komaram bheem district
-
TG: మళ్లీ పులి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సాక్షి,కొమరంభీంజిల్లా: జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. తాజాగా మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది.పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో శుక్రవారమే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పులి కోసం కాగజ్నగర్ కారిడార్లో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ మ్యాన్ఈటర్ నిర్వహస్తున్నారు.మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం వేట కొనసాగుతోంది.ఇదీ చదవండి: పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్నగర్లో హై అలర్ట్ -
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి
సాక్షి, హైదరాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు (మహాలక్ష్మి, జ్యోతి, శైలజ) పరిస్థితి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించారు.వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ నేడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ శైలజ మృతి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతదన్నారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త తననును ఎంతగానో కలచి వేసింది అని కవిత పేర్కొన్నారు.ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే అని కవిత ఆరోపించారు. -
నాన్నా.. నన్ను కాపాడు
కౌటాల: ‘నాన్నా.. నన్ను కాపాడు’.. తీవ్ర జ్వరంబారిన పడిన ఓ టెన్త్ విద్యార్థిని తన తండ్రితో పలికిన చివరి మాటలు ఇవి. దీంతో ఆ తండ్రి మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. కుమా ర్తె మృతిని తట్టుకోలేకపోతున్న తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గుండాయిపేటకు చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ (16) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ టెన్త్ చదువుతోంది. జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా జ్వరమొచి్చంది.. చేతనైతలేదు.. కాళ్లు చేతులు గుంజుతున్నయ్.. ఇంటికి తీసుకుపో’అని చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని తనను కాపాడాలని కోరింది. దీంతో తండ్రి ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. కాగా, గుండాయిపేట గ్రామంలో కొద్ది రోజులుగా విష జ్వరా లు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
హోలీ రోజు విషాదం.. వార్దా నదిలో గల్లంతైన యువకులు మృతి
సాక్షి, కొమురంభీం జిల్లా: హోలీ పండుగ రోజు అసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానికి వెళ్లి గల్లంతయిన యువకుల కథ విషాదంగా ముగిసింది. కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు విగతజీవులుగా మారారు. మృతులను కౌటాల మండలం నదీమబాద్కు చెందిన కమలాకర్(22), సంతోష్(25), ప్రవీణ్(23), సాయి(22)గా గుర్తించారు. కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సంతోషంగా హోలీ ఆడుకున్నారు. స్నేహితులపై రంగులు చల్లుకుంటూ.. సెల్పీలు దిగి హోలీ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు తాటిపల్లి వద్దనున్న వార్ధా నదికి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా.. నలుగురు కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిస్య్కూ టీం అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చెపట్టిన ఫలితం లభించలేదు. నలుగురు నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను కౌటాల దవాఖానకు తరలించారు. పండుగ నాడుఒకే సారి నలుగురు స్నేహితులు మృతి చెందడంతో బాధితుల కుంటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. -
TS: హమ్మయ్యా.. ఆ పులులు సేఫ్!
కొమురం భీం, సాక్షి: కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో కలకలం రేపిన పులుల మృత్యువాత సంఘటనలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. రెండు పులులపై విష ప్రయోగం జరిగినట్టు గుర్తించిన అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ ను సీరియస్ గా తీసుకుంది. చివరికి మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టిన అనంతరం తల్లి పులి రెండు పిల్లల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్ ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర రేంజ్ దరిగాం అడవుల్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మూడు రోజుల విస్తృత గాలింపు తర్వాత ఎట్టకేలకు కనిపించకుండా పోయిన S6 పులి దాని రెండు పిల్లలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. దరిగాం అడవిలో విష ప్రయోగంతో చనిపోయిన రెండు పులులతో పాటు మరో రెండు పులులు మిస్ అవడంపై అలర్ట్ అయిన జిల్లా అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.. మూడు వందల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 72 బృందాలు , 105 ట్రాప్ కెమెరాల తో మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు అటవీ శాఖ అధికారులు.. అయితే సిబ్బందికి మిస్ అయిన పులులు కనిపించడంతో ఆపరేషన్ సక్సెస్ గా ముగిసింది. ఎస్ 6 తల్లి పులితో పాటు కనిపించకుండా పోయిన పులి పిల్లలు సైతం క్షేమంగా ఉన్నాయంటూ తేల్చింది కొమురంభీం జిల్లా అటవీ శాఖ. గత ఏడాది డిసెంబర్ 27 న దరిగాం అటవి ప్రాంతంలో ఎస్ 9 పులి ఓ పశువు పై దాడి చేయగా.. ఆ పశువును మరోసారి తిన్న కే15 పులి ఈనెల 6 న మృత్యువాత పడింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే ఐదేళ్ల మగపులి ఎస్ 9 సైతం మరణించింది. దీంతో పులి మరణాల కేసును సీరియస్గా తీసుకున్న ఉన్నతాదికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో.. పశువుపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. ఆ పశువు మృతి చెందిన సమీపంలో నాలుగు పులుల పాదముద్రలు లభించడంతో ఆందోళన చెందింది అటవీశాఖ. దీంతో అలర్ట్ అయిన అటవిశాఖ చనిపోయిన పులులతో పాటు పశువు మాంసం తిన్న మరో రెండు పులుల కోసం అన్వేషణ సాగించింది. ఈనెల 9 న టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభింవింది.. మొదటి రోజు 14 ట్రాకింగ్ టీములు, 22 ట్రాప్ కెమెరాలతో దరిగాం అటవి ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. 24 గంటలు దరిగాం అడవిని జల్లెడ పట్టిన మిస్ అయిన పులుల ఆచూకీ లభించకపోవడంతో ట్రాకింగ్ టీంను 72 కు పెంచింది. దరిగాం అటవీ ప్రాంతంతో పాటు సర్కపల్లి, గోంది అటవి ప్రాంతంలోను సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసిన అటవీ శాఖ 105 కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసింది. దీంతో ఈనెల 11 న దరిగాం గోంది అటవి ప్రాంతంలో మరో పశువుపై పులిదాడి చేసి హతమార్చగా.. ఆ పశువు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి చిక్కింది. దాని పాదముద్రల ఆధారంగా మూడేళ్ల వయస్సున ఆడపులి.. ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ ఊపిరి పీల్చుకుంది. 73వ క్యాంపు వారికి కే 14 పులి పాదముద్రలు 51 క్యాంప్ టీంకు కే 16, 17 పాదముద్రలు లభించడంతో సర్చ్ ఆపరేషన్ ని నిలిపివేసింది. 62 గంటల పాటు ఓ యుద్దంలా సాగిన టైగర్ సర్చ్ ఆపరేషన్ పులులు క్షేమంగా ఉన్నాయన్న సమాచారంతో సక్సెస్ గా ముగియగా.. దరిగాం అటవీ ప్రాంతంలో లెక్కకు మించి పులుల సంచారం సాగుతుందన్న సమాచారంతో అటవిశాఖకు మరింత దృష్టి సారించింది. ఇప్పుడు ఆ పులులను వేటగాళ్ల కంటపడకుంటా క్షేమంగా కాపాడటం.. ఆ పులులతో మనుషులకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడటం తప్పని సరిగా మారింది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని ఓ రైతుకు పత్తి చేనులో పులి కనిపించింది. వెంటనే రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పారెస్ట్ అదికారులు గుంపులు గుంపులు చేనులల్లో పనులు చేసుకోవాలని ఫారెస్ట్ కర్జెల్లి రేంజ్ అధికారి నవ్య రైతులకు సూచిస్తున్నారు. ఇటు దరిగాం అటవీ సంఘటన లో పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగం చేశారు.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేపోలేదని తెలుస్తోంది. -
కొమురంభీం జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ సక్సెస్
-
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం
కొమరంభీం జిల్లా: కాగజ్నగర్లో సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్కు సాంకేతిక లోపం తెలెత్తింది. సిర్పూర్లో హెలికాఫ్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ చాపర్ను నిలిపివేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం ఆసిఫాబాద్ బయలుదేరారు. సోమవారం కూడా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సీఎం కేసీఆర్కు ప్రమాదం తృటిలో తప్పిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాఫ్టర్ బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైకి లేచిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. కాగా, సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్లో పర్యటిస్తున్నారు. సిర్పూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. -
సంతోషంగా నిశ్చితార్థం.. బంధువును దిగబెట్టి వస్తుండగా..
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రేమించిన అమ్మాయిని మనువాడేందుకు పెద్దలను ఒప్పించాడు. సంతోషంగా నిశ్చితార్ధం చేసుకుని.. ఆ శుభ కార్యక్రమానికి వచ్చిన బంధువును ఊళ్లో దిగబెట్టి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఇది తట్టుకోలేని అతని తండ్రి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనలు గురువారం కొమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామంలో చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన వసాకే తులసీరాం(21) అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించగా, ఇరు కుటుంబాల అంగీకారంతో బుధవారం నిశ్చితార్థం జరిగింది. దీనికి హాజరైన బంధువుల్లో ఒకరైన ఆసిఫాబాద్ మండలం ఎల్లారానికి చెందిన అంజన్నను గురువారం స్కూటీపై అతడి గ్రామంలో దింపి తులసీరాం ఇంటికి బయలుదేరాడు. బుదల్ఘాట్ వాగు దాటిన తర్వాత జైత్పూర్ రోడ్డు వద్ద కంకర క్రషర్ సమీపంలో జాతీయ రహదారి– 363పై వేగంగా వచి్చన డీబీఎల్ కంపెనీకి చెందిన టిప్పర్ స్కూటీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. లారీ టైర్ల కింద స్కూటీ ఇరుక్కుపోగా తులసీరాం అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి తట్టుకోలేక: కుమారుడి మరణ వార్త విన్న తండ్రి భీంరావు(45) తీవ్ర మనస్తాపంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. స్థానికులు అంబులెన్స్లో ఆసిఫాబాద్లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రీకుమారుల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు. -
ఆసిఫాబాద్: ఛాతీలో నొప్పి.. దూకేసిన ఆర్టీసీ డ్రైవర్
కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు నుంచి బయటకు దూకేశాడు. అదుపు తప్పిన బస్సు.. బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు సదరు సూపర్ లగ్జరీ బస్సులో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ప్రయాణికుడితో పాటు ఛాతీ నొప్పికి గురైన డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. -
కొమరంభీం జిల్లా జైనూర్ లో హైమన్ ధర్ఫ్ 36వ వర్థంతి సభ
-
పంట చేనుకు కాపలా వెళ్లిన యువతి.. చివరికి ఊహించని ఘటన..
పెంచికల్పేట్(సిర్పూర్)కొమరంభీం జిల్లా: మండలంలోని కమ్మర్గాం గ్రామానికి చెందిన దుర్గం దస్రుబాయి(22) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సదరు యువతి శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని పంట చేనుకు కాపలా వెళ్లింది. మధ్యాహ్నం వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా పంటచేనులో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై విజయ్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్(టి) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. యువతి తల్లి శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. మృతిపై అనుమానాలు దస్రుబాయి మృతి పట్ల తల్లి శకుంతల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంట చేనుకు కాపలా వెళ్లిన తన కూతురును హత్య చేసి నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. భూతగాదాల నేపథ్యంలో హత్య చేశారని నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: విజయవాడలో స్పా మాటున హైటెక్ వ్యభిచారం.. -
ప్రేమ.. పెళ్లికి తల్లి అడ్డు చెప్పిందని..
దహెగాం: ప్రేమ..పెళ్లి వద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఒక బాలిక ఆత్మహత్య చేసు కుంది. కుమురంభీం జిల్లా దహె గాం మండలం రాళ్లగూడ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ సనత్కుమార్ కథనం ప్రకారం.. రాళ్ల గూడ కు చెందిన నాగపురి స్వరూపకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భర్త మోహన్ చనిపోయాడు. చిన్నకూతురు శిరీష(16) ఇంటర్ ఫెయిల్ కావడంతో ఇంటివద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన యువకుడిని 8 నెలలుగా ప్రేమిస్తోంది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఇప్పుడే ప్రేమ, పెళ్లి ఏంటని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష బుధవారం వేకువజామున ఇంటి వెనకాల పురుగు మందు తాగింది. వెంటనే శిరీషను తల్లి కాగజ్నగర్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మృతు రాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
పత్తిలో దాక్కుని.. ఊపిరందక..
కౌటాల: దాగుడుమూతలు ఆట ఓ బాలుడి ప్రాణం తీసింది. తమ్ముడు, చెల్లికి దొరక్కుండా పత్తిలో దాక్కునే ప్రయత్నంలో ఊపిరి ఆగిపోయింది. ఈ సంఘటన కుమురంభీం జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కన్నెపల్లికి చెందిన చెన్నూరి కైలాష్, రుమలకు ముగ్గు రు సంతానం అభిషేక్, హర్షిత్, అవంతిక ఉన్నారు. అభిషేక్ (12) కౌటాలలోని ప్రైవేటు పాఠశాల్లో 4వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కౌటాల వారసంతలో కూరగాయలు విక్రయించడానికి వెళ్లారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన అభిషేక్ తమ్ముడు, చెల్లితో దాగుడుమూతలు ఆడుతూ ఇంట్లో నిల్వ ఉంచిన పత్తిలో దాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరాడు. ఇంట్లోకి వచ్చిన హర్షిత్ పత్తిలో తన అన్న తలదూర్చి కాళ్లు పైకి ఉండటం గమనించాడు. భయపడి కేకలు వేయడంతో బంధువులు వచ్చి బయటకు తీశారు. కౌటాలలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల సూ చన మేరకు కుటుంబ సభ్యులు కాగజ్నగర్కు తరలించారు. అప్పటికే అభిషేక్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
అంగన్వాడీ సెంటర్లో ఆమ్లెట్ దొంగలు!
సాక్షి, కొమరంభీం ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాణి మండలం పరిధిలోని ఓ అంగన్వాడీ సెంటర్లో ‘ఆమ్లెట్ దొంగలు’ హల్ చేశారు. గంభీరావుపేట్ గ్రామపంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో వీరంగం సృష్టించారు. అంగన్వాడీ కేంద్రానికి ఉన్న తాళాన్ని పలగొట్టి కేంద్రం లోపలికి ప్రవేశించి.. అక్కడే ఉన్న గుడ్లను, వంట పాత్రలు ఉపయోగించి ఉపయోగించి ఆమ్లెట్లు వేసుకున్నారు. గర్భిణీలకు, పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా ఇచ్చే గుడ్లను వాడేశారు. ఈ తరుణంలో నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ఆ ఆగంతకులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇది తాగుబోతుల పనేనని గ్రామస్తులు భావిస్తున్నారు. -
బీఆర్ఎస్కు షాక్.. సర్పంచ్ల మూకుమ్మడి రాజీనామా
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): అధికార పార్టీకి చెందిన ఆదివాసీ సర్పంచ్లు రాజీనామా అస్త్రం సంధించారు. నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అడుగు కూడా ముందుకు సాగడంలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సర్పంచ్లు సమావేశమై గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నామని, అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఆదివాసీ సర్పంచుల సంఘం మండల ప్రధానకార్యదర్శి సిడాం అన్నిగా విలేకరులతో మాట్లాడుతూ 2021 నుంచి నేటి వరకు ప్రభుత్వ విధానాలతోపంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సక్రమంగా అందడంలేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లోని సమస్యలను పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. భూప్రక్షాళన తర్వాత చాలామంది రైతులకు కొత్తపట్టాలు రాలేదని, రేషన్కార్డులు ఇవ్వలేదని, డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణీపై ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. రాజీనామా ప్రతులను వాట్సాప్ ద్వారా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. రాజీనామా చేసినవారిలో ఆదివాసీ సర్పంచుల మండల అధ్యక్షుడు కోట్నాక కిష్టు, సర్పంచులు దేవ్రావు, పెందూర్ పవన్, జంగు, మనోహర్ తదితరులు ఉన్నారు. గతంలోనూ రాజీనామా.. ఏడాది క్రితం మండలంలోని సర్పంచులు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మికి రాజీనామా పత్రాన్ని ఇచ్చేందుకు సైతం వెళ్లారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో రాజీనామా ఆలోచనను విరమించుకున్నారు. -
వేటగాళ్ల ఉచ్చుకు యువకుడు బలి
తిర్యాణి(లింగాపూర్): కొమురంభీమ్ జిల్లా లింగాపూర్ మండలం దంపూర్ గ్రామంలో అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు గురువారం రాత్రి ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిర్యాణి మండలం దంతన్పెల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు భీమన్న దేవుని గంగస్నానం కోసం గురువారం దంపూర్ గ్రామం మీదుగా కాలినడకన జన్నారం వైపు వెళ్లారు. గంగస్నానం ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో రాత్రివేళ దంపూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి దంతన్పల్లి గ్రామానికి చెందిన ఆత్రం భీమ్రావు(21) అక్కడికక్కడే మృతి చెందాడు. భీమ్రావుతోపాటు ఉన్న ఆత్రం పావుగా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడికి లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఆత్రం భీము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపార -
కొమరం భీం జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలో పులి కలకలం
-
TS: మూడు జిల్లాలను వణికిస్తున్న మ్యాన్ ఈటర్స్
సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్: చలితో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను పెద్దపులి కూడా వణికిస్తోంది. పులి దాడిలో ఓ రైతు మృతి చనిపోవడంతో కలవరపాటుకి గురి చేస్తున్నాయి. పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని ఎనిమిది మండలాల ప్రజలను పులుల కదలికలు జనాలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరోవైపు వాటిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం చేస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. గురువారం దాదాపు పన్నెండు గంటలపాటు పులి సంచారించిందన్న ప్రచారం.. ప్రజలను భయాందోళనకు గురి చేసింది. మరోవైపు ఉదయం పూట వాకింగ్కు వెళ్లడంపై ఆంక్షలు విధించారు పోలీసులు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ పహారా కాస్తున్నారు. బయటకి రావొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చివరి సారిగా పులి జాడ తెలియగా.. టౌన్ దాటి పెద్ద వాగు గుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఖానాపూర్ శివారులో సిడాం భీము అనే వ్యక్తిని పులి దాడి చేసి చంపేసింది. ఆ పులే కాగజ్ నగర్లోనూ సంచరించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక.. కాలి ముద్రల ఆధారంగా పులి ఆనవాలును నిర్ధారించుకునే యత్నం చేస్తున్నారు. ఇక పులి సంచారంతో స్థానికులు భయం భయంగా గడిపారు. తలుపులు తీయడానికే జనం వణికిపోతున్నారు. మూడు జిల్లాలు, 8 మండలాలు, 18 గ్రామాలను ఇప్పుడు మ్యాన్ ఈటర్స్ వణికిస్తున్నాయి. తొలుత మ్యాన్ ఈటర్స్ కాదని అధికారులు ప్రకటించినా.. ఖానాపూర్ రైతు మరణంతో ఆ భయం రెట్టింపు అయ్యింది. మరోవైపు అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లోకారి దారిలో పులి కలకలం రేగింది. రోడ్డు దాటుతూ వాహనదారులకు పులి కనిపించిందన్న ప్రచారంతో అక్కడా భయం నెలకొంది. మైక్ల ద్వారా ప్రజలను బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. దహేగాం మండలం ఖర్జి గ్రామంలో పశువుల మందపై పులి పంజా విసిరినట్లు తెలుస్తోంది. భీంపూర్ , తాంసి , జైనథ్ మండలాల పరిదిలోని పెనుగంగ తీరం వెంట ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. తీవ్ర యత్నం అటవీ శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తమ ప్రయత్నం గురించి అధికారులు వివరిస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 20 మంది ప్రత్యేక అటవీశాఖ టీంతో ట్రాకింగ్ చేస్తున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ తో పులి సంచార ప్రాంతాల్లో అణువణువునా గాలిస్తున్నారు. ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్ గూడ అటవీ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించారు. కోల్బెల్ట్లోనూ ప్రచారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోనూ పులి సంచారం కలకలం రేపింది. దీంతో స్థానికులు, సింగరేణి కార్మికుల్లో భయాందోళన నెలకొంది. విషయం దృష్టికి రావడంతో.. శ్రీరాంపూర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పులి ఆనవాళ్లు కనిపించలేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని ప్రజలకు భరోసా ఇస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఇదీ చదవండి: దళితబంధులో ఎమ్మెల్యేల జోక్యమా? -
కొమరం భీమ్ జిల్లాలో టైగర్ టెన్షన్
-
ప్రసవం కోసం పడవ ప్రయాణం
చింతలమానెపల్లి(సిర్పూర్): దిందా వాసుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు..వరదతో ఉప్పొంగే వాగుపై వంతెన నిర్మించాలని పోరుబాట పట్టినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఓ నిండు గర్భిణిని అష్టకష్టాలు పడి ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం నవేగాం గ్రామానికి చెందిన లొకండే సాయిరాం భార్య పద్మ రెండో కాన్పు కోసం చింతలమానెపల్లి మండలం దిందా గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. నెలలు నిండటంతో వైద్యుల సూచన మేరకు శుక్రవారం కాగజ్నగర్లో శస్త్రచికిత్స చేయించాల్సి ఉంది. బుధవారమే ఆస్పత్రికి చేరుకోవాల్సి ఉన్నా దిందా వాగులో వరద అధికంగా ఉండటంతో వెళ్లలేదు. రెండ్రోజులుగా వరద తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నాటు పడవపై గర్భిణిని వరద దాటించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం ప్రాణహిత నది వద్ద నుంచి నాటు పడవను తీసుకువచ్చారు. వాగు దాటేందుకు పద్మ పత్తి చేల గుండా కాలినడకన వాగు వద్దకు చేరుకుంది. ఆ తర్వాత నాటు పడవ ద్వారా స్థానికులు వాగు దాటించారు. అనంతరం అవతలి ఒడ్డున ఏర్పాటు చేసిన 108 వాహనంలో కాగజ్నగర్కు తరలించారు. -
కౌటాల కస్తూర్బా స్కూల్లో 15 మందికి అస్వస్థత
కౌటాల (సిర్పూర్): కుమురంభీం జిల్లా కౌటాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 15 మంది విద్యార్థినులు అస్వస్థత బారినపడ్డారు. గురువారం సాయంత్రమే కొందరు విద్యార్థులు వాంతులు, తలనొప్పి, జ్వరం బారినపడ్డారు. శుక్రవారం నాటికి ఇలా అనారోగ్యానికి గురైనవారి సంఖ్య మరింత పెరిగింది. దీంతో 15 మందిని అంబులెన్స్లో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంగా ఉన్న నలుగురికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని.. మిగతా వారిని హాస్టల్కు తిరిగి పంపిస్తున్నామని వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది విద్యాలయానికి వెళ్లి.. విద్యార్థులందరి నుంచి రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. చదవండి: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ -
వరుస విషాదాలు.. హాస్టళ్లలో దారుణాలు.. అసలు ఏం జరుగుతోంది?
సాక్షి ప్రతినిధి మంచిర్యాల/కాగజ్నగర్టౌన్: కుమురంభీం జిల్లాలో ఓ విద్యార్థిని జ్వరంతో మంగళవారం రాత్రి చనిపోయింది. కాగజ్నగర్ మండలం అంకుశాపూర్కు చెందిన శంకర్, నీలాబాయి దంపతుల పెద్ద కూతురు ఐశ్వర్య (14) కాగజ్నగర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం తలనొప్పిగా ఉందని డ్యూటీ టీచర్కు చెబితే పెయిన్బామ్ రాసుకోమనడంతో, జండూబామ్ రాసుకుని నిద్రపోయిన ఐశ్వర్య ఉదయంఎంతకీ నిద్రలేవలేదు. నోరు, ముక్కు నుంచి నురగలు రావడంతో విద్యార్థులు డ్యూటీ టీచర్కు చెప్పారు. చదవండి: ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన సమాచారం అందుకున్న తండ్రి శంకర్ వచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఐశ్వర్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బాలిక మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు మృతదేహంతో హాస్టల్ ముందు 8గంటలపాటు ధర్నా చేశారు. కొందరు స్కూల్లోకి చొచ్చుకెళ్లి డీఈవో అశోక్ ముందే ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డీఎస్పీ కరుణాకర్ ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలిక మృతికి కారణమైన ఎస్వో స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీ టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తెలిపారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్గ్రేషియాగా రూ.15లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతోపాటు తక్షణ సాయం కింద రూ.50వేలు నగదు ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు. కాగా, గత 15 రోజుల్లో జిల్లాలోని పలు గురుకులాల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఇందులో ఒకరు డిగ్రీ విద్యారి్థని. హాస్టళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం వల్లే ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. -
కోమరంభీం జిల్లాలో టీఆర్ఎస్కు షాకిచ్చిన నేతలు... లేఖలో ఆవేదన
సాక్షి, కొమరంభీం జిల్లా: కోమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మండలంలోని పలు అభివృద్ధి పనులు జరగడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇచ్చిన హమీలు నేరవేయడం లేదని ముగ్గురు సర్పంచ్లు, జడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీతో పాటు కాగజ్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, బెజ్జూర్ సహాకర సంఘం డైరెక్టర్ రాజీనామా చేశారు. ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోడవం వల్లే రాజీనామా చేశామని సదరు ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి లేఖ రాశారు. -
ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి
ఎనిమిది కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కిదిగితే గానీ ఆ గ్రామానికి చేరుకోలేం. గుక్కెడు నీటికోసం పిల్లాజెల్లా అంతా కలిసి బిందెలు ఎత్తుకుని పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఊరు విడిచిపోతేగానీ పెద్ద చదువులకు అవకాశం లేదు. అటవీ ప్రాంతంలో కష్టాలతో సహవాసం చేస్తున్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భీమనగొంది గ్రామస్తుల వ్యథ ఇది. సిర్పూర్(యూ): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భీమనగొంది ఉంది. ఇక్కడ 31 ఆదివాసీ కుటుంబాలకు చెందిన 150 మందికిపైగా జీవిస్తున్నారు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే చోర్పల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో కొండల మధ్య ప్రయాణించాల్సిందే. అదీ ఎగుడు దిగుడుగా ఉండే అధ్వానపు రహదారి మీద స్థానికంగా రేషన్ దుకాణం లేకపోవడంతో చోర్పల్లికి కాలినడకన వెళ్లి.. 20, 30 కిలోల బియ్యం మూటలు నెత్తిన మోసుకుంటూ తెచ్చుకోవాల్సిందే. గ్రామస్తులు వినియోగిస్తున్న బావి ఇక వానాకాలం వచ్చిందంటే మట్టిరోడ్డు బురదతో నిండి.. కాలు తీసి కాలువేయలేని పరిస్థితి ఉంటుంది. ఎంత అత్యవసరమైనా 108 వాహనం రాదు. ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఎడ్లబండిపై చోర్పల్లి వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో జైనూర్, సిర్పూర్(యూ) మండల కేంద్రాలకు చేరుకుంటారు. నీళ్లకు నిండా గోస.. గ్రామంలో రెండేళ్ల క్రితం భగీరథ ట్యాంకు నిర్మించారు. కానీ ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ట్యాంకును సైతం 20 రోజులకోసారి నింపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఊరి చివరన నిర్మించుకున్న బావి నుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. బావి ప్రహరీ సగం వరకు కూలిపోయి శిథిలావస్థకు చేరుకుంది. భీమనగొంది గ్రామ రహదారి అదికూడా ఈ బావి వాగులో ఉండటంతో వానాకాలంలో చెత్తాచెదారంతో నిండిపోతుంది. గ్రామానికి చెందిన వృద్ధులు వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పింఛన్ వస్తలేదు నాకు అరవై ఏళ్లు దాటినా ఇప్పటివరకు పింఛన్ వస్తలేదు. నాకు ఏ పని చేతకాదు. సర్కారు పింఛన్ అందిస్తే బతుకుతా. – ఆత్రం బాగుబాయి, గ్రామస్తురాలు రోడ్డు, నీటి సమస్య పరిష్కరించాలి మా గ్రామానికి రోడ్డు పెద్ద సమ స్య. ఊరి నుంచి పంచాయతీకి వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిందే. రోడ్డు, నీటి సమ స్య పరిష్కరిస్తే గ్రామం బాగు పడుతుంది. – మర్సుకోల సోనేరావు, గ్రామస్తుడు -
కుమురంభీం జిల్లా అటవీ అందాలు.. సరిహద్దుల్లో సందర్శనీయం
చింతలమానెపల్లి(సిర్పూర్): కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం తగ్గింది. ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గడం.. నిబంధనలు సడలించడం కారణంగా ఈ వేసవిలో పర్యాటక ప్రాంతాలను చుట్టి రావాలనే ఆసక్తి చాలామందిలో కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోనూ సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. కుమురంభీం జిల్లా అటవీ అందాలు.. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. వచ్చే నెల 13నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాంతాలన్ని ప్రాణహిత నది చుట్టుపక్కల ఉన్నాయి. అటు పుష్కరస్నానం.. ఇటు పర్యాటక ప్రాంత సందర్శన రెండూ సాధ్యమవుతాయి. జిల్లా సరిహద్దులోని సందర్శనీయ స్థలాలపై ప్రత్యేక కథనం. బామ్రాఘడ్.. వన్యప్రాణుల నిలయం కుమురంభీం జిల్లాను ఆనుకుని ఉన్న గడ్చిరోలి జిల్లాలోని బామ్రాఘడ్ ప్రాంతం ప్రకృతి రమణీయతను చాటుతోంది. తహసీల్గా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ఈ ప్రాంతం జిల్లాలోని సరిహద్దు మండలం చింతలమానెపల్లి నుంచి 80కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బామ్రాఘడ్లోని హెమల్కాస వద్ద సామాజిక సేవా కార్యకర్త బాబా ఆమ్టె ఆధ్వర్యంలో లోక్బిర్దారి ప్రకల్ప్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. గిరిజనులకు ఉచితంగా వైద్యం చేస్తారు. ఆస్పత్రి ఆవరణలో వన్యప్రాణుల సందర్శనశాల(జూ పార్కు) ఉంది. చిరుత పులులు, ముళ్ల పందులు, ఎలుగుబంట్లు ఇలా ఎన్నో రకాల అరుదైన జంతువులు ఉన్నాయి. బామ్రాఘడ్ సమీపంలో ఇంద్రావతి నది త్రివేణి సంగమం అరుదైనదిగా చెబుతుంటారు. ఇంద్రావతి, వాముల గౌతమి, వర్లకోట నదుల కలయికతో సంగమ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, ప్రయాణంలో కనిపించే దృశ్యాలు, అటవీ అందాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటాయి. బామ్రాఘడ్ వెళ్లే మార్గంలో వచ్చే గ్లోరీ ఆఫ్ ఆల్లపల్లి చూడాల్సిన ప్రదేశం.. కమలాపూర్.. గజరాజుల అడ్డా చింతలమానెపల్లి మండల కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కమలాపూర్ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. 10 వరకు పెద్ద ఏనుగులు, రెండు చిన్న ఏనుగులు ఉన్నాయి. స్థానిక అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఏనుగుల సంరక్షకుల సమక్షంలో సందర్శకులు నేరుగా పండ్లు, ఆహారం అందించవచ్చు. ఈ కేంద్రాన్ని స్థానికంగా హాథీ క్యాంప్ అని పిలుస్తారు. ఇక్కడి రిజర్వాయర్, అటవీ అందాలు, చల్లెవాడ రాబందుల సంరక్షణ కేంద్రం, ఏనుగు రూపంలో ఉన్న కొండ సందర్శకులను ఆకట్టుకున్నాయి. చెప్రాడ ప్రశాంత ధాం చెప్రాడ ప్రశాంత ధాం ఆలయం కుమురంభీం, మంచిర్యాల జిల్లా వాసులకు సుపరిచిత ప్రదేశం. పెన్గంగా, వార్ధా నదుల సంగమ స్థలం ప్రాణహిత జన్మస్థలంలో ఈ దేవస్థానం ఉంది. చెప్రాడలో కార్తీక మçహారాజ్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టించిన ప్రశాంత ధాం హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందింది. స్థానిక ప్రజలు మహారాజ్గా పిలుచుకునే కార్తీక్ స్వామి ఇక్కడ ఆలయ అభివృద్ధికి ఎన్నో పనులు చేపట్టారు. శ్రీకృష్ణ, రామ, శివ, దుర్గా, సాయిబాబా, గజానన్ మహరాజ్ ఆలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించారు. మూడేళ్ల క్రితం కార్తీక మహారాజ్ పరమపదించగా, ఆయన భక్తులు మహా సమాధిని నిర్మించారు. యేటా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. జనవరి ఒకటిన నూతన సంవత్సరం సందర్భంగా మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తుంటారు. తోగ వెంకటాపూర్.. చెట్టుకాండంలో వేంకటేశ్వరుడు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చామూర్శి తాలూకాలో మార్కండ ఆలయం ఉంది. గడ్చిరోలి జిల్లాలో ప్రజలు కొలిచే దేవస్థానాల్లో తోగ వెంకటాపూర్ ఒకటి. కుమురంభీం, మంచిర్యాల, గడ్చిరోలి జిల్లాల సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. కాగజ్నగర్ నుంచి కౌటాల, చింతలమానెపల్లి, మహారాష్ట్రలోని అహెరి మీదుగా 80 కిలోమీటర్ల రోడ్డు మార్గం ప్రయాణిస్తే తోగ వెంకటాపూర్ చేరుకోవచ్చు. ఇక్కడ వేరుమద్ది చెట్టు కాండంలో వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు. 800 ఏళ్ల చరిత ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అహెరి రాజ వంశీయులు తమ కుల దైవంగా భావిస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవస్థానం ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. వేల సంవత్సరాల నాటి అరుదైన వృక్షాలు అబ్బుర పరుస్తాయి. చప్పట్లు కొడితే పైకి ఉబికే నీటి ఊటలు మనుషుల అలజడికే ఎగిసిపడే నీటి అలలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పులుల అభయారణ్యం.. తాడోబా జిల్లాకు సమీపంలో ఉండి పర్యాటక ప్రేమికులకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం తాడోబా. కాగజ్నగర్ పట్టణం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో చంద్రాపూర్ జిల్లా కేంద్రం ఉంది. చంద్రాపూర్కు రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఏ సమయంలోనైనా చేరుకోవచ్చు. తాడోబా అటవీ ప్రాంతం చిరుతలు, పెద్ద పులులు, జింకలు, ఎలుగుబంట్లు, ఇతర ఎన్నో రకాల వన్యప్రాణులకు ప్రసిద్ధి. ఇక్కడి తాడోబా సఫారి టూర్ వేసవిలో ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ అటవీ ప్రాంతంలో పర్యటనకు పలు మార్గాలు ఉండగా, మొహార్లి గేట్ మార్గం గుండా వెళ్తే పూర్తిస్థాయిలో అందాలను ఆస్వాదించవచ్చు. పర్యటనకు సఫారి టూర్ ఆన్లైన్లో రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. వాహనానికి నిర్ణీత రుసుం చెల్లించి అటవీ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంటుంది. పులులు, జింకలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులను వాటి సహజ స్థితిలో సమీపం నుంచి చూసే అవకాశం పర్యాటకులకు ఉంటుంది. వసతిపరంగా తాడోబాలో మహారాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రిసార్ట్లు, చంద్రాపూర్లో పర్యాటకులకు అనువైన ధరల్లో హోటళ్లు, రిసార్చ్టులు ఉన్నాయి. చంద్రాపూర్లో మహంకాళి ఆలయం, చంద్రాపూర్ కోట, అందమైన పార్కులు సందర్శనీయ స్థలాలు. దాబా కొండయ్య మహారాజ్ ఆలయం కాగజ్నగర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుదైన ఆధ్యాత్మిక స్థలం స్థలం దాబా. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గోండ్పిప్పిరి తాలూకాలోని దాబా విశిష్టత కలిగిన దేవస్థానం. ఇక్కడ సజీవ సమాధి పొందిన కొండయ్య మహారాజ్ ఆలయం ఉంది. వీరశైవుడు అయిన కొండయ్య మçహారాజ్ ఎన్నో మహిమలు కలిగిన వ్యక్తిగా స్థానికులు చెబుతారు. నిజాం ప్రభువు ఎదుట మహిమలు చూపించడంతో నిజాం ప్రభువు సైతం ఆశ్చర్యపోయి బహుమతులు అందించారని కథనం. వరంగల్లో శిలానందికి గడ్డి తినిపించడం, ఎన్నో రకాల రోగాలను ప్రత్యక్షంగా నయం చేయడం, ఇతర ఎన్నో మహిమలను చూపించిన వ్యక్తిగా స్థానికులు ఆయనను కొలుస్తారు. ఆధ్యాత్మిక భావనలు పెంచడంలో భాగంగా జిల్లాలోని బెజ్జూర్, కాగజ్నగర్, సిర్పూర్(టి) మండలాల్లో పర్యటించిన ఆయన ఎన్నోరకాల మహిమలు చూపించడాన్ని ఇప్పటికి పెద్దలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. సిర్పూర్(టి) మండలం లోనవెల్లికి చెందిన అంబేద కొండయ్య మçహారాజ్ దాబాలో స్థిరపడ్డారు. ఇప్పటికి ఆయన వంశీకులు లోనవెల్లిలో నివసిస్తున్నారు. 1834లో జన్మించిన ఆయన కార్తీక శుద్ధ తృతీయ 1939 నవంబర్ 14న అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం అనుమతితో యోగ సమాధి అయ్యారు. ప్రతిఏటా మాఘశుద్ధ తృతీయ నాడు ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. శివరాత్రి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఇక్కడ ఇప్పటికీ ఆయన వంశీయులు పూజలు చేస్తున్నారు. -
ఉత్సాహంగా బర్డ్ వాక్ ఫెస్టివల్
సాక్షి, మంచిర్యాల: బర్డ్ వాక్ ఫెస్టివల్కు విశేష స్పందన వచ్చింది. శనివారం తెల్లవారు జామున 5 గం. నుంచే అడవుల్లో సందర్శకుల సందడి మొదలైంది. పక్షులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, వాటి కూతలు వినేందుకు వివిధ ప్రాంతాల నుంచి వంద మందికిపైగా పేర్లు నమోదు చేసుకోగా, అధికారులు కోవిడ్ కారణంగా 60 మందికే అనుమతి ఇచ్చారు. తొలి రోజు కొమురంభీం జిల్లా కాగజ్నగర్, సిర్పూర్ టీ, బెజ్జూరు, పెంచికల్పేట అడవుల్లో బర్డ్ వాక్ కొనసా గింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, సిద్దిపేటతోపాటు ఇతర ప్రాంతాల పక్షి ప్రేమికులు అడవుల్లో కలియదిరిగారు. కెమెరాల్లో పక్షుల ఫొటోలను బంధించారు. ఆసిఫాబాద్ డీఎఫ్వో ఎస్.శాంతారామ్ మాట్లాడుతూ.. కరోనాతో అనేక మంది చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారని అలాంటి వారు ప్రకృతితో గడిపేందుకు ఈ సందర్శన మంచి అవకాశమని అన్నారు. ఆదివారం కూడా ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. -
బహు సుందరం బాబేఝరి అడవులు.. ఎక్కడో తెలుసా..!
కెరమెరి(ఆసిపాబాద్) : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ఆదివాసీ గ్రామమైన జాబేఝరి అడవులు ఊహల్లోకి విహరింపజేస్తున్నాయి. ఎవరూ ఊహించని, చూడని బాబేఝరి అడవులు మరో కశ్మీర్ను తలపిస్తున్నాయి. బాబేఝరి, టోకెన్మోవాడ్, పిట్టగూడ గ్రామాలకు ఆనుకొని వందల ఎకరాల విస్థీర్ణంలో ఉన్న ఈ అడవులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఏపుగా పెరిగిన చెట్లు, గుబురుగుబురుగా పొదలు, ఆ పొదల్ల మధ్య పచ్చపచ్చని పొలాలు, అందమైన లోయలు ఎంతో అహ్లద భరితంగా కనిపిస్తున్నాయి. ఓ సారి చూస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించక మానదు. అయితే వర్షాకాలంలో ప్రతి రోజు చల్లటి వాతావరణం ఉండేది ఇక్కడ. ప్రస్తుతానికి వర్షాకాలం ముగిసినా తేలిక పాటి చిరుజల్లులు పడుతూనే ఉంటాయి. దీంతో ప్రకతి పచ్చదనాన్ని పరచినట్లు ఆ దృశ్యాలను చూస్తే మైమరచి పోతాం. అలాగే హట్టి పై భాగం నుంచి ములుపులు తిరిగిన రోడ్డు, పచ్చపచ్చని పొలాలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. -
ఖైదీని పట్టుకోబోతే గంజాయి దొరికింది
సిర్పూర్(యూ): జైలు తప్పించుకున్న ఖైదీని వెదుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ఖైదీతోపాటు గంజాయి దొరికింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ఖైదీ మూడు రోజుల క్రితం పోలీసుల నుంచి తప్పించుకుని కుమ్రుంభీం జిల్లా లింగాపూర్ మండల పరిధిలోని రాఘవాపూర్ ప్రాంతంలోని ఓ పొలం వద్ద తలదాచుకున్నాడు. ఖైదీ వద్ద ఉన్న ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడిని వెదుక్కుంటూ వెళ్లిన ప్రత్యేక పోలీసుల బృందానికి శనివారం ఓ పొలం వద్ద 20 గంజాయి మొక్కలతో పట్టుబడ్డాడు. గంజాయి మొక్కల గురించి ఖైదీని ఆరా తీయగా... ఇక్కడే తాను ఓ పొలం నుంచి వీటిని సేకరించినట్లు వెల్లడించాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఆదివారం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఖైదీనుంచి గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా... సిర్పూర్(యు) మండలంలోని మత్తూరతండా ప్రాంతంలో కూడా గంజాయి సాగవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా..అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. -
కొమురంభీం జిల్లా దిందా లో పోరుబాట పట్టీన గిరిజనులు
-
పోరుబాట పట్టిన కొమరంభీం జిల్లా ఆదివాసులు
-
దహెగాం మండలంలో పులి సంచారం
దహెగాం(సిర్పూర్): కుమురం భీం జిల్లా దహెగాం మండలంలో ఆదివారం పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఐనం గ్రామ సమీపంలోని పొలాల్లోకి పులి రావడాన్ని గమనించిన కామెట సురేశ్ అనే వ్యక్తి గ్రామస్తులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న కాగజ్నగర్ అటవీ డివిజన్ ఎఫ్ఆర్వో పూర్ణిమ, ఎఫ్ఎస్వో సతీశ్, డీఆర్వో శ్రీధర్చారి గ్రామానికి వచ్చి పులి అడుగులను గుర్తించారు. ఐనం, పొలంపల్లి నుంచి తెనుగుపల్లి వైపు పులి వెళ్లినట్లు వెల్లడించారు. పులి సంచారం నేపథ్యంలో రైతు లను అప్రమత్తం చేశారు. ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లరాదని అటవీ అధికారులు సూచించారు. -
బాబోయ్ పులి
-
ఎమ్మెల్యే కోనప్ప అనుచరుల బెదిరింపులు!
-
కొమురంభీం: కమ్మరిగామ్ లో అమానవీయం
-
కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం
-
మావోయిస్టులు లొంగిపోవాలి: డీజీపీ మహేందర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రం చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మావోల కదలికలు లేకుండా నిర్మూలిస్తామని తెలిపారు. సోమవారం ఆయన కుమ్రంబీమ్ జిల్లా కేంద్రంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోలను నిర్మూలించడానికి 31 టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ గడ్డపై అడుగు పెట్టకుండా మావోలపై చర్యలు చేడుతున్నామన్నారు. కరోనాతో బాధపడుతున్న మావోలు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోతే చికిత్స అందిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. చదవండి: ఆన్లైన్లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టులు -
ప్రేమ పెళ్లి.. యువకుడిపై యువతి బంధువులు దాడి
-
ప్రేమ పెళ్లి.. మాట్లాడుకుందామని పిలిచి ఒక్కసారిగా..
సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. మాట్లాడుదామని యువకుడిని పిలిచిన అమ్మాయి తల్లిదండ్రులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటన తిర్యాని మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై బాధిత యువకుడు రామును లాక్కొచ్చిన యువతి బంధువులు.. అతని విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో రాముకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స కోసం అసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చెసుకున్నందుకు తన భర్తపై తల్లిదండ్రులు దాడి చేయించారని కూమర్తె మడవి సమత పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. -
Photo Story: జాలువారుతున్న కారుమబ్బులు
సాయం సంధ్యావేళ.. నింగిలో కారుమబ్బులు కమ్ముకోగా.. ఆకాశం నుంచి ఆ మబ్బులు ఇలా భూమిపైకి జాలువారుతున్నట్లు కనిపించాయి. కుమురం భీం జిల్లా కౌటాల సమీపంలో ఈ మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం ఈ చిత్రాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది. – చింతలమానెపల్లి భానుడి కిరణాలు.. బంగారు వర్ణాలు.. కారుమబ్బులను చీల్చుకుంటూ నీటిపై పడిన భానుడి కిరణాలు బంగారు వర్ణాన్ని సంతరించుకున్నాయి. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ అర్కగూడ ప్రాజెక్టు వద్ద ఈ దృశ్యం కనువిందు చేసింది. శుక్రవారం సాయంత్రం సూర్యకిరణాలతో ప్రాజెక్టు నీరు మొత్తం పసిడి వర్ణం పులుముకోగా చేపల కోసం వేటగాళ్లు పడవల్లో తిరుగుతుండడం.. చిత్రకారుడు గీసిన బొమ్మలా ఆకట్టుకుంది. – చింతలమానెపల్లి ఇవి కూడా చూడండి: సోనూ సూద్ ఇంటికి జనం తాకిడి పాపం ఏనుగు.. వర్షంలో పాట్లు -
కొమురం భీం జిల్లాపై కరోనా పంజా
-
ఆదివాసీల ‘ఆఖరి మజిలీ’ ప్రత్యేకం
సాక్షి, మంచిర్యాల: మైదాన ప్రాంతవాసులతో పోలిస్తే ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. పుట్టుక, పెళ్లి, చావు.. ఇలా అన్నింటా వారికి ప్రత్యేక జీవనశైలి ఉంది. సాధారణంగా ఎవరైనా కాలం చేస్తే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, తెలిసినవారితో కలసి అంతిమ వీడ్కోలు పలికి ఇల్లు చేరుతుంటారు. కానీ, ఈ వ్యవహారంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని గోండు తెగ సంప్రదాయం వేరు. మృతదేహం చితిలో పూర్తిగా కాలిపోయి.. బూడిదగా మారేవరకూ(నీర్పూజ) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అర్ధరాత్రి తర్వాత కాష్టం చుట్టూ తిరుగుతూ సంప్రదాయ వాయిద్యాలు, డప్పులు మోగిస్తూ, ప్రత్యేక గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తారు. చనిపోయినవ్యక్తిని ఈ పాటల్లో కీర్తిస్తూ స్వర్గప్రాప్తి కలగాలని కోరుతారు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చి బతికి చనిపోయినవారి చివరి మజిలీలో ఇదే ఆఖరిఘట్టంగా భావించి ‘ఆత్మకు శాంతి’ చేకూరేలా ఆడి పాడి ఈ క్రతువు పూర్తిచేస్తారు. ఇలా చేస్తే చనిపోయినవారి ఆత్మ స్వర్గంలో శాంతిస్తుందని గిరిజనుల నమ్మకం. ఈ తంతులో మహిళలు తప్ప కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఆడి పాడే సమయంలో అక్కడే మేకను బలి ఇస్తారు. వంట చేసుకుని సంప్రదాయ సంగీతం మధ్య ఆడుతూపాడుతూ అక్కడే భోజనం చేస్తారు. ఇదంతా సూర్యోదయం వరకు కొనసాగుతుంది. అనాదిగా ఆదివాసీల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. తాజాగా... ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయిలో ఆత్రం బొజ్జు పటేల్ మరణించారు. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘనంగా అంతిమయాత్ర పూర్తి చేశారు. తర్వాత అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు సంప్రదాయ తంతు నిర్వహించారు. కాగా, దేహాన్ని కాల్చకుండా మట్టిలో పూడిస్తే మాత్రం ఈ తరహా కార్యక్రమాలు ఉండవు. అనాదిగా వస్తున్న ఆచారం చితిలో కాలిన తర్వాత చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమం చేస్తాం. అనాదిగా ఈ ఆచారం పాటిస్తున్నాం. ఇలా చేస్తే చనిపోయిన వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని నమ్మకం. – మెస్రం షేకు, దబోలి, జైనూరు మండలం, ఆసిఫాబాద్ జిల్లా -
అదిగో పెద్దపులి.. చచ్చాంరా దేవుడో!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి పులులు జనారణ్యంలోకి చొరబడటంతో కలకలం రేగింది. కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి ఇప్పటికే ఓ యువకుడి ప్రాణాలు తీయగా దాని జాడ ఇంకా కానరాలేదు. శుక్రవారం జిల్లాలోని బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామ సమీపంలోని గట్టుచెరువు అటవీ ప్రాంతంలో శుక్రవారం పెద్దపులి హల్చల్ చేసింది. మేకల కాపరులు కొండయ్య, ఉపేందర్కు పులి తారసపడటంతో ప్రాణాలను కాపాడుకోవటానికి చెట్టెక్కారు. పులి సంచరిస్తున్న విషయంపై కర్జెల్లి రేంజ్ అధికారి రాజేందర్ పశువుల కాపరుల వద్ద నుంచి వివరాలను సేకరించారు. అలాగే మంచిర్యాల జిల్లా వేమనపల్లి ముక్కిడిగూడెం అడవుల్లో పులి సంచరిస్తోంది. గురువారం అడవిలోకి వెళ్లిన వేమనపల్లికి చెందిన మేకల కాపరి దేవనబోయిన భానేశ్కు పులి తారసపడింది. దీంతో సదరు యువకుడు ప్రాణభయంతో పరుగులు తీయగా.. మేకలు చెల్లాచెదురై ఇంటి ముఖం పట్టాయి. రెండు రోజుల కిందట ముక్కిడిగూడెం శివారులోని పత్తి చేన్లలోకి పులి వచ్చి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పాతజాజులపేట మీదుగా ప్రాణహిత నది వరకు వచ్చి అంపుడొర్రె నుంచి పులి అడవిలోకి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. (చదవండి: ఐదు రోజులాయే.. పులి బోనులో చిక్కేనా..?) మేకల్ని చంపి దర్జాగా.. అనంతపురం/పామిడి: పామిడి మండలంలోని దిబ్బసానిపల్లిలో శుక్రవారం చిరుత కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన మనోజ్ మేకలను శివారు ప్రాంతానికి మేత కోసం తోలుకెళ్లాడు. అదే సమయంలో చిరుత ఒక్కసారిగా మేకల మందపై పంజా విసిరింది. ఈ దాడిలో మూడు మేకలు మృతి చెందగా.. కొన్ని గాయపడ్డాయి. అప్రమత్తమైన మనోజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అటవీశాఖ అధికారులు చిరుత నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇక మేకలపై దాడి చేసిన అనంతరం పులి దర్జాగా ఓ బండరాళ్ల గుట్ట ప్రాంతంలో సంచరిస్తున్న దృశ్యాల్ని స్థానిక యువకులు తమ సెల్ ఫోన్లలో చిత్రించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
నీట మునిగిన పంటలు
వేమనపల్లి: ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రాణహితకు సహజ సిద్ధంగా వచ్చే వరద దిగువన ఉన్న గోదావరిలోకి వెళ్లకుండా మేడిగడ్డ వద్ద రిజర్వాయర్ అడ్డుగా ఉండటంతో వరద ఆదివారం రాత్రికి రాత్రే లోతట్టు పంటలను ముంచెత్తింది. దీంతో రైతులు లబోదిబోమం టున్నారు. నదీతీరం వెంట ఉన్న వేమనపల్లి, కోటపల్లి మండలాలతోపాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లోని వేల ఎకరాల్లో పత్తి పంటలు నీటిపాలయ్యాయి. వేమనపల్లి శివారులో 240 ఎకరాలు, గొర్లపల్లిలో 110 ఎకరాలు, కేతన్పల్లిలో 140, కల్మలపేట శివారులో 120, ముల్కలపేట 80, రాచర్ల 110, ఒడ్డుగూడెం 60, సుంపుటం 85, జాజులపేట 70, ముక్కిడిగూడం 92, కళ్లంపల్లి 60 ఎకరాలు మునిగినట్లు అధికారులు తెలిపారు. స్తంభించిన రాకపోకలు ప్రాణహిత వరద పోటెత్తడంతో లోతట్టు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మత్తడివాగు వరకు వరద నీరు పోటెత్తుతుండటంతో వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కళ్లెంపల్లి బొందచేను ఒర్రె, చింత ఒర్రె వంతెనలపై నుంచి వరద వెళ్తోంది. దీంతో పలు మండలాలకు రాకపోకలు స్తంభించాయి. ముల్కలపేట, రాచర్ల గ్రామాల మధ్య ఉన్న ఆర్అండ్బీ రోడ్డు వంతెనలపై నుంచి వరద పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో కోటపల్లి, వేమనపల్లి మండలాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. -
కోమురం భీం ఆసిఫాబాద్లో కొత్తగా 8 కరోనా కేసులు
సాక్షి, కొమురం భీం, ఆసిఫాబాద్: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. పట్టణాలతో పాటు పల్లెలను వణికిస్తోంది. తాజాగా జిల్లాలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. సిర్పూర్ టీ మండలం ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి కొమరం బాలు ధ్రువీకరించారు. అదేవిధంగా కాగజ్ నగర్లో ఇద్దరికి.. రెబ్బెన పీహెచ్సీలో పని చేస్తోన్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా తేలింది. అంతేకాక ఆసిఫాబాద్లో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్లతో పాటు కసాబ్వాడకు చెందిన మరొకరికి కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరుకుంది. -
బాధితుల ధర్నా.. తమ స్థలాల్లో ఎలా చేస్తారంటూ?
కొమురం భీంజిల్లా : తమకు కేటాయించిన ఇళ్లస్థలాల్లో హరితహారం చేపట్టడంపై బాధితులు ధర్నా చేపట్టారు. ఈ ఘటన కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గోలేటి శివారులోని సర్వే నంబర్ 141 లోఉన్న భూమిని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే తాజాగా రెవెన్యూ అధికారులు.. ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో వివాదం తలెత్తింది. నిరుపేద కుటుంబాలకు కేటాయించిన భూమిలో హరితహారం ప్లాంటేషన్ చేస్తామని గ్రామ పంచాయితీ అధికారులు చెప్పడంతో వారిని అడ్డుకున్న బాధితులు ధర్నా చేపట్టారు. తమకు కేటాయించిన స్థలంలో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకొని బాధితులు ధర్నాకు దిగారు. -
మావోయిస్టులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్!
సాక్షి, అసిఫాబాద్: కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసు బలగాల నుంచి మావోయిస్టు దళ సభ్యులు తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. దీంతో తప్పించుకున్న మావోయిస్టుల గురించి 25 స్పెషల్ పార్టీ పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేస్తూ అడవి మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. 15 పోలీస్ పార్టీలతో గ్రామాలను తనిఖీ చేస్తూ గ్రామాల్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారిపై నిఘా ఉంచి పరిశీలిస్తున్నారు. మరో 20 పోలీస్ పార్టీలతో ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని ప్రదేశాల్లో విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నార్త్ జోన్ ఐజీ ఈ కూంబింగ్ ఆపరేషన్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. (మన్యంలో అలజడి..) మావోయిస్టులకు సహకరించిన కోవ అనంతరావు నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని గురువారం జైలుకు పంపించారు. ఈ క్రమంలో మావోయిస్టులకు సహాయం చేసిన వారిని గుర్తించి వారిపై నిఘా పెట్టారు. మావోల గురించి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి తగిన బహుమతులు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టుల గురించి నార్త్ జోన్ ఐజీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఉత్తరాన ఉలికిపాటు..!) -
కేసీఆర్కు ఆపిల్ పండ్లు అందించిన రైతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి పండించిన ఆపిల్ పండ్లను ముఖ్యమంత్రి కేసిఆర్కు కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ మంగళవారం ప్రగతి భవన్లో అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్కి రైతు బాలాజీ మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాలాజీని అభినందించారు. కొమురం భీం (ఆసిఫాబాద్)జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ ఆపిల్ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఉదాహరణ అని చెప్పారు. (ఇదిగో తెలంగాణ ఆపిల్!) -
చేతిలో పేలిన గన్.. పరిస్థితి విషమం!
-
చేతిలో పేలిన గన్.. పరిస్థితి విషమం!
సాక్షి, కొమురంభీం జిల్లా: తిర్యాణీ పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. స్పెషల్ పార్టీకి చెందిన కిరణ్ గన్ శుభ్రం చేస్తుండగా పేలింది. బుల్లెట్ అతని తలలోకి దూసుకెళ్లింది. క్షతగాత్రున్ని హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
సాక్షి, జైనూర్: కొమరం భీం జిల్లాలో మైనార్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మాయమాటలు చెప్పి.. బాలికను మభ్యపెట్టిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. జిల్లాలోని జైనూర్ మండలం శేకుగూడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారం చేసిన నిందితులు ఆత్రం ప్రభు (24), పెందూర్ శ్రీకాంత్ (19)పై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో నిందితులపై పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేసి కేసు పెట్టాల్సిందిగా జిల్లా డీఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. -
ప్రేమ వివాహం.. అల్లుడిపై దాడి చేసిన మామ
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన ఓ తండ్రి.. అల్లుడిని హత్య చేసేందుకు కత్తితో దాడి చేశాడు. వివరాలు.. తిర్యాని మండలం నాయకపు గూడాకు చెందిన నవీన్, కావ్యలకు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో కావ్య తండ్రి వీరి వివాహాన్ని అంగీకరించలేదు. అంతేకక అల్లునిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కావ్య తండ్రి, నవీన్పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న నవీన్ను గమనించిన స్థానికులు తిర్యాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. కావ్య తండ్రి కోసం గాలిస్తున్నారు. -
యూరియా కోసం కలెక్టర్ను అడ్డుకున్నారు
సాక్షి, సిర్పూర్ కాగజ్నగర్: ఇంకా ఎన్ని రోజులు మా పనులన్నీ వదులుకొని యూరియా కోసం లైన్లు కట్టాలి.. మా పంటలు ఏం కావాలని కొమురం భీం(ఆసిఫాబాద్) జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతును రైతలు నిలదీశారు. ఆయన సోమవారం యూరియా పరిస్థితిని పరిశీలించేందుకు కాగజ్నగర్లో పర్యటించారు. ఈ సందర్భంలో రైతులు తమకు యూరియా అందే వరకు కదలనివ్వమని కలెక్టర్ వాహనం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు తమకు గత వారం రోజులుగా యూరియా అందటం లేదని.. తీవ్ర కొతరను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా నిత్యం పడిగాపులు కాస్తున్నామని కలెక్టర్కు దృష్టికి తీసుకువచ్చారు. యూరియా నిల్వలు పెంచాలని రైతులు కలెక్టర్ను కోరారు. -
ప్రతి పంచాయతీకీ నెలకు రూ.2లక్షలు
పల్లెల అభివృద్ధి, పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి నెలకు రూ.2లక్షల నిధులు మంజూరు చేస్తుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మం తు తెలిపారు. గురువారం ఆయన దహెగాం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి 30 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సాక్షి, సిర్పూర్: పల్లెల్లో అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నెలకు రూ.2 లక్షలు మంజూరు చేస్తుంనది కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పే ర్కొన్నారు. దహెగాం మండలంలోని ఇట్యాల, కోత్మీర్, బీబ్రా గ్రామాల్లో గురువారం ఆయన 30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలును పరి శీలించారు. ముందుగా ఇట్యాల ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు. గ్రామంలో పలు కాలనీల్లో పర్యటించారు. డ్రెయినేజీలు శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది జ్వరాలు వచ్చే అవకాశముందన్నారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో అధికారులతో పాటు గ్రామస్తులు భాగస్వాములు కావాలని సూచిం చారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. శ్మశానవాటిక, డంపింగ్యార్డుల కోసం స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని కోత్మీర్, బీబ్రా గ్రామాల్లో పర్యటించారు. కోత్మీ ర్లో మొక్కలను నాటారు. బీబ్రాలో శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హేమంత్కుమార్, ఎంపీపీ కంబగౌని సులోచన, తహసీల్దార్ సదా నందం, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచులు మురారీ, తరనుం సుల్తానా, క్రిష్ణమూర్తి, ఇట్యాల, బీబ్రా ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, శంకర్, పశువైద్యాధికారి పావని, ఈజీఎస్ ఏపీవో చంద్రయ్య, ఈవోపీఆర్డీ రాజేశ్వర్గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సంతో ష్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రసాద్రాజు, నాయకులు సురేష్, సోను తదితరులు పాల్గొన్నారు. -
‘తుమ్మిడిహెట్టి’ కోసం కదిలిన కాంగ్రెస్
సాక్షి, కాగజ్నగర్: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగంలోకి దిగారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవతో కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో దాదాపుగా 16.5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.38వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ సైతం చేశారు. కెనాల్ పనులు సైతం జరిగాయి. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టి కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. రీడిజైన్ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని మొదటి నుంచి ప్రతిపక్షం వాదిస్తూనే ఉంది. రంగంలోకి రాష్ట్ర నాయకత్వం ఈ నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు పోన్నాల లక్ష్మయ్య, హన్మంతరావు, షేబ్బీర్అలీ, జానరెడ్డి, సురేష్ సెట్కార్, కొండ విశ్వేశ్వర్, మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఉదయం 11గంటలకు కాగజ్నగర్ చేరుకోగా వారికి కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో కుమురంభీం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, సిర్పూర్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ పాల్వాయి హరీష్బాబు మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11గంటలకు తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో కాగజ్నగర్ చేరుకుని ఇక్కడి నుంచి కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదిని పరిశీలించడానికి వెళ్లారు. ప్రాణహిత నదిలో నీటి లభ్యత గురించి తెలుసుకుని పరిశీలించారు. -
ప్రేమ పేరుతో హోంగార్డు మోసం
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు పోలీసుల చర్యలు ఆ శాఖ పరువు తీస్తున్నాయి. దీంతో పోలీసు ఉద్యోగుల వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే కొమురం ఆసిఫాబాద్ జిల్లాలో కానిస్టేబుల్గా పని చేస్తున్న ఓ వ్యక్తి మహిళల అక్రమరవాణా కేసులో జైలుపాలయ్యాడు. ఇక లక్సెట్టిపేటకు చెందిన రిజర్వ్ సీఐ శ్రీనివాస్పై 498-ఎ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువతి గర్భందాల్చి బిడ్డకు జన్మనిస్తూ మృతి చెందింది. ఇందుకు జిల్లాకు చెందిన ఓ హోంగార్డే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల ప్రవర్తనపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఏఆర్ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న సజ్జన్లాల్ ధాంపూర్కు చెందిన అరుణ అనే యువతిని ప్రేమపేరుతో గర్భవతిని చేశాడు. ఆమె ఆదివారం ఆసిఫాబాద్లో మగబిడ్డకు జన్మనిచ్చి అనంతరం మృతి చెందింది. అయితే గతంలోనే సజన్ లాల్కు పెళ్లి కాగా, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ప్రేమ, పెళ్లి పేరుతో అరుణను లోబరచుకుని గత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. గర్భవతి అయిన ఆమెకు ఇవాళ ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకు వెళ్లకుండా ఆలస్యం చేశాడు. దీంతో ఆమె దారిలోనే బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి అక్కడ నుంచి సజ్జన్ లాల్ పరారయ్యాడు. అరుణ మృతితో న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తీసుకు వెళ్లేది లేదని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కాగా సజన్ లాల్ వ్యవహారంపై గతంలోనే ఆసిఫాబాద్ పోలీసులకు అరుణ బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తన చెల్లెలు చనిపోయిందని అరుణ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ సత్యనారాయణ...బాధితురాలి కుటుంబసభ్యులను సముదాయించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఇక పుట్టిన బిడ్డను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
వైద్యులు లేక డెలివరీ చేసిన నర్సులు శిశువు మృతి
-
నెరవేరనున్న ఏళ్ల కల
సాక్షి, సిర్పూర్(టి): నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరనున్నది. పట్టణంలో బస్టాండ్ నిర్మాణం నియోజకవర్గ ప్రజలకు కలగా మిగిలిపోగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృషితో బస్టాండ్ నిర్మాణం కోసం ఆర్టిసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సిర్పూర్(టి)లో నూతన బస్టాండ్, బస్డిపో నిర్మాణం, బస్డిపోలోనే సినిమా హాల్ నిర్మాణాలకు అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో మండలంలోని ప్రజలతోపాటు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థల పరిశీలన మండల కేంద్రం మీదుగా నియోజకవర్గంలోని కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల ప్రజలతోపాటు సమీపంలోని మహారాష్ట్ర ప్రజలు ఇబ్బందుల నడుమ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్, బస్డిపో, సినిమాహాల్ నిర్మాణానికి ఇటీవలే సర్వే నిర్వహించి స్థల పరిశీలన, రికార్డులను పరిశీలించారు.నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ నిర్మించి, ప్రయాణికులకు వసతులు కల్పిస్తే ఇక్కట్లు తీరినట్లేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని ఆనుకోని మహారాష్ట్ర గ్రామాలు, పట్టణాలు ఉన్నా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడంతో అధిక ధరలు వెచ్చించి ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికారులు తక్షణమే పనులు ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నియోజవర్గ ప్రజలు కోరుతున్నారు. -
ఏళ్లకు తీరిన ఓట్ల కష్టం
కెరమెరి(ఆసిఫాబాద్): అదో కుగ్రామం. కెరమెరి మండలానికి అతి సమీపం. ఏ కాలంలో.. ఏ సందర్భంలో ఆ గ్రామాన్ని సిర్పూర్(యూ) మండలంలో చేర్పించారో ఎవరికి తెలియదు. అనాదిగా వారు కష్టాలు అనుభవిస్తున్నారు. సమస్యల్లోనే కాదు ఓట్లు వేయడంలోనూ వారికి ఇబ్బందులే.. అదే సిర్పూర్(యూ) మండలంలోని బాబ్జిపేట్ గ్రామ పంచాయతీలోని మెట్టిగూడ గ్రామం. అక్కడ నివసిస్తున్నది గోండు తెగలు, ఆదివాసీలు. మొత్తం జనాభా 129, పురుష ఓటర్లు 31, మహిళా ఓటర్లు 38 మొత్తం కేవలం 69 మంది మాత్రమే ఉన్నారు. ఏళ్ల తర్వాత తీరిన సమస్య! ప్రతిసారి జరిగే ఎన్నికల్లో వారు ఓటు వేయాలంటే 24కిలో మీటర్ల దూరంలోని పంగిడి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేయకతప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన శాసన సభ ఎన్నికల్లో మాత్రం వారు 6కిలో మీటర్ల సమీపంలోని బాబ్జిపేట్ (ఖాతీగూడ) గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దేశంలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ నుంచి వారు ప్రతిసారి జరిగే ఎన్నికల్లో 24కిలో మీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సి వచ్చేది. రెండు గుట్టలు ఎక్కడం.. రాళ్లు రప్పల రహదారి. విషప్రాణులు సంచరించే అభయారణ్యం అయినా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో వారు ఎంత దూరమైన కాలిబాటతో వెళ్లి ఓటు వేసేవారు. కానీ ఈసారి ఎన్నికల నిబంధన ప్రకారం రెండు కిలో మీటర్ల దూరంలో పోలింగ్స్టేషన్ ఉంటే స్వంత గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయవచ్చనే నిబంధన వారి సమస్యకు చెక్ పడినట్లయింది. రికార్డుకెక్కిన ఆదివాసీ గ్రామం... తెలంగాణ రాష్ట్రంలోని అతితక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్ కేంద్రంగా మెట్టిగూడ రాష్ట్ర రికార్డుల్లో చేరింది. తమ గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఆదివాసీల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇన్నాళ్లు రాళ్లు రప్పలు, వాగులు వంకలు దాటి అష్టకష్టాలు పడేవాళ్లమని కానీ అధికారులు మాపై కరుణ చూపారని వారు పేర్కొంటున్నారు. -
‘గళం’ విప్పేదెవరో..!
సాక్షి, మంచిర్యాల: శాసనమండలిలో గళం విప్పేందుకు ఉబలాటపడుతున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోలింగ్కు కేవలం వారం రోజులే వ్యవధి ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓట్ల వేటను వేగవంతం చేశారు. సాధారణ ఓటర్లకు భిన్నంగా పట్టభద్రుల ఓటర్లను దొరకపట్టడమే గగనమవుతున్న తరుణంలో అన్ని రకాల ప్రచారాస్త్రాలను వినియోగించుకొంటున్నారు. ప్రచారం ముమ్మరం శాసనమండలి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా పట్టభద్రుల నియో జకవర్గ స్థానానికి తలపడుతున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. పోలింగ్కు వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో ఆలోగా వీలైనంతమంది ఓటర్లను కలుసుకొనేందుకు నానా పాట్లు పడుతున్నారు. సాధారణ ఎన్నికల్లోనైతే ఓటర్లంతా ఒక గ్రామంలోనో, పట్టణంలోనో ఉంటారు. కాని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎక్కడుంటారో దొరకబట్టడమే అభ్యర్థులకు కష్టంగా మారింది. దీంతో ఓట్ల సమూహాలను గుర్తించేందుకు అభ్యర్థుల మద్దతుదారులు నానాతిప్పలు పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలల కరస్పాండెంట్లు, విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదుల వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రధానంగా నలుగురు అభ్యర్థుల నడుమ పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త టి.జీవన్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ నేత పి.సుగుణాకర్రావు, టీఆర్ఎస్ మద్దతుతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ పోటీలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 22వ తేదీన ఎమ్మెల్సీ పోలింగ్ ఉండడంతో, అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగిరం చేశారు. ఇప్పటికే ఓ మారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం పూర్తి చేసిన అభ్యర్థులు, రెండవసారి ప్రచారం చేపట్టారు. గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి మంచిర్యాలలో ప్రచారం నిర్వహించారు. ముందుగా మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అక్కడి నుంచి కోర్టుకు వెళ్లి న్యాయవాదుల మద్దతు కోరారు. స్వతహాగా న్యాయవాది అయిన జీవన్రెడ్డికి లాయర్లు స్వాగతం పలికారు. అనంతరం విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతు కోసం తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలంటూ అభ్యర్థించారు. కాగా మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఈ నెల 13న నిర్మల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి పి.సుగుణాకర్రావు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో ఇప్పటికే ప్రచారం చేపట్టారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులంతా మండలిలో తమకు గళం విప్పే అవకాశం ఇవ్వాలంటూ ఓటు అభ్యర్థిస్తున్నారు. పట్టభద్రుల వాణిని మండలిలో వినిపించేందుకు తమకు పట్టం కట్టాలంటూ కోరుతున్నారు. ముఖ్యంగా సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి ప్రశ్నించే గొంతు కోసం తనకు ఓటేయాలంటూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు తనకున్న వ్యక్తిగత చరిష్మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందనే భరోసాతో ఆయనున్నారు. అంతా అధికారపక్షంగా ఉన్న సమయంలో మాట్లాడే ఓ ప్రతిపక్ష గొంతు కావాలంటూ ప్రచారాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న చంద్రశేఖర్గౌడ్, సైతం పట్టభద్రుల సమస్యలు పరిష్కరించేందుకు తనకు చాన్స్ ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన తనకు అన్ని అంశాలపై అవగాహన ఉందంటున్నారు. బీజేపీ జాతీయ నేత పి.సుగుణాకర్రావు సైతం మండలిలో ప్రశ్నించే గొంతుకు అవకాశం కల్పించాలని కోరారు. రాణి రుద్రమ యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొన్నారు. మొత్తానికి మండలి పోలింగ్కు కేవలం వారం రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. -
ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
-
నిఘా చూస్తోంది!
సాక్షి, ఆసిఫాబాద్టౌన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లాలో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల కార్యకలాపాలపై దృష్టి సారిం చేందుకు ప్రత్యేక నిఘా బృందాలను నియమించారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు జిల్లాను జల్లెడ పడుతున్నాయి. అభ్యర్థుల ప్రచారం, నగ దు వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోటీ చేస్తున్న అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో అనుని త్యం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు వివరాలపై ఈసారి ఎన్ని కల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. విధించిన గడువుకు మించి ఖర్చు పెడితే చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల లెక్కలు తప్పుగా చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బృందాల ద్వారా ర్యాలీలు, బహిరంగ సభలతోపాటు ఇతర కార్యక్రమాలను వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు. ర్యాలీలు, సభల్లో ఎమ్మెల్యే ఫొటోలు వాడితే ఆ సభకు అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే లెక్కిస్తారు. ప్రచారానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ఎన్నికల అధికారులు ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రత్యేక రిజిష్టర్ను అందజేస్తున్నారు. ఈ రిజిష్టర్లో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అక్రమ మార్గాలపై దృష్టి.. ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను నివారించేందుకు నిఘా మరింత పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వాంకిడి, సిర్పూర్(టి)తోపాటు ఆసిఫాబాద్, గోలేటి ఎక్స్రోడ్, కాగజ్నగర్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాకే పంపిస్తున్నారు. అయితే ఈ తనిఖీల ద్వారా కొంత వరకూ సామాన్యులు కూడా ఇబ్బందులకు గురువుతున్నారు. సామాన్య పౌరులు తమతో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లవద్దని, అంతకు మించి తరలిస్తే వాటిని సీజ్ చేసి ఆ దాయపు పన్నుల శాఖకు అప్పగించనున్నారు. న గదుకు సంబంధించిన రశీదు, ధ్రువ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. కాగా జీరో అకౌంట్స్ ఖాతాలతోపాటు, బ్యాంకుల లావాదేవీలపై కూ డా అధికారులు కన్నేశారు. అలాగే మద్యం తరలిం పుపైనా ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఎన్ని కలకు ముందు ఏరులై పారే మద్యం అమ్మకాలు, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇతర ప్రాంతల నుంచి అక్రమంగా మద్యం తరలిపోకుండా ప్రత్యేక తనిఖీలపై సైతం చేపడుతున్నారు. దీనికి తోడు జిల్లాలో నూతనంగా నాలుగు స్కార్పి యో హైవే వాహనాలు రావడం, అవి నిరంతరం హైవేలపై తిరుగుతూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూస్తున్నాయి. జిల్లాలో ఆరు బృందాలు.. ఎన్నికల భద్రత అంశాలపై దృష్టి సారించిన పోలీసులు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 3, కాగజ్నగర్ మరో మూడు భద్రత బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. దీనితోపాటు మొబైల్ పెట్రోలింగ్, బ్లూకోట్ టీంలు ఎప్పటికప్పుడు నిఘాను పెంచుతున్నాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వ్యక్తులతోపాటు రౌడీషీ టర్లను బైండోవర్ చేసి రూ.లక్ష సొంతపూచీకత్తుపై విడుదల చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులపై కూడా నిఘా ఉంచేందుకు ప్రజలతో భాగ్యస్వామ్యం అవుతున్నారు. సమాచార వ్యవస్థను మరింత పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా వరుసగా గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి జియో ట్యాగింగ్.. గతంలో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్ లేదు. కాని ఈసారి నూతనంగా ప్రతీ పోలింగ్స్టేషన్ను జియో ట్యాగింగ్తో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధునిక సాంకేతికతతో కూడిన జియో ట్యాగింగ్ సిస్టమ్ను పోలీస్ యంత్రాంగం వినియోగిస్తోంది. ఇది పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన బందోబస్తు, రూట్మ్యాప్ తదితర వివరాలు సులువుగా తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడనుంది. -
బయటపడ్డ పురాతన నాణేలు
దహెగాం (సిర్పూర్) : ఓ పాత ఇంటిని కూల్చివేస్తుండగా పురాతన నాణేల కుండలు బయటపడ్డాయి. కుమురం భీం జిల్లా దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన జునగరి గంగ మ్మ ఇంటిని అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు వెల్ములే సురేశ్, రమేశ్ కొనుగోలు చేశారు. ఇల్లును కూల్చి కొత్తగా నిర్మించాలనుకున్నారు. ఈ క్రమంలో పాత ఇంటిని కూల్చివేస్తుండగా గోడలో ఉన్న పురాతన నాణేల కుండలు పగిలి బయటపడ్డాయి. రాగి, వెండి, ఇత్తడివి కలిపి మొత్తం 1365 నాణేలు లభ్యమయ్యాయి. వీటిపై 1862, 1885, 1899, 1907 సంవత్సరాలు ముద్రించి ఉన్నాయి. ఈ నాణేలపై బ్రిటిష్ చక్రవర్తి విక్టోరియా మహారాణి, చార్మినార్, హెడ్వట్ సెవెన్ పేర్లు ఉన్నాయి. నాణేలను పెంచికల్పేట్ తహసీల్దార్ రియాజ్ అలీ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. ఇంకేమైనా నాణేలు లభించాయా? అనే అనుమానంతో పోలీసులు.. సురేశ్, రమేశ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. -
మెడికల్ ల్యాబ్లో ఘోరం
కాగజ్నగర్ : కాగజ్నగర్ పట్టణంలోని అగ్రసేన్ భవన్ ముందు ఉన్న మెడికల్ ల్యాబ్లో సోమవారం రాత్రి ఒక యువతిపై అత్యాచార యత్నం జరిగినట్లు పట్టణ ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన యువతీ (20) అగ్రసేన్ భవన్ ముందు ఉన్న సాయి రత్న క్లీనికల్ ల్యాబ్లో పని చేస్తోందని తెలిపారు. అదే ల్యాబ్లో ప్రైవేట్ టెక్నిషియన్గా పని చేస్తున్న కాగజ్నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన మేకర్తి రవి సోమవారం రాత్రి యువతీపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. అయితే ఆ సమయంలో అమ్మాయి ప్రతిఘటించడంతో రవి యువతిపై చేయి చేసుకున్నాడని ఎస్సై వివరించారు. కేకలు వేయడంతో రవి అక్కడి నుండి పరారయ్యాడని, బాధితురాలు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మేకర్తి రవిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
పోరుగడ్డ.. ఆసిఫాబాద్
ఆదివాసీల ఖిల్లా.. ఈ జిల్లా కొమురం భీమ్ పేరిట ఏర్పాటు నిజాం కాలం నాటి ఆనవాళ్లు ఎన్నో జల్..జంగల్..జమీన్.. అంటూ నినదించిన గిరిజన పక్ష పోరాట యోధుడు కొమురం భీమ్ పురిటిగడ్డ ఈ ఆసిఫాబాద్. ఆయనతో పాటు మరెందనో పోరాట యోధుల జన్మస్థలాలున్నది ఈ ప్రాంతంలోనే. కెరమెరి ఘాట్ల అందాలు.. సిర్పూర్ పేపర్మిల్లు, హైమన్డార్ఫ్ దంపతుల సేవలు.. మినీ ఇండియూగా కనిపించే కాగజ్నగర్.. ఇక్కడి విశేషాలు. ఒకప్పుడు జిల్లా కేంద్రం ఇప్పుడు మళ్లీ జిల్లాగా..- ఆసిఫాబాద్ ఆజంజాహి వంశ కాలంలో.. హైదరాబాద్ సంస్థానాధీశుడిగా ఉన్న ఆజంజాహి వంశానికి చెందిన నిజాం నవాబు 1907లో ఈ ప్రాంతాన్ని ఆసిఫాబాద్గా నామకరణం చేశారు. ఈ ప్రాంతం గుండా రెబ్బెనలో ఉన్న రైల్వేస్టేషన్ను ఆసిఫాబాద్ రోడ్గా మార్చారు. 1913 నుంచి 1940 వరకు ఇది జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తరువాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్ తరలిపోయినా, ఆసిఫాబాద్ మాత్రం విశిష్టతను కాపాడుకుంటూ వస్తుంది. నిజాం నాటి కార్యాలయ భవనాలు నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొన్నటి వరకు నిజాం కాలం భవనంలోనే కొనసాగింది. జిల్లా ప్రత్యేకత జల్ జంగల్ జమీన్ కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమరం భీమ్ వర్ధంతి ఏటా ప్రభుత్వం కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే కావడం, రాష్ట్రంలో మొదటి గిరిజన పట్టభద్రుడు కొట్నాక భీమ్రావు నియోజకవర్గానికి చెందిన వారు కావడం విశేషం. నిజాం మెచ్చిన గ్రామంగా పేరొందిన ఆసిఫాబాద్ ఒకప్పటి జిల్లా కేంద్రం. మొట్టమొదటి ఆర్టీసీ డిపో కూడా ఇక్కడే ఏర్పాటైంది. జైనూరు మండలం మార్లవాయిలో గిరిజనులకు సంక్షేమ ఫలాలందించిన శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ హెమండార్ఫ్ దంపతుల సమాధులున్నాయి. కెరమెరి ఘాట్లు ప్రకృతి అందాలకు కనువిందు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా క్షేత్రం కూడా నియోజకవర్గంలోనే ఉంది. దీంతో పాటు పట్టణంమలోని శిర్డీ సాయి మందిరం కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఆసిఫాబాద్ మండలంలో కొమురం భీమ్, వట్టివాగు, తిర్యాణిలో చెలిమెల వాగు, కాగజ్నగర్ నియోజకవర్గంలో జగన్నాథ్పూర్ ప్రాజెక్టులున్నాయి. రెబ్బెన మండలంలోని గంగాపూర్లో వేంకటేశ్వర దేవాలయం, కాగజ్నగర్ మండలం ఈజ్గాంలో శివమల్లన్న దేవాలయం, టొంకిని హనుమాన్ ఆలయం ప్రసిద్ది చెందినవి. ఇక్కడి రైతులు రికార్డు స్థాయిలో పత్తి పండిస్తారు. దీంతో పారిశ్రామికంగా జిన్నింగు, ఆయిల్ మిల్లులు వెలిశాయి. రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైల్వేస్టేషన్కు ఆసిఫాబాద్ రోడ్ పేరు పెట్టారు. కాగజ్నగర్లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్పీఎం పేపర్ మిల్లు, సర్సిల్క్ మిల్లులు మూత పడ్డాయి. క్రీశ 1700 శతాబ్దంలో ఆసిఫాబాద్ను సుమారు 200 సంవత్సరాలు గోండు రాజులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతుంది. అభివృద్ధి వైపు... ఆసిఫాబాద్ను కొమురం భీమ్ జిల్లాగా ప్రకటించడంతో ఇ క్కడి ప్రజల్లో అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇక్కడ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు సుమారు 60 శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు ఏర్పాటుతో సుమారు 2 వేలకు పైగా ఉద్యోగుల సంఖ్య పెరగనునుంది. జిల్లా కేంద్రంలో విద్య, వైద్యం, రోడ్లు, కనీస సౌకర్యాలు లేవు. తాజాగా జిల్లా ప్రకటనతో జిల్లాలో రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ, వైద్య సేవలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రి 500 పడకల ఆస్పత్రిగా స్థాయి పెరిగింది. హోటళ్లు, లాడ్జిల సంఖ్య పెరగనుంది. జిల్లా ఏ ర్పాటుతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అద్దె ఇళ్లకు సై తం డిమాండ్ పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడ వివిధ పనుల కోసం వచ్చే ప్రజలతో వ్యాపారం గణనీయం గా అభివృద్ధి చెందుతుందే అవకాశాలున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించే అవకాశాలున్నా యి. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలతో ఆర్టీసీ బస్సుల సంఖ్య, ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో వ్యవసా యాభివృద్ధికి సమృద్దిగా వనరులున్నాయి. మండలంలోని కొమురంభీమ్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 45,500, వట్టివాగు ప్రాజెక్టు ద్వారా 24,500 ఎకరాల ఎకరా ల ఆయకట్టుకు సాగునీరందనుంది. దీంతో పంట పొలాలు, చేలు సస్యశామలమవుతాయి. వ్యవసాయాభివృద్ధి జరుగుతుంది. జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరగడంతో జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులూ ఏర్పాటవొచ్చు. దీంతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల సంఖ్య పెరిగి గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత పెరిగే అవకాశాలున్నాయి. -
పోలీస్ బాస్లు ఎవరు..?
కొత్త జిల్లాల్లో ఎస్పీల పోస్టింగ్లపై జోరుగా చర్చ తెరపైకి పలువురి పేర్లు కొమురంభీంకు దుగ్గల్..? ఆదిలాబాద్కు విజయ్కుమార్..? దృష్టంతా కొమురంభీం జిల్లాపైనే ప్రజాప్రతినిధుల రంగ ప్రవేశం అనుకూల ఎస్పీని తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు..! సాక్షి, మంచిర్యాల : త్వరలోనే కొలువుదీరనున్న కొత్త జిల్లాల్లో ఎస్పీలు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్.. నిర్మల్.. కొమురంభీం జిల్లాలుగా విభజింపబడుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో కొత్త ఎస్పీల నియామకాలు అనివార్యమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్ల కొరత ఉండడం.. కొత్త జిల్లాల్లోనూ ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండడంతో ప్రభుత్వం ఏఎస్పీలకు జిల్లా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అన్ని జిల్లాల నుంచి ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీలు.. ఏఎస్పీలకు సంబంధించిన వివరాలు.. ప్రతిపాదనలు డీజీపీకి అందాయి. పనితీరే ప్రామాణికంగా పలువురు ఏఎస్పీలకు కొత్త జిల్లాల్లో అవకాశం కల్పించేందుకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తయ్యింది. సీనియా ర్టీ.. పర్యవేక్షణ.. కేసుల దర్యాప్తు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వనుంది. మంచిర్యాలలో హాట్ టాపిక్ మరోపక్క.. కొత్త జిల్లాల ఏర్పాటుకు గడువు సమీపిస్తున్న కొద్దీ జిల్లాల్లో పోలీస్ బాస్లు ఎవరుంటారోనని పోలీసులు.. ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాలలో ఈ చర్చ హాట్టాపిక్గా మారింది. కార్మిక క్షేత్రమైన కొమురంభీం జిల్లా నేరాలకు కేరాఫ్గా ఉండడం.. మహారాష్ట్ర-తెలంగాణకు సరిహద్దు ప్రాంతంలో ఉండడం.. బొగ్గు.. ఇసుక.. రియల్ మాఫియా..కలప స్మగ్లింగ్తోపాటు ఎక్కువగా దొంగతనాలు జరుగుతుండడంతో సీనియర్ ఐపీఎస్ అధికారిని ఈ ప్రాంతానికి ఎస్పీగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రస్తుత జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ కొమురంభీం జిల్లాకు వస్తారని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే ఇటీవల మంచిర్యాల ఏఎస్పీ ఎస్ఎం విజయ్కుమార్ ఓఎస్డీగా జిల్లా కేంద్రానికి బదిలీపై వెళ్లారు. ఈయన్ను ఆదిలాబాద్ ఎస్పీగా నియమించే అవకాశాలున్నాయని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. నిర్మల్ ఎస్పీ నియామకం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మొన్నటి వరకు జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్పీ రాధికను నిర్మల్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కాని.. ఆ స్థానంలో మరో కొత్త అధికారిని నియమించే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. అనుకూల ఎస్పీ కోసం ప్రయత్నాలు..? కొమురంభీం జిల్లా ఎస్పీ నియామకం విషయంలో ఈ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు.. రియల్టర్లు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు.. అక్రమ రియల్ వ్యాపారులు.. పోలీసుల మధ్య అవగాహన ఉంది. గతంలో ఓ యువనేతకు సన్నిహితుడిగా పేరొందిన రియల్టర్ నస్పూర్లోని అసైన్డ్భూమిని కబ్జా చేసే యత్నం చేశాడు. దీనిపై పట్టణంలో జోరుగా చర్చ సాగడం.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు ఆ రియల్టర్ అక్రమాన్ని అడ్డుకున్నారు. పలు చోట్ల అయితే ప్రజాప్రతినిధులే రియల్ వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం భూ కబ్జాలు.. సెటిల్మెంట్లకు కేరాఫ్గా మారింది. సాక్షాత్తు రెవెన్యూ అధికారులు రియల్టర్లకు వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజాయితీ.. కఠినంగా పనిచేసే అధికారి వస్తే తమ వ్యాపారానికి ప్రమాదమని భావించిన పలువురు ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉండే అధికారిని కొత్త ఎస్పీగా తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే.. ఏడాదిన్నర కాలం మంచిర్యాల ఏఎస్పీగా పని చేసిన విజయ్కుమార్ డివిజన్ పరిధిలో అనేక అక్రమార్కులపై కొరడా ఝుళిపించారు. భూ కబ్జాలు.. సెటిల్మెంట్లకు దిగిన పలువురు నేతల దూకుడుకు కళ్లెం వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొమురంభీం జిల్లాకు ఎలాంటి ఎస్పీ వస్తారోననే చర్చ హాట్టాపిక్గా మారింది. -
పరుగో.. పరుగు
కొమురంభీం జిల్లాలో కార్యాలయ భవనాల వేట ఇది వరకే ప్రైవేట్ భవనాలు పక్కా చేసిన పలు శాఖలు ప్రభుత్వ భవనాలనే ఎంచుకోవాలన్న ఆర్డీవో ఇతర శాఖలకు ఇచ్చేందుకు పలు అధికారుల నిరాకరణ ఉన్న పలు డివిజన్ కార్యాలయాల్లో జిల్లా ఆఫీసులు బెల్లంపల్లి, మందమర్రి వైపు అధికారుల పరుగు ఖరారు కాని ఆర్డీవో కార్యాలయ భవనం..? సాక్షి, మంచిర్యాల : కొత్తగా ఏర్పాటవుతున్న కొమురంభీం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు పలు శాఖాధికారులకు సవాలుగా మారింది. కొత్త జిల్లాల ప్రారంభానికి సరిగ్గా ఇరవై రోజులే మిలిగి ఉంది. ఇప్పటి వరకు కేవలం కలెక్టర్, ఎస్పీ కార్యాలయ భవనాలు మాత్రమే ఖరారయ్యాయి. స్థానికంగా ఉన్న పలు డివిజన్ శాఖల భవనాల్లో ఆయా జిల్లా కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కానీ డివిజన్ కార్యాలయాలు లేని శాఖలకు భవనాల ఏర్పాటు తలనొప్పి వ్యవహారంగా మారింది. దీంతో ఇప్పటికే పలు శాఖల అధికారులు కార్యాలయాల ఏర్పాటు కోసం మంచిర్యాల పట్టణంలో పలు ప్రైవేట్ భవనాలు ఎంపిక చేసి.. అద్దె కూడా ఖరారు చేసుకున్నారు. ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటయ్యే కార్యాలయాల అద్దె రూ.4 వేల నుంచి రూ.6 వేలలోపు ఉండేలా చూడాలని అప్పట్లో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. తాజాగా.. కొమురంభీం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఆ మేరకు భవనాల ఎంపిక చేయాలని ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానం ఆదేశాలు జారీ చేయడంతో డివిజన్ పాటు జిల్లా స్థాయి అధికారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు కొన్ని శాఖలకు మాత్రమే డివిజన్ కార్యాలయాలు ఉండడం.. ఆయా భవనాల్లో జిల్లా కార్యాలయాలు వస్తుండడంతో డివిజన్ కార్యాలయాలు ఇతర భవనాలకు తరలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న భవనాన్ని జిల్లా కార్యాలయానికి అప్పగిస్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన డివిజన్ స్థాయి అధికారుల్లో వ్యక్తమవుతోంది. మరోపక్క.. ఇప్పటికీ పశుసంవర్థక, కార్మిక శాఖ, మైనింగ్, తూనికలు కొలతలు, సాంఘిక సంక్షేమం, ఆహార కల్తీ నిరోధక, ఔషధశాఖ, సేల్స్, కమర్షియల్, ఇన్కంటాక్స్, అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల, సబ్ ట్రెజరీ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సొంత భవనాలు లేని డివిజన్ స్థాయి శాఖలు మంచిర్యాలలో మరెన్నో ఉన్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులు జిల్లా కార్యాలయాల భవనాల అన్వేషణలో పడ్డారు. ఇప్పటికే పలు శాఖల అధికారులు పలు ప్రైవేట్ భవనాలను ఎంపిక చేసుకుని పెట్టుకున్నారు. తాజాగా.. ఆర్డీవో ఆదేశాలతో మళ్లీ ప్రభుత్వ భవనాలు వెతుక్కోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇకపోతే.. కనీసం డివిజన్ స్థాయి కార్యాలయాలు లేని బీసీ, మైనార్టీ వెల్ఫేర్, కార్పొరేషన్లు, దేవాదాయ శాఖల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వీటిలో ఇప్పటికే కొన్ని శాఖలు మాత్రమే భవనాలు చూసి పెట్టుకున్నారు. మిగిలిన శాఖలు ఇంకా భవనాల అన్వేషణలో వెనకబడే ఉన్నారు. ఇదిలావుంటే.. మంచిర్యాలలో ప్రభుత్వ కార్యాలయల భవనాల కొరత ఉండడంతో కొందరు అధికారులు మంచిర్యాలను ఆనుకుని ఉన్న బెల్లంపల్లి, మందమర్రి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. మంచిర్యాల నుంచి 20 కి.మీల దూరంలో ఉన్న ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం.. సింగరేణి అతిథి గృహాలూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో జిల్లా శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నామని జిల్లా స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆర్డీవో కార్యాలయ ఏర్పాటుపై సందిగ్ధం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ భవన ఎంపికలో సంది గ్ధత నెలకొంది. ప్రస్తుత సొంత భ వనంలో ఎస్పీ కార్యాల యం ఏర్పాటు కానుండడం.. ఆర్డీవో కార్యాలయాన్ని కొత్త కలెక్టరేట్ సముదాయంలోకి తరలించాలని ఇటీవల ఎంపీ బాల్కసుమన్ సూచించారు. ఇప్పటికే కలెక్టరేట్లో జేసీ, డీఆర్వో, ఏవో, సంబంధిత విభాగాలు, సమీక్ష, సమావేశ మందిరం, డీఆర్డీఏ, డ్వామా ఇతర శాఖలు ఏర్పాటుకానుండడంతో ఆర్డీవో కార్యాలయానికి స్థలాభావం సమస్య ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఐబీ చౌరస్తా వద్ద ఉన్న ఆర్అండ్బీ డీఈ అతిథిగృహంలో ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానం కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నించా రు. దీన్ని ఆ శాఖ అధికారి ఒకరు సున్నితంగా తిరస్కరించారు. అయినా.. ఆర్డీవో అదే భవనంలో కార్యాలయం ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.