Karumuri Venkata Nageswara Rao
-
‘పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ పోరాటం ఆగదు’
తణుకు(ప.గో. జిల్లా): తేతలిలో పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కారుమూరి.. పశువధ కర్మాగారం మూయించటానికి తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.రోజుకి నాలుగు వందల పశువులను వధించటానికి ఇలాంటి పరిశ్రమ ఇరవై ఎకరాల్లో ఉండాలని, కానీ కేవలం మూడెకరాల్లో జనావాసాల మధ్య నడుపుతుంటే ఎందుకు అడ్డకోరని ప్రశ్నించారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి కొంతమందికి తొత్తులా వ్యవహరిస్తున్నాడని కారుమూరి మండిపడ్డారు. అసలు అనుమతులు లేని ఫ్యాకరీకి పోలీసులు ఎలా కాపలా కాస్తారని ప్రశ్నించారు.‘పంచాయితీ తీర్మానం లేదు.. నో అబ్జక్షన్ సర్టిఫికేట్ లేదు అయినా అధికారులు ఎందుకు ముందుకు రారు..?, పచ్చటి తణుకును వాయు కాలుష్యం నీరు కాలుష్యం కమ్మేస్తుంటే అధికారులకు పట్టదా ....?, అక్కడ ప్రజలు ముక్కులు బద్దలయ్యే వాసనతో రోదిస్తుంటే 144 సెక్షన్ పెట్టి పోలీస్లను పెట్టి వారి నోళ్లు నొక్కేస్తారా....?, గోస్థానం నుండి పుట్టిన గొస్తానీ నదిని గోవు రక్తంతో కలుషితం చేస్తారా?, శాంతియుతంగా ప్రజలు దీక్ష చేస్తుంటే పోలీస్లు గూండాల వ్యవహరించి టెంట్లు పీకేస్తారా?, ఎక్కడో యూపీ మనిషికి కొమ్ము కాస్తారా?, ఇక్కడ లక్షల మంది ప్రజల గోడు పట్టదా? అని నిలదీశారు.తణుకు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. రానున్న రోజుల్లో పోరాటానికి సిద్ధం కావాలి. ఇది మంచిది కాదు.. ఇలాంటింటి ప్రకృతి విరుద్ధమైన పరిశ్రమ ఇక్కడ ఉండకూడదు. పశువులను తరలిస్తునప్న వాహనాన్ని ఒక్క పోలీస్ కూడా ఆపి చెక్ చేయడం లేదు. పాలు ఇవ్వని ఒట్టిపోయిన పశువుగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్లు లేకుండా పాడి పశువుల్ని వధిస్తుంటే కళ్లప్పగించి చూస్తారా?, నా హయాంలో ఒక్క పశువుని కూడా వధించకుండా కాపాడుకున్నాను. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేకు అంత దమ్ము లేదు.. అతనికి డబ్బే ముఖ్యం. ప్రజలు సమస్యలు పట్టవు.. ప్రజలు ఏమైపోయినా పర్లేదు’ అని కారుమూరి ధ్వజమెత్తారు. -
పశువధకు ఎమ్మెల్యే రాధాకృష్ణే సూత్రధారి
తణుకు అర్బన్: తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పశువధ కర్మాగారం నుంచి అందిన డబ్బుకు దాసోహం కావడంతోనే మండలంలోని తేతలిలో లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ అక్రమంగా పశువధ నిర్వహిస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డబ్బుకు లొంగిపోయిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఓట్లేసి గెలిపించిన మహిళలను రోడ్డుపై కూర్చోబెట్టి వారి జీవనాన్ని హరించారని విమర్శించారు. 2014 నుంచి 2019 లోపు ఫ్యాక్టరీ నిర్మా ణానికి అనుమతులు, సివిల్ పనులు, సాంకేతిక సామర్థ్యాన్ని ఏర్పాటుచేసుకున్నామని, కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీ ద్వారా వ్యాపారాన్ని పెంచాలని, తద్వారా రెవెన్యూ వస్తుందని, ఉపాధి పెరుగుతుందని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్టు ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ప్రకటించారని విమర్శించారు. ఇళ్లలో ఉండలేకపోతున్నామని, పిల్లలు అనారోగ్యాల పాలవుతున్నామంటూ మహిళలు ఆవేదన చెందుతున్నా ఎమ్మెల్యేకు పట్టడం లేదన్నారు. పంచాయతీ అనుమతి లేకుండా ఏ గ్రామంలో కూడా ప్రైవేటు ఫ్యాక్టరీలు నడిచే వ్యవస్థ లేదని చట్టాలు చెబుతున్నా కనీసం ఆ జ్ఞానం కూడా ఎమ్మెల్యేకు లేకపోవడం శోచనీయమని అన్నారు. ఆరు నెలల్లోనే మీ నిజ స్వరూపం ప్రజలకు అర్థమయ్యిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా పశువధ జరిగిందని తప్పుడు పత్రాలు పుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, కర్మాగారంలో ఎప్పుడు వధ జరిగిందో కరెంటు బిల్లులే నిదర్శనమని, జీఎస్టీ బిల్లులు కూడా తమ వద్ద ఉన్నాయని కారుమూరి అన్నారు. నాకు దమ్ము, ధైర్యం ఉన్నాయి కాబట్టే గతంలో ఫ్యాక్టరీని మూయించానని, మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పుడు మాయించాలని ఆరిమిల్లికి సవాల్ విసిరారు. చంద్రబాబు కుయుక్తులతో గద్దెనెక్కారని, ఎమ్మెల్యే ఆరిమిల్లి ధోరణి కూడా అలానే ఉందని కారుమూరి అన్నారు. ఆనాడు నాకు ఫ్యాక్టరీలో వాటా ఉందని అబద్దాలు వండివార్చారని, ఇప్పుడు తాను అడుగుతున్నా ఫ్యాక్టరీలో మీకు, మీ కుమారుడికి వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తణుకు నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఆర్కే ట్యాక్స్ చెల్సించాల్సిదేనని ప్రజలు అంటున్నారని కారుమూరి విమర్శించారు.పోరాటం ఆగదుతేతలి గ్రామస్తుల కోసం అఖిలపక్షం, వివిధ సంఘాల తరఫున రానున్న రోజుల్లో పశువధపై ఉద్యమం చేయనున్నామని కారుమూరి అన్నారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా పోరాటం ఆగదన్నారు.అనుమతులు సక్రమంగా లేవులాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చూపిస్తున్న అనుమతులన్నీ అక్రమమని గోసేవా సమితి సభ్యుడు కొండ్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ అండతో అధికారులు చట్టాన్ని మీరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తణుకు తహసీల్దార్, రూరల్ సీఐ వ్యవహారం కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు. తాము చేపట్టిన నిరసన శిబిరం టెంట్లు తొలగించడంతో పాటు సామగ్రిని స్వాధీ నం చేసుకోవడం చట్టవ్యతిరేకమన్నారు. ఇందుకు సహకరించిన అధికారులపై కేసులు పెట్టనున్నట్టు చెప్పారు. బాధిత మహిళలు మాట్లాడుతూ పరిశ్రమ వద్ద గత ఐదేళ్లలో ఎప్పుడూ దుర్వాసన రాలేదని, రెండు నెలలుగా దుర్వాసన రావడంతో ఆందోళనలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సెక్రటరీ ఆర్గనైజేషన్ యిండుగపల్లి బలరామకృష్ణ, గోసేవా సమితి సభ్యుడు జల్లూరి జగదీష్, పార్టీ నాయకులు వి.సీతారాం, మెహర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఛార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్తారంటూ మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల మోతతో ప్రజలపై రూ.15వేల కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలంటూ ఆయన ప్రశ్నించారు. పేదవాడిని లక్షాధికారి చేస్తానని ఇప్పుడు చేస్తున్నదేంటీ? ఇలా బాదుడు బాధితే లక్షాధికారి భిక్షాధికారి అవుతాడంటూ ఆయన వ్యాఖ్యానించారు.విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: వరుదు కళ్యాణివిశాఖ: చంద్రబాబు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. కొండనాలిక మందేస్తే ఉన్న ఉన్న నాలుక ఊడినట్లు ప్రజల పరిస్థితి తయారైందన్నారు. ‘‘విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకొం. ప్రజల తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం దుర్మార్గం’’ వరుదు కళ్యాణి మండిపడ్డారు.సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు కరెంట్ చార్జీల పేరుతో రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపారని ధ్వజమెత్తారు.ప్రజలపై భారం: ఎస్వీ మోహన్రెడ్డితాజాగా రూ. 9 వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపి ఇంట్లో కరెంటు స్వీచ్ వేయాలంటే భయపడేవిధంగా చేస్తున్నారన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా విద్యుత్ చార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం వేశారు. సెకి పేరుతో విద్యుత్ ఒప్పందంలో ఏదో జరిగిందని మాజీ సీఎం వైఎస్ జగన్పై ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో తక్కువ ధరకే విద్యుత్ ఒప్పందం కుదిరింది’’ అని ఎస్వీ మోహన్రెడ్డి చెప్పారు. -
కూటమి ప్రభుత్వంలో రైతుల బాధ వర్ణణాతీతం
-
బాబు హయాంలో నిత్యావసరాల ధరలకు రెక్కలు: కారుమూరి
-
రైతులకు 20 వేలు ఎక్కడ చంద్రబాబు.. టీడీపీపై కారుమూరి ఫైర్
-
చంద్రబాబుది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ బాదుడు: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి చందాలపైనే ఆధారపడ్డారంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి చందాలు.. అన్నా క్యాంటీన్లకు చందాలు.. చివరికి వరదల్లో కూడా చందాలే అంటూ ఆయన ఎద్దేవా చేశారు.విజయవాడ వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. వరదల్లో కేవలం ఆకలితో అలమటించి 30 మందిపైగా మరణించారన్నారు. రాష్ట్రమంతటా కూడా చిన్నపిల్లలను కూడా వదలకుండా వందల కోట్లు చందాలు వసూలు చేశారు. చందాలు, కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.‘‘వరద బాధితుల సాయంలో కూడా పెద్ద ఎత్తున దోచుకొంటున్నారు. మా ప్రభుత్వం హాయాంలో టీడీపీ వాళ్లు బాదుడే బాదుడు అంటూ ఇళ్ల చుట్టూ తిరిగారు. ఇప్పుడు కూటమి సర్కార్ సామాన్యుడు నడ్డి విరిగేలా నిత్యావసరాల ధరలు పెంచటాన్ని ఏమనాలి?. చంద్రబాబుది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ బాదుడు అనుకుంటున్నారు. కూరగాయలు ఆకాశాన్నంటాయి. గత ప్రభుత్వంలో ఏమైనా ధరలు పెరిగితే రైతు బజార్లు ద్వారా సబ్సిడీకి అందించేవాళ్లం. గతంలో మేము ఇసుకను ప్రభుత్వానికి ఆదాయం కల్పించి సామాన్యులు కొనేలా అందించాం.. కానీ ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపారు’’ అని కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది : వైఎస్ జగన్ -
క్షమించరాని తప్పు ఆర్.కృష్ణయ్య రాజీనామాపై కారుమూరి రియాక్షన్
-
బేరసారాలకు ఆర్ కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం:కారుమూరి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేతలను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై బుధవారం కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. ‘‘బీసీలకు వైఎస్ జగన్ ఎంతో మేలు చేశారు. రాజ్యాధికారం దక్కాలని వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారు. కృష్ణయ్య ద్వారా బీసీలకు మంచి జరుగుతుందని జగన్ అనుకున్నారు. కానీ, ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి బాబు బేరసారాలకు కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. .. బీసీలను కృష్ణయ్య మోసం చేశారు. ఈ ద్రోహంతో ఆర్ కృష్ణయ్యను తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించరు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన కృష్ణయ్య.. చరిత్ర హీనుడిగా మిలిపోవడం ఖాయం అని కారుమూరి అన్నారు. సీబీఐ అంటే ఎందుకు భయం?జగన్కు ఉన్న ప్రజా ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు. అందుకే తిరుపతి లడ్డు పేరుతో తప్పుడు ప్రచారానికి దిగారు. లడ్డుపై టీటీడీ ఈవో, ఒక మాట చంద్రబాబు మరో మాట మాట్లాడుతున్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసమే ఇదంతా. సీబీఐ అంటే చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారు.. లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించొచ్చు కదా అని కారుమూరి ప్రశ్నించారు. -
ప్రజలకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి జగన్
-
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలున్నాయ్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు. -
‘ఎవడైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు’
ప. గో. జిల్లా: నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయించి వాలంటీర్ల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు మాయల ఫకీరు, జిత్తులమారి నక్క అంటూ మండిపడ్డారు. ‘ప్రజలకు మేలు చేసేది ఏదైనా చంద్రబాబుకి ద్వేషమే. ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు. ఎండలు మండుతున్నాయి . పెన్షన్ల కోసం అవ్వాతాతలు మళ్ళీ లైన్లో నిలబడి సొమ్మ సిల్లీ పడిపోతే చంద్రబాబుకి సంతోషం. చంద్రబాబుకి అయన తోక పార్టీకి ఏనాడూ వాలంటీర్లు అంటే ఇష్టం లేదు. చంద్రబాబు సిగ్గు లేకుండా, దుర్మార్గంగా, హేయమైన విధానాలు పాటిస్తూ నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లపై పిర్యాదు చేయించాడు. వాలంటీర్లపై చంద్రబాబు నీచ బుద్ధి కపట ప్రేమ ఈరోజు బయటపడింది’ అని కారుమూరి విమర్శించారు. -
వాడు గుంటనక్క రాజకీయ వ్యభిచారి: కారుమూరి వెంకట నాగేశ్వర
-
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
అత్తిలి(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో మంగళవారం చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, వైస్ ఎంపీపీలు సుంకర నాగేశ్వరరావు, దారం శిరీష, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పోలినాటి చంద్రరావు, ఉపసర్పంచ్ మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జన బలమే గీటురాయి.. -
‘మా ప్రభుత్వానికి రైతు శ్రేయస్సే ముఖ్యం’
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వానికి ముఖ్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరోసారి స్పష్టం చేశారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈరోజు(శనివారం) తణుకు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి కారుమూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను నష్ట నివారణ చర్యలపై ఈ సమీక్షా సమావేశం నిర్వహించగా, రైతులు, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ‘మిచాంగ్ తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నేను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాలా చోట్ల పర్యటించి చూశాను. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి రైతులను ఆదుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. రైతులకు వెంటనే సబ్సిడీ అందించే విధంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు.. ఇబ్బంది పడకూడదు అని సీఎం జగన్ ఆదేశాలివ్వడం జరిగింది. తుపాను సమయంలో అధికారులంతా చాలా బాగా కష్టపడ్డారు. రంగుమారిన, మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా కొనే విధంగా సీఎం జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం. రైతు శ్రేయస్సే మా ప్రభుత్వానికి ముఖ్యం’ అని తెలిపారు. -
రైతులను ఆదుకుంటాం
వెంకటాచలం/పామర్రు/నరసాపురం రూరల్/తొండంగి/త్రిపురాంతకం: ‘ఎవరూ అధైర్య పడొద్దు... ఈ కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది. రైతులకు అన్ని విధాలా సాయం చేస్తుంది...’ అని పలువురు రాష్ట్ర మంత్రులు చెప్పారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేశ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. పంటలు నష్టపోయిన రైతులతోపాటు పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. 6.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: కారుమూరి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కృష్ణా జిల్లా పామర్రులో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి వెంబడి ఉన్న పంట పొలాలను, రైతులు ఆరబోసుకున్న ధాన్యం రాశులను పరిశీలించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి రూ.1,300కోట్లకు గాను, బుధవారం వరకు రైతుల ఖాతాల్లో రూ.1,089 కోట్లు జమ చేశామని, మిగిలిన మొత్తం కూడా ఒకటి, రెండు రోజుల్లో చెల్లిస్తామని వివరించారు. కౌలు కార్డులు లేని కౌలురైతుల ధాన్యాన్ని కూడా స్థానిక సొసైటీల ద్వారా కొనుగోలు చేసి నగదు చెల్లిస్తామని స్పష్టంచేశారు. కృష్ణాజిల్లా రైతులు తమ ధాన్యాన్ని పల్నాడు, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డ్రయర్స్ ఉన్న మిల్లులకు అమ్ముకునే విధంగా అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పొలంలో చల్లిన మినుము విత్తనాలు పాడైపోయిన వారికి మళ్లీ సబ్సిడీపై విత్తనాలు అందించేలా చూస్తామన్నారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు మండలాల్లోని ముంపు గ్రామాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. క్షేత్రస్థాయిలో సర్వే: దాడిశెట్టి కాకినాడ జిల్లా ఏ.కొత్తపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా పరిశీలించారు. బాధిత రైతులు, అధికారులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. మంత్రి రాజా మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నష్టం వివరాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. పంట నష్టం అంచనాలు అందినవెంటనే సాయం: ఆదిమూలపు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద దెబ్బతిన్న వరి పొలాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పరిశీలించారు. తహశీల్దార్ వి.కిరణ్, వ్యవసాయ శాఖ అధికారులను అడగి పంటనష్టం గురించి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో పంట నష్టం అంచనాలు అందిన వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ రైతు పక్షపాతి అని ప్రతి ఒక్క రైతుకూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ : కాకాణి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన తిక్కవరప్పాడు, ఇస్కపాళెం, పుంజులూరుపాడు, గుడ్లూరువారిపాళెం, తిరుమలమ్మపాళెం గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పర్యటించారు. తిరుమలమ్మపాళెం, ఇతర వరద ప్రభావిత గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. కొంతమేరకు వరినాట్లు, నారుమళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు ఆర్బీకేల ద్వారా 80శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి పరిహారాన్ని అందిస్తామని వివరించారు. ఏర్పాట్లు బాగున్నాయి రాత్రి కురిసిన వర్షానికి ఇళ్ల చుట్టూ నీరు చేరింది. ఏం చేయాలో తెలియలేదు. ఇంకా నీరు ఎక్కువగా వస్తే ఎలా ఉండాలో తెలియక అయోమయంలో పడ్డాం. వెంటనే సకాలంలో అధికారులు వచ్చి చర్యలు తీసుకున్నారు. శిబిరానికి తీసుకొచ్చారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, టీ కూడా అందజేశారు. అధికారులు మా బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. – రాచూరి ముత్యాలరావు, చెరుకూరి రత్నం, తాళ్లపూడి, తూర్పు గోదావరి జిల్లా పరీక్షలు చేసి మందులిచ్చారు నేను, మా ముసలావిడ ఇద్దరమే ప్రకాశపురంలోని గుడిసెలో నివసిస్తున్నాం. తుపాను రాగానే జోరువానలో మమ్మల్ని ఇద్దర్నీ మా వలంటీర్ వచ్చి వ్యానులో తీసుకెళ్లి పునరావాస కేంద్రంలో అన్నం పెట్టించారు. వయసు మీద పడటంతో ఈ వలంటీరే దిక్కయింది. శిబిరంలో డాక్టర్లు మందులిచ్చారు. – మురాల ప్రభుదాసు, ప్రకాశపురం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా సురక్షితంగా బయట పడ్డాను నా ఇల్లు బాగోలేదు. తుపాన్ వేళ ఎలా చేయాలని దిగులు పడుతున్న సమయంలో గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. నన్ను అక్కడికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు భోజనాలు, టిఫిన్లు పెట్టారు. నిద్రపోవడానికి వసతి కూడా కల్పించారు. విపత్తులు వచ్చినప్పుడు ఈ విధంగా ఎన్నడూ చేయలేదు. అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – శింగోతు నాంచార్లు, కె.పల్లెపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా వలంటీర్ వల్లే బతికి బట్టకట్టాను నేను చాలా తుపాన్లు చూశాను. శిబిరానికి వెళ్లేందుకు నిరాకరిస్తే మా వలంటీర్ అమ్మాయి వచ్చి మామ్మా.. నేను తీసుకెళ్తాను అంటూ పట్టుబట్టింది. సిబ్బందితో వచ్చి వ్యానులో తీసుకెళ్లారు. రెండు రోజులు వేములదీవి ఈస్ట్ గ్రామంలోని తుపాను షెల్టర్లో ఉన్నాను. నేను శిబిరానికి వెళ్లిన తర్వాత నా గుడిసె కూలిపోయింది. వలంటీర్ మాట విని ఉండకపోతే నా ప్రాణాలు పోయేవి. వలంటీర్ వల్లే బతికి బట్టకట్టాను. – మైలాబత్తుల కమలమ్మ, వేములదీవి ఈస్ట్, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా సకాలంలో ఆదుకున్నారు వర్షం నీటితో ఇల్లు మొత్తం నీరు చేరింది. అధికారులు, పంచాయతీ సిబ్బంది సకాలంలో వచ్చి మమ్మల్ని ఉన్నత పాఠశాల వద్దకు చేర్చారు. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. భోజనం, అల్పాహారం, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. – గోపిరెడ్డి రమ్య, వేగేశ్వరపురం, తూర్పు గోదావరి జిల్లా -
జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు
-
తోక కత్తిరించి తాట తీస్తా..మంత్రి కారుమూరి పవర్ ఫుల్ స్పీచ్
-
చరిత్ర సృష్టించిన సామాజిక సాధికార యాత్ర..టీడీపీ పని అయిపొయింది
-
సామాజిక న్యాయం సీఎం జగన్ చేసి చూపించారు: మంత్రి కారుమూరి
సాక్షి, కోనసీమ జిల్లా: కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మధ్యాహ్నం రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభమైంది. ఎనిమిది కిలోమీటర్లు మేర బస్సు యాత్ర సాగింది. సాయంత్రం కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని మంత్రి కారుమూరు నాగేశ్వరావు అన్నారు. అన్ని వర్గాలకు రాజ్యాంగ బద్ధమైన పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి మాట్లాడుతూ, పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిశారని కిందిస్థాయిలో ఏ ఒక్క కార్యకర్త కలవలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేరుగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఇంతకంటే ఏం కావాలని పేద వర్గాలు అంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. జైలు ఊచలు లెక్కపెట్టిన చంద్రబాబు.. కంటి ఆపరేషన్ అని చెప్పి బయటకు వచ్చాడు. ఇప్పుడు గుండెకాయ రోగం వచ్చిందట అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు -నేడు వంటి కార్యక్రమాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలు అభివృద్ధిని సూచిస్తున్నాయి. ఎంతోమందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి డాక్టర్లు, ఇంజనీర్లు చేసిన ఘనత వైఎస్సార్కు దక్కుతుంది. ఆయనకంటే నాలుగు అడుగులు ఎక్కువ వేసిన ఘనత ఆయన కుమారుడు జగన్కే దక్కుతుందని మంత్రి కారుమూరి అన్నారు. నాడు నేడుతో మారిన స్కూళ్ల రూపురేఖలు: మార్గాని భరత్ మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.. మరి చంద్రబాబు మనవడిని ఎక్కడ చదివిస్తున్నాడో చంద్రబాబు చెప్పాలి. నాడు-నేడుతో ఏడున్నర దశాబ్దాల స్కూళ్ల పరిస్థితిని సీఎం జగన్ మార్చేశారని మార్గాని పేర్కొన్నారు. చదవండి: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ -
హైదరాబాద్ లో రోడ్డెక్కి తందానాలు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు
-
బాబు తప్పు చేశారు కాబట్టే ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం లేదు
-
'స్కిల్ స్కాం సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే'
తాడేపల్లి: చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టే ఎవరూ మద్దతివ్వడంలేదని మంత్రి కారుమూరి అన్నారు. చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు కానీ.. ముఖ్యమంత్రి జగన్ ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని చెప్పారు. ఎన్నో కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇవాళ్టికి చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలు పాలయ్యారని అన్నారు. స్కిల్ స్కాం సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని చెప్పారు. కేసుల నుంచి బయటపడటానికి చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారని మంత్రి కారుమూరి చెప్పారు. బాబు తప్పు చేశారు కాబట్టే ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం లేదని స్పష్టం చేశారు. బాబు పాలనలో ప్రజలను దోచుకుతిన్నారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలందరికీ ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయని అన్నారు. చంద్రబాబు అవినీతిని ఎండకడతానన్న పవన్ టిడిపితోనే కుమ్మక్కయ్యారని మంత్రి కారుమూరి అన్నారు. తడాకా చూపిస్తానని చెప్పి బాబు పంచన చేరారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి పవన్కు ఏమీ లేదని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: ఒకరిది ఓర్పు.. పిరికితనం మరొకరిది!.. ఎందుకిలా.. -
నాడు అవినీతి.. నేడు నీతి అయిందా పవన్?
సాక్షి, తాడేపల్లి: ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి?అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు స్కిల్ స్కామ్లో రూ. 371 కోట్లు నొక్కేసి సాక్ష్యాధారాలతో సహా పట్టుబడిపోయాడన్నారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. వాస్తవం ఇది అయితే.. వాస్తవాలను వక్రీకరిస్తూ, టీడీపీకి చెందిన ఒక సామాజికవర్గం వారు చంద్రబాబు అరెస్టు అన్యాయం-అక్రమం, సేవ్ డెమోక్రసీ అంటూ మాట్లాడుతున్నారు. అంటే ప్రజా ధనాన్ని లూటీ చేసిన బాబును అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టా..? అని నిలదీస్తున్నామన్నారు. అసెంబ్లీలో చర్చించరు..బయట మాత్రం సింపతీ గేమ్ అలాగే, 'చంద్రబాబు చేసిన స్కాములు-అరెస్టులపై అసెంబ్లీలో చర్చిద్దామంటే.. వాళ్ళు చర్చకు రారు. కానీ, చంద్రబాబును ఈ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేసిందని పబ్లిసిటీ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్లో చర్చిద్దామంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరూ లేరు, అంతా పారిపోయారు. ఒక్కొక్కరికి కోటిన్నర ఇచ్చి లాయర్లను రప్పించి వాదనలు వినిపించినా.. వారు ఎంతసేపటికీ టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తారు తప్పితే.. చంద్రబాబు అవినీతి చేయలేదు అని ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ కార్యకర్తలు సైతం నమ్మరు, ఎన్టీఆర్ కుటుంబం నమ్మదు.. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు' అని మంత్రి మండిపడ్డారు. బాబు పాలన అంతా స్కాములే.. స్కీముల్లేవ్ 'చంద్రబాబు పాలన అంతా అవినీతి, స్కాములే. ఆయన 14 ఏళ్ళ పాలన అంతా స్కాముల మయమే.. జగన్ గారి పరిపాలనలో ప్రతిదీ పేద ప్రజలకోసం అమలు చేస్తున్న సంక్షేమ స్కీములే. బాబు నిప్పు, నీతిమంతుడే అయితే ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను అమెరికాకు పంపించి, ఎందుకు దాచిపెట్టారు? నీ.. పీఎస్ శ్రీనివాస్కు హవాలా మార్గంలో నిధులు రాకపోతే.. అతన్ని ఎందుకు పంపించేశావు? అలా, మీ స్కాములకు లాబియిస్టుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని(ఎంవీపీ) దుబాయ్ పారిపోయాడు! చంద్రబాబు చేసిన స్కాములతో ఆయన పాపం పండింది. బాబు తప్పులు చేశాడు కాబట్టే.. మీరు చొక్కాలు విప్పి రోడ్డున పడుతున్నారు' అని విమర్శించారు. బాబుకు వెన్నుపోటు పొడిచేందుకు లోకేష్, బాలకృష్ణ మాస్టర్ ప్లాన్? 'లోకేష్ ఎక్కడ దాక్కున్నాడు..? చంద్రబాబును అరెస్టు చేస్తే.. నా తండ్రి దగ్గరకు వెళ్ళనివ్వరా.. అని రెచ్చిపోయి, ప్లకార్డులు పట్టుకుని, కింద కూర్చుని నానా హడావుడి చేశాడు. ఇప్పుడేమో ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. నీ తండ్రి జైల్లో ఉంటే.. నీవు కూడా ఈ స్కాముల్లో పాత్రధారుడివి కాబట్టి, ఢిల్లీలో నక్కావా..? తండ్రి జైల్లో ఉంటే.. బాలకృష్ణతో కలిసి లోకేష్ పార్టీని లాక్కోవాలని చూస్తున్నట్టు ఉన్నారు. ఎన్టీఆర్ గారికి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటే.. రివర్స్లో ఆయనను పొడిచేందుకు మామ, అల్లుళ్ళు బాలకృష్ణ, లోకేష్లు రెడీ అయినట్టు ఉన్నారు. అందుకే, జైల్లో ఉన్న తండ్రిని పట్టించుకోకుండా, సీక్రెట్గా వీళ్ళు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. బాలకృష్ణ చంద్రబాబు కుర్చీలో కూర్చున్నాడు. అసెంబ్లీలో ఆయన కుర్చీపైకి ఎక్కి నిల్చొన్నాడు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే.. చంద్రబాబుకు తగిన శాస్తి జరగాల్సిందే' అంటూ చెబుతూ వచ్చారు. బాలకృష్ణ తొడకొడితే బిల్డింగ్ కూలుతుందేమో అని భయపడ్డాం! 'బాలకృష్ణ మొన్న స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి మీసం మెలేసి, తొడగొట్టాడు. దాంతో చంద్రబాబు దోపిడీ చేసి, నిర్మించిన టెంపరరీ అసెంబ్లీ బిల్డింగ్లు ఎక్కడ కూలిపోతాయోనని మేమంతా భయపడ్డాను. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఒంటి చేత్తో పది, ఇరవై లారీలను ఎత్తేస్తాడు. ఆయన తొడకొడితే భూమి బద్ధలైపోతుంది. అందుకే, యనమల నోరు తెరవట్లేదు? చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు ఈ స్కాములు జరగలేదని మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కదా.. ఆయన కూడా నోరు తెరవడం లేదు. ఎందుకంటే, బాబు తర్వాత యనమలకే ఈ అవినీతి గురించి బాగా తెలుసు. అవినీతి జరిగిందన్నది యనమలకు తెలుసు. నాడు అవినీతి.. నేడు నీతి అయిందా పవన్? 'చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులు, దుర్మార్గులు, తన తల్లిని తిట్టారు, నియోజకవర్గానికి వెయ్యి కోట్లు చొప్పున అవినీతి చేశారు.. అని మాట్లాడిన పవన్ కల్యాణ్- ఈరోజు ఎందుకు నోరు విప్పడు. ఆరోజు పవన్ కల్యాణ్ మాట్లాడిన అవినీతి కేసులే ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకున్నాయి. అప్పుడు అవినీతి అయినవి.. ఇప్పుడు మీ కళ్ళకు నీతివిగా కనిపిస్తున్నాయా..? దేశానికి ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీనే అరెస్టు చేశారు. బాబు ఏమైనా దిగొచ్చాడా..? తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే. స్కిల్ స్కాంకు సంబంధించిన నోట్ ఫైళ్ళపై.. చంద్రబాబు 13 సంతకాలు పెట్టాడు. పైగా, బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే.. చైర్మన్కు ఏమిటి సంబంధం అని అవగాహన లేకుండా లోకేష్, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా తానే స్వయంగా నోట్ ఫైళ్ళ మీద సంతకాలు చేసి, నిధులు విడుదలకు ఒత్తిళ్ళు చేస్తే.. అది తప్పు కాకుండా ఒప్పు అవుతుందా..? చంద్రబాబు తప్పు చేశాడు, సాక్ష్యాలతో సహా చిక్కాడు కాబట్టి.. ఆయన ఏ కోర్టుకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా చంద్రబాబు నోరు విప్పాలి. ఏమి అడిగినా 'తెలియదు, గుర్తులేదు, మరచిపోయాను..' అని ఒకటే సమాధానం చెబుతున్నాడంటూ' మండిపడ్డారు. భేషుగ్గా జగన్ పరిపాలన! సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపు దేశం యావత్తు చూస్తుంటే.. ఇక, మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని ప్రభుత్వంపై ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని రోజూ బురద జల్లుతున్నారు. గత నాలుగేళ్ళ సీఎం జగన్ పరిపాలనలో విద్యారంగం మొదలు సచివాలయ వ్యవస్థ.. పారదర్శకమైన పరిపాలన.. సామాజిక న్యాయం.. ప్రతి ఇంటికీ మూడు-నాలుగు సంక్షేమ పథకాలు అందేలా.. గొప్పగా పాలన చేస్తూ, ఏపీ దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ముందుంది. పేదరికం 11 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందున్నాం. జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ మేలు జరుగుతుంటే.. వీళ్ళంతా తట్టుకోలేకపోతున్నారు. అందుకే, ఈ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు’ అని మంత్రి కారుమూరి ధ్వజమెత్తారు. -
చంద్రబాబుకు భారీ షాక్
-
‘ఈనాడు తప్పుడు రాతలు.. కళ్లు పెద్దవి చేసుకుని చూడు రామోజీ’
సాక్షి, తాడేపల్లి: ధాన్యం కొనుగోళ్లపై రామోజీవి తప్పుడు రాతలు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతులకు కనీసం ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదని, సీఎం జగన్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు. ‘‘రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారు. రామోజీ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు-నేడు ఏం జరిగిందో అర్థమవుతోంది. సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం పచ్చగడ్డిలా మేసేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం 2 కోట్ల 65 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ ప్రభుత్వం 32 లక్షల మంది రైతుల నుంచి 3 కోట్ల 10 లక్షల 65 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించింది. 58 వేల కోట్లు చెల్లించాం’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చాం. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. రామోజీ.. ఈనాడు పత్రికను మరింతగా దిగజారుస్తున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా చేసిన మా పై నిందలా.. తప్పుడు రాతలు రాయడానికి రామోజీకి సిగ్గులేదా?. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాం. టీడీపీ హయాంలో దళారీ వ్యవస్థతో రైతులను దోచుకుతిన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. నిజాలు తెలుసుకుని వార్తలు రాయడం నేర్చుకో రామోజీ’’ అంటూ మంత్రి కారుమూరి దుయ్యబట్టారు. చదవండి: సినిమా రేంజ్లో సీన్లు పండించిన పవన్.. ప్లాన్ బెడిసికొట్టింది! ‘‘దొంగ ఓట్లు చేర్చడంలో చంద్రబాబు దిట్ట. ఈ రోజు నిజం బయటపడటంతో చంద్రబాబు భయపడుతున్నాడు. చంద్రబాబు మాకొద్దు బాబోయ్ అంటున్నారు ప్రజలు. 600 హామీలిచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది ఎవరు?. డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు? చంద్రబాబు, లోకేష్, పవన్ రోడ్లపై తిరగడం వల్ల వర్షాలు కూడా పడటం లేదు’’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. -
నారా లోకేష్ ఓ పిల్ల కాకి: మంత్రి కారుమూరి
సాక్షి, పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే బీసీలకు మేలు జరిగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేష్ ఓ పిల్ల కాకి అంటూ దుయ్యబట్టారు. మూడు పర్యాయాలు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించాడా అని ప్రశ్నించారు. ‘‘బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్కు లేదు. బీసీలను ఓట్లేసే యంత్రంలా చంద్రబాబు వాడుకున్నాడు. ఇష్టానుసారంగా దొంగ ఓట్లు రాయించింది చంద్రబాబే. అల్జీమర్స్ వ్యాధి చంద్రబాబు కుటుంబంలో ఉంది’’ అని మంత్రి మండిపడ్డారు. చదవండి: పాదయాత్రలో లోకేష్కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ -
చంద్రబాబు, లోకేశ్, పవన్పై మంత్రి కారుమూరి ఫైర్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ బాబు, పవన్ కల్యాణ్పై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఓ ముసలి నక్క, దుర్మార్గుడు, పుంగనూరులో రౌడీలా వ్యవహరించారని ఆరోపించారు. లోకేశ్ పప్పు.. అతనొక రాజకీయ నాయకుడేనా? అని ప్రశ్నించారు. పవన్ తాటతీస్తా.. పంచలూడదీస్తా అంటున్నాడు.. ఇది కరెక్టేనా? అని అన్నారు. సినిమాలకు రాజకీయాలను జోడించడమేంటి.. కాగా, మంత్రి కారుమూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో పోలీసులకు చేతులెత్తి దండం పెట్టాలి. రక్తమోడుతున్నా తుపాకులకు పనిచెప్పకుండా సంయమనం పాటించారు. చంద్రబాబు ఇంకెంతమంది ఉసురు పోసుకుంటారని విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని చూపించడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. పవన్ తాటతీస్తా.. పంచలూడదీస్తా అంటున్నాడు.. ఇది కరెక్టేనా? అని అన్నారు. మనస్థాయి ఏంటి.. మన బ్రతుకేంటి అని ఆలోచించుకోవాలి. సినిమాను సినిమాగా.. రాజకీయాలను రాజకీయాలుగా చూడాలి. అంతేకానీ సినిమాకు, రాజకీయాలను జోడించి చూడటం సరికాదు. ప్రజల వద్దకు వెళ్లి ఏం చెబుతారు.. మమ్మల్ని విమర్శించే ఏ పార్టీ నాయకులకైనా ప్రజల వద్దకు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, బీజేపీలో నేతలు తప్ప ఏ ఒక్క కార్యకర్త అయినా మాట్లాడుతున్నాడా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని పార్టీల వారికీ పథకాలు అందుతున్నాయి. అందుకే నాయకులు తప్ప ఆ పార్టీల కార్యకర్తలెవరూ మమ్మల్ని విమర్శించడం లేదు. వీరంతా ఏం చేశారని ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడతారు. సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్లు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారు. టీడీపీ కార్యకర్తల ఉసురు, ప్రజల ఉసురు కచ్చితంగా చంద్రబాబుకు తగులుతుంది. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే అందరినీ కలుపుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లో టీడీపీ హింసను ప్రేరేపిస్తుంది: కొమ్మినేని -
‘ఏపీకి చంద్రబాబు ఏమీ చేయలేదు.. ఆయనకు అడిగే హక్కులేదు’
సాక్షి, తిరుపతి: చంద్రబాబుకి ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు లేదని.. ఆయన ఏనాడు ప్రజలకు మంచి పని చేయలేదని ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. గురువారం ఉదయం మంత్రి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్కి పరిపాలనలో మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కోరుకోవడం జరిగిందన్నారు. ఏపీ అన్ని రంగాల్లో ముందుంది. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు, విమర్శలు చేసినా సీఎం జగన్ తాను పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. భారతదేశంలోనే ఏపీ నంబర్ వన్ స్ధానానికి వస్తుందన్నారు. జీడీపీలో ఏపీ మొదటి స్థానంలో, విద్యలో మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ -
ఒక్క వలంటీర్ నైనా అరెస్ట్ చేయించగలిగితే నేను ఉరేసుకుంటా
-
‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం’
సాక్షి,ఏలూరు టూ టౌన్: రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈనాడు’ వేస్టు పేపర్లా, టిష్యూ పేపర్లా మారిందని, ప్రభుత్వంపై బురద చల్లేందుకే అసత్య కథనాలు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో అప్పులు, వేల కోట్లు దారి మళ్లింపుపై ఎందుకు రాయలేదని నిలదీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పౌర సరఫరాల శాఖలో మార్పులు చేశారని, రైతులకు మేలు చేసేలా ధాన్యం కొనుగోలులో దళారులు, మిల్లర్ల పాత్ర లేకుండా చేశారని తెలిపారు. రవాణా, గోనె సంచులు, హమాలీ చార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇటీవలి రబీ సీజన్లో ధాన్యంలో నూక శాతం ఎక్కువగా వచ్చినా ఒక్క రూపాయి కూడా కోత లేకుండా రైతులకు మద్దతు ధర మొత్తం చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. రబీలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, రూ.28,402 కోట్ల విలువైన 15 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని తెలిపారు. అందులో ఇప్పటివరకు రైతులకు రూ.28,200 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.200 కోట్లు సమయంలోగా చెల్లిస్తామన్నారు. జయ బొండాలు ధాన్యాన్ని కేరళ ప్రభుత్వం కోరిక మేరకు మన రైతులు పండించారని, దానిని ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు కొన్నారని, దీనివల్ల లక్ష్య సాధన తగ్గిందన్నారు. ‘మార్గదర్శి’లో వేల కోట్లు దారి మళ్లించారని, దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టడం ఖాయమని చెప్పారు. చదవండి: Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’ -
నైతికతకు నిలువుటద్దం..నిజంగా నవశకమే
ఎన్నికల్లో గెలవడం కోసం నోటికొచ్చిన వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవడం మామూలే అనే అభిప్రాయం ప్రజానీకంలో పాతుకుపోయింది. కానీ అటువంటి అభిప్రాయాన్ని తారుమారు చేస్తూ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో 98 శాతం నెరవేర్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం. ఇక ముందెవరైనా హామీ ఇవ్వాలంటే జగన్ నెలకొల్పిన ఈ ప్రమాణం అందుకోవాలి. అందుకే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయపార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇస్తూ ఉంటాయి. వాటిని తమ మేని ఫెస్టోలో చేర్చి ప్రచారం చేసుకోవడం కూడా సహజం. అయితే గెలి చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలోనే ఆయా పార్టీలు, లేదా నాయకుల మను గడ ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు నేతృత్వం వహిస్తున్న టీడీపీ, వైసీపీల పనితీరును అంచనా వేయాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేయలేని వాగ్దానాలెన్నో చేశారు. ఏకంగా 650 వాగ్దానాలు చేస్తూ వాటిని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో గెలిచారు. అయితే సీఎం అయ్యాక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో కనీసం 10 శాతం కూడా నెర వేర్చలేదు. సీఎంగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో మేని ఫెస్టోను ఏ మేరకు అమలు చేశాననే విష యాన్ని కనీసం సమీక్షించుకోవడానికి కూడా ఆయనకు తీరిక దొరకలేదు. అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు 1994, 1999లలో కూడా రెండు సార్లు సీఎంగా పని చేశారు. ఆ సమయాల్లో కూడా తన పార్టీ మేనిఫెస్టోను అమలు చేయడంగానీ, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గానీ చంద్రబాబు చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు తాను సీఎంగా కొనసాగిన 2014 –19 మధ్య కాలంలో ఉద్యోగాల విషయంలో రాష్ట్రంలోని యువతకు, రుణమాఫీ విషయంలో మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా కాలయాపన చేశారు. పైగా బాబు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాల్లో కూడా అర్హులైన వారందరికీ లబ్ధి కలి గించకుండా పైరవీలకు, అక్రమాలకు పెద్దపీట వేస్తూ ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో ప్రజ లను దోచుకోవడానికి టీడీపీ శ్రేణులను ప్రజల మీదికి వదిలారు. అలా ఐదేళ్లు గడిచి పోతుండగా 2019 నాటి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళలకు ‘పసుపు కుంకుమ’ లాంటి పథ కాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నైజమేమిటో అప్పటికే బాగా అర్థమైన రాష్ట్ర ప్రజలు ఆయనను ఓడించి ఇంటికి పంపారు. జగన్మోహన్ రెడ్డి తన ‘నవరత్నాల’ పథ కాలతో పాటుగా ప్రజలకు చేసే ఇతర మేళ్లని గురించి రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికీ పంచారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో పోల్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే మేనిఫెస్టోను అమలు చేయడం ప్రారంభించారు. జగన్ మూడేళ్ల పరిపాలనలోనే తన మేని ఫెస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చారు. అంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టోలో హామీ ఇవ్వని కొత్త పథకాలను కూడా అమలు చేయడం మొదలు పెట్టారు. డీబీటీ, నాన్– డీబీటీ పథకాల ద్వారా గత నాలుగేళ్ల కాలంలో ప్రజలకు సుమారుగా రూ. 2.82 లక్షల కోట్ల రూపాయలను అందించినా అందులో ఎక్కడా ఒక్క పైసా అవినీతి కూడా జరిగిందని ఎవరూ చెప్పలేని విధంగా పూర్తి నీతివంతమైన పరిపాలనను అందించడం జగన్ సృష్టించిన మరో చరిత్ర. అంతేకాదు దేశ చరిత్రలోనే మొదటి సారిగా ఒకేసారి 1.26 లక్షల ప్రభుత్వ ఉద్యోగా లను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేశారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడం ఇవాళ దేశమే అబ్బురపడు తున్న అభివృద్ధి. పథకాలను అందించడంలో అర్హతే ప్రామాణికంగా తీసుకొని కుల, మత, ప్రాంతీయ, వర్గ, వర్ణ, రాజకీయ పార్టీ విబేధా లకు తావివ్వకుండా చూడటం జగన్ నైతికతకు నిలువుటద్దం. 2014 ఎన్నికల్లో వాడుకొని మోసం చేసిన పవన్ కల్యాణ్తో మళ్లీ పొత్తుకోసం వెంపర్లా డటం, గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నరేంద్ర మోదీ చెలిమి కోసం ఇప్పుడు తహతహలాడటం చంద్రబాబు అనై తిక విధానానికి నిదర్శనమైతే, అప్పుడూ ఇప్పుడూ కూడా కేవలం ప్రజలనే నమ్ముకొని ఒంటరిగా బరిలో నిలబడటానికి సిద్ధపడటం జగన్ నైతికతకు తార్కాణం. ఈ నేపథ్యంలోనే 2024లో రాబోయే ఎన్నికల కోసం చంద్రబాబు అప్పుడే తన మేని ఫెస్టోను ప్రకటించేశారు. షరా మామూలుగా తాను గతంలో ప్రజలకు ఏం చేసింది చెప్పకుండా ఇక ఇప్పుడేదో చేసేస్తాననే రీతిలో రాజమండ్రిలో టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలోని అంశాలకే పేర్లు మార్చి తన మేని ఫెస్టోగా ప్రకటించడం గమనార్హం. ఆయన భావ దారిద్య్రం ఏ స్థాయికి చేరిందంటే జగన్ పరిపాలనలో తల్లులందరి మన్ననలు పొందిన ‘అమ్మఒడి’ పథకానికి ‘అమ్మకు వందనం’ అని పేరుమార్చి తన మేనిఫెస్టోలో పెట్టేసుకున్నారు. అసలు ఎన్నడూ తన హామీలను నెరవేర్చని చంద్ర బాబు ప్రకటించిన మేనిఫెస్టోకి విలువేముంటుంది? అయినా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపైన, జగన్ పరిపాలనపై చేస్తున్న ఆరోపణల మీద బహిరంగ చర్చకు రావాలని మేము చేసిన సవాల్కు ఇప్పటివరకూ బాబు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇదివరకు అధికారమిచ్చి అందలం ఎక్కిస్తే చంద్రబాబు, ఆయన అనుచరగణం చేసిందేమిటో బాగా తెలి సిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చంద్రబాబు మేని ఫెస్టో పేరిట కొత్తగా ఇస్తున్న హామీలను నమ్మే అవకాశం ఏ మాత్రం లేదు. :::డా. మేరుగు నాగార్జున, వ్యాసకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు నిజంగా నవశకమే... ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2019 వరకూ రెండే పార్టీల పాలన సాగింది. దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉండగా, ఆ తర్వాత కాంగ్రెస్ అధి ష్ఠానం చేసిన అపరా ధాల వల్ల నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ అధి కారాన్ని చేజిక్కించుకుంది. ప్రజల నమ్మకాన్ని ఎన్టీఆర్ వమ్ము చేయలేదు. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అవసరమని భావించి ఆ దిశగా కొత్త సంక్షేమానికి తెర తీశారు. సమాజంలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమ ఫలాలు దక్కేలా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీని లాక్కొని అధికారంలోకి వచ్చారు. అక్ర మంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను పక్కన పెట్టి నేల విడిచి సాము చేశారు. హైటెక్ అంటూ కొన్ని వర్గాలకు రాష్ట్ర సంపదను దోచిపెట్టి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు. విజన్ 2020 అంటూ త్రిశంకు స్వర్గంలో తేలియాడుతూ ప్రజలను గాలికొదిలేశారు. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ రాజ శేఖరరెడ్డి ‘నేనున్నా’ అంటూ తెలుగు ప్రజలకు భరోసా ఇచ్చారు. మండు వేసవిలో కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలలో తన ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చీ రాగానే ప్రజలను తమ అగచాట్ల నుంచి విముక్తి కలిగించేలా పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కరవు కాటకాలతో అల్లాడు తున్న ప్రజలకు ఊపిరి పోశారు. వైఎస్ఆర్ పాలించిన ఐదేళ్ల మూడు నెలల్లో ప్రజలు హాయిగా, సంతోషంగా గుండెలో మీద చేతులు వేసుకుని బతికారు. ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలను బాధించింది. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే నేను రాజకీయా ల్లోకి అడుగు పెట్టాను. జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యేగా ఎది గాను. వైఎస్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తయారైంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమతుల్యత దెబ్బతింది. ప్రాంతీయ వాదా లతో అట్టుడికి పోయింది. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ విభజన, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం జరిగి పోయాయి. ఎప్పుడూ ఎవరో ఒకరి సహాయంతో లేదా అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చే చంద్రబాబు చేతుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి దోపిడీకి గురైంది. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, గొప్ప విజనరీ అని డప్పాలు కొట్టుకునే చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఓడిపోయారు. ఇదే సమయంలో దిక్సూచిలా వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు కనిపించారు. నేను విన్నా... నేను కన్నా... నేను ఉన్నా అంటూ ప్రజల ఆదరాభిమానాలతో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్కు కూడా ఇవ్వని భారీ మెజారిటీని ప్రజలు జగన్కు ఇచ్చారు. తన పాదయాత్రలో కనిపించిన, వినిపించిన ప్రజల కష్టాలను, అవస్థలను మేనిఫెస్టోగా రూపొందించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాను, బైబిలు మాదిరిగా భావించి అందులో పొందుపరిచిన ప్రతి అంశాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో 98.5 శాతం హామీ లను అమలు చేయడం చాలా గొప్ప విషయం. ఓ వైపు చంద్రబాబు ఖజానా ఖాళీ చేసినా... మరో వైపు కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా... ఏ మాత్రం బెదరకుండా మొక్కవోని ధైర్యంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకే వెళ్లారు. కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టు కుంటూ, పొదుపు మంత్రం పాటిస్తూ చంద్ర బాబు హయాంలో చెల్లాచెదురైన ఆర్థిక వ్యవ స్థను గాడిలో పెట్టి ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధిని రెండు కళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నారు. విద్యా, వైద్య రంగా లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. చదువు ఒక్కటే భావితరాలకు తర గని ఆస్తి అని చెప్పి విద్యార్థుల పాలిట మేన మామగా మారారు. ప్రతి పేద వాడి ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం చక్కగా ఉంటుందని భావించారు. రైతు సంక్షేమమే ప్రధానంగా భావించి గత టీడీపీ హయాంలో పడకేసిన వ్యవసాయాన్ని పండుగ చేశారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు వరుసగా టకటకా చెబితే పది లక్షల బహుమతి ప్రకటించా! ఇంతవరకూ నా వద్దకు వచ్చి ఎవరూ చెప్పలేక పోయారు. అంటే అన్ని పథకాలను ఆయన ప్రజలకు అందిస్తున్నారు. అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ సమ న్యాయం చేయడం సాధ్యమని ఈ నాలుగేళ్లలో జగన్ నిరూపించారు. పరిపాలనలో పారదర్శ కత, ప్రజల గుమ్మం ముందుకు ప్రభుత్వం వెళ్లడం, అవినీతికి అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో నగదు బదిలీ, వాలంటీర్ల సేవలు తదితరాలు గతంలో ఎన్నడూ లేనివి. ఇవన్నీ కొత్తగా ప్రవేశపెట్టిన జగన్ పెద్ద విజనరీ. ప్రతిపక్షాల విమర్శలు, పచ్చ మీడియా దాడులకు అదరని, బెదరని గొప్ప ధైర్యశాలి. నాలుగేళ్ల పాలనతో 42 ఏళ్ల రాజ కీయ సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించారు. జగన్ పాలన నిజంగా నవ శకమే! :::వ్యాసకర్త రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి డా‘‘ కారుమూరి వెంకట నాగేశ్వరరావు (వైఎస్పార్సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా) -
రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత సీఎం జగన్దే
తణుకు అర్బన్/అత్తిలి : ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ లేకుండా రైతుకు గిట్టుబాటు ధరను నేరుగా అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి గింజనూ కొనుగోలు చేసి వారి బ్యాంకు ఖాతాలకే నగదు జమ చేసిన ఘనత కూడా సీఎం జగన్కే దక్కుతుందన్నారు. తన ధాన్యం కొనలేదు.. గిట్టుబాటు ధర ఇవ్వలేదు.. అని ఏ ఒక్క రైతూ అననప్పటికీ తగుదునమ్మా అని తణుకులో చంద్రబాబు నిర్వహించిన రైతు పోరుబాట పాదయాత్ర, సభ జనాదరణ లేక అట్టర్ ఫ్లాప్ షో అయ్యాయని చెప్పారు. తన సామాజికవర్గానికి చెందిన తణుకు టీడీపీ నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలనే తపనతో ఏదోరకంగా జాకీ లేసి పైకి లేపేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై నాలుగేళ్లపాటు మాట్లాడని చంద్రబాబు.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతో తణుకుకు రెండుసార్లు వచ్చాడని దుయ్యబట్టారు. చంద్రబాబు యాత్రలో రైతులు లేకపోగా దూరప్రాంతాల నుంచి తీసుకొచ్చిన జనంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. బీసీలను ఓటు యంత్రంగా వాడుకునే చంద్రబాబుకు రానున్న రోజుల్లో బీసీలే తగిన పాఠం చెబుతారని హెచ్చరించారు. జనం లేని సభలో టీడీపీ నాయకులు మీడియాపై కూడా దాడులకు దిగే హీనస్థితికి దిగజారిపోయారని మంత్రి కారుమూరి మండిపడ్డారు. చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం పబొ మగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన రైతు పోరుబాట యాత్రలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ.. మంత్రికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం అత్తిలి, తణుకులో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైఎస్సార్సీపీ బీసీ సెల్ అత్తిలి మండల అధ్యక్షుడు రంభ సూరిబాబు, పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ తదితరులు చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండించారు. అత్తిలి బస్స్టేషన్ సెంటర్లో, తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించి చంద్రబాబు దిష్టి»ొమ్మలను దహనం చేశారు. -
బాబుది రైతులను పాడుచేసే దగా యాత్ర
తణుకు టౌన్: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల కోసమంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టింది రైతు పోరుబాట కాదని.. అది రైతు పాడు యాత్రగా మిగిలిపోతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం రాత్రి రైతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం చేసినట్టు తెలిపారు. దీనివల్ల జిల్లాలో సాగు చేసిన బొండాలు రకం ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేసి రైతులకు లాభం కలిగిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు ఐరన్ లెగ్ నాయకుడని, ఆయన వెళ్లిన ప్రతిచోట వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులు మరింత నష్టపోతున్నారని చెప్పారు. గురువారం సాయంత్రం తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం గ్రామంలోకి చేరగానే భారీ వర్షంతో కూడిన ఈదురు గాలులకు 10 విద్యుత్ స్తంభాలు కూలిపోయి, రైతులకు మరింత నష్టం ఏర్పడిందని తెలిపారు. ఈ పరిణామాలతో చంద్రబాబు చేపట్టిన యాత్ర రైతు పాడు యాత్రగా మారి రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సంచుల కొరత లేదు ధాన్యం కొనుగోలుకు గోనె సంచుల కొరత లేదని, బియ్యానికి ఉపయోగించే సంచులను కూడా ధాన్యం రైతులకు అందించే ఏర్పాట్లు చేశామని మంత్రి కారుమూరి చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో అలసత్వం వహించిన 36 రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టామని, 46 మంది అధికారులపై చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు. ధాన్యం రైతులకు బుధవారం ఒక్కరోజే రూ.470 కోట్ల మొత్తం ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్టు చెప్పారు. రైతులు కాపకాయల అయ్యప్పస్వామి, కడియం సత్యనారాయణ మాట్లాడుతూ.. గతం కంటే ఈ సంవత్సరం ధాన్యం సొమ్ము నాలుగు రోజుల్లోనే బ్యాంక్ ఖాతాల్లో పడినట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రం సేవలు చాలా బాగున్నాయని, ఎప్పటికప్పుడు ధాన్యానికి సంబంధించిన వివరాలు, సమాచారం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులను మంత్రి కారుమూరి సత్కరించారు. -
రైతులపై చంద్రబాబుది మొసలి కన్నీరు: మంత్రి నాగేశ్వరరావు
-
‘అన్ని రకాల ప్రయోజనాలతో రైతులను ఆదుకుంటాం’
సాక్షి, తాడేపల్లిగూడెం: కోసిన ధాన్యం కోసినట్లుగా కొనుగోలు చేసి ,రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామని ,రైతులు ధైర్యంగా ఉండాలని ఉప ముఖ్య మంత్రి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు.సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిగుడెం మండలం నందమూరు ,కృష్ణయ్య పాలెం గ్రామాలలో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు తో కలసి కొట్టు.సత్యనారాయణ పర్యటించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో వారు మాట్లాడి ,వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంటలు బాగా పండాయి ఏకరానికి 55 నుండి 60 బస్తాలు దిగుమతి అవుతున్నాయి ,సగం పైగా కోతలు అయ్యాయి మిగతావి కోతలు అయ్యే లోపు అకాల వర్షాలు కురిశాయన్నారు. అయినా కూడా ఏ రైతు ఇబ్బంది గాని నష్ట పోకూడదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయాలని ఆదేశించారని, అదే సమయంలో సకాలంలో డబ్బులు నేరుగా బ్యాంక్లో జమ చేయమని జిల్లా యంత్రాంగం కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కాలం కలసి రాకపోయినా ప్రభుత్వం అన్ని రకాలు ప్రయోజ నాలు కల్పించి ,రైతులను ఆదుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి రైతులకు ఇన్సూరెన్స్ చేశామని నష్టపోయినప్పుడు అదే నెలలో ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తున్నామని అయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడు నందమూరు కు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి , తన ఉనికి కోసమే ప్రయాస పడుతున్నారన్నారు. ముఖ్య మంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చేసిన కాలంలో ఏనాడైనా , ఏ సంవత్సరం అయినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గాని ఎటువంటి మేలు చేశారా అని మంత్రి అన్నారు. అకాల వర్షాలు పడినప్పుడు నుండి మంత్రులు, ప్రజాప్రతి నిధులు ,జిల్లా అధికారులు రాత్రి అనక పగల అనక క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులను కలసి మాట్లాడి, ధైర్యం చెప్పి ధ్యానం కొనుగోలు పైనే ప్రధాన దృష్టి పెట్టామని అయన అన్నారు.మీరు వ్యవసాయం దండగ అన్నారు, మేము పండగ అని అందుకు అనుగుణంగా రైతుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించి రైతన్నకు బాసటగా నిలిచామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు. సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాలు,వినియోగ దారుల శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా, దళారీ వ్యవస్థ లేకుండా, రైతులకు, మిల్లులకు సంబంధం లేకుండా రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ద్వారానే ప్రతి గింజను కొంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కి 850 కోట్లు చెల్లించామని, ఇంకా ఎంత కొన్నను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.మొన్న ఆకుతీగ పాడు గ్రామం కు , వ్యవసాయ శాఖ కమిషనరు, జిల్లా జాయింటు కలెక్టరుతో పర్యటించామని ధాన్యం కొనుగోలు తర్వాత సకాలంలో డబ్బులు జమ అయ్యాయని రైతులు చెప్పారని మంత్రి అన్నారు. నందమూరు కు ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఆయన చెప్పే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని , ఆయన హయాంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గాని ఏటువంటి ప్రయోజనాలు రైతులకు కల్పించలేదన్నారు. ఆనాడు కాల్దారి కాల్పులకు ప్రతిపక్ష నాయకులు కరాకులని, రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు మిల్లర్ల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. రైతులు ఆర్బికే లో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత అని, తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లవ లసిన అవసరం లేదన్నారు.అకాల వర్షంతో రైతుల వద్ద ఉన్న ధాన్యం ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతులు ఏవ్వరూ ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, నిబంధనకు వ్యతిరేకంగా నిర్వహించిన 12 రైస్ మిల్లులను సీజ్ చెయ్యడం జరిగిందన్నారు. రైతులు మంచి పంటలు వేసుకో వాలని మంచి దిగుబడులు రావాలని రైతులు ఆనందంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశయం అని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగ దారుల శాఖ మంత్రి కారుమూరి. వెంకట నాగేశ్వరావు రావు అన్నారు. -
‘సీఎం కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు’
సాక్షి,పశ్చిమగోదావరి:పారిశ్రామిక విధానం, గొప్ప ముఖ్యమంత్రి ఉన్నారన్న భరోసాతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కారుమూరి స్పందిస్తూ.. దేశంలో అతి పెద్ద రెండో తీరప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం.. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులే పెట్టుబడిదారులను ఏపీ వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఊహించని రీతిలో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. చంద్రబాబు లాగా మసిపూసి మారేడు కాయ చేయడం లేదని, ఆయన హయాంలో లాగా హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే సిబ్బందికి సూట్లు, కోట్లు తగిలించి దొంగ ఒప్పందాలు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అంబానీ,ఆదానీ,అపాచీ మిట్టల్, జెఎస్డబ్ల్యు, జిఎంఆర్ తదితర బడా పారిశ్రామిక వేత్తలు వాస్తవ ఒప్పందాలు జరిగాయని చెప్పుకొచ్చారు. భావి తరాలకు చక్కని విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగాల కోసం సీఎం జగన్ బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. -
అంబెడ్కర్ కలను నిజం చేసిన నాయకుడు సీఎం జగన్: మంత్రి కారుమూరి
-
పవన్ కల్యాణ్పై పోటీకి సిద్దం: మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు: రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. చంద్రబాబు, లోక్శ్ బాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, మంత్రి కారుమూరి బుట్టాయగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా గెలుపు మాత్రం మాదే. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాన్ తణుకు నుంచి పోటీ చేస్తే పవన్పై పోటీ చేసేందుకు నేను సిద్థంగా ఉన్నాను. చంద్రబాబు, లోకేశ్ బాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీలేదు. లోకేశ్ పాదయాత్రను ప్రజలు జోకర్లా చూస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్పై నమ్మకంతో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
ధాన్యం సేకరణలో ఫలిస్తున్న విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం ఐదేళ్లలో సేకరించిన ధాన్యం కన్నా ఎక్కువ మొత్తాన్ని ఈ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే సేకరించింది. అప్పట్లో 2014 నుంచి 2019 వరకు రూ.40,236 కోట్లు వెచ్చించి 2.65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే... రైతులకు వేలుపట్టి నడిపించటం తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్న వై.ఎస్.జగన్ సర్కారు ఈ మూడున్నరేళ్లలోనే ఏకంగా రూ.54,279 కోట్లు ఖర్చుచేసి 2.88 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. రైతుల కష్టం దళారుల పాలు కాకూడదన్న లక్ష్యంతో ఏకంగా 3,725 రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం కొంటోంది సర్కారు. చెప్పిన గడువు ప్రకారం వాళ్లకు చెల్లింపులు సైతం జరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదారు లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నపుడు.. 3,725 ఆర్బీకేల్లో కొనుగోళ్లు జరుగుతున్నపుడు.. ఎక్కడో ఒకరో ఇద్దరో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యి ఉండొచ్చు. అయితే ఇన్ని లక్షల మందికి మేలు జరుగుతున్న విషయాన్ని పక్కనబెట్టి.. ఆ ఒకటి రెండు ఘటనలను చూపుతూ ప్రతిపక్షాలు, వాళ్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఓ వర్గం మీడియా మొత్తం ధాన్యం సేకరణ ప్రక్రియనే తప్పుబడుతోంది. ఆ ఒకటి రెండు ఘటనల్ని మాత్రమే పతాక శీర్షికల్లో ప్రచురిస్తూ దు్రష్పచారానికి దిగుతుండటంపై రాష్ట్ర రైతాంగం మండిపడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మిల్లర్లు, మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే తమ వద్ద ధాన్యాన్ని కొంటోందని, రవాణా, కూలీ, గన్నీ బ్యాగుల వంటి అంశాలను ఆర్బీకేలే చూసుకుంటున్నాయని, షెడ్యూలు ప్రకారం చెల్లింపులు సైతం జరిగిపోతున్నాయని, మద్దతు ధర చెల్లించటంతో రైతులుగా తమకు పూర్తి న్యాయం జరుగుతోందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులే కాదు... ‘ఈనాడు’ పత్రిక పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ కూడా ఖండించారు. దళారులను తొలగించటమే ఓ చరిత్ర... రైతుకు, ప్రభుత్వానికి మధ్య దళారులను తొలగించటమనేదే ఓ చరిత్ర. అంతేకాకుండా తన పంటను విక్రయించుకోవాలనుకున్న ప్రతి రైతు నుంచీ.. మద్దతు ధర చెల్లించి ఈ–క్రాప్ డేటా ఆధారంగా పంటను కొనుగోలు చేయటం మరో చరిత్ర. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో గన్నీ బ్యాగులు, కూలీ, రవాణా రైతుల నెత్తిమీదే పడేది. పైపెచ్చు సకాలంలో రైతులకు చెల్లింపులూ జరిగేవి కావు. ఆయన ఓడిపోయి వెళ్లిపోతూ రైతులకు చెల్లించకుండా వదిలేసిన రూ.980 కోట్ల బకాయిలే ఇందుకు సాక్ష్యం. ఇలాంటివన్నిటినీ సమూలంగా ప్రక్షాళన చేసి.. రైతులను ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా... అక్కడక్కడ ఒకరిద్దరు తెలుగుదేశం కార్యకర్తలను రైతులుగా నిలబెట్టి వారివద్ద మైకు పెట్టి మొత్తం ప్రక్రియనే విమర్శించటమనేది ‘ఈనాడు’, ప్రతిపక్షాలు అమలు చేస్తున్న వ్యూహం. నిజానికి గ్రామస్థాయిలో ఆర్బీకేలు వచ్చాక... ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఏటికేడాది ఇంకా మెరుగుపడుతోంది. వేగం అందుకుంటోంది. ఈ సానుకూలతను ప్రతిపక్ష మీడియా మరుగునపరుస్తున్నా... రైతులు మాత్రం క్షేత్ర స్థాయిలో ప్రశంసిస్తూనే ఉన్నారు. కలెక్టర్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు.. దశాబ్దాలుగా రైతుల గిట్టుబాటు ధరను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులకు తొలిసారిగా ప్రభుత్వం చెక్పెట్టింది. కల్లంలో ఆర్బీకే సిబ్బంది ధాన్యం తూకం వేసి, ఎఫ్టీవో (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) జనరేట్ చేసిన తర్వాత మద్దతు ధర ఒక్క రూపాయి కూడా తగ్గకుండా రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపడుతోంది. మిల్లుకు ధాన్యాన్ని చేర్చడంతో పాటు మిల్లరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. రైతులతో సబంధం లేకుండానే వాటిని పరిష్కరించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొలి్పంది. ఫలితంగా ఆర్బీకేలో ఖరారైన తేమ శాతానికి, తూకానికి మిల్లరు కట్టుబడాల్సిన పరిస్థితి వచి్చంది. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, జేసీలు, రెవెన్యూ, పౌరసఫరాలు, టెన్నికల్ అసిస్టెంట్లు, పీఏసీఎస్ సిబ్బంది వరకు ధాన్యం సేకరణలో భాగస్వాములయ్యారు. ధాన్యం అమ్మటానికి వచ్చిన రైతుకు ఏ స్థాయిలో ఇబ్బంది కలిగినా సర్కారు వేగంగా స్పందిస్తోంది. కొంత మంది మిల్లర్లు తేమ శాతం ఎక్కువ ఉందని రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను సైతం ఆయా జిల్లా కలెక్టర్లు తిరిగి వెనక్కి ఇప్పించిన దాఖలాలున్నాయంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆర్బీకే ద్వారా ఎఫ్టీవో పొందాక రైతు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని వారికి అవగాహన కలి్పస్తున్నారు. మిల్లర్లు తరుగు కింద ధాన్యం తగ్గించినా, రైతు నుంచి డబ్బు డిమాండ్ చేసినా, ఇతర విషయాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ 1967 వివరాలను ఎఫ్టీవో రశీదుపై ప్రభుత్వం ముద్రిస్తోంది కూడా. పక్కాగా నిబంధనలు అమలు.. మిల్లర్ల దందాను అరికట్టే క్రమంలో ప్రభుత్వం లక్ష్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న మిల్లర్లెవ్వరినీ ఉపేక్షించట్లేదు. ఈ క్రమంలోనే రైతులను మిల్లులకు పిలిచి ఇబ్బంది పెడుతున్న మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ కొరఢా ఝుళిపించింది. విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పశి్చమగోదావరి జిల్లాల్లో 23 మిల్లులపై కఠిన చర్యలకు ఆదేశించింది. మరోవైపు ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది టెన్నికల్ అసిస్టెంట్స్, 7 మంది పీఏసీఎస్ సిబ్బందిలో పౌరసరఫరాల శాఖ ఒకరిని తొలగించడంతో పాటు, మిగిలిన వారిని సస్పెండ్ చేయటం, షోకాజ్ నోటీసులివ్వటం వంటివి చేసింది. 23 మిల్లులపై చర్యలు ఇలా.. – పశ్చిమగోదావరిలో ఒక మిల్లును బ్లాక్ లిస్టు చేశారు. మూడు మిల్లులకు షోకాజ్ నోటీలు ఇచ్చారు. – విజయనగరంలో మూడు మిల్లులను కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)నుంచి తప్పించారు. – తూర్పుగోదావరిలో మూడు రైస్ మిల్లులను హెచ్చరికలో భాగంగా ఐదు రోజుల పాటు డిటాగ్ చేశారు. – కృష్ణా జిల్లాలో పది మిల్లులను షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. – ఎన్టీఆర్ జిల్లాలో మూడు మిల్లులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైతులకు సమాచారం ఇచ్చాకే... కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఇప్పుడే కోతలు చేపట్టడం, సంక్రాంతి కావడంతో కొనుగోళ్లు నెమ్మదించాయి. ఈ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయితే మొత్తం లక్ష్యం 35 లక్షల టన్నులు ముగుస్తుంది. ప్రభుత్వం ఎక్కడైతే పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ముగిశాయో అక్కడ క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ధాన్యం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రక్రియను ముగించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో ఆర్బీకే సిబ్బంది, తహసీల్దార్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా ఆమోదం పొందిన తర్వాతే.. రైతులకు సమాచారం ఇచ్చాకే ధాన్యం సేకరణ కేంద్రాన్ని మూసివేస్తారు. రైతులకు పూర్తి మద్దతు ధర వస్తుండటంతో దాదాపు అంతా ప్రభుత్వం ద్వారా విక్రయించేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు బ్యాంకు గ్యారెంటీల శాతాన్ని పెంచడంతో జిల్లాలకు ధాన్యం సేకరణ కేటాయింపు కూడా పెరిగింది. దళారులను అడ్డుకుంటున్నందుకే టీడీపీ యాగీ... ప్రభుత్వం ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం అండతో చెలరేగిపోయిన ఆ పార్టీ మిల్లర్లకు, దళారులకు పరిస్థితులు ఏమాత్రం రుచించటం లేదు. రైతులు తాము చెప్పిన రేటుకే గతంలో అమ్మేవారని, దానివల్ల తమకు భారీగా వచ్చే ఆదాయం మొత్తానికి ఇపుడు గండిపడిందని రగిలిపోతున్నారు. అందుకే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొందరైతే ప్రభుత్వం కొనుగోలు చేయదని, ధాన్యం పాడైపోతుందని, అకాల వర్షాలు దెబ్బతీస్తాయని రకరకాలుగా భయపెట్టి రైతుల నుంచి ముందుగానే తక్కువ రేటుకు ధాన్యం కొనేశారు. ఆ దళారులే ఇప్పుడు రైతుల పేరుతో ఆర్బీకేల్లో ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధరతో పాటు హామాలీ, రవాణా ఖర్చులను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. వారిని ప్రభుత్వం సమర్థంగా అడ్డుకోవటంతో పచ్చపత్రికలు రంగంలోకి దిగి తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయనేది రైతుల మాట.. జియో లొకేషన్ ట్యాగింగ్తో.. ‘‘రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు మూసి వేయట్లేదు. తాత్కాలిక అంచనాలు ప్రకారం ఆర్బీకేలకు ధాన్యం కొనుగోళ్లకు అనుమతులు ఇచ్చాం. చాలా వరకు ఆర్బీకేలు ఈ లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఇప్పుడు ఇంకా క్షేత్ర స్థాయిలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం డేటాను సేకరిస్తున్నాం. ఇందులో అక్రమంగా బయటి ధాన్యం చొరబకుండా జియో లొకేషన్ ట్యాగ్ చేస్తూ సేకరించాల్సిన ధాన్యం వివరాలను ఫొటోల రూపంలో ప్రత్యేక యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాం. కొందరు దళారులు రైతుల నుంచి ముందుగానే తక్కువ రేటుకు ధాన్యం కొని ఇప్పుడు అదే రైతుల పేరుతో అమ్మాలని చూస్తున్నారు. దీనిని అరికట్టేందుకే జియో ట్యాగ్ చేస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పండుగ సందర్భంగా కొనుగోళ్లు నెమ్మదించాయి తప్ప.. నిలిపివేయలేదు. జనవరి 13 నుంచి 19వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.17లక్షల టన్నులు సేకరించాం. – జి.వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ ఈ సారి కొనుగోళ్లు బాగున్నాయి.. నేను ధాన్యం విక్రయించిన ఇన్నేళ్లలో ఇంత త్వరగా ఎప్పుడూ డబ్బులు పడలేదు. ఎవరి చుట్టూ తిరగకుండానే ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసింది. మూడున్నర ఎకరాల్లో పంట వేశారు. సుమారు ఎనిమిది టన్నుల వరకు ధాన్యాన్ని అమ్మాను. నేను డిసెంబర్ 15వ తేదీ ధాన్యం ఇస్తే జనవరి మొదటి వారం మొత్తం రూ.1.30 లక్షలు జమయ్యాయి. గతంలో మాదిరిగా మిల్లర దగ్గరకు వెళ్లి బతిమలాడుకోలేదు. తేమ శాతంలో కోత కూడా పెట్టలేదు. నిబంధనలు ప్రకారం నాకు దక్కాల్సిన మద్దతు ధర ప్రతి పైసా వచి్చంది. మా దగ్గర ఈ సారి కొనుగోళ్లు బాగున్నాయి. – ఎం.అప్పలనాయుడు, వంగర మండలం, కేసీహెచ్ పల్లె గ్రామం, విజయనగరం జిల్లా ఐదు రోజుల్లో నగదు జమ అయింది నేను ఖరీఫ్లో ఐదు ఎకరాలల్లో వరి సాగు చేశాను. 110 క్వింటాలను రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం కోనుగోలు చేసింది. డిసెంబర్ 9న ధాన్యం ఇస్తే.. డిసెంబర్ 14న రూ.2,24,400 నా ఖాతాలో పడ్డాయి. 5 రోజుల్లో ధాన్యం డబ్బు జమ కావడం గతంలో ఎప్పుడూ చూడలేదు. వరి పంట సాగు చేస్తున్న రైతుకి ప్రతి సంవత్సరం ఏదో కారణంగా తీవ్ర నష్టం వచ్చేది. ఈ సారి ఆ కష్టాలను అధిగమించాం. మంచి మద్దతు ధర కూడా దక్కింది. – కుమరాపు శ్రీనివాసరావు, డీఆర్వలస, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా రవాణా ఖర్చులు కూడా దక్కాయి నాకు మూడు ఎకరాలు, నా కుమారుడికి ఒక ఎకరా చొప్పున పల్లం భూమి ఉంది. ఈ ఏడాది ఎకరాకు 30 బస్తాలు చొప్పున పంట దిగుబడి వచ్చింది. డిసెంబర్ 25వ తేదీన కొప్పర వలస రైతు భరోసా కేంద్రం ద్వారా 120 బస్తాల ధాన్యం విక్రయించాను. మూడు రోజులు కిందట మా ఖాతాలకు రూ.1.95 లక్షలు జమ అయ్యింది. దీనికి తోడు లోడింగ్, రవాణా ఖర్చులు కూడా పడ్డాయి. – యలకల జనార్ధన నాయుడు, వంగర మండలం, రుషింగి గ్రామం, విజయనగరం జిల్లా అంచనా దాటినా కొంటున్నాం.. ఈ ఖరీఫ్లో కాకినాడ జిల్లాలో 263 కొనుగోలు కేంద్రాలు ద్వారా ధాన్యం సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 2.44 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. ఇది తాత్కాలిక అంచనాను దాటింది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొంటాం. ఎక్కడా ధాన్యం కేంద్రాలను మూసివేయలేదు. జిల్లాలో 51,519 మంది రైతుల నుంచి ధాన్యం కొంటే రూ.466.61 కోట్లు చెల్లించేశాం. –ఎస్.ఇలక్కియ, జేసీ, కాకినాడ జిల్లా రైతులు ఆందోళన చెందొద్దు రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు అధైర్య పడొద్దు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు మూసివేయట్లేదు. ఒకవేళ తాత్కాలిక లక్ష్యం పూర్తయినా కూడా కొనుగోలు చేస్తాం. ఎవరూ కూడా మిల్లర్లు దగ్గరకు వెళ్లొద్దు. వారు తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కోత పెట్టడం, డబ్బులు వసూలు చేయడం, ధాన్యాన్ని ఆన్లోడ్ చేయకపోయినా కఠినంగా వ్యవహరిస్తాం. అవసరమైతే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టి జైలుకు కూడా పంపించేందుకు వెనుకాడం. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రి -
పవన్కు ప్రజలు తిరిగి అదే గతి పట్టిస్తారు: మంత్రి కారుమూరి
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్ పార్టీని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టేశాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. అన్ననే గెలిపించలేదని హేళన చేసిన టీడీపీతోనే కలవడానికి సిగ్గు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులతో కొడతానన్న పవన్కు ప్రజలు తిరిగి అదేగతి పట్టిస్తారని హెచ్చరించారు. పవన్ వ్యాఖ్యలను చూసి యువత అసహ్యించుకుంటున్నారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చదవండి: (మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు) -
‘జనసేన పార్టీని పవన్ తాకట్టుపెట్టాడు’
తాడేపల్లిగూడెం(ప.గో. జిల్లా): చంద్రబాబు-పవన్ కల్యాణ్ సమావేశంపై మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. అవకాశవాద రాజకీయాల కోసమే వారి సమావేశమని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ‘పవన్ అవకాశవాది. పవన్ తీరుతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ తాకట్టుపెట్టాడు.ఆర్థిక లబ్ధి కోసమే చంద్రబాబును పవన్ కలిశాడు’ అని మంత్రి విమర్శించారు. చంద్రబాబు, పవన్కు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని, పేద ప్రజల ప్రాణాలన్నా వారికి లెక్కలేదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. -
బాబు, పవన్ కలయిక అందరూ ఊహించిందే : మంత్రి కారుమూరి
-
ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తో " స్ట్రెయిట్ టాక్ "
-
టీడీపీకి సమాధి కట్టేది బీసీలే
సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న బుధవారం నిర్వహించనున్న జయహో బీసీ సభతో టీడీపీ అధినేత చంద్రబాబుకి వణుకు మొదలైందని వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేశారు. అందుకే అయ్యన్న, అచ్చెన్నలాంటి టీడీపీ జాగిలాలను తమపైకి వదులుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి సమాధి కట్టేది బీసీలేనని స్పష్టం చేశారు. టీడీపీలో బీసీలను జెండా మోసేవారిగానే చూశారన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మూడున్నరేళ్ల పాలనలోనే సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాలకు రూ.90,415 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే.. పెద్ద బీసీ.. సీఎం జగన్ శతాబ్దాల నుంచి బీసీలు వివక్ష అనుభవిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు ఆత్మగౌరవంతోపాటు పాలనలో భాగస్వామ్యం కూడా కల్పించారు. పెద్ద బీసీ.. సీఎం జగన్ మాత్రమే. శతాబ్దాలుగా ఇనుప గజ్జెలతో మోతుబరి వ్యవస్థ మాపై నాట్యం చేస్తున్న తరుణంలో బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు.. దేశానికే బ్యాక్ బోన్ అని సీఎం జగన్ నిరూపించారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారు. గత ప్రభుత్వంలో బీసీలకు చంద్రబాబు కేవలం రూ.965 కోట్లు బడ్జెట్ మాత్రమే కేటాయించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మూడేళ్లలోనే రూ.90,415 కోట్లు ఖర్చు చేశారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీపీలు, సహకార సంఘాల డైరెక్టర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, లోక్సభ, రాజ్యసభల్లో ఎంపీలుగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. బీసీలు అధికంగా ఉండే విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం బీసీల అభ్యున్నతికి చిహ్నం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్ టీడీపీలో వణుకు మొదలైంది.. ఈ మూడున్నరేళ్లలోనే బీసీల్లో ఎంతో పేరు సంపాదించిన సీఎం వైఎస్ జగన్ను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ జయహో బీసీ సభ అనగానే టీడీపీలో వణుకు మొదలైంది. బీసీలే టీడీపీకి సమాధి కడతారు. బీసీలకు ఏం చేశామో.. ధైర్యంగా మేం చెప్పుకోగలం. చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా? బీసీలకు బాబు వెన్నుపోటు పొడిచారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. అయ్యన్నపాత్రుడు ఒక రోగ్. బీసీలను చంద్రబాబు ఓటింగ్ యంత్రాలుగానే చూశారు. ఒక్క బీసీకి కూడా రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. సీఎం జగన్ ఏకంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు. బీసీల గుండెల్లో జగన్ ఉన్నారు. బాబు పునాదులు కదులుతున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ అంటూ ప్రజలు విసుక్కుంటున్నారు. –కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి బీసీల సంక్షేమంపై టీడీపీ నేతలవి పచ్చి అబద్ధాలు.. బీసీల సంక్షేమంపై టీడీపీ నేతల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 1995లో చంద్రబాబు టీడీపీని ఆక్రమించుకున్నాక ప్రతి సాధారణ ఎన్నికల్లో బీసీలకు 100 టికెట్లు ఇస్తామని చెప్పి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? దీన్ని ఎందుకు టీడీపీలోని బీసీ నాయకులు ప్రశ్నించలేకపోతున్నారు? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నది టీడీపీకి చెందిన వ్యక్తి. ఇది వాస్తవం కాదా? కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా బీసీలకు మేలు చేయడానికి సీఎం జగన్ పార్టీ తరఫున రిజర్వేషన్లు అమలు చేశారు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున రూ. 50 వేల కోట్లు ఇస్తామని చెప్పి, కేవలం రూ.14,246 కోట్లు మాత్రమే బాబు ఖర్చు చేశారు. సీఎం జగన్ తొలి ఏడాదిలోనే రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారు. 5 చట్టాలు, 56 కార్పొరేషన్లు, 9 నవరత్నాలు, 18 ప్రత్యేక పథకాలు, 14 శాఖల పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే బీసీ జనగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ సైతం పంపారు. – యనమల నాగార్జున యాదవ్, అధికార ప్రతినిధి, వైఎస్సార్సీపీ బీసీలే ఎజెండా రూపకర్తలు జయహో బీసీ సభకు వచ్చే బీసీ సోదరుల సునామీలో చంద్రబాబు కొట్టుకుపోతారు. దీంతో టీడీపీకి చెందిన బీసీ జాగిలాలను మా మీద దాడికి వదిలారు. అయ్యన్నపాత్రుడు ఒక గంజాయి డాన్, స్మగ్లర్. ఈఎస్ఐలో మందులు మెక్కిన అచ్చెన్నాయుడు, కాల్మనీ సెక్స్ రాకెట్ల ద్వారా మహిళా జాతిని సర్వనాశనం చేసిన బుద్ధా వెంకన్న ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీసీలను చంద్రబాబు బానిసలుగా చూస్తే, అదే బీసీలకు రక్షగా సీఎం జగనన్న ఉన్నారు. టీడీపీలో బీసీలను జెండా మోసేవారిగానే చూశారు. అదే వైఎస్సార్సీపీలో బీసీలే ఎజెండా రూపకర్తలు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాసింది నిజమా? కాదా? కాదని లోకేష్ మీద ప్రమాణం చేయగలరా? – కొండా రాజీవ్గాంధీ, అధికార ప్రతినిధి వైఎస్సార్సీపీ -
దోచుకో.. దాచుకో.. పంచుకో ఇదే చంద్రబాబు విధానం: మంత్రి కారుమూరి
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీసీలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని విమర్శించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని, ఏం మాట్లాడుతున్నారో అయనకే తెలియడం లేదని దుయ్యబట్టారు. దోచుకో.. దాచుకో.. పంచుకో ఇదే చంద్రబాబు విధానమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలకంటే సీఎం జగన్ ఎక్కువే చేశారన్నారు. 56 కార్పొరేషన్లు ఇచ్చి బీసీల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. బీసీలంతా జగన్ వెంట ఉన్నారన్నారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాకే బీసీలకు అనేక పదవులు దక్కాయన్నారు. వైఎస్ జగన్ బీసీలకు నాలుగు రాజ్యసభ పదవులు ఇస్తే.. టీడీపీ ఒక్క పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చదవండి: దగుల్బాజీ రామోజీ తప్పు చేస్తే ప్రశ్నించకూడదా?: మంత్రి కాకాణి ‘గత ఎన్నికల్లో చంద్రబాబును చీకొట్టినా బుద్ధి రాలేదు. బాబును ప్రజలు నమ్మరు. ఐటీ తానే కనిపెట్టానని, సెల్ ఫోన్లు తానే కనిపెట్టానని చెప్పుకుంటున్నారు. ఈడీ దాడులు చేయగానే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లమీద పడ్డారు. నోటి దురదతో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు పెద్ద స్కాం చేసి జైలుకి వెళ్లొచ్చాడు. బీసీలకు రావాల్సిన లబ్దిని రాకుండా చేశారు. బీసీల మీటింగుతో టీడీపీ వారికి భయం పట్టుకుంది. టీడీపీ నేతలకు సిగ్గుండాలి. బీసీల్లో ఆత్మగౌరవం పెరిగింది. మాకు పదవులు ఇవ్వడమే కాదు, పూర్తి స్వేచ్చ ఇచ్చారు. బీసీలపై చర్చకు మేము సిద్దం. టీడీపీ నేతలు సిద్దమా? ఎవరేమి చేశారో డిసెంబర్ 7న జరగనున్న బీసీ సభలో వెల్లడిస్తాం. బీసీల కోసం చంద్రబాబు ఒక్క సెంటు భూమినైనా కొన్నాడా?. అప్పు చేసిన డబ్బు చంద్రబాబు ఏం చేశాడో లెక్క తేల్చాలి. మేము చేసిన అప్పులన్నిటికీ లెక్కలు ఉంటాయి. జయహో బీసీ అనేది టీడీపీ రిజిస్ట్రేషన్ చేసుకుందా?అది అందరిదీ. ఓటు బ్యాంకుగానే మమ్మల్ని ఇంతకాలం వాడుకున్నారు. ఇకముందు అవేమీ చెల్లవు. వారి ఆట ముగిసింది. టీడీపీకి ఘోరీ కట్టబోతున్నాం. ’ అని మంత్రి కారుమూరి నిప్పులు చెరిగారు. -
‘చంద్రబాబు మోసాలపై మోదీనే చెప్పారు.. ఇంకా సాక్ష్యం ఏం కావాలి’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు హయంలో ఎప్పుడైనా బీసీలకు పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాగా, మంత్రి కారుమూరి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నారు. అన్ని పదవుల్లో బీసీలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబు పనంతా దాచుకోవడం.. దోచుకోవడమే. మళ్లీ దోచుకోవడానికి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే. పోలవరం నిధులను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీయే అన్నారు’ అని తెలిపారు. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యం
సాక్షి, అమరావతి: వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సత్వర న్యాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరించినట్లు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు.సచివాలయంలో గురువారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి తొలి సమావేశం జరిగింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సవరించిన చట్టం ప్రకారం కొనుగోలుదారులు వస్తువులు ఎక్కడ కొన్నప్పటికీ వారి నివాస ప్రాంతం నుంచి ఆన్లైన్లో, స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో, లేదా వినియోగదారుల సేవ కేంద్రంలోని 1967, 18004250082 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు హాజరు కావొచ్చని చెప్పారు. వినియోగదారులు దోపిడీకి గురికాకుండా గత పది నెలల్లో విస్తృతంగా తనిఖీలు చేసి 1,748 కేసులు నమోదు చేశామన్నారు. పాత వాటితో కలిపి మొత్తం 2,139 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. పెట్రోల్ బంకులపై 97 కేసులు, ఎరువుల దుకాణాలపై 350 కేసులు, విశాఖపట్నం, విజయవాడలోని షాషింగ్ మాల్స్పై 175 కేసులు నమోదు చేశామన్నారు. త్వరలో బంగారు నగల దుకాణాల్లో కూడా తనిఖీలు చేస్తామన్నారు. ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు 15 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ఆరు ఫిబ్రవరికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విశాఖలోని ల్యాబ్ను ఆధునీకరిస్తామని, విజయవాడ, తిరుపతిలో కూడా ల్యాబ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఉక్రోషంతో చంద్రబాబు దుర్భాషలు భవిష్యత్తులో రాజకీయ జీవితం ఉండదని చంద్రబాబునాయుడు ఉక్రోషంతో దుర్భాషలకు దిగుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రజలు పట్టించుకోవట్లేదని, ఇక ఇంటికి వెళ్లాల్సిందేనని అర్థమైన చంద్రబాబు చివరి ఎన్నికలని, అసెంబ్లీకి పంపాలని వేడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీకి నాయకత్వమే లేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలను వారి కుటుంబ సభ్యులే తిడుతున్నారన్నారు. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం రైతుల నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. నూతన ఆన్లైన్ విధానం ద్వారా రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఒక్కపైసా కూడా నష్టపోకుండా మద్దతు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్టీవో వచ్చిన 21 రోజుల్లోగా నగదు జమ చేసేలా ఆదేశించామన్నారు. ఇప్పటికే 2.30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొని, రూ.160 కోట్లకు పైగా చెల్లించామన్నారు. ఇందులో ధాన్యం అమ్మిన మరుసటిరోజే నగదు జమయిన∙ రైతులు కూడా ఉన్నట్లు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. -
దళారులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి కారుమూరి
-
సజావుగా ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణలో ఈసారి నుంచి సరికొత్త విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో అక్కడక్కడా తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. కనీస మద్దతు ధరతో పాటు గోనె సంచుల డబ్బులు, హమాలీ చార్జీలు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే క్రిమినల్ చర్యలు ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులు తమ పంటను నేరుగా ఆర్బీకేల వద్దకు తీసుకుని రావాలని మంత్రి కారుమూరి సూచించారు. రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లవద్దని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్ల జోక్యం తగదని.. ఈ మేరకు ఇప్పటికే వారికి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీకేల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఆర్బీకేల సంఖ్యను పెంచాలన్నారు. గత ముఖ్యమంత్రుల కన్నా సీఎం జగన్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతుల ముసుగులో కొందరు ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పవన్ ప్యాకేజ్ కోసం యువతను పెడదారి పట్టించొద్దు
-
కేరళకు ఆంధ్రా ధాన్యం
సాక్షి, అమరావతి: కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్తో కూడిన కేరళ ఉన్నతాధికారుల బృందం మంత్రి కారుమూరితో భేటీ అయింది. తమకు కావాల్సిన సరుకుల సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం మంత్రి కారుమూరి మాట్లాడుతూ లక్ష టన్నుల ధాన్యం, 60 వేల టన్నుల బియ్యం కావాలని కేరళ ప్రభుత్వం అడగటం శుభపరిణామమని పేర్కొన్నారు. నెలకు 550 టన్నుల ఎండుమిర్చి, కంది, పెసర, మినుములు సైతం సరఫరా చేయాలని కోరిందని తెలిపారు. ఈ నెల 21న మరోసారి సమావేశమై ధరలు నిర్ణయిస్తామన్నారు. ధరలు రైతులకు లాభదాయకంగా ఉంటే ఈ నెల 27న కేరళలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయని వివరించారు. పౌర సరఫరాల కమిషనర్ అరుణ్కుమార్, డైరెక్టర్ విజయ సునీత, ఏపీ ఎస్సీఎస్సీఎల్ ఎండీ వీరపాండియన్, సహకార సంఘాల కమిషనర్ ఎ.బాబు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో రూ.30 కోట్లు కొట్టేశారు టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పౌర సరఫాల శాఖ నిధులు రూ. 30 కోట్లు కొల్లగొట్టారని మంత్రి కారుమూరి చెప్పారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రాథమికంగా ఐదుగురి తప్పు తేలడంతో వారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. నిందితుల ఆస్తులను అటాచ్ చేశామని, మొత్తం వసూలు చేస్తామన్నారు. తప్పుడు పత్రాలతో చెరువులు, కాలువలు, తోటలను వరి పొలాలుగా చూపి ఈ–క్రాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై ధాన్యం నగదుతో పాటే రవాణా చార్జీలనూ రైతుల అకౌంట్లో వేస్తామన్నారు. -
మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అమరావతి పేరుతో చంద్రబాబు బినామీల రాజధాని కట్టాలని చూశారని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరారవు మండిపడ్డారు. శనివారం వికేంద్రీకరణకు మద్దతుగా తణుకు నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి మనల్ని తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు అన్నారు. తన స్వార్థం కోసం అసైన్డ్ భూముల చట్టాన్ని కూడా మార్చారని మండిపడ్డారు. 'నూజవీడులో రాజధాని వస్తుందని నమ్మి భూములు కొన్న చాలా మంది రైతులు చనిపోయారు. అమరావతి చుట్టూ తన అనుయాయులతో భూములు కొనిపించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందులో అమరావతి ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. 29 గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కాదు. భూములు ఇవ్వమన్న రైతులకు సీపీఎం, సీపీఐ, జనసేన నాడు మద్దతుగా నిలిచి ఇప్పుడు మాట మార్చాయి. 29 గ్రామాల ప్రజలు కోసం మూడు ప్రాంతాల ప్రజలు మోసపోవాలా?. మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది' అని మంత్రి కారుమూరి నాగేశ్వరారవు వ్యాఖ్యానించారు. చదవండి: (స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ) -
మొగల్తూరు: కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రి రోజా
-
కృష్ణంరాజు స్మృతి వనం.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, పశ్చిమ గోదావరి: రెబల్స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలిసి హాజరయ్యారు టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలసి మంత్రులంతా కలిసి సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు మరణంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారని, సినీ-రాజకీయ రంగాల్లో రాణించిన ఆయన మృతి ఆయా రంగాలకు తీరని లోటని మంత్రి రోజా అన్నారు. ఆయన పేరిట మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ తరపున కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని, రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని, ఇదే విషయాన్ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సైతం తెలిపామని వెల్లడించారు. -
వెన్నుపోటుదారులకు నువ్వు మద్దతివ్వలేదా?
తణుకు అర్బన్: ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి కుర్చీలో కూర్చున్న చంద్రబాబుకు సహకరించింది నువ్వు కాదా బాలకృష్ణా అంటూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. తణుకులో ఆదివారం ఆయన మాట్లాడుతూ..ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా దించేసి, కుంగి కృశించి మృతి చెందడానికి కారణమైన చంద్రబాబును నీవు భుజాలపైకి ఎక్కించుకోలేదా అని బాలకృష్ణను ప్రశ్నించారు. సినిమాల్లో విలన్లాంటి పాత్ర పోషిస్తున్న చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నప్పుడే నీ తండ్రిపై నీకు ఎంతప్రేమ ఉందో ప్రజలందరికీ అర్థమైందన్నారు. సీఎం వైఎస్ జగన్కి ఎన్టీఆర్పై ప్రేమ ఉంది కాబట్టే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారని చెప్పారు. -
బీసీలకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు: మంత్రి కారుమూరి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ఏనాడైన బీసీలకు న్యాయం చేశారా?. బీసీల తోకలు కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ఎవరినైనా బీసీని రాజ్యసభకు పంపించావా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. విశాఖలో మంత్రి కారుమూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీఠ వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు రాజ్యసభకు వెళ్లారో ప్రజలకు తెలుసు. మంత్రి వర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలకు ప్రాధాన్యత ఉందా అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ అంటే వైఎస్ గుర్తుకు వస్తారు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టాము. తణుకులో బీసీ కమ్యూనిటీ హాలుకు జ్యోతి రావు పూలే పేరు పెడితే టీడీపీ హయాంలో ఆ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు వైఎస్ కృషి చేశారు. అందుకే ఆయన పేరు పెట్టాలని ఎక్కువ మంది కోరారు’ అని స్పష్టం చేశారు. -
ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా అభివృద్ధి చేశాం: మంత్రి కారుమూరి
-
‘రోలెక్స్ వాచీలు, బౌన్సర్లతో జరిగేది రైతుల యాత్రనా?’
సాక్షి, అమరావతి: అమరావతి మహాపాదయాత్ర అనేది చంద్రబాబు అండ్ కో ఆడిస్తున్న డ్రామాగా అభివర్ణించారు ఏపీ మంత్రి కారుమురి నాగేశ్వరరావు. ఈ యాత్రలో బౌన్సర్లతో రైతులు యాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేశారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పాదయాత్రలో ఎప్పుడు బౌన్సర్లను చూడలేదు. రోలెక్స్ వాచీలు పెట్టుకుని మరీ పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు. ఇంత రిచ్ రైతులను.. వాళ్లు చేస్తున్న యాత్రను దేశచరిత్రలోనే చూసి ఉండరు అని మంత్రి కారుమురి సెటైర్ వేశారు. అమరావతిని కడితే రాష్ట్ర భవిష్యత్ దెబ్బతింటుందన్న ఆయన.. ఒక వేళ నిజంగా నాలుగు లక్షల కోట్లు పెట్టి ఉంటే ఊహించిన నష్టం వాటిల్లేదన్నారు. చంద్రబాబు తన నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేసేవాడని విమర్శించారు. ఇక.. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. కొంతమంది కావాలనే రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి. ప్రజలందరూ మూడు రాజధానులు కోరుకుంటున్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు మేలు జరగాలన్నదే మా కోరిక అని మంత్రి కారుమురి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అది ప్రభుత్వ విధాన నిర్ణయం-ఏపీ హైకోర్టు -
టీడీపీ కుట్ర బట్టబయలు: మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: ఆ ఫోరెనిక్స్ రిపోర్టు తాను ఇచ్చింది కాదని అమెరికాలోని ల్యాబ్కు చెందిన జిమ్ స్టాఫర్డ్ స్వయంగా స్పష్టం చేయడంతో టీడీపీ కుట్ర బట్టబయలైందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రిపోర్టును మార్చడానికి ఆయన సమ్మతించక పోవడంతో ఏకంగా సర్టిఫికెట్నే మార్చడం టీడీపీ దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను ఇబ్బంది పెట్టారని ఏ మహిళా.. ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినా ఒక మార్ఫింగ్ వీడియోతో చంద్రబాబు అండ్ కో నీచ రాజకీయాలకు తెరతీశారని దుయ్యబట్టారు. సాంకేతికతను ఉపయోగించుకుని కుట్రలకు తెరతీయడంలో దిట్ట అయిన చంద్రబాబు, లోకేశ్ గ్యాంగ్ ఎంతటి నీచానికైనా ఒడిగడతారని మండిపడ్డారు. తప్పుడు రిపోర్ట్తో దొరికిపోయిన బాబు అండ్ గ్యాంగ్పై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ వీడియో చూశామని టీడీపీకి చెందిన కొందరు మహిళలు సభ్యత మరచి.. అడ్డగోలుగా మాట్లాడుతుండడం పట్ల సభ్య సమాజం తల దించుకుంటోందని అన్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేస్తున్న లోకేశ్ చిత్రాలు చూసి కూడా ఏమీ మాట్లాడని చంద్రబాబు అండ్ కోను ఏమనుకోవాలని నిలదీశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: ‘టీడీపీ పెద్ద ఫేక్.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబూ ఫేక్’ -
బాబు వైఖరి మారకపోతే 3 సీట్లు కూడా దక్కవు
తణుకు టౌన్: బడుగు, బలహీనవర్గాల పట్ల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీ నాయకులు వివక్ష, ద్వేష భావాలను వదలకపోతే రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న 23 సీట్లలో 3 కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీల తోకలు కట్ చేస్తానని హేళన చేశారని, ఇప్పటికీ మారని ఆయన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. మంత్రి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్పై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తే బడుగు, బలహీన వర్గాలపై ఆ పార్టీ ఎంత ద్వేషంతో ఉందో అర్థమవుతుందని చెప్పారు. యూకే నుంచి తెప్పించిన మార్ఫింగ్ చేసిన వీడియోతో టీడీపీ నాయకుల దుష్ప్రచారం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో మహిళలు, బడుగు బలహీన వర్గాల పట్ల టీడీపీ వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందన్నారు. ఆడవారిని ఏ విధంగా అవమానిస్తారో, ఎన్టీఆర్ను జయప్రదంగా పార్టీ నుంచి ఎలా వెళ్లగొట్టారో అందరికీ తెలుసని చెప్పారు. గోరంట్ల మాధవ్, నందిగం సురేష్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిందని, వాటిని తట్టుకుని పోరాడి 2019 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిచి పార్లమెంట్లో ప్రవేశించారని చెప్పారు. వారిని ఎదుర్కోలేక బూతు పురాణంతో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. -
‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు. చదవండి: వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా? ‘‘పుష్కరాల్లో బాబు లెగ్ పెట్టాడు. 29 మందిని పొట్టన పెట్టుకొన్నాడు. నిన్న కూడా గోదావరి జిల్లాల్లో అడుగు పెట్టాడు. పడవ ప్రమాదం జరిగింది. గోదారమ్మ దయతో శాంతించింది కాబట్టి టీడీపీ నేతలు బతికి బయట పడ్డారు. సీఎం జగన్ పాలనలో గోదావరి ప్రాంత ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. వరదలు సంభవించినప్పటి నుంచి సీఎం జగన్, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంతా ప్రజలతోనే ఉన్నాం. ప్రజలు మంచి కోసం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి అన్నారు. -
చంద్రబాబు చీప్ పాలిటిక్స్: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: గోదావరికి ఎన్నడూ లేనంతగా ఉధృతంగా వరదలు వచ్చాయని.. ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరదలపై అధికారులను అలర్ట్ చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. చదవండి: ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయి: మంత్రి వేణు ‘‘ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అనేక చర్యలు తీసుకున్నాం. గతంలో జిల్లాకు ఒక కలెక్టర్, ఒక జేసీ ఉండేవారు. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అధికారుల సంఖ్య పెరిగింది. వలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులు, మంత్రులు సమన్వయంతో పని చేశారు. జిల్లాకు రెండు కోట్లు, నాలుగు కోట్లు చొప్పున కేటాయించారు. నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, పాలు, కిరోసిన్ అందించాం. సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులతో రెగ్యులర్గా మానిటరింగ్ చేశారని’’ మంత్రి అన్నారు. గతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే విహార యాత్రలా చేసేవారని మంత్రి దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈనాడు పత్రికలో పిల్లలకు పాలు లేవు, పెద్దలకు తిండి లేదంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును జాకీలు పెట్టి ఎల్లో మీడియా లేపుతోందని మండిపడ్డారు. ఎల్లో పత్రికల్లో రాసినవి.. చంద్రబాబు ప్రెస్ మీట్లు, పవన్ ట్వీట్లు పెడుతున్నారు. రామోజీ దిగజారి చీప్గా ప్రవర్తిస్తున్నారని మంత్రి కారుమూరి నిప్పలు చెరిగారు. చంద్రబాబు పాలనలో వర్షాలు కూడా పడలేదు. సీఎం జగన్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నా రాజకీయ జీవితంలో వైఎస్సార్సీపీ ప్లీనరీకి వచ్చిన జనాల్ని ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు చేసేవన్నీ చీప్ పాలిటిక్స్. సీఎం జగన్ ముందుచూపు వల్లే వరదల్లో ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూశాం. అదనంగా బోట్లు, హెలికాఫ్టర్లు సిద్ధం చేస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. -
అన్ని వర్గాల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం
సాక్షి,తణుకు అర్బన్: ప్రజలకు పారదర్శకంగా సంక్షేమాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పరచారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో తణుకు మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. ఓకేసారి ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశచరిత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఏ లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందో దానికి కట్టుబడి ఉద్యోగులంతా ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. సీఎం జగన్కు రుణపడి ఉంటాం పీజీలు చేసి ఈ చెత్త ఉద్యోగాలే దిక్కా అని కొందరు.. మీ ఉద్యోగాలు నీటి బుడగలే అంటూ ఇంకొందరు తమను విమర్శించారని, వీటికి చెక్ చెబుతూ చెప్పాడంటే చేస్తాడంతే అనే రీతిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించారని సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. తమ జీవితాలు మారిపోయాయంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, మంత్రి కారుమూరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సచివాలయ ఉద్యోగులతో కలిసి మంత్రి కారుమూరి కేక్ కట్ చేసి వారందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, మునిసిపాలిటీ పరిధిలోని సెక్రటరీలు పాల్గొన్నారు. -
వెన్నుపొటు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్
-
సీఎం వైఎస్ జగన్ ను ప్రజలు ఇంటి బిడ్డలా వ్యవహరిస్తున్నారు
-
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు: మంత్రి కారుమూరి
-
ఈనాడు విషపు రాతలపై కోర్టును ఆశ్రయిస్తాం: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: ఈనాడు విషపు రాతలపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ ఈనాడు పత్రికలో వచ్చిన వార్త హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్బీకే ద్వారా రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఈనాడు కథనం పూర్తి అవాస్తవమని, ఆర్బీకేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం అధికారులకి స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ‘పొలమే లేని వ్యక్తి ఆర్బీకేకు ధాన్యం అమ్మడానికి వెళ్లగా తిరస్కరించినట్లు ఈనాడు పత్రిక సృష్టించింది. తనకి పొలమే లేదని, తాను రైతునే కాదని, అదంతా అబద్దమని ఆ వ్యక్తే చెబుతున్నారు. రైతులే కాని వారిని రైతులగా చూపిస్తూ తప్పుడు వార్తలతో విషప్రచారం చేస్తున్నారు. రైతులకి మేలు చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది. ఈనాడు విషప్రచారంపై కోర్టుని ఆశ్రయించనున్నాం. దిగజారుడు వార్తలతో మీ పత్రిక విలువ మరింత దిగజార్చుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలకు.. ఈనాడు వార్తకు సంబంధం లేదు’ అని మంత్రి అన్నారు. ఈ కేవైసీ త్వరగా చేయకపోవడం వల్ల తప్పులు జరిగే అవకాశాలున్నాయని మాత్రమే ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. 68 వేల రైతులు తూర్పుగోదావరిలో ఉంటే 51 వేల మంది నమోదు చేస్తుకున్నారని, ఇంకా 17 వేల మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రత్యేక మేళా ద్వారా ఈ కేవైసీ త్వరగా నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేవైసీ నమోదు ద్వారా అక్రమాలకి ఆస్కారం ఉండదన్నారు. మిల్లర్లు, అదికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
రైతుల కోసం ఆర్బీకే సెంటర్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది
-
‘ముసుగు తొలగింది.. టెంట్ హౌస్ పార్టీ మరోసారి అద్దెకు సిద్ధం’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సుభిక్ష పాలనను అడ్డుకోవాలన్నదే చంద్రబాబు ప్రయత్నం అని దుయ్యబట్టారు. చదవండి: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ‘‘చంద్రబాబు, పవన్ మధ్య ముసుగు తొలగిపోయింది. తన టెంట్ హౌస్ పార్టీని మరోసారి అద్దెకు ఇచ్చేందుకు పవన్ సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ అభిమానులు తనను సీఎం చేసుకోవాలని చొక్కాలు చించుకుంటుంటే. పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి చొక్కాలు చించుకుంటున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడని, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు అవమానించినప్పుడు.. ఇదే పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లారు’’ అని మంత్రి ప్రశ్నించారు. -
ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్యూలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా
సాక్షి, ఏఎన్యూ: జన క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో వైఎస్సార్ సీపీ మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న ఆ పార్టీ యువతరం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ కల్పనకు నాందిపలికింది. నిరుద్యోగులతోపాటు కోవిడ్–19 విపత్కర పరిస్థితుల్లో పలు రంగాల్లో ఉపాధి కోల్పోయిన వారికి అవకాశాలను చేరువచేసే ప్రక్రియ ప్రారంభించింది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్మేళాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా భారీ ఉద్యోగ మేళా నిర్వహించనుంది. భారీ స్పందన ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. బుధవారం నాటికి 90వేల మందికిపైగా నిరుద్యోగులు తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. జాబ్మేళా నాటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉంది. నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ కోసం 8985656565 ఫోన్ నంబరును సంప్రదించొచ్చు. www.ysrcpjobmela.com ద్వారా కూడా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ysrcpjobmela@gmail.com మెయిల్ అడ్రస్కు రెజ్యూమ్ పంపవచ్చు. కనీస వేతనం రూ.14వేల నుంచి అవకాశాలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన 175కిపైగా కంపెనీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, పరిశ్రమలు, తయారీ రంగ కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు పాల్గొననున్నాయి. ఏఎన్యూ వేదికగా 25 వేల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. నెలకు కనీసం రూ.14 వేల వేతనం నుంచి సంవత్సరానికి రూ.12.5 లక్షల ప్యాకేజీ వరకు ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రధాన ద్వారం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జాబ్మేళా నిర్వహణకు ఏఎన్యూలోని డాక్టర్ వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్, ఈసీఈ, సెంట్రల్ బ్లాక్ తదితర ఐదు భవనాల్లో విభాగాల వారీగా జాబ్మేళా నిర్వహించనున్నారు. పది, ఇంటర్మీడియెట్ చదివిన వారికి ఒక బ్లాక్లోనూ, డిగ్రీ, పీజీ కోర్సులకు మరో భవనంలోనూ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల వారికి ఇంకో భవనంలోనూ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. దీనికోసం ఈ భవనాల్లోని 100కుపైగా గదులను ఇప్పటికే సిద్దం చేశారు. 500 మంది వలంటీర్ల నియామకం మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు సేవలందించేందుకు 500 మంది సిబ్బంది, వలంటీర్లను నియమించారు. నిరుద్యోగులకు సమాచారం ఇచ్చేందుకు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అభ్యర్థికీ ఓ కోడ్ ఇచ్చి వారికి సంబంధించిన ఇంటర్వ్యూ జరిగే ప్రాంతాన్ని వారి మొబైల్కు ఆన్లైన్ ద్వారా తెలిపే ఏర్పాట్లూ చేస్తున్నారు. చదవండి:‘జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు’ విజయవాడ, గుంటూరు నుంచి ఉచిత బస్ సౌకర్యం నిరుద్యోగుల కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికోసం విజయవాడ, గుంటూరు బస్టాండ్ నుంచి ప్రైవేటు బస్సులు నడపనున్నారు. అదనంగా ఆర్టీసీ సర్వీసులూ నడవనున్నాయి. జాబ్మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత భోజన వసతీ కల్పించనున్నారు. వేసవి దృష్ట్యా అవసరమైతే వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. యువత కోసమే.. నరసరావుపేట రూరల్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కారుమూరి మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసమే మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విశాఖలో మేళాలు నిర్వహించి ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించినట్టు వివరించారు. కార్యక్రమంలో జిల్లా మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో విజయవంతం చేస్తాం... జాబ్మేళా ఏర్పాట్లకు సహకారం అందించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. యూనివర్సిటీ, ప్రభుత్వ శాఖలూ పూర్తి సహకారం అందిస్తున్నాయి. కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అందరి సహకారంతో జాబ్మేళాను విజయవంతం చేస్తాం. – ఎ హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జాబ్మేళా పర్యవేక్షకులు -
మంత్రి కారుమూరి ఔదార్యం
తణుకు అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కళాశాల విద్యార్థినికి వైద్యం చేయించి సొంత వాహనంలో సురక్షితంగా ఇంటికి చేర్చారు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. సోమవారం సాయంత్రం రేలంగిలో వలంటీర్ల సత్కార సభ ముగించుకుని తణుకు వస్తుండగా రోడ్డుపై పడి ఉన్న పాలి గ్రామానికి చెందిన విద్యార్థిని మీనాను ఆయన చూశారు. వెంటనే తన కాన్వాయ్ని నిలిపి ఆమెకు సపర్యలు చేసి రేలంగిలో వైద్యం అందించారు. అనంతరం తన వాహనంలో ఆమెను ఇంటికి పంపి ఔదార్యం చూపించారు. -
సోమువీర్రాజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: మంత్రి కారుమూరి
-
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారుమురి నాగేశ్వరరావు
-
మంత్రిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధ్యతలు
సాక్షి, అమరావతి: పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదన్నారు. పౌర సరఫరాల శాఖలో పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా పనిచేస్తానని కారుమూరి తెలిపారు. చదవండి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషా శ్రీ చరణ్ రాజకీయ నేపథ్యం: 2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున తణుకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున దెందులూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున తణుకు ఎమ్మెల్యేగా గెలిచారు. -
నాకు ఏ శాఖ ఇచ్చినా ఒకే..
-
తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో టీడీపీ హస్తం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో టీడీపీ హస్తం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ.. టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై టీడీపీ ఆరోపణలు అర్ధరహితమని అన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. తణుకు టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి పది రోజుల క్రితమే తనకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. కారుమూరిపై టీడీపీ ఆరోపణలు అర్ధరహితమని, అక్రమాలకి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని, పూర్తిస్ధాయి విచారణకి కూడా ఆదేశించామని పేర్కొన్నారు. మాట్లాడటానికి విషయం లేక అసెంబ్లీలో టీడీపీ నేతలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యపాన నిషేధం అమలు చేసింది ఎన్టీఆర్ అయితే దానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేస్తామని తాము చెబుతున్న విధంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం సాయంత్రం ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై మరోసారి చర్చించనున్నామని మంత్రి బొత్స తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజే..: అంబటి టీడీపీ సభ్యులు అసాధారణంగా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. టీడీపీ తీరు శాసనసభను కించపరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం రోజే టీడీపీ వైఖరి బయటపడిందని తెలిపారు. స్పీకర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేయకుండా ఏం చేస్తామని ప్రశ్నించారు. -
ఏలాంటి విచారణకైనా సిద్ధం: కారుమురి
-
వలంటీరుతో ఓడిస్తాం.. దమ్ముంటే రాజీనామా చెయ్యండి
తణుకు అర్బన్: నరసాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీకి దిగితే మీపై వలంటీరును పోటీకి పెట్టి విజయం సాధిస్తామని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుకు సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ► అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీరు ఎన్నికలకు దిగితే ఒక వలంటీరును మీపై పోటీకి దింపి గెలిపించే సత్తా మాకుంది. సీఎం జగన్ బొమ్మతో గెలిచి ఆయనకే మతాన్ని అంటగట్టేలా మాట్లాడుతున్న మీరు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. ► కరోనా వైరస్కు ముందే నియోజకవర్గాన్ని విడిచి ఢిల్లీ, హైదరాబాద్లో ఉంటున్న మిమ్మల్ని నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలు మరిచిపోయారు. తణుకు నియోజకవర్గంలోనే పీఎం రిలీఫ్ ఫండ్స్ సుమారుగా రూ.8 లక్షలు వరకు వచ్చి ఉన్నా ఆ నిధులను వినియోగించే పరిస్థితిలో మీరు లేరు. ► అన్ని మతాలకు సమన్యాయం చేసేలా అర్చకులు, ఫాదర్స్, ఇమామ్లకు సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ని ఉద్దేశించి మతం రంగు అంటించేలా మాట్లాడడమే కాకుండా కరోనా సమయంలో వినాయక చవితి మండపాలు పెట్టుకోనివ్వలేదని కనుమూరి ఆరోపించడం ఎంతవరకు సమంజసం? 18 నెలల పాలనలోనే బెస్ట్ సీఎంగా నిలిచిన వ్యక్తికి మతం రంగు అంటించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేతిలో ఎంపీ కనుమూరి కీలుబొమ్మగా మారారు. -
‘ఉన్మాది, ఉగ్రవాదిలా వ్యాఖ్యలు చేస్తున్నారు’
సాక్షి, పశ్చిమ గోదావరి : నర్సాపురం పార్లమెంట్ ఓటర్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజును మర్చిపోయారని తణుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. కరోనా మొదలు ఇప్పటి వరకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటించలేదని, వరదల సమయంలోను ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డినిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా ఎవరి ఇంటిలో వారు వినాయకచవితి చేసుకోవాలని సూచిస్తే దానిని రఘురామ కృష్ణంరాజు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘హైదరాబాద్.. ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుంది’) పార్టీలు,మతాలకతీతంగా వైఎస్ జగన్ పాలన చేస్తుంటే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హిందుదేవాలయాలు కూల్చి వేస్తే ఆనాడు బిజేపిలో ఉన్న రాఘురామ కృష్ణం రాజు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఉన్మాది, ఉగ్రవాదిలాగా వ్యాఖ్యలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావని విమర్శించారు. పుష్కరాలలో అంతమంది చనిపోతే ఎందుకు మాట్లాడలేదని, కులాలా మధ్య, మతాల మధ్య చిచ్చు పెడితే తనను కేంద్రమే జైలుకు పంపిస్తుందని నాగేశ్వరరావు హెచ్చరించారు. (ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు)