం ద్వారా జీవితాలలో మంచి మార్పులు వస్తాయని’ తెలిపారు. (చదువుకు ఫీజు.. ఎంతైనా చెల్లింపు) రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం.. ‘పేదల సంక్షేమం కోసం శ్రమిస్తున్న మా ప్రభుత్వంపై కొందరు నిత్యం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుపేదలకి రికార్డు స్థాయిలో ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే కొన్ని పత్రికలు, మీడియాల తప్పుడు ప్రచారాన్ని ఏమనాలి. చంద్రబాబును ప్రజలు మరిచిపోతారనే భయంతోనే ఆ పత్రికలు, ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏ తప్పు చేయకపోయినా రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇందుకు దేవుడి దయ, ప్రజల దీవెనలు కావాలి. రాష్ట్రంలో ఉంది.. ప్రతిపక్షం కాదు..రాక్షసులు’ అని సీఎం జగన్ విమర్శించారు. (విద్యా విప్లవానికి శ్రీకారం) ‘దిశ’ పోలీస్స్టేషన్ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. పోలీస్ బేరక్స్లో నిర్మించిన దిశ పోలీస్స్టేషన్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మహిళల భదత్ర, సత్వర న్యాయం జరగాలన్నారు. -
జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం
-
‘వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు అండగా మరో విశిష్ట పథకానికి శ్రీకారం చుట్టారు. ‘జగనన్న వసతి దీవెన’పథకాన్ని సోమవారం ఆయన విజయనగరం జిల్లాలో ప్రారంభించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు చేరుకున్న సీఎం జగన్ విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించించారు. అనంతరం వేదికపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించి.. ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించారు. వైఎస్ జగన్ తండ్రికి మించిన తనయుడు విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రజలు వైఎస్ జగన్ని తండ్రికి మించిన తనయుడిగా భావిస్తున్నారన్నారు. అమ్మఒడి, ఆరోగ్య పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. రైతు భరోసాతో జిల్లాలో వలసలు ఆగిపోయాయన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది కళ్లలో ఆనందం నింపారన్నారు. జగనన్న పథకాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని కోలగట్ల విమర్శించారు. -
విజయనగరం చేరుకున్న సీఎం
-
విజయనగరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నేడు ‘జగనన్న వసతి దీవెన’ పథకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు చేరుకున్న సీఎం జగన్ అక్కడ నుంచి విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కొద్దిసేపట్లో ‘వైఎస్సార్ జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్కు చేరుకుని ‘దిశ’ పోలీస్స్టేషన్ను ప్రారంభించనున్నారు. -
పేద విద్యార్ధులకు మరో విశిష్ట పథకం
-
వసతి దీవెన