Lifetime Achievement Award
-
ఫలితాలకు షార్ట్కట్స్ ఉండవు!
‘పనిలో షార్ట్ కట్స్ ఉండచ్చు. కానీ, ఫలితాలు అందుకోవాలంటే దీర్ఘకాలం ప్రయత్నించాల్సిందే’ అంటారు డాక్టర్ పింగళి ఉషారాణి. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మకాలజీలో డీఎమ్గా ఉన్న డాక్టర్ పింగళి ఉషారాణి చేసిన పరిశోధనలకు గాను ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ రీసెర్చ్ (ఐఎస్సీఆర్) నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పాతికేళ్లుగా క్లినికల్ ఫార్మకాలజీలో తాను చేస్తున్న కృషి గురించి వివరించారామె ...‘మా వర్క్లో పేషెంట్ కేర్, రీసెర్చ్ రెండూ ఉంటాయి. గాంధీ, నిమ్స్ ఫార్మాస్యుటికల్ విభాగాలలో ఎలాంటి వర్క్ జరుగుతుందో బయటి వారికి తెలియదు. అకడమిక్ విభాగంలో విద్యార్థులకు పాఠాలు చెప్పి, పంపుతారు అనే ఆలోచనలో ఉంటారు. కానీ, దీని వెనకాల ప్రతిరోజూ పరిశోధన ఉంటుంది. విద్యార్థులకుప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నిరంతర ప్రయత్నం ఉంటుంది.మందుల పనితీరుపై పరిశోధనలుకార్డియో, లివర్ చికిత్సలకు, నొప్పులకు వేసుకునే మందులు పేషంట్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి... అనే అంశంపై పీహెచ్డి స్టూడెంట్స్తో కలిసి పరిశోధన చేశాం. దేశవ్యాప్తం గా ఉన్న ఫార్మకాలజీ స్టూడెంట్స్కి ప్రతియేటా ట్రైనింగ్ ఇస్తుంటాం. పరిశోధనలు చేయడానికి అన్ని మెడికల్ కాలేజీలకు సరైన పరికరాలు ఉండకపోవచ్చు. అందుకని అందరికీ అర్ధమయ్యే విధంగా మా పరిశోధనల ఫలితాలు తీసుకువస్తున్నాం. పాతికేళ్ల ప్రయాణంఈ రంగంలో నా వర్క్ మొదలు పెట్టినప్పుడు ఏదీ సులువుగా లేదు. ఒక్కోసారి 15–18 గంటలు వర్క్లో ఉండాల్సిన రోజులు ఉన్నాయి. పనికి షార్ట్కట్స్ ఉండచ్చు, ఫలితాలకు మాత్రం షార్ట్ కట్స్ ఉండవు అనేది తెలుసుకున్నాను. ప్రతి నిమిషమూ విలువైనదేఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ, సవాళ్లు ఉంటేనే మరింత బాగా పనిచేయగలం. ప్రస్తుతం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్కు బ్లడ్ లెవల్స్లో మందుల వాడకం పైన వర్క్ చేస్తున్నాం. మన వర్క్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో ఒక ప్రణాళిక వేసుకుని, ఆపైన కృషి చేస్తూ పోతే మంచి గుర్తింపు వస్తుంది. మన వర్క్ని మనం బాగా ఇచ్చాం అనే సంతృప్తి కూడా దానికి తోడవుతుంది. నేర్చుకోవాలనే తపన ఏ వయసులోనైనా ఉండాలి’ అని వివరించారు ఉషారాణి. క్లినికల్ ఫార్మకాలజీలో డిఎమ్ అంటే ‘డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ లేదా డిఎమ్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ’ అని కూడా పిలుస్తారు. ఈ రంగంలో పేషంట్ కేర్ – రీసెర్చ్ డెవలప్మెంట్ లో చేసిన ఇన్నేళ్ల కృషికి ఫలితంగా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. ఐఎస్సిఆర్ ప్రెసిడెంట్ పురస్కారంతో పాటు క్లినికల్ రీసెర్చ్లో భాగంగా అవార్డులు, ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లలో పాల్గొనే అవకాశాలూ లభించాయి. – డాక్టర్ పింగళి ఉషారాణి – నిర్మలారెడ్డి -
సైయెంట్ మోహన్ రెడ్డికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మక లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారం లభించింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలకు ఆయన అందించిన సేవలకు గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) నుంచి గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్నారు. ఇటీవల లండన్లో జరిగిన ఐవోడీ వార్షిక సదస్సులో దీన్ని ప్రదానం చేశారు. మోహన్ రెడ్డి గతంలో నాస్కామ్ చైర్మన్గా వ్యవహరించారు. టీ–హబ్ ఫౌండింగ్ డైరెక్టర్లలో ఆయన ఒకరు కాగా, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ రూర్కీ గవర్నర్స్ బోర్డ్లకు చైర్మన్గా ఉన్నారు. కార్పొరేట్ రంగంలో అత్యుత్తమ ప్రమాణంగా గోల్డెన్ పీకాక్ అవార్డులకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. -
ఆగిన హరికథా గంగా ప్రవాహం
హరి కథలు చెప్పడమంటే మాటలు కాదు..అందుకు అద్భుతమైన సంగీత, పాండిత్య ప్రతిభ అవసరం. అది అందరికీ అబ్బే విద్య కాదు. ఈ తరంలో చాలా మందికి హరికథ అంటే తెలియదు. హరికథ అనేది తెలుగువారి సాంప్రదాయంలో ఓ భాగం. సంగీత, సాహిత్య నృత్య, అభినయాల సమ్మేళనమే ఈ హరికథ..ఈ విశిష్ట కళలో తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు కోట సచ్చిదానందశాస్త్రి. ఆయన కథ చెప్పే విధానం గంగా ప్రవాహంలా సాగిపోతుంది. తన అద్భుతమైన, అనర్గళమైన వాక్పటిమతో, శ్రావ్యమైన సంగీత, నాద, తాళ పాండిత్యంతో, శ్రోతలను రసమాధుర్యంలో ఓలలాడించే వారు ‘కోట’. ఆయన హరికథంటే జనం ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు... తండోపతండాలుగా వచ్చిన వారితో అక్కడ హౌస్ఫుల్... ఆ రోజు సినిమా థియేటర్లలో సెకండ్ షోకు జనం నిల్... చిన్న పిట్టకథలు, చతురోక్తులతో ‘కోట’ కథాగానం జనరంజకంగా సాగేది..మధూకరం చేసుకుంటూ వేదవిద్యను నేర్చుకుని, హరికథను సాధన చేసి, ప్రఖ్యాత హరికథకుడిగా ‘కోట’ ఎదిగారు. 7 దశాబ్దాల సుదీర్ఘ కథాగానంతో భారత ప్రభుత్వంచే ‘పద్మశ్రీ’ స్వీకరించారు. హరికథకు తొలిసారిగా పద్మశ్రీ అందించిన తొలి భాగవతార్గా కీర్తిని పొందారు. రామాయణ, భారత, భాగవతాలను గానం చేస్తూ విశేష ప్రాచుర్యం కల్పించారు. 7 దశాబ్దాలుగా దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చారు. శతాధిక కథావారసులను తీర్చిదిద్దారు. 8 పదుల వయసులోనూ కథాగానం చేస్తూ వచ్చారు. అలసిపోయిన ఆ గానం ఇక శాశ్వతంగా మూగబోయింది. తెనాలి: సచ్చిదానంద శాస్త్రి స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి. తల్లిదండ్రులు వెంకట శివయ్య, సుబ్బమ్మ. పురోహితుడైన తండ్రి దగ్గరే శాస్త్రి చిన్నతనంలో వేదవిద్య అభ్యసించారు. బ్రాహ్మణ కోడూరులో మధూకర వృత్తితో పమిడిమర్రు సుబ్బావధానులు దగ్గర వేద విద్య నేర్చారు. 14 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో అయిదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగబిడ్డల్లో పెద్దవాడైన సచ్చిదానందశాస్త్రిపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. బంధువర్గంలో కళాకారులు, హరికథకులు ఉండటంతో సహజంగానే ఆసక్తి కలిగిన శాస్త్రి..ఒకపక్క పౌరోహిత్యం చేస్తూనే..పరిమి సుబ్రహ్మణ్య భాగవతుల రచనలు చదివి స్వయంగా కథాగానం సాధన చేశారు. తర్వాత అదే జీవనాధారమైంది. విజయవాడలో ఓగిరాల గోపాలం, తణుకులో ముసునూరు సూర్యనారాయణమూర్తి భాగవతులు, తెనాలిలో భాగవతుల అన్నపూర్ణయ్య దగ్గర తన కథాగానాన్ని మెరుగుపరుచుకుంటూ, ప్రదర్శనలిస్తూ వచ్చారు. విజయనగరంలో ఏడేళ్లపాటు ఉండి ఆంధ్ర, ఒడిశా పరిసరాల్లో కథాగానం చేశారు.హరికథను జనరంజకం చేసిన కోట..57 ఏళ్ల క్రితం గుంటూరు చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. ఆసక్తి కలిగిన శిష్యులకు శిక్షణనిస్తూ వచ్చారు. చతురోక్తులు, సరస సంభాషణలతో ప్రేక్షకుల మనసు తనపై లగ్నమయ్యేవరకు కాలక్షేపం చేసి, కథాంశంతో హరికథను ఆరంభించేవారు. భక్తిరస సినిమా పాటలు, సున్నితమైన హాస్య సంభాషణలను చొప్పించటం, నృత్యాలు, అభినయం, నాటకీయతను చేర్చి హరికథను జనరంజకం చేశారు. ఈ ప్రత్యేకతతో వారికి ఎంతో డిమాండ్ ఏర్పడింది. ఒక్కరోజు విరామం లేకుండా హరికథలు చెప్పేవారు. బొత్తిగా చదువులేని వారికీ విద్య నేర్పారు. ఎలాంటి ప్రతిఫలం తీసుకోలేదు. వారంతా హరికథ వృత్తిగా స్థిరపడినవారే. ఆకాశవాణిలో ఆయన టాప్ ఏ గ్రేడ్ ఆరి్టస్టు. ముఖ్యమైన పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, లండన్, మారిషస్ వంటి దేశాల్లోనూ ప్రదర్శనలిచ్చారు. కంచిలోని పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి, శృంగేరీ పీఠాధిపతి, త్రిదండి చినజీయర్స్వామి, కుర్తాళం పీఠాధిపతుల సమక్షంలో కథాగానం చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య రంగా, నీలం సంజీవరెడ్డి, బ్రహా్మనందరెడ్డి, తెన్నేటి విశ్వనాథం వంటి ప్రముఖులు సచ్చిదానందశాస్త్రి కథాగానానికి పరవశులయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి వీణను బహూకరిస్తే, ఎస్పీ బాలు చేతులమీదుగా అభిమానులు స్వర్ణకంకణం తొడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ‘కళారత్న’తో గౌరవించింది. విజయనగరం మహారాజా కళాశాల శతజయంతి ఉత్సవాల్లో హరికథా పితామహ ఆది¿¶భట్ల నారాయణదాసు పురస్కారంతో సచ్చిదానందను సత్కరించారు. హరికథా త్రిమూర్తులుగా పేరొందిన ఆదిభట్ల నారాయణదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్, పరిమి సుబ్రహ్మణ్యం భాగవతులు ఆరాధన ఉత్సవాలను గత 26 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు సచ్చిదానందశాస్త్రి. కోట హరికథాగాన కళాపీఠం పేరుతో జరిపే ఆ ఉత్సవాల్లో 25–30 ప్రోగ్రాములు, ప్రతిరోజూ అన్నదానం, ఏడు పదులు పైబడిన హరికథకులను సత్కరిస్తూ వస్తున్నారు. ‘హరికథ సజీవకళ. దీనిని ఉద్ధరించాలి’ అనేది సచ్చిదానందశాస్త్రి ఆశయం. ‘ఆదిభట్ల’తో సహా ఏ ఒక్క హరికథకుడిì కీ దక్కని పద్మశ్రీ గౌరవం తనకు దక్కటం అదృష్టమని చెప్పారు. ప్రతి దేవస్ధానంలో ఒక హరికథకుడిని నిర్ణయించటం, సంప్రదాయ కళారూపాల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగితే కళలు పదికాలాలపాటు నిలిచి ఉంటాయని చెప్పేవారు..గుంటూరులోసచ్చిదానందశాస్త్రి తుదిశ్వాసనగరంపాలెం: ప్రముఖ హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి (90) కన్నుమూశారు. వృద్ధాప్యంతో బాధపడుతోన్న ఆయన సోమవారం రాత్రి గుంటూరు అమరావతిరోడ్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సీతాదేవి, కుమారులు శివశాస్త్రి, శ్రీరామచంద్రమూర్తి, కృష్ణ మోహన్, కుమార్తె దుర్గవెంకటసుబ్బలక్ష్మీ ఉన్నారు. ఆయన భార్య గతంలోనే చనిపోయారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలను గుంటూరు బొంగరాల బీడు శ్మశానవాటికలో నిర్వహించినట్లు పెద్ద కుమారుడు శివశాస్త్రి తెలిపారు. సచ్చిదానందశాస్త్రి గతేడాది జనవరిలో పద్మశ్రీ అవార్డు, 2022లో సంగీతనాటక అకాడమి అవార్డు, 2023 నవంబర్లో వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2015లో హంసా పురస్కారం, 2009లో కొప్పరపు కవుల పురస్కారాలను అందుకున్నారు. -
ప్రియా సిస్టర్స్కు జీవన సాఫల్య పురస్కారం...
ప్రముఖ సంగీత విద్వాంసులు, ప్రియా సిస్టర్స్గా పేరొందిన అక్కాచెల్లెళ్లు హరిప్రియా, షణ్ముఖప్రియలకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేస్తున్నారు. శ్రీ వాసవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, కె.రోశయ్య 91వ జయంతి సందర్భంగా నగరంలోని రవీంద్రభారతిలో సాయంత్రం 5.45గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగనుంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. -
గుర్నానీకి హైసియా పురస్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ మహీంద్రా మాజీ సీఈవో, ఎండీ సి.పి.గుర్నానీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. హైసియా 31వ జాతీయ సదస్సు, అవార్డుల కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో జరిగింది. 2022–23 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో మొత్తం 36 కంపెనీలు, వ్యక్తులు హైసియా అవార్డులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. 1983లో భారత్ నెగ్గిన తొలి వన్డే ప్రపంచకప్ విజేత సభ్యుడైన రవిశాస్త్రి అంతర్జాతీయ కెరీర్ అనంతరం టీవీ వ్యాఖ్యతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. తదనంతరం భారత పురుషుల టీమ్ డైరెక్టర్గా, హెడ్ కోచ్గా విజయవంతమయ్యారు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో జట్టును మరో దశకు తీసుకెళ్లారు. ఓ ఆటగాడిగా, కోచ్గా రవిశాస్త్రి దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన బీసీసీఐ 2019–20 సీజన్కుగాను ‘సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్’ (జీవిత సాఫల్య) అవార్డుతో సత్కరించింది. ఆయనతో పాటు ఫరూఖ్ ఇంజినీర్కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. పురుషుల విభాగంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లకు ఇచ్చే ‘పాలీ ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల్ని 2019–20 సీజన్కుగాను షమీ, అశి్వన్ (2020–21), జస్ప్రీత్ బుమ్రా (2021–22), శుబ్మన్ గిల్ (2022–23) అందుకున్నారు. మహిళల కేటగిరీలో బెస్ట్ క్రికెటర్ అవార్డుల్ని దీప్తి శర్మ (2019–20, 2022–23), స్మృతి మంధాన (2020–21, 2021–22) గెలుచుకున్నారు. ఓపెనింగ్లో చిచ్చర పిడుగల్లే రాణిస్తున్న యశస్వి జైస్వాల్ 2022–23 సీజన్కు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు చేజిక్కించుకున్నాడు. ఈ విభాగంలో మయాంక్ అగర్వాల్ (2019, 20), అక్షర్ పటేల్ (2020–21), శ్రేయస్ అయ్యర్ (2021–22)లకు అవార్దులు దక్కాయి. కరోనా మహమ్మారి వల్ల 2019–20, 2020–21, 2021–22, 2022–23 సీజన్లలో బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం చేయలేకపోయారు. దీంతో మంగళవారం ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన వేడుకలో నాలుగు సీజన్లకు సంబంధించిన పురుషులు, మహిళల, దేశవాళీ క్రికెటర్లకు అవార్డుల్ని ఒకేసారి ప్రదానం చేశారు. -
నీ కోసం కథలు రాసి
‘ఇంటి మూలన వంట గది’ ‘అడవిలో హరిణి’ ‘సంధ్య వెలుతురు’... సి.ఎస్.లక్ష్మి అనే చిత్తూరు సుబ్రహ్మణ్యం లక్ష్మి కథల సంపుటాల పేర్లు ఇవి. ‘అంబై’ కలం పేరుతో తమిళంలో స్త్రీల పారంపరిక బంధనాలను ప్రశ్నించే కథలు రాస్తున్న సి.ఎస్.లక్ష్మికి ప్రతిష్టాత్మక ‘టాటా లిటరేచర్ లైఫ్టైమ్ అవార్డు’ ఈ సంవత్సరానికి ప్రకటించారు. ‘స్పారో’ అనే సంస్థను స్థాపించి మహిళా సాహిత్యకారుల చరిత్రను నిక్షిప్తం చేస్తున్న లక్ష్మి పరిచయం... ఆలోచనలు... ‘నన్ను మహిళా రచయిత అని ప్రత్యేకంగా పిలవొద్దు. పురుషులు ఏం రాసినా వారిని పురుష రచయిత అంటున్నారా? మమ్మల్ని మాత్రం మహిళా రచయితలు అనడం ఎందుకు? మమ్మల్ని కూడా రచయితలు అనే పిలవండి’ అంటారు సి.ఎస్.లక్ష్మి. ‘అంబై’ కలం పేరుతో తమిళ పాఠకులకు సుదీర్ఘకాలంగా అభిమాన రచయిత్రిగా ఉన్న సి.ఎస్.లక్ష్మి ఒకటీ రెండు నవలలు రాసినా ఎక్కువగా అంకితమైంది కథలకే. అదీ స్త్రీల కథలకి. తమిళంలో స్త్రీవాద దృక్పథంతో రాసి ఒక కదలిక తేగలిగిన రచయితల్లో సి.ఎస్.లక్ష్మి ప్రముఖులు. సుదీర్ఘ కాలంగా తాను ఆశించిన స్త్రీ వికాసం కోసం కలాన్ని అంకితం చేయడం వల్లే ఆమెకు ‘టాటా లిటరేచర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ 2023 సంవత్సరానికి ప్రకటించారు. టాటా సన్స్ ప్రతినిధి హరీష్ భట్ ఈ విషయాన్ని తెలియచేస్తూ ‘స్త్రీలు తాము మోయక తప్పని మూసలను లక్ష్మి తన కథల ద్వారా బద్దలు కొడుతూనే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో అందుకున్న వారిలో వి.ఎస్.నైపాల్, మహాశ్వేతా దేవి, రస్కిన్ బాండ్, గిరిష్ కర్నాడ్ తదితరులు ఉన్నారు. ఊరు కోయంబత్తూరు కోయంబత్తూరులో జన్మించిన అంబై ఢిల్లీలోని జె.ఎన్.యు నుంచి పిహెచ్.డి పట్టా పొందారు. తమిళనాడులో అధ్యాపకురాలిగా పని చేస్తూ కథలు రాశారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ విష్ణు మాథూర్ని వివాహం చేసుకుని తర్వాతి కాలంలో ముంబైలో స్థిరపడ్డారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పిల్లల కోసం ‘నందిమలై చరలిలె’ (నందిమల కొండల్లో) అనే డిటెక్టివ్ నవలతో ఆమె రచనా జీవితం మొదలైనా 1967లో రాసిన ‘సిరగుగల్ మురియుమ్’(రెక్కలు విరిగిపోతాయి) అనే కథతో సిసలైన బాట పట్టారు. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీవాద దృక్పథం గురించి తమిళంలో తొలిసారి గొంతు విప్పిన రచయిత్రి ఆమేనని విమర్శకులు అంటారు. సంప్రదాయం, ఆచారాలు మహిళల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అణచివేస్తున్నాయో ఆమె తన కథల్లో వివరించే ప్రయత్నం చేశారు. తప్పక చదవాల్సిన తమిళ కథల్లో అంబై రాసిన ‘వీట్టిన్ మూలై ఒరు సమేలరై’, ‘అమ్మా ఒరు కొలై సెయ్దల్’, ‘కరుప్పు కుదిరై చతుక్కుమ్’ కథలు ఉంటాయని రచయిత జయమోహన్ పేర్కొన్నారు. 2021లో అంబైకు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. కలం పేరు వెనుక కథ తన కలం పేరు ‘అంబై’గా మార్చుకోవడానికి వెనకున్న కథను గతంలో వెల్లడించారామె. శుక్రవారం పుట్టే ఆడపిల్లలకు ‘లక్ష్మి’ అనే పేరు పెడతారని, తనకూ అదే పేరు పెడితే ఆ పేరుతోనే కథలు రాయాలపించలేదని చెప్పారు. తమిళ సీనియర్ రచయిత దేవన్ రాసిన ‘పార్వతిన్ సంగల్పం (పార్వతి సంకల్పం)’ నవలలో భర్త చేత అణచివేతకు గురైన ఓ భార్య తన పేరును అంబైగా మార్చుకొని రాయడం మొదలు పెడుతుందని, అదే తనకు స్ఫూర్తినిచ్చి కలం పేరును అంబైగా మార్చుకున్నానని తెలిపారు. సాహితీ కార్యకర్త సి.ఎస్.లక్ష్మి కేవలం రాయడమే కాదు చాలా సాహితీ కార్యక్రమాలు చేస్తారు. తమిళంలో మహిళా సాహిత్యం గురించి ఆమె చేసిన పరిశోధన ముఖ్యమైనది. 1994లో చెన్నైలో స్థాపించిన రోజ ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీ ఏర్పాటు వెనుక అంబై కీలకంగా నిలిచారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు లైబ్రరీల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ మూడు లక్షల పుస్తకాల దాకా ఉన్నాయి. అలాగే 1988లో SPARROW (Sound and Picture Archives for Research on Women) అనే ఎన్జీవో ప్రారంభించారు. మహిళా రచయితలు, మహిళా కళాకారుల రచనలు, ప్రతిభ, వారి కృషిని డాక్యుమెంట్ చేయడం, నిక్షిప్తం చేయడం ఆ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఆమె ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. తన సంస్థ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు. -
బిజినెస్ లీడర్ 'అట్లూరి'కి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
అమెరికాలోని భారతీయ తెలుగు కమ్యూనిటీ వ్యాపార ప్రముఖులలో ఒకరైన 'అట్లూరి'కి ఇండియా స్టార్టప్ ఫెస్ట్-2023 (ఐఎస్ఎఫ్ 2023) ఈవెంట్లో 'లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు' లభించింది. దశాబ్దాలుగా వ్యాపార ఆలోచనలతో అనేక ఔత్సాహిక స్టార్టప్ ఆలోచనలకు వేదికగా పనిచేసిన CXO ఫోరమ్ రూపశిల్పిగా ఉన్నందుకు ఈ అవార్డును అందుకున్నట్లు సమాచారం. స్టార్టప్లలో చాలా మంది ఒకే విధమైన ఆలోచనను కలిగి ఉంటారు. కానీ కొత్త సాంకేతికతలు, మార్కెట్ పోకడలను అవలంబించడం ద్వారా వారు అభివృద్ధి చెందాలని అట్లూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ సూరంపూడి (ఐటీసీ లిమిటెడ్లోని అగ్రి & ఐటీ బిజినెస్ గ్రూప్ హెడ్), డా.డి నాగేశ్వర్ రెడ్డి (ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ & ఏఐజీ హాస్పిటల్స్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ & చీఫ్), వినీత్ రాయ్ (ఆవిష్కార్ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్) డా.గల్లా రామచంద్ర నాయుడు (అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్), డా.పి రాజ మోహన్ రావు (యునైటెడ్ టెలికామ్స్ గ్రూప్ చైర్మన్) మొదలైన వారికి కూడా అవార్డులు అందించినట్లు సమాచారం. -
పర్యావరణ విధ్వంసంతోనే వాతావరణ మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్యంసం కారణంగానే వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా అతి తక్కువ సమయంలో భారీ వర్షాలు, తీవ్రమైన తుపానులు వంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటి నుంచి రేయింబవళ్లు యుద్ధప్రాతిపదికన శ్రమిస్తే తప్ప పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేని పరిస్థితి ఉందని... తక్షణమే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరగాలని పురుషోత్తమ్రెడ్డి సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేపిటల్ ఫౌండేషన్ సంస్థ ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ను అందించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సీవీ ఆనందబోస్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి, జస్టిస్ ఏకే పట్నాయక్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తంరెడ్డితో పాటు సామాజికంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ్రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి రంగంలో గత 50 ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. మన దేశంలో పర్యావరణ చట్టాలు బాగున్నప్పటికీ... వాటి అమలు మాత్రం సరిగా జరగడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తున్నాయని.. ఇసుక వంటి ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాల్సింది స్థానిక యంత్రాంగాలేనని తెలిపారు. భారత్లో అంతులేని సౌరశక్తి ఉందని, దానిని ఉపయోగించుకోవడం ద్వారా సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. -
కమల్ హాసన్ ఖాతాలో మరో అరుదైన అవార్డు
నటుడు కమల్హాసన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నటుడు నిర్మాత దర్శకుడు గాయకుడు రచయిత ఇలా పలు ముఖాలు కలిగిన అరుదైన కళాకారుడు కమలహాసన్. తమిళం తెలుగు మలయాళం హిందీ వంటి పలు భాషల్లో కథానాయకుడిగా విజయాలను సాధించిన నటుడు ఈయన. అంతేకాకుండా పలు సరికొత్త విషయాలను సినిమాకు పరిచయం చేసిన ఘనత కూడా కమలహాసన్కే చెందుతుంది. (చదవండి: విడిపోవద్దురా అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న కోటి) పలు భాషల్లో ఇప్పటికే 232 చిత్రాల్లో నటించిన కమలహాసన్ ఇటీవల తన సొంత బ్యానర్లో నిర్మించి కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఇండియన్– 2 ఈయనకు 233వ చిత్రం అవుతుంది. తదుపరి తన 234 చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక నిర్మాతగాను నటుడు ధనుష్, శింబు, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈయన ఇప్పటికే పలు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత అవార్డులతో సత్కరించింది. కాగా తాజాగా ఈ విశ్వనటుడు విశ్వ వేదికపై జీవిత సాఫల్య అవార్డును అందుకోబోతున్నారు. ఈ నెల 27వ తేదీన అబుదాబిలో జరగనున్న అంతర్జాతీయ భారతీ య చలనచిత్రోత్సవ వేడుకల్లో కమల్కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడం గమనార్హం. -
చరిత్ర సృష్టించబోతున్న సంగీత దర్శకుడు కోటి
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి పర దేశ (ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్) పార్లమెంట్లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించబోతోంది. అది మరెవరికో కాదు, మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటికి! కోటి తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. అంతే కాకుండా కోటి అక్కడ ఉన్న మన తెలుగు గాయనితో ఒక పాట కూడా పాడించబోతున్నారు. ఆ గాయని మరెవరో కాదు, తన మొదటి పాటతోనే ఆసియా రికార్డు పుస్తకంలో స్థానం దక్కించుకున్న మన తెలుగింటి ఆడపడుచు సుస్మిత రాజేష్. హరుడే వరుడై, హర హర శంభో తర్వాత మరో వినూత్నమైన పాటతో, కొత్త కలయికతో మన ముందుకు వస్తున్నారు సుస్మిత. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని AISECS అడ్వైజర్ రాజేష్ ఉప్పల మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెంపొందించడానికి దోహదపడతాయన్నారు. 4 వేల పాటల మైలురాయిని దాటిన కోటిని ఆస్ట్రేలియాలోని పార్లమెంట్లో గెస్ట్ ఆఫ్ హానర్గా పిలవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. చదవండి: పెళ్లికి ముందు, నాకూ, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు: ప్రియాంక చోప్రా -
ఆస్ట్రేలియాలో సంగీత దర్శకుడు కోటికి గౌరవ పురస్కారం
-
Artist Vijaya Lakshmi: సంకల్పానికి చిత్రరూపం
ఆమె చిత్రలేఖనంలో మనకు కనిపించేది ఒక రూపం కాదు... అనేకం. బుద్ధుడి బొమ్మలో కేవలం బుద్ధుడు మాత్రమే కాదు... బ్రష్ పట్టుకుని... తదేక దీక్షతో బుద్ధుడి బొమ్మ వేస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంటుంది. రవివర్మ కుంచెకు అందిన అందం... విజయలక్ష్మి చిత్రాల్లో ద్యోతకమవుతుంది. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా, శామిర్ పేట మండలంలో ఉంది తుర్కపల్లి. ఆ ఊరిలో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. కళారత్న, అబ్దుల్ కలామ్ అవార్డులతోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు, ప్రశంసలు ఆమె సొంతమయ్యాయి. తన రంగుల ప్రస్థానాన్ని, ఒక చిత్రంలో లెక్కకు మించిన వివరాలను పొందుపరచడంలో తన అభిరుచిని, బొమ్మల పట్ల తన ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారు విజయలక్ష్మి. అసాధారణమైన ప్రతిభ ‘‘నా జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రవేశించాయో స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నా దృష్టిని ఆకర్షించిన దృశ్యాలకు చిత్రరూపం ఇవ్వడం నా బాల్యంలోనే మొదలైంది. నన్ను స్కూల్కి మా అన్న తీసుకు వెళ్లి, తీసుకువచ్చేవాడు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలే నా లోకం. అందులోని బొమ్మలే నా స్నేహితులు. అందరి పిల్లల్లా ఆడుకోవడం నాకు కుదరదు కదా. అందుకే చదువుకుంటూ, బొమ్మలేసుకుంటూ పెరిగాను. టెన్త్క్లాస్ తర్వాత కాలేజ్కెళ్లడం కష్టమైంది. కొన్నేళ్ల విరామంలో సైకాలజీ, ప్రముఖుల బయోగ్రఫీలు, భగవద్గీత... అదీ ఇదీ అనే తేడా లేకుండా నాకు దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేశాను. చదివేకొద్దీ నా ఆలోచన పరిధి విస్తృతం కాసాగింది. నా గురించి నేను ఆలోచించడమూ ఎక్కువైంది. ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రత్యేకతలతోనే గుర్తిస్తారు. ఇతర లోపాలున్నా సరే అవి తొలుత గుర్తుకురావు. నాకు ఎడమ చెయ్యి మాత్రమే మామూలుగా పని చేస్తుంది. రెండు కాళ్లు, కుడి చెయ్యి చిన్నప్పుడే పోలియో భూతం బారిన పడ్డాయి. నా పేరు విన్న వెంటనే కాన్వాస్ మీద అద్భుతాలు సృష్టించగలిగిన ఒక చిత్రకారిణి గుర్తుకురావాలి. సమాజం ఒక సాధారణ వ్యక్తిని సాధారణంగానే గుర్తిస్తుంది. ఒక నైపుణ్యమో, వైకల్యమో ఉన్నప్పుడు వ్యక్తిగా గుర్తించడానికంటే ముందు నైపుణ్యం, వైకల్యాలతోనే పరిగణనలోకి తీసుకుంటుంది. పోలియో బాధితురాలిగా ఐడెంటిఫై కావడం కంటే విజయలక్ష్మి అంటే చిత్రలేఖనం గుర్తుకు వచ్చేటంతగా రాణించాలనుకున్నాను. అందుకోసమే అహర్నిశలూ శ్రమించాను. నేను చూసిన దృశ్యాల నుంచి నా బొమ్మల పరిధిని విస్తరించాను. నేను చదివిన పుస్తకాల నుంచి ఇతివృత్తాలను రూపుదిద్దుకున్నాను. అన్నింటికీ మించి రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందాను. రవీంద్రభారతిలో పురస్కారాలు చిత్రకారిణిగా గుర్తింపు రావడమే కాదు, పురస్కారాలను రవీంద్రభారతిలో అందుకోగలిగాను. రవీంద్రభారతిలో అందుకోవడం కూడా ఒక పురస్కారంగానే భావిస్తాను. 2019లో నా చిత్రాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, సాలార్జంగ్ మ్యూజియంతోపాటు ఢిల్లీలోనూ ప్రదర్శితమయ్యాయి. మనలో ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, సంకల్పబలం ఉంటే భగవంతుడు అవకాశం ఇచ్చి తీరుతాడని నమ్ముతాను. ఓ సంస్థ నా అవసరాన్ని గుర్తించి డెబ్బై వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వీల్చైర్ విరాళంగా ఇచ్చింది. అది కూడా భగవంతుడు పంపినట్లే. స్ఫూర్తిప్రదాతగా... నేను రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందితే, నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్న కొత్తతరం ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చదువుకున్న స్కూల్లో నా బొమ్మలను ప్రదర్శించినప్పుడు నాకా సంగతి తెలిసింది. జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదు, స్ఫూర్తిమంతంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్ మీడియాను నూటికి నూరుశాతం వినియోగించుకున్నాననే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగానే ఇన్ఫ్లూయెన్సర్ని కాగలిగాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తం కోసం ఏడాదికి మూడుసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మా ఊరి కుర్రాళ్లు ‘ఏం చేయాలో చెప్పక్కా, మేము చేసి పెడతాం’ అని ఉత్సాహంగా సహాయం చేస్తున్నారు. ‘వీల్చైర్ నుంచి నేను ఇన్ని చేస్తుంటే హాయిగా నడవగలిగిన వాళ్లు ఎందుకు చేయలేరు. స్థిరచిత్తం ఉంటే ఏదైనా సాధ్యమే’నని వీడియోల్లో చెబుతుంటాను’’ అని సంతోషంగా తన బొమ్మలలోకాన్ని వివరించింది విజయలక్ష్మి. బుద్ధుడి వెనుక యువతి విజయలక్ష్మి చిత్రలేఖనంలో ఉన్న అమ్మాయి అచ్చమైన తెలుగుదనంతో ఒత్తైన జడ వేసుకుని ఉంటుంది. ఆ జడను అలంకరించి పూలు కూడా అచ్చం పూలను పోలినట్లే తెల్లటి పువ్వులో పసుపువర్ణంలో పువ్వు మధ్యభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెవి జుంకీలకున్న నగిషీలు కూడా. అలాగే మరో చిత్రలేఖనం ఇంకా అద్భుతం... మన దృష్టి అభయ ముద్రలో ఉన్న బుద్ధుడి మీద కేంద్రీకృతమవుతుంది. బుద్ధుని పాదాల వద్దనున్న కమలం మీద, బుద్ధుడి శిఖ, శిఖ వెనుకనున్న కాంతివలయాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత మన దృష్టికి వస్తుందో అద్భుతం. ఆ బుద్ధుడి బొమ్మ ఉన్నది కేవలం కాన్వాస్ మీద కాదు. ఒక యువతి వీపు మీద. అటువైపు తిరిగి కూర్చుని ఉన్న యువతిని చిత్రీకరించిన తర్వాత ఆమె వీపు మీద చూపరులకు అభిముఖంగా ఉన్న బుద్ధుడిని చిత్రించింది విజయలక్ష్మి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పుప్పాల శ్రీనివాస్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృతమైన సేవలందిస్తున్న రహదారి భద్రతా నిపుణుడు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. శనివారం అహ్మదాబాద్లో జరిగిన ఓహెచ్ఎస్ఎస్ఏఐ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆరోగ్యం, భద్రత, పర్యావరణం, సుస్థిరత అంశాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రహదారి భద్రతపై విస్తృతంగా పని చేయడంతో పాటు, పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని రోడ్డు భద్రతపై పరిశోధన పత్రాలను అందజేసినందుకుగాను పుప్పాల శ్రీనివాస్కు ఈ పురస్కారం దక్కింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో పుప్పాల చేస్తున్న సేవలు అభినందనీయమని, దేశంలో రహదారిభద్రతా ఉద్యమానికి ఎంతో దోహదం చేశాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. -
ఏపీ ముఖ్యమంత్రి జగన్గారికి కృతజ్ఞతలు
‘‘కళారంగంలో శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవిత సాఫల్య పురస్కారం కె. విశ్వనాథ్గారితో పాటు నాకూ దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి «కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ప్రముఖ దర్శక– నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలపై ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి సినిమాలు తీస్తున్న నన్ను పీపుల్స్స్టార్ అని ప్రజలు అభిమానిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. -
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్–2022’ అత్యున్నత పురస్కారాల కోసం వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన హైపవర్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారం విజయవాడలో సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడి కృష్ణమోహన్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు రేవు ముత్యాలరాజు, అనూరాధ రాజారత్నం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్కుమార్రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా విజయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత భారతరత్న, పద్మశ్రీ తదితర పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోందన్నారు. అవార్డు ఎంపిక కోసం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళాభ్యు దయం, సామాజిక న్యాయం, దేశ–విదేశాల్లో గుర్తింపు పొందిన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి∙దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, వారి బయోడేటాను secy&political@ap.gov.in కు మెయిల్ చేయాలని తెలిపారు. గతేడాది 59 మందిని సత్కరించినట్లు గుర్తుచేశారు. ఇక వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఇస్తారన్నారు. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందిస్తారని తెలిపారు. -
సీఐడీ అదనపు డీజీ సునీల్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ‘సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సీఆర్సీఐడీఎఫ్) రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్కుమార్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును, ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికకు సైబర్ స్టార్ అవార్డులను ప్రకటించాయి. ఐఎస్ఈఏ, సీపీఎఫ్, ఐజీఎం, ఫ్రో డిస్కవర్, పీఎస్ఎం సంస్థలతో కలసి సీఆర్సీఐడీఎఫ్ ‘ఉత్తమ సైబర్ విధానాలు’ అనే అంశంపై మూడో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. వర్చువల్ విధానంలో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్కుమార్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. సైబర్ పోలీసింగ్, సైబర్ నేరాల పరిష్కారంలో వినూత్న విధానాలను ప్రవేశపెట్టినందుకు 2021కు గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు సీఆర్సీఐడీఎఫ్ తెలిపింది. సైబర్ నేరాల కట్టడి కోసం తగిన రీతిలో వ్యవస్థను బలోపేతం చేసినందుకు సీఐడీ విభాగం ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికను ‘సైబర్ స్టార్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలను ఈ జాతీయ సదస్సులో వక్తలు ప్రశంసించారు. దేశంలో అత్యధికంగా సైబర్ సేఫ్ లాగిన్స్ను తయారు చేసిన ఘనత ఏపీ సీఐడీ విభాగానిదేనని పేర్కొన్నారు. సైబర్ బుల్లీషీట్స్, 4ఎస్4యు పోర్టల్, ఫ్యాక్ట్ చెక్, యూట్యూబ్ వెబినార్స్ మొదలైన వినూత్న విధానాలను పీవీ సునీల్కుమార్ ప్రవేశపెట్టారు. వాటిని సైబర్ క్రైమ్స్ విభాగం సమర్థంగా నిర్వహిస్తూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తోంది. రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలు, వ్యూహాలను సీఆర్సీఐడీఎఫ్ ప్రత్యేకంగా ప్రశంసించింది. -
YSR Awards: సేవలకు సత్కారం
‘సామాన్యుల్లా కనిపించే అసామాన్యుల సేవలకు వందనం.. వెలకట్టలేని మీ ప్రతిభకు సలాం చేస్తూ వైఎస్సార్ అవార్డులు ప్రకటించాం. ఎందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు, సంస్థలను పురస్కారాలతో సత్కరిస్తున్నాం. తెలుగువారికి, రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచిన సంస్కృతి, కళలకు అవార్డుల్లో పెద్దపీట వేశాం..’ – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక నుంచి ఏటా నవంబర్ 1వ తేదీన వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్ , సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అనంతరం 2021 సంవత్సరానికిగాను 29 వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 30 వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు కలిపి మొత్తం 59 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వైఎస్సార్ అవార్డులను నెలకొల్పడం వెనుక ఉద్దేశం, ఎంపికలో పాటించిన పారదర్శకత, అవార్డు గ్రహీతల గొప్పతనం గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వివరించారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. పద్మ అవార్డుల తరహాలో... కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో సేవలందించిన గొప్పవారిని దేశంలో అత్యున్నత అవార్డులైన భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ తదితర అవార్డులతో సత్కరిస్తోంది. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే చేపట్టి రాష్ట్రం తరపున అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించిన నేపథ్యంలో వైఎస్సార్ అవార్డులను నెలకొల్పాం. మహామనిషి పేరుతో అత్యున్నత పురస్కారాలు మహానేత, నాన్న వైఎస్సార్ పేరు చెబితే అందరికీ ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచెకట్టులో కనిపిస్తుంది. తన ప్రతి అడుగులోనూ వ్యవసాయం మీద మమకారం కనిపిస్తుంది. పల్లెలు, పేదల మీద అభిమానం తనను చూడగానే గోచరిస్తాయి. ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం, అందరినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన.. ఇవన్నీ నాన్నను చూడగానే గుర్తొచ్చే విషయాలు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా.. అంత గొప్పవాడు, మహానుభావుడి పేరుమీద రాష్ట్ర స్ధాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను వైఎస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల పేరుతో ప్రకటించాం. లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రకటించిన వారికి రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. పారదర్శకంగా ఎంపిక ఈ రోజు గర్వంగా ఇంకో విషయం చెబుతున్నా. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం దగ్గరనుంచి ప్రతి సంక్షేమ పథకాన్నీ పేదలకు అత్యంత పారదర్శకంగా ఇవ్వగలిగే వ్యవస్ధని తెచ్చాం. ఈ అవార్డుల ఎంపికలో కూడా కులం, మతం, ప్రాంతం చూడలేదు. పార్టీలు, రాజకీయ భావాలను కూడా చూడలేదు. మనిషిని మనిషిగానే చూశాం. విభేదించే భావాలున్నా మనుషుల్లో కూడా మహామనుషులను చూశాం. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పారదర్శకంగా అవార్డులను ఇస్తున్నాం. ఎందరో మహానుభావులు... మన తెలుగు సంస్కృతి, కళలు, మానవతామూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులుగా వీటిని భావిస్తున్నాం. ఎందరెందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు ఇస్తున్నాం. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్లైన కళలు, సంస్కృతికి ఈ అవార్డుల్లో పెద్దపీట వేశాం. ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్థల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర చిత్రకళకు, వీధి నాటకానికి, హరికథకు, బుర్రకథకు, వెంకటగిరి జాంధానీ చీరకు, మనదైన కలంకారీకి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికీ, మనదైన కూచిపూడికి ఇస్తున్న అవార్డులు ఇవి. వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్ఎన్ ఛారిటీస్, సీపీ బ్రౌన్ లైబ్రరీ, వేటపాలెం గ్రంథాలయం, ఆర్డీటీ సంస్థ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్.. ఇలాంటి గొప్ప సంస్థలు చేస్తున్న సేవలకు ఇస్తున్న అవార్డులు ఇవి. పండించే రైతన్నకు మనదైన వ్యవసాయానికి, ఉద్యానవన ఉద్యమానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న విప్లవానికి ఇస్తున్న అవార్డులు ఇవి. కలం యోధులైన కవులకు, స్త్రీవాద ఉద్యమానికి, సామాజిక స్పృహను మేల్కొల్పడంలో మేరుపర్వత సమానులైన రచయితలకు, విశ్లేషక పాత్రికేయులకు ఇస్తున్న అవార్డులు ఇవి. కోవిడ్ సమయంలో అయినవారే దగ్గరకు రాని పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో అన్నీ తామై వారాలు, నెలలు పాటు కుటుంబాలకు దూరమై ప్రాణాలకు తెగించి అసామాన్యమైన సేవలందించిన మానవతామూర్తులకు ఈ అవార్డులు ఇస్తున్నాం. మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీవాడిగా తెలుగుజాతి మాణిక్యాలను, మకుటాలను, మహానుభావుల్ని ఈ రకంగా సత్కరించడాన్ని దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. విశిష్ట సేవలు.. ప్రతిభకు గుర్తింపు – గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేయడం సంతోషదాయకమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులు, పేదల కోసం విశేషంగా కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆ మహానేత మహోన్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన పేరిట ఏటా అవార్డులను అందించాలన్న నిర్ణయం సామాజిక, కళ, సాంస్కృతిక రంగాలకు ప్రోత్సాహానిస్తుందని చెప్పారు. సామాజిక, సేవా, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేస్తూ కూడా ఎలాంటి గుర్తింపునకు నోచుకోనివారిని ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఓ మంచి ఒరవడిని సృష్టించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అవార్డులకు ఎంపిక చేయడం ముదావహమన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో ఏర్పడ్డ రాష్ట్ర అవతవరణ దినోత్సవం రోజు ఏటా వైఎస్సార్ అవార్డులను ఇవ్వడం సముచిత నిర్ణయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిది సంస్థలకు పురస్కారం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల్లో 9 సంస్థలు ఉండగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారు 11 మంది ఉన్నారు. కళలు, సంస్కృతి రంగాల నుంచి 20 మంది, సాహిత్యరంగంలో ఏడుగురు, పాత్రికేయ రంగానికి చెందినవారు ఆరుగురు, కోవిడ్ సేవలు అందించిన ఆరుగురు ప్రభుత్వ వైద్యాధికారులు/సిబ్బంది అవార్డులకు ఎంపికయ్యారు. మరణించిన ఐదుగురు అవార్డు గ్రహీతల తరపున వారి కుటుంబ సభ్యులు అవార్డులను స్వీకరించారు. అనివార్య కారణాలతో పాత్రికేయ దిగ్గజం ఏబీకే ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో తరువాత ప్రత్యేకంగా అవార్డు అందించాలని నిర్ణయించారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా తరపున ఆమె కుమార్తె అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ఆదిమూలపు సురేశ్, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎం.శంకర్ నారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తానేటి వనిత, జి.జయరాం, ప్రభుత్వ కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు, వైఎస్సార్ అవార్డుల కమిటీ కన్వీనర్ జీవీడీ కృష్ణమోహన్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రశంసలందుకున్న సీఎం జగన్ వినమ్రత వీల్ చెయిర్లో ఉన్న కత్తి పద్మారావు నిలుచునేందుకు సహాయం చేస్తున్న సీఎం జగన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తరచూ చెప్పే మాటను సీఎం వైఎస్ జగన్ ఆచరణలో మరోసారి నిరూపించారు. ముఖ్యమంత్రి అనే భేషజం, హోదాను ఏమాత్రం ప్రదర్శించకుండా తన వినమ్రతను చాటుకున్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘వైఎస్సార్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ వేదికపై సాక్షాత్కరించిన ఆ దృశ్యం అందరి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అభ్యుదయ కవి కత్తి పద్మారావు ఇటీవల అనారోగ్యం బారినపడటంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వీల్ చెయిర్లో వచ్చారు. సహాయకులు ఆయన్ను వీల్ చెయిర్లో వేదిక మీదకు తీసుకొస్తున్న దృశ్యాన్ని దూరం నుంచి చూడగానే సీఎం జగన్ లేచి ముందుకు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. వీల్ చెయిర్ ఫుట్ రెస్ట్ మీద ఉన్న కత్తి పద్మారావు కాలును సీఎం జగన్ స్వయంగా పట్టుకుని ఫుట్ రెస్ట్ నుంచి పక్కకు జరిపి నేలపై ఉంచారు. ఆయన చేతులు పట్టుకుని నిల్చునేందుకు ఆసరా అందించారు. వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసిన తరువాత కత్తి పద్మారావు తిరిగి వీల్ చెయిర్లో కూర్చునేందుకు సాయం చేశారు. ఆయన కాళ్లను వీల్ చెయిర్ ఫుట్ రెస్ట్ మీద ఉంచి సరి చేశారు. కత్తి పద్మారావుపట్ల గౌరవంతో, వాత్సల్యంతో ముఖ్యమంత్రి స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో క్లిప్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
‘వైఎస్సార్’ అవార్డు గ్రహీతల స్పందన..
రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు పొందిన ప్రముఖుల అభిప్రాయాలు.. సీఎం అభినందనీయులు కళాకారులు, వృత్తి నైపుణ్య తదితర రంగాల వారిని ఎంపిక చేయటం గొప్ప విషయం. ఇన్ని రంగాలవారికి పురస్కారాలు అందించటం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రథమం. 1వ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు పాఠ్యాంశాల రూపకల్పన, భాషా పరిశోధన, సామాజిక రంగాలలో నా కృషిని గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. - కేతు విశ్వనాథరెడ్డి, సాహితీవేత్త, కడప జిల్లా గొప్ప ఔదార్యం సాహిత్యం, విద్య, సామాజిక రంగాల్లో నా కృషికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం అందించినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇంతమందిని ప్రోత్సహించటం గొప్ప ఔదార్యంతో కూడిన సందర్భం. - ఆచార్య కొలకలూరి ఇనాక్, గుంటూరు కళల అభివృద్ధికి ప్రోత్సాహం దేశంలో కళలు అభివృద్ధి చెందటానికి ప్రోత్సాహం చాలా అవసరం. రాష్ట్రంలో కళలు, వ్యవసాయం వంటి వివిధ రంగాల అభివృద్ధికి కృషిచేస్తున్న వారిని సత్కరించిన ముఖ్యమంత్రి జగన్ అభినందనీయులు. తద్వారా ఆయన అనేక రంగాలకు చేయూత ఇచ్చారు. నాకు వైఎస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది. - పొన్నాల రామసుబ్బారెడ్డి, రంగస్థలనటుడు, నెల్లూరు దేశంలో ఎక్కడా లేనివిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించడం హర్షణీయం. సాహిత్య రంగంలో ఏడుగురిని ఎన్నుకున్నారు. అందులో నేను ఒకడిని కావడం నా అదృష్టం. నా సాహిత్య కృషికి ఇదొక మంచి పురస్కారం. ఇనుమడించిన ఉత్సాహంతో మరిన్ని రచనలు రాయడానికి కృషి చేస్తాను. – ప్రొ. రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి, కవి, అనంతపురం జిల్లా ఏపీ ప్రజలకు సన్మానం తరిమెల నాగిరెడ్డి గారితో కలిసి పనిచేశాం. వైఎస్సార్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. విశాల దృక్పథం కనిపించింది. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అన్ని రంగాలవారికీ అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన సన్మానం ఇది. - ఇమామ్, పాత్రికేయుడు, కదలిక, అనంతపురం సాంస్కృతిక విప్లవానికి ప్రోత్సాహం 60 ఏళ్లుగా తెలుగు తత్వశాస్త్రంలో కృషిచేస్తూ ఇప్పటివరకు 95కు పైగా పుస్తకాలు రాశాను. ఇందులో 75 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అస్పృశ్యుని యుద్ధగాధ అనే దళితుని జీవనగాధ రాజకీయ, సామాజిక, ఆర్థికశాస్త్రంగా ముందుకు వచ్చింది. ఈ గ్రంధానికి చాలా అవార్డులు వచ్చాయి. భారత రాజకీయాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మార్గదర్శకంలో వెయ్యి పేజీలతో రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. బౌద్ధం నుంచి జ్ఞానం, ప్రతిభ తీసుకుని అంబేడ్కర్ ఎలా రాజ్యాంగం రంచించారు వంటి గ్రంథాలు రాయడం జరిగింది. ఈ రోజు వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం రావడం ఆనందంగా భావిస్తున్నా. ఇలాంటి ప్రోత్సాహకాలు రాజ్యాంగం ప్రకారం సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లాయి. కవులను, కళాకారులను, ట్రస్ట్లను, గ్రంథాలయాలను, విద్యాసంస్థలను ప్రోత్సహించడం ద్వారా మనలో ఒక సాంస్కృతిక భావజాలం ఏర్పడుతుంది. అది జ్ఞానాన్ని పెంచుతుంది. - కత్తి పద్మారావు ఎంతో సంతోషించేవారు.. మా నాన్న వంగపండు ప్రసాదరావు ఏ ఒక్కరి నుంచీ పైసా తీసుకోకుండా జీవితాన్ని కళకే అంకితం చేశారు. ఈ రోజు జగనన్న నా తండ్రి గొప్పతనాన్ని గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించారు. ఇప్పుడు నా తండ్రి బతికుంటే ఎంతో సంతోషించేవారు. జగనన్న నన్ను, నా తండ్రిని ఎంతగానో అభిమానిస్తారు. అటువంటి నాయుకుడిని ఎక్కడా చూడలేం. కృతజ్ఞతగా ఆయన అడుగుజాడల్లో పార్టీ కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాను. – వంగపండు ఉష సాహిత్య సౌరభ వికాసం.. సీపీ బ్రౌన్ లైబ్రరీ సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కడం సంతోషకరం. సీపీ బ్రౌన్ నివసించిన ప్రాంతంలో గ్రంథాలయం కట్టారు. ఇటీవల సీఎం జగన్ ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయం అభివృద్ధికి రూ.5.50 కోట్లు కేటాయించారు. ట్రస్టు కింద గ్రంథాలయాన్ని వైఎస్సార్ తొలుత ఎస్వీ యూనివర్సిటీకి ఇచ్చారు. అనంతరం వైవీ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అవార్డు ద్వారా గ్రంథాలయానికి మంచి గుర్తింపు లభించింది. - సూర్యకళావతి, వైస్ చాన్సలర్, యోగివేమన యూనివర్సిటీ అరుదైన గౌరవం సారస్వత నికేతన్ రెండేళ్ల కిందటే శతాబ్ది ఉత్సవాలు చేసుకుంది. ఇప్పుడు వైఎస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు లభించింది. కళాకారులను, సాహితీవేత్తలను, వివిధ సంస్థలను గుర్తించి ఒకేసారి గౌరవించడం చాలా గొప్ప విషయం. - వెంకటేశ్వర్లు, సారస్వత నికేతన్ కార్యదర్శి సేవా నిరతికి నిదర్శనం వైఎస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు తరఫున, భక్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు. లక్షలాదిమంది ఆన్లైన్లో ఈ కార్యమ్రమాన్ని చూశారు. నాకు చాలామంది మెసేజ్లు కూడా పంపారు. 50-60 సంవత్సరాలుగా రాష్ట్రంలోను, దేశంలోను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. బాబా చూపిన మార్గంలో నడుస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు రావడంతో చాలామంది సంతోషిస్తున్నారు. - రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వందేళ్ల చరిత్రకు గుర్తింపు మా తాతగారు మల్లాడి సత్యలింగం నాయకర్ ప్రతి ఒక్కరికీ విద్య అందాలని ఆరాటపడ్డారు. తన ఆస్తులన్నింటినీ మార్చి ట్రస్టుగా పెట్టారు. వందేళ్ల చరిత్ర ఉన్న మా ట్రస్టుకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. - మల్లాడి కార్తీక్ నాయకర్, ఎంఎస్ఎన్ చారిటీస్ రాష్ట్రానికి తెలిసింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రత్యేక వందనాలు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం వల్ల గ్రంథాలయానికి రాష్ట్రవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఎంతోమందికి గ్రంథాలయం కల్పవృక్షంలా ఉంది. 123 ఏళ్లుగా సేవలందిస్తోంది. - ఆర్.సి.హెచ్.వెంకట్రావు, గెజిటెడ్ లైబ్రేరియన్, గౌతమీ గ్రంథాలయం, రాజమండ్రి సేవకు సత్కారం అనేక రంగాల్లో ఆర్డీటీ సేవలందిస్తోంది. ఆర్టీడీ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది. సీఎం జగన్కి కృతజ్ఞతలు. - డాక్టర్ వై.వి.మల్లారెడ్డి, ట్రస్టీ, ఆర్డీటీ, అనంతపురం జన్మకు ఇది చాలు వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు.. జీవితంలో ఇలాంటి గౌరవం దక్కుతుందని ఊహించలేదు. ఇలాంటి వేడుక ఒకటి చూస్తానని అనుకోలేదు. ఈ జన్మకు ఇది చాలు. ముఖ్యమంత్రిని దేవుడు చల్లగా చూడాలి. - గోచిపాత గాలీబు, డప్పు కళాకారుడు నైపుణ్యానికి సత్కారం ముఖ్యమంత్రికి వందనాలు. నేను అరటి రైతును. 1995లో మొట్టమొదటగా టిష్యూ కల్చర్ను ప్రవేశపెట్టాను. అరటిసాగులో నాకృషిని గుర్తించి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అవార్డుల ద్వారా వివిధ రంగాల్లోని వ్యక్తుల నైపుణ్యాలను వెలికి తీశారు. - బలరామిరెడ్డి నల్లపురెడ్డి, అరటిరైతు, పులివెందుల చాలా సంతోషం ఆర్గానిక్ పద్ధతిలో ఉద్యాన పంటలను సాగుచేస్తాను. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు రావడం మాకు చాలా సంతోషం. వైవిధ్య భరితంగా పంటలను సాగు చేయడంపై నేను దృష్టిపెడుతున్నాను. మహానుభావుడు, రైతు బాంధవుడైన వైఎస్సార్ పేరుపై అవార్డు రావడం మాకు సంతోషంగా ఉంది. - కొట్యాడ శ్రీనివాసరావు, ఉద్యాన రైతు, నిమ్మలపాలెం, విజయనగరం జిల్లా జగన్ ప్రభుత్వం గుర్తించింది ఈ రీతిలో ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఇలాంటి అవార్డులు ఇవ్వలేదు. 1984 నుంచి నేను కాఫీ సాగుచేస్తున్నాను. అనేక ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఎవ్వరూ గుర్తించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చింది. ఇంకా ఆసక్తితో కృషితో సాగు చేస్తాను. 2018 నుంచి సొసైటీ కూడా ఏర్పాటు చేశాం. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. - సెగ్గె కొండలరావు, కాఫీ రైతు, చింతపల్లి, విశాఖపట్నం జిల్లా కోవిడ్ సేవలకు గుర్తింపు కోవిడ్లో రోగులకు సేవచేయడం దేవుడు ఇచ్చిన అవకాశం. దీన్ని ప్రభుత్వం గుర్తించి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. - డాక్టర్ నీతిచంద్ర, పల్మనాలజిస్ట్, నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ దేవుడిచ్చిన అవకాశం విప్తతు సమయంలో సేవ చేయడం దేవుడు మాకు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాం. మేమే కాదు చాలామంది నర్సులు బంధువులను పోగొట్టుకున్నారు. సంకల్పంతో రోగులకు సేవలందించారు. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు రావడం సతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. - కె.జ్యోతిర్మయి, స్టాఫ్నర్సు, అనంతపురం ప్రభుత్వాస్పత్రి గొప్ప గౌరవం.. మా సేవలను ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషకరం. కోవిడ్ డ్యూటీ చేసినప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్లాం. నాలో ఏ ధైర్యం ఉందో.. అదే ధైర్యాన్ని పేషెంట్లకు ఇచ్చా. నా విధిని నేను నిర్వర్తించాను. దీనికి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చేంత గొప్ప గౌరవం దక్కుతుందని ఊహించలేదు. - పోతంశెట్టి లక్ష్మి, స్టాఫ్నర్సు, విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆయన జీవితం సాహిత్యం కోసమే మా నాన్న, ప్రముఖ సాహితీవేత్త కాళీపట్నం రామారావు పేరిట వైఎస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఆయన మరణానంతరం ఇచ్చారు. ఆయన జీవితం సాహిత్యం కోసం అంకితం చేశారు. సాహిత్యం మీద వచ్చిందంతా సాహిత్యానికే ఖర్చు చేసేవారు. ఆయన స్థాపించిన సంస్థకే ఖర్చు పెట్టాలని మా కుటుంబం నిర్ణయించింది. మా నాన్నగారికి ఈ అవార్డు ఇవ్వడం పట్ల మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. - కాళీపట్నం సుబ్బారావు మహానేత వైఎస్సార్ పొందూరు ఖద్దరే కట్టేవారు పొందూరు ఖద్దరు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పొందూరు ఖద్దరు పంచెలే కట్టుకునేవారు. 73 ఏళ్ల చేనేత సహకార సంఘ చరిత్రలో ఇన్నాళ్లకు గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పొందూరు ఖాదీ సంస్థ తరఫున ఈ అవార్డు అందుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది, ఈ అవార్డు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారు. ఈ నగదు సంస్థను బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. - డి.వెంకటరమణ, పొందూరు ఖాదీ బోర్డు కార్యదర్శి సంగీత ప్రపంచానికి గర్వకారణం 103 సంవత్సరాల చరిత్ర కలిగిన మహారాజా ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఎంతోమంది మహానుభావులు ఈ కళాశాల నుంచి వచ్చి కళాశాల ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. ఇటువంటి అవార్డు కళాశాలకు రావడం యావత్ సంగీత ప్రపంచమంతా గర్వించదగినది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపల్ హోదాలో నేను అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. భావితరాలకు ఇది ప్రోత్సాహకరంగా ఉండి, మరింతమంది కళాకారులను తీర్చిదిద్దడానికి దోహదపడుతుంది. - ఆర్వి ప్రసన్నకుమారి మహానేత జ్ఞాపకం పాతికముఫ్పై ఏళ్లుగా ప్రజాగాయకుడిగా, ప్రజాకళాకారుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాను. గత ప్రభుత్వ హయాంలో 275 కేసులు నాపై ఉన్నాయి. ఈరోజు జగన్న నన్ను గుర్తుపెట్టుకుని ఈ పేదకళాకారునికి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం గొప్ప విషయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి నన్ను హైదరాబాద్ రవీంద్రభారతికి పిలిచి ఆ రోజుల్లోనే రూ.లక్ష ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ మహానేత చనిపోయినపుడు నేను రాసిన పాట ఎప్పుడు పాడినా కన్నీళ్లు వస్తాయి. ఈరోజు ఆ రుషి పేరుమీద ఆయన తనయుడు నాకు వీధి నాటకం విభాగంలో అవార్డు ఇచ్చినందుకు శతకోటి నమస్కారాలు. – మజ్జి శ్రీనివాసరావు (దేవీశ్రీ) 30 ఏళ్ల కళ.. ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో కాలిగ్రాఫీకి వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు అభించింది. ఈ కళ అత్యంత అద్భుతమైన, అరుదైన కళ. దీన్ని నేర్చుకోవాలంటే 20 నుంచి 30 ఏళ్లు శ్రమించాలి. కానీ నేర్చుకుంటే ఆ కళాకారునికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దానికి ఇదే నిదర్శనం. ఈ రోజు నా శ్రమను, కళను గుర్తించి అవార్డు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – పరమేశ్వరరాజు. బొబ్బిలి వీణకు సన్మానం తరతరాలుగా దాదాపు రెండొందల శతాబ్దాలుగా విజయనగరంలో బొబ్బిలి వీణ తయారు చేస్తున్నాం. నేను మూడోతరం. ప్రస్తుతం మాలో ఐదోతరం వారు కూడా వీణల తయారీలో ఉన్నారు. యాభై ఏళ్లుగా బొబ్బిలి వీణను తయారు చేస్తూ మరికొంత మందికి నేర్పిస్తున్నాను. ఎనిమిది రకాల మెమెంటో వీణలు తయారు చేయడం ఇప్పుడు ప్రధానంగా మారింది. మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా భావించే బొబ్బిలి వీణకు వైఎస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. – సర్వసిద్ధి అచ్యుతనారాయణ మాకో గుర్తింపు.. నా పేరు సురభి వేణుగోపాల్. మాది శ్రీవినాయక నాట్యమండలి సురభి థియేటర్. సురభి అనేది 1880లో వైఎస్సార్ కడప జిల్లాలో ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటివరకు నాటకరంగాన్ని వృత్తిగా భావిస్తూ సేవ చేసుకుంటున్నాం. ఇది ఏకైక కుటుంబసంస్థ. ఇటువంటి సంస్థను గుర్తించి అవార్డు ఇవ్వడం ఆనందంగా గర్వకారణంగా ఉంది. ఈ రోజు కళాకారుడిగా ప్రత్యేకించి గుర్తించి ఇక్కడ పిలవడం జరిగింది. 2019లో ఆంధ్రా అవతరణ సందర్భంగా ప్రదర్శించిన మాయాబజార్ నాటకాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి వీక్షించండం సంతోషంగా ఉంది. ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాదృష్టికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఒక కళాకారుడిగా ఆనందం, అభిమానం, కృతజ్ఞతలు ఒకేసారి తెలియచేస్తున్నాను. వైఎస్సార్ హయాంలో ఆరి మారాఠీలను బీసీలుగా గుర్తించారు. ఒకరు కులం ఇచ్చారు. ఒకరు అవార్డు ఇచ్చారు. - సురభి నాట్యమండలి 50 ఏళ్ల సేవకు.. బుర్రకథ కళారంగంలో 50 సంవత్సరాలుగా సేవచేస్తున్నా. ప్రభుత్వం వృత్తిని గౌరవించి గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. జగన్మోహన్రెడ్డికి ఎటువంటి కష్టాలు లేకుండా కలకాలం జీవించాలంటూ అప్పటికప్పుడు పద్యాన్ని పాడి వినిపించారు. - మిరియాల అప్పారావు -
వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం
-
వైఎస్ఆర్ లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డ్: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్
-
వైఎస్ఆర్ లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డ్: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్
-
నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్: సీఎం జగన్
-
YSR Awards: ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సం
సాక్షి, అమరావతి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్ అని.. అలాంటి వ్యక్తి వైఎస్సార్ పేరుమీద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందన్నారు. విజయవాడలోని ఏ–కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, కేవలం సేవలను పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్లైన్ వారియర్స్ను ఎంపిక చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి శుభాకాంక్షలు. సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య సమయం గడపడం నా అదృష్టం. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని పలు సూచనలు వచ్చాయి. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్ ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాం. నిండైన పంచెకట్టుతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచారు. వైఎస్సార్ ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహా మనీషి’’ అని సీఎం కొనియాడారు. ప్రతి సంవత్సరం నవంబర్ 1న వైఎస్సార్ అవార్డులు ప్రదానం చేస్తామని సీఎం వెల్లడించారు. లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేస్తామన్నారు. అచీవ్మెంట్ అవార్డు పొందిన వారికి రూ.5 లక్షలు కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి: గవర్నర్ వైఎస్సార్ వైద్య వృతి చేసినా.. వ్యవసాయం, విద్యారంగాలకు విశేష కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ‘‘ఏపీ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ గొప్ప వ్యక్తిగా నిలిచారు. వైఎస్సార్కు విద్య, వైద్యం, అంటే ఎంతో మక్కువ. పేదల నాడి తెలిసిన డాక్టర్ వైఎస్సార్.. వారి కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించి ప్రజల హృదయాలను గెలిచారని’’ గవర్నర్ అన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. వ్యవసాయం, ఆక్వా, ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్లోనూ ఏపీ క్రియాశీలకంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడుని ప్రార్థిస్తున్నానని గవర్నర్ అన్నారు. వైఎస్సార్ అవార్డులు అందుకున్నవారికి ఆయన అభినందనలు తెలిపారు. ట్రస్టులు 1. ఎంఎస్ఎన్ చారిటీస్ ట్రస్ట్ – కాకినాడ(తూర్పుగోదావరి) 2. సీపీ బ్రౌన్ లైబ్రరీ – వైఎస్సార్ జిల్లా 3. సారస్వత నికేతన్ లైబ్రరీ – వేటపాలెం(ప్రకాశం) 4. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ – పుట్టపర్తి(అనంతపురం) 5. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ – వైఎస్సార్ జిల్లా 6. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) – అనంతపురం 7. గౌతమి రీజనల్ లైబ్రరీ – తూర్పుగోదావరి 8. మహారాజా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ – విజయనగరం రైతులు 9. స్వర్గీయ పల్లా వెంకన్న – కడియం(తూర్పుగోదావరి) 10. మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ – శ్రీకాకుళం 11. ఎంసీ రామకృష్ణారెడ్డి – అనంతపురం 12. కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం 13. విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ – కృష్ణా జిల్లా 14. ఎం.బలరామి రెడ్డి – వైఎస్సార్ జిల్లా 15. ఎస్.రాఘవేంద్ర – చిత్తూరు 16. సెగ్గె కొండలరావు – విశాఖపట్నం 17. ఆంధ్ర కశ్మీర్ ట్రైబల్ ఫ్మారింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ – విశాఖపట్నం 18. వల్లూరు రవికుమార్ – కృష్ణా జిల్లా 19. శివ అభిరామిరెడ్డి – నెల్లూరు జిల్లా కళలు–సంస్కృతి 20. పొందూరు ఖద్దర్(ఆంధ్రాపైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం) – శ్రీకాకుళం 21. స్వర్గీయ వంగపండు ప్రసాదరావు(జానపద గేయం) – విజయనగరం 22. అచ్యుత నారాయణ(బొబ్బిలి వీణ కేంద్రం) – విజయనగరం 23. పొన్నాల రామసుబ్బారెడ్డి(రంగస్థలం) – నెల్లూరు 24. వినాయక నాట్యమండలి(సురభి నాటకం) – వైఎస్సార్ జిల్లా 25. సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం(కూచిపూడి నాట్యం) – కృష్ణా 26. దాలవాయి చలపతిరావు(తోలు బొమ్మలాట) – అనంతపురం 27. కిల్లు జానకమ్మ(థింసా నృత్య బృందం) – విశాఖ 28. సవర రాజు(సవర పెయింటింగ్స్) – శ్రీకాకుళం 29. మజ్జి శ్రీనివాసరావు(వీధి నాటకం) – విశాఖపట్నం 30. ధర్మాడి సత్యం(డిజాస్టర్ మేనేజ్మెంట్) – తూర్పుగోదావరి 31. సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) – తూర్పుగోదావరి 32. మిరియాల అప్పారావు(బుర్రకథ) – పశ్చిమగోదావరి 33. కూరెళ్ల వెంకటాచారి(కొండపల్లి బొమ్మలు) – కృష్ణా 34. గోచిపాత గాలేబు(డప్పు కళాకారుడు) – కృష్ణా 35. జి.రమణయ్య(వెంకటగిరి జాంధానీ చీరలు) – నెల్లూరు 36. శివప్రసాద రెడ్డి(కళంకారీ పెయింటింగ్స్) – కర్నూలు 37. బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్టిజన్స్ సొసైటీ – చిత్తూరు 38. డా.వి.సత్యనారాయణ(నాదస్వరం) – చిత్తూరు 39. పూసపాటి పరమేశ్వర్రాజు(కాలిగ్రఫీ) – విజయనగరం సాహిత్యం 40. స్వర్గీయ కాళీపట్నం రామారావు(కారా మాస్టర్) – శ్రీకాకుళం 41. కత్తి పద్మారావు – గుంటూరు 42. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి – వైఎస్సార్ జిల్లా 43. బండి నారాయణ స్వామి – అనంతపురం 44. కేతు విశ్వనాథరెడ్డి – వైఎస్సార్ జిల్లా 45. కొలకలూరి ఇనాక్ – గుంటూరు 46. లలితా కుమారి(ఓల్గా) – గుంటూరు జర్నలిజం 47. ఏబీకే ప్రసాద్ – కృష్ణా 48. స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు 49. స్వర్గీయ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ) – గుంటూరు 50. స్వర్గీయ కె.అమరనాథ్ – పశ్చిమగోదావరి 51. సురేంద్ర (కార్టునిస్ట్) – వైఎస్సార్ జిల్లా 52. ఇమామ్ – అనంతపురం వైద్య–ఆరోగ్య విభాగం 53. డాక్టర్ నీతి చంద్ర(ఊపిరితిత్తుల వ్యాధుల ప్రొఫెసర్) – నెల్లూరు 54. డాక్టర్ కె.కృష్ణ కిషోర్(ఈఎన్టీ ప్రొఫెసర్) – తూర్పుగోదావరి 55. లక్ష్మి(స్టాఫ్ నర్స్) – విజయవాడ 56. కె.జోతిర్మయి(స్టాఫ్ నర్స్) – అననంతపురం 57. తురబిల్లి తేజస్వి(స్టాఫ్ నర్స్) – విశాఖపట్నం 58. ఎం.యోబు(మేల్ నర్స్) – వైఎస్సార్ జిల్లా 59. ఆర్తి హోమ్స్ – వైఎస్సార్ జిల్లా -
వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఆగష్టు 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతో పాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్లు పేర్కొంది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యం.. అదే విధంగా వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. చదవండి: Huzurabad Bypoll: టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ -
13న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు
సాక్షి, అమరావతి బ్యూరో: వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విశిష్ట వ్యక్తులకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ఆగస్టు 13న సీఎం వైఎస్ జగన్ ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏ–1 కన్వెన్షన్ హాలును సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్లతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు. అవార్డుల ప్రదానోత్సవానికి వేదిక, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఏ–1 కన్వెన్షన్ హాలు ఏ మేరకు అనువుగా ఉంటుందో పరిశీలించి, కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్షించారు. వెలంపల్లి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విశిష్ట వ్యక్తులకు జూలై 7న వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ప్రకటించిందని గుర్తు చేశారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపికను అందిస్తామన్నారు. -
‘అనంత’ వాసులకు అరుదైన గౌరవం
సాక్షి,అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న వైఎస్సార్ లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డులు ఈ సారి అనంత వాసులు నలుగురితో పాటు రెండు సంస్థలకు దక్కాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు బండి నారాయణస్వామి, డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (వైఎస్సార్ జిల్లా తరఫున), పాత్రికేయ రంగంలో కదలిక సంపాదకులు ఇమామ్, కళాకారుల విభాగంలో దళవాయి చలపతి, స్వచ్ఛంద సంస్థల విభాగంలో ఆర్డీటీ, సత్యసాయి ట్రస్ట్కు లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డులు దక్కగా, ఉద్యానంలో తాడిపత్రికి చెందిన ఎంసీ రామకృష్ణారెడ్డి, వైద్య రంగంలో స్టాఫ్ నర్సు జ్యోతి మేరీ ఎచీవ్మెంట్ అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకంతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహంతో సత్కరించనుంది. సేవే పరమావధిగా... పుట్టపర్తి అర్బన్: సేవే పరమావధిగా భావించే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. 1972 సెప్టెంబర్ 2న ఈ ట్రస్ట్ను సత్యసాయిబాబా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బాబా ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పేదప్రజలకు అత్యాధునిక వైద్యం చేరువ చేసేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 153 దేశాల్లో సత్యసాయి భక్తులు సేవా ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానాలు, ఇళ్ల నిర్మాణాలు, ఎల్కేజీ నుంచి ఉన్నత విద్య వరకూ ఉచిత విద్యాబోధనను అందజేసేలా పాఠశాలలు, కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీని నెలకొల్పారు. కోవిడ్ –19 విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.5 కోట్ల చొప్పున విరాళాన్ని అందజేశారు. మరో రూ.5 కోట్ల వ్యయంతో మందులు కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. స్థానికంగా కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసి, వేలాది మందిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులను తరలించేందుకు ఉచితంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సత్యసాయి తాగునీటి పథకంలో భాగంగా 700కు పైగా గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. విలక్షణత స్వామి సొంతం ‘స్వామి’ అంటూ అందరూ గౌరవంగా పిలుచుకునే ‘అనంత’ కథకుడు బండి నారాయణస్వామి జీవితం చాలా విలక్షణమైనది. తొలుత కవిత్వంలో ఈదులాడిన స్వామి తదనంతర కాలంలో బాలసాహిత్యంలోకి వచ్చారు. నవలలు రాశారు. ఏకకాలంలో కరువు కథలు రాశారు. మధ్యతరగతి ద్వందాల్ని విమర్శిస్తూ రచనలు చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన 1987లో పరుగు కథతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘గద్దలాడుతాండాయి, మీ రాజ్యం మీరేలండి, నిసర్గమ్, రెండు కలల దేశమ్’ నవలలు రచించారు. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్ కథా కోకిల, కొలకలూరి ఇనాక్, ఎన్టీఆర్ పురస్కారాలను అందుకున్నారు. సాహిత్యానికి ‘రాచ’బాట కవిగా, విమర్శకునిగా, వ్యాసకర్తగా కరువు సీమ సమష్టి జీవన చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రాచపాలెం చంద్రశేఖరరెడ్డిది సాహితీ రంగానికి పరిచయం అక్కరలేని సుప్రసిద్ధమైన పేరు. స్వతహాగా చిత్తూరు జిల్లాకు చెందిన వారైనా.. వైఎస్సార్ లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డును వైఎస్సార్ జిల్లా తరఫున అందుకుంటున్నారు. నాలుగు దశాబ్ధాలుగా ఆయన అనంతను తన సాహితీ క్షేత్రంగా మార్చుకుని సాహిత్య యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ‘శిల్ప ప్రభావతి (పరిశోధనా గ్రంథం), మన నవలలు–మన కథానికలు (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గ్రంథం), కొన్ని కావ్యాలు – కొందరు కవులు, ప్రతిఫలనం (విమర్శనాత్మక గ్రంథం)’ తదితర పుస్తకాలను రచించారు. 2012లో గురుజాడ పురస్కారం, 2016లో తెలుగు భాషా పురస్కారం, 2017లో గుర్రం జాషువా అవార్డును అందుకున్నారు. పాత్రికేయ రంగంలో ‘కదలిక’ ఇమామ్... ‘కదలిక’ పత్రిక ద్వారా సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలా అక్షరీకరణ చేశారు. సీమ వేదికగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరువు పరిస్థితులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గాలను చూపెట్టారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు ప్రజా నాయకుడు తరిమెల నాగిరెడ్డితో కలిసి పనిచేస్తూ జనశక్తి పత్రికకు అనేక వ్యాసాలు రాశారు. 1983లో కదలిక పత్రికను ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డికి సన్నిహితునిగా ఉంటూ అనేక ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. అనేక సందర్భాలలో గౌరవ సత్కారాలందుకున్న ఇమామ్కు పాత్రికేయ రంగంలో వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారం దక్కడంపై పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దళవాయికి మరో పురస్కారం ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారుడు దళవాయి చలపతికి వైఎస్సార్ లైప్టైం అచీవ్మెంట్ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. వారసత్వంగా వచ్చిన తోలుబొమ్మలాటను తొలుత గ్రామాలలో ప్రదర్శించే ఆయన అనంతరం దేశ విదేశాలకు విస్తరించారు. ఎన్నో రాష్ట్ర జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. పరిఢవిల్లిన ఉద్యానం.. ఉద్యాన తోటల్లో నాణ్యమైన దిగుబడులు సాధించినందుకు తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు ఎంసీ రామకృష్ణారెడ్డికి వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 1995లోనే ట్రెల్లీస్ పద్ధతిలో ఎఫ్1 హైబ్రీడ్ రకం టమాట సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఉద్యాన పంటలు విస్తరించారు. 10 ఎకరాల్లో సాత్గుడి రకం చీనీ, 10 ఎకరాల్లో టిష్యూకల్చర్ భగువ రకం దానిమ్మ, 5 ఎకరాల్లో సూపర్సొనాకా రకం ద్రాక్ష, మరో 5 ఎకరాల్లో అలగార్ రకం మునగ సాగు చేస్తున్నారు. కేవలం పదో తరగతి వరకు చదువుకున్న అతను ఆధునిక సాగు పద్ధతులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ఉద్యాన దిగుబడులతో ఏటా రూ.కోటికి పైగా టర్నోవర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్డీటీ సిగలో మరో కలికితురాయి జిల్లాలో 1969 నుంచి సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో బడుగు, బలహీన, నిమ్నజాతులు, గిరిజనుల అభ్యున్నతికి సంస్థ ఫౌండర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎనలేని కృషి చేశారు. ఆయన స్ఫూర్తితో ఆ సేవా కార్యక్రమాలు నేటికీ కొనసాగుతున్నాయి. విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, ఉద్యానం, మహిళాభ్యున్నతి, గృహ నిర్మాణ రంగాల్లో విశేష కృషి చేస్తోంది. దివ్యాంగులు, అనాథల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామీణస్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దినందుకు రెండేళ్ల క్రితం ఆర్డీటీ సంస్థకు భారతీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ను భారత ప్రభుత్వం అందించింది. తాజాగా సేవా రంగానికి సంబంధించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారానికి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వృత్తే దైవంలా.. వృత్తినే దైవంగా భావిస్తూ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న అనంతపురం సర్వజనాస్పత్రి స్టాఫ్ నర్సు కె.జ్యోతిమేరీకి కోవిడ్ వారియర్స్ విభాగంలో వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డును ప్రభుత్వం ఎంపిక చేసింది. 2006లో కర్నూలు జిల్లా పత్తికొండ పీహెచ్సీలో స్టాఫ్నర్సుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె 2012 నుంచి అనంతపురం సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో కోవిడ్ బారిన పడి, 20 రోజుల తర్వాత కోలుకుని సూపర్ స్పెషాలిటీ కోవిడ్ ఆస్పత్రిలో 5 నెలల పాటు రోగులకు సేవలందించారు. ఈ ఏడాది సెకెండ్ వేవ్లోనూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కోవిడ్ ఓపీ, ఈఎన్టీ, ఐసోలేషన్, చెస్ట్ ఐసీయూ, తదితర కోవిడ్ వార్డుల్లో వరుసగా పని చేశారు. -
బిల్ గేట్స్కు ప్రతిష్టాత్మక పురస్కారం
భారతీయ ఐటి పరిశ్రమకు పితామహుడిగా పిలుచుకునే దివంగత ఎఫ్సీ కోహ్లీ (మరణానంతరం), ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, దాత బిల్ గేట్స్ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. 'టై గ్లోబల్' అనే సంస్ కోహ్లీకి లైఫ్టైమ్ అచీవ్మెంట్ సర్వీస్ అవార్డును ప్రదానం చేయగా, బిల్ గేట్స్ కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డుతో సత్కరించింది. మారియట్ ఇంటర్నేషనల్కు చెందిన బిల్ మారియట్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఫ్యామిలీ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం వర్చువల్ గా జరిగిన ‘‘గ్లోబల్ సమ్మిట్ 2020’’ కార్యక్రమంలో ది ఇండస్ వ్యవస్థాపకులు (టీఐఈ) ఈ అవార్డులను ప్రదానం చేసింది. టీసీఎస్ వ్యవస్థాపక సీఈవో దివంగత కోహ్లీ తరపున ఆయన భార్య ఈ అవార్డును అందుకున్నారు. (ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక లేరు) ప్రతి వ్యవస్థాపకుడు బిల్గేట్స్ లా ఉండాలనే కలకంటారని, కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్దిలో ఆయన అద్భుతమైన కృషికి ఈ అవార్డు లభించిందని టీఐఈ గ్లోబల్ చైర్ మహావీర్ శర్మ వెల్లడించారు. అటు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 'టై గ్లోబల్' అవార్డును అందుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని గేట్స్ తన సందేశంలో తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కరణలే కీలకమని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలోనూ ఆవిష్కరణలే ప్రధానభూమిక పోషిస్తాయన్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ విభాగంలో మూడు అవార్డులతో పాటు, వివిధ విభాగాల క్రింద పది అవార్డులను ఇచ్చింది. స్టార్టప్ ఎకోసిస్టమ్కు మద్దతు ఇచ్చే ఉత్తమ ప్రభుత్వ సంస్థ అవార్డును సింగపూర్ ప్రభుత్వం గెలుచుకుంది. ఇతర అవార్డులు: ఉత్తమ కార్పొరేట్ సహాయక వ్యవస్థాపకత (స్టార్టప్ల కోసం గూగుల్ / ఆల్ఫాబెట్); ఉత్తమ విశ్వవిద్యాలయం ప్రోత్సాహక వ్యవస్థాపకత (స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం); ఉత్తమ యాక్సిలరేటర్ అవార్డు (వై కాంబినేటర్); ఉత్తమ పనితీరు గ్లోబల్ వీసీ ఫండ్ (సీక్వోయా క్యాపిటల్); ప్రపంచంలో అత్యంత చురుకైన ఏంజెల్ నెట్వర్క్ (టెక్ కోస్ట్ ఏంజిల్స్); బూట్స్ట్రాప్ టు బిలియన్స్ అవార్డు (బెన్ చెస్ట్నట్); రాపిడ్ లిస్టింగ్ అవార్డు (విఐఆర్ బయోటెక్నాలజీ), లైటనింగ్ యునికార్న్ అవార్డు (ఇండిగో అగ్రికల్చర్); మరియు మోస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ (డేటా రోబో) ఉన్నాయి. -
నటిస్తూ..నవ్విస్తా!
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): తనను ఎంతగానో ఆదరించి సత్కరించిన విశాఖపట్నం ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాను... తాను ఆంధ్రా యూనివర్సిటీలోనే మొదటి నాటకం వేశాను... నేను నమ్మిన వెంకటేశ్వరస్వామి విశాఖవాసులతో ఈ సత్కారం చేయించినట్టు ఉంది... ఇదీ సిరిపురం వీఎంఆర్డీఏ గురజాడ కళాక్షేత్రంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పౌరసత్కారం అందుకున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పందన. తనకు జరిగిన సత్కారం అనంతరం ఆయన మాట్లాడుతూ, బీచ్రోడ్డులో ఊరేగింపు సమయంలో ప్రజల చిరునవ్వు చూస్తే తనకెంతో ఆనందం కలిగిందన్నారు. నేను నటిస్తూ మిమ్మల్ని నవ్విస్తూ నా జీవితం కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. రైటర్స్ అకాడమీ చైర్మన్, సీనియర్ పాత్రికేయుడు వీవీ రమణమూర్తి స్వాగతోపన్యాసం పలుకుతూ సినిమా రంగంలో ఎవరి సపోర్ట్ లేకుండా బ్రహ్మానందం తన నటననే ప్రతిభగా తీర్చిదిద్దుకుని 35 వసంతాల సినీ ప్రస్థానంలో 1154 చిత్రాల్లో నటించారని గుర్తు చేశారు. సినీ కళారంగానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ పౌరసత్కారం చేస్తున్నామన్నారు. ♦ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సాంస్కతిక, సాహిత్య, సేవా రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న ఎంతో మంది ప్రముఖులను రైటర్స్ అకాడమీ జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించడం అభినందనీయమన్నారు. తెలుగువారి గొప్పదనాన్ని చాటిచెప్పిన సినీ హాస్య నటుడు, వక్త, సాహితీవేత్త, రచయిత కన్నెగంటి బ్రహ్మానందం సత్కార కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు సైతం భాగస్వాములు కావడం ఆనందదాయకంగా ఉందన్నారు. మంచి సంగీతం, హాస్యం జీవితంలో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. అటువంటి హాస్యాన్ని అందరికి పంచి పెట్టే విధంగా బ్రహ్మానందం కృషి మరువలేనదన్నారు. చరిత్రలో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, భమిడిపాటి రాధాకృష్ణ, ఆదివిష్ణు తరం తర్వాత కూడా హాస్యానికి ప్రాముఖ్యత పెరిగిందన్నారు. మైసూరులోని గణపతి ఆశ్రమంలో మ్యూజిక్ థెరపీ ద్వారా పలు రోగాలను తగ్గిస్తున్నారని, హాస్యానికి అంత ప్రాధాన్యం ఉందన్నారు. ఆ సంస్థలో ఒక్క రోజైనా తమ కార్యక్రమం నిర్వహించాలని ఎంతో మంది కళాకారులు కలలు కంటారని పేర్కొన్నారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు అక్కడ హాస్యథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్న విషయాన్ని స్వయంగా చూశానన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడు రేలంగి, అల్లు రామలింగయ్యల తరువాత అంతటి ఖ్యాతి గడించిన బ్రహ్మానందం 1154 చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారని వివరించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ సినిమా రంగంలో హాస్యనటుడు బ్రహ్మానందం తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకున్నారన్నారు. ఆంధ్రాయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. విశాఖలో ఎన్నెన్నో అందమైన లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. హాస్యనటుడు బ్రహ్మానందం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకొస్తే ఏయూలో ఓ భవనం సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ శివశంకర్ తదితరులుపాల్గొన్నారు. తెలుగు ప్రముఖులు రాసిన వ్యాసాల సంపుటిని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు ఘనంగా పౌర సత్కారం... ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి ఘనంగా పౌరసత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అతిథుల చేతులమీదుగా రైటర్స్ అకాడమీ తరఫున జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. వెండికిరీటం, బంగారు పుష్పాలతో సత్కరించారు. ఈ సందర్భంగా 35 మంది తెలుగు ప్రముఖులు రాసిన వ్యాసాల సంపుటిని విడుదల చేశారు. సాగర తీరంలోప్రత్యేకంగా అలంకరించినగుర్రపుబగ్గిపై అభివాదంచేస్తున్న హాస్యనటుడు బ్రహ్మానందం అట్టహాసంగా ఊరేగింపు... అంతకుముందు ఆర్కేబీచ్రోడ్డులోని నేవీ స్మారక స్థూపం నుంచి గురజాడ కళాక్షేత్రం వరకూ ‘బ్రహ్మరథం’ పేరిట ఉత్తరాంధ్ర సాంస్కృతిక కళారూపాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఉత్తరాంధ్రకు చెందిన తప్పెటగుళ్లు, కోలాటం, పులివేషాలు, డప్పు విన్యాసాలు, చెక్కభజన, బొమ్మల డ్యాన్సులు, మత్స్యకార నృత్యాలు మొదలైన కార్యక్రమాలు హైలెట్గా నిలిచాయి. దారి పొడుగునా బ్రహ్మానందం ప్రజలకు అభివాదం చేశారు. -
విహారి గారి వసుధైక కుటుంబం
విహారి గారి కథలన్నీ చదివాక, ప్రత్యేకంగా ఆయన వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే కథేమిటని ప్రశ్నించుకుంటే, అందుకు సమాధానంలా, ‘వలయం’ నాముందు నిటారుగా నిలబడింది. తాను ఎన్నికచేసిన కథల సంపుటికి, ఆ కథనే మొదటి కథగా తీసుకోవడం వెనక, ఆ కథ తన సాహితీ జీవనానికి ముందుమాటగానో, భూమికగానో ఆయన భావించినట్టుగా తోచింది. కొడుకు జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా వాడికి తోడ్పడటం తండ్రి బాధ్యత. కొడుకు సమస్యల్ని తండ్రి పరిష్కరించడంలో ఆశ్చర్యమేముంటుంది? ‘వలయం’లోని కథకుడు దూరపు బంధువుల ఇబ్బందులకే గాదు, పరిచితులైన వాళ్ళెవరడిగినా, వాళ్ళకు తోడ్పడటం తన బాధ్యతగా భావిస్తారు. తన సహాయం వల్ల సుఖపడ్డవాళ్ళు, తనపట్ల కృతజ్ఞతల్ని వెల్లడించబోతే, అందులో తాను చేసిన పనేమీ పెద్దదిగాదని నమ్ముతాడు. ఎదుటి మనిషి మనస్సుకు నొప్పి కలగకుండా జాగ్రత్తపడుతూ, అతను అప్పజెప్పిన బాధ్యతను చిరునవ్వుతో, ఆత్మవిమర్శ చేసుకుంటూనే, చేసుకుపోతాడు. ఈ బాధ్యతల వలయం నుంచి ఆ కథకుడు బయటపడాలని ఎప్పుడూ అనుకోడు. కథకుడుగా విహారి బాధ్యత గుర్తెరిగిన రచయిత అనీ, ఆ కర్తవ్య నిర్వహణ నుంచీ తప్పుకోవడం ఆయనకు అసాధ్యమనీ చెప్పడానికి అయిదు దశాబ్దాల ఆయన రచనలే పెద్ద సాక్ష్యం. 1970, 80ల మధ్యలో ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రభ, యువ, జ్యోతి వంటి పత్రికల్లో మధ్య తరగతికి చెందిన రచయితలే పుంఖానుపుంఖాలుగా కథలు రాశారు. వాళ్ళందరిలోనూ ఇప్పటి వరకూ ఆపకుండా రాస్తున్న కథకులు విహారిగారొక్కరే! కథ చెప్పడంలో ఆయనది ప్రసన్నకథా కవితార్థయుక్తే! స్నేహంగా, ఆర్ద్రంగా, భుజంపైన చెయ్యేసుకుని నడుస్తున్న స్నేహితుడు కథ చెప్తున్నట్టుగా ఉంటాయి ఆయన కథలు. తొలినాటి కథకులందరిలాగే ఆయనది కూడా మౌఖిక ధోరణి. చాలా కథల్లో కథ చెప్పేవ్యక్తి కథలోని పాత్రే అయివుంటాడు. కొన్ని సార్లు ప్రధాన పాత్రగానూ, మరికొన్నిసార్లు చిన్న పాత్రగానూ ఉంటాడు. సర్వసాక్షి కథనం ఉన్న కథల్లో, రచయిత స్వభావం, వ్యక్తిత్వం, కథనంతా తీర్చిదిద్దుతుంది. అలా ఆయన కథలన్నింటిలోనూ పరుచుకున్న విహారి వ్యక్తిత్వం ‘వలయం’ కథలోని కథకుడి స్వభావానికి దగ్గరగా ఉంటుంది. తన ప్రేమను తన కుటుంబానికి పంచినంత నిబద్ధతతోనే మొత్తం సమాజానికీ పంచుతాడు. మధ్యతరగతి పునాదులపైన విస్తరిల్లిన మన దేశపు సౌభాగ్యానికి, మధ్య తరగతి వాళ్ళ మానవీయ విలువలే ఆధారమని చాటిస్తాడు. మధ్యతరగతిలో ఉండే కుహనా విలువల్ని వదులుకునే మార్గాల కోసం అన్వేషిస్తాడు. విహారిగారి స్వాభావికమైన ఈ జీవన విధానానికి పెరిగిన కొమ్మలూ, ఆకులూ, పువ్వులూ, పళ్లే ఆయన రచనలు. విహారి కథా ప్రపంచంలోకి అడుగుపెట్టడమంటే అది సమకాలీన సమాజపు కోణాలన్నింటినీ పరామర్శించడమే. కథకుడుగా ఆయన చాలా అప్రమత్తంగా ఉంటాడు. తన తరువాతి తరాలనూ సానుభూతితో అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు. అధో జగత్ సోదరులనూ, కింది మధ్య తరగతి వాళ్లనూ ‘డబ్బు’ ఎంతగా వేధిస్తుందో ఆయనకు బాగా తెలుసు. మధ్య తరగతి మనుషుల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్న వ్యాపార సంబంధాల్ని నిరసిస్తున్న కథల్లో గూడా ఆయన మానవ సంబంధాల మాధుర్యాన్ని నొక్కి చెప్పడం మరిచిపోరు. ఎదిగిన కూతుర్ని రాబందుల బారి నుంచీ తప్పించడం కోసం నానా బాధలు పడే తల్లులూ, పుస్తకాన్ని కొనగలిగే అయిదు రూపాయల కోసం ప్రమాదకరమైన పందెపు బరిలో దిగే కుర్రాళ్ళూ, బతుకు బరువు మోయడానికి ఇష్టంలేని పాతరోత పనులలోనే ముడుచుకుపోవడానికి సిద్ధపడే నిర్భాగ్యులూ, కూతుళ్ళకు పెళ్ళి చేయాల్సిన వయస్సులో గూడా నిస్సిగ్గుగా బిడ్డల్ని కనే తండ్రులూ, ఈ మధ్య తరగతి విలాపాలూ, విలాసాలూ విహారి సాహిత్య ప్రపంచంలో మనకెదురౌతారు. విహారి గారికి ధర్మాగ్రహం. పీడనలోంచి పీడనే పుడుతుందని ఆయన హెచ్చరిస్తారు. సమాజంలో ఇంత దుర్మార్గముండడానికున్న కారణాలను ఆయన కథలన్నీ తరచి చూస్తాయి. ఈ లోకాన్ని మరింత అందంగా తయారుచేయడమెలాగో సూచిస్తాయి. -మధురాంతకం నరేంద్ర -
చాగంటి కోటేశ్వరరావుకు జీవన సాఫల్య పురస్కారం
-
నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం
‘‘పండంటి కాపురం’ చిత్రంలో జయసుధ నా కూతురిగా నటించింది. ఆమెకి కూడా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు ఈ లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉంది’’ అని సీనియర్ నటి జమున అన్నారు. వీబీ ఎంటర్టైన్మెంట్స్పై ఆరేళ్లుగా బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు బొప్పన గత రెండేళ్లుగా వెండి తెర అవార్డులను కూడా అందిస్తున్నారు. ఈ ఏడాది జమునకు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్టు, జయసుధకు లెజెండరీ అవార్డుతో పాటు పలువురు కళాకారులకు అవార్డులను అందజేశారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘గతంలో ‘పండంటి కాపురం’లో జమునమ్మకు కూతురిగా నటించాను. నలభై ఏళ్ల తర్వాత ఆమె, నేను ఒకే వేదిక మీద కలిసి అవార్డును తీసుకోవడం గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘నాకు సపోర్ట్ అందిస్తున్న శతాబ్ధిటౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్కి ధన్యవాదాలు. వారు తోడుగా ఉన్నారు కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు విష్ణు బొప్పన. ‘‘నాకు ఆల్ రౌండర్ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాబూమోహన్. ‘‘బెస్ట్ డైలాగ్ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. ఫ్యామిలీ మూవీగా ‘సమ్మోహనం’ చిత్రానికి వీకే నరేశ్, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇషా రెబ్బా, ‘ఎఫ్ 2’కి కమెడియన్గా రఘుబాబు ఇలా పలువురు తారలకు అవార్డులను ప్రదానం చేశారు. -
సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాల్లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియ ర్ నటుడు కృష్ణంరాజు, ఉత్తమ నటుడిగా రామ్చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్అశ్విన్, ఉత్తమ చిత్రం గా ‘మహానటి’కి అవార్డులు ప్రదానం చేశారు. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపు ణు లు ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు. ‘వైఎస్. రాజశేఖరరెడ్డిగారు అంటే నాకెంతో ఇష్టం. ఆయన నన్ను రాజా అని పిలిస్తే నేను ఆయన్ను రాజా అని పిలిచేవాణ్ణి. ఆయన కుమారుడు జగన్గారు పెట్టిన ఈ ‘సాక్షి’ భారతిగారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కొనసాగుతుంది.’ – నటుడు కృష్ణంరాజు ‘సాక్షి’ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా హుందాగా ఉంటుంది.’ – దర్శకుడు పూరి జగన్నాథ్ ‘సాక్షి’ అవార్డులు చాలా జెన్యూన్గా ఉంటాయి.’ – నటుడు– నిర్మాత రామ్ చరణ్ అని శనివారం హైదరాబాద్లో జరిగిన ‘సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్’ని కొనియాడారు. పలు విభాగాల్లో ఈ అవార్డులను పలువురు ప్రముఖులు అందుకున్నారు. ‘సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్’ ఎంపిక జాబితాలో జాతీయ అవార్డులు సాధించిన ‘మహానటి, రంగస్థలం, అ!, చి!ల!సౌ’ చిత్రాలు ఉండటం విశేషం. ఈ కార్యక్రమంలో ‘మధుర’ శ్రీధర్, నవీన్ ఎర్నేని, రాజారవీంద్ర, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ట్రెండ్ని సెట్ చేసేందుకు కష్టపడ్డా –కృష్ణంరాజు నేను నా సినిమాల్లో ఫైట్స్ అన్నీ డూప్ లేకుండా నిజంగా చేసినవే. అటువంటి ఫైట్స్ చేసి ప్రేక్షకుల నుంచి కాంప్లిమెంట్స్ పొందినప్పటికీ నేను మాత్రం రెండు కాళ్లు, కుడి చెయ్యి విరగ్గొట్టుకున్నాను(నవ్వుతూ). ఎన్నిసార్లు హాస్పిటల్కు వెళ్లానో నాకు తెలుసు(నవ్వుతూ). అప్పట్లో ఇలా ట్రెండ్ని సెట్ చేయడానికి నేను పనిచేశా, కష్టపడ్డాను. విలన్గా చేయమని దర్శకులు అడిగితే ఒప్పుకోలేదు. అయితే విలన్ పాత్రలను నా స్టైల్లో చేస్తాను, మీకు ఓకే అయితే చేస్తానన్నాను. ఫైట్స్ దగ్గర నుంచి పిస్టల్తో పేల్చడం వరకు ప్రతిదీ కొత్తగానే ప్రయత్నించాను. ‘మదర్ ఇండియా, బంగారు తల్లి’ లాంటి సినిమాల్లో చాలా డిఫరెంట్గా చేశా. ఒక ప్రొడక్షన్లోకి అడుగుపెట్టినప్పుడు చాలా అవమానాలు వచ్చాయి. అప్పట్లో హీరోయిన్స్ని ముట్టుకోకుండా ఆమడ దూరంలో ఉండి చేసే విధానం ఉండేది. నా ఉద్దేశం ఏంటంటే మగవాళ్లు, ఆడవాళ్లు సమానమే అనేది. అందుకే ‘కృష్ణవేణి’ సినిమాను తెలుగు ప్రేక్షకులు గుర్తించుకోగలిగేలా తీయగలిగాను. ఈ సినిమాను చూసిన హీరో ఎన్టీఆర్ గారు మెచ్చుకున్నారు. ‘భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న’ లాంటి సినిమాల్లో ట్రెండ్ని సెట్ చేశాం. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. నేనూ మంచి స్నేహితులం. ఆయన నన్ను ఎంతమందిలో చూసినా ‘ఏం రాజా’ అంటూ పిలిచేవారు. నేను కూడా ఆయన్ని ‘రాజా’ అంటూ పిలచేవాణ్ణి. ‘సాక్షి’ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన యాజమాన్యానికి నా అభినందనలు. ‘సాక్షి’ నన్ను గుర్తించి ‘జీవితసాఫల్య పురస్కారం’ అందించడం అత్యంత సంతోషదాయకంగా భావిస్తున్నా. నా పుట్టిల్లు ఇచ్చిన అవార్డు ఇది – అనసూయ ‘సాక్షి’ మీడియా నా పుట్టినిల్లు. అదే పుట్టినిల్లు నుంచి నా నటనను మెచ్చుకుని ఎక్స్లెన్స్ అవార్డు ఇవ్వడం గర్వంగా ఉంది. నేను ‘సాక్షి’ ద్వారానే గుర్తింపు తెచ్చుకోగలిగాను. ‘రంగమ్మత్త’ లాంటి క్యారెక్టర్ ద్వారా నన్ను తెలుగు ప్రేక్షకుల్లో గుర్తుండేలా చేసిన దర్శకుడు సుకుమార్కు ప్రత్యేక కృతజ్ఞలు. రామ్చరణ్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ లాంటి పేరుమోసిన ఆర్టిస్ట్లతో షూటింగ్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ‘రంగస్థలం’ లోని ‘ఓయ్ చిట్టిబాబూ’ అంటూ హీరో రామ్చరణ్ని వేదిక మీద పిలవడంతో ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు. అదే నిజమైన అవార్డు – రామ్చరణ్ ‘‘రంగస్థలం’ సినిమా నాకే కాదు, యూనిట్ అందరికీ మరచిపోలేని చిత్రం. నిజంగా రెండు కారణాల వల్ల ఈ అవార్డు తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో నిజాయతీగా జనాలు ఓటు వేసి అవార్డులు రావడం అనేది చాలా తక్కువ. ఓ జ్యూరీ కమిటీ ఉంటుంది. వారందరూ కూర్చుని ఎంపిక చేస్తారు. అయితే జనాల్లో నుంచి వచ్చినప్పుడే అది నిజమైన అవార్డు. సాక్షి మీడియా జనాల నుంచి ఓటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేసి చాలా నిజాయతీగా ఐదేళ్ల నుంచి సౌత్ ఇండియాలో అవార్డులు ఇస్తుండటం అభినందనీయం. ఏ అవార్డు తీసుకున్నా ఆనందం రాదు.. మరి ఇలాంటి అవార్డు తీసుకున్నప్పుడు ఓ ఆర్టిస్టుకు నిజంగా ఏదో గెలిచామనే ఆనందం వస్తుంది. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్యూ.. ఇలాంటి అవార్డుల వేడుక ఇంకా ఇంకా కొనసాగాలి. మరో కారణం ఏంటంటే... ఆ వ్యక్తి లేకుంటే, నన్ను కలవకపోయి ఉంటే ఈ అవార్డు లేదు. చాలా మొండోడు.. గట్టోడు. ఏదైనా సాధించేవరకూ వదలడు. పెన్ను పట్టుకుని పేపర్ మీద రాయడం మొదలు పెడితే కథతో, డైలాగులతో, పాత్రలతో ప్రేమలో పడిపోతారు... ఆయనే సుకుమార్. ఆయన డైరెక్టర్ అయ్యారు కానీ, స్కూల్లో లెక్కల మాస్టారులా ఎలా ఉన్నారో షూటింగ్లోనూ అంతే.. ఆయన అనుకున్న లెక్కలు వచ్చే వరకూ వదలడు.. ఆ సన్నివేశం అర్థమయ్యేవరకూ మమ్మల్ని వదలడు. స్కూల్ టీచర్లా మమ్మల్ని అలా చెక్కుతూ చెక్కుతూ మంచి నటన రాబట్టుకున్నారు.. థ్యాంక్యూ సుక్కు. నువ్వు అలా రాబట్టుకున్నావు కాబట్టే రంగమ్మత్త నుంచి దేవిశ్రీ, రత్నవేలుగారికి.. ఇలా అందరికీ ఈ ప్రయాణం సులభమైంది ఈ సినిమా చేయడానికి.. సో హాట్యాఫ్ సుక్కు. ‘రంగస్థలం’ సినిమా చేయడానికి నీ ఆలోచనలే నీ బలం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. జాతీయ అవార్డుకు ఎంపికైన వారందరికీ అభినందనలు. నన్ను హీరోగా పరిచయం చేసన మా డైరెక్టర్ (పూరి జగన్నాథ్) మొన్ననే ‘ఇస్మార్ట్ శంకర్’ తో హిట్ కొట్టారు.. ఈ మధ్యనే మాట్లాడాను.. ఏంటో చరణ్.. హిట్ చూసి మూడేళ్లయింది అన్నారు.. సార్.. ఇది మామూలే.. మేమూ అలాంటివి చూశాం. కానీ మీరు మంచి లవబుల్ డైరెక్టర్. ప్రేక్షకులు ఒక్కసారి ప్రేమిస్తే మళ్లీ మరచిపోరు.. మీ సినిమా కోసం వేచి చూస్తారంతే.. థ్యాంక్యూ’’ అన్నారు. భారతమ్మ చల్లని నీడలో ‘సాక్షి’ – పూరి జగన్నాథ్ ‘సాక్షి’ అంటే నాకు చాలా అభిమానం. ‘సాక్షి’తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ‘సాక్షి’ని స్థాపించింది మన పెద్దాయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు. ఇప్పుడు ఈ మీడియా సంస్థ భారతమ్మ చల్లని నీడలో విజయపథంలో వెళ్లడం ఆనందంగా ఉంది. ప్రతిఏటా ‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డులను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులికి ఇవ్వడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. నా చేత కూడా అవార్డులు ఇప్పించినందుకు సంతోషిస్తున్నా. కృష్ణంరాజుగారి సినిమాలు చూసి పెరిగినవాణ్ణి. అప్పట్లో ఆయన సినిమాల్లోని ఫైట్స్కి ‘డిహే డిహే’ అని సౌండ్స్ వచ్చేవి. ఆ సౌండ్స్ కూడా ట్రెండే. అవార్డు అందుకున్న వేదికపై అవార్డు ఇవ్వడం హ్యాపీ –హాస్యనటుడు అలీ ‘సాక్షి’ మీడియా నాకు ఇదే వేదికపై అవార్డు ఇచ్చింది. ఆరోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే వేదికపై నా చేత అవార్డు ఇప్పించిన ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. అప్పట్లో నరేష్గారిని చూస్తే హిందీ హీరో వస్తున్నాడు అనే చర్చ జరిగేది. అటువంటి మంచి నటుడికి నేను అవార్డ్ ఇవ్వడం గర్వంగా భావిస్తున్నా. గౌరవంగా భావిస్తున్నా –నరేష్ నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగ ప్రవేశం చేశాను. దర్శకులు జంధ్యాలగారు, మా అమ్మ విజయనిర్మలగారు నా గురువులు. నా మొదటి సినిమాను జంధ్యాలగారి దర్శకత్వంలో చేయడం గర్వంగా ఉంది. అదే విధంగా బాపు, విశ్వనాథం, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ రంగరావుగార్ల దర్శకత్వాల్లో సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాను. నేను అవార్డు కోసం సినిమా చేయను. చేసిన సినిమాకు అవార్డు రావాలని ఎదురు చూస్తుంటాను. ‘రంగస్థలం, మహానటి, సమ్మోహనం’ లాంటి చిత్రాల్లో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాను. ఇందుకు నేను గర్విస్తున్నాను. ‘సాక్షి’లాంటి ఉన్నత మీడియా నా నటనను మెచ్చుకుని నాకు అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. నా తొలి అవార్డు – రాహుల్ రవీంద్రన్ ఇది నా జీవితంలో తొలి అవార్డు. ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. వారికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. ఏడేళ్ల క్రితం ఇదే రోజు నేను నటించిన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’ విడుదలైంది. ఈ సినిమా అత్యంత ప్రేక్షకాదరణ పొందినా అవార్డును అందుకోలేకపోయాను. ఆ సమయంలో హీరో నాని నాతో ఓ మాట అన్నాడు. ‘రాహుల్... డెబ్యూ ఫిల్మ్కి అవార్డు ఒకటి కొట్టు. జీవితంలో గుర్తుండిపోతుందని అన్నాడు. కానీ నేను సాధించలేకపోయాను. నా ఏడేళ్ల సినిమా ప్రయాణంలో ‘సాక్షి’ అందించిన ఈ అవార్డే ఫస్ట్ది. అందుకు నేను సాక్షికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ అవార్డు అందుకోవడం గర్వంగానూ ఉంది. జీవితాంతం రుణపడి ఉంటా –అజయ్ భూపతి నా మనసులో ఉన్న భావాన్ని, నేను ఎలా సినిమా తీయాలనుకుంటున్నాను అనే నా ఆలోచల్ని టెక్నీషియన్స్ గుర్తించారు. ‘పిల్లా రా.. ’ అనే పాటలు ఊపిరిపోశాయి. నేను చెప్పిన ప్రతి సీన్కి వాళ్లు ఊపిరిపోయబట్టే ‘ఆర్ఎక్స్–100’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయినే విలన్. అందుకే హీరోయిన్గా, విలన్గా రెండు అవార్డులు పాయల్కు రావడం ఆనందంగా ఉంది. డైరెక్టర్గా నన్ను ‘సాక్షి’ గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం పట్ల జీవితాంతం రుణపడి ఉంటాను. ‘సాక్షి’ నాకు నచ్చిన మీడియా –ఛార్మి ‘సాక్షి’ నాకు నచ్చిన మీడియా. చాలా హానెస్ట్, జెన్యూన్, సూపర్ టాలెంట్. ఈ మీడియాతో నేను చాలా అనుబంధంగా ఉంటాను. చాలా ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. అటువంటి మీడియా సంస్థ నన్ను ఆహ్వానించి, నా ద్వారా అవార్డును ప్రదానం చేయించడం ఆనందంగా ఉంది. ఎక్స్లెన్స్ అవార్డులను అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు సినిమా ఎక్స్లెంట్ –రెజీనా తెలుగు చిత్రాలు జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడం ఆనందంగా ఉంది. అటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేను కూడా భాగస్వామిని అవడం గర్వంగా ఉంది. తెలుగు సినిమా నిజంగా ఎక్స్లెంట్. పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా పాత్రలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రేక్షకులతో పాటు ‘సాక్షి’ మీడియా నన్ను గుర్తించి ‘ఎక్స్లెన్స్’ అవార్డును ఇవ్వడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చిన్న నటుడికి అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్ – సంపూర్ణేష్ బాబు నేనొక చిన్న నటుణ్ణి. నా నటనను మెచ్చుకుని మెగా ఫ్యామిలీ నుంచి కాంప్లిమెంట్స్ రూపంలో వీడియో రావడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా నా లాంటి చిన్న నటుణ్ణి గుర్తించి ఎక్స్లెన్స్ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్, రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని మూడు నిమిషాల నిడివిగల డైలాగ్ని చెప్పి అలరించాడు. నిజమైన అవార్డు – దేవిశ్రీప్రసాద్ కష్టపడినవాడిని గుర్తించి ఈ అవార్డు ఫలనా వ్యక్తికే చెందినది అంటూ ‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డులను ప్రదానం చేయడం సంతోషంగా ఉంది. ఇది నిజమైన అవార్డు. గతంలో కూడా ‘సాక్షి’ నాకు అవార్డు ప్రకటించింది. ఆ సమయంలో నేను ఇండియాలో లేకపోవడం వల్ల అందుకోలేని పరిస్థితి. అయినా ఆ అవార్డు దేవిశ్రీ ప్రసాద్కే చెందినది అంటూ నా తమ్ముణ్ణి (సాగర్)ని పిలిచి అవార్డు ఇవ్వడం ఆనందంగా అనిపించింది. అందుకే ‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డును రియల్ అవార్డుగా పరిగణిస్తున్నా. నేను సంగీతం అందించిన ప్రతి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ నాకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తున్నందుకు గర్వంగా ఉంది. ఓవర్నైట్ స్టార్ అయిపోయా – పాయల్ రాజ్పుత్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా నా జీవితంలో గుర్తుండిపోయే ఓ మైలురాయి. ఆ సినిమాతో నేను ఓవర్నైట్ స్టార్ని అయిపోయా. దర్శకుడు అజయ్ భూపతి నన్ను ఎందుకు హీరోయిన్గా ఎంచుకున్నారో సినిమా విడుదలయ్యాక తెలిసింది. ఆ సినిమా అత్యంత ప్రజాదరణ పొందబట్టే నన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. నాకు ఇంత మంచి పేరు వచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నా (ఆనంద భాష్పాలతో). తెలుగు సినీ పరిశ్రమ నాకొక మంచి అవకాశాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టింది. అటువంటి ఓ మంచి సినిమాకి సాక్షి అవార్డు ఇవ్వడం నేను గర్వంగా ఫీలవుతున్నా. గర్వంగా ఉంది – పూజాహెగ్డే ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి మంచి సినిమాకు నాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా అభినయం, అందానికి మెచ్చి నాకు ఈ సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు రావడం హ్యాపీ. అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. అ అవార్డుకు ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్. ఆయన నా మీద నమ్మకంతో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్లో నన్ను హుందాగా, అందంగా చూపించారు. హీరోయిన్ పాత్రతో పంచ్లు వేయించడం ఆయనకే చెల్లింది. గోదావరి ప్రజలకు అంకితం – రత్నవేలు గోదావరి పరిసర ప్రాంతాల్లో ‘రంగస్థలం’ షూటింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించాం. తెలుగు సినిమాటోగ్రఫీ ఇంత గొప్పగా ఉంటుందా? అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకుమార్గారికి, రామ్చరణ్గారికి థ్యాంక్స్. సాక్షి ఇచ్చిన ఈ అవార్డుని గోదావరి ప్రజలకు అంకితం ఇస్తున్నా. కథ అమ్మలాంటిది – సునీల్ సినిమాల కోసం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు రచయిత త్రివిక్రమ్ నన్ను ఆదరించాడు. నేను సినిమాల్లో నటించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. సినిమాకి కథ అమ్మలాంటిది. అటువంటి కథకు త్రివిక్రమ్ ప్రాణం పోస్తారు. స్క్రిప్ట్రాసే వాడు అమ్మలాంటి వారైతే... దర్శకుడు తండ్రిలాంటి వాడు. తల్లి, తండ్రి కలిసి సినిమాను తీసి, సినిమా ద్వారా ప్రపంచానికి మాలాంటి వారిని పరిచయం చేస్తున్నారు. ఈ రోజు ‘సాక్షి’ నుంచి అందుకున్న అవార్డు నాకు ఎంతో ప్రత్యేకమైనది. దీనికి ప్రధాన కారణం త్రివిక్రమే. ఇంకేం ఇంకేం కావాలి – అనంత శ్రీరామ్ అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటకు అవార్డు రావడం ‘ఇంకేం ఇకేం కావాలే’ అన్నట్టుగా ఉంది. పురస్కారం అనేది ఒక విజయం, ఒక గుర్తింపు. అటువంటి పురస్కారాన్ని సాక్షి నన్ను గుర్తించి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ‘గీత గోవిందం’ సినిమా డైరెక్టర్ పరశురామ్గారు నాపై నమ్మకంతో పాట రాసే అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ పాట రాసి 300 మిలియన్ ప్రేక్షకులు ఆదరించగలిగే సామర్థ్యాన్ని తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ప్రత్యేక గుర్తింపు – నిధీ అగర్వాల్ ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు నేను హీరోయిన్గా పరిచయం అయ్యాను. దీనికి ప్రధాన కారణం హీరో నాగచైతన్య. ఆయనకు థ్యాంక్స్. దర్శకుడు చందూమొండేటి నన్ను వెతికి మరీ హీరోయిన్గా సెలక్ట్ చేయబట్టే మీ ముందు ఇలా ఉన్నాను. ‘సాక్షి’ ప్రత్యేకంగా నన్ను గుర్తించి నా నటన మెచ్చుకుని ఎక్స్లెన్స్ అవార్డును ప్రదానం చేయడం సంతోషంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం –అడివి శేషు వందశాతం కష్టపడి ‘గూఢచారి’ సినిమాను తీశాను. సినిమా ప్రేక్షాకాదరణ పొందటమే కాకుండా నన్ను ఉన్నత శిఖరంలో నిలబెట్టింది ఈ సినిమా. వందశాతం కష్టపడి చేశాను కాబట్టే సాక్షి నన్ను గుర్తించి ఎక్స్లెన్స్ అవార్డును ప్రదానం చేసింది. అందుకు సాక్షికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కష్టానికి ప్రతి ఫలమే ఎక్స్లెన్స్ అవార్డు. ఈ అవార్డు ప్రత్యేకం – చిన్మయి గాయనిగా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా కుటుంబ ప్రోత్సాహమే. ఇంతమంది కథానా యికలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటమే కారణం. నా భర్త రాహుల్ రవీంద్రన్ నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, నా భుజం తడుతూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఈ రోజు సాక్షి అవార్డు అందుకోవడం ప్రత్యేకం. సోషల్ మీడియాలో అభినందనలతో పాటు తిట్లు వస్తుంటాయి. నేను కూడా అదే రీతిలో స్పందిస్తుంటాను. -
పరుచూరి బ్రదర్స్కు జీవిత సాఫల్య పురస్కారం
మే 4న దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 75వ జయంతి. ఈ సందర్భంగా అంతర్జాతీయ సాంస్కృతిక సాహితీ సేవాసంస్థ వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్, రేలంగి నరసింహారావు చైర్మన్గా ఏర్పడిన డా. దాసరి– వంశీ జీవిత సాఫల్య పురస్కారం కమిటీలు ఈ నెల 10న ప్రముఖ సినీరచయితలు పరుచూరి బ్రదర్స్ (పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ)కు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు పేర్కొన్నారు. -
భాగ్యనగరం తల్లిలాంటింది!
సాక్షి, సిటీబ్యూరో: భారతదేశంలో ప్రఖ్యాత సితార్ విద్యాంసుల్లో పండిట్ జనార్దన్ మిట్టా ఒకరు. స్వయంకృషితో ఎదిగిన హిందూస్థానీ సంగీత సాధకుడాయన. ఆరు దశాబ్దాలుగా సినీ, శాస్త్రీయ సంగీత రంగాలకు సేవ చేసిన జనార్దన్.. కళా నిలయమైన హైదరాబాద్లోనే జన్మించారు. చిన్న వయసులోనే సితార్పై మక్కువ పెంచుకుని ఎవరి శిక్షణ లేకుండానే సంగీతంపై పట్టు సాధించారు. ఆనాటి దక్కన్ రేడియోలో బాల కళాకారుడిగా కచేరీలు కూడా ఇచ్చారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ వద్ద మెలకువలు నేర్చుకుని దక్షిణాదిన తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సంగమం ఆధ్వర్యంలో అరవై వసంతాల సంగీత వేడుకల సందర్భంగా లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డు అందుకొనేందుకు ఇటీవల రవీంద్రభారతికివచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. విదేశాల్లో సంగీత ప్రయాణం.. పండిట్ జనార్దన్ శాస్త్రీయ రంగంలో గాయకి, తంత్రకారి శైలులు రెండింటిపై పట్టు సాధించిన అరుదైన కళాకారుడిగా పేరు పొందారు. దేశ విదేశాల్లో పర్యటించి హిందూస్తానీ కచేరీలు చేశారు. వి.రాఘవన్, టీఎన్ కృష్ణన్, ఎం చంద్రశేఖరన్ , టీవీ గోపాలకృష్ణన్, కన్యాకుమారి, ఉస్తాద్ షేక్ దావూద్, జాకీర్ హుస్సేన్ వంటి సంగీత దిగ్గజాలతో జుగల్బందీలనూ, ఫ్యూషన్ సంగీత కచేరీలు చేశారు. అమెరికా, యూకే, యూరప్, ఫ్రాన్స్, బెల్జియం, పోలాండ్, జర్మనీ, శ్రీలంక, వెస్టిండీస్, సింగపూర్ వంటి దేశాల్లో తన సితార్ కచేరీలతో ప్రేక్షకులను మైమరపించారు. 1971లో న్యూయర్క్లోని ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేశారు. పండిట్ రవిశంకర్ తర్వాత ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేసిన వాద్య కళాకారుడు మన జనార్దన్ మాత్రమే. 1976లో తిరువాయూరులో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో కచేరీ చేసిన తొలి హిందూస్థానీ వాద్య కళాకారుడిగా ప్రత్యేకతను పొందారు. కంచి కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠాల ఆస్థాన విద్వాన్గా సేవలందించారు. సాదర స్వాగతం పలికిన సినీ ప్రపంచం.. జనార్దన్ మిట్టా ప్రతిభను గుర్తించిన సినీ ప్రపంచం సాదరంగా ఆహ్వానించింది. 1958లో భాగ్యదేవత చిత్రంలోని పాటలకు సితార్ను వాయించడంతో తన సినీ కెరీర్ను ప్రారంభించారు. ఎస్. రాజేశ్వరావు మొదలుకొని ఏఆర్ రెహమాన్ వరకు దక్షిణాది అన్ని భాషల సంగీత దర్శకుల దగ్గర ప్రధాన సితార్ వాద్యకారుడిగా పనిచేశారు. దక్షిణాది భాషలతో పాటు పలు హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ సినీ గీతాలలో కూడా తన సితార్ మెరుపులు మెరింపించారు. తన ఆరు దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు ముప్పైవేల పాటలకు సితార్ వాద్య సహకారాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఎన్నో వందల చిత్రాల రీరికార్డింగ్ల్లో సన్నివేశాలకు తన సితార్ నాదంతో జీవం పోశారు. తెలుగులో రంగుల కల, అగ్ని సంస్కారం, మలయాళంలో ఎసైప్పన్, సంస్కార్ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. బ్లిస్, శ్రీశైలం, యాభై వసంతాల ఉస్మానియా యూనివర్సిటీ వంటి లఘు చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించారు. కథలు సమాజాన్ని ప్రభావితం చేయాలి కమల్హాసన్ నటించిన మాటలు లేని పుష్పక విమానం చిత్రంలో తెర వెనుక జనార్దన్ సితార్ ఎన్నో భావాలను పండించింది. ఇక చరిత్రలో నిలిచిపోయే ఘంటసాల భగవద్గీతలో కూడా జనార్దన్ తన సితార్ వాదనతో అమరత్వాన్ని అద్దారు. ఎన్నెన్నో పురస్కారాలు ... మద్రాస్ సినీ మ్యూజిషియన్స్ యూనియన్కు అధ్యక్షుడిగా, ట్రస్ట్ కన్వీనర్గా వ్యవహరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని, సంగీత కళాభారతి, సంగీత శిరోమణి, సితార్ చక్రవర్తి, సితార్ సమ్రాట్ వంటి ఎన్నో బిరుదులు, అవార్డులు అందుకున్నారు. తాను నెలకొల్పిన విశ్వకళా సంగమ సంస్థ ద్వారా కళారూపాలనూ, కళాకారులనూ ప్రోత్సహిస్తున్నారు. ‘ఎన్నెన్నో పురస్కారాలు అందుకొని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అరవై వసంతాల సంగీత జీవిత వేడుకల సందర్భంగా పొందిన టైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు (స్వర్ణ కంకణం) జీవితంలో మరువలేను. భాగ్యనగరంతల్లిలాంటింది. వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడినా హైదరాబాద్కు వస్తే తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు ఉంటుంది. ఈ నేల, ఈ గాలి, ఈ వాతావరణం ఎప్పుడూ మరువలేను. హైదరాబాద్కు ఎంత చేసినా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోలేనిది’ అన్నారు ఆయన. -
‘సాక్షి’ ఫొటో ఎడిటర్కు లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ‘సాక్షి’ పత్రిక ఫొటో ఎడిటర్ రవికాంత్రెడ్డి లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అందుకున్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ జర్నలిజం దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో 2018–ఇండియా ప్రెస్ ఫొటో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మంత్రి దేవినేని ఉమా జ్యోతి ప్రజ్వలన చేసి మూడో జాతీయ స్థాయి ఫొటో ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. చెప్పలేని భావాలు, సందర్భాలను కళ్లకు కట్టినట్లుగా చెప్పేవి ఫొటోలేనన్నారు. ఫొటో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీకి మొత్తం 1,890 ఫొటోలు వచ్చాయని చెప్పారు. ఫొటోగ్రాఫర్లల్లో సృజనాత్మకతను పెంచడానికి వర్క్షాప్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ‘సాక్షి’ ఫొటో ఎడిటర్ రవికాంత్రెడ్డి, ఆంధ్రజ్యోతి పత్రిక మాజీ ఎడిటర్ దండమూడి సీతారామ్కు లైఫ్ టైమ్ ఎఛీవ్మెంట్ పురస్కారం అందజేశారు. అలాగే పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు కూడా అవార్డులు అందజేశారు. వీరిలో ‘సాక్షి’కి చెందిన పలువురు ఫొటోగ్రాఫర్లున్నారు. స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో జి.వీరేష్ (అనంతపురం), కె.చక్రపాణి (విజయవాడ), ఎండీ నవాజ్ (విశాఖ)కు కన్సోలేషన్ బహుమతులు.. వి.రూబెన్ బెసాలియేల్ (విజయవాడ), వీరభగవాన్ తెలగరెడ్డి (విజయవాడ), ఐ.సుబ్రమణ్యం (తిరుపతి), పి.విజయకృష్ణ (విజయవాడ), ఎం.వెంకటరమణ (గుంటూరు)కు స్పాట్ న్యూస్, జనరల్ న్యూస్ విభాగాల్లో శ్యాప్ ఎచీవ్మెంట్ అవార్డులు దక్కాయి. ఎన్.కిశోర్ (విజయవాడ), ఎం.మనువిశాల్ (విజయవాడ)కు ఎఫ్ఐసీ హానర్బుల్ మెన్షన్ అవార్డులు.. తెలంగాణకు సంబంధించిన శివ కొల్లోజు(యదాద్రి)కు బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఎం.రవికుమార్ (హైదరాబాద్), దశరథ్ రజ్వా (కొత్తగూడెం)కు స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో కన్సోలేషన్ బహుమతి లభించింది. గుంటుపల్లి స్వామి (కరీంనగర్)కి జనరల్ న్యూస్ విభాగంలో ‘మారుతీరాజు మెమోరియల్’ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు, కల్చరల్ సెంటర్ చైర్మన్ వైహెచ్ ప్రసాద్, సీఈవో శివనాగిరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే నాయకుడు అంబటి ఆంజనేయులు, చందు జనార్ధన్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సీహెచ్వీఎస్ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి వై.డి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ ఫొటో ఎడిటర్కి లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
సాక్షి, అమరావతి: స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మూడో జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’ఫొటో ఎడిటర్ కె.రవికాంత్రెడ్డికి లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు లభించింది. ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ దండమూరి సీతారామ్, ఈనాడు దినపత్రిక సీనియర్ ఫొటోగ్రాఫర్ కేశవులు కూడా ఎంపికయ్యారు. 2018వ సంవత్సరానికి స్పాట్, జనరల్ న్యూస్, పర్యాటకం అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 18 రాష్ట్రాల నుంచి 1,890 ఫొటోలు ఎంట్రీలుగా నమోదయ్యాయి. ముంబైకి చెందిన ఫోర్బ్స్ పత్రిక చీఫ్ ఫొటోగ్రాఫర్ వికాస్ కోట్, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.నాగేశ్వరరావు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చీఫ్ ఫొటోగ్రాఫర్ ఆర్బీ కోటేశ్వరరావులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన ‘సాక్షి’ఫొటో జర్నలిస్ట్లకు పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. బహుమతుల్ని నవంబర్ 1న విజయవాడ కల్చరల్ సెంటర్లో ప్రదానం చేస్తారని స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
జమునకు జీవితసాఫల్య పురస్కారం
డల్లాస్, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు 95వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా డల్లాస్లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఏఎఫ్ఏ ప్రస్తుత అధ్యక్షులు రావు కల్వల మాట్లాడుతూ..1992, 2012 లో అక్కినేని నాగేశ్వరరావును డల్లాస్కు ఆహ్వానించి తీసుకువచ్చిన డా. ప్రసాద్ తోటకూర నాయకత్వంలోనే 2014 లో ఏఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలియజేశారు. అప్పటినుండి ఇప్పటికివరకు నాలుగు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని, ఈ సంవత్సరం డిసెంబర్ 22న సాయంత్రం 4 నుండి 7:30 గంటల వరకు కరీంనగర్ లో ప్రతిమా మల్టీప్లెక్స్ లో ఐదవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని జరుపుతున్నట్లు ప్రకటించి అందరూ హాజరు కావలసిందిగా ఆహ్వానం పలికారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ డా. అక్కినేనిని ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషిగా గుర్తించి, ఆయన అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా గడిపిన కొంతమంది మిత్రులం కలిసి అమెరికాలో “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” అనే సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా. అక్కినేని కృష్ణా జిల్లాలో, ఒక కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించినా కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యం, దూరదృష్టి లాంటి లక్షణాలతో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ లక్షణాలు అందరికి ఆదర్శనీయం కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి సంవత్సరం తెలుగుగడ్డ పై అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని పేర్కొన్నారు. ఏఎఫ్ఏ సంస్థకు డా. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు) , రావు కల్వల (అధ్యక్షులు), శారద అకునూరి (ఉపాధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట ( కార్యదర్శి), ధామా భక్తవత్సలు (కోశాధికారి), డా. సి.ఆర్. రావు, రవి కొండబోలు, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 2018 పురస్కార గ్రహీతలు : జీవిత సాఫల్య పురస్కారం : అనేక సాంఘిక, పౌరాణిక చిత్రాలలో అద్వితీయమైన పాత్రలను పోషించి అందరి అభిమానాన్ని చూరగొన్న కథానాయకి, పూర్వ లోకసభ సభ్యురాలు, ‘కళాభారతి’ జమున. విద్యా రత్న: ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు, పూర్వ శాసనమండలి సభ్యులు, ప్రస్తుత రాజకీయాలపై తన నిష్పక్షపాత వైఖరితో కూడిన రాజకీయ విశ్లేషణ చేస్తున్న ప్రొఫెసర్ కె. నాగేశ్వర్. సినీ రత్న: సినీ రంగంలో అద్భుతమైన గీతాలు రాస్తూ గీత రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత గా పురస్కారం అందుకున్న డా. సుద్దాల అశోక్ తేజ. విశిష్ట వ్యాపార రత్న: పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా పవర్ రంగంలో ‘పవర్ మెక్’ కంపెనీ ద్వార అద్భుత విజయాలు సాధించి, తన ప్రగతిని కేవలం లాభాల్లోనే లేక్కవేసుకోకుండా సామాజిక స్పృహతో విద్యా, వైద్య రంగాల్లో తనవంతు సహాయం చేస్తున్న పారిశ్రామికవేత్త సజ్జా కిషోర్ బాబు. రంగస్థల రత్న : ఆదిభట్ల నారాయణదాసు శిష్య పరంపరలో హరికథల్లో శిక్షణ తీసుకుని ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్.వి. సంగీత, నృత్య కళాశాలలో హరికథా విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తూ, హరికథా రంగంలో అగ్రగణ్యులైన డా. ముప్పవరపు సింహాచల శాస్త్రి. వైద్య రత్న : కరీంనగర్ లోని ‘ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)’ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న బి. శ్రీనివాసరావు. సేవా రత్న: ‘వృక్షో రక్షతి రక్షతః’ అనే నినాదంతో తన జీవితాన్ని చెట్ల పెంపకానికి అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటుతున్న వనజీవి పద్మశ్రీ ‘దారిపెల్లి జానకి రామయ్య’. వినూత్న రత్న: తన అద్భుతమైన కళాదృష్టితో వ్యర్ధ పదార్దాల నుండి కూడా అద్భుతమైన కళాఖండాలను తయారుజేసి తన ఇంటినే మ్యుజియం గా మార్చిన చిత్రకారిణి డా. కమలా ప్రసాద రావు -
కేరళలో దళితులను ఆదుకోవాలి: చుక్కా రామయ్య
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో శ్రీమంతులు నిలదొక్కుకుంటున్నారని, దళిత, గిరిజన, ఆదివాసీలు మాత్రం నిరాశ్రయులయ్యారని అలాంటి వారిని ఆదుకుని మానవత్వం చాటాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాక్షి దినపత్రిక ఇటీవల చుక్కా రామయ్యకు జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.లక్ష నగదును అందచేయగా, ఆ మొత్తాన్ని కేరళ వరద బాధితులకు అందించారు. కేరళకు చెందిన దళిత ఫ్యాంథర్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అంబుజాక్షన్కు ఆయన ఈ చెక్కును అందించారు. కేరళకు విదేశాల నుంచి వచ్చే సాయాన్ని తిరస్కరించరాదని, దాన్ని పేదల కోసం వినియోగించాలని రామయ్య సూచించారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీ నర్ మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ ఐఏఎస్ కాకి మాధవరావులు మాట్లాడుతూ.. కేరళలో నిమ్నవర్గాల పట్ల చూపిస్తున్న వివక్ష తగదని, అక్కడి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం
వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత విష్ణు బొప్పన మూడేళ్లుగా బుల్లితెర అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి వెండితెర అవార్డులు అందించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా ఈ వేడుక జరిగింది. సీనియర్ దర్శకులు ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ అవార్డు తనకెంతో సంతృప్తి ఇచ్చిందని విశ్వనాథ్ అన్నారు. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావుకు లెజెండ్రీ అవార్డును, మరో సీనియర్ నటుడు గిరిబాబుకు ఆల్రౌండర్ పురస్కారం అందించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు ఇచ్చారు. బాల తారల్లో అవార్డు అందుకున్నవారిలో ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని, ‘అప్పూ’ ఫేమ్ డి. సాయి శ్రీవంత్ తదితరులు ఉన్నారు. ఈ వేదికపై పేద కళాకారులకు ఆర్థికసాయం చేశారు. ‘‘ఈ వేడుక విజయవంతం కావడానికి స్పాన్లర్లే కీలకం.. వారందరికీ థ్యాంక్స్’’ అన్నారు విష్ణు బొప్పన. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఐజీ మాగంటి కాంతారావు, ఐఏఎస్ మాగంటి ఉషారాణి ముఖ్య అతిథులుగా హాజరవగా, నటి జయప్రద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటీనటులు సుమన్, భానుచందర్, సత్యప్రకాష్, ఏడిద శ్రీరామ్, కవిత, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చుక్కా రామయ్య
-
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: జీవిత సాఫల్య పురస్కారం: సూపర్ స్టార్ కృష్ణ,విజయ నిర్మల
-
విదేశాల్లో భారత నేతలను గెలిపించాలి: యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న భారతీయులకు చేయూతనిచ్చి వారిని సెనెటర్లుగా, కాంగ్రెస్మెన్లుగా గెలిపించినప్పుడే భారతీయుల గర్జన ప్రపంచమంతా వినిపిస్తుందని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. అమెరికాలో జరిగిన తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ తెలుగు సంఘం (టాటా) సంయుక్తంగా యార్లగడ్డకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశాయి. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. రాజా కృష్ణమూర్తి, అరుణా మిల్లర్, చివుకుల ఉపేంద్ర వంటి ఇండో–అమెరికన్ రాజకీయవేత్తలకు అమెరికాలోని తెలుగు ప్రజలు చేయూతనివ్వాలని కోరారు. ఎన్టీఆర్ తెలుగు భాష కోసం ప్రాణమిచ్చారని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుకు ప్రాచీన హోదా కోసం కృషి చేశారని గుర్తు చేశారు. సంస్కృతిని కాపాడుకునేందుకు కావాల్సింది సఖ్యత అని ఆటా–టాటా సంస్థలు చాటి చెప్పాయన్నారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు ఆసిరెడ్డి కరుణాకర్, టాటా అధ్యక్షుడు హరనాథ్ పొలిచెర్ల తదితరులు పాల్గొన్నారు. -
చిట్టితల్లికి జేజేలు
విశాఖ కల్చరల్: ప్రతిభతో.. సేవా దృక్పథంతో.. రాణిస్తున్న మహిళలను సత్కరించారు.. సమాజానికి దశ దిశ నిర్దేశించల మార్గ దర్శకులైన అతివలకు జేజేలు పలికారు.. పురస్కార గ్రహీతల్లో విజయనిర్మల వం టి దర్శక దిగ్గజం నుంచి కలశ మేడపురెడ్డి వంటి నాలుగేళ్ల చిన్నారి వరకు విభిన్న రంగాల వారు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ టూరిజం సంస్థ, జె–వరల్డ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వి–టీఎం ఈవెంట్ మేనేజర్ సంస్థ సీఈఓ వీరూమామ నిర్వహించారు. గిన్నిస్బుక్ రికా ర్డుల్లోకెక్కిన సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మలకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల రాలేక పోవడంతో ఆమె తనయుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రధాన కార్యదర్శి నరేష్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైజాగ్ తనకు తల్లిలాంటిదని నరేష్ అన్నారు. ప్రతి మనిషి జీవితంలో రెండుసార్లు పుడతాడు. అమ్మ కడుపులోంచి ఒకసారి, ఎక్కడైతే వృత్తి ప్రారంభమైందో అక్కడ మరోసారి పుడతాడు. ఈ విధంగా వైజాగ్ తన కు తల్లితో సమానమని వివరించారు. తన గురువు జంధ్యాల దర్శకత్వంలో సినీ కెరీర్ నాలుగు స్తంభాలాటతో ప్రారంభమైందన్నారు. విశాఖలోనే తాను నటించిన జంబలకడి పంబ వంటి పలు చిత్రాల షూటింగ్ జరిగి అద్భుత విజయాలు సాధించాయన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, దక్షిణాది సూపర్స్టార్ శరత్కుమార్, సినీ దర్శకురాలు బి.జయ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరేష్, ఏపీ పర్యాటక సంస్థ డైరెక్టర్ పి.ఎస్.నాయుడు, టాలీవుడ్ నిర్మాత బి.ఎ.రాజు, వీజేఎఫ్ ప్రెస్క్లబ్ అధక్షుడు గంట్ల శ్రీనుబాబు, గంటా నారాయణమ్మ ట్రస్ట్ చైర్పర్సన్ గంటా శారద, సురక్ష హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ నటి శ్రీదేవి, సిరియా అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వసంత కోకిల చిత్రంలో ఇళయారాజా స్వరపరిచిన ‘కథగా కల్పనగా..’ పాటను శ్రీదేవి స్మృతిగా ఆలపించారు. సందర్భానికి సరితూగేలా యుగే..యుగే.. నా ధర్మము.. అనే పల్లవితో సాగిన గీతం మహిళల మనోభావాలను ఆవిష్కరించింది. నృత్య ప్రదర్శనల మధ్యలో క్విజ్, దివ్యాంగులు/ ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారి సాంస్కృతిక ప్రదర్శనలు వెరసి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగారూ రూపొందించారు. పురస్కార గ్రహీతలు వీరే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి వి–టీమ్ అంతర్జాతీయ మహిళా పురస్కారాలు స్వీకరించారు. వీరిలో పద్మినీ కచ్చపి (సంగీతం–అమెరికా), నజరత్ హజాన్ (దుబాయ్–శాంతి), హరిక కొలివెలసి (ఏపీ–సంఘ సేవ), బి.జయ (టాలీవుడ్ దర్శకురాలు), కల్పన (సినీ నేపధ్యగాయని), పల్లవి(బుల్లితెర నటి), కలశ మేడపురెడ్డి (చిన్నారి సంఘ సేవకురాలు), శరణి గంటా (నారాయణ గ్రూప్ విద్యాసంస్థల డైరెక్టర్), సీతా మాడభూషి (సంప్రదాయ నాట్యం), సనా(టాలీవుడ్ క్యారెక్టర్ నటి), మార్టినా డి–క్రూజ (అడ్వాన్స్ ఎడ్యుకేషన్), జి.లక్ష్మి (పోలీసు), సమలినీ ఫోనిక్సా(శ్రీలంక నటి) ఈ పురస్కారాలందుకున్నారు. కార్యక్రమానికి సౌత్ ఇండియా టైటిల్ విజేత గాయత్రి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
‘సినిమాను బతికించుకోవాలి..’
సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు బెంగళూరులో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు గురువారం రాత్రి నుంచి ఆరంభమయ్యాయి. నగరంలో వివిధ థియేటర్లలో జరుగుతున్న అపురూప సినిమాలను వీక్షించడానికి పెద్దసంఖ్యలో సినీ ప్రముఖులు, చిత్రప్రియులు తరలివస్తున్నారు. ఈ ఏడాది ప్రముఖ దర్శక దిగ్గజం మణిరత్నంను జీవన సాఫల్య పురస్కారంతో ఫిల్మ్ ఫెస్టివల్ సత్కరించనుంది. కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్ ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని 13 సభ్యుల ఎంపిక కమిటీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు మణిరత్నంను ఎంపిక చేసింది. మార్చి 1న ముగింపు వేడుకల్లో ఆయనను సన్మానిస్తారు. మరోవైపు ఉత్సవాల రెండోరోజు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై నిపుణులు చర్చించారు. అంతేకాకుండా భారత్లో సెన్సార్ అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. సినిమాను బతికించుకోవాలి: రాజేంద్రసింగ్ రాజేంద్రసింగ్ బాబు సెన్సార్షిప్లో ఎదురయ్యే ఇబ్బందులను చర్చించారు. సెన్సార్ బోర్డు రాజకీయ ప్రేరేపణలో పనిచేస్తోందని చెప్పారు. సినిమాను బతికించుకోవాలంటే ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలసి ఒక క్రమమైన విధివిధానాలను రూపొందించుకోవాలని సూచించారు. సినిమా చిత్రీకరించడం ఒక ఎత్తయితే, దానికి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ సాధించడం మరో ఎత్తని ఆయన తెలిపారు. సీబీఎఫ్సీ ప్రాంతీయ అధికారి శ్రీనివాసప్ప మాట్లాడుతూ.. నియమావళి ప్రకారమే సెన్సార్షిప్ చేస్తున్నాం. అయినా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని ఎలాగైనా పరిష్కరించుకుంటామని తెలిపారు. దిమిత్రివ్ దే క్లెర్క్, మహేష్ నారాయణన్, రత్నా సేన్గుప్తా అనే ముగ్గురు దర్శకులు ముచ్చటిస్తూ సినిమాలపై ఆసక్తితో తాము ఈ రంగానికి ఎంచుకున్నట్లు తెలిపారు. సినిమా ద్వారా ఎంతోమందిలో స్ఫూర్తినింపొచ్చని తెలిపారు. సూపర్ సెన్సారింగ్ ఇబ్బందికరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ శత్యూ మాట్లాడుతూ.. తనకు సెన్సార్ బోర్డు వ్యవహార శైలీతో ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ సినిమా విడుదలయ్యాక అందులో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని, కొన్ని సీన్లు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ చాలామంది సూపర్ సెన్సార్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పద్మావత్ మణికర్ణిక తదితర సినిమాలపై కొంతమంది వ్యక్తులకు వచ్చే ఇబ్బందులేంటో ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్పారు. సినిమా వ్యక్తులు ఇలాంటి ఎన్నో కష్టాలను అధిగమించి విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం చాలా దారుణమని తెలిపారు. దేశంలో సెన్సార్ వ్యవస్థను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. -
డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డికి ‘ఐఎంఏ డాక్టర్ ఎంజీ గార్గ్ జీవిత సాఫల్య పురస్కారం’లభించింది. ముంబైలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమానికి వెయ్యిమంది ప్రసిద్ధ వైద్యులు హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగంలో ఆయన చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు ఐఎంఏ తెలిపింది. -
గాయకులకు జీవితసాఫల్య పురస్కారాలు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ హాలులో గాయకులకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. ప్రముఖ గాయని పి.సుశీలతోపాటు దానా గిలెస్పీలను ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చేతనారాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత సత్కరించి పురస్కారాలు అందజేశారు. సత్యసాయిబాబా సన్నిధిలో లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డులు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దానా గిలెస్పీ కర్ణాటక సంగీతంతో సత్యసాయి గీతాలతో మైమరిపించారు. సత్యసాయి తమ జీవితాలకు మూలస్తంభం లాంటివారని పురస్కార గ్రహీతలు పేర్కొన్నారు. అనంతరం సత్యసాయి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు సత్యసాయి, శివుడు, షిర్డీసాయి పలు అవతార ఘట్టాలను వేదికపై ప్రస్ఫుటింపజేశారు. నాటికలతో పాటు నృత్యాలు చేస్తూ మహిళా దినోత్సవాన్ని రంజింపజేశారు. అనంతరం ఈశ్వరమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహుతులను సన్మానించారు. మహామంగళ హారతి, భజన కార్యక్రమాలు కొనసాగాయి. -
ప్రకాశ్ పడుకోన్కు జీవిత సాఫల్య పురస్కారం
కొచ్చి: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్ ‘బాయ్’ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఈ ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డుకు శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి. బాయ్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘కొత్తగా ప్రవేశపెట్టిన ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తాం. బ్యాడ్మింటన్లో విశేష సేవలందించిన వారికి ప్రతీ ఏడాది ఈ అవార్డు ఇస్తాం. బెంగళూరులో జరిగిన గత ఎగ్జిక్యూటివ్ మీటింగ్లోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాం. తొలి అవార్డును పడుకోన్కు ఇవ్వాలని కోర్ కమిటీ ప్రతిపాదించింది’ అని అన్నారు. 1980లో ప్రకాశ్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ టైటిల్ను సాధించారు. 1983లో ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం, 1978 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలిచారు. కేంద్ర ప్రభు త్వం ద్వారా 1972లో ‘అర్జున’, 1982లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు అందుకున్నారు. -
నేడు సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం
ముఖ్య అతిథిగా బర్ఖాదత్ - ‘తెలుగు శిఖరం’గా డాక్టర్ దాసరి నారాయణరావు - కైకాల సత్యనారాయణకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు సాక్షి, హైదరాబాద్: సమాజంలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందజేసిన ప్రముఖులకు ప్రతి ఏటా అందజేసే ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఫిల్మ్నగర్ జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ప్రముఖ టెలివిజన్ జర్నలిస్టు, రచయిత్రి బర్ఖాదత్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అడిషనల్ డీజీపీ అంజనీ కుమార్, రెయిన్బో హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్–మెటర్నల్ అండ్ ఫెటల్ మెడిసిన్ డాక్టర్ ప్రణతీరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వినోద్ అగర్వాల్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, జలమండలి ఎండీ దానకిశోర్, పర్యాటక శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషి, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, సాగర్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తెలుగు శిఖరం దాసరి కన్నులపండువగా జరగనున్న ఈ వేడుకల్లో తెలుగు సినీ దిగ్గజం, డాక్టర్ దాసరి నారాయణరావుకు ‘తెలుగు శిఖరం’ అవార్డును అందజేయనున్నారు. అలా గే ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోనున్నా రు. సామాజిక సేవ, సాహిత్య, సాంస్కృతిక రంగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, క్రీడలు, సినిమా తదితర రంగాల్లో ఉత్తమ సేవలందజేసిన వ్యక్తులు, సంస్థలు, నటీనటులు, క్రీడాకారులకు ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులను అందజేయనున్నారు. గత రెండేళ్లుగా సాక్షి ఆయా రంగాలకు చెందిన వారి సేవలను గుర్తించి, విజేతలను ఎంపిక చేసి అవార్డులను అంద జేస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయ నిపుణుల బృం దం విజే తల ఎంపికలో ప్రతిష్టాత్మకంగా వ్యవహ రించింది. ఆయా రంగా ల్లో వారు అందజేస్తున్న సేవలు, సాధించిన విజయాలు, సమాజ పురోగమనంలో వారి ప్రభావం వంటి అంశా లను ప్రామాణికంగా తీసుకుని అవార్డులకు ఎంపిక చేశారు. -
రేపు జిత్కు జీవిత సాఫల్య పురస్కారం
విశిష్ట అతిథిగా హాస్యనటుడు అలీ రాజమహేంద్రవరం కల్చరల్ : నవరస నటసమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో గాయకుడు, నటుడు శ్రీపాద జిత్మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్టు సమాఖ్య గౌరవాధ్యక్షుడు పట్టపగలు వెంకటరావు తెలిపారు. శుక్రవారం ఆనం రోటరీహాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. సుమారు 210 సినిమాల్లో నటుడిగా, 65 ఏళ్లుగా గాయకుడిగా,న్యాయవాదిగా, క్రీడాకారుడిగా జిత్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేస్తున్నామన్నారు. జిత్ మోహన్ మిత్రా నగరంలో ఆర్కెస్ట్రా స్థాపించి, 47 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఆరువేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారన్నారు. అనంతరం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా జిత్ తన ఆర్కెస్ట్రా ద్వారా సంగీత విభావరి నిర్వహిస్తారని, కుమారి షైలికపాత్రో కూచిపూడి నృత్యం ప్రదర్శిస్తారన్నారు. విశిష్ట అతిథిగా సినీనటుడు అలీ హాజరవుతారన్నారు. సమావేశంలో జిత్, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, పీపీఎస్ కృష్ణారావు, శివప్రసాద్, జగపతి పాల్గొన్నారు. -
బీవీఆర్ మోహన్ రెడ్డికి జీవన సాఫల్య పురస్కారం
హైదరాబాద్లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు-2015ను అందుకుంటున్న సైయంట్ వ్యవస్థాపకుడు, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి. -
విశ్వనటుడికి జీవిత సాఫల్య అవార్డు
విశ్వనటుడు కమలహాసన్ అవార్డులకే అలంకారం అనడంలో అతిశయోక్తి కాదేమో. ఇప్పటికే పద్మశ్రీ వంటి జాతీయ అవార్డుతో పాటు పలు విశిష్ట అవార్డులు ఆయన్ని వరించాయి. తాజాగా జీవిత సాఫల్య తమిళర్ అవార్డు పురస్కారం కమలహసన్ కోసం ఎదురు చూస్తోంది. ఆరేళ్లుగా నార్వే చిత్రోత్సవాలు నిర్వహిస్తూ తమిళ కళాకారులతో పాటు, తమిళేతర చిత్ర కళాకారులకు తమిళర్ విరుదు పేరుతో అవార్డులను అందిస్తున్నారు. ఏడో నార్వే తమిళ చిత్రోత్సవ కార్యక్రమం మార్చి 28 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకూ నార్వేలో నిర్వహించనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పోటీకి నామినేషన్ల గడువు ఈ నెల 15తో ముగియనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 25న అవార్డులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రోత్సవాల్లో తమిళనాడులో నిర్మించిన చిత్రాలతో పాటు తమిళేతర దేశాల్లో రూపొందించిన తమిళ చిత్రాలకు అవార్డులను అందించనున్నట్లు వెల్లడించారు. పూర్తి చిత్రాలతో పాటు లఘు చిత్రాలు, డాక్యుమెంట్ చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ కేటగిరీల్లో అవార్డు పోటీలు ఉంటాయన్నారు. నార్వే ప్రభుత్వ అంగీకారంతో ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన విశ్వనటుడు కమలహాసన్ను జీవిత సాఫల్య తమిళర్ బిరుదుతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. అలాగే నటుడు ప్రకాశ్రాజ్కు కలైశిఖరం అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
నారాయణ మూర్తికి ఐసీఎస్ఐ ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డు...
ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్కు సంబంధించి ముంబైలో గురువారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) 15వ జాతీయ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఇందులో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్.రామదొరై చేతుల మీదుగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి ‘లైఫ్టైం అచీవ్మెంట్’ అవార్డును అందుకున్నారు. చిత్రంలో ఐసీఎస్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్, అఫిసియేటింగ్ సెక్రటరీ సీఎస్ సుతాను సిన్హా, ఐసీఎస్ఐ కౌన్సిల్ మెంబర్ సీఎస్ వినీత్ చౌదరీ, ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ సీఎస్ అతుల్ హెచ్ మెహ్తా (ఎడమ నుంచి కుడికి). -
వి.హనుమంతరావుకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
-
కేతిరెడ్డి జీవిత సాఫల్యం
సినీ దర్శక -నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గానూ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. నెల్లూరులో 25 కళా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కే తిరెడ్డి మాట్లాడుతూ- ‘‘నెల్లూరులో పుట్టడం నాకు ఆ దేవుడిచ్చిన వరం. తెలుగు భాషాపరిరక్షణ ఉద్యమ నాయకునిగా నెల్లూరు జిల్లా నన్ను నిలబెట్టింది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులో పాఠశాల స్థాయిలో తెలుగు భాషా బోధన రద్దుకు నిరసనగా ఉత్తరాల ద్వారా ఉద్యమం చేయనున్నాం. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
గానకోకిలకు...జీవిత సాఫల్య పురస్కారం!
దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి గీతాలు ఆలపించి, శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు గాయని ఎస్. జానకి. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్లో ఆమె అందుకోని అవార్డులు లేవు. తాజాగా, జానకిని మరో పురస్కారం వరించింది. ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’లో భాగంగా 2014వ సంవత్సరానికి గాను ఆమెకు జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్లు జ్యూరీ చైర్మన్, నిర్మాత డి. సురేశ్బాబు తెలిపారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న హైదరాబాద్లో జరిగే భారీ వేడుకలో ఈ అవార్డులు అందజేయనున్నారు. నాలుగు దక్షిణాది భాషల్లోనూ ప్రతి భాషలో 14 విభాగాల్లో ఉత్తమ సినీ సంగీత కళాకారులకు అవార్డులిస్తారు. ‘‘దక్షిణాదిలో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ఆరో ఏట అడుగుపెట్టింది. తెలుగు వరకు 2014లో విడుదలైన 197 సినిమాల్లో పాటలున్న 176 చిత్రాల్లోని 947 గీతాలను పరిశీలించాం’’ అని నట, రచయిత తనికెళ్ల భరణి చెప్పారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులైన దర్శకుడు చంద్రసిద్ధార్థ్, సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్, కల్యాణీమాలిక్, రచయిత అబ్బూరి రవి, గీత రచయితలు చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, గాయని సునీత, ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
భారత బ్యాంకర్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్
దుబాయ్ : దోహా బ్యాంక్ సీఈఓ ఆర్. సీతారామన్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. బ్యాంకింగ్ రంగంలో ఈ భారతీయ బ్యాంకర్ చేసిన సేవలు, మధ్య ప్రాచ్యం ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఆయన తన సేవల ద్వారా అందించిన తోడ్పాటుకు ఈ అవార్డ్ లభించింది. ఇక్కడ ఇటీవల జరిగిన ద బ్యాంకర్ మిడిల్ ఈస్ట్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2015 కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డ్ను ప్రదానం చేశారు. -
ఉత్తమ క్రీడాకారుడిగా జీతూ రాయ్
న్యూఢిల్లీ : ఈ ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో... మేటి షూటర్ జీతూ రాయ్ ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచాడు. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్కు ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ లభించింది. వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అథ్లెట్లకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. యూత్ ఐకాన్ పురస్కారాన్ని సైనా నెహ్వాల్ గెలుచుకోగా, బ్యాడ్మింటన్లో పి.వి.సింధు, టెన్నిస్లో సానియా మీర్జాలు ఉత్తమ క్రీడాకారిణిలుగా ఎంపికయ్యారు. -
బల్బీర్ సింగ్కు జీవిత సాఫల్య పురస్కారం
న్యూఢిల్లీ: తొలిసారిగా ప్రవేశపెట్టిన హాకీ ఇండియా అవార్డుల్లో బల్బీర్ సింగ్ సీనియర్కు మేజర్ ధ్యాన్చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు. శనివారం ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. 90 ఏళ్ల బల్బీర్కు ట్రోఫీతో పాటు రూ. 30 లక్షల నగదును అందించారు. 1948 నుంచి 56 వరకు జరిగిన ఒలింపిక్స్లో స్వర్ణాలు సాధించిన హాకీ జట్టులో బల్బీర్ సభ్యుడు. 1956 ఒలింపిక్స్ ఫైనల్లో ఆయన చేసిన ఐదు గోల్స్ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. అలాగే పురుషుల విభాగంలో ఉత్తమ ఆటగాడిగా బీరేంద్ర లక్రా.. మహిళల్లో వందనా కటారియా అవార్డులను గెలుచుకున్నారు. వీరికి రూ.25 లక్షల చొప్పున నగదును అందించారు. పీఆర్ శ్రీజేష్ (ఉత్తమ గోల్కీపర్), దీపికా (ఉత్తమ డిఫెండర్), మన్ప్రీత్సింగ్ (ఉత్తమ మిడ్ఫీల్డర్), ఆకాశ్దీప్సింగ్ (ఉత్త మ ఫార్వర్డ్) తదితరులు అవార్డులు గెలుచుకున్న వారిలో ఉన్నారు. -
కపిల్కు ‘జీవితకాల సాఫల్య’ పురస్కారం
లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్కు ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. ‘మన దేశాన్ని వాళ్లు పాలించారు కాబట్టి ఒకప్పుడు ఇంగ్లండ్ అంటే నాకు ఇష్టముండేదికాదు. అయితే వాళ్లు బాగా ఆడకపోయినా మనకు క్రికెట్ను అందించారు. కాబట్టి ప్రస్తుతం ఆ భావన లేదు’ అని కపిల్ వ్యాఖ్యానించారు. -
స్వరాజ్పాల్కు జీవిత సాఫల్య పురస్కారం
లండన్: బ్రిటన్కు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్పాల్కు ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. పరిశ్రమలు, విద్య తదితర రంగాలకు పాల్ చేసిన సేవలకుగాను ఈ పురస్కారం లభించింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో స్వరాజ్పాల్ తరఫున ఆయన కుమార్తె అంజలి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పాల్ పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. -
కపిల్దేవ్ పేరుకు ఏకగ్రీవంగా ఆమోదం