kodi pandalu
-
మొయినాబాద్ పీఎస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..
సాక్షి, రంగారెడ్డి: ఫామ్హౌస్లో కోడి పందెం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోచంపల్లిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఫామ్ హౌస్ లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండటంతో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు చెందిన ఫామ్హౌస్లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్హౌస్కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
కోడి పందేల నిర్వహణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్కి బిగ్ షాక్ తగిలింది. ఫామ్హౌస్లో కోడి పందేల నిర్వహణకు సంబంధించి మొయినాబాద్ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు చెందిన ఫామ్హౌస్లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్హౌస్పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్హౌస్ను శివ కుమార్ వర్మ లీజ్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండమొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్హౌస్పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. -
హైదరాబాద్ శివారులో భారీగా కోడి పందేలు.. టీడీపీ నేత అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో భారీఎత్తున కోడి పందేలు నిర్వహించారు. పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో కోళ్ల పందేల శిబిరంపై దాడులు నిర్వహించారు. కోళ్ల పందెం నిర్వహించింది టీడీపీకి చెందిన శివకుమార్ వర్మగా గుర్తించారు. ఈ క్రమంలో కోడి పందేలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు. వీరిలో పది మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగతా వారంతా ఏపీకి చెందినవారే ఉన్నారు.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టాలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కోళ్ల పందేల శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్కుమార్రెడ్డి తమ 50 మంది సిబ్బందితో కోడి పందేల శిబిరానికి చేరుకున్నారు.అనంతరం, పోలీసులు వ్యవసాయ క్షేత్రంలోనికి వెళ్లేసరికి పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించడంతో వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో కోడి పందేల నిర్వాహకుడు టీడీపీకి చెందిన భూపతిరాజు శివకుమార్వర్మ, పందెంరాయుళ్లు ఎటూ పోకుండా పోలీసులు చుట్టుముట్టి వారిని నిర్బంధించారు. లోకేష్తో పాటు పలు సందర్బాల్లో ఫొటోలు దిగిన భూపతిరాజు. ఇక, ఆంధ్రప్రదేశ్కు చెందిన శివకుమార్ 64 మంది పందెం రాయుళ్లు, 80 కోళ్లతో కోడి పందేలు నిర్వహించారు. కోడి పందేళ్లను ఆడించడానికి బెట్టింగ్ రూ.30 లక్షలు పెట్టినట్టు సమాచారం. కోడి పందేలు ఆడుతున్న వారి నుంచి రూ.30 లక్షలు, 80 కోళ్లు, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు. -
కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు
-
అమెరికాలోనూ కోడిపందేలు
సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాల పేరిట కోడిపందేలను ప్రభుత్వం నిషేధించినా, ‘తగ్గేదే లే’ అంటూ ఈ పందేలు ఏటా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోడిపందేల కోలాహలం అమెరికాకూ వ్యాపించింది. తాజాగా అమెరికాలో ఇద్దరు కోడిపందెం రాయుళ్లను కెంటకీ స్టేట్ పోలీసులు అరెస్టు చేశారు.వారి దగ్గర ఉన్న కోళ్లను స్వాధీనం చేసుకుని, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు ఇది వైరల్గా మారింది. మన దేశంలో జరిగే కోడిపందేల్లాగానే అమెరికాలోనూ కోడిపందేలు జరుగుతుంటాయి. బరిలోకి దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పందేలు కాస్తుంటారు. పందేల కోసం పుంజులను సుమారు ఏడాది పాటు పుష్టిగా పెంచుతారు. పందెంకోళ్లకు పెట్టే ఆహారానికి, వాటి ఆరోగ్యానికి భారీగా ఖర్చు చేస్తుంటారు. ఏది ఏమైనా కత్తులతో కుత్తుకలు తెగేలా సాగే పుంజుల పోరాటాలు ఏ దేశంలో జరిగినా, చూడటానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు. -
సైలెంట్ పుంజు.. వయలెంట్ విజయం
భీమడోలు: ఏలూరు జిల్లా కోడి పందేల బరిలో ఓ పుంజు చిత్రమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘నేనెప్పుడూ సైలెంట్.. నా జోలికొస్తే మాత్రం మహా వయలెంట్’ అన్నట్టుగా మూడు కోడి పుంజుల్ని వీరోచిత పటిమతో ఓడించిన రసంగి పుంజును అబ్రాస్ పుంజు మట్టికరిపించింది. ఏలూరు జిల్లా భీమడోలులో జాతీయ రహదారి పక్కన ఓ భారీ బరిని ఏర్పాటు చేశారు. బుధవారం చివరగా ఓ పందెం వేశారు. ఒకేసారి ఐదు కోడి పుంజులను బరిలోకి దింపారు. వాటిలో ప్రారంభం నుంచి సైలెంట్గా ఉన్న అబ్రాస్ కోడి పుంజు వేరే పుంజుల జోలికి వెళ్లకుండా మౌనంగా ఉండిపోయింది. కాగా.. రసంగి కోడి పుంజు మిగిలిన మూడు పుంజులపై వీరోచితంగా పోరాడి వాటిని మట్టి కరిపించింది. చివరగా నక్కినక్కి ఉన్న అబ్రాస్ కోడి పుంజుని పొడిచేందుకు వెళ్లిన రసంగిని అబ్రాస్ పుంజు ఒకే ఒక్క దెబ్బతో నేల కరిపించింది. ఈ పందేన్ని చూసిన వారంతా ‘సైలెంట్ పుంజు.. వయలెంట్’ విజయం.. అని వ్యాఖ్యానించారు. -
కోడి పందేల కంట్రోలింగ్కు లేడీ బౌన్సర్స్
-
కోడి పందాల బరుల దగ్గర బరితెగిస్తున్న టీడీపీ నేతలు
-
జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ ను నిలదీసిన టీడీపీ, జనసేన నేతలు
-
నెమలి ‘పుంజు’ తడాఖా.. పందెంలో ‘కోటి’ గెలిచిన కోడి
సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో కూటమి పాలనలో కోడి పందెం బెట్టింగ్ చర్చనీయాంశంగా మారింది. కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు.తాడేపల్లిగూడెం పట్టణంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది. కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు. విజయవాడ.. ఇదిలా ఉండగా.. సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలను కూటమి నేతలు ప్రోత్సహిస్తున్నారు. కోడి పందెం బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకున్నారు కూటమి నేతలు. కూటమి ఎమ్మెల్యేలకు కోడి పందెం బరుల్లో వాటాలు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే అనుచరులే హవా కొనసాగిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందెం బరుల్లో జూద క్రీడలకు స్పెషల్ ఏర్పాట్లు చేశారు. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు, బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నారు. తొలి రెండు రోజుల్లోనే చేతులు మారిన వందల కోట్ల రూపాయలు. జూదం, మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు. అందుకు తగినట్టుగానే భారీగా డబ్బులు వసూలు. అయితే, పండుగ ముందు పోలీసులు.. కోడి పందేలు, పేకాట, గుండాటలు ఆడితే తాటతీస్తామని హెచ్చరించారు. తీరా పండుగ వచ్చాక మాత్రం.. పోలీసులు కనిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కూటమి నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శలు వస్తున్నాయి. -
కూటమి నేతల హల్చల్.. కోడి పందెం, రికార్డింగ్ డ్యాన్స్..
సాక్షి, కాకినాడ: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు యథేచ్ఛగా కోడి పందేలు(Kodi Pandem) కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట కూటమి నేతలు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే సమయంలో పాఠశాలలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. స్కూల్స్లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో, స్థానికులు మండిపడుతున్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. కూటమి నేతలే దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అలాగే, కోడి పందేల బరుల దగ్గర జూదం కోసం స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అడ్డు అదుపు లేకుండా గుండాట, పేకాట, గ్యాంబ్లింగ్, లోనాబయటా ఆడిపిస్తున్నారు. ఇక, జూద క్రీడలు కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. పేకాట ఆడేవాళ్లకు దగ్గరుండి మద్యం సరఫరా చేయిస్తున్నారు కూటమి నేతలు.ఇదే సమయంలో కోడి పందేలా కోసం ప్రభుత్వ పాఠశాలలను సైతం కూటమి నేతలు వదిలిపెట్టడం లేదు. తుని రూరల్ వి.కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. ఇక, కూటమి నేతల ఒత్తిళ్ళతో కోడి పందేల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎక్కడ చూసినా జూదం ఆడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి టీడీపీ, జనసేన నేతలు కోడి పందేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జూద క్రీడలు, కోడి పందేల కోసం లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.ఇదిలా ఉండగా.. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు జనసేనలో కోడి పందేలు చిచ్చురేపాయి. రాజోలులో నడి రోడ్డుపై కోడి పందెం బరుల కోసం జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్పై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన బరులు ఏర్పాటు చేసుకున్నారు జనసేన, టీడీపీ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజోలులో విచ్చలవిడిగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్స్లు జరిగాయి. పలుచోట్ల రాత్రి సమయంలో కూటమి నేతలే రికార్డింగ్ డ్యాన్స్లను ప్రోత్సహించారు. ఇంతటితో ఆగకుండా కూటమి నేతలు మరింత హల్చల్ చేశారు. ఇటీవలి కాలంలో బౌన్సర్లు ఏర్పాటు సాధారణంగా మారిన నేపథ్యంలో కోడి పందేల బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఓ అడుగు ముందుకేసిన నిర్వాహకులు మహిళా బౌన్సర్లను రంగంలోకి దింపారు. -
‘బరి’తెగించిన కూటమి నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: సంక్రాంతి (Sankranti) పండగ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని.. కోడి పందేలకు(Cockfighting), జూద క్రీడలకు దూరంగా ఉండాలని.. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసు యంత్రాంగం కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆఫ్ట్రాల్ అన్నట్టుగా ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని పందేలరాయుళ్లు.. అధికార కూటమి నేతల అండతో.. తమకు అడ్డే లేదన్నట్టుగా ‘బరి’ తెగించేశారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో షరా మామూలుగానే పందెం కోడి కాలు దువ్వింది.. కత్తి కట్టించుకుని.. తగ్గేదేలే అన్నట్లుగా బరిలో తలపడింది.పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి పండగల్లో తొలి రోజయిన భోగి నాడే కోడి పందేలు, గుండాట, పేకాట, లాటరీ, జూదం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన కోడిపందేలు, గుండాటల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో నిలవగా కాకినాడ జిల్లా రెండో స్థానంలో ఉంది.ఉమ్మడి జిల్లాలో మొత్తం సుమారు 350 బరుల్లో కోడి పందేలు జరిగాయని అంచనా. ఇందులో కోనసీమ జిల్లాలోనే అత్యధికంగా 110 బరుల్లో కోడి పందేలు జరిగాయి. ఈ ప్రాంతంలో తొలి రోజు రూ.110 కోట్లుపైనే పందేలు జరిగాయని లెక్కలేస్తున్నారు. బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కూటమి నేతల. ప్రజలను నిలువునా దోచేస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లా: జీవహింస వద్దన్న కోర్టు మార్గదర్శకాలను కూటమి నేతలు లెక్కచేయడం లేదు. యథేచ్ఛగా కూటమి నేతల కనుసన్నల్లో పందెం కోళ్లు కత్తులు దూశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జూదాలను ప్రోత్సహిస్తున్నారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు పందెం బరులను ప్రారంభించారు. పోలీసుల మైకులు మూగబోయాయి. జిల్లా వ్యాప్తంగా బరుల వద్ద కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహణ యథేచ్ఛగా సాగిపోతోంది. మద్యం స్టాళ్లు ఏర్పాటు చేసి భారీగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం ఏరులై పారుతోంది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగాచేతులు మారింది.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
కత్తులు దూసిన కోళ్లు
సాక్షి అమరావతి/నెట్వర్క్: సంక్రాంతి తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేల జాతర మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులు.. మినీ స్టేడియంలను తలపించిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. భారీ టెంట్లు.. వీవీఐపీ, వీఐపీ, సామాన్య జనానికి వేర్వేరుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలను తిలకించేందుకు వీలుగా కుర్చీలు.. సోఫాలు.. ఎయిర్ కూలర్లతో సౌకర్యవంతమైన ఏర్పాట్ల నడుమ ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య పందేలు సాగాయి.ప్రత్యేక ఎంట్రీ పాస్లు ఇచ్చి.. పందేల్లో తలపడిన కోళ్లు ప్రేక్షకులకు కన్పించేల భారీ ఎల్ఈడీ స్క్రీన్ల లైవ్ ఇచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోను పెద్దఎత్తున కోడి పందేలు సాగాయి. గతానికి మించిన భారీ ఏర్పాట్లతో కోళ్ల సమరం సాగింది. ఈ ఏడాది కోడి పందేల జాతర రాయలసీమ జిల్లాలకు పాకింది. గోదావరి జిల్లాల్లో ఇలా.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో జాతీయ రహదారి పక్కనే రూ.కోటి ఖర్చుతో కోడి పందేల బరిని మినీ స్టేడియాన్ని తలదన్నేలా నిర్మించారు. అక్కడ కోడి పందేలు వేసేవారికి.. వాటిని చూసేవారికి ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్ప–డేగాపురం వద్ద హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన భారీ బరిలో కోడి పందేలు మొదలయ్యాయి. పందేలరాయుళ్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బరులకు సమీపంలోనే కార్వేన్లు, రెస్ట్రూమ్ల సౌకర్యాలు కల్చించారు. బౌన్సర్లతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరం, సీసలి, మహాదేవపట్నం, ఆకివీడులో బరులను సినిమా సెట్టింగులను తలపించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ ఓ బరిలో పందేలను ప్రారంభించేందుకు గోల్డ్ కాయిన్ తయారు చేయించి హెడ్ అండ్ టాస్ వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 350 బరుల్లో కోడిపందేలు పోటాపోటీగా నిర్వహించారు. కోడిపందేలు, గుండాట కలిపి తొలిరోజు సుమారు రూ.250 కోట్లకు పైగా పందేలు జరిగాయని అంచనా. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యవేక్షణలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో 10 ఎకరాల లే–అవుట్లో భారీగా కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో 15 బరుల్లో సుమారు రూ.3 కోట్ల పందేలు జరిగాయని అంచనా. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 30 బరులు ఏర్పాటు చేశారు. కరపలో మూడు రోజులపాటు నిర్వహించే 60 పందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన వారికి బహుమతిగా రూ.25 లక్షల విలువైన తార్ జీపు, గురజనాపల్లి, గొర్రిపూడి బరుల్లో నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లను విజేతలకు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బరిలోకి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు, జూద జాతరకు సోమవారమే శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పందేలు మొదలయ్యాయి. మంతెనవారిపాలెంలో 40 ఎకరాల్లో భారీ బరి ఏర్పాటు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని తూర్పుపాలెం వద్ద 30 ఎకరాల్లో 6 బరులు ఏర్పాటయ్యాయి.వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు బోస్నగర్, అనంతవరం, జంపని, చుండూరు మండలం కేఎన్ పల్లి, భట్టిప్రోలు మండలం పల్లకోన ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పందేలు తొలిరోజే జోరందుకున్నాయి. సంతనూతలపాడు మండలం వడ్డెపాలెం పరిసరాల్లో సోమవారం కోడి పందేలు జరిగాయి. ఒంగోలు పాతపాడు, కొత్తపట్నం మండలం మడనూరు, గామళ్లపాడులో పందేలు మొదలయ్యాయి. ‘సీమ’లోనూ కాలు దువ్విన కోడి⇒ ఎకరాల్లో ప్రత్యేక బరి ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడి పందేలు, క్యాసినో, కోత ముక్క ఆడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడు, ఎనికేపాడు, అంబాపురంలోనూ భారీ బరులు ఏర్పాటయ్యాయి. పెనమలూరు పరిధిలోని ఈడుపుగల్లు, గొడవర్రు, ఉప్పులూరు, పెద్దపులిపాకలో కోడి పందేలు జరిగాయి. నందిగామ, పామర్రు గుడివాడ, జగ్గయ్యపేట, పెడన, తిరువూరు, మచిలీపట్నం, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా బరుల్లో కోడిపందేలు సాగుతున్నాయి. -
చచ్చినా.. తగ్గేదే లే!
సాక్షి, భీమవరం: తెలుగు నేలపై సంక్రాంతి సీజన్ అంటే పందెంకోళ్ల పౌరుషం గుర్తొస్తుంది. పందెంలో గెలిచినా.. ఓడినా మాంసాహార ప్రియులు పుంజులను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. పందెంలో ఓడిపోయిన, చనిపోయిన పుంజును తూర్పు గోదావరి జిల్లాలో ‘కోస’ అని పశ్చిమ గోదావరిలో ‘కోజ’ అని వ్యవహరిస్తారు. వీటి మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది. ఏనుగు చచ్చినా బతికినా విలువ తగ్గదన్నట్టు పందెం పుంజైనా, పోరాటంలో మరణించిన ‘కోజ’ అయినా ధర వేలల్లో ఉంటుంది. బరువును బట్టి ఇవి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతాయి.పుష్టికరమైన ఆహారం..పందెం కోడిని మేపినట్లు మేపామనే సామెతను బట్టి పందెం పుంజులను ఎంత శ్రద్ధగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. శక్తి కోసం నాటు పుంజులకు ఉడకబెట్టిన మటన్, డ్రై ఫ్రూట్స్, కోడి గుడ్లు, వెల్లుల్లి లాంటి బలవర్థకమైన ఆహారాన్ని నెలల తరబడి అందిస్తారు. శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగిరేందుకు వాటితో ఈత, నడక వ్యాయామాలు చేయిస్తారు. ప్రత్యేకంగా పెంచిన ఈ తరహా పుంజులు రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో ధర పలికితే మిగిలినవి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటాయి. ప్రత్యేకమైన రుచి.. పందెంకోళ్లను మటన్, బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి ఖరీదైన మేతతో పుష్టిగా మేపి వ్యాయామాలు చేయించడం వల్ల వాటి శరీరంలో కొవ్వు లేకుండా కండ ఎక్కువగా ఉంటుంది. పందెంలో ప్రత్యర్థి పుంజుపై గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డిన సమయంలో రక్తం మరింత వేడెక్కి ప్రత్యేకమైన రుచి వస్తుందని మాంసాహార ప్రియుల నమ్మకం. అందుకోసమే ఎంత ఖరీదైనా వెనుకాడకుండా వీటిని కొనుగోలు చేసి ఆరగిస్తారు. బంధుమిత్రులకు వండి పెట్టి.. కొందరు పందేలరాయుళ్లు ‘కోజ’లను తమ వెంట తీసుకెళ్లిపోతే మరి కొందరు బరి బయటే అమ్మేస్తుంటారు. పుంజు బరువును బట్టి ధర పలుకుతుంది. ప్రత్యేకంగా వీటిని నిప్పులపై కాల్పించుకుని దగ్గరుండి కావాల్సిన సైజుల్లో ముక్కలు కొట్టించి మాంసాన్ని తీసుకువెళుతుంటారు. వీటిని కొనేందుకే కొందరు బరుల వద్దకు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. పందెం పూర్తి కాగానే పరుగులు తీస్తుంటారు.పండుగ నాడు ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు ‘కోజ’ పుంజులను వండి పెట్టి ఆనందంగా గడుపుతారు. తెలిసిన వారికి మాంసాన్ని పంపేందుకు ఆసక్తి చూపుతారు. పందెం అనంతరం ‘కోజ’ను తమకే ఇవ్వాలని పందేలరాయుళ్లకు ముందుగానే చెబుతారు. ‘పెద్దలకు’ కానుకగా.. సంక్రాంతి సమయంలో సామాన్యులే కాకుండా కొందరు నాయకులు, ఉద్యోగులు సైతం తమ పైవారికి ‘కోజ’లను కానుకగా పంపించి ప్రసన్నం చేసుకుంటారు. పందేల నిర్వాహకులు ఒక్కో బరి నుంచి 25కిపైగా ‘కోజ’లను సేకరించి రాజకీయ నాయకులతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ అధికారులకు పంపిస్తుంటారు. స్టేషన్ మామూళ్ల విషయాన్ని పక్కనపెడితే తమకు ఎన్ని ‘కోజ’లు పంపాలో పోలీసులు ముందే ఇండెంట్ పెడతారని పందేలరాయుళ్లు అంటుంటారు. కోట్లు కురిపిస్తున్న ‘కోజ’ ‘కోజ’ల రూపంలో పండుగ మూడు రోజులూ ఒక్కొక్క బరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి దాదాపు 80 కోడిపందేల బరులు ఏర్పాటు కానుండగా ‘కోజ’లపై రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. -
కోడిపందాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
-
కొలికపూడి ప్రగల్భాలు.. గాలి తీసిన టీడీపీ కార్యకర్తలు
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు గాలి తీసేశారు పచ్చ నేతలు, కార్యకర్తలు. పది రోజుల క్రితం తిరువూరులో జూదం ఆడనివ్వను అంటూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రగల్భాలు పలికారు. కానీ, ఆయన మాటలను కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు ఎవరూ లెక్క చేయలేదు. తిరువూరులో కమీషన్ తీసుకుని మరీ టీడీపీ నేతలు పందేలు, జూదం ఆడిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరువూరులో టీడీపీ నేతలు హల్చల్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా కమీషన్లు తీసుకుని పందేలు, జూదం ఆడిస్తున్నారు పచ్చ నేతలు. ఇక, పోలీసులు సైతం జూదం నిర్వాహకులతో కుమ్మక్కు అయినట్టు తెలుస్తోంది. గుండాట, పేకాట, లోనా బయట, గ్యాబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. కూటమి నేతలు జూద క్రీడలకు ప్రత్యేక ధరలు నిర్ణయించి అమ్మేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే, పది రోజుల క్రితమే తిరువూరులో జూదం ఆడనివ్వనంటూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. కానీ, ఆయన మాటలను టీడీపీ కార్యకర్తలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. జూదం ఆడుతున్న శిబిరాల వద్దనే పబ్లిక్గా మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయి. మామూళ్లు తీసుకుని ఎక్సైజ్ అధికారులు.. మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఇక, అంతకుముందు.. కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహిస్తే ఊరుకోనని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ప్రస్తుతం విచ్చిలవిడిగా జూదం ఆడుతున్నా కమిషనర్ రాజశేఖర్ బాబు మాత్రం పట్టించుకోవడం లేదు. తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే, కోడి పందెం బరులు , జూద క్రీడల వద్ద పోలీసులు కనిపించకపోవడం విశేషం. -
కోడి పందేల్లో కూటమి నేతల బరితెగింపు
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పందెంలను ప్రారంభిస్తున్నారు. ఇక, పందెం రాయుళ్లు.. కోడి పుంజులతో బరులకు చేరుకుంటున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పందెం బరుల దగ్గర ఎల్ఈడీ తెరలు సైతం దర్శనమిస్తున్నాయి. పెందెంలా నిర్వహణ కోసం భారీ ఏర్పాటు. మరోవైపు.. స్థానికంగా జరుగున్న కోడి పందెంలను చూసేందుకు ప్రజలు భారీగా బరుల వద్దకు చేరుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. కోడి పందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించుకున్నారు.నిషేధం బేఖాతరు.. కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్–1974లోని సెక్షన్ 9(1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్ లీగ్’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్ లీగ్ (కోడి పందేల లీగ్) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ మాదిరిగా కోడి పందేల లీగ్ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు. -
పీక్స్కు చేరిన కోడి పందేల సందడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్రాంతి వేళ కోడి పందేలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సర్వహంగులతో సిద్ధమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఏ రోజున ఎక్కడెక్కడ పందేలు జరుగుతాయనే షెడ్యూల్స్ ప్రకటిస్తున్నారు. పలానా చోట పలానా బరి సిద్ధమవుతోందని.. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఎంత మొత్తంలో పందేలు వేయొచ్చనే వివరాలతో కూడిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కోడిపందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. బిగ్ డే మ్యాచ్లట.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించుకున్నారు.మరోవైపు బడా కోడి పందేంరాయుళ్లు నలుగురు పేర్లతో 13వ తేదీ గణపవరం, 14వ తేదీ శింగవరం, 15వ తేదీ సీసలిలో బిగ్డే మ్యాచ్లంటూ షెడ్యూల్ ప్రకటించడం వంటివి రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదే తరహాలో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని స్థానిక పందెంరాయుళ్లు బరులు, ఇతర వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున పందేలకు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. నిషేధం బేఖాతరు.. కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్–1974లోని సెక్షన్ 9 (1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్ లీగ్’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్ లీగ్ (కోడి పందేల లీగ్) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ మాదిరిగా కోడి పందేల లీగ్ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు. -
సంక్రాంతి సంబరాల ముసుగులో కోడిపందాలు
-
పందేనికి ‘బరి’తెగించి ఏర్పాట్లు
తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతికి సర్వం సిద్ధమైంది. సంబరాల ముసుగులో జూద క్రీడలు విచ్చలవిడిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కోడి పందేల కోసం బరులు ముస్తాబవుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులే భారీగా కమీషన్లు తీసుకుంటూ ‘కోట్లాట’కు సహకరిస్తున్నారని సమాచారం. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జూదాలు, కోడిపందేల వంటి వాటిపై నిషేధం ఉన్నా.. సంక్రాంత్రి సంబరాల పేరుతో పెద్ద సంఖ్యలో హైటెక్ జూదానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సువిశాల ప్రాంగణాల్లో సకల హంగులతో బరులను తీర్చి దిద్దుతున్నారు సినీతారలతో పబ్లిసిటీ చేయిస్తున్న నిర్వాహకులు. వీవీఐపీలకు ప్రత్యేకంగా ఏసీ, కూలర్లు, ఎల్ఈడీ స్కీన్ల వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. క్యాసినో, పేకాట, గుండాట వంటి పలు రకాల జూద క్రీడలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సరాసరిన పదికి పైగా బరులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బరి స్థాయిని బట్టి రూ.30లక్షలు నుంచి రూ. 2కోట్ల వరకు టీడీపీ ప్రజా ప్రతినిధులకు డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో బరి ఏర్పాటు చేసుకోవాలంటే నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రెండుకోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడతోపాటు పరిసర ప్రాంతాలు రామవరప్పాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాల పేరుతో బరులు ఏర్పాటు చేస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ.. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని అధికారులు చెబుతున్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించటం లేదు. పేపరు ప్రకటనలు తప్ప ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. పోలీసు ఉన్నతాధికారులకు సైతం ముడుపులు ముడుతుండటంతో బరుల వైపు కన్నెత్తి చూడరనే భావన నెలకొంది. ఈ గ్రామాల్లో భారీ ఏర్పాట్లు.. ⇒ గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ మండలం బొమ్ములూరు, వలివర్తిపాడు, నందివాడ మండలం పోలుకొండ, రుద్రపాక, తమిరిశ, గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు, భీమవరం, కూరాడ, పెంజెండ్ర (డోకిపర్రు), ప్రాంతాల్లో బరులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు దోచుకునేందుకు రెడీ అయ్యారు. రూ. 70 లక్షలు నుంచి రూ. 1.50 కోట్ల వరకూ బరి అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ⇒ పెడన నియోజకవర్గంలోని పెడన మండలం తోటమూల, పల్లోటి హైసూ్కల్ వెనుక, కొంకేపూడి జాతీయ రహదారి పక్కన బరులు ఏర్పాటు చేశారు. బంటుమిల్లిలో పెద్ద తుమ్మిడి, ఆర్తమూరు, కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం, పల్లెపాలెం, గూడూరు మండలం పెడన –గూడూరు అడ్డరోడ్డు వద్ద, పోసినవారిపాలెంలో బరులు రెడీ అయ్యాయి. ఒక్కో బరి రూ. 30 లక్షలు నుంచి రూ. 50 లక్షలు వరకూ అమ్మకాలు జరిగాయి.⇒ పామర్రు మండలంలోని కొత్త పెద్దమద్దాలి, పెద పారుపూడి మండలం యలమర్రు, పమిడిముక్కల మండలంలో కపిలేశ్వరపురం, హనుమంతపురం, తోట్లవల్లూరు మండలంలో తోట్లవల్లూరు, వల్లూరుపాలెం, గరికపర్రు, కుమ్మమూరు, మొవ్వ మండలంలోని కోసూరు, భట్లపెనుమర్రు గ్రామాల్లో బరులు నిర్వహిస్తున్నారు. రూ. 30 లక్షలు వరకూ బరులు విక్రయిస్తున్నారు.⇒ అవనిగడ్డ మండలంలోని అవనిగడ్డ, పులిగడ్డ, కోడూరు, నాగాయలంక, టి.కొత్తపాలెం, గణపేశ్వరం, మోపిదేవి మండలంలో రావివారిపాలెం, మోపిదేవి వార్పు, చల్లపల్లిలో నడకుదురు, రామానగర్, ఘంటసాల మండలం లంకపల్లి, శ్రీకాకుళం ప్రాంతాల్లో బరులు రెడీ అయ్యాయి. భారీ సెట్టింగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. ⇒ మచిలీపట్నం పరిధిలో గల మంగినపూడి బీచ్ రోడ్డులో మూడు బరులు ఏర్పాటు చేశారు. గుండాట, కోతముక్క, కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ⇒ గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం అంపాపురం, కె.సీతారామపురం, ఉంగుటూరు మండలం నందమూరు, గన్నవరం మండలం సూరంపల్లి, విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు, రామవరప్పాడు, అంబాపురం గ్రామాల్లో సంక్రాంతి బరులు సిద్ధం చేస్తున్నారు. అంపాపురంలో క్యాసినోకు ఏర్పాట్లు చేస్తునట్లు సమాచారం.పుంజులు సై.. పందేల బరిలో తగ్గేదేలే అన్నట్లు కోడిపుంజులు సై అంటూ సిద్ధం అయ్యాయి. గతంలో మాదిరి కాకుండా ఇప్పటికే బహిరంగానే మద్యం, పేకాట శిబిరాలకు ప్రభుత్వం డోర్లు తెరిచింది. ఆ జోష్తో పెద్ద ఎత్తున ఈ ఏడాది కోడి పందేలు, క్యాసినో, గుండాట, పేకాట, మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు. సరదాగా సొంత ఊర్లకు పండుగకు వచ్చే వారి జేబులు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. సాంకేతికతను ఉపయోగించి ఎంట్రీ ఫీజు రూ.5వేలుగా నిర్ణయించి, పెద్ద ఎత్తున అన్ని హంగులతో బరులను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచించారు. నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, ప్రజా ప్రతినిధులు భరోసా ఇచ్చి, వారి నుంచి కోట్ల రూపాయలు దండుకొనేలా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు ముందుగానే పందెం ఒప్పందాలు, కోతముక్కకు వచ్చే జూదరులకు హోటల్ రూమ్స్ బుకింగ్ జరుగుతున్నాయి. -
అవినీతి వెలగపండు
భవ్య పరిపాలనా రాజధానిలో సూర్యోదయ దిక్కుకు ప్రాతినిధ్యం వహించే ఆ ఎమ్మెల్యే అవినీతికి అంతేలేదు. ఆయన పేరు చెబితే భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలే గుర్తొస్తాయి. కొండలు సైతం భయంతో కంపిస్తాయంటే అతిశయోక్తి కాదు. వరుసగా మూడుసార్లు ఎన్నికైనా ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. అవినీతి, అక్రమాలు మాత్రం భారీగానే వెలగబెట్టారు. ఫలితంగా ‘రామ..రామ’.. ఇదేమి దోపిడీ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆరిలోవ(విశాఖ): విశాఖ నగర ప్రజలకు తెలియని కత్తికట్టి ఆడే కోడి పందేల విష సంస్కృతిని ఆ ఎమ్మెల్యే ఇక్కడి జూదరులకు పరిచయం చేశారు. ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక జీవీఎంసీకి చెందిన పదెకరాల ఖాళీ స్థలంలో 2016 నుంచి 2020 వరకు సుమారు నాలుగేళ్లపాటు వరుసగా సంక్రాంతి సమయంలో బరులు ఏర్పాటు చేయించి భారీగానే వెనకేసుకున్నారు. ప్రజల జేబులు గుల్లచేశారు. ఆరిలోవ, జోడుగుళ్లపాలెం, అప్పూఘర్, జాలరిపేట ప్రాంతాల్లో మద్యం దుకాణాలను 2015లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అప్పట్లో ఆరిలోవలో నిర్వహించిన మద్యం దుకాణం తొలగించాలని ఐద్వా ఆధ్వర్యంలో స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు ధర్నాలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ► రుషికొండ ప్రాంతంలో రెవెన్యూకి చెందిన భూమిలో గెడ్డ భాగాన్ని ఆక్రమించి ఆ స్థలం రోడ్డు నిర్మాణంలో పోయినట్టు ఎమ్మెల్యే చూపించారు. ప్రత్యామ్నాయంగా వేరేచోట స్థలం పొందారు. ► 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక దందాలకు పాల్పడ్డారు. జోడుగుళ్లపాలెం వద్ద సుమారు ఎకరం స్థలాన్ని తన బంధువుల పేరుతో ఆక్రమించే యత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన యత్నానికి బ్రేక్ పడింది. ► ఎంవీపీ కాలనీలో సెక్టార్–2లో గెడ్డ స్థలాన్ని ఆక్రమించి ఓ బిల్డర్కు అపార్టుమెంట్ నిర్మాణం కోసం కట్టబెట్టారు. ఆ అపార్టుమెంట్లో కొన్ని ప్లాట్లు తనకు ఇవ్వడానికి బిల్డర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో జీవీఎంసీ అధికారులు ఆ అపార్టుమెంట్ నిర్మాణాన్ని నిలిపేశారు. అప్పటి వైఎస్సార్ సీపీ నాయకుడు (ప్రస్తుతం జనసేన కార్పొరేటర్) పీతల మూర్తియాదవ్ ఈ ఆక్రమణపై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. ► రామకృష్ణాపురాన్ని ఆనుకొని ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక 2017లో పెగదిలికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు కొందరు సర్వే నంబర్లు 26, 27ల్లోని సుమారు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 18 పాకలు వేశారు. దీనిపై ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జీవీఎంసీ అధికారులు ఆ పాకలను తొలగించారు. అయినా పట్టువదలకుండా వేసిన పాకలను మూడుసార్లు అధికారులు తొలగించాల్సి వచి్చంది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు పేదలకు చెందిన పాకలను తొలగించారని కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఎమ్మెల్యేపై కేసులు ► 2020 మార్చి 15న ఎమ్మెల్యే నిర్వహించే మద్యం షాపుల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఆ దుకాణాల్లో కల్తీ మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు తన అనుచరులతో ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ 353, 501 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ► 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ► రుషికొండ వద్ద ప్రభుత్వానికి చెందిన స్థలంలో గెడ్డ భాగాన్ని ఆక్రమించినట్లు 2011లో రూరల్ రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేపై భూ ఆక్రమణ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత అధికారులను బెదిరించి ఆయన కేసును కొట్టివేయించుకున్నారు. -
తగ్గని వేడి..పందెం కో‘ఢీ’
భీమవరం/అమలాపురం టౌన్: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడి పందేలు మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరం, సీసలి, పెన్నాడ, యలమంచిలి మండలం కలగంపూడి, పూలపల్లి, పోడూరు మండలం కవిటం, వీరవాసరం మండలం జొన్నలపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగాయి. ఏలూరు జిల్లా పరిధిలోని ఉంగుటూరు, కైకలూరు, నూజివీడు, దెందులూరు, చింతలపూడి, ఏలూరు తదితర నియోజకవర్గాల్లో పందేల జోరు కొనసాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల్లో దాదాపు రూ.500 కోట్లకు పైగా చేతులు మారినట్టు చెబుతున్నారు. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా నిర్వహించారు. పందేల రాయుళ్లను ఆకర్షించేందుకు భీమవరం సమీపంలోని పెన్నాడ శిబిరం వద్ద ఎక్కువ పందేలు గెల్చుకున్న వారికి బుల్లెట్, స్కూటీ వంటి వాహనాలను బహుమతులుగా ఇచ్చారు. చిన్న గ్రామాల్లో సైతం కోడి పందేల జోరు కనిపించింది. తూర్పున 80 బరుల్లో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 80 ప్రధాన బరుల్లో కోడి పుంజులు తలపడ్డాయి. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డ వారంతా కుటుంబాలతో సహా సొంతూళ్లకు వచ్చి కోడి పందేల బరుల వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో వెలిసిన భారీ పందెం బరిలో రూ.కోట్లు చేతులు మారాయి. మలికిపురం, రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అమలాపురం రూరల్, అల్లవరం, రాయవరం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో వెలిసిన బరుల్లో కోడి పందేలు జోరుగా జరిగాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం, మేడపాడు, ఉండూరు, అచ్చంపేట, పులిమేరు, తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పందెం కోళ్లు సై అంటే సై అన్నాయి. కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు, ఉప్పులూరు, గొడవర్రు, అంపాపురం, కంకిపాడు, కొత్తూరు తాడేపల్లి, మేకావానిపాలెం, ఎనీ్టఆర్ జిల్లా వెలగలేరు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించారు. -
సై అంటున్న కోడి పుంజులు..
అమలాపురం టౌన్/సాక్షి నెట్వర్క్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు ఆదివారం మొదలయ్యాయి. పండగ మూడు రోజులూ జరిగే ఈ పందేలను వీక్షించేందుకు, రూ.వేలు, రూ.లక్షల్లో కాసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 బరులు ఏర్పాటైనట్టు సమాచారం. వీటిలో దాదాపు రూ.20 కోట్ల మేర పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే రూ.6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు. ►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో భారీ బరి ఏర్పాటైంది. ఇక్కడ రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. మండల కేంద్రమైన మలికిపురంలో కూడా భారీ బరి ఏర్పాటు చేశారు. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బారికేడ్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు. ►తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. నల్లజర్ల మండలంలో పోలీసులు గుండాటకు ఎక్కడా అనుమతించలేదు. ఇక్కడ మధ్యాహ్నం తర్వాతే పందేలు ప్రారంభించారు. ఎక్కడా మునుపటి ఉత్సాహం కనపడలేదు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు ఉదయం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ మండలంలోని మలకపల్లిలో ఏర్పాటు చేసిన బరి వద్ద బౌన్సర్లను పెట్టి మరీ పందేలు నిర్వహించారు. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని 25 బరుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ►కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, మేడపాడులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. ఉండూరు, పులిమేరు, అచ్చంపేటల్లో కూడా బరులు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం, గైగోలుపాడు తదితర చోట్ల కోడి పందేలపై పోలీసులు దాడి చేశారు. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు సిబ్బందితో వెళ్లి గుండాట బోర్డులను తొలగించి, పందేలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించారు. కరప మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. -
రంజుగా.. రారాజులా పెరిగి...కట్ చేస్తే..!
జనవరి వచ్చిందంటే చాలు సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. పుట్టింటికి ఎపుడు పోదామా అని కొత్త పెళ్లి కూతుళ్లు ఎదురుచూస్తూ ఉంటారు. అటు కొత్త అల్లుళ్ళ మంచీ మర్యాదకోసం అత్తగారిళ్లు సిద్ధమవుతుంటాయి. రకరకాల పిండివంటల తయారీలో మునిగిపోతారు మహిళలు. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు అబ్బో.. సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎంత నిర్బంధం, ఆంక్షలున్నా కోడి పందాల సందడి మాత్రం మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగ మూడ్రోజుల పాటు కోస్తాకుర్రాళ్లలో కోడి పందాల జోష్ రేంజే వేరు. గతంలో సరాదాగా సాగిన ఈ వ్యవహారం ఇపుడు కోట్లాది రూపాయల వ్యాపారంగా మారిపోయింది. ఈ కోడి పందాల కథా కమామిష్షు ఏంటో ఒకసారి చూద్దాం. కోడి పందాలు, పందెం కోళ్లు కోడిపందెం అంటే.. స్పెషల్గా పెంచిపోషించిన, శిక్షణ ఇచ్చిన రెండు కోడి పుంజులు హోరాహోరీగా పోట్లాడుకోవడం. ఊపిరి ఆగేదాకా కాలు దూసి పోరాడటం. కాళ్లకు కట్టిన పదునైన కత్తులు దిగుతున్నా.. రక్త మోడుతున్నా వెన్ను చూపకూడదు. విజయమో వీర స్వర్గమో అన్నట్టు అయితే ప్రత్యర్థిని పడగొట్టాలి.. లేదంటే తన ప్రాణం పోవాలి. అదీ పందెం. కోడి పుంజులకు శిక్షణ ఇంత పకడ్బందీగా పందెం సాగాలి అంటూ ఏంతో కొంత ట్రైనింగ్ ఉండాలిగా. ప్రత్యర్థికి దీటుగా బలిష్టంగా ఉండాలిగా. అందుకే మరి పందెంకోళ్లకు ప్రత్యేక శిక్షణతోపాటు బలవర్ధక ఆహారాన్ని కూడా అందిస్తారు. అయితే ఇందులో పందేనికి పనికి వచ్చే పుంజు(మగకోళ్లను) గుర్తించడం ఒక కళ. ఇక్కడే తొలి అడుగు పడుతుంది. ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలున్న పుంజును “కాకి” అని, తెల్లని ఈకలు ఉంటే దానిని “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే దానిని “పర్ల” అని, నల్లగా ఉండి, రెండు మూడు ఈకలు ఉన్న పుంజును కొక్కి రాయి అని దీనికి పెద్ద పురాణమే ఉంది. ముఖ్యంగా ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే డేగ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని పూల, నల్లబోర, ఎర్రపొడ, గేరువా లాంటివి ఇందులో ఉన్నాయి. డేగ, నెమలి, కాకి కోడి పందేలకు సంబంధించి డేగ, కాకి, నెమలి రకాలు పాపులర్. ఇలా తమకు నచ్చిన పందెం కోళ్లను గుర్తించి, వాటిని ప్రత్యేక షెడ్లలో సకల సదుపాయాలతో పెంచుతారు. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, తైలాలతో మసాజ్లు, దాణా దాకా అన్నీ రాచమర్యాదలే. రోజుకు రెండు పూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించిన అనంతరం పిస్తా, బాదం, జీడి పప్పు అక్రూట్ లాంటి డ్రైఫూట్స్ తినిపిస్తారు. మధ్యాహ్నం , సాయంత్రం తృణధాన్యాల, డ్రై ఫ్రూట్స్తో దాణా పెడతారు.అంతేకాదు కొద్దిగా మద్యాన్ని కూడా పోస్తారట. దీంతో పౌరుషానికి ప్రతీకగా, పందేనికి సిద్ధం అన్నట్టు తయారవుతాయి. కుక్కుట శాస్త్రం (కోళ్ల పంచాంగం) మనుషులకు పంచాంగం ఉన్నట్టు కోళ్లకూ ఉంది మరి. అదే కుక్కుట శాస్త్రం. కోడిని సంస్కృతంలో కుక్కుట అంటారు అలా ఈ కోళ్ల పంచాంగానికి కుక్కుట శాస్త్రం అని పేరు వచ్చింది. తిధి, వార,నక్షత్రాలు, కోళ్లపై గెలుపోటముల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు వివిధ రకాల కోడిపుంజులపై వివిధ రకాల్లో ప్రభావం చూపుతాయట. వారం, తిధి, దిశ,నక్షత్ర బలంతోపాటు, తమ జాతకం బలానికి, కోడి జాతక బలంకూడా తోడైతే ఇక గెలుపు మాదేనని నమ్ముతారు పందెం రాయుళ్లు. చివరకు మిగిలేది చుట్టూ వేలాదిమంది గుమిగూడగా, యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. యజమాని పట్ల విశ్వాసంతో, బాస్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్నట్టు రంగంలోకి దిగుతాయి. రక్తం చిందించి మరీ పోరాడతాయి. ఈ క్రమంలో నెగ్గితే..వైభోగం. లేదంటే పరలోకం. అప్పటిదాకా రాజభోగాలు అనుభవించి, నేనే రాజు అన్నట్టుగా ఎదిగిన పుంజు కాస్తా.. చివరికి మందులోకి నంజులాగానో, అల్లుడుగారికి విందుగానో మారిపోతుంది. -
పుంజు భలే రంజుగా!
సాక్షి, భీమవరం: ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతికి దాదాపు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందడిని తెచ్చే కోడి పందేలకు అప్పుడే తెర లేచింది. రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో ఏటా సంక్రాంతి పండుగ మూడు రోజులు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే కోడి పందేలను వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కోడి పందేల నిర్వాహకులు తమ పుంజులను పందెం బరిలో నిలపడానికి సిద్ధం చేస్తున్నారు. కోడి పుంజుల ఎంపిక, వాటికి ప్రత్యేక శిక్షణ, మంచి పౌష్టికాహారం, శారీరక పటుత్వానికి ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తూ పందెం బరిలో నిలపడానికి సై అంటున్నారు. మేత, శిక్షణ.. పెద్ద కసరత్తే ఏ వ్యక్తితో అయినా గొడవ పడి, కోపం వచ్చి నప్పుడు నిన్ను పందెం పుంజును మేపినట్టు మేపానని దెప్పడం గోదావరి జిల్లాల్లో సర్వసాధారణం. దీనినిబట్టి పందెం కోళ్లను ఇక్కడ ఏ విధంగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. పది నిమిషాల పాటు ఉండే పందెం బరిలో ప్రత్యర్థి పుంజును మట్టికరిపించేందుకు కోళ్ల పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సంక్రాంతికి మూడు నెలల ముందు నుంచే వాటికిచ్చే మేత, శిక్షణలో పెద్ద కసరత్తే చేస్తారు. పండుగ సమయంలో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. ఆ మూడు రోజులు కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే భారీ బరులు, గ్యాలరీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పందేలను చూడటానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీ ఎత్తున వస్తుంటారు. వారితో ముందుగానే హోటళ్లు, లాడ్జిలు నిండిపోతాయి. మటన్ నుంచి డ్రైప్రూట్స్ వరకు.. శిక్షణలో పుంజుకు శక్తి, సామర్థ్యం పెంచేందుకు, దాని శరీరంలో కొవ్వు చేరకుండా సులువుగా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు మూడు నెలలపాటు ప్రత్యేక మేతను అందిస్తారు. కోడి పరిమాణాన్ని బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం పప్పులు, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు పెడతారు. సాయంత్రం.. చోళ్లు, గంటులు, మెరికలు మొదలైన వాటిని ఆహారంగా అందిస్తారు. పుంజుకు నొప్పులు తగ్గేందుకు ప్రత్యేక శిక్షణ.. పండుగ దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు. ఇందుకు వేప, జామాయిల్, కుంకుడు, వెదురు, వాయిల తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాల వాటిని నీటిలో వేసి గంటల కొద్దీ మరిగిస్తారు. ఈ ద్రావణాన్ని చిన్న తొట్టెలో కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చుతారు. ఆ తర్వాత అందులో పుంజును ఉంచి పైనుంచి ద్రావణం పోస్తూ వారం రోజుల వ్యవధిలో ఒకటి రెండుసార్లు నీళ్లపోతలు చేయిస్తారు. చివరిగా శాఖల కోసం పొయ్యిపై మూకుడిని వేడి చేస్తూ.. అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దాన్ని కోడి శరీరమంతా అద్దుతారు. వారానికి ఒకసారి చొప్పున, కొందరు.. రెండు మూడుసార్లు కూడా ఈ శాఖలు చేయిస్తుంటారు. ఏ ప్రక్రియ అయినా కోడి సామర్థ్యాన్ని బట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఇవే కాకుండా పందెం పుంజు అనారోగ్యం, వైరస్ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తారు. ఆయుర్వేద పద్ధతులను అనుసరించేవారూ ఉన్నారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతిని ఇచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు. రూ.కోట్లలో వ్యాపారం మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు జీతాలుంటాయి. ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్లపోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఈ విధంగా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటాయి. పండుగల కోసం రెండు వేలకు పైగా పందెం కోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. పండుగకు నెలరోజులు మాత్రమే గడువుండటంతో ఇప్పటికే భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో పందెంకోళ్ల పెంపకం జోరుగా సాగుతోంది. పుంజుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ.. బరిలో ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందెంరాయుళ్లు పుంజుల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాల వద్ద పుంజులను పెంచితే అధిక శాతం మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను కొనుగోలు చేసి వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకు అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందుగానే అడ్వాన్స్లు చెల్లిస్తుండటం విశేషం. పందెం పుంజులకు ఉన్న డిమాండ్తో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 150కి పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నట్టు అంచనా. కాకి, నెమలి, పచ్చకాకి, కేతువ, డేగ.. వివిధ రంగుల్లో కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు సిద్ధం చేస్తారు. ఎంపిక చేసుకున్న పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు అవలంబిస్తారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నది.. తమ పుంజు బలం, బలహీనత ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పందెం పుంజు దినచర్య ఇలా.. ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లల్లో పటుత్వానికి, ఆయాసం రాకుండా ఉండేందుకు, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు దాదాపు నెల పాటు రోజు విడిచి రోజు ఈత కొట్టిస్తారు. తదుపరి ప్రక్రియగా ‘వి’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగేలా బేటా (ని ర్ణీత పద్ధతిలో వాకింగ్) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ నడిచేలా చేస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేయిస్తారు. తర్వాత మేత పెట్టి ఉదయం 11 గంటల వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మారుస్తారు. -
ఏపీ: ఈసారి ‘క్రాస్’ పుంజులతో..
కైకలూరు: సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. కత్తులతో కుత్తుకలు తెగే పుంజుల పోరాటాన్ని రక్తికట్టించేందుకు నిర్వాహకులు ఎప్పటిలాగే ఈ ఏడాదీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి విభిన్నంగా క్రాస్డ్ జనరేషన్ పుంజులను బరిలోకి దించుతున్నారు. ఈ రోమాంచిత పోటీలకు జస్ట్ ఆరు రోజులే గడువు మిగిలి ఉంది. టిక్..టిక్..టిక్.. గతేడాది జనవరిలో కోడిపందేల రూపంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.900 కోట్లు చేతులు మారాయన్నది ఓ అంచనా. ఇందులో కోడిపందేలకు పెట్టింది పేరైన ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వాటా అత్యధికంగా రూ.500 కోట్లు ఉండొచ్చు. నోట్ల రద్దు, కరోనా ప్రభావంతో గతంలో పందేల జోరు తగ్గినా, ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించడంతో రాష్ట్రంలో ఈ ఏడాది ఇంకా ఎక్కువగా పందేలు ఉంటాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కోడిపందేల నిర్వాహకులు పందెపు బరులను సిద్ధంచేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు.. ఇప్పటికే పలు జిల్లాల్లో లాడ్జిలు, అతిథి గృహాలు బుక్కయిపోయాయి. కోడి పందేలు.. కొత్త పుంతలు.. ఈ ఏడాది కోడిపందేలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. క్రాస్ జనరేషన్ కోడిపుంజుల హవా కొనసాగుతోంది. అమెరికన్ గేమ్ పాల్, అమెరికన్ పెర్విన్, బ్రెజిల్ జాతి కోళ్లను తీసుకొచ్చి దేశీయ నెమలి, డేగ వంటి జాతి కోళ్లతో క్రాసింగ్ చేయిస్తున్నారు. పందేనికి సిద్ధమైన వీటి ధర రూ.లక్ష పైమాటగానే ఉంది. ఇక కోడిపుంజుల పెంపకాన్ని పలు జిల్లాల్లో నిర్వాహకులు కుటీర పరిశ్రమగా మార్చుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 300 కోడిపుంజుల శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 18 నెలల పాటు పుంజులను పోటీలకు సిద్ధంచేయడానికి ఒక్కో శిక్షకుడికి రూ.15 వేలు జీతం ఇస్తున్నారు. యంత్రాలలో కోడిగుడ్లను పొదిగించి నాణ్యమైన పుంజు జాతులను తయారుచేస్తున్నారు. మార్పు కోసం పోలీసుల యత్నం హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలను అడ్డుకోవడానికి గతంలో పోలీసులతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. పోలీసు యాక్ట్ 144 సెక్షన్ను విధించారు. బైండోవర్లు చేసి, వేలాదిగా కోడి కత్తులను సీజ్ చేశారు. ఈ ఏడాది కూడా భారీగా కోడికత్తులను సీజ్ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందేలకు సంబంధించి 900 కేసులు నమోదు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్, క్రికెట్ వంటి పోటీలను మార్పు కోసం నిర్వహిస్తున్నారు. కమిటీలతో కట్టడి చేస్తాం.. సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు, జూదాలను కట్టడి చేయడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేశాం. ఏలూరు జిల్లాలో కేవలం 15 రోజుల్లోనే 45 కేసులు నమోదు చేశాం. ఇప్పటికే పెట్రోలింగ్ టీంలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా జూదాల వైపు దృష్టి మళ్లకుండా పోలీస్స్టేషన్ల పరిధిలో వాలీబాల్, క్రికెట్ వంటి పోటీలను పోలీసు శాఖ ఏర్పాటుచేసింది. – రాహుల్దేవ్ శర్మ, ఎస్పీ, ఏలూరు జిల్లా -
పుంజు భలే రంజుగా! సంప్రదాయం నుంచి సంపాదనగా ‘కోడి పందేలు’
సాక్షి, అమరావతి: బరిలో తలపడే పుంజులు అత్యంత పౌరుషంతో పోరాడుతాయి. ఓడిపోయిన పుంజు తోక ముడిచి బరినుంచి పారిపోతే.. గెలిచిన పుంజు తన యజమాని ఉప్పొంగిపోయేంత గర్వాన్ని ఇచ్చేది. పుంజుల పోరాటం చూపరులకు సైతం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. తొలినాళ్లలో సరదా కోసం మొదలైన పందాలు ట్రెండ్ మార్చుకుంటున్నాయి. ఇప్పుడు కోడి పందాలంటే విశాలమైన మైదానం.. భారీ టెంట్లు.. ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా ప్రత్యేకంగా గ్యాలరీలు.. ఫ్లాష్లైట్ల కాంతులు.. భారీ సంఖ్యలో జన సందోహం నడుమ జాతరను తలపించేలా మారిపోయింది. ప్రత్యేక శిక్షణ పొందిన పుంజులను పహిల్వాన్ మాదిరిగా వాటి కాళ్లకు పదునైన కత్తులు కట్టి బరిలో దించుతున్నారు. రక్తమోడుతున్నా వీరోచితంగా పోరాడి ఒక కోడి గెలిస్తే.. మరో కోడి ప్రాణాలు విడుస్తుంది. ఆ తరువాత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంది. సంక్రాంతి మూడు రోజుల్లోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.వందలాది కోట్లు కోడి పందాల మాటున చేతులు మారుతున్నాయి. తాజాగా ఒకచోట కోడి పందాలు వేసి.. వాటిని సోషల్ మీడియాలో లైవ్లో చూపించి బెట్టింగ్లు వేసుకునే స్థాయికి చేరింది. అలా మొదలై.. పూర్వం దేశంలోని అనేక ప్రాంతాల్లో కోడి పందాలు వినోదం కోసం మొదలై వీరోచిత పోరాటాలకు దారితీశాయని చరిత్ర చెబుతోంది. తొలినాళ్లలో అడవి కోళ్లు లేదా పెరటి కోళ్లు పోరాడుకునేలా ప్రేరేపించి వినోదం పొందేవారు. పల్నాడు యుద్ధం (1178–1182) కోడి పందాల్లో తలెత్తిన వివాదం వల్లే సంభవించినట్టు చరిత్ర చెబుతోంది. బొబ్బిలి యుద్ధంలోనూ కోడి పందాలు జరిగాయి. రానురాను కోడి పందాలు ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో జూదం తరహాలో మార్పు చెందాయి. సుమారు రెండున్నర దశాబ్దాలుగా సంక్రాంతి అంటే కోడి పందాలు అనేలా మారిపోయాయి. సంక్రాంతి మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందాల కోసం ఐదు నెలల ముందు నుంచే ప్రత్యేకంగా ఎంపిక చేసిన కోడి పుంజులను తీర్చిదిద్దుతారు. వాటి పెంపకానికి రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇదీ చదవండి: ఆ ఒక్కటీ... అడక్కు..!! షాక్లో ఆడిట్ అధికారులు -
సంక్రాంతికి తగ్గేదేలే.. స్పెషల్ డైట్తో తర్ఫీదు.. పుంజు ధర ఎంతో తెలుసా?
సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాల్లో గుర్తొచ్చేది కోడిపందేలే. ఏటా ఎంతో సందడిగా జరిగే ఈ పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడకు వస్తుంటారు. పందేలలో రూ.కోట్లు చేతులు మారుతుంటాయి. అయితే సంక్రాంతి పండగకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా అప్పుడే కోడిపుంజులను పందేలకు సిద్ధం చేస్తున్నారు. బరిలో బలంగా ఢీకొట్టేలా జాతి కోళ్లను జిల్లాలోని కొన్ని శిబిరాల్లో పెంచుతుండగా, వీటి ఖరీదు రూ.వేల నుంచి లక్షల్లో పలుకుతుండటం విశేషం. భీమవరం (ప్రకాశం చౌక్): సంక్రాంతి బరిలో దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పెట్టుబడులు పెడతారు. పందేనికి పుంజును సిద్ధం చేయడం కోసం పెంపకందారులు చాలా శ్రమిస్తారు. పుంజును సుమారు ఏడాది పాటు పెంచుతారు. వీటి ఆహారం నుంచి ఆరోగ్యంగా, బలంగా ఉండేవరకు ఒక్కోక్క పుంజుపై సుమారు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తారు. కొందరు ప్రత్యేకంగా కోసం స్థలం లీజుకు తీసుకుని మరీ 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. పుంజుల సంఖ్య బట్టి ఏడాదికి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తారు. మరి కొందరు అయితే తమ ఇంటి వద్ద ఉండే చిన్న పాటి ఖాళీ స్థలంలోనే పందెం పుంజులను పెంచుతూ పండగ సమయంలో వాటిని విక్రయించి ఉపాధి పొందుతారు. ఖరీదైనా దాణా.. నిత్యం వ్యాయామం పందెం పుంజుకు బలవర్థమైన ఆహారం పెడతారు. మటన్ కైమా, జీడిపప్పు, బాదం పప్పు, కోడిగుడ్డు, గంటులు, చోళ్లు, తదితర వాటిని ప్రతిరోజు వాటికి ఆహారంగా పెడతారు. తరచూ పుశువైద్యులకు చూపించి వారి సలహాలు మేరకు విటమిన్ మాత్రలు, అనారోగ్యానికి గురికాకుండా వైద్యం అందించడం చేస్తారు. పందెం బరిలో త్వరగా అలసిపోకుండా ఎక్కువ సేపు పోరాడేలా ప్రతి రోజు వ్యాయామం చేయిస్తారు. నీటిలో ఈత కొట్టిస్తారు. పుంజు ఎలా పోరాడుతుంతో తెలుసుకోవడానికి తరచూ ఇతర కోళ్లతో పందేలు వేసి గమనిస్తుంటారు. రూ.10 కోట్ల వ్యాపారంపైనే.. జిల్లాలో పందెం పుంజుల పెంపకం కలిగిన ప్రాంతాల చూస్తే ముఖ్యంగా భీమవరం, పాలకొల్లు, ఉండి, ఆకివీడు, కాళ్ల, వీరవాసరం, నర్సాపురం, ఆచంట, తణుకు, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, తదితర ప్రాంతాల్లో భారీగా పుంజులను పెంచుతుంటారు. మొత్తం జిల్లాలో ఏటా సంక్రాంతి పండగకు పందెం పుంజుల కొనుగోలు కోసం పందెంరాయుళ్లు సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారని అంచనా. పుంజు ధర, రకాలు పందెం పుంజుల ధర విషయానికి వస్తే జాతి, రంగు, దెబ్బలాడే విధానాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. వీటి ధర సుమారుగా రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయి. వీటిలో నెమలి, కాకీ నెమలి, పచ్చ కాకి, సేతువా, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగీ, మైలా, ఫింగలా, పెట్టమర్రు, తదితర రకాల పుంజులు ఉంటాయి. ఆన్లైన్లోనూ విక్రయాలు పందెం పుంజులను పెంపకందారులు పలు రకాలుగా విక్రయిస్తున్నారు. పుంజు కావాల్సిన వారు ముందుగా కొంత అడ్వాన్సు ఇచ్చి బుక్ చేసుకుని పందెం రోజు పూర్తి మొత్తం ఇచ్చి తీసుకువెళుతుంటారు. మరి కొందరు నేరుగా మకాం వద్దకు వెళ్లి వారికి కావాల్సిన పుంజులను ఎంచుకుని కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అయితే పెంపకందారులు పుంజులను ఆన్లైన్లో కూడా విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండగ సమయంలో పందేలు జరిగే ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ నేరుగా కూడా విక్రయిస్తుంటారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, వీరవాసరం, కాళ్ల, ఉండి, ఆకివీడు, తాడేపల్లిగూడెం, అత్తిలి, తణుకు తదితర మండలాల్లో కోడి పుంజులను విక్రయాలు ఎక్కువగా విక్రయిస్తుంటారు. -
సంక్రాంతి : కత్తి దూసిన పుంజులు (ఫోటోలు)
-
Cockfights: కత్తి దూసిన పుంజులు: కోళ్లు.. కోట్లు
సాక్షి, అమరావతి: పందెం కోళ్లు జూలు విదిల్చి కత్తులు దూశాయి. భోగి రోజైన శుక్రవారం ఉభయ గోదావరితోపాటు పలు జిల్లాల్లో ఆంక్షలను అధిగమించి సంప్రదాయం పేరుతో నిర్వాహకులు పందెం పుంజులను బరుల్లోకి దించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంపలో ఒకరోజు ముందే పందెం కోళ్ల కూత మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా పళ్లంకుర్రులో మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో అత్యధిక పందాలు గెలిచిన కోడి పుంజు యజమానికి ఇన్నోవా కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇక్కడ పందేలకు హాజరయ్యారు. బురదగా బరులు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బరులు తడిసిపోయి బురదమయంగా మారడంతో పలుచోట్ల పందేలు ఆలస్యంగా మొదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా సీసలి, తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోట ప్రాంతాల్లో వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేశారు. ఫ్లడ్లైట్ల వెలుగులతో వీఐపీ గ్యాలరీలు, సాధారణ బారికేడ్లుతో బరుల వద్ద ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల మాత్రం కత్తులు కట్టకుండా సంప్రదాయ కోడి పందాలను రాజకీయ నాయకులు ప్రారంభించారు. బరుల ధ్వంసం.. బైండోవర్లు పలు ప్రాంతాల్లో పోలీసులు కోడి పందాలను అడ్డుకునేందుకు బరులను ధ్వంసం చేశారు. నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. పందెం కోళ్లకు కత్తులు కట్టేవారిని అదుపులోకి తీసుకుని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైక్లతో ప్రచారం నిర్వహించారు. ఈసారి కోడి పందాలను అడ్డుకోవడంలో వర్షం, కరోనా భయం కొంతమేర సహకరించాయి. పందెంరాయుళ్ల సంఖ్య కొంత పలచబడింది. పశ్చిమలో ‘తగ్గేదే లే’ పశ్చిమ గోదావరి జిల్లాలో పూలపల్లి, కలగంపూడి, మార్టేరు, ఉంగుటూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, దొరమామిడి, బుట్టాయిగూడెం, దెందులూరు తదితర చోట్ల భారీ షామియానాలు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. బరుల వద్ద పేకాట, గుండాటతో కోలాహలం నెలకొంది. కోడి పకోడి, బిర్యాని విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. జిల్లాలో సుమారు రూ.80 కోట్లు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. గుండెపోటుతో యువకుడు మృతి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కోడిపందేలను తిలకిస్తూ ఆరేపల్లి వీర్రాజు (34) గుండెపోటుకు గురై కుప్పకూలాడు. భీమవరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రూ.లక్షకు తగ్గకుండా.. కృష్ణా జిల్లాలోని కొత్తూరు, తాడేపల్లి, సింగ్నగర్ పైపుల రోడ్డు, అంబాపురం, నూజివీడు ప్రాంతాల్లో ఒక్కో పందెం రూ.లక్షకు తక్కువ కాకుండా జరిగాయి. గుంటూరు జిల్లా మాచర్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు పందేలు కాశారు. పలుచోట్ల అరెస్టులు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో పలుచోట్ల కోడి పందేల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చింతలపాలెం, ఉదయగిరి మండలం క్రిష్ణంపల్లి బీసీ కాలనీ, వెంకటగిరిలో మాసాపేట ట్యాంకు, సైదాపురం మండలం చీకవోలు తదితర చోట్ల పొలాలు, ఇతర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్న 13 మందిని అరెస్టు చేసి రూ.5 వేల నగదు, పుంజులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ గంగవరం పోర్టు రోడ్ వై జంక్షన్లోని తోటల్లో కోడి పందాలు నిర్వహిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు కోళ్లు, రూ.10 వేలు స్వాధీనం చేసుకొన్నారు. -
సరిహద్దు జిల్లాల్లో జాతరే..
అశ్వారావుపేట/సత్తుపల్లి: కోడి పందేలతో ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు జాతరను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు సరిహద్దుకు తరలివచ్చారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర మండలాల్లో కోడి పందేలు జరిగే ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వచ్చారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల మీదుగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించే కోడిపందేల స్థావరాలకు కూడా బయలుదేరారు. ఇటు కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు, కాకర్ల, మల్లేల గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని కొన్ని గ్రామాలకు జిల్లా వాసులు వెళ్లారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చంద్రుగొండతో పాటు ఏపీకి బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడుల్లోని పామాయిల్ తోటల్లో షెడ్లు ఏర్పాటు చేసి ఏడాది పాటు కోళ్లను పెంచారు. వీటితో కొందరు పందెంలో పాల్గొంటున్నారు. -
లుంగీ, షర్టు ధరించి మారు వేషంలో ఎస్ఐ.. ఏమైందో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: పోలీస్ డ్రెస్సులో దాడికి వెళుతుంటే కోడి పందేల నిర్వాహకులు ముందే అప్రమత్తమవుతున్నారని ఎస్ఐ మారు వేషంలో ప్రత్యక్షమయ్యారు. లుంగీ, షర్టు ధరించి సామాన్య గ్రామీణుడిలా వెళ్లడంతో ఆయననెవరూ గుర్తు పట్టలేదు. కోడి పుంజులతో సహా సునాయాసంగా నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటన రోలుగుంటలో బుధవారం రాత్రి జరిగింది. చదవండి: సంక్రాంతి: గంగిరెద్దులతో మాట్లాడగల నేర్పరులు స్థానిక ఎస్ఐ బి.నాగకార్తీక్ సిబ్బందితో కలిసి ఇలా వినూత్న రీతిలో ఎం.కె.పట్నం పరిసర ప్రాంతంలోని కోడి పందెం స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా వారి నుంచి రెండు కోడి పుంజులు, రూ.510 లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. -
'పుంజు'కున్న ధరలు.. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ
సాక్షి, పశ్చిమగోదావరి(నిడదవోలు): సంక్రాంతి బరిలో నిలిచే కోడి పుంజుల ధరలు ఔరా అనిపిస్తున్నాయి. పుంజు రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతున్నాయి. బరిలో దిగితే నువ్వానేనా అన్నట్టు తలపడే రకాల్లో సేతువ జాతి ముందుంటుంది. దీని ధర రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. తర్వాత స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకి పుంజు, పెట్టమారు జాతులు ఉన్నాయి. పర్ల రూ. 50 వేలు, నెమలి రూ. 50 వేల నుంచి రూ.60 వేలు, కాకి డేగ పర్ల రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ఎర్రకెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకి డేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలు ధరలు పలుకుతున్నాయి. వీటితో పాటు రసంగి, కెక్కరి, పూల, అబ్రస్, పండుడేగ, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ రకాలు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరలకు పందెంరాయుళ్లు కొనుగోలు చేస్తున్నారు. పుంజుల ప్రత్యేకతలు, సామర్థ్యం ఆధారంగా ధరలు ఉంటాయని పెంపకందారులు చెబుతున్నారు. చదవండి: (‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’) -
కవన హేమంతం
హేమంత రుతువులో వచ్చే మకర సంక్రాంతి తెలుగువాళ్ల పెద్ద పండుగ. ముఖ్యంగా ఇది కృషీవలుౖరైన రైతుల పండుగ. పంటలు చేతికంది, ధాన్యరాశులు ముంగిళ్లలో పోగుపడే వేళ జరుపుకొనే అచ్చమైన అన్నదాతల పండుగ. అలాగని ఇది తెలుగువాళ్లకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు తమ తమ ఆచార సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగను వీలైనంత సంబరంగా జరుపుకొంటారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీనులు మొదలుకొని ఆధునికుల వరకు ఎందరో కవులు తమ కావ్యాల్లో సంక్రాంతి హేలను, హేమంత రుతులీలను అత్యంత హృద్యంగా వర్ణించారు. వర్షరుతువు ప్రారంభంలో వేసిన పంటలు చేతికందే నాటికి హేమంత ప్రభావం తారస్థాయికి చేరుకుంటుంది. పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. చలి వణికిస్తుంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా వీధుల్లో మంచు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయి. ఇది ప్రకృతి ధర్మం. ‘అహములు సన్నములయ్యెను/ దహనము హితమయ్యె దీర్ఘదశలయ్యె నిశల్;/ బహు శీతోపేతంబై/ యుహుహూ మని వడకె లోకముర్వీనాథా!’ అని పోతనామాత్యుడు తన భాగవత కావ్యంలో హేమంత శీతలతను కళ్లకు కట్టాడు. అలాగని, అంతటితోనే ఆగలేదు. ‘పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా/ బరువు లెట్టి యినుడు పశ్చిమాద్రి/ మరుగు జొచ్చెగాక మసలిన చలిచేత/ జిక్కె జిక్కెననగ జిక్కకున్నె?’ అంటూ, చలి తాకిడి నుంచి తప్పించుకోవడానికే సూర్యుడు ఉరుకులు పరుగులు పెట్టి పడమటి కొండల్లో దాక్కున్నాడని తీర్మానించాడు. హేమంతపు చలిధాటి సూర్యుడినే భయపెట్టిందంటే, ఇక మానవమాత్రుల సంగతి చెప్పేదేముంటుంది? ఇలాంటి హేమంత శీతవేళ వచ్చే పండుగ మకర సంక్రాంతి. చలి తీవ్రతను తట్టుకోవడానికి జనాలు చలిమంటలు వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి ముందురోజు భోగి పండుగనాడు వీధివీధినా ఊరుమ్మడి చలిమంటలు వేసుకోవడం ఆనవాయితీ. పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి వేళ ధాన్యరాశులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఒకవైపు గడగడ వణికించే చలి ఉన్నా, స్థూలంగా ప్రకృతి ఆహ్లాదభరితంగా ఉంటుంది. సంక్రాంతి శోభను ఎందరో ఆధునిక కవులు సైతం అత్యద్భుతంగా వర్ణించారు. ‘కళ్యాణకంఠి ఈ కన్నెసంక్రాంతి/ భోగాలబాల ఈ భోగి సంక్రాంతి/ వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ రాయప్రోలువారు సంక్రాంతి రాకడపై హర్షాతిరేకాలు ప్రకటించారు. సంక్రాంతికి కొత్త అల్లుళ్లను ఆహ్వానించడం, బంధుమిత్రులతో విందుభోజనాలు ఆరగించడం ఆనవాయితీ. ‘జిడ్డుదేఱిన వెన్నెలగడ్డ పెరుగు/ గరగిరకజాటు ముంగారు చెఱకురసము/ సంతరించితి విందుభోజనము సేయ/ రండురండని పిలిచె సంక్రమణ లక్ష్మి’ అని చవులూరించేలా వర్ణించారు ‘తెనుగు లెంక’ తుమ్మలవారు. సాహితీ ఉపాధ్యాయుడే కాక, స్వయంగా కృషీవలుడైన ఆయన సంక్రాంతిపై విరివిగా పద్యాలను అల్లారు. ఆధునికుల్లో జంటకవులైన పింగళి–కాటూరి ‘దినకరుడు శాంతుడై తోచె దినములింత/ కురుచలయ్యెను జలిగాలి చురుకు హెచ్చె/... మన గృహమ్ముల ధాన్య సంపదల నిల్పి/ సరస మధురమ్ము పుష్యమాసమ్ము వచ్చె’ అంటూ ‘తొలకరి’ కావ్యంలో పుష్య సౌభాగ్యాన్ని వర్ణించారు. వీరు ఇదే కావ్యంలో సంక్రాంతి వేడుకలను వర్ణిస్తూ, ‘రండు మాయింటి కీరు పేరంటమునకు/ బొమ్మలెత్తును మా పిల్లయమ్మలార’ అంటూ సంక్రాంతి బొమ్మల కొలువుల వేడుకను ప్రస్తావించారు. దసరాకే కాదు, కొన్నిప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టడమూ ఆనవాయితీ. సంక్రాంతి బొమ్మల కొలువుల్లో ప్రధాన దైవం సంక్రాంతి పురుషుడు. సంక్రాంతి పురుషుణ్ణే సంకురమయ్య అని పిలుచుకుంటారు. కాలపురుషుడే సంక్రాంతి పురుషుడిగా మకర సంక్రాంతినాడు భూమిపైకి దిగివచ్చి, భూలోక వాసులను పరిపాలిస్తాడని ఒక నమ్మకం. సంక్రాంతి రైతుల పండుగే కాదు, ముదితల పండుగ, ముగ్గుల పండుగ కూడా! ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి వీధుల్లో ప్రతి ముంగిటా ముగ్గులు కళకళలాడుతూ కనిపిస్తాయి. ముగ్గులు ప్రాచీన కళారూపాలు. కామశాస్త్రం ప్రస్తావించిన అరవైనాలుగు కళల జాబితాలో ముగ్గులు వేయడం కూడా ఒక కళ. తెలుగు కవిత్వంలో ముగ్గుల ప్రస్తావన నన్నయ నాటి నుంచే ఉంది. పాండవులు వారణావతంలోని లక్క ఇంటికి వెళుతున్నప్పుడు వారణావత పుర ప్రజలు వారికి భారీగా స్వాగతం పలికారట. స్వాగత మర్యాదల్లో భాగంగా ఇంటింటా ముంగిళ్లలో ముగ్గులు తీర్చిదిద్దారట. ఆ ఘట్టంలోనే నన్నయ ‘అంగుళల నొప్పె కర్పూర రంగవల్లులు..’ అంటూ ముచ్చటైన పద్యం రాశాడు. ‘పలనాటి వీరచరిత్ర’లో కవిసార్వభౌముడు శ్రీనాథుడూ ముగ్గు ముచ్చట్లు చెప్పాడు. సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు, పేకాటల సందళ్లు ఒకవైపు కోలాహలంగా కొన సాగుతుంటే, మరోవైపు కవి సమ్మేళనాల వంటి సాహితీ కార్యక్రమాలు కూడా సందడిగా జరుగుతుంటాయి. సంక్రాంతి కర్షకుల పండుగే కాదు, కవుల పండుగ కూడా! సంక్రాంతి నాటికి ధాన్యరాశులే కాదు, కవనరాశులు కూడా తెలుగునేల మీద భారీగానే పోగుపడతాయి. వాటి వాసిని నిర్ణయించాల్సింది మాత్రం ప్రజలే! -
సంక్రాంతి బరిలో తగ్గేదేలే...
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్), ద్వారకాతిరుమల: సంక్రాంతి బరికి సై అంటూ పందెంకోళ్లు కాలు దువ్వుతున్నా యి. పండుగ దగ్గర పడుతున్న కొద్దీ సమరోత్సాహంతో కదం తొక్కు తున్నాయి. ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో నిరంతర సాధనతో రాటుదేలుతూ ఈ సంక్రాంతికి నువ్వా నేనా అన్న రీతిలో సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా పందెం కొట్టాలన్న కసితో పందెంరాయుళ్లు కూడా పందెం నీదా.. నాదా అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. పందెంకోళ్ల వైభోగం చూసి ఒకపక్క జనం నోరెళ్లబెడుతుంటే.. మరోవైపు వాటి యజమానులు మాత్రం మురిసిపోతున్నారు. పందేల్లో పైచేయి కోసం తహతహలాడిపోతున్నారు. కోడి పందేలంటేనే గోదావరి జిల్లాలు.. ఇక భీమవరం, మెట్ట ప్రాంతాల్లో పండుగ మూడు రోజులు పందెం బరులు తిరునాళ్లను తలపిస్తాయి. భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తారు. కోడి పందేలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి ఎన్నారైలు గోదావరి జిల్లాలకు తరలివస్తారు. పందేల్లో డబ్బు సంపాదించాలని కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు. ఈ ఏడాది కూడా పందేలు భారీ ఎత్తున నిర్వహించేందుకు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, గణపవరం, వీరవాసరం, ఐ.భీమవరం, ద్వారకాతిరుమల, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, ఉంగుటూరు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. పండుగకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏడాది ముందు నుంచే కసరత్తులు ఎలాగైనా పందెం కొట్టాలనే లక్ష్యంతో సరైన పుంజును బరిలోకి దింపేందుకు పందెంరాయుళ్లు వాటి శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. పుంజును పోటీలకు సిద్ధం చేసేందుకు దాదాపు ఏడాది ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పందెం కోళ్ల శిక్షణ, పోషణకు యజమానులు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ముందుగా వాటి గొంతులో నీటిని పోసి, కపం పోయేలా కళ్లి కొట్టడం, నోట్లో నీరు పోసి ఊదడం, ఒంట్లో కొవ్వు కరిగించేందుకు పొయ్యిపై అట్లపెనం పెట్టి, దానిపై నీరు చల్లి, ఆ నీటిని గుడ్డతో కోడి శరీరానికి రాయడం వంటివి చేస్తారు. కత్తిపోట్లు తట్టుకోవడానికి, ఒళ్లు గట్టిపడడానికి పసుపు, పిప్పళ్లు, వట్టివేర్లు, ఉక్కిసాయిలం, జామాయిల్ సీస, కుంకుళ్లు తదితర 20 రకాల ఆకులతో మరగబెట్టిన నీటిని పోత పోస్తున్నారు. నీటిలో ఈదించడం, వాకింగ్ చేయించడం వంటివి చేస్తారు. పుంజు బరిలో దిగినప్పుడు ఆవేశ పడకుండా ఢీకొట్టేందుకు ఈత కొట్టిస్తామని యజమానులు చెబుతున్నారు. రూ. 15 వేల నుంచి రూ.లక్ష వరకూ ధర జిల్లాలో ఏటా సంక్రాంతికి పందెం పుంజుల అమ్మకాలపై సుమారు రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. పుంజు ధర సుమారు రూ.15 వేల నుంచి సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. నెమలి, కాకి నెమలి, పచ్చకాకి, సేతువ, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగి, మైలా, ఫింగలా, పెట్టమర్రు తదితర రకాల పుంజులు ఉన్నాయి. గత మూడేళ్లుగా పెరూవియన్ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. పెరూ దేశానికి చెందిన ఈ జాతి పుంజులు అమిత వేగంతో దెబ్బలాడతాయి. అవి చిన్నగా ఉండటం వల్ల స్వదేశీ కోళ్లతో సంకరం చేసి, వాటి ద్వారా వచ్చిన సెకండ్, థర్డ్ జనరేషన్ బ్రీడ్లను ప్రస్తుతం పందాలకు సిద్ధం చేస్తున్నారు. బలానికి డ్రై ఫ్రూట్ లడ్డూ, మటన్ కైమా బలం కోసం బాదం, పిస్తా, డ్రైఫ్రూట్ లడ్డూ, మటన్ కైమా, కోడిగుడ్లు పెడుతున్నారు. ఆహారంగా సోళ్లు, గంట్లు, మెరికలు అందిస్తున్నారు. పుంజును తరచూ పశువైద్యులకు చూపించి వారి సలహాల మేరకు విటమిన్ మాత్రలు అందిస్తారు. పుంజు సామర్థ్యం తెలుసుకునేందుకు తరుచూ ట్రయల్ పందాలు వేస్తారు. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగకు రాబట్టుకోవాలని కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు శ్రమిస్తున్నారు. పందానికి పుంజును సిద్ధం చేసేందుకు సుమారు ఏడాది పాటు పెంచుతారు. ఒక్కొక్క పుంజుపై రూ.10 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారు. ముందుగా పుంజుల పెంపకం కోసం స్థలం లీజుకు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. వారి స్థాయిని బట్టి పుంజుల పెంపకం కోసం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు. -
సంక్రాంతి, ఉగాది సందర్భంగా పందేలకు అనుమతివ్వాలి
గోకవరం: సంక్రాంతి, ఉగాది పండుగలకు గ్రామాల్లో ఎడ్లు, గుర్రం, కోడి పందేలు వంటివాటికి ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వాలని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం లేఖ రాశారు. లేఖ ప్రతులను తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో విడుదల చేశారు. ఈ ప్రాంత వాసులకు సంక్రాంతి, ఉగాది ఉత్సవాల్లో ఎడ్లు, గుర్రం, కోడి పందేలు, గోలీలు ఆడుకోవడం, ఎడ్లు బరువు లాగే పందేలు, ఆటల పోటీలు, జాతరలు తదితర వాటిని ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ మధ్యకాలంలో పండుగ ఉత్సవాల్లో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బందులు పెట్టడం, చివరిలో అనుమతిస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు రోజుల పాటు పూర్తిస్థాయిలో ఆటలకు అనుమతి ఇవ్వాలని, పండుగలప్పుడు ప్రజలను జైలుకి తీసుకెళ్లే పరిస్థితి ఉండకుండా చేయాలని కోరారు. -
మఫ్టీలో పోలీసులు.. అది తెలియని గ్రామస్తులు
భువనేశ్వర్ : మల్కన్గిరి జిల్లాలోని కలిమెల సమితిలో ఉన్న మారగాన్ పల్లి గ్రామంలో పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్డీపీ అభిలాష్ సహా మరో ఎనిమిది మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కలిమెల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. సంక్రాంతి పండగ నేపథ్యంలో గ్రామ శివారులోని ఓ తోట వద్ద కొంతమంది గ్రామస్తులు మద్యం తాగడం, కోళ్ల పందేలు నిర్వహించడం వంటివి చేస్తుండగా అక్కడికి మఫ్టీలో చేరుకున్న పోలీసులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులను ఎవరో కొత్త వారు అని భావించిన గ్రామస్తులు.. ‘మా ప్రాంతానికి వచ్చి, మాకే ఎదురు తిరుగుతారా?’ అని వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆఖరికి వారు పోలీసులని తెలియటంతో అక్కడినుంచి గ్రామస్తులు పరారయ్యారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు గ్రామస్తులను నిర్భందంలోకి తీసుకుని, స్టేషన్కు తరలించారు. -
వాడి తగ్గిన కోడి పందెం
సాక్షి, అమరావతి: సంక్రాంతి కోడి పందేల ముచ్చట గురువారంతో ముగిసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోను మూడు రోజుల పాటు పందేలు జరిగాయి. గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పందేల బరుల్లో కోళ్ల హంగామాతో పాటు సమీపంలో పేకాట, గుండాట, కోతాట వంటి జూదం, అనధికార మద్యం షాపులు లెక్కకు మిక్కిలి ఉండేవి. అయితే ఈఏడాది కోడి పందేలు గతానికంటే భిన్నంగా జరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు గట్టి నిఘాతో జూదానికి బ్రేక్ పడింది. కోడి పుంజులకు కత్తులు కట్టకుండా పందేలు వేసుకోవాలని పోలీసులు సూచించారు. అలా జరపడం వల్ల ఉపయోగంలేదని, కత్తులు కట్టి పందెం వేస్తేనే త్వరగా గెలుపోటములు తేలుతాయని నిర్వాహకులు పట్టుబట్టారు. బరుల వద్ద జూదం, మద్యం విక్రయాలు జరిగితే సహించేది లేదని పోలీసు యంత్రాంగం అల్టిమేటం ఇచ్చింది. దీంతో పందేలు చప్పగా సాగాయని నిర్వాహకులు నిట్టూర్చారు. అయితే కొన్ని చోట్ల చాటుమాటుగా గుండాటలతో పాటు పేకాటలు నిర్వహించారు. మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ షాపుల్లో మద్యం కొని తెచ్చుకుని కొందరు బరుల వద్ద సేవించారు. భోగి రోజు మధ్యాహ్నం మొదలై.. కనుమ రోజున ముగిసిన పందేలలో ఈ ఏడాది క్రేజ్ తగ్గిందని, జూదం కూడా తగ్గడం మంచి పరిణామమని గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కోడి పందెం బరులకు ఆనుకుని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పకోడి దుకాణాలు, బిర్యాని సెంటర్లు, కూల్డ్రింక్ షాప్లతో పాటు కార్లు, బైక్ పార్కింగ్లతో భారీ ఎత్తున వ్యాపారం జరిగింది. పందేలు తిలకించిన పలువురు ప్రముఖులు గోదావరి జిల్లాల్లో కోడి పందేలను చూసేందుకు గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఈసారి కూడా వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరిగిన కోడి పందేలను ఆయన తిలకించారు. ఉండి–భీమవరం రోడ్డు పక్కన ఉన్న కోట్ల ఆడిటోరియంలో ఆయనకు ప్రత్యేక బస ఏర్పాటు చేశారు. సినీ నటుడు శ్రీకాంత్తో పాటు పలువురు ప్రముఖులు గోదావరి జిల్లాలకు వచ్చి మూడు రోజులపాటు పండుగను సరదాగా గడిపారు. -
'కత్తి’ కడితే కటకటాలే..!
జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పిండివంటల ఘుమఘుమలు.. బంధుమిత్రులు, ఆత్మీయుల కలయికలు, కొత్త అల్లుళ్ల సరదాలతో పండగ శోభ సంతరించుకుంది. మరోవైపు క్రీడల నిర్వహణ పేరుతో కొందరు కోడి పందేల బరులు ఏర్పాటు చేస్తున్నారు. భోగి వరకూ క్రీడా పోటీల వేదికలుగా ఉపయోగిస్తూ ఆ తర్వాత కోడిపందేల బరులుగా మార్చే ఎత్తుగడ కొనసాగుతోంది. అయితే అన్ని బరులపై నిఘా పెట్టామని.. నిబంధనలు ఉల్లంఘించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో: సంప్రదాయం ముసుగులో కోడిపందేలు నిర్వహించే వారు కటకటాలు లెక్కించక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ముందు నుంచే నగరంలోని అనేక ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు. రోజూ ఎక్కడో చోట గుట్టుచప్పుడు కాకుండా పందేలు నిర్వహిస్తున్నారు. గతంలో సంక్రాంతి పండుగ ముందురోజు హడావుడిగా బరి ప్రాంతాలను శుభ్రం చేసి చదునుచేసి టెంట్లు ఏర్పాటు చేసి పందేలను నిర్వహించే వారు. రానురాను పందేలు నిర్వహణ తీరులో మార్పులు సంతరించుకుంటున్నాయి. విజయవాడ కమిషనరేట్ పరిధిలో అనధికారికంగా ఏర్పాటవుతున్న బరి ముందస్తుగా బరుల ఏర్పాటుకు ఇబ్బందులు లేకుండా సంక్రాంతి క్రీడా పోటీల నిర్వహణ పేరుతో వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను సిద్ధం చేసి తాత్కాలికంగా వివిధ రకాల క్రీడా పోటీలకు శ్రీకారం చుడుతున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని గన్నవరం, కంకిపాడు, ఉంగుటూరు, తోట్లవల్లూరు, నున్న, ఆత్కూరు పరిధిల్లో ఇలాంటి అనధికార బరులను పదకొడింటిని పోలీసులు గుర్తించారు. పలుచోట్ల స్థలాలను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నట్లు గుర్తించారు. అడిగితే సంక్రాంతికి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం స్థలాన్ని చదునుచేశామని చెబుతున్నారు. దీంతో అధికారులు వారిని ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడుతోంది. చదవండి: సంక్రాంతికి మీ ఇంటికా.. మా ఇంటికా? నిర్వాహకుల ధీమా.. న్యాయస్థానం ఆదేశాలతో కోడిపందేలు, ఇతర జూదాలను అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బరి ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా చివరి మూడు రోజులు అనుమతులు వస్తాయని నిర్వాహకులు ధీమాగా ఉంటున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం.. అనుమతి లేకుండా బరులు ఏర్పాటు చేసినా.. నిబంధనలు ఉల్లంఘించి కత్తి కట్టి కోడిపందేలు నిర్వహించినా నేరం. అలాంటి నిర్వాహకులపై జంతు హింస నిరోధక చట్టం 1960 ప్రకారం సెక్షన్–11 కింద కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే పోలీసుల అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన 11 బరులను గుర్తించాం. పోలీసుల అనుమతితో సంప్రదాయ బద్ధంగా రంగవల్లులు, క్రీడల పోటీలు నిర్వహించవచ్చు. అలా కాకుండా సంప్రదాయం ముసుగులో కోడిపందేలు, పేకాట, గుండాట, కోతాట, నెంబరు పందేలు తదితర జూదక్రీడలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. – ద్వారకా తిరుమలరావు, సీపీ, విజయవాడ -
కాసుకోం‘ఢీ’
సత్తుపల్లి: కాకిడేగ పందానికి సై అంటే.. నెమలి పుంజు తొడకొడుతోంది. పందెం రాయుళ్లలో హుషారు ఉరకలేస్తోంది. సరదాల సంక్రాంతి పండగ పురస్కరించుకుని ఆంధ్రా సరిహద్దుల్లో పందెం బిర్రులు సిద్ధమవుతున్నాయి. పోలీసులు ఆంక్షలు పెడుతున్నా.. పందెం రాయుళ్లు వెనక్కు తగ్గడంలేదు. భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజులు కోడి పందేలు వేసేందుకు రాయుళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఆంధ్ర సరిహద్దులో ఉన్న సత్తుపల్లి నియోజకవర్గంపై కోడిపందేల ప్రభావం అధికంగానే ఉంది. పశ్చిమగోదావరిజిల్లా సీతానగరం, పోతునూరు, సీసం, చింతంపల్లి, కృష్ణాజిల్లా కొప్పాక, కొత్తూరు, కాకర్ల, పోళ్లు గ్రామాల్లో కోడిపందేల బిర్రులు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలో కోడి పందేల బిర్రులపై పోలీసులు దాడి చేయటంతో ఇద్దరు యువకులు తప్పించుకునే ప్రయత్నంలో బావిలోపడి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ జిల్లాలో కోడి పందేలు జరిగే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పందెం రాయుళ్లు చెప్పుకుంటున్నారు. ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. సంక్రాంతి పండగ మూడురోజులు పందేలు కాసేందుకు ఉత్సాహం చూపిస్తారు. సంకలో కోడిపుంజు పట్టుకుని పందేలకు వెళ్లేవాళ్లు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కన్పిస్తారు. పందేలను తిలకించేందుకు కూడా పెద్ద సంఖ్యలో తరలి వెళ్తారు. పట్టణాలు, నగరాల నుంచి పండగలకు వచ్చిన అతిథులు, బంధువులు పందేలను చూసేందుకు ఆసక్తి కనబర్చుతారు. పల్లెల్లో ఖరీదైన కార్లలో పందెం రాయుళ్లు హల్చల్ చేస్తుంటారు. పందెం కోసం ప్రత్యేక శిక్షణ పందేల కోసం కోడి పుంజులను ప్రత్యేక శిక్షణ ఇచ్చి పెంచుతారు. సాధారణ కోళ్ల కంటే పందెం కోళ్లు చూడటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పసిబిడ్డను పెంచినట్టు పందెం కోళ్ల ఆలనాపాలనా చూస్తారు. పందెం కోళ్ల ఆకారం.. కూత గంభీరంగా ఉంటుంది. పందేలకు మూడు నెలల ముందు నుంచే పందెం పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏడాదిన్నర వయసు ఉన్న పుంజును ఎంచుకుని ప్రత్యేక బోనులో ఉంచి సకల సౌకర్యాలతో పెంచుతారు. పందెం కోళ్లు మిగతా కోళ్లతో జతకట్టనివ్వరు. బ్రహ్మచర్యం వల్ల పుంజులకు శక్తి పెరుగుతుందని విశ్వాసం. కోడి పుంజులకు సజ్జలు, సోళ్లు, మటన్ కీమా, బాదం, పిస్తా, పప్పు, పచ్చసొన తీసిని కోడిగుడ్డు, రెవిటాల్ టాబ్లెట్, 18 రకాల దినుసులు కలిపిన లేహ్యం తినిపిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్లల్లో వేప, జామ, వెదురు ఆకులు, పసుపు కలిపి మరగబెట్టిన గోరువెచ్చని నీటితో పందెం పుంజులకు ప్రత్యేకంగా స్నానం చేపిస్తారు. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా పుంజును పందేనికి సిద్ధం చేస్తారు. పందెం కోళ్లల్లో సుమారు 50 రకాలు ఉంటాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సీతువ, పూల, పింగళి, కౌజు, ఎర్రబోర, నెమలి పుంజులు ఉంటాయి. లక్షల్లో కోడి కోసాట.. కోడి పందేల మాటున అదే ప్రాంతంలో లక్షల రూపాయల్లో కోసాట(లోన, బయట) పేకాట నిర్వహిస్తుంటారు. ఓ వైపు కోడి పందేలు నడుస్తుండగానే కోసాట(పేకాట) నడుస్తుంటుంది. రాత్రి వేళ్లల్లో సైతం ఫ్లడ్లైట్ల వెలుగులో లక్షల రూపాయల కోసాట(లోన, బయట) జరుగుతుందని సమాచారం. పందెం రాయుళ్లు ఉదయం నుంచి మద్యం మత్తులో ఉండటంతో లోనబయట పేకాటలో సర్వం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం వినిపిస్తున్నాయి. పందెం జరిగే తోటల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోడిపందేలు జరుగుతుండగానే కోసాట, గుండుపట్టాలు, పులిమేక జూదం నడుస్తున్నట్లు సమాచారం. జూదరులకు అందుబాటులో మద్యం, మాంసం విక్రయాలు, బిరియాని ప్యాకెట్లు లభిస్తుంటాయి. పోలీస్ నిఘా ఉన్నా.. కోడిపందేలు నియంత్రించేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేసి హెచ్చరికలు జారీచేసినప్పటికీ పందెం రాయుళ్లు ఖాతరు చేయటం లేదు. గతేడాది పండగ మూడురోజులు పోలీసులు పందేలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పోలీసులు సరిహద్దుల్లో గస్తీకాస్తున్నా పందెంరాయుళ్లు కోడిపుంజులను వేరే దారిన పంపించి పందేల స్థావరాలను చేరుకుంటారు. ఒక్కోసారి పోలీసులకు పందేలు ఓచోట నడుస్తున్నాయని సమాచారం అందించి, వారిని బురిడి కొట్టించి వేరేచోట దర్జాగా పందేలు వేస్తుంటారు. పండగ మూడురోజులు కోడిపందేలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ పందెం రాయుళ్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిమాండ్ చేయటం విశేషం. -
కోడి పందెలు జోరు
మంచిర్యాలక్రైం: సంక్రాంతి ప్రత్యేకం కోడి పందెలు జోరందుకుంటున్నాయి. పందెంరాయుళ్లు సై అంటే సై అంటున్నారు. కోడి పందెల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో అన్నిచోట్ల రహస్యంగా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు దొరకకుండా ఉండేలా స్థావరాలను ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది కూడా భారీగా పందెలు నిర్వహించేందుకు పలువురు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా పందెంరాయుళ్లు ఎలాగైనా నిర్వహించాలన్న ఉత్సాహంతో సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కోడి పుంజులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం మందమర్రి, కోటపల్లి, నెన్నెల, నీల్వాయి, మంచిర్యాల నియోజకవర్గంలోని లక్సెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కోడి పందెలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పందెలకు ప్రత్యేకం.. మంచిర్యాల జిల్లాలో గతంలో తరచుగా కోడి పందెలు నిర్వహించే ప్రాంతాలు లక్సెట్టిపేట మండలం వెంకట్రావ్పేట, బలరావుపేట, మందమర్రి మండలంలోని పులిమడుగు, మందమర్రి, శివ్వారం, కోటపల్లి మండలంలోని సిర్సా, అన్నారం, అర్జున్గుట్టా, కోటపల్లి, సుంపుటం, జనగామ, హాజీపూర్ మండలంలోని పెద్దంపేట, గొల్లపెల్లి, మంచిర్యాలలో గోదావరినదీ పరివాహక ప్రాంతాల్లో, శ్రీరాంపూర్లో, బెల్లంపల్లి డివిజన్లోని తాండూర్ మండలంలో భారీగా కోడి పందెలు నిర్వహించే వారు. గతేడాది టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు చేసిన దాడిలో 8 కేసులు నమోదు కాగా పందెం కోడి పుంజులు 21, పందెం నిర్వహిస్తున్న 43 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.58,270ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే.. జిల్లాలో ప్రతిఏటా సంక్రాంతి పండుగకు భారీ ఎత్తున కోడి పందెలు నిర్వహిస్తున్నారు. వాటి నియంత్రణలో మాత్రం పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. సీజన్లో అడపదడపా దాడులు చేస్తూ నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బడా పందెంరాయుళ్లపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. కొన్నిచోట్లా ప్రభుత్వ ఉద్యోగులు, చోటమోటా రాజకీయ నాయకులు సైతం కోడి పందెల నిర్వహణలో పాల్గొనడం గమనార్హం. గతేడాది నమోదైన కేసులు కొన్ని.. 2018 జనవరి 4న మందమర్రి మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో కోడి పందెలు నిర్వహిస్తున్నారన్నా సమాచారం మేరకు రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి రెండు కోడి పుంజులను, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేవారు. వారి నుంచి రూ.5500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2018 జనవరి 11న స్థానిక పోలీసులు కోడి పందేల స్థావరంపై దాడిచేసి నాలుగు పందెం కోడి పుంజులు, ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రూ. 4080 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2018 జనవరి 15న లక్సెట్టిపేట మండల కేంద్రంలో కోడి పందెలు ఆడుతున్నారన్నా సమాచారం మేరకు రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసుల దాడిచేసి మూడు పందెం కోళ్లు, ఇద్దరు వ్యక్తులను, రూ.1720 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 21న జైపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీరాంపూర్లో కోడి పందెల స్థావరంపై దాడిచేసి రెండు కోడి పుంజులను, 14 మందిని అరెçస్ట్ చేశారు. వీరివద్ద నుంచి రూ.22,850 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 28న లక్సెట్టిపేట మండల కేంద్రంలోని శివారు ప్రాంతాల్లో కోడి పందెం స్థావరాలపై స్థానిక పోలీసులు దాడిచేసి మూడు కోడి పుంజులు, ఐదుగురు వ్యక్తులను అరెçస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2030 నగదు స్వాధీనం చేసుకున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం నిషేధించిన ఏ ఆటలపైనా అయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సంక్రాంతి పండుగకు కోటి పందెలు అధికంగా ఆడుతుంటారు. ఇది తమిళనాడు, సీమాంధ్ర ప్రాంతాల నుంచి మనకు వచ్చింది. కోడి పందెలపై హైకోర్టు నిషేధం విధించింది. వీటిపై ఇప్పటికే టాస్క్ఫోర్స్ టీమ్ తిరుగుతోంది. గతంలో కేసులు నమోదు చేశాం. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందెలపై ప్రత్యేక దృష్టి సారించాం. కోడి పందెలు, పేకాట, మట్కా తదితర నిషేధిత ఆటలపై సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలి. కోడి పుంజులు ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
కోడి పందేల జాతర
కోడి పందేలకు వేళయింది. ఏటా సంక్రాంతి పండగకు రూ.లక్షల్లో కోడి పందేలు.. రూ.కోట్లలో పేకాట. ఏటా ఆనవాయితీగా వస్తున్న ఆటలో ఏడాదిపాటు చెమటోడ్చి పండించిన పంట కష్టం ఒక్కసారి పోగొట్టుకున్న అభాగ్యులెందరో. వీధిన పడిన కుటుంబాలు మరెన్నో. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీ రాష్ట్రంలోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉండడంతో జూదాన్ని అరికట్టడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. డిసెంబర్ చివరి నుంచి జనవరి నెలాఖరు వరకు పందేలకు సీజన్గా చెప్పుకుంటారు. నెల రోజులపాటు ఏ నలుగురు జూదగాళ్లు కలిసినా పందెం ఎక్కడ జరుగుతుంది.. పేకాట ఎక్కడ నడుస్తుందనే సంభాషణలే. ఇందులోనే సంకలో పుంజు పెట్టుకొని తిరిగేవాళ్లు. కేవలం గంట వ్యవధిలోనే పందెంరాయుళ్లు ఒకేచోట కలుసుకోవడం.. అక్కడికక్కడే పందెం వేసుకోవడం.. మళ్లీ స్థలం మార్చడం నిత్యకృత్యం. పది రోజుల నుంచే అక్కడక్కడా పందేలు జరుగుతున్నాయంటే ఎంత డబ్బు చేతులు మారుతుందో అర్థం చేసుకోవచ్చు. సత్తుపల్లి: ఆంధ్రా సరిహద్దు మామిడి తోటలన్నీ పందెం బిర్రులుగా మారుతున్నాయి. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు బిర్రులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.కోట్లలో కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చకచకా చేసుకుంటున్నారు. ఆంధ్రా ప్రాంతంలో అయితే పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. సురక్షితంగా పందేలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో పందెంరాయుళ్లు ఆంధ్రాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో జరిగే పందెం బిర్రులన్నీ సత్తుపల్లి పరిసర ప్రాంత జూదగాళ్లతోనే నడుస్తాయి. రూ.కోట్లలో పేకాట.. కోడిపందెం మాటున రూ.కోట్లలో పేకాట నడుస్తున్నట్లు సమాచారం. కోడిపందేలు ఒక ఎత్తయితే.. రాత్రి, పగలూ తేడా లేకుండా విద్యుత్ జనరేటర్లు అమర్చి మరీ లోనా.. బయటా(పేకాట) నిర్వహించడంతో రెప్పపాటులో రూ.కోట్లు చేతులు మారి జూదరులు వీధినపడిన సంఘటనలు కోకొల్లలు. ఇవే కాకుండా.. గుండుపట్టాలతో జూదం నిర్వహిస్తారు. దీనికి తగినట్లుగా ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అయితే పది రోజుల నుంచే ఆంధ్రా సరిహద్దుల్లో పేకాట జోరుగా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుక్కుట శాస్త్రమంటే.. ముసుగు పందేలలో కుక్కుట శాస్త్రం చూసుకొని పందెం వేస్తుంటారు. ఏ సమయంలో.. ఏ నక్షత్రంలో.. ఏ రంగుపుంజు పొడుస్తుంది.. యజమాని పేరులోని మొదటి అక్షరాన్నిబట్టి కుక్కుట శాస్త్రాన్ని అనుసరించి పందెం వేయడం ఆనవాయితీగా వస్తోంది. కోడి పందేలు జరిగే ప్రదేశం.. కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం.. పందెం రోజు జరిగే నక్షత్రం.. శుక్లపక్షంలో నెగ్గే కోళ్లనుబట్టి పందేలు వేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. కోళ్ల పందెం ఏ దిశగా జరుగుతుందో పుంజు యజమాని తన కోడిపుంజును ఆ దిక్కుకు తీసుకెళ్లే విషయంపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పందెంరాయుళ్ల విశ్వాసం. ఆ మూడు రోజులు ఫుల్ జోష్.. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు సంక్రాంతి పందేలకు అడ్డూ అదుపూ ఉండదు. సత్తుపల్లి శివారులోని చింతలపూడి మండలంలో ఐదారుచోట్ల పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సత్తుపల్లి ప్రాంతంలోని కొందరు పందెం బిర్రులు తీసుకొని మరీ పందేలు నడిపిస్తారు. ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం, సీతానగరం, పోతునూరు, చింతంపల్లి, ధర్మాజిగూడెం, కళ్ల చెరువు, వెంకటాపురం, పంచాలకుంట, ప్రగడవరం, గోకారం, కృష్ణా జిల్లా తిరువూరు, కాకర్ల, విస్సన్నపేటల్లో పందేలు జోరుగా జరుగుతాయి. ఇంకా పెద్దపెద్ద పందేలు కొప్పాక, భీమవరంలో భారీ సెట్టింగ్ల మధ్య నిర్వహిస్తారు. పందెంకోళ్ల రకాలు.. పందెంకోళ్లు సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నల్ల సవల ఇలా అనేక రకాలు ఉన్నాయి. ప్రాంతాలనుబట్టి పేర్లు మారిపోతుంటాయి. వీటిలో కాకి, డేగ, నెమలి పందేలకు పెట్టింది పేరు. వీటి ధరలు రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయి. పూర్వ కాలంలో కోడిపందేల కోసం యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. పల్నాటి చరిత్ర, బొబ్బిలి యుద్ధంలో కోడిపందేల చరిత్ర ఆనవాళ్లు కనిపిస్తాయి. -
జోరుగా కోడి పందేలు
భద్రాచలం (ఖమ్మం): భద్రాచలానికి సమీపంలోని సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉండటంతో అటువైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో నిర్వాహకులు యథేచ్ఛగా జూదం నిర్వహిస్తున్నా రు. భద్రాచలం పట్టణానికి సమీపంలో ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం తునికి చెరువు, చోడవరం అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చీరవల్లి సమీప అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వారంలో రెండు రోజులు, ఎక్కువగా గురు, ఆదివారాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పందెంరాయు ళ్లు తరలివస్తున్నారు. ఎక్కువగా ఖమ్మం జిల్లాలో ని సత్తుపల్లి, భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి తూర్పుగోదావరి, విశాఖ పట్నం జిల్లాల నుంచి ఇక్కడ నిర్వహించే కోడిపందేలలో పాల్గొనేందుకు వస్తున్నారు. భద్రాద్రి, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వారంతా భద్రాచలం మీదుగా, తూర్పు, విశాఖపట్నం నుంచి వచ్చే వారు రంపచోడవం ఘాట్రోడ్ నుంచి చింతూరు మీదగా వాహనాల్లో వస్తున్నారు. ఇక్కడ కోడిపందేలు నిర్వహించే రోజుల్లో ఆయా రూట్లలో కార్ల దండు కనిపిస్తుంది. భద్రాచలం ప్రాంతానికి యాత్రికులు, భక్తులు ఎక్కువగా వాహనాల్లోనే వస్తూ ఉంటారు. ఈ క్రమంలో తనిఖీలు లేకుండానే పందెంరాయుళ్లు దర్జాగా స్థావరాలకు చేరుకుంటున్నారు. కత్తులు కడితే రూ.లక్షలు పడాల్సిందే కోడి పందేలు కొందరు ప్రముఖల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రాచలానికి సమీపంలో మూడు చోట్ల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోగా, ఎక్కడ నిర్వహిస్తారనేది పందెం రాయుళ్లకు ముందుగానే సమాచారం ఉంటుంది. స్థావరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి. బిర్రులోకి వెళ్లే ప్రతీ ఒక్కరి నుంచి రూ. 300 రూ.500 వరకు నిర్వాహకులు వసూళ్లు చేస్తున్నారు. పందెం నిర్వహించే రోజున ఎంత మంది వచ్చినప్పటికీ, ఐదు వందల మంది పట్టే రీతిలో బిర్రు తయారు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక రోజుకు కత్తుల కట్టిన చోట రూ.2.50 లక్షల వరకు వసూళ్లవుతాయి. పందెం కాసే డబ్బుల్లోంచి కూడా 5 శాతం కమీషన్ నిర్వాహకులకు ఇచ్చేలా తగిన ఒప్పందాలు ఉంటాయి. ఒక్క రోజుకు రూ. 3 నుంచి 5 లక్షల వరకూ నిర్వాహకులకు ముడతాయి. మూడు ముక్కల పేకాట, లోనబయట వంటి జూదం నిర్వహించుకునేందుకు నిర్వాహకులకు ముందస్తుగా డబ్బులు చెల్లించాలి. కోడిపందేలు నిర్వహించే చోట మద్యం విక్రయాలకు సంబంధించిన దుకాణాలు కూడా వెలుస్తున్నాయి. వీటిని పెట్టుకునేందుకు నిర్వాహకులకు డబ్బులు చెల్లించి ముందుగానే ఒప్పందం చేసుకోవాలి. ఈ రీతిన కోడి పందేల నిర్వహణకు లక్షలాది రూపాయలను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిహారం డబ్బులు అందుకున్న బడాబాబులు సైతం వీటిలో పాల్గొనేందుకు వస్తుండటంతో ఇక్కడ పందేలు రూ.లక్షల్లోనే సాగుతున్నాయి. భద్రాచలం కేంద్రంగానే.. సరిహద్దు అటవీ ప్రాతంలో వినాయక చవితి మొదలుకుని సంక్రాంతి వరకు కోడిపందేల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాలకు కొంతమంది జట్టుగా ఏర్పడి కోడిపందేలను నిర్వహిస్తున్నారు. పందేలు జరిగే రోజుల్లో తనిఖీలు చేయకుండా సరిహద్దు ప్రాంతాల్లోని ఒక్కో స్టేషన్కు నెలకు రూ. లక్ష ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వీటి జోలికి వెళ్లకుండా ఉండేలా కొన్ని వర్గాలకు కూడా డబ్బులు పంచుతున్నారనే ప్రచారం ఉంది. గత ఏడాది కూడా ఇదే రీతిన సరిహద్దు ప్రాంతంలో కోడి పందేలు సాగాయి. అప్పట్లో జరిగిన మామూళ్ల పర్వంపై ఇక్కడి నిఘా వర్గాలు పక్కా ఆధారాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. భద్రాచలంలో పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారి మారాయిగూడెం ప్రాంతంలో జరిగే కోడిపందేలును అడ్డుకునేందుకు ఛత్తీస్గఢ్ పోలీస్ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. ముందుగానే మేల్కొంటేనే.. భద్రాచలం కేంద్రంగా సాగుతున్న కోడిపందేల దందాపై పోలీసు అధికారులు అడ్డుకట్ట వేయాలి. లేకుంటే ఈ పరిణామాలు వేరే అక్రమాలకు తావిచ్చే అవకాశం ఉంటుంది. గత సంఘటనలు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలో ఎటపాక పోలీసు స్టేషన్లో ఎన్ఐఏ అధికారిని అంటూ కొన్ని రోజులు పాటు హల్చల్ చేసిన నకిలీ పోలీసు భద్రాచలం కేంద్రంగానే కదలికలు కొనసాగించాడు. గంజాయి రవాణాకు కూడా ఇదే మార్గం కావటం పోలీసులకు కత్తిసాము వంటిదే. మళ్లీ ఈ ప్రాంతంలో కోడి పందేలకు తెరలేపగా, ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావటం, మరో పక్క మావోయిస్టుల కదలికలు కూడా బాగానే ఉండటంతో దీని వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోలీసు శాఖ ఉన్నతాధికారులు దీనిపై ముందుగానే దృష్టి సారించి కట్టడి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు
గద్వాల క్రైం: ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కోడిపందేల ఆట అంటే యమ క్రేజీ. అది జూదౖ మెనా జాలీగా ఆడుతుంటారు. ముఖ్యంగా సం క్రాంతి పండగ సందర్భంగా దాన్ని ఓ సంప్రదాయంగా ఆడతారనే విషయం అందరికీ తెలియదు. అయితే కొన్నిప్రాంతాల్లో ఆ సంప్రదాయం ముదిరి కత్తులు దూసుకునే వరకు వెళ్తుంది. రూ.లక్షల్లో బెట్టింగులు.. కోట్లల్లో చేతులు మారుతుంటాయి. ఆ సంస్కృతి ఇప్పుడు తెలంగాణలోనూ పాకుతోంది. అక్కడ కేవలం సంక్రాంతి పండగ సమయాల్లో సాగితే ఇక్కడ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా నిత్యం రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. పందెం కోళ్ల సై ఆటకు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, భూత్పూర్, ఖిల్లాఘనపురం, కొత్తకోట, కొల్లాపూర్, పాన్గల్, మిడ్జిల్, పెబ్బేరు, నాగర్కర్నూల్, అచ్చంపేట, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాలకు చెందిన వారితో గుంటూరు జిల్లా కారంపుడి, పిడుగురాళ్లకు చెందిన కేటుగాళ్లు జోగుళాంబ గద్వాల జిల్లాను అడ్డాగా మార్చుకున్నారు. నడిగడ్డ ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో పందేలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కొందరు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర సరిహద్దుల్లో గుట్టలు, వాగులు, చిట్టడవి లాంటి రహస్య ప్రాంతాల్లో పందేలు కాస్తున్నారు. ఐదు రోజుల కిందట అయిజ శివారులో పక్కా సమాచారంతో కోళ్ల పందేల గుంపులపై పోలీసులు దాడులు చేశారు. అక్కడ వారినుంచి రూ.4.19 లక్షలు, 4 తుఫాన్ వాహనాలు, 4 కార్లు, 5 పందెం కోళ్లు, నాలుగు కత్తులు, 46 మంది కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఇంత పెద్దమొత్తంలో బెట్టింగురాయుళ్లు పట్టుబడటం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. వారిని విచారించగా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలిసింది. నడిగడ్డలో జరిగిన దాడులు.. జనవరిలో మల్దకల్ మండలంలో కోళ్ల పందేలు ఆడుతున్న 9 మంది పట్టుబడ్డారు. ఫిబ్రవరిలో ఇటిక్యాల మండలం ఎర్రవల్లి గ్రామ శివారులో 37 మంది కోళ్ల పందేలు కాస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేనెలలో ధరూర్ మండల కేంద్రంలో 10 మంది పందెంరాయుళ్లు దొరికారు. ఈనెలలో గట్టు మండలం బల్గెర గ్రామ శివారులో కోళ్ల పందెం ఆడుతున్న పది మంది అరెస్టయ్యారు. తాజాగా ఐదు రోజుల కిందట అయిజ మండల కేంద్రంలో వాగు ప్రాంతంలో జరిగిన దాడిలో భారీగా 46 మంది అరెస్టయ్యారు. ఇలా కేవలం ఈ ఏడాదినే లెక్కేసుకుంటే 102 మందిపై గేమింగ్ యాక్టు కింద కేసులు నమోదయ్యాయి. అక్రమాలకు అడ్డాగా నడిగడ్డ నడిగడ్డ అక్రమ దందాలు, నిషేధిత వ్యాపారాలు, నిషేధిత ఆటలు, జూదానికి అడ్డాగా మారుతోంది. ఇక్కడి పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తున్నందునే వారి భాగోతం వెలుగుచూస్తోందనే చెప్పాలి. జూదం, బెట్టింగ్, కల్తీ విత్తనాలు, సారా, కల్తీ కల్లు లాంటి ఎన్నో అక్రమం దందాలను పోలీసులు ఒక్కొక్కటిగా చెక్ పెడుతూ వస్తున్నారు. ఇంత చేస్తున్నా కేటుగాళ్లకు భయం లేకుండా పోయింది. తాజాగా కోళ్ల పందేలా వ్యవహారం బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది. పందెకోళ్లకు భలే డిమాండ్ కోళ్ల పందేలకు ఇక్కడ ప్రత్యేకమైన కోళ్లను ఎంపిక చేసుకుంటారు. అరుదైన జాతుల్లో ఉమ్మార్, శైలం, పెద్దవరిసే లాంటి పలు రకాల కోళ్లను మాత్రమే పందేలకు వినియోగిస్తారు. వాటి ధరలు వేలల్లో ఉంటాయంటే నమ్మశక్యం కాదు. కోళ్ల పోషణకు రాగులు, సద్దలు, జీడిపప్పు, పిస్తా తదితర తృణ ధాన్యాలు తినిపిస్తారు. ఈ కోళ్లన్నీ ఆంధ్రా ప్రాంతం నుంచే వస్తాయి. పందేనికి ముందు వాటి కాళ్లకు కత్తులు కట్టి రంగంలోకి దించుతారు. నికాసైన సారా తాగించి బరిలోకి దించుతారు. పక్కాప్లాన్తో నిర్వహణ కోళ్ల పందేల నిర్వహణ పక్కాప్లాన్తో ప్రారంభమవుతుంది. పోలీసులు, జన సంచారం లేని స్థలాలు గుర్తిస్తారు. ఎక్కడ నిర్వహించాలనేది కూడా స్థానికుల సాయంతో ముందుగా పరిశీలన చేసి బెట్టింగ్ రాయుళ్లను ఒక చోటుకు తీసుకొస్తారు. ఆ ప్రాంతంలో ఎవరూ రాకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళఎవరైనా వస్తే తప్పించుకునేందుకు పథక రచనలు కూడా ఉంటాయి. రెండు గ్రూపులుగా విడిపోయి రెండేసి కోళ్లను ఆటలో వదులుతారు. ఆ రెండు గ్రూపుల వ్యక్తులు తమకు నచ్చిన కోడిపై బెట్టింగ్ కడతారు. రూ.10 వేల నుంచి మొదలు లక్షల్లో పందేలు కాస్తారు. పెట్టిన బెట్టుకు రెండు, మూడింతలు లాభం వస్తుండటంతో కకొందరు అప్పులు చేసి మరీ పందెం కాయడానికి వస్తున్నారు. గెలుపొందిన వారు లక్షాధికారులవుతుంటే ఓడిన వారు మాత్రం రోడ్డున పడుతున్నారు. కఠిన చర్యలు తప్పవు నిషేధిత పోటీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. కోడి పందేలు, జూదం, బెట్టింగ్ నిర్వహించే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసుశాఖ గట్టి నిఘా పెట్టింది. జిల్లాలో కొంత మందితో బయటి రాష్ట్రానికి చెందిన వారు వచ్చి కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నాం. దొరికిన వారిపై గేమింగ్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నాం. – సురేందర్రావు, డీఎస్పీ, గద్వాల -
పెంటపాడు మండలం పరిమెళ్లలో కోళ్ల పందాలు
-
హెచ్చరికలు బేఖాతరు
పండగ మూడు రోజుల్లో రూ.30 కోట్ల మేర సాగిన కోడిపందేలు కత్తులు కట్టి మరీ బరితెగించిన పందెగాళ్లు కోర్టు ఆదేశాలు, 144 సెక్ష¯ŒS ఉన్నా.. పట్టించుకోని వైనం యథేచ్ఛగా గుండాటలు, అశ్లీల నృత్యాలు అయినా పత్తా లేని పోలీసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోడిపందేలు నిర్వహించరాదంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ఈ నెల 25వ తేదీ వరకూ 144 సెక్ష¯ŒS విధిస్తున్నామని, ఐదుగురికంటే ఎక్కువమంది గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా జిల్లా కలెక్టరే హెచ్చరించినా.. పందెగాళ్లు బేఖాతర్ అన్నారు. ఫలితంగా సంక్రాంతి పండగా మూడు రోజులూ.. సంప్రదాయం ముసుగులో జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కోడిపందేలు, గుండాట, మూడుముక్కలాటలు, అశ్లీల నృత్యాలు యథేచ్ఛగా సాగాయి. మునుపెన్నడూ లేని రీతిలో పందెగాళ్లు ఈ మూడు రోజుల్లో రూ.30 కోట్ల మేర కొల్ల గొట్టారు. ఇందులో ‘తమ్ముళ్ల’కు, పోలీసులకు వాటాలు అందడంతో పందెంకోళ్లకు పగ్గాలు వేసేవారే లేకపోయారు. ప్రధానంగా కోనసీమలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే పందేలు విచ్చలవిడిగా సాగాయి. మురమళ్లలో డ్రోన్ల వినియోగం ఐ.పోలవరం మండలం మురమళ్లలోని కోడిపందేల బరి జిల్లాలోనే అతి పెద్దది. దీంతో దీనినో క్రీడాస్థలంలా తయారు చేశారు. బరుల చుట్టూ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలు జరుగుతున్న తీరును డ్రో¯ŒS కెమెరాలతో చిత్రించారు. ఈ బరిలో ప్రతి పందెం రూ.లక్షల్లోనే సాగింది. ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు వీఐపీ గ్యాలరీలో తొలి వరుసలోనే కూర్చుని ఇక్కడి పందేలను స్వయంగా జరిపించారు. భోజన విరామం కూడా లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ పందేలు నిర్విరామంగా నిర్వహించారు. మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాల్లో గ్యాలరీలో కూర్చునవారికి నిర్వాహకులు చికె¯ŒS బిర్యానీ బాక్సులు అందించడంతో ఏమాత్రం బ్రేక్ లేకుండా పందేలు సాగాయి. ఈ ఒక్క బరిలోనే రోజూ దాదాపు రూ.5 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.15 కోట్ల మేర పందేలు జరిగాయి. మురమళ్ల బరిలో పందేలు చూసేందుకు జిల్లావ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఇక్కడ గుండాట కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ బరి వద్ద గుండాట ఏర్పాటుకు రూ.38 లక్షలతో హక్కులు సొంతం చేసుకున్న నిర్వాహకులు రోజుకు రూ.50 లక్షల పైనే ఆర్జించారు. ఇందులో తెలుగు తమ్ముళ్లకు కూడా 30 శాతం వాటాలు అందాయి. డిప్యూటీ సీఎం ఇలాకాల్లో.. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురంతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో కూడా మూడు రోజులూ కోడిపందేలు జోరుగా జరిగాయి. అల్లవరం మండలం గోడి, గోడిలంక, గుండెపూడి, అల్లవరం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, ఎ¯ŒS.కొత్తపల్లి, చల్లపల్లి, కూనవరంలో అమాత్యుని అండ ఉందనే ధైర్యంతో పందెగాళ్లు లక్షల్లోనే పందేలు కాశారు. పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం, మేడపాడు, వీకే రాయపురం, మాధవపట్నం గ్రామాల్లోని బరుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రాజోలు దీవిలో కూడా పందేలు యథేచ్ఛగా సాగాయి. మండలంలోని చింతలపల్లి, ఉయ్యూరివారి మెరక, మలికిపురం, అంతర్వేది, సఖినేటిపల్లిలంక తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహించారు. మెట్టప్రాంతంలో.. మెట్టలోని జగ్గంపేట నియోజకవర్గంలో భోగి నుంచి కనుమ పండగ వరకూ కోడిపందేలు జోరుగా జరిగాయి. ప్రధానంగా కిర్లంపూడిలో కోడిపందేలు జరిగాయి. కాకినాడ ఎంపీ తోట నరసింహం తన కుమారుడు, అల్లుడితో కలిసి ఆదివారం సాయంత్రం ఇక్కడ పందేలను తిలకించారు. కిర్లంపూడి మండలంలో వేలంక, గోనేడ, తామరాడ, కృష్ణవరం, జగ్గంపేట మండలం కాట్రావుపల్లి, మర్రిపాక, రాజపూడి, జె.కొత్తూరు, వెంగాయమ్మపురం, గోవిందపురం, గండేపల్లి మండలం సింగరంపాలెం, మల్లేపల్లి, నీలాద్రిరావుపేట, గోకవరం మండలం కృష్ణునిపాలెం, కామరాజుపేట, మల్లవరం తదితర గ్రామాల్లో జరిగిన కోడిపందేల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రాజమహేంద్రవరం రూరల్ కవలగొయ్యి, కోలమూరు, వేమగిరి, కడియపులంక తదితర గ్రామాల పరిధిలో ఈ మూడు రోజులూ కోడిపందేలు అర్ధరాత్రి వరకూ నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు దగ్గరుండి మరీ పందేలను ప్రోత్సహించారు. కోడిపందేలకు తోడుగా ఆయా బరుల వద్ద గుండాట, ముక్కతిప్పుడు, మద్యం, సారా అందుబాటులోకి తెచ్చారు. ఈ మూడు రోజుల్లోనే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ చేతులు మారాయి. మండపేట నియోజకవర్గం మండపేట అర్బన్, రాయవరం, కపిలేశ్వరపురం మండలం లంకల్లోనూ రూ.50 లక్షలకు పైగా పందేలు జరిగాయి. అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెం, అనపర్తి, గొల్లల మామిడాడ, మెట్ట గ్రామాల్లోను, రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు, యండగండి, పల్లిపాలెం తదితర గ్రామాల్లోనూ, కాకినాడ రూరల్ పరిధి భావారం తోటలు, గొర్రిపూడి, పెనుమర్తి, గురజనాపల్లి, పెద్దాపురప్పాడు తదితర గ్రామాల్లోనూ, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, రాజానగరం నియోజకవర్గాల పరిధిలోనూ భారీగా పందేలు నిర్వహించారు. విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు సందట్లో సడేమియా అన్నట్టు కొన్నిచోట్ల అశ్లీల నృత్యాలకూ తెర తీశారు. మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెం, గుడిమెళ్లంక, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, కొత్తపేట ప్రభల తీర్థాల్లో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు నిర్వహించారు. రాత్రి మొదలైన ఈ నృత్యాలు అర్ధరాత్రయ్యేసరికి శృతి మించిపోయాయి. కోనసీమవ్యాప్తంగా కుర్రకారు ఈ నృత్యాలను తిలకించేందుకు తండోపతండాలుగా వెళ్లారు. వీటి విషయంలో కూడా పోలీసులు మౌనంగానే ఉండిపోయారు. -
పందేనిదే పైచేయి
అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో యథేచ్ఛగా కోడిపందేలు హోంమంత్రి నియోజకవర్గాల్లోనూ అదే తీరు మురమళ్లలో భారీ బరులు.. కోట్లలో పందేలు విచ్చలవిడిగా గుండాటలు, జూదాలు చేతులెత్తేసిన పోలీసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : చిన్నచిన్న విషయాలకే సామాన్యులపై ప్రతాపం చూపించే పోలీసులు.. అధికార, ధనబలం ముందు తల వంచేశారు. పందెంకోళ్లకు, పందెగాళ్లకు పగ్గాలు వేయలేకపోయారు. కోడిపందేల నియంత్రణ కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఫలితంగా సంక్రాంతి కోడిపందేలు జిల్లావ్యాప్తంగా యథేచ్ఛగా సాగాయి. అన్నిచోట్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలే దగ్గరుండి పందేలను ప్రారంభించడం.. ఆ పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా శుక్రవారం భోగి పండగనాడే కోడిపందేలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. దీంతోపాటు గుండాట, పేకాటలు జోరుగా సాగాయి. తొలిరోజు పందెం కోడి ఆరేడు కోట్ల పైనే కొట్టింది. కోడిపందేల నిర్వాహకులు జిల్లా అంతటా సుమారు 40 బరులు ఏర్పాటు చేశారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం పందేలపై కనిపించలేదు. అన్నిచోట్లా రూ.2 వేల నోట్లు రెపరెపలాడాయి. స్వైపింగ్ మెషీన్లు సిద్ధం చేసినా వినియోగించలేదు. ప్రధాన ఆకర్షణగా మురమళ్ల ∙ఐ.పోలవరం మండలం మురమళ్ల బరిలో టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కత్తులు లేకుండా సంప్రదాయ పద్ధతిలో కోడిపందేలకు శ్రీకారం చుట్టారు. అనంతరం కత్తులు కట్టి యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. ఇక్కడి ఏర్పాట్లు మినీ స్టేడియంను తలపించాయి. బరిలో ప్రతి పావుగంటకో పందెం జరిగింది. ఒక బరిలో ఒక్కో పందెం రూ.10 లక్షలకు తక్కువ కాకుండా జరిగింది. దీంతోపాటు పై పందేలు రూ.20 లక్షల పైనే జరిగాయి. అక్కడ మరో మూడు చిన్న బరులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ పందేలు జరిగాయి. ఇక్కడి పందేల్లో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర కనిపించారు. ∙రూ.38 లక్షలకు హక్కులు దక్కించుకున్న గుండాట నిర్వాహకులు గుండాట, సూట్ బాల్ ఆటల కోసం 15 బోర్డులు ఏర్పాటు చేసి అరకోటి లావాదేవీలు జరిపారు. ∙మురమళ్లలోనే సుమారు 10 వేల మంది పందేలను వీక్షించారు. రహదారుల మధ్య మొక్కలు, నేతల ఫ్లెక్సీలు, గ్యాలరీలు.. ఇలా సర్వహంగులతో నిర్వహించడంతో మురమళ్ల కోలాహలంగా మారింది. ∙ఒక్క మురమళ్లలోనే రూ.3 కోట్ల‡ పందేలు జరగగా, మిగిలినచోట్ల సుమారు రూ.4 కోట్లు.. కలిపితే మొత్తంగా రూ.7 కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. మరిన్నిచోట్ల : రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని చింతలపల్లి, మలికిపురం, లక్కవరం, గూడపల్లి, శంకరగుప్తం, సఖినేటిపల్లి లంక, రామేశ్వరం, లొల్ల, ర్యాలి, పొడగట్లపల్లి, దేవరపల్లి, నడిమిలంక, గెద్దనాపల్లి, చెయ్యేరు, పల్లంకుర్రు శివారు ఐ.చెరువు, అన్నంపల్లి, పల్లిపాలెం, రాజుపాలెం, గున్నేపల్లి అగ్రహారం తదితర గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు. ∙కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప, కాకినాడ రూరల్లోని 16 ప్రాంతాల్లో బరులు వేసి రూ.లక్షల్లో పందేలు నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కనుసన్నల్లోనే కోడిపందేలు నిర్వహించారు. ∙మండల కేంద్రమైన కాజులూరు, గొల్లపాలెం, పల్లిపాలెం, కుయ్యేరు, జగన్నాథగిరి, కె.గంగవరం మండలం పేకేరు, ఎండగండి, కూళ్ల, రామచంద్రపురం మండలం ద్రాక్షారామల్లో కూడా కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. పోలీసులతో ముందుగానే ఒప్పందాలు! పందేలు జరిగే ప్రతి ప్రాంతం నుంచి బరికి రోజుకు రూ.5 లక్షల చొప్పున పోలీసులకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలాచోట్ల పోలీసుల మొబైల్ ఫో¯ŒSలు స్విచ్చాఫ్ అయిపోయాయి. కొందరు ఫో¯ŒS లిఫ్ట్ చేసినా పందేలు తమ దృష్టికి రాలేదని పైకి చెబుతూ.. పైనుంచి వస్తున్న ఒత్తిళ్ల ముందు తామెంత అని ప్రైవేటు సంభాషణల్లో అంటున్నారు. కాగా, దర్జాగా కోడిపందేలు ఆడుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను, నేతలను ఏమీ చేయలేని పోలీసులు.. కొత్తపేట, కరప తదితర ప్రాంతాల్లో సరదాగా పందేలు ఆడుతున్న సామాన్యులపై మాత్రం ప్రతాపం చూపారు. 25 వరకూ 144 సెక్షన్ : జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకూ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ తెలిపారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తప్పవన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పందేనికి సై
సంక్రాంతి కోడిపందేలకు సిద్ధమవుతున్న బరులు బరితెగిస్తున్న తమ్ముళ్లు ఎమ్మెల్యే స్వగ్రామంలో మినీ స్టేడియాన్ని తలపించేలా ఏర్పాట్లు డ్రో¯ŒS కెమెరాలతో చిత్రీకరణ డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గాల్లోనూ భారీ ఏర్పాట్లు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న పోలీసులు ‘‘కోడిపందేలు జరగనివ్వం. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కోర్టులు కూడా అవే చెప్పాయి. అంతకీ పెద్ద పండగకు సంబరాలు కావాలంటే కాకినాడ రండి’’ – జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెబుతున్న మాటలివి. కానీ, వాస్తవంగా జరుగుతున్నది వేరేలా ఉంది. ఆయన సొంత నియోజకవర్గమైన అమలాపురం, ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం ప్రాంతాలతోపాటు.. కోనసీమలోని పలు ప్రాంతాల్లో పందెగాళ్లు బరితెగిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల కనుసన్నల్లో కోట్లలో పందేలు నిర్వహించేందుకు బరులు రెడీ చేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించుకోవచ్చు. కానీ కోళ్లకు కత్తులు కడితే మాత్రం స్వాధీనం చేసుకోవాలి. సరిగ్గా దీనినే పందేల నిర్వాహకులు అవకాశంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. కోడిపందేలకు ఇక్కడ బరులు సరిపోవనే ఉద్దేశంతో పందెగాళ్లు గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లేవారు. కానీ, ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాను తలదన్నేలా.. కోనసీమలోని మురమళ్ల, గోడి గ్రామాల్లో కోట్లలో పందేలు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. మురమళ్లలో భారీ ఏర్పాట్లు ఐ.పోలవరం మండల ముఖద్వారం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం వెనుక శరభయ్య చెరువు సమీపంలో సుమారు 15 ఎకరాల్లో కోట్లలో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్కింగ్కే పదెకరాలు కేటాయించారంటే ఏ స్థాయిలో పందేలు జరుగుతాయో ఊహించవచ్చు. ఆక్వా రంగంలో చేయి తిరిగిన ఒక ప్రముఖుడు అక్కడి ముఖ్యనేత సూచనతో ఈ స్థలాన్ని ఉచితంగా అందించారు. ఏర్పాట్లు మినీ స్టేడియంను తలపిస్తున్నాయి. భారీ షామియానాలు, పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. తోపులాటలు జరగకుండా భారీ గేట్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. క్రికెట్ స్టేడియంలో మాదిరిగా 500 మంది వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీ. 3 వేల మంది కూర్చుని వీక్షించేలా సాధారణ గ్యాలరీ ఏర్పాౖటెంది. నిర్వహణ ఏర్పాట్లకే సుమారు రూ.15 లక్షలు వెచ్చించారు. ఆ సొమ్మును గుండాట వేలం పాట సొంతం చేసుకున్నవారు అడ్వాన్సుగా ఇచ్చారని సమాచారం. నియోజకవర్గ ముఖ్యనేతకు వరుసకు సోదరుడైన మురమళ్లకు చెందిన తెలుగు యువత నాయకుడు అన్నీ తానే అన్నట్టుగా బేరసారాలు నిర్వహిస్తున్నారు. మురమళ్ల బరి నిర్వాహకులు వాట్సాప్లో ఆహ్వానాలు కూడా పంపించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు స్వగ్రామం మురమళ్ల. ఆయన అనుచరగణం కనుసన్నల్లోనే ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. గత సంక్రాంతికి ఎల్ఈడీ తెరలతో కోడిపందేలను చూపించారు. ఈసారి డ్రో¯ŒS కెమేరాల సాయంతో పందేలను చిత్రీకరించే ఏర్పాట్లు చేస్తున్నారు. కోడిపందేలకు ముహూర్తం శుక్రవారం ఉదయం 8 గంటలుగా నిర్ణయించారు. రూ.10 లక్షల పందేలు ఎనిమిది, రూ.8 లక్షల పందేలు ఐదు, కత్తులు లేని పందేలు (జట్టీ పందేలు) మరో ఐదింటి కోసం నిర్వాహకులు సన్నాహాలు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిర్వహించేందుకు విద్యుద్దీపాలు కూడా ఏర్పాటు చేశారు. పండగ మూడు రోజులూ ఇక్కడ రూ.10 కోట్లు పైబడే పందేలు జరుగుతాయి. మూడు రోజులూ జరిగే గుండాటను రూ.38 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. ఐ.పోలవరంలో ఒక టీడీపీ నాయకుడి అతిథి గృహంలో ఈ వేలం నిర్వహించారు. పేకాటకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యధికంగా స్కోర్ కొట్టే పేకాటగాడికి బంపర్ ఆఫర్గా రూ.15 లక్షల విలువైన కారును బహుమతిగా ప్రకటించారు. పేకాటకు ససేమిరా అంటున్న పోలీసు అధికారులపై టీడీపీ నేతలు ‘అన్ని రకాల’ ఒత్తిళ్లూ తెస్తున్నారు. అధికార పార్టీ నేతలే కోడిపందేలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ గొడవ ఎందుకని పోలీసులు స్థానికంగా ఉండకుండా కాకినాడ సాగర సంబరాలకు డ్యూటీలు వేయించేసుకున్నారని తెలిసింది. ఇటు అమలాపురం.. అటు పెద్దాపురం.. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది పెద్దాపురం నియోజకవర్గం. ఈ రెండు ప్రాంతాల్లో కూడా కోడిపందేలకు పందేలరాయుళ్లు ‘బరి’ తెగిస్తున్నారు. అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం గోడి, గుండెపూడి, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఉప్పలగుప్తం మండలం కూనవరంతోపాటు.. మిగిలిన కోనసీమలోని మలికిపురం మండలం ఉయ్యూరువారి మెరక, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంక, అంతర్వేది, రావులపాలెం మండలం దేవరపల్లి, అంబాజీపేట మండలం వాకలగరువు ఇలా ఒక్క కోనసీమలోనే సుమారు 20 ప్రాంతాల్లో పందేలు నిర్వహించనున్నారు. అల్లవరం మండలం గోడిలో భారీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇక పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వేట్లపాలెం, వీకే రాయపురం గ్రామాల్లో రూ.70 లక్షలకు వేలం హక్కులు సొంతం చేసుకున్నారు. ఎవరెన్ని చెప్పినా పందేలు నిర్వహించి తీరుతామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. నగదు సమస్యకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పెద్ద నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు పందెగాళ్లు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు కొత్త రూ.2000, రూ.500 నోట్లు అవకాశం ఉన్నంత మేర సిద్ధం చేసుకున్నారు. మరికొందరు తమ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదుకు అనుసంధానంగా చెక్కు బుక్కులు, స్వైపింగ్ మెషీన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం అన్నిచోట్లా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై మాకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బోర్డులు కూడా ఏర్పాటు చేశాం. – ఎల్.అంకయ్య, డీఎస్పీ, అమలాపురం -
వాయిదాతో పందేనికి పండుగేనా?
సుప్రీం ఆదేశాలతో పందెగాళ్లకు ఉపశమనం సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి కోడి పందేల విషయంలో తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో మళ్లీ కోళ్లను దువ్వుతున్నారు. గత వారం ఉమ్మిడి హైకోర్లు ఇచ్చిన ఆంక్షలతో సందిగ్ధంలో పడిన పందెం సందడి సుప్రీం ఆదేశాలతో ఊరట చెందుతున్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లోని నాలుగో అంశంపై స్టే ఇస్తూనే తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేయటంతో వారం రోజుల్లో వచ్చే సంక్రాంతి గడిచిపోతుందని, ఈలోగా పందేల దందా పూర్తి చేసుకోవచ్చునని పందెంగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోళ్లను స్వాధీనం చేసుకోవటంపై సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని పందెగాళ్లు స్వాగతిస్తున్నారు. అయితే సుప్రీం జారీ చేసిన రెండు ఆదేశాలతో జిల్లాలో కోడి పందేలను పూర్తి స్థాయిలో అదుపు చేయటంపై పోలీసులకు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోళ్లను స్వాధీనం చేసుకోవద్దంటే పరోక్షంగా కోడి పందేలకు సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంప్రదాయ ఒరవడిలో జరిగే కోడి పందేలను అడ్డుకోవటం సరికాదని తన పిటిష¯ŒSలో విన్నవించారు. సుప్రీం కూడా ఈ కేసును సంప్రదాయ కోణంలో విచారించి ఆయుధాల కోణంలో అభ్యంతరం చెప్పింది. ఆయుధాల పరంగా అభ్యంతరం, కోళ్లను స్వాధీనం చేసుకోవద్దన్న ఆదేశం, విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేయటంతో జిల్లాలోని పందెగాళ్లు ఆ ఉత్తర్వులను తమకు సానుకూలంగా తీసుకుంటుంటే.. జిల్లా పోలీసులు సున్నితంగా ఉన్న ఆ మూడు అంశాలతో పందేలను ఎంత వరకు నిలువరించగలమ ని తర్జన భర్జన పడుతున్నారు. ఇంతటి ఉత్కంఠలో పందెగాళ్లు, పోలీసులు ఇద్దరిలో ఎవరిది విజయమో సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే. ప్రతి సంక్రాంతి పండుగలకు జిల్లాలో కోడి పందేలతో రూ.30 కోట్లు వరకూ చేతులు మారుతున్న క్రమంలో ఈసారి హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాలు, ఉత్తర్వులతో çపండుగ పందేలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. -
కోడి పందేలకు ఈ–ప్రచారం
బరులు సిద్ధం చేసుకుంటున్న పందెగాళ్లు భరతం పడతామంటున్న పోలీసులు అమలాపురం టౌన్ : ఈసారి సంక్రాంతి పండగల్లో కోడి పందేలు నిర్వహించొద్దని... పందేలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఆ మేరకు సమాయత్తమవుతోంది. అయినప్పటికీ పందెగాళ్లు ‘బరి’లోకి దిగడానికి కత్తులు సానపడుతున్నారు. ఇందుకు సోషల్ మీడియా ద్వారా పందేల సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పందెం కోడి నాలుగు రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్ల్లో హల్చల్ చేస్తోంది. ఎవరి వాట్సాప్ల్లో చూసినా పందేల కోళ్ల వివరాలు, పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ సారి పందేలను నగదు రహిత లావాదేవీలతో...స్వైపింగ్ మిషన్లతో నిర్వహిస్తామని చెబుతూ చిత్రాలు పోస్టు చేస్తున్నారు. పందెం కోడి పుంజులు ఎన్ని రకాలు... వాటి పేర్లు, ఫోటోలతో కూడిన చిత్ర మాలికను షేర్ చేస్తున్నారు. అలాగే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కోడి పందేలు నగదు రహిత లావాదేవీలతో నిర్వహిస్తున్న సమాచారం ఈ మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ రెండు పోస్టింగ్లు ప్రస్తుతం గోదావరి జిల్లాల ప్రజల స్మార్ట్ ఫోన్ల వాట్సాప్ల్లో విహరిస్తున్నాయి. సంక్రాంతి దగ్గరపడుతుండడంతో ఎక్కడ చూసినా కోడి పందేలు.. ఈసారి నగదు రహిత లావాదేవీలతో పందేలు.. స్వైపింగ్ మిషన్లు.. వాట్సాప్ పోస్టింగ్లపైనే చర్చ జరుగుతోంది. పందెగాళ్ల ముందస్తు ఏర్పాట్లు, పోస్టింగ్లు ఇలా ఉంటే కోర్టు ఆదేశాల క్రమంలో పోలీసుశాఖ మాత్రం లాఠీ పట్టుకుని ఈసారి పోటీలను అడ్డుకునేందుకు సిద్ధమవుతోంది. ఈసారి కోడి గెలుస్తుందో...ఖాకీ గెలుస్తుందో సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే. -
పందెం కో‘ఢీ’
సన్నాహాలతో ‘సై’ అంటున్న పందెగాళ్లు హైకోర్టు ఆదేశాలతో ఆచీతూచీ అడుగులు ఎప్పుడూ ఉన్నదేనంటూ సమాయతమ్తవుతున్న వైనం గతమంతా రూ.30 కోట్లతో హవా ఆ వైభవాన్ని కొనసాగిస్తామంటూ ధీమా సంక్రాంతి వచ్చిందంటే భోగిమంట ... కొత్త దుస్తులు... ఇంటి ముందు ముగ్గులు... తోరణాలు... హరిదాసుల గానాలాపనలు... కొత్త అల్లుళ్లతో కోలాహలం... పిల్లల పరుగులు...గోమాతలకు పూజలు ఒక్క మాటలో చెప్పాలంటే ఊరంతా పండగే. కానీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు, ఆ ముసుగులో మరిన్ని జూదాలు, కత్తుల కోలాటాలు... ఘర్షణ వాతావరణం... ఇవుంటేనే సం... క్రాంతి. ఈ తీరుపై సోమవారం హైకోర్టు కన్నెర్ర చేసింది. కోడి పందేలు నిర్వహించకుండా చూడాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్కు, ఎస్పీలకు అప్పగించింది. గట్టి చర్యలు తీసుకోవాలని హుంకరించడంతో పందెగాళ్లు తర్జనభర్జన పడుతున్నారు. ఇంకొంతమంది ఇదంతా మామూలే అన్నట్టుగా కోళ్లను దువ్వుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు అన్నిటికంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు. ఈ పందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇవి లేకుండా సంక్రాంతి సంబరాలు జరగవంటే అతిశయోక్తికాదు. ఓ తిరునాళ్లను తలపించే విధంగా నిర్వహిస్తూ ఓ సంప్రదాయ క్రీడగా వీటిని పరిగణిస్తారు. కోడి పుంజుకు కత్తి కట్టకుండా పందెం కడితేనే అది సంప్రదాయ క్రీడ అవుతుంది. అదే కత్తికట్టి బరిలోకి దింపి పందేలు కాస్తే కచ్చితంగా అది చట్ట ప్రకారం నేరమే అవుతుంది. కానీ గోదావరి పొడవునా ఉన్న పల్లెల్లో ఈ నిబంధనలేమీ వర్తించవంటారు స్థానికులు. వారిని స్థానికులనేకంటే ఆయా ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు అనడమే సబబు. ప్రతి సంక్రాంతికి ముందూ పందేలు జరగనివ్వమని...లాఠీ ఝుళిపిస్తామని పోలీసులు హుంకరిస్తుంటారు. కానీ సంక్రాంతి ప్రారంభానికి పది రోజులు ముందు నుంచి ప్రారంభమై సంక్రాంతి మూడు రోజులు కోట్ల పందేలు జరిగిపోతూనే ఉంటాయి. ఈ సమయాల్లో పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం ప్రతి సంక్రాంతికి షరా’మామూలుగానే తయారవుతోంది. కోర్టు ఆదేశాలున్నా.. వినోదం పేరుతో మూగజీవాలను హింసించడం తగదని సోమవారం హైకోర్టు హెచ్చరించింది. అటువంటి కోడి పందేలు అసలు నిర్వహించ వద్దని, నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పీపుల్ ఫర్ ఏనిమల్ ఆర్గనైజేషన్, ఏనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్లపై కోర్టు ప్రభుత్వానికి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో సంక్రాంతికి కోడి పందేలపై చర్చ మొదలైంది. ఈసారి పందేలు జరుగుతాయా లేవా అనే దానిపై పందేల నిర్వాహకులు, రాజకీయ నాయకుల మధ్య తీవ్రంగా చర్చ సాగుతోంది. ప్రతి ఏటా ఇటువంటి ఉత్తర్వులు రావడం మామూలేనని, ఆరు నూరైనా పందేలు నిర్వహించడం ఖాయమనే పందేల రాయుళ్ల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. జిల్లాలో అల్లవరం మండలం గోడి, గోడిలంక, ఐ.పోలవరం మండలం మురమళ్ల, పెదమడి మొక్కతోట, కేశనకుర్రు, ఎదుర్లంక, రావులపాలెం మండలం దేవరపల్లి, మల్కిపురం మండలం ఉయ్యూరువారిమెరక, పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం, జగ్గంపేట శివారు మల్లిశాల, తుని, రంపచోడవరం ఏజెన్సీలోని అడ్డతీగల, దేవీపట్నం తదితర ప్రాంతాల్లో కో అంటే కోడిపందేలు కోట్లలోనే నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలోనే... ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు దగ్గరుండి మరీ కోడిపందేలు ఆడించిన సందర్భాలు అనేకం. గత ఏడాది సంక్రాంతి మూడు రోజులు జిల్లాలో పలుచోట్ల ఫ్లడ్లైట్ల వెలుతురులో ఎల్ఈడీ స్క్రీ¯ŒSలు ఏర్పాటు చేసి మరీ కోడిపందేలు నిర్వహించారు. మురమళ్లలో జరిగిన ఈ పందేలు రూ.కోట్లు దాటేశాయి. పేరుకు సంప్రదాయబద్ధమని పైకి చెబుతూ బరిలో మాత్రం పక్కా ప్లా¯ŒSతో జూదంగా మార్చేస్తుంటారు. వీరికి రాజకీయ అండదండలు దండిగానే ఉంటాయి. పోలీసులు బరి దగ్గరకు రాకుండానే వాటాలు వెళ్లిపోతాయి. కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో గుండాట, గాంబ్లింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డూ అదుపే ఉండదు. ఆ ముసుగులో అన్నీ... కోడి పందేలతోపాటు మిగిలిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు వారం రోజులు ముందుగానే వేలం పాటలు నిర్వహించి లక్షల్లో రేట్లు నిర్ణయిస్తారు. పందెం కాపు కాసే నగదు నుంచి మామూళ్ల పంపకానికి వాటాలు కూడా తీస్తారు. అందుకోసం సొమ్మునంతటినీ ఒక పూల్గా ఏర్పాటు చేస్తారు. ఇదంతా చక్కబెట్టినందుకు నాయకులకు కూడా తగినంత ముడుతుంది. గత ఏడాది సంక్రాంతి మూడు రోజులు జిల్లా అంతటా కలిపి రూ.20 నుంచి రూ.30 కోట్లు కోడి పందేలు జరిగాయని అంచనా. గతేడాది కూడా న్యాయస్థానం ఇదేరకమైన ఉత్తర్వులు ఇచ్చినా చివరకు పందెం కోడే గెలిచింది. పందేలు నియంత్రించాల్సిన ఖాకీ ఓడిపోయింది.ఈ సారి ఏం జరుగుతుందో తేలాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.