Jaish-e-Mohammed
-
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్లో మోస్ట్ వాంటెడ్గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్ను భారత్ వాంటెడ్గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
పఠాన్కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్లో హతం
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్థాన్లో హత్యకు గురయ్యాడు. పంజాబ్లోని సియాల్ కోట్లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. నూర్ మదీనా మసీద్లో ఫజర్ ప్రార్థన అనంతరం బయటకు రాగా.. బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు లతీఫ్తోపాటు మరో ఇద్దరు సహచరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లతీఫ్తోపాట మరో ఉగ్రవాది అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కాల్పులు జరిపిన అగంతకులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. ఈ దాడిపై పాక్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పఠాన్ కోట్ దాడి వ్యూహకర్త షామిద్ లతీఫ్(41) ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్కు లాంచింగ్ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్కోట్లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికికి మాస్టర్మైండ్ లతీఫే. ఈ దాడిలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పఠాన్కోట్లో బాంబు పేలుడు జరిగి మరో అధికారి మరణించారు. తరువాత ఈ దాడికి పాల్పడిన అయిదుగురు ముష్కరులను భారత బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ పేలుళ్లకు సూత్రధాని షాహిద్ లతీఫ్ అంటూ అప్పట్లో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అతడు పాక్లోని సియాల్కోట్ నుంచే ఈ దాడికి పథకం వేసి.. ఐదుగురు ఉగ్రవాదులను పఠాన్కోట్పై దాడికి పంపినట్లు దర్యాప్తు నివేదికలో తేలింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ లతీఫ్ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇక ఇటీవల పాక్లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల హత్యలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో వేర్వేరు ఉగ్రవాద సంస్థలకు చెందిన అయిదుగురు టాప్ కమాండర్లు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించారు. లతీఫ్ను 1994 నవంబర్ ఉగ్రవాదం, చట్ట విరుద్ధ కార్యాకలాపాల నివారణ చట్టం (UAPA)ప్రకారం జమ్మూకశ్మీర్లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 16 ఏళ్ల పాటు మసూద్ అజార్తో కలిసి కోట్ బల్వాల్లోని జైలులో శిక్షననుభవించాడు. అనంతరం 2010లో వాఘా ద్వారా పాకిస్థాన్కు అప్పగించారు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ను హైజాక్ చేసిన కేసులో లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు. చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
పీఏఎఫ్ఎఫ్పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘జమ్మూకశ్మీర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు దిగుతున్న జైషే మహ్మద్కు ఇది మారుపేరు. ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి హింసాత్మక చర్యలకు కుట్ర పన్నుతోంది. యువతను ఉగ్ర భావజాలం వైపు ఆకర్షిస్తోంది’’ అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం పీఏఎఫ్ఎఫ్పై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. -
పాక్లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్తో పాటు పొరుగున్న పాక్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్లోని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్లో అతివాద శక్తులు బలపడటం... భారత్కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఉగ్రవాద శక్తులకు తోడ్పాటు వద్దు: జైశంకర్
ఐక్యరాజ్యసమితి: లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆరోపించారు. శిక్ష పడుతుందన్న భయం వాటికి లేకుండా పోయిందన్నారు. ఇతర దేశాల అండ చూసుకొని రెచ్చిపోతున్నాయని చెప్పారు. ఆయన గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అధ్యక్ష హోదాలో ప్రసంగించారు. ఇండియాలో ముంబై, పఠాన్ కోట్, పుల్వామా దాడులకు పాల్పడింది పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలేనని గుర్తుచేశారు. అలాంటి సంస్థలకు ఏ దేశమూ తోడ్పాటు అందించవద్దని కోరారు. ఉగ్రవాద మూకలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని విస్మరించడం తగదని అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. -
జైషే ఉగ్ర కుట్ర భగ్నం
జమ్మూ: స్వాతంత్రదినోత్సవం రోజునే బైక్బాంబును పేల్చి విధ్వంసం సృష్టించాలన్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ పన్నాగాన్ని భద్రతాబలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. జమ్మూ జిల్లా కేంద్రంలో బాంబు పేలుడుకు సిద్ధమైన నలుగురు జైషే ఉగ్రవాదులు, వారికి సాయపడిన ఉత్తరప్రదేశ్ వాసిని, వారి సహాయకులను పోలీసులు అరెస్ట్చేశారు. డ్రోన్ల ద్వారా అందే ఆయుధాలను తోటి ఉగ్రవాదులకు చేరవేసే పనిలో బిజీగా ఉండగా వీరిని అరెస్ట్చేశారు. అయోధ్య రామజన్మభూమిపై నిఘా పెట్టాలని, దాడికి సంబంధించిన ఆయుధాలను అమృత్సర్లో డ్రోన్ ద్వారా అందుతాయని, పాక్లోని ఉగ్రవాది.. యూపీకి చెందిన సోనూ ఖాన్ అనే వ్యక్తిని ఆదేశించాడు. ఆ పని పూర్తిచేసేలోపే పోలీసులు ఖాన్ను అరెస్ట్చేశారు. -
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. దేశ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా బాంబు దాడులకు ప్లాన్ చేసిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. జైసే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్ధకు చెందిన వీరు శనివారం పట్టుబడ్డారు. ఈ నలుగురు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సేకరించి మిగిలిన ఉగ్రవాదులకు సరఫరా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు.. టూవీలర్కు ఐఈడీ అమర్చి పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. ఆదివారం స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో బాంబు దాడులకు సిద్ధమైనట్లు గుర్తించారు. -
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్కు చెందిన జైషే మొహమ్మద్ కశ్మీర్ కమాండర్, ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు, 2019 పుల్వామా దాడి సూత్రధారిగా భావిస్తున్న మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూ అలియాస్ అద్నన్ సహా మరొకరు హతమయ్యారు. గురువారం కశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీపీ) విజయ్ కుమార్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఉగ్రమూకల కదలికలున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు గురువారం నమిబియాన్, మర్సార్, డాచిగాం అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కార్డన్సెర్చ్ చేపట్టాయి. ఈ సమయంలో చిన్నారులు, మహిళలను అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు కాల్పులకు దిగగా దీటుగా బలగాలు స్పందించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ‘మృతుల్లో పాకిస్తాన్కు చెందిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, జైషే మొహమ్మద్కు చెందిన లంబూ ఉన్నాడు. ఇతడు జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు. 2019లో జరిగిన పుల్వామా దాడి కుట్రకు సూత్రధారి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీటులో ఇతడి పేరు ఉంది’ అని ఐజీపీ వెల్లడించారు. ఈ ఘన విజయం సాధించిన పోలీసులు, బలగాలను ఆయన అభినందించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై అదిల్ అద్నాన్ అనే ఆత్మాహుతి దళ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో దాడి చేయగా 40 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అద్నాన్కు శిక్షణ ఇచ్చింది లంబూయేనని భద్రతాధికారులు చెబుతున్నారు. ఎవరీ లంబూ? మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూకు అబూ సైఫుల్లా అనీ ఫౌజీ భాయి అని కూడా పేర్లున్నాయి. ఇతడు జైషే మొహమ్మద్ కశ్మీర్ ప్రధాన కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్లోని బహావల్పూర్లోని కోసర్ కాలనీకి చెందిన వాడు. ఐఈడీ తయారీలో ఇతడు దిట్ట. 2017లో కశ్మీర్లోకి అక్రమంగా చొరబడ్డాడు. అవంతిపొరా, పుల్వామా, అనంత్నాగ్ జిల్లాల్లో ఇతడు ఉగ్ర కార్యకలాపాలు సాగించాడు. త్రాల్లోపాటు జాతీయరహదారిపై ఉగ్ర దాడులకు ఇతడు యత్నించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్థానిక ఉగ్రవాది సమీర్ అహ్మద్ దార్తో కలిసి పుల్వామాలో పనిచేశాడు. అఫ్గానిస్తాన్లో తాలిబన్ల తరఫున కూడా లంబూ పోరాడాడు. భారత బలగాలపై రాళ్లు రువ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా కశ్మీర్ యువతను ప్రేరేపించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అవంతిపొరా, కాక్పొరా, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి యువతను ఉగ్రమార్గం పట్టించి, వారిని ఇతర ప్రాంతాలకు పంపించడంలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నాయి. ఇతడిపై 14 కేసులు నమోదయ్యాయి. -
పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల్ని కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. తజికిస్తాన్ రాజధాని డషంబేలో బుధవారం ఎనిమిది దేశాలతో కూడిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశానికి దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద సంస్థకు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. ఇందుకోసం ఎస్సీఓ, యాంటీ టెర్రర్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలని సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్న దోవల్, ఉగ్రవాద దాడుల్లో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్లో తరచూ దాడులకు పాల్పడే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్లను కట్టడి చేయడానికి దోవల్ ఒక కార్యాచరణని కూడా ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చదవండి: టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు -
200 మీటర్ల సొరంగం; పాక్ కుట్రలు బట్టబయలు!
న్యూఢిల్లీ: ఇటీవల నగ్రోటా వద్ద జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశంలో దొరికిన కీలక సమాచారం ఆధారంగా సరిహద్దు భద్రతా బలగాలు భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గల సుమారు 200 మీటర్ల పొడవు గల సొరంగాన్ని కనుగొన్నాయి. గురువారం నాటి ఎన్కౌంటర్లో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు, వారు దేశంలో ప్రవేశించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు అభిప్రాయపడ్డారు. పక్కా పథకం ప్రకారం కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడేందుకు సిద్ధమైన ముష్కరులు, ఈ క్రమంలో 8 మీటర్ల లోతు, 200- మీటర్ల పొడవు గల సొరంగాన్ని తవ్వినట్లు గుర్తించినట్లు ఆదివారం వెల్లడించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 160 మీటర్ల దూరంలో గల ఈ సొరంగం కొత్తగా తవ్విందని, దీని గుండా కశ్మీర్లోకి చొరబడి ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పథకం రచించారని భద్రతా అధికాలు అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. ‘‘సొరంగం తవ్వడానికి ఇంజనీరింగ్ నిపుణుల సహాయం తీసుకున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. తైవాన్లో తయారైన ఈట్రెక్స్ 20ఎక్స్ జర్మిన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) డివైస్ను ఉగ్రవాదులు ఉపయోగించారు. సరిహద్దు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఓ వాహనాన్ని నిలిపారు. భద్రతా బలగాల చేతికి చిక్కే ముందే భారీ విధ్వంసానికి పాల్పడేందుకు పథకం రచించారు. జీపీఎస్ డివైస్ ఆధారంగా సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి’’ అని ఉగ్ర కార్యకలాపాల నిరోధక విభాగం ఉన్నతాధికారి జాతీయ మీడియాతో పేర్కొన్నారు.(చదవండి: కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం) పాక్ కుట్రలు బట్టబయలు! కాగా పాకిస్తాన్లోని రేంజర్ ఔట్పోస్టులు చక్ బురా, రాజబ్ షాహిద్, ఆసిఫ్ షాహిద్ల గుండా మొదలైన ఈ సొరంగం కశ్మీర్ దాకా తవ్వబడిందని, 32. 45648 అక్షాంశం(ఉత్తరం), 75.121815(తూర్పు) రేఖాంశం వద్ద కేంద్రీకృతమైనట్లు నిఘా వర్గాల సమాచారం. ఇక దీపక్ రాణా నేతృత్వంలోని 48 బెటాలియన్ భద్రతా బలగాలు ఈ సొరంగాన్ని ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కనుగొన్నట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్లో తయారైన యూరియా ఫర్టిలైజర్, ఇసుక బస్తాలతో దీనిని నింపారు. జీపీఎస్ డేటా ఆధారంగా భారత్ సరిహద్దులో గల, బీఎస్ఎఫ్ బార్డర్ ఔట్పోస్టు రీగల్ సమీపంలోని 189 పిల్లర్ వద్దకు ఉగ్రవాదులు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం నడిచి, ఆర్మీ క్యాంపు సమీపంలో గల రైల్వే ట్రాక్ దాటి జాతీయ రహదారి 44 మీదకు చేరుకుని నవంబరు 19 అర్ధరాత్రి ట్రక్కు ఎక్కారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాయాది దేశం పాకిస్తాన్ భారత్పై ప్రతీకారం తీర్చుకునే దిశగా ఈ మేరకు ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతంలోనూ భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు గుర్తించిన విషయం తెలిసిందే. దాదాపు 20 మీటర్ల పొడవు, 25 అడుగుల లోతు గల ఈ టన్నెల్ ముఖద్వారం వద్ద లభించిన ప్లాస్టిక్ ఇసుక సంచులపై పాకిస్తానీ గుర్తులు(కరాచీ, శకర్ఘడ్ అనే పదాలు) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులు భారత్లో చొరబడేందుకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వీలుగా ఈ సొరంగాన్ని నిర్మించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోని పాకిస్తాన్ భారత్పై విషం చిమ్ముతూ ఉగ్రకుట్రలకు పథకం రచిస్తోందన్న ఆరోపణలకు ఈ పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. -
కశ్మీర్ విధ్వంసానికి పాక్ పన్నాగం
ఇస్లామాబాద్ : ఉగ్రవాదులపై పోరులో ముందున్న భారత్పై కక్ష తీర్చుకోవాలనుకుంటున్న దాయాది దేశం పాకిస్తాన్ ప్రయత్నాలు ఏమాత్రం మానటంలేదు. దేశంలో ఉగ్ర చర్యలకు పాల్పడాలని, ఉగ్రవాదులను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించాలని ప్రణాళిలు రచిస్తూనే ఉంది. ఏ ఒక్క అవకాశం వచ్చినా.. భారత్ను దొంగ దెబ్బ తీయాలని కలలు కంటోంది. సరిహద్దుల్లో కశ్మీర్ను వేదికగా చేసుకుని రక్తపాతం సృష్టించాలని కుట్రలకు పన్నుతోంది. అయితే భారత్కు చెందిన నిఘా వర్గాల అప్రమత్తతో ఎన్నోసార్లు పాక్ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో విధ్వంసం సృష్టించేలా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలతో మంతనాలు జరిపినట్లు తేలింది. కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఇంటిలిజెన్స్ అధికారి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. (లద్దాఖ్, కశ్మీర్ భారత్లో అంతర్భాగం) ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. పాక్ ఆర్మీ నేతృత్వంలోని అధికారుల బృంధం కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడాలని ప్రణాళిక రచించింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనపై నిరసనగా భారత ప్రభుత్వంపై కుట్ర పన్నాలని వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగా ఆ దేశంలో తలదాచుకుంటున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ మేరకు 2019 డిసెంబర్ 27న తొలి భేటీ, ఈ ఏడాది జనవరి తొలి వారంలో ఇస్లామాబాద్ వేదికగా రెండో భేటీ నిర్వహించారు. కశ్మీర్లో జాయింట్ ఆపరేషన్ ద్వారా విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా ఈ రెండు సమావేశాల్లో తీర్మానం చేశారు. ఇదంతా పాక్ ఆర్మీకి చెందిన కీలక అధికారుల సమక్షంలోనే జరింది. అయితే అప్పటికే పాకిస్తాన్ కుట్రలను పసిగట్టిన భారత నిఘా వర్గాలు ఆర్మీ సహకారంతో వారి చర్యను భగ్నం చేశారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు చాకచాక్యంగా వహరించారు. దీంతో కశ్మీర్కు పాక్ నుంచి పొంచిఉన్న పెను ముప్పు తప్పిందని ఇంటిలిజెన్స్ అధికారి వెల్లడించారు. కాగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ గత ఏడాది ఆగస్ట్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ను రెండుగా విభజించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్తాన్లోని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం బహిరంగంగానే తప్పుబట్టింది. కశ్మీరీలను హక్కులను హరించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని భారత్పై విషం కక్కింది. కశ్మీరీలకు అండగా తాము ఉంటామని ఇమ్రాన్ ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం సైతం గట్టిగానే బదులిచ్చింది. కశ్మీర్ భారత్లోని అంతర్భాగమని, తమ నిర్ణయాల్లో తలదూర్చొద్దని హెచ్చరించింది. అయితే పాక్ బుద్ధిని ముందే ఊహించిన కేంద్రం.. ఆర్మీ సహాయంతో కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలో తలెత్తకుండా కఠిన చర్యలను చేపట్టింది. కీలక నేతలందరినీ గృహ నిర్బంధం చేసి పరిస్థితులను చక్కదిద్దింది. లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు 144 సెక్షన్ విధించి అప్రమత్తంగా వ్యవహరించింది. -
తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!
శ్రీనగర్: పుల్వామా దాడితో భారత సైన్యంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు మరోసారి అలాంటి పథకాన్నే రచించారు. అయితే, భద్రతా బలగాల ఉమ్మడి సెర్చ్ ఆపరేష్తో వారి కుట్రలు భగ్నమయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో గడీకల్ ప్రాంతంలోని కెవారాలో హైవే పక్కన 52 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించామని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైవే పక్కన ఉన్న పండ్లతోటలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ ట్యాంక్లో ఈ మొత్తం బయటపడిందని తెలిపింది. పుల్వామా ఘటన జరిగిన ప్రాంతానికి 9 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉందని వెల్లడించింది. 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. ఆ ప్రాంతంలోనే మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. కాగా, 2019 ఫిబ్రవరి పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఉగ్రవాదులు 35 కిలోల ఆర్డీఎక్స్ను మరికొన్ని జలెటిన్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు వెల్లడైంది. పుల్వామా దాడి వెను జైషే చీష్ మసూద్ అజార్ ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఇక పుల్వామా దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్లోని బాలాకోట్పై వైమానిక దాడులు చేసి జైషే ఉగ్రవాద శిబిరాలను మారూపాల్లేండా చేసిన సంగతి తెలిసిందే. -
పాక్ ఇప్పటికి ఉగ్రవాదులకు స్వర్గధామమే
వాషింగ్టన్: నేటికి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు నిరంతరం మద్దతు ఇవ్వడమే కాక వారికి సురక్షితమైన స్వర్గంగా పనిచేస్తున్నదని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్, అఫ్గనిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై పాక్ ఇంకా నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేదు అని అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. ‘ప్రాంతీయంగా పుట్టుకొచ్చిన కొన్ని ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ సురక్షితమైన స్వర్గధామంగా కొనసాగుతోంది’ అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీయో ఆరోపించారు. తమ దేశంలో నివసిస్తున్నట్లు భావిస్తున్న ఉగ్రవాద నాయకులను విచారించడానికి పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఈ నివేదిక పేర్కొంది. 2008లో ముంబై దాడుల సూత్రధారి జైషే ఈ మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్, సాజిద్ మీర్ వంటి ఇతర ఉగ్రవాద నాయకులను విచారించడానికి పాకిస్తాన్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని నివేదిక పేర్కొన్నది. వీరిద్దరూ పాకిస్తాన్ రక్షణలో నివసిస్తున్నారని ప్రపంచం అంతా తెలుసు. కానీ అక్కడి ప్రభుత్వం ఈ వాదనలను తిరస్కరిస్తుంది అని తెలిపింది. ఉగ్రవాద గ్రూపులను అంతం చేయడంలో పాకిస్తాన్ ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కూడా పేర్కొంది. అయితే 2019 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలపై దాడి చేసిన తర్వాత పాక్ ఉగ్రవాద గ్రూపులకు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపివేయడానికి కొన్ని చర్యలు తీసుకున్న మాట వాస్తవం అని ఈ నివేదిక వెల్లడించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి పాకిస్తాన్ 2015లో జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. కానీ ఎలాంటి పురోగతి సాధించలేదు అని నివేదిక వెల్లడించింది. -
తీరు మారని పాక్.. అమెరికా ఫైర్!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ మనీల్యాండరింగ్ వ్యవహారాల గుట్టుమట్లను తేల్చే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గట్టి షాకిచ్చింది. లష్కర్-ఎ-తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు నిధులు చేకూరుతున్న మార్గాలను అన్వేషించడంలో విఫలమైనందుకుగానూ ‘గ్రేలిస్టు’లో కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా(కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ అధికారులు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ పాక్ తీరు మారకపోవడంతో అధ్యక్షుడు షియాంగ్మిన్ లియూ(చైనా) నేతృత్వంలోని బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (కశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి) పాకిస్తాన్పై అమెరికా ఆగ్రహం ఇదిలా ఉండగా.. లష్కర్, జైషే వంటి ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పిస్తూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ అమెరికా బుధవారం పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పాకిస్తాన్ కేంద్రంగా... ఆఫ్గనిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్న అఫ్గన్ తాలిబన్, భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడిన లష్కర్- ఎ- తొయిబా, దాని అనుబంధ సంస్థలు, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్, అతడి అనుచరులపై కేసులు నమోదు చేసినా చెప్పుకోతగ్గ స్థాయిలో చర్యలు తీసుకోలేదు’’ అని విమర్శించింది. అదే విధంగా ఆఫ్గనిస్తాన్లో నివసిస్తూ పాక్పై ఉగ్రచర్యలను ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ భారత పౌరుడిని ఉగ్రవాదిగా గుర్తించాలన్న పాకిస్తాన్ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ విషయంపై స్పందించిన పాక్ విదేశాంగ శాఖ అమెరికా తీరు తమను నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేసింది.(సిబ్బందిని 50% తగ్గించండి: పాక్కు భారత్ ఆదేశం) 2018 నుంచి గ్రే లిస్టులో.. భారత్లో ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే గతంలో నిషేధించిన దాయాది దేశం... నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్లిస్టు’లో పెట్టి తన విధానమేమిటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరికల నేపథ్యంలో... లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్-ఉద్- దావా(జేయూడీ), ఫతా-ఈ- ఇన్సానియత్(ఎఫ్ఏఐ)లను నిషేధిస్తామన్న పాక్.. వాటిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంటూ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్టులో కొనసాగుతున్న పాకిస్తాన్.. ఈ ఏడాది అక్టోబర్లో జరిగే సమావేశం నాటికి తన పంథాను మార్చుకోనట్లయితే ఇరాన్, ఉత్తర కొరియా మాదిరి.. ‘బ్లాక్ లిస్టు’లో చేరే అవకాశం ఉంది. కాగా మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నిరోధక నిబంధనలకు అనుగుణంగా లేదని భావించే దేశాల జాబితాలో ఎఫ్ఏటీఎఫ్ తమను చేర్చకుండా ఉండేందుకు పాకిస్తాన్ విఫలయత్నం చేస్తోంది. -
కశ్మీర్లో హై అలర్ట్
శ్రీనగర్: ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారనే సమాచారంతో కశ్మీర్లో భద్రతా బలగాలు సోమవారం హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. ‘భద్రతాబలగాలే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఉప్పందించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను చంపినందుకు ప్రతీకారంగా కారు బాంబు, లేక ఆత్మాహుతి దాడి జరిపేందుకు కుట్ర పన్నినట్లు మాకు తెలిసింది’ అని ఓ అధికారి తెలిపారు. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యమున్న 17వ రోజున గతంలో ఇక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు. -
బట్టబయలైన పాక్ కుట్ర... నిజాలు కక్కిన ఉగ్రవాది!
కాబూల్/న్యూఢిల్లీ: ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19ను కట్టడి చేసేందుకు మల్లగుల్లాలు పడుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇవేమీ పట్టకుండా మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఆరోగ్య సంక్షోభం తలెత్తిన వేళ ఉగ్ర దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నింది. ఆఫ్గనిస్తాన్- పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తాలిబన్ గ్రూపులను పునరుత్తేజపరిచి కశ్మీర్పై దాడికి వ్యూహాలు రచించింది. జైషే ఉగ్రవాదులతో కలిసి పనిచేయాల్సిందిగా తాలిబన్లను ఆదేశించిన దాయాది దేశం.. ఆఫ్గనిస్తాన్లో ఉన్న భారత ఆస్తులను ధ్వంసం చేసేలా కుట్ర పన్నింది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ఆఫ్గన్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఎత్తుగడను చిత్తు చేశాయి. (పాకిస్తాన్ తీరుపై మండిపడ్డ భారత ఆర్మీ చీఫ్) ఈ క్రమంలో జైషే, తాలిబన్ ఉగ్రవాదులపై కాల్పులు జరిపి.. 15 మందిని మట్టుబెట్టారు. వీరిలో ఏడుగురు జైషే సంస్థకు చెందిన వారు కాగా ఎనిమిది మంది తాలిబన్ గ్రూపునకు చెందినవారు. ఇక వీరిని హతమార్చిన అనంతరం భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అఫ్గన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఈ ఎన్కౌంటర్లో వీరి చేతికి చిక్కిన ఓ ఉగ్రవాది తమ ప్రణాళిక గురించి వారికి వివరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ‘‘ఏప్రిల్ 13- 14 అర్ధరాత్రి సమయంలో జైషే ఉగ్రవాదులు నంగర్హర్ ప్రావిన్స్లో చొరబడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురిని హతమార్చారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు’’అని ఆఫ్గాన్ మీడియా ఈ మేరకు కథనం వెలువరించింది. (అప్గనిస్తాన్: ఏడుగురు పౌరుల ఊచకోత!) ఇక ఈ విషయం గురించి భారత సైన్యానికి చెందిన అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని తాము ముందే ఊహించామన్నారు. ‘‘ఐఎస్ఐ పాత ఆట మళ్లీ మొదలుపెట్టింది. గతంలో అఫ్గన్ లోపలి నుంచే కుట్రలు పన్నేది. అయితే అమెరికాతో ఒప్పందం తర్వాత వారి పంథా మారినట్లు వెల్లడించింది. ఇదంతా కేవలం అమెరికన్లను ప్రసన్నం చేసుకునేందుకే.. కానీ వారి తీరు మారలేదు. అయితే ఆఫ్గన్ రక్షణ దళాలు వారి ఆట కట్టించేందుకు దృఢ సంకల్పంతో యుద్ధం చేయడం ఊహించని పరిణామం. ఏదేమైనా వాళ్లు గొప్ప పని చేశారు’’అని పేర్కొన్నారు. కాగా దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న పాక్ మరోసారి కుట్రలకు తెరతీసింది.(తాలిబన్ల విడుదలకు అధ్యక్షుడి ఆదేశాలు) -
పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రికూతుళ్లను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జమ్మూకశ్మీర్లోని లెత్పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, ఇన్షా తారిక్లు ఉన్నారు. సోమవారం రాత్రి వారి ఇళ్లపై సోదాలు జరిపిన అధికారులు మంగళవారం తెల్లవారుజామున అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేశారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు వీరు జైషే మొహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. అహ్మద్, ఇన్షా అరెస్ట్లతో ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది. గతవారం పుల్వామా ఉగ్రదాడికి సహకరించిన జైషే మొహ్మద్ సభ్యుడు షకీర్ బషీర్ మాగ్రేను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్కు షకీర్ వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. షకీర్ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకే అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్) -
‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడికి సంబంధించి ఒక కీలక నిందితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది. అతడిని పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ సభ్యుడిగా గుర్తించారు. పుల్వామాలోని కాకాపొరా ప్రాంతంలోని హజిబల్కు చెందిన షకీర్ బషీర్ మాగ్రే పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్కు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. బషీర్కు అక్కడ ఒక ఫర్నిచర్ షాప్ కూడా ఉంది. 2018లో పాకిస్తాన్ ఉగ్రవాది మొహ్మద్ ఉమర్ ఫారూఖ్ ద్వారా ధార్కు బషీర్ పరిచయం అయ్యాడు. ఆ తరువాత బషీర్.. జైషే మొహ్మద్ కోసం పూర్తి కాలం పనిచేశాడు. పలు సందర్భాలో ఆయుధాలు, పేలుడు సామగ్రిని ఉగ్రవాదుల కోసం సిద్ధం చేశాడని ఎన్ఐఏ తెలిపింది. -
ఉగ్రవాదంపై చర్యల్లో పాక్ విఫలం
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మనీలాండరింగ్ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించే ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలన్నీ పాక్ తుంగలో తొక్కిందని మండిపడింది. హఫీజ్ సయీద్తో పాటుగా ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ముద్ర వేసిన ఇతర ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయాన్ని నిరోధించడంలో పాక్ విఫలమైందని పేర్కొంది. పాక్ తీసుకుంటున్న ఉగ్రవాద నిరోధక చర్యలు 40లో 31 ఎఫ్ఏటీఎఫ్ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చింది. గత ఏడాదే ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్ను గ్రే లిస్ట్లో ఉంచింది. ఈ ఏడాది గ్రే లిస్ట్ నుంచి పాక్ను బ్లాక్ లిస్ట్కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు పారిస్లో ఈ నెల 13 నుంచి జరగనున్నాయి. మా విమానం తిరిగిచ్చేయండి! పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలి అమెరికా పర్యటన గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా పర్యటనకు ఇమ్రాన్ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్కు చెందిన ప్రైవేటు విమానంలో వెళ్లిన విషయం తెలిసిందే. తిరుగుప్రయాణంలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినందువల్ల ఇమ్రాన్, ఆయన బృందం వేరే విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. అయితే, సాంకేతిక లోపం వల్ల కాదు.. సౌదీ యువరాజుకు ఇమ్రాన్పై కోపం వచ్చి, తన విమానాన్ని వెనక్కు పంపించమని ఆదేశించినందువల్లనే ఇమ్రాన్ వేరే విమానంలో న్యూయార్క్ నుంచి పాకిస్తాన్కు తిరిగి వెళ్లారని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని ‘ది ఫ్రైడే టైమ్స్’ ఒక కథనంలో వెల్లడించింది. -
యాపిల్ ట్రక్లో పట్టుబడ్డ టెర్రరిస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానిత జైషే మహ్మద్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న యాపిల్ ట్రక్కులో ఉగ్రవాది తలదాచుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ము నుంచి ఢిల్లీకి వెళుతున్న ట్రక్కులో జైషే ఉగ్రవాది ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న అంబాలా పోలీసులు వ్యూహాత్మకంగా అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన జైషే ఉగ్రవాదిని అంబాలా పోలీసులు జమ్ము పోలీసులకు అప్పగించారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదికి పలు కేసులతో సంబంధం ఉంది. జమ్ము కశ్మీర్ పోలీసులతో పాటు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు అతడిని విచారించేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లో దాడులతో తెగబడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో భద్రతను ముమ్మరం చేయడంతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లు యత్నాలను భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. -
ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ప్రధాని మోదీ, అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లపై ఉగ్రవాదులు దాడికి వ్యూహం పన్నారన్న హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా దేశంలోని జమ్మూ, అమృత్సర్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నోలతో సహా 30 ప్రధాన నగరాలపై పేలుళ్లకు పథకం రచించినట్లు సమాచారం అందడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను హిట్ లిస్ట్లో చేర్చామంటూ పౌర విమానయాన భద్రతా విభాగానికి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పేరుతో లేఖ అందింది. సెప్టెంబర్ 10వ తేదీన పంపినట్లు ఉన్న ఈ లేఖలో ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడనున్నట్లు ఉగ్రసంస్థ పేర్కొంది. అలాగే ఎయిర్ బేస్ కేంద్రాలు ఉన్న శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, పఠాన్ కోట్, హిందన్లపై దాడులు చేస్తామని హెచ్చరికలతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని, అదీ ఎయిర్బేస్ కేంద్రంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. -
భారీ కుట్రకు పాక్ పన్నాగం.. మసూద్ విడుదల!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్పై ఉగ్రకుట్రకు పాల్పడేందుకు పాకిస్తాన్ వ్యూహాలు రచిస్తోంది. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హోదాకు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్ను భారీ దెబ్బతీయాలని ఆదేశం పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజాద్ను జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్, రాజస్తాన్, సియోల్కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది. భారత్పై ప్రతీకార చర్యలకు ఎప్పటి నుంచో కాలుదువ్వుతున్న పాక్.. అజార్ను విడుదల చేసి ప్రత్యేక వ్యూహాలు రచించినట్లు ఐబీ అనుమానం వ్యక్త చేస్తోంది. భారత్పై దాడికి పాల్పడేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్థేశం చేయడానికి రెండురోజుల క్రితం మసూద్ను రహస్యంగా విడుదల చేశారని ఐబీ పేర్కొంది. కాగా అజాద్ను అరెస్ట్ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలు పాక్పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ సమాజం ముందు నటిస్తూనే పాక్ ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. కశ్మీర్ అంశం అనంతరం రెండు దేశాల మధ్య వాతావరణం యుద్ధ రీతిలో మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. పాక్ మాటలకు భారత్ కూడా అదేరీతిలో ధీటైన సమాధానమే ఇచ్చింది. పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఓ అడుగుముందుకేసి కశ్మీర్కు తాము అండగా ఉంటామని, అవసరమైతే భారత్తో యుద్ధానికి కూడా సిద్ధంగా ఉంటామని గెంతులేశారు. భారత్పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరొందిన అజార్ను భారత్పై యుద్ధానికి ఉసిగొల్పేందుకు జైలు నుంచి విడుదల చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, రక్షణ సిబ్బంది సరిహద్దులో భద్రతను మరింత పెంచింది. బలగాలను అప్రమత్తం చేసింది. -
జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!
న్యూఢిల్లీ : పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో దోషిగా తేలిన ఉగ్రవాది బసీర్ అహ్మద్ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతను శ్రీనగర్ నుంచి వచ్చిన జైషే ఉగ్రసంస్థ సభ్యుడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటి కమిషనర్ (స్పెషల్ సెల్) సంజీవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో బసీర్ ఢిల్లీ పోలీసులపై కాల్పులు జరిపాడన్న ఆరోపణలపై అరెస్టయ్యాడు. అయితే, కింది కోర్టు నిర్దోషిగా తేల్చడంతో విడుదలై బయటికొచ్చాడు. ఈ తీర్పుపై పోలీస్శాఖ హైకోర్టును ఆశ్రయించగా అతన్ని దోషిగా తేల్చింది. కానీ, బసీర్ కోర్టులో లొంగిపోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో హైకోర్టు అతనిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పక్కా సమాచారంతో బసీర్ను, అతనితోపాటు ఉన్న ఫయాజ్, మాజిద్ బాబాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రదాడిని తిప్పికొట్టడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. ‘116వ బెటాలియన్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు ఇక్కడి కేపీ రోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా తమ వద్ద ఉన్న రైఫిళ్లతో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అలాగే వారి వాహనంపై గ్రెనేడ్లను విసిరారు. దీంతో జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా గాయపడిన మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలించాం’అని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ అధికారి అర్షద్ అహ్మద్ను చికిత్స కోసం శ్రీనగర్కు తరలించినట్లు చెప్పారు. ఈ ఉగ్రవాదులను జైషే మొహ్మద్ ఉగ్రవాద గ్రూపునకు చెందిన వారుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రూటు మార్చుకోనంటున్న పాక్
న్యూఢిల్లీ : ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే... పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. ఇప్పటికే భారత్ చేతిలో అనేకసార్లు దెబ్బ తిన్న పాక్.. తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత సైన్యాలు ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేయడం, ప్రపంచ వేదిక మీద పాక్ను ఒంటరి చేయడం వంటి చర్యలు ఎన్ని తీసుకున్నప్పటికి దాయాది దేశంలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు మరింత తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటికే 16 ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ‘పీఓకేలో 16 టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం అందింది. వేసవి ముగిసేలోపలే భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ క్యాంప్లకు చెందిన ఉగ్రవాదులు కొందరు ఎల్ఓసీ సమీపంలో పాడ్స్ను లాంచ్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. అయితే వారి చర్యలను చాలా నిశితంగా గమనిస్తున్నాం. ఏ మాత్రం అవకాశం చిక్కినా మరో సారి గట్టిగానే బుద్ధి చెప్తాం’ అన్నారు. జాకీర్ ముసాను చంపడం మూలానే ఇంత భారీ ఎత్తున ఉగ్ర చర్యలకు పాల్పడుతుండవచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం జైషే మహ్మద్ నాయకత్వం మొత్తం అంతరించి పోయిందని.. ఉన్న వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని అధికారులు తెలిపారు. భారత సైన్యం, ఇతర బలగాలు చేస్తున్న దాడులకు జడిసి.. కొత్త వారు ఎవరూ ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్ల్లో చేరేందుకు ముందుకు రావడం లేదన్నారు. -
‘పుల్వామా దాడితో మసూద్కు సంబంధం లేదంటేనే’
ఇస్లామాబాద్ : ఉగ్రవాది మసూద్ అజహర్ను బ్లాక్లిస్ట్లో పెట్టాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక కొన్ని రోజుల క్రితం బ్రిటన్ కూడా త్వరలోనే మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తామని.. పాక్లోని ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే పాత్ర లేదని భారత్ ఒప్పుకుంటేనే.. మసూద్ అజహర్ను బ్లాక్లిస్ట్లో పెట్టే అంశంపై చర్చిస్తామంటూ సదరు మంత్రి షరతులు విధించడం గమనార్హం. పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్రదాడిలో మసూద్ అజహర్ పాత్ర ఉన్నట్లు భారత్ దగ్గర ఏమైనా రుజువులున్నాయా. ఉంటే వాటిని ప్రపంచానికి చూపించాలి. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే.. లేవని ఒప్పుకోవాలి. భారత్ అలా చేస్తేనే మసూద్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే విషయం గురించి చర్చిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ‘పుల్వామా దాడి అనేది ప్రత్యేక అంశం. దీన్ని.. మసూద్ అజహర్కు ముడిపెట్టడం భావ్యం కాదు. కానీ ఈ విషయంలో భారత్ తీరు ఏం బాగోలేదు. కశ్మీర్లో దేశీయ తిరుగబాటును అణచివేయడానికి భారత్ చేసే ప్రయత్నాల్లో ఈ ప్రచారం ఓ భాగమే. దీని గురించి మేం ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేద’ని ఫైజల్ పేర్కొన్నాడు. ఓవైపు మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెస్తుండగా.. చైనా మాత్రం అందుకు అడ్డుతగులుతున్న సంగతి తెలిసిందే. -
జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్
శ్రీనగర్: ఉగ్రసంస్థ జైషే మహమ్మద్కు చెందిన ఇర్షాద్ అహ్మద్ రిషిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆదివారం అరెస్ట్ చేసింది 2017లో దక్షిణ కశ్మీర్ లెత్పోరాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ జరిగిన దాడితో ఇర్షాద్కు సంబంధం ఉన్నట్టుగా ఎన్ఐఏ అనుమానిస్తుంది. కాగా, ఈ దాడిలో ఐదుగురు అధికారులు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇర్షాద్ ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదో నిందితుడు. అతడు జైషే ఉగ్రసంస్థ అండర్ గ్రౌండ్ వర్కర్గా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జైషే కమాండర్ నూర్ మహమ్మద్కు సన్నిహితుడిగా ఉన్నారు. సీఆర్పీఎఫ్ క్యాంప్పై దాడి జరిపిన ఉగ్రవాదులకు ఇర్షాద్ ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. కాగా, నిందితున్ని సోమవారం జమ్మూలోని ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. -
‘పుల్వామా దాడి గురించి ముందే తెలుసు’
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని దేశం ఎన్నటికి మర్చిపోదు. ఈ దారుణ సంఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి గురించి తనకు ముందే తెలుసు అంటున్నాడు జైషే మహ్మద్ కమాండర్ నిసర్ అహ్మద్ తంత్రి. ఈ దాడికి సంబంధించి విచారణ నిమిత్తం నిసర్ను రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిసర్ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సూచనలతోనే ఈ దాడి జరిగిందని నిసర్ తెలిపాడు. ఈ దాడిలో ప్రధాన కుట్రదారైన ముదాసిర్ ఖాన్ దాడి చేయడానికి ముందు తనకు ఫోన్ చేశాడని.. త్వరలో తాము జరపబోయే బ్రహ్మాండమైన దాడిలో భాగం కావాల్సిందిగా తనను కోరాడని వెల్లడించాడు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సూచనల మేరకే ఈ దాడి చేయబోతున్నట్లు ముదాసిర్ తనకు చెప్పాడని నిసర్ పేర్కొన్నాడు. జైషే సంస్థకు చెందిన ఒక కమాండర్ పుల్వామా దాడిలో జైషే పాత్ర ఉన్నట్లు ధ్రువీకరించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ విషయంలో భారత్ ఇప్పటివరకూ ఇంటెలిజెన్స్ సమాచారంపై ఆధారపడుతూ వచ్చింది. అయితే ఈ విషయాల గురించి విచారణతో సంబంధం ఉన్న ఓ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. -
పాక్ ముసుగు తొలగించిన ముషార్రఫ్
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ వైఖరిని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ బహిర్గతం చేశారు. భారత్పై దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ను పాక్ ఇంటెలిజెన్స్ సర్వీస్ను వినియోగిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ నదిమ్ మాలిక్కు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్కూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అయినప్పటికీ.. తన పాలన కాలంలో దానిని భారత్పై దాడుల కోసం ఇంటెలిజెన్స్ వాడుతుండేదని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడుగా ఉన్న కాలంలోనే జైషే సంస్థ తనను రెండు సార్లు హత్య చేసేందుకు యత్నించిదని ఆరోపించారు. అయితే మీ పాలనలో ఉగ్ర సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ జర్నలిస్ట్ ముషార్రఫ్ను ప్రశ్నించారు. దీనికి ముషార్రఫ్ అప్పటి పరిస్థితులు చాలా భిన్నమైనవని.. ఆ కాలంలో భారత్, పాక్లు రహస్యంగా పోరాడేవని వ్యాఖ్యానించారు. ఇందుకోసం పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలు పనిచేసేవని పేర్కొన్నారు. ఉగ్ర నివారణ చర్యల్లో భాగంగా జైషే మహమ్మద్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. తాను కూడా అందుకోసం ఒత్తిడి తీసుకురాలేదని అన్నారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో పాటు భారత్లో జరిగిన చాలా ఉగ్ర దాడుల వెనుకు జైషే చీఫ్ మసూద్ అజార్ హస్తం ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఆ శవాలు చూపిస్తేనే మా ప్రతీకారం తీరినట్టు’
లక్నో : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్ స్థావరం బాలకోట్పై భారత వైమానిక దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారనే అంశంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. మెరుపు దాడుల్లో సుమారు 250 నుంచి 350 వరకు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అందుకు సాక్ష్యాలు చూపించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పుల్వామా ఉగ్రదాడి బాధిత కుటుంబాలు కూడా ఇదే తరహా డిమాండ్తో ముందుకు వస్తున్నాయి. తమ కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేసిన ఉగ్రవాదుల శవాలను చూస్తేనే తమకు శాంతి కలుగుతుందని పేర్కొంటున్నాయి. అప్పుడే ప్రతీకారం తీరినట్టు 40 మందికి పైగా జవాన్లను పొట్టబెట్టుకున్న జైషే ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రదీప్ కుమార్, రామ్ వకీలు అమరులయ్యారు. ఈ క్రమంలో రామ్ వకీల్ సోదరి రామ్ రక్షా మాట్లాడుతూ.. ‘ పుల్వామాలో ఒక్కో వ్యక్తి చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూశాం. ఇందుకు బాధ్యత వహించిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుందనే భావిస్తున్నాం. అయితే ఇందుకు తగిన ఆధారాలు కావాలి. తమ దేశంలో ఎటువంటి నష్టం కలగలేదని పాకిస్తాన్ చెబుతోంది. కాబట్టి ఆధారాలు చూపించే వరకు మేము దీనిని అంగీకరించలేము. ఉగ్రవాదుల శవాలు చూస్తేనే మాకు శాంతి కలుగుతుంది. అప్పుడే నా సోదరుడి మృతికి ప్రతీకారం తీరినట్టు అవుతుంది’ అని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇక ఈ విషయం గురించి ప్రదీప్ కుమార్ తల్లి మాట్లాడుతూ... ‘నా కొడుకు లాంటి ఎంతో మంది కొడుకులు కన్నుమూశారు. మెరుపు దాడులు చేశామన్న మాటలతో మాకు తృప్తి కలగడం లేదు. ఉగ్రవాదుల మృతదేహాలు చూసి తీరాల్సిందే. ప్రభుత్వమే ఆ పని చేయాలి’ అంటూ డిమాండ్ చేశారు. కాగా కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్రధాన స్థావరం బాలకోట్లో భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తువా ప్రావిన్స్లోని జైషే క్యాంపులపై సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థంతో ఐఏఎఫ్ విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో పన్నెండు మిరాజ్- 2000 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. -
దాడికి ముందు యాక్టివ్గా 300 మొబైల్ కనెక్షన్లు!!
న్యూఢిల్లీ : కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్రధాన స్థావరం బాలకోట్లో భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తువా ప్రావిన్స్లోని జైషే క్యాంపులపై సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థంతో ఐఏఎఫ్ విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో పన్నెండు మిరాజ్- 2000 యుద్ధ విమానాలు పాల్గొనగా... సుమారు 250 మంది 300 మంది ఉగ్రవాదులు మృతి చెందారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా ప్రభుత్వం హడావుడి మాత్రమేనని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్ఓ) వర్గాలు కీలక సమాచారం వెల్లడించాయి. మెరుపు దాడులు జరిగిన సమయంలో టార్గెట్ వద్ద 300 మొబైల్స్ యాక్టివ్గా ఉన్నాయని పేర్కొన్నాయి. జైషే క్యాంపులపై భారత జెట్ ఫైటర్లు దాడి చేస్తున్నాయనే సమాచారంతో బాలకోట్ వద్ద ఉన్న ఫోన్ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాడికి ముందు ఆ ప్రాంతంలో సిగ్నల్స్ ట్రేస్ చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో సర్జికల్ స్ట్రైక్స్లో 300 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారనే వార్తలకు బలం చేకూరినట్లైంది. కాగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన ఉగ్రదాడుల్లో ఎంత మంది హతమయ్యారనే విషయం గురించి ప్రభుత్వం ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. Sources: NTRO surveillance of JeM Balakot camp in days leading up to air strike by IAF confirmed around 300 active mobile connections in facility pic.twitter.com/uwyzd0qpHB — ANI (@ANI) March 4, 2019 -
ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు?
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నమాట వాస్తవమేనని మొట్టమొదటి సారిగా అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి, మసూద్ ప్రస్తుతం క్యాన్సర్తో బాధ పడుతున్నారని తెలిపారు. పాకిస్థాన్ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ను సోమవారం ఉదయం భావల్పూర్లోని జైషే మొహమ్మద్ శిబిరానికి తరలించినట్లు పాకిస్థాన్ మీడియా తెలియజేసింది. మసూద్ చనిపోయాడన్న, బతికున్నాడన్నా అదో పెద్ద వార్తగా నేడు ప్రపంచ మీడియా ప్రచారం చేస్తోంది? ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు? ఎలా మిలిటెంట్గా మారాడు? ఆయనకు పాకిస్థాన్కు ఉన్న అనుబంధం ఎలాంటిది? ఆయనకు మన దేశంలో జరగుతున్న ఉగ్ర దాడులకున్న సంబంధం ఏమిటీ? సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే, 1999, డిసెంబర్లో నేపాల్ రాజధాని కఠ్మాండు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ–814ను మసూద్ అజర్ అనుచరులు హైజాక్ చేసి కాందహార్కు తరలించారు. అందులోని 155 మంది ప్రయాణికులను బందీ చేసుకున్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న మసూద్ అజర్ను విడుదల చేస్తేనే బందీలను సురక్షితంగా విడుదల చేస్తామని హైజాకర్లు హెచ్చరించారు. అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వారి హెచ్చరికకు లొంగిపోవాల్సి వచ్చింది. హైజాకర్ల డిమాండ్ మేరకు మరో ఇద్దరు టెర్రరిస్ట్ నాయకులతోపాటు మసూద్ను అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ ప్రత్యేక విమానంలో కాందహార్కు తీసుకెళ్లి హైజాకర్లకు అప్పగించారు. మసూద్ అజర్ ప్రాముఖ్యత గురించి ఆ రోజే ప్రపంచానికి మొదటిసారి తెలిసి వచ్చింది. అంతకుముందు రెండు సార్లు మసూద్ జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన గురించి మొదటిసారి భారత్కు తెలిసి వచ్చింది. 1994లో పోర్చుగీసు పాస్పోర్టుపై బంగ్లాదేశ్ మీదుగా కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాకు వచ్చినప్పుడు మసూద్ అజర్ యాదృశ్చికంగా భారత సైనికులకు పట్టుబడ్డారు. అప్పటికే పేరుబడ్డ సజ్జద్ అఫ్ఘాని అనే టెర్రరిస్టుతో కలిసి ఆటోలో వెళుతుండగా తనిఖీలో సైనికులతో అఫ్ఘానితోపాటు మసూద్ను అరెస్ట్ చేశారు. స్కూల్ హెడ్మాస్టర్ కొడుకు భారత్లో పట్టుపడ్డప్పడు దాదాపు 30 ఏళ్లు ఉన్న మసూద్ అజర్ పాకిస్థాన్, పంజాబ్ రాష్ట్రంలోని భావల్పూర్లో పుట్టాడు. ఆయన తండ్రి ఓ స్కూల్ హెడ్మాస్టర్. 1980వ దశకంలో సోవియట్–అఫ్ఘానిస్థాన్ యుద్ధాలతో స్ఫూర్తి పొందిన మసూద్ అఫ్ఘానిస్థాన్ తరపున సోవియట్ దళాలపై మిలెటెంట్ పోరాటాలు జరిపాడు. ఆ తర్వాత 1990వ దశకంలో కశ్మీర్లో ప్రవేశించి మిలిటెంట్ కార్యకలాపాలు ప్రారంభించాడు. 1994లో యాధశ్చికంగా అరెస్ట్ అయ్యాడు. అప్పుడు హర్కతుల్ అన్సార్ అనే మిలిటెంట్ సంస్థకు అతను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 1999, డిసెంబర్లో విడుదలయ్యాక నేరుగా పాకిస్థాన్ వెళ్లాడు. కార్గిల్ యుద్ధంలో పరాజయం భారంతో ఉన్న పాకిస్థాన్ సైనికులు, ఐఎస్ఐ ఆయనకు ఆశ్రయం కల్పించింది. ఆ తర్వాత కొద్దికాలం అఫ్ఘాన్లో గడిపిన మసూద్ పాకిస్థాన్ తిరిగొచ్చి బాలకోట్లో జేషే మొహమ్మద్ సంస్థను ఏర్పాటు చేశాడు. 2000లో మళ్లీ కశ్మీర్లో ప్రవేశించిన భారత సైనికులకు వ్యతిరేకంగా అనేక మిలిటెంట్ దాడులు జరిపించాడు. పాక్ సైనిక, ఐఎస్ఐ అధికారులతో ఆయన కశ్మీర్లోని సులభంగా వచ్చి అంతకన్నా సులభంగా బాలకోట్ వెళ్లేవాడు. కశ్మీర్లోని షాపియన్, కుల్గామ్, అనంత్నాగ్, పుల్వామా ప్రాంతాల్లో స్థానిక మిలిటెంట్లను చేరదీసి మంచి పట్టు సాధించాడు. మసూద్కు వీవిఐపీ సెక్యూరిటీ 2000, జనవరిలో కరాచిలోని ఓ మసీదు నుంచి ముస్లిం ప్రజలనుద్దేశించి మసూద్ అజర్ ప్రసంగించాడు. ఈ విషయాన్ని ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ రుజువు చేయగా, దాన్ని పాక్ ఐఎస్ఐ ఖండించింది. మసూద్ జాడ తమకే తెలియడం లేదని బుకాయించింది. ఆ జర్నలిస్టు స్వయంగా వెళ్లి మసూద్ అజర్ కలసుకున్నారు. మసూద్కున్న సైనిక సెక్యూరిటీని చూసిన ఆ జర్నలిస్ట్, వీవీఐపీలకు కూడా ఉండనంత సెక్యూరిటీ ఉందంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మసూద్ అజర్ 1999లో భారత్ నుంచి విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత్కు వ్యతిరేకంగా 45 జైషే ఆత్మాహుతి దాడులు జరిపించాడు. వాటిలో పార్లమెంట్, ఎర్రకోట సైనిక శిబిరంపై జరిగిన దాడులు కూడా ఉన్నాయి. దాంతో ఆయన్ని ‘భారత ఒసామా బిన్ లాడెన్’గా భారత మీడియా అభివర్ణించింది. బాలకోట్లో స్థావరం బాలకోట్లో మసూద్ అజర్ టెర్రరిస్ట్ శిక్షణా శిబిరం ఉన్నట్లు 2006లో ఓ అమెరికన్ ‘టెర్రరిస్ట్ ఎక్స్పర్ట్’ కాలిఫోర్నియా కోర్టుకు తెలిపారు. ఆయన అందుకు సాక్ష్యాలు 2001 నుంచి 2004 మధ్య శాటిలైట్ రికార్డు చేసిన ఛాయా చిత్రాలను చూపించారు. ఎప్పటిలాగా అప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వం ఆ వార్తను ఖండించింది. ఆ తర్వాత పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పర్వేజ్ ముషార్రఫ్నే హత్య చేయడానికి జైషే ఉగ్రవాదులు ప్రయత్నించడం, ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్లు తీవ్రమవడంతో తప్పనిసరై 2008 నుంచి పాన్ సైన్యం జైషే చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 2014లో మళ్లీ ప్రత్యక్షం పాక్ సైనిక చర్యలతో అజ్ఞాతంలోకి వెళ్లిన మసూద్ 2014లో హఠాత్తుగా పాకిస్థాన్లో ప్రజల మధ్య మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. 2016లో పఠాన్కోట్లోని భారత వైమానిక స్థావరంపై జైషే ఆత్మాహతి దాడికి పాల్పడడంతో మసూద్పై కఠిన చర్యలకు భారత ప్రభుత్వం, పాక్ను డిమాండ్ చేసింది. తాత్కాలికంగా మసూద్ను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం రాచ మర్యాదలు చేసి విడిచిపెట్టింది. పఠాన్కోట్ నుంచి పుల్వామా ఉగ్ర దాడి వరకు జరిగిన అనేక ఉగ్ర దాడులతో మసూద్ అజర్కు ప్రత్యక్ష సంబంధం ఉంది. -
బుద్ధి చూపించుకున్న పాక్.. సరికొత్త నాటకాలు!!
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్ సహా అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన పాకిస్తాన్ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే నిషేధించిన దాయాది దేశం... నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్లిస్టు’లో పెట్టి తన విధానమేమిటో స్పష్టం చేసింది. లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్-ఉద్- దావా(జేయూడీ), ఫతా-ఈ- ఇన్సానియత్(ఎఫ్ఏఐ)లను నిషేధిస్తామన్న పాక్.. వాటిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం నిషేధిత ఉగ్ర సంస్థల జాబితాలో వాటికి చోటు కల్పించలేదు. అప్పుడలా..ఇప్పుడేమో ఇలా.. ఉగ్రవాద నిరోధక చట్టం-1997లోని షెడ్యూల్-I ప్రకారం 68 సంస్థలను నిషేధించిన పాకిస్తాన్.. జేయూడీ, ఎఫ్ఏఐలను మాత్రం షెడ్యూల్-IIలోని అండర్ వాచ్ జాబితాలో పెట్టింది. అయితే ఫిబ్రవరి 21న విడుదల చేసిన జాబితాలో ఈ రెండు సంస్థలను నిషేధిస్తున్నట్లుగా పాక్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో చర్చించిన జాతీయ భద్రతా కమిటీ సూచనల మేరకు జేయూడీ, ఎఫ్ఏఐలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. కానీ తాజా జాబితాలో మాత్రం వాటిని అండర్ వాచ్ లిస్టులో ఉంచడం గమనార్హం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్- ఉగ్రవాదులకు డబ్బు చేకూరే మార్గాలను పరిశీలించే సంస్థ)లో తమకు ఉన్న ‘గ్రేలిస్టు’ హోదాను తొలగించుకునేందుకు మొదట ఈ రెండు సంస్థలను నిషేధించినట్లుగా పాక్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన జాబితాతో తన బుద్ధి మారదని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో... ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ నిజ స్వరూపం మరోసారి బయటపడిందని, ఎఫ్ఏటీఎఫ్ను మోసం చేసేందుకు పాక్ ప్రభుత్వ వర్గాలు ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కశ్మీర్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న లష్కర్-ఏ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ 1990లో ఎఫ్ఏఐను, 2002లో జేయూడీని స్థాపించాడు. ఎఫ్ఏఐ చారిటీ సంస్థగా కొనసాగుతుండగా.. జేయూడీ లష్కర్కు అనుసంధానంగా రాజకీయ పార్టీ ముసుగులో పనిచేస్తోంది. ఇక 2001లో భారత పార్లమెంట్పై దాడి, 2006లో ముంబై పేలుళ్లు, 26/11 ముంబై ఘటన వంటి పలు ఉగ్రదాడులకు లష్కర్ పాల్పడిన సంగతి తెలిసిందే. -
‘మెరుపు దాడులకు రాజకీయ మరక’
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర సంస్థ జైషే మహ్మద్పై భారత వైమానిక దాడులను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఆరోపించారు. మెరుపు దాడుల్లో 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మన యుద్ధవిమానాలు నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించాయని, అయితే ఎంతమంది దాడుల్లో మరణించారని ఇప్పుడే వెల్లడించడం తొందరపాటు అవుతుందని వాయుసేన పేర్కొంది. వాయుసేన వివరణను ప్రస్తావిస్తూ అమిత్ షా ప్రకటనను మనీష్ తివారీ తప్పుపట్టారు. అమిత్ షా వ్యాఖ్యలు మెరుపుదాడులను రాజకీయం చేయడం కాదా అని ఆయన నిలదీశారు. వాయుసేన ప్రకటనకు భిన్నంగా 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పడం రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టడమేనని అన్నారు. మరోవైపు బాలాకోట్లో ఉగ్రవాదుల మరణంపై ఎలాంటి ఆధారాలు లేవని విదేశీ మీడియా కథనాలు ప్రచురించిందని మరో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా పీఓకేలో భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని పాలక బీజేపీ శ్రేణులే ప్రచారంలో పెట్టాయని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. బాధ్యతకలిగిన పౌరుడిగా, ప్రభుత్వం వెల్లడించే సమాచారాన్ని తాను విశ్వసిస్తానని,అయితే ప్రపంచాన్ని మనం నమ్మించాలంటే విపక్షాలను నిందించడం మానేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలని హితవు పలుకుతూ చిదంబరం ట్వీట్ చేశారు. -
సర్జికల్ స్ట్రైక్స్పై మసూద్ సోదరుడి ఆడియో..!
న్యూఢిల్లీ : భారత సర్జికల్ దాడులతో ఎలాంటి నష్టం జరుగలేదని పాకిస్తాన్ చెప్తున్న మాటలు తప్పని రుజువయ్యాయి. తమపై ఐఏఎఫ్ మెరుపుదాడులు చేసింది నిజమేనని జైషే చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు మౌలానా అమర్ వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన మరుసటి రోజున జైషే సీనియర్లతో జరిగిన సమావేశంలో అమర్ మాట్లాడినట్టు ఓ ఆడియో షోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ‘బాలాకోట్లోని జైషే క్యాంపులపై వైమానిక దాడులు జరిగింది నిజమే. అయితే, మార్కజ్ (జిహాద్ బోధనా కేంద్రం)పై మాత్రమే దాడులు జరిగాయి. భారత్ చెప్తున్నట్టు జైషే కీలక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు. మా భూభాగంలోకి వచ్చి మరీ జిహాద్ బోధనా కేంద్రంపై భారత్ దాడులకు దిగడం తీవ్ర వేదనకు గురిచేసింది. దీంతో ప్రతీకారానికి భారత్ మంచి అవకాశం ఇచ్చింది. మాపై దాడి చేసి యుద్ధానికి కాలు దువ్వింది’ అని వ్యాఖ్యానించాడు. (మసూద్కు సైనిక ఆస్పత్రిలో చికిత్స) భారీ స్థాయిలో మృతులు.. కశ్మీర్ను రక్షించుకునేందుకు జిహాద్ శిక్షణ పొందుతున్న వారిపై ఐఏఎఫ్ బాంబులతో విరుచుకుపడిందని అమర్ తెలిపారు. తద్వారా కశ్మీర్లోని ముస్లింలకు భారత్ మరింత కోపం తెప్పించిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మిరాజ్ జెట్ ఫైటర్స్ దాడుల్లో ‘జబా టాప్’ అనే కొండ ప్రాంతంలో చాలా మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి. అక్కడ పడి ఉన్న దాదాపు 30 శవాలను తరలించేందుకు అంబులెన్సులు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. ఉగ్రవాద శిక్షణనిస్తున్న మాజీ ఐఎస్ఐ అధికారి, కల్నల్ సలీం కూడా ఈ దాడుల్లో మరణించినట్టు సమాచారం. (సరిహద్దుకు అటూ.. ఇటూ..) -
మరో ‘పుల్వామా’ తప్పింది!
శ్రీనగర్: పుల్వామాలో ఫిబ్రవరి 14న సీర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డ జైషే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ 40 మంది జవాన్లను బలికొన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఆత్మాహుతి దాడి చేసేందుకు ఓ ఉగ్రవాది సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన రకీబ్ అహ్మద్ భద్రతాబలగాలపై ఆత్మాహుతి దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. కానీ కుల్గామ్లోని తురిగామ్లో 24న జరిగిన ఎన్కౌంటర్లో రకీబ్ సహా ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ‘మీరు ఈ వీడియోను చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను’ అని రకీబ్ మాట్లాడిన వీడియో శనివారం సోషల్మీడియాలో షేరింగ్ అవుతోంది. ఏ రకంగా ఆత్మాహుతిదాడి చేయబోతున్నానో వీడియోలో రకీబ్ చెప్పాడు. ఆదిల్ దార్, రకీబ్లకు సంబంధించిన వీడియోల మధ్య సారూప్యత ఉందన్నారు. భారత్ కాల్పుల్లో నలుగురు దుర్మరణం ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు చనిపోయారని పాకిస్తాన్ ఆర్మీ ఆరోపించింది. నైకాల్ సెక్టార్లో పాక్ ఆర్మీ పోస్టులు లక్ష్యంగా భారత బలగాలు కాల్పులు జరిపాయని తెలిపింది. -
రాయని డైరీ; మసూద్ అజార్ (జైషే చీఫ్)
‘‘అజార్ భయ్యా.. మీకోసం ఇద్దరు వచ్చారు’’ అని చెప్పాడు ఇంట్లో పనికుర్రాడు. ‘‘ఆ ఇద్దరూ ఎవరో తెలుసుకుని, వారిలో ఎవరితోనైతే నాకు అవసరం లేదో వారిని కాకుండా, ఎవరికి నా అవసరం ఉందో వారిని ముందుగా నా గదిలోకి పంపించు’’ అని చెప్పాను. ‘‘భయ్యాజీ, ఆ ఇద్దరిలో ఒకరు మీకు చిరపరిచితులైన షా మెహమూద్ ఖురేషీ. ఈ దేశ విదేశాంగ మంత్రి. ఇంకొకరు ఒక అపరిచిత వ్యక్తి. ఆయన మెడకు స్టెతస్కోప్ ఉంది. ఆయన చేతిలో బీపీ మిషన్ ఉంది’’ అన్నాడు. ‘‘వాళ్లిద్దరిలో ఎవర్ని ముందుగా లోపలికి పంపుతావో నువ్వే నిర్ణయించుకుని పంపు’’ అన్నాను. వెంటనే షా మెహమూద్ ఖురేషీని పంపాడు పనికుర్రాడు! ‘‘అజార్జీ.. ఎందుకో రమ్మన్నారట’’ అన్నారు ఖురేషీ.. లోపలికి వస్తూనే. ‘‘మీతో అవసరం ఉండి మిమ్మల్ని పిలిపించుకోలేదు ఖురేషీ. మీకు నా అవసరం ఉండి మిమ్మల్ని పిలిపించుకున్నాను’’ అన్నాను. ‘‘చెప్పండి అజార్జీ..’’ అన్నాడు! ‘‘మా పనికుర్రాడికి ఉన్నంత ఇంగితం కూడా లేకపోయింది ఈ దేశపు విదేశాంగ మంత్రికి’’ అన్నాను.. అతడి వైపు చూడకుండా. ‘‘వారెవ్వా అజార్జీ.. నేనివాళ మీ పనికుర్రాడి ఇంగితం గురించి వినవలసిందే. వినడమే కాదు, అతడి నుంచి నేను నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే.. మీ ఆదేశాలు లేకనే, నాకై నేనుగా అతడి వద్ద నేర్చుకోడానికి రోజూ ఒక సమయానికి వచ్చి ఇక్కడ కూర్చోగలను’’ అన్నాడు. తల పట్టుకున్నాను. ‘‘ఆశ్చర్యపోతున్నాను ఖురేషీ. నా మాటల్లోని అంతరార్థాన్ని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు! ఒక పనికుర్రాడికి ఇంగితం ఉండడం కన్నా, ఒక దేశ విదేశాంగ మంత్రికి ఇంగితం లేకపోవడం ఆలోచించవలసిన విషయం కదా. అలాంటప్పుడు మీరు చేయవలసింది పనికుర్రాడి ఇంగితమేమిటో తెలుసుకోడానికి ఉత్సాహం ప్రదర్శించడం కాదు. ‘విదేశాంగ మంత్రికి ఇంగితం లేదు’ అన్న మాటకు ముఖం కందగడ్డలా మార్చుకోవడం. అది కదా మీరు తక్షణం చేయవలసింది!.. చెప్పండి..’’ అన్నాను. ‘‘మార్చుకుంటాను అజార్జీ.. మీరు కనుక నాక్కొంత సమయం ఇవ్వగలిగితే’’ అన్నాడు. నా గదిలోని చీమ కూడా అంతటి విధేయతను ప్రదర్శించదు! రోషం వస్తే జైషే చీఫ్ అని కూడా చూడకుండా నన్ను కుట్టేస్తుంది. ‘‘బాగున్నవాడి గురించి బాగోలేకుండా పడి ఉన్నాడని చెప్పడం ఏమన్నా బాగుందా ఖురేషీ! ఒక ఉగ్రవాది ఒంట్లో బాగోలేకుండా మంచం మీద పడుకుని ఉన్నాడంటే మాతృదేశానికి ఎంత అప్రతిష్ఠ! శతృదేశానికి ఎంత అపహాస్యం. జైషే హెడ్డుకి చికెన్గున్యా అని తెలిస్తే పిల్లలక్కూడా నవ్వొచ్చేస్తుంది’’ అన్నాను. ‘‘ఇంత ఆలోచించలేదు అజార్జీ..’’ అన్నాడు.. ‘‘మా పనికుర్రాడు తెలుసుకోగలిగాడు ఖురేషీ, నాకు ఏనాటికీ డాక్టర్ అవసరం ఉండబోదని. మీకే తెలియలేదు. వెళ్లండి’’ అన్నాను. పనికుర్రాడిని లోపలికి పిలిచాను. వచ్చాడు. ‘‘బయట అపరిచిత వ్యక్తి ఉన్నాడన్నావ్ కదా. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఖురేషీని చూపించు’’ అని చెప్పాను. ఏం ప్రభుత్వాలో! ‘మా దగ్గర లేడు’ అని చెప్తే పోయేదానికి, ‘ఉన్నాడు కానీ, ఒంట్లో బాగోలేదు’ అని చెప్పిస్తాయా! ప్రభుత్వాలు తెలివిగా లేకనే ఉగ్రవాదులు తెలివిగా ఉండి ప్రభుత్వాల్ని కాపాడుకోవలసి వస్తోంది. -మాధవ్ శింగరాజు -
అసలు టార్గెట్ బహావల్పూరా?
పాకిస్తాన్ను స్థావరంగా చేసుకుని భారత్లో విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్,లష్కరే తొయిబాల ప్రధాన కేంద్రాలపై మొదట దాడి చేయాలని భారత్ భావించింది. బాలాకోట్ కంటే ముందు ఈ రెండు సంస్థలకు బహావల్పూర్, మురీదకే పట్టణాల్లో ఉన్న కార్యాలయాలపై దాడి చేసి నేలమట్టం చేయాలని తొలుత అనుకున్నారు. అయితే, ఈ రెండు సంస్థల కార్యాలయాలు బాగా కిక్కిరిసిన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఉండటంతో భారత్ తన ఆలోచన మార్చుకుంది. దాడి చేస్తే జననష్టం అధికంగా ఉంటుంది, తద్వారా అంతర్జాతీయ సమాజం వేలెత్తి చూపే అవకాశం ఉండడంతో జనావాసాలకు దూరంగా ఉన్న బాలాకోట్ను భారత ప్రభుత్వం ఎంచుకుంది. అంతేకాకుండా బహావల్పూర్, మురీదకే పట్టణాలపై దాడి చేసి తిరిగి వచ్చేందుకు వైమానిక దళానికి అంత సురక్షితం కాదన్న ఆలోచన కూడా నిర్ణయం మారడానికి కారణమైంది. కన్ఫ్యూజ్ చేసి ఖతం చేశారు.. బాలాకోట్ పట్టణానికి సమీపంలోని జైషే మహ్మద్ శిక్షణ శిబిరాలపై దాడుల సమయంలో భారత వైమానిక దళం చాకచక్యంగా వ్యవహరించింది. భారత యుద్ధవిమానాలు ఎటు వెళ్తున్నాయో తెలుసుకునే వీల్లేకుండా వైమానిక యూనిట్లు వివిధ మార్గాల్లో వెళ్లడంతో పాక్ సైన్యం వెంటనే స్పందించలేకపోయింది. జైషే ప్రధాన కేంద్రం ఉన్న బహావల్పూర్ వైపు ఒక యూనిట్, లష్కరే తొయిబా కేంద్రం ఉన్న మురీదకే వైపు మరో యూనిట్ వెళ్లడంతో పాక్ వైమానిక దళాలు లాహోర్–సియాల్కోట్ సెక్టర్, ఓకడా–బహావల్పూర్ సెక్టర్లకు పరిమితమైపోయాయి. పాక్ వైమానిక దళాన్ని తప్పుదోవ పట్టించడంలో సఫలమయ్యారు. భారత వాయుసేన ప్రధాన యూనిట్ మాత్రం కేరన్–అతాముఖమ్ సరిహద్దు గుండా పాకిస్తాన్లో ప్రవేశించి బాలాకోట్పై దాడిచేశాయి. ఎక్కువ సంఖ్యలో యుద్ధవిమానాలు ఈ మూడో యూనిట్లోనే ఉన్నాయి. పాక్ వైమానిక దళం విషయం అర్థం చేసుకుని తేరుకునేలోపే ఈ మూడో యూనిట్ పని ముగించుకుని సురక్షితంగా వచ్చేసింది. ప్రధానితో ఉన్నతాధికారుల భేటీ న్యూఢిల్లీ: పాక్ యుద్ధ విమానాలు భారత గగనతల ఉల్లంఘన కు పాల్పడిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్తో పాటు నిఘా, త్రివిధ దళాల ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో భేటీఅయ్యారు. బాలాకోట్ స్థావ రంపై ఐఏఎఫ్ దాడి అనంతరం నెలకొన్న పరిస్థితిని ఆయనకు వివరించారు. మిగ్–21 ఫైటర్జెట్ను పాక్ నేలకూల్చిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించడంపై కూడా చర్చించారు. షోపియాన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతాబలగాలు జరిపిన ఎన్కౌంటర్ లో జైషే మహ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని మీమెందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్ర తా బలగాలు బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారని.. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారని అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు షోపియన్ ప్రాంతానికి చెందిన సుహైల్ నజీర్ కాగా, మరొకరిని పాక్ పౌరుడిగా గుర్తించారు. పాక్ అండతోనే జైషే ‘పుల్వామా దాడి’ వూజెన్(చైనా): జైషే మహ్మద్ను పాకిస్తాన్ వెనకేసుకురావడంతోనే పుల్వామా ఉగ్రదాడి సాధ్యమైందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. భారత్, రష్యా, చైనా విదేశాంగ మంత్రుల సమావేశం కోసం సుష్మా బుధవారం చైనాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. భేటీలో పుల్వామా ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తారు. భారత్ తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో చైనాకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ప్రధాన స్థావరంగా, పాక్ ప్రోత్సాహంతోనే జైషే మహ్మద్ ఈ దాడికి పాల్పడిందని వివరించారు. దాడిని ఐరాస సభ్యదేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తగిన సమయమని సుష్మా అన్నారు. గతేడాది మోదీతో భేటీ.. ద్వైపాక్షిక బంధాన్ని మరింత దృఢం చేసిందని వాంగ్ యీ చెప్పారు. పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టారిలా.. బుధవారం ఉదయం 9.58 గంటలకు మూడు పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొరబడ్డాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అందులో జేఎఫ్–17, ఎఫ్–16 లాంటి శక్తిమంతమైన విమానాలు ఉన్నాయి. క్రిష్ణగాటి, నంగి తేక్రిలోని ఆర్మీ స్థావరాలు, నారియన్లోని ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ విమానాలు దాడులకు దిగాయి. అవి జారవిడిచిన బాంబులు జనావాసాలకు దూరంగా పడటంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే స్పందించిన భారత వైమానిక దళం ప్రతీకార దాడులు ప్రారంభించింది. మిగ్–21, ఇతర యుద్ధ విమానాలతో ప్రత్యర్థికి దీటైన జవాబిచ్చింది. నౌషెరా, రాజౌరీలలోని కీలక స్థావరాలకు నష్టం కలగకుండా నిరోధించగలిగింది. మిగ్–21 బైసన్ విమానం కుప్పకూలే ముందు గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులతో పాకిస్తాన్ విమానం ఎఫ్–16ను నేలకూల్చింది. మన విమానాన్ని పాకిస్తాన్ విమానమే పేల్చి వేసిందా? లేదా క్షిపణితో దాడి చేశారా? అన్నది తెలియరాలేదు. ఉదయం 10.45 గంటలకు మిషన్ ముగిశాక అభినందన్ తప్ప మిగిలిన సిబ్బంది క్షేమంగా తిరిగొచ్చారు. -
ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్
ఢిల్లీ : ఉత్తర్ప్రదేశ్లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులిద్దరు జమ్ముకాశ్మీర్లోని కుల్గాంకు చెందిన షహనవాజ్ అహ్మద్, పుల్వామాకు చెందిన అక్విబ్ అహ్మద్గా గుర్తించారు. యూపీ డీజీపీ ఓపీ సింగ్ వివరాలను వెల్లడించారు. జమ్ముకాశ్మీర్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు యూపీ పోలీసులు తెలిపారు. -
‘పుల్వామా కంటే పెద్ద ఉగ్రదాడి జరగొచ్చు’
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని మరువక ముందే అందుకు బాధ్యత వహించిన... జైషే మహ్మద్ సంస్థ మరిన్ని ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తమకు సమాచారం అందిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్లో భారత భద్రతా బలగాల వాహనాలపై దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి. చౌకీబాల్ నుంచి తంగ్ధార్ వెళ్లే మార్గాల్లో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇందుకోసం తాంజీమ్ అనే ఇస్లామీ సంస్థ ఐఈడీతో నిండిన ఓ గ్రీన్ స్కార్పియోను సిద్ధం చేసిందని వెల్లడించాయి. కశ్మీరీ యువకులతో నిరసనలు చేయిస్తూ.. వారి సహకారంతో వాస్తవాధీన రేఖ దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే 5 నుంచి 6 మంది ఉగ్రవాదులు కశ్మీర్లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి.(లొంగిపోవడం కంటే కూడా చావడానికి సిద్ధం..) 500 కిలోల బ్లాస్ట్కు సిద్ధంగా ఉండండి.. జైషే మహ్మద్కు చెందిన ఓ సోషల్ మీడియా గ్రూపు మెసేజ్లను ఇంటెలిజిన్స్ వర్గాలు డీకోడ్ చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.... ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వారం కేవలం 200 కిలోల ఐఈడీ మాత్రమే ఉపయోగించాం. 500 కిలోల భారీ బ్లాస్ట్కు సిద్ధంగా ఉండండి. కశ్మీరీలపై సైన్యం ఎటువంటి చర్యలకు పాల్పడ్డా.. భద్రతా బలగాలపై మరిన్ని దాడులు జరుగుతాయి. ఇది కేవలం మనకు.. సైన్యానికి జరుగుతున్న యుద్ధం. రండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి’ అని జైషే.. భారత ఆర్మీని హెచ్చరించింది. ఇక భద్రతా వైఫల్యం కారణంగానే పుల్వామా దాడి జరిగిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సైనికులు ప్రయాణిస్తున్న సమయంలో పౌరుల వాహనాలను అనుమతించడంతో పుల్వామా దాడి సాధ్యమైందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో దాడికి జైషే సిద్ధమవుతోందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(‘లొంగిపోండి.. లేదంటే అంతం చేస్తాం’) కాగా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ ఆదిల్... సీఆర్పీఎఫ్ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం.. కశ్మీర్లో తిరిగే ప్రతీ ఉగ్రవాదిని అంతం చేస్తామని ఆర్మీ అధికారులు మీడియా ముఖంగా హెచ్చరించారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న కశ్మీరీ యువత లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.(పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం!) -
పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన ట్రంప్
వాషింగ్టన్: పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. జైషే మహమ్మద్ జరిపిన ఈ ఆత్మహుతి దాడిని భయంకరమైనదిగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై తనకు రిపోర్ట్లు వస్తున్నాయని తెలిపిన ట్రంప్.. త్వరలో ఓ ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంగళవారం వైట్హౌస్ ఓవల్ ఆఫీస్లో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పుల్వామా ఉగ్రదాడి విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై చాలా నివేదికలు కూడా వచ్చినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై సరైన సమయంలో తాము మాట్లాడతామని తెలిపారు. దక్షిణ ఆసియా దేశాలైన భారత్, పాక్లు కలిసి ఉంటే అద్భుతంగా ఉంటుందన్నారు. ఈ ఘటనను ఇప్పటికే ఖండించిన అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో తాము భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. జవాన్ల మృతిపై కేవలం తాము సంతాపం తెలుపడమే కాకుండా భారత్కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు సహాకరించి.. కారకులపైన కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన పాకిస్తాన్ను కోరారు. ఈ ఘటన జరిగిన అనంతరం తాము పాక్తో మాట్లాడినట్టు వెల్లడించారు. -
‘కశ్మీర్ నుంచి ప్రాణాలతో తిరిగి వెళ్లరు’
శ్రీనగర్ : కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు వెంటనే లొంగిపోవాలని, లేదంటే చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ప్రతీ ఒక్కరిని అంతం చేస్తామని ఆర్మీ అధికారి కన్వాల్ జీత్సింగ్ థిల్లాన్ హెచ్చరించారు. పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ను ఆనవాలు కశ్మీర్ లోయలో కనిపించకుండా చేస్తామని పేర్కొన్నారు. పుల్వామా దాడి వెనుక జైషే మహ్మద్ హస్తం ఉందని స్పష్టమైందని, దీనికి పాక్ సహకారం ఉందని వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సోమవారం నాటి ఎన్కౌంటర్లో దాడి కీలక సూత్రధారి, జైషే మహ్మద్ టాప్ కమాండర్ రషీద్ ఘాజీని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.(పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం!) ఈ క్రమంలో ఆర్మీ అధికారులు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఎన్కౌంటర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా... 40 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి బాధ్యులను 100 గంటల్లోనే అంతం చేశామని పేర్కొన్నారు. ‘ ఉగ్ర సంస్థలో ఉన్న, చేరాలనుకున్న ఎవరైనా సరే లొంగిపోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా. తుపాకీ వదిలేయమని కుటుంబ సభ్యులైనా వారికి సూచిస్తే మంచింది. అలా జరగని పక్షంలో వారిని కోల్పోవాల్సి ఉంటుంది. కశ్మీర్ నుంచి వారిని పూర్తిగా తొలగిస్తాం. మీరకుంటున్నట్లుగా లొంగిపోయే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. లేదంటే అంతం చేయడానికి మేము సిద్ధం’ అంటూ థిల్లాన్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణాలతో తిరిగి వెళ్లరు.. పుల్వామా దాడికి ప్రణాళిక పాకిస్తాన్లోనే జరిగిందని కశ్మీర్ ఐజీ ఎస్పీ పంత్ తెలిపారు. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే తమ లక్ష్యమని... కశ్మీర్లో అడుగుపెట్టిన ఉగ్రవాదులు ప్రాణాలతో తిరిగి వెళ్లరని హెచ్చరించారు. పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదులు కనిపించగానే కాల్చి పారేస్తామని స్పష్టం చేశారు. -
ఉగ్రవాది ఆదిల్కు శిక్షణ ఇచ్చింది అతడే!
అప్పటి దాకా సహచరులతో చర్చిస్తూ, కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడుతూ సాఫీగా సాగిపోతున్న భారత సైనికుల ప్రయాణంలో ఒక్కసారిగా మృత్యుఘోష. జవాన్ల కాన్వాయ్ని ఢీకొట్టి యావత్ భారతావనికి తీరని శోకం మిగిల్చాడు కరుడు గట్టిన ఉగ్రవాది, జైషే కమాండర్ ఆదిల్ అలియాస్ వకాస్. తనను తాను పేల్చుకుని మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జవాన్లను పొట్టనబెట్టుకోవడానికి ముందే తన ఆశయం నెరవేరిన వెంటనే స్వర్గంలో ఉంటానంటూ ఆదిల్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆత్మాహుతికి ముందు అతడు ఎంతగా శిక్షణ పొందాడో అర్థమవుతోంది. (మాట ఇస్తున్నా.. ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రతీకారం : మోదీ) పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్ అదృశ్యమయ్యాడు. ఇక ఆనాటి నుంచి జైషే కమాండర్గా మారిన ఆదిల్ ప్రస్తుతం ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. అయితే తనకు అప్పగించిన ఆపరేషన్ను ఆదిల్ పక్కాగా అమలు చేయడానికి జైషే మహ్మద్ టాప్ కమాండర్ ఘాజీ అబ్దుల్ రషీద్ ఇచ్చిన శిక్షణే కారణమని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. (ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) ఐఈడీ ఎక్స్పర్ట్ ఘాజీ.. జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్కు ఘాజీ అత్యంత నమ్మకస్తుడు. ఆఫ్గనిస్తాన్లోని తాలిబన్ గ్రూపులో శిక్షణ పొందిన ఈ 32 ఏళ్ల ఉగ్రవాది.. 2008లో జైషేలో చేరాడు. అనతి కాలంలోనే మసూద్కు అత్యంత సన్నిహితుడిగా మారిన ఘాజీ.. ఐఈడీ తయారు చేయడం, అమర్చడం, పేల్చడంలో నిపుణుడు. 2010 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషేలో యువకులను చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం పుల్వామా జిల్లాలో జైషే చీఫ్ మసూద్ మేనల్లుళ్లు తాలా రషీద్ (2017), ఉస్మాన్ (2018)లను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ క్రమంలో వారి మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా భావించిన మసూద్ ఘాజీని రంగంలోకి దింపినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారత్కు చేరుకున్న ఘాజీ దక్షిణ కశ్మీర్పై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. తీవ్రవాద భావాలున్న యువకులను ఆకర్షించి... జైషేను బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆదిల్ వంటి ఎంతోమంది యువకులను అతడు జైషేలో చేర్చుకుని శిక్షణనిచ్చినట్టు సమాచారం. ఎక్కడైతే తన మేనల్లుళ్లను అంతం చేశారో .. అదే జిల్లాలో జవాన్లే లక్ష్యంగా దాడికి సిద్ధం చేయాలంటూ మసూద్ ఇటీవలే ఘాజీకి సూచించిన క్రమంలో ఆదిల్ ద్వారా గురువారం నాటి హింసరచన సాగించినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఇటీవల పుల్వామాలోని రతన్పోరాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఘాజీ తృటిలో తప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా సరే భరత జాతికి ఆగ్రహం తెప్పించిన మసూద్, ఘాజీ వంటి వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు.. భారత్ సరైన సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్న విషయం జగమెరిగిన సత్యం. -
వారు చితక్కొట్టడంతోనే నా కొడుకు ఉగ్రవాదయ్యాడు
శ్రీనగర్ : మూడేళ్ల క్రితం భారత బలగాలు తన కొడుకును చితక్కొట్టడంతోనే మిలిటెంట్ గ్రూప్లో చేరాడని సూసైడర్ బాంబర్, ఆదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు తెలిపారు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆదిల్ ఆత్మహుతికి దాడికి తెగబడి 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదిల్ ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకొని జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిపై దుండగుడు ఆదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు రాయిటర్స్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకున్న బాధే తమకు ఉందని ఆదిల్ అహ్మద్ దార్ తండ్రి గులామ్ అహ్మద్ దార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2016లో తన కొడుకు అతని స్నేహితులు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా.. భారత సైనికులు అడ్డుకొని చితక్కొట్టారని, ఈ ఘటనతోనే ఆదిల్ ఉగ్రవాద గ్రూప్ల పట్ల ఆకర్షితుడయ్యాడని తెలిపాడు. అప్పటి నుంచి భారత సైనికులపై కోపం పెంచుకున్నాడని అతని తల్లి ఫహమీదా పేర్కొంది. ఇక తన కొడుకు ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదని, ఈ దాడి వ్యూహం తమకు తెలియదన్నారు. గతేడాది మార్చి 19 నుంచి ఆదిల్.. పని చేసే చోటు నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి జాడలేడన్నారు. అతని జాడ కోసం మూడు నెలలుగా ప్రయత్నించి ఆశ చాలించుకున్నామన్నారు. తన కొడుకు మరణానికి దేశంలోని రాజకీయనాయకులే కారణమని, కశ్మీర్ సమస్యపై తేల్చకుండా నాన్చుతున్నారని గులామ్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ అంశం తేలే వరకు.. తమలాంటి పేదల పిల్లలు, భారత జవాన్ల ప్రాణాలు పోతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) -
‘సిద్ధూని తీసేయకపోతే చూడం’
చండీగఢ్ : ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రజలు భగ్గుమన్నారు. సోషల్ మీడియా వేదికగా సిద్ధుపై దుమ్మెత్తిపోస్తున్నారు. 43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై సిద్దూ స్పందిస్తూ.. ‘కొంతమంది కోసం మీరు దేశం మొత్తాన్ని నిందిస్తారా? హింసను ఎప్పుడూ ఖండించాల్సిందే. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించాల్సిందే. పాకిస్తాన్తో.. భారత్ చర్చలు జరిపినపుడు మాత్రమే ఇటువంటి ఘటనలు పునరావృతమవ్వవు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పాక్కు వత్తాసుగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో సోని టీవీలో ప్రసారమయ్యే ‘ది కపిల్ శర్మ షోను నిషేదించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈ షో నుంచి సిద్ధూనన్న తీసేయాలని పట్టుబడుతున్నారు. ఈ షోను చూడకపోతే.. రద్దవుతోందని, ఇది అమరజవాన్లకు నిజమైన నివాళని పిలుపునిస్తున్నారు. సిద్ధూకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని కూడా కామెంట్ చేస్తున్నారు. ‘దేశ రక్షణ కోసం 40 మంది ప్రాణ త్యాగం చేస్తే.. సిగ్గులేకుండా పరాయి దేశానికి వత్తాసు పలుకుతావా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత జవాన్లపై ఏ మాత్రం గౌరవం ఉన్న సోనీ టీవీ వెంటనే కపిల్ శర్మ షో నుంచి సిద్ధుని తీసేయాలని సూచిస్తున్నారు. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో సిద్ధు తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారకంగా పాకిస్తాన్పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్ స్ట్రైక్ 2 జరపాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల విషయంలో భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్చనిస్తున్నట్లు ప్రకటించారు. @SonyTV @KapilSharmaK9 We request you to expel @sherryontopp from The Kapil Sharma Show & show courtesy to nation where you earn revenue. Removing him would be great tribute to our martyrs of Pulwama,else we would boycott this show henceforth "Kapil Sharma" — Hitesh Vyas (@vyashit) February 15, 2019 We all must boycott Kapil Sharma show as long as Sidhu is there. — Rajendra Saluja (@RajendraSaluja) February 15, 2019 Throw Out Sidhu From The Kapil Sharma Show Or Els We #Boycott The Kapil Sharma Show..!!@SonyTV @KapilSharmaK9 — Soumya Roy (@SamRoy_) February 15, 2019 -
పాకిస్తాన్తో చర్చించాల్సిందే : సిద్ధు
చండీగఢ్ : ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్తో.. భారత్ చర్చలు జరిపినపుడు మాత్రమే ఇటువంటి ఘటనలు జరగవని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో వివాదానికి దారి తీసిన సిద్ధు.. తన తాజా వ్యాఖ్యలతో మరోసారి తీవ్ర విమర్శల పాలవుతున్నారు.(ఉగ్ర మారణహోమం) సిగ్గుచేటు.. సిద్ధు వ్యాఖ్యలపై స్పందించిన రిటైర్డు మేజర్ జనరల్ జీవీ భక్షి మాట్లాడుతూ..‘ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. దేశ భద్రత కోసం యూనిఫాం ధరించిన సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదుర్కొనే సమస్యల గురించి ఆయన అవగాహన లేనట్లుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.(ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం : రాహుల్ గాంధీ) కాగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఇది నివాళులు అర్పించాల్సిన సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే చర్చకు తావు లేదు అని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో సిద్ధు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ప్రభుత్వానికి అండగా ఉంటాం : రాహుల్
న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు తాను, తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన పట్ల విచారం చేసిన రాహుల్.. రానున్న రెండు రోజుల పాటు ఇతర రాజకీయ చర్చలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం అంతిమ లక్ష్యం దేశాన్ని విభజించడమేనని పేర్కొన్నారు. అందుకే వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదులు ఎంతగా ప్రయత్నించినా ఒక్క సెకను పాటు కూడా హిందుస్థాన్ ప్రజలను వేరుచేయలేరన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఒకేతాటిపై నిలవాలని, అపుడే మన ఐక్యత గురించి వారి తెలుస్తుందని పేర్కొన్నారు. వేరే చర్చకు తావు లేదు.. ‘ ఇది నివాళులు అర్పించాల్సిన సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే చర్చకు తావు లేదు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఉక్కుపాదం మోపాలి.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా పుల్వామా ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదం పట్ల ఉక్కుపాదం మోపాలని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. -
కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం కుదరకే..
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పాకిస్తాన్ నిరాశలో మునిగిపోయిందని, కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం వీలు కాకపోవడం వల్లే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దారుణానికి తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ చెత్తగా వాగుతోంది. ఉగ్రవాదులు నిర్భయంగా ర్యాలీలు చేసుకునేందుకు అనుమతినిస్తూ, మేమైనా చేయగలమనే అహంకారంతో భారత్ను బహిరంగంగానే హెచ్చరించాలని చూస్తోంది’ అని వ్యాఖ్యానించారు. తాను ఈరోజు అమర జవానుల సంస్మరణ సభకు హాజరవుతున్నానని తెలిపారు. తనతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్రాథ్ సింగ్ కూడా కశ్మీర్ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతా, ఇంటలెజిన్స్ వర్గాలతో భేటీ అయి, ఘటనకు గల కారణాల గురించి చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. J&K Governor Satya Pal Malik to ANI: I will be leaving for the wreath laying ceremony of the martyrs in Kashmir. HM Rajnath Singh is also coming. We will hold a review meeting with top security and intelligence officials. We will find out where the lapses occurred. (File pic) pic.twitter.com/aUMOiYoq6K — ANI (@ANI) February 15, 2019 J&K Governor Satya Pal Malik to ANI: Pakistan is frustrated, after successful elections they could not recruit new terrorists, stone pelting has stopped, so it wanted to do something. We have alerted all installations and cantonments as Pakistan may do something else. (File pic) pic.twitter.com/gBEQCyB8sv — ANI (@ANI) February 15, 2019 -
ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్కు సంబంధించిన చివరి వీడియోను జైషే మొహమ్మద్ సంస్థ విడుదల చేసింది. వెనుక జైషే జెండాతో పాటు చేతిలో తుపాకీ పట్టుకున్న ఆదిల్ ఆ వీడియోలో మాట్లాడుతూ..‘ఈ వీడియోను మీరు చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను. నేను ఏడాది కాలం పాటు జైషే మొహమ్మద్లో పనిచేశాను. కశ్మీర్ ప్రజలకు నేను ఇచ్చే చివరి సందేశం ఇదే. దక్షిణ కశ్మీర్ చాలాకాలంగా భారత్కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉత్తర, సెంట్రల్ కశ్మీర్తో పాటు జమ్మూ ప్రజలు ఈ పోరాటంలో చేరాల్సిన సమయం ఆసన్నమైంది. మా కమాండర్లలో కొందరిని చంపేయడం ద్వారా మమ్మల్ని ఎన్నటికీ బలహీనపర్చలేరు’అని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా 2001లో ఐసీఏ18 విమానం హైజాక్, నగ్రోటా, ఉడీ, పఠాన్కోట్ ఉగ్రదాడుల్ని ప్రస్తుతించాడు. పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్ అదృశ్యమయ్యాడు. -
దేశంలోకి జైషే ఉగ్రవాదులు.. హై అలర్ట్!
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దాదాపు 12మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లోకి చొరబడ్డారని, పిర్ పంచాల్ పర్వత శ్రేణుల మీదుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వీరు ఈ నెలలోనే జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించారని నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జమ్మూకశ్మీర్, దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒకేసారి 12 మందికిపైగా ఉగ్రవాదులు దేశంలోకి రావడం ఆందోళన రేపుతోంది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్, ఢిల్లీలో దాడులు జరిగే అవకాశముందని ఐబీ హెచ్చరికలు జారీచేసింది. 12మంది ఉగ్రవాదులు ప్రస్తుతం మూడు గ్రూపులుగా విడిపోయి.. ప్రతి గ్రూపులో నలుగురు చొప్పున ఉన్నారని, దక్షిణ కశ్మీర్లోని ట్రాల్, షోపియన్, పుల్వామా జిల్లాల్లో వీరు యాక్టివ్గా సంచరిస్తున్నారని భదత్రా సంస్థలకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. దక్షిణ కశ్మీర్లో గతవారం రోజుల్లోనే దాదాపు 12 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడులను చాలావరకు భద్రతా దళాలు తిప్పికొట్టాయి. -
జైషే టాప్ కమాండర్ హతం
సాక్షి, శ్రీనగర్: జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ ముఫ్తీ వకాస్ హతమయ్యాడు. జమ్మూకశ్మీర్లోని సంజువాన్ ఆర్మీ క్యాంపుపై దాడికి ప్రధాన సూత్రధారి అయిన వకాస్ను భారత ఆర్మీ, కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా మట్టుపెట్టాయి. కశ్మీర్లోని అవంతీపూర్లో ఉగ్రకదలికలు ఉన్నట్లు గుర్తించిన 50 రాష్ట్రీయ రైఫిల్స్ బృందాలు, భారత ఆర్మీ, స్థానిక పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. హతివారాలో జరిపిన ఎన్కౌంటర్లో సంజువాన్ ఆర్మీ క్యాంపు దాడి ప్రధాన నిందితుడు ముఫ్తీ వకాస్ హతమయ్యాడని శ్రీనగర్ ఆర్మీ క్యాంపు అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా మీడియాకు వివరించారు. ఓ ఏకే 47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నామని, ఈ ఆపరేషన్లో పౌరులెవరికీ ఎలాంటి హానీ జరగలేదన్నారు. నూర్ మహమ్మద్ అనంతరం జైషే ఉగ్రసంస్థకు వకాస్ ప్రధాన కమాండర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత నెలలో జమ్మూ నగర శివార్లలోని సంజువాన్ ఆర్మీక్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
ప్లాన్ చేసి పాక్ నుంచి జూన్లోనే చొరబడ్డారు..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లోని మిలిటరీ క్యాంపుపై దాడికి పాల్పడిన ముగ్గురు తీవ్రవాదుల గురించి భారత ఆర్మీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. వారు గత జూన్ (2017) నెలలోనే పాక్ భూభాగం నుంచి భారత్లోని జమ్ముకశ్మీర్లోకి చొరబడినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా దాడి చేయడంకోసం జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో గడిచిన ఏడు నెలల్లో తల దాచుకుంటూ గడిపారని వివరాలు సేకరించారు. ఈ నెల (ఫిబ్రవరి) 10న జైషే ఈ మహ్మద్(జేఈఎం) ఉగ్రవాదులు ముగ్గురు భారీ మొత్తంలో ఆయుధాలతో వచ్చి సుంజువాన్ మిలిటరీ క్యాంపుపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు జవాన్లు, ఒక పౌరుడు చనిపోగా బలగాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించి విచారణ చేపట్టిన అధికారులకు దాడి కుట్ర పాక్ నుంచే జరిగిందని మరోసారి స్పష్టమైంది. -
‘సంజువాన్’ దాడిలో ఆరుగురి మృతి
సంజువాన్: జమ్మూ నగర శివార్లలోని సంజువాన్లో ఆర్మీ కుటుంబాలు నివసించే గృహసముదాయంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. క్వార్టర్స్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు మిగిలిఉన్నారేమోనన్న అనుమానంతో సైన్యం సోదాలు కొనసాగిస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారని అధికారులు శనివారం చెప్పగా.. తాజా సమాచారం ప్రకారం ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారని వెల్లడించారు. ఓ మేజర్ సహా 10 మంది గాయపడ్డారని ఆదివారం చెప్పారు. చనిపోయిన వారిలో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ (జేసీవో) ఉన్నారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు శనివారం ఆర్మీ క్వార్టర్స్లోకి సైనిక దుస్తుల్లో ప్రవేశించి దాడి చేయడం తెలిసిందే. మరో నాలుగు మృతదేహాలు లభ్యం ఇప్పటికి మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను సిబ్బంది మట్టుబెట్టగా శనివారం రాత్రి నుంచి ఎలాంటి కాల్పులూ జరగలేదనీ, అయినా ఇంకా ఎక్కడైనా ముష్కరులు దాగి ఉండొచ్చనే అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. తొలుత ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతదేహాలు లభించగా, క్వార్టర్స్ను శుభ్రం చేస్తుండగా మరో ముగ్గురు సిబ్బంది, ఒక పౌరుడి మృతదేహం కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ ఆరుగురూ శనివారం తెల్లవారుజామునే చనిపోయారన్నారు. సుబేదార్ మదన్ లాల్ చౌదరి, సుబేదార్ మహ్మద్ అష్రఫ్ మిర్, హవిల్దార్ హబీబ్ ఉల్లా ఖురేషీ, నాయక్ మంజూర్ అహ్మద్, లాన్స్ నాయక్ ఇక్బాల్తోపాటు ఇక్బాల్ తండ్రి కూడా మరణించారనీ చెప్పారు. మదన్ లాల్ తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఒట్టి చేతులతోనే ఉగ్రవాదులతో పోరాడాడనీ, ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు చొచ్చుకుపోయినా కుటుంబ సభ్యులను కాపాడుకోగలిగాడన్నారు. గాయపడిన వారిలో ఓ మహిళ గర్భవతి కాగా, వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీ బిడ్డలను కాపాడగలిగారు. క్వార్టర్స్పై బాంబులు క్వార్టర్స్ నుంచి ఇప్పటికే ఆర్మీ కుటుంబాలను ఖాళీ చేయించిన ఇళ్లపై ఆర్మీ మోర్టారు బాంబులను వేసింది. ఇంకా ఉగ్రవాదులు ఎవరైనా దాక్కొని ఉంటే వారినీ హతమార్చేందుకే ఈ చర్యకు పూనుకుంది. దీంతో ఆర్మీ క్వార్టర్స్కు మంటలంటుకున్నాయి. మరోవైపు ఈ దాడి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనేనన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. విచారణ కూడా ప్రారంభం కాకుండానే తమపై ఆరోపణలు చేయడం భారత మీడియాకు, అధికారులకు అలవాటైపోయిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. -
ఆరుగురు జైషే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్మూ,కశ్మీర్లో భారత భద్రతా దళాలకు మరో భారీ విజయం లభించింది యురి సెక్టార్లో భద్రతా బలగాలు - ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను... భద్రతా దళాలు మధ్యలోనే అడ్డుకుని మట్టుబెట్టాయి. జమ్మూ,కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, పారా మిలటరీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో ముందుగా ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. అనంతరం తనిఖీలు నిర్వహించగా మరో ఉగ్రవాది.. జవాన్లపై కాల్పులు జరపడంతో ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో మరో ఉగ్రవాది మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్...భద్రతా దళాలను అభినందించారు. -
మసూద్, అతడి సోదరుడు సూత్రధారులు!
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ జైష్-ఈ-అహ్మద్ హస్తం ముందని గుర్తించినట్టు తెలుస్తోంది. జైష్-ఈ-అహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్, అతడి సోదరుడు, మరో ఇద్దరు దాడికి సూత్రధారులుగా గుర్తించామని పాకిస్థాన్ కు భారత్ తెలిపినట్టు సమాచారం. పఠాన్ కోట్ దాడి వెనుకున్న కుట్రదారులను చట్టపరంగా శిక్షించేందుకు పాకిస్థాన్ వెంటనే చర్యలు చేపట్టాలని పాకిస్థాన్ భారత్ కోరుతోంది. ఈనెల 15న ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. మరోవైపు దర్యాప్తులో సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి హామీయిచ్చిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.