minister jupally
-
జూపల్లి వారసులపై సీబీ‘ఐ’
సాక్షి, హైదరాబాద్: వారిద్దరూ మంత్రి కుమారులు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను తమ పలుకుబడితో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కంపెనీలను ఏర్పాటు చేసి ఆ భూములను బ్యాంకుల్లో తనకా పెట్టారు. మార్కెట్ విలువ కన్నా నాలుగొంతులు అధిక విలువ చూపి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. వాటితో స్టేట్ ఆఫ్ ఇండి యా నుంచి కోట్ల రుణాలు తీసుకొని కంపెనీల్లోకి మళ్లించారు. రుణాలు చెల్లించకపోవడంతో తన ఖా పెట్టిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాం కు అధికారులు సిద్ధమయ్యారు. అప్పుడే అసలు కథ బయటపడింది. తనఖా పెట్టిన ఆస్తులకు, తీసుకున్న రుణాలకు పొంతన లేకపోవడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుల ఈ ‘తనఖా’మాయాజాలంపై సీబీఐ రంగంలోకి దిగింది. అసలేం జరిగింది? మంత్రి జూపల్లి కుమారులు వరుణ్, అరుణ్ ఇద్దరూ వ్యాపార రంగంలో ఉన్నారు. 2011లో వారు శైలి ఇన్ఫ్రా లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ స్థాపించారు. దాన్ని 2015లో క్రిద్యా ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీదకు మార్చారు. ఈ కంపెనీ తీసుకున్న బ్యాంకు రుణాలకు జూపల్లి అరుణ్, వాసిరెడ్డి కిరణ్రెడ్డి హమీదారులుగా ఉన్నారు. అరుణ్.. అమీర్పేట్లోని రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్లోని మూడు ఫ్లాట్లు, గండిపేట కిస్మత్పూర్లోని 3.2 ఎకరాల భూమి, గగన్పహాడ్లోని ఇల్లును తనఖా పెట్టి 2015 నాటికి ఎస్బీఐ నుంచి రూ.64.80 కోట్ల రుణం పొందారు. వీటిని చెల్లించకపోవడంతో ఏడాదిన్నర క్రితం ఎస్బీఐ అరుణ్కు నోటీసులు ఇచ్చింది. 2016లో తనఖా పెట్టిన ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రకటన ఇచ్చింది. తనఖా పెట్టిన ఈ ఆస్తులను బ్యాంకు అధికారులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పరిశీలించగా రూ.7.75 కోట్లే ఉందని తేలింది. దీంతో బ్యాంకు అధికారులు నోరెళ్లబెట్టాల్సిన వచ్చింది. కంపెనీ కోసం తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి ఈ ఏడాది జనవరికల్లా రూ.86.30 కోట్లకు చేరింది. మార్కెట్ విలువలో గోల్మాల్ చేసి అరుణ్ బ్యాంకు రుణం పొందినట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. తనఖా పెట్టిన మొత్తం ఆస్తు ల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.17.79 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఆస్తులను స్వాధీనం చేసుకున్నా బ్యాంకుకు రూ.68.50 కోట్ల నష్టం మిగలనుంది. గతేడాదే సీబీఐ నోటీసు బోగస్ పత్రాలతో కోట్లు రుణం పొందిన జూపల్లి వారసులపై సీబీఐ దృష్టి సారించింది. దీనిపై ప్రధాని కార్యాలయానికి ఇప్పటికే ఫిర్యాదు అంది నట్లు తెలిపింది. గత జూలై 28నే జూపల్లి అరుణ్కు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలంటూ గతేడాది ఆగస్టు 18న సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ సంజయ్ దూబే అరుణ్కు జారీ చేసిన నోటీసులో తెలిపారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జూపల్లి అనుచరులు, పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, పూర్తి వివరాలను వెల్లడించలేమని ఢిల్లీలోని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదీ మాయాజాలం.. సాధారణంగా ఎవరైనా భూములు కొన్న సందర్భంలో మార్కెట్ విలువ కన్నా రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా చూపిస్తారు. కానీ జూపల్లి అరుణ్ మాత్రం రిజిస్ట్రేషన్ విలువను మార్కెట్ విలువ కన్నా అధికంగా చూపాడు. అదీగాకుండా తనఖా పెట్టిన ఆ భూమిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. కిస్మత్పూర్లోని 3.27 ఎకరాల భూమి మార్కెట్ విలువ ప్రకారం రూ.78.48 లక్షలుంంటే.. అరుణ్ దాని రిజిస్ట్రేషన్ విలువను రూ.3.30 కోట్లుగా చూపాడు. అలాగే గగన్పహాడ్లోని ఇల్లు మార్కెట్ విలువ ప్రకారం రూ.1.93 కోట్లు ఉంటే రిజిస్ట్రేషన్లో రూ.2.5 కోట్లుగా చూపించారు. -
వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్న జానా, ఉత్తమ్
సాక్షి, చౌటుప్పల్ (మునుగోడు): ప్రస్తుతం బీరాలు పలుకుతున్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. యాదాద్రి భువనగికి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి మరోసారి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఈ విషయాన్ని ఇప్పటికే జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం వెల్లడించాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. -
ఆ కాంట్రాక్టర్ల నుంచి జరిమానా వసూలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై), నాబార్డ్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే సదరు కాంట్రాక్టర్ల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాబార్డ్, పీఎంజీఎస్వై పనుల పురోగతిపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా జరుగుతున్న పనులు, జాప్యానికి గల కారణాలపై ఈఈ, ఎస్ఈలతో చర్చించారు. ఆశించినంత వేగంగా పనులు జరగకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరైన పనులను పూర్తి చేయడం ద్వారా కేంద్రం నుంచి అదనంగా నిధులను పొందేందుకు వీలుంటుందని, ఎట్టి పరిస్థితుల్లోను మార్చి 31లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 151 పనులకు టెండర్లు పూర్తి.. పీఎంజీఎస్వై కింద దాదాపు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని జూపల్లి వెల్లడించారు. ఇందులో రూ.300 కోట్ల విలువైన పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని, మిగిలిన పనులను కూడా జూన్ 30లోగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 154 పనులను పూర్తి చేసే లక్ష్యం రూపొందించుకున్నామని, ఇందులో 151 పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. -
నిధుల్లేక నీరసిస్తున్న స్థానిక సంస్థలు
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేక స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు పెట్టారు. దీంతో తాము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి సడక్ యోజన అమలు, ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పనులకు సంబంధించి సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.1,318 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.601 కోట్లే విడుదల చేశారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నిధుల్లేక గ్రామ పంచాయతీలు బలహీనపడిపోతున్నాయని టీఆర్ఎస్ సభ్యుడు భూపాల్రెడ్డి చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నాలుగు జిల్లా పరిషత్ సమావేశాలకు వెళ్లొస్తే వాస్తవం తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. సర్పంచులు, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్రెడ్డి వాపోయారు. 14వ ఆర్థిక సంఘంలో మార్పుల వల్ల నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు పోతున్నాయని, దీంతో మండల, జిల్లా పరిషత్లకు నిధులు రావట్లేదని టీఆర్ఎస్ సభ్యుడు భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇస్తున్నట్లే జిల్లా పరిషత్లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని టీఆర్ఎస్ సభ్యుడు భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, పాత చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పంచాయతీరాజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధికి త్వరలోనే సమగ్ర పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. 2015–17 కాలంలో స్థానిక సంస్థలకు రూ.1,146.94 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు గ్రామ పంచాయతీలకే వెళ్తున్నాయని, మండల, జిల్లా పరిషత్లకు రావట్లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో పంచాయతీ రహదారులు ఘోరంగా ఉన్నాయని షబ్బీర్ అలీ విమర్శించగా.. మంత్రి జూపల్లి బదులిస్తూ 20–30 ఏళ్లలో చేసిన దానికంటే ఒక్క ఏడాదిలోనే వేల కోట్ల రూపాయల పనులు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర మంత్రులు జోక్యం చేసుకోవడంతో షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘సంబంధిత మంత్రికి జవాబు ఇవ్వడం రాదా? లేదా ఆయన శాఖ ఏమైనా మారిందా?’అంటూ విరుచుకుపడ్డారు. పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలి.. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) స్థానంలో పాత పద్ధతిని పునరుద్ధరించాలని టీఆర్ఎస్ సభ్యుడు జనార్దన్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగుల అభద్రతా భావంతో బతుకుతున్నారన్నారు. హైదరాబాద్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో తినుబండారాల ధరలు 6 నుంచి 10 రెట్లు అదనంగా ఉంటున్నాయని, వీటిని కట్టడి చేయాలని సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. చౌక దుకాణాల్లో బియ్యం తప్ప వేరే ఇవ్వడం లేదని, దీంతో వేలాది మంది డీలర్లకు కనీస కమీషన్లు కూడా రావట్లేదని షబ్బీర్అలీ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, గ్రూప్–1 ఫలితాలను నిలుపుదల చేయడంపై వాయి దా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని షబ్బీర్అలీ కోరగా.. మండలి చైర్మన్ స్వామిగౌడ్ తిరస్కరించారు. ఉస్మానియా భూముల లీజుకు రూపాయా?: ప్రభాకర్రావు ఉస్మానియా వర్సిటీలో కొన్ని భూములను ఏడాదికి ఎకరం రూపాయికే లీజుకు ఇవ్వడంపై ప్రభాకర్రావు ప్రశ్నించారు. కొందరికి ఎకరానికి రూపాయి, ఇంకొందరికి రూ.40, మరికొందరికి రూ.50 లక్షలకు లీజుకు ఇచ్చారని, వ్యత్యాసమెందుకు ఉందన్నారు. 24 ప్రభుత్వ, తదితర సంస్థలకు 187.5 ఎకరాలు లీజుకు ఇచ్చామని కడియం శ్రీహరి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 4 సంస్థలు లీజుకు అడగగా, వాటికి లీజు రేట్లను పెంచే ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో పెట్రోల్ బంకుల టాయిలెట్లు పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని మంత్రి కె.తారకరామారావు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో టాయిలెట్ల పరిస్థితిపై పలువురు అడిగిన ప్రశ్నలపై మంత్రి మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు ఉపయోగపడేలా వాటి యాజమాన్యాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించామని చెప్పారు. కాగా, రాష్ట్రంలో 1,152 మంది అనాథ పిల్లలున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. అందులో 37 మందికి బీసీ–ఎ సర్టిఫికెట్ ఇచ్చామని ఆయన చెప్పారు. సరైన స్థలంలోనే కలెక్టరేట్ల నిర్మాణం: తుమ్మల ప్రజామోదం లేకుండా ఎక్కడా కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండలిలో హామీ ఇచ్చారు. నిజామాబాద్ కలెక్టరేట్ కోసం అనువైన ప్రదేశం ఎంపిక చేయలేదని భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కలెక్టరేట్ల స్థలాల మంజూరుపై బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ మార్పుపై పొంగులేటì ప్రశ్నించారు. నిర్మల్లో కొండ మీద స్థలంపై విమర్శలు రావడంతో శంకుస్థాపన చేయలేదని తుమ్మల పేర్కొన్నారు. -
రెండేళ్లలో ఎల్ఈడీ కాంతులు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంపిక చేసిన 60 మంది సర్పంచ్లకు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. 2019 మార్చి 31 నాటికి ప్రతి గ్రామానికి ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేసే లక్ష్యంతో 60 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామన్నారు. ఇందుకోసం కేంద్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఎఫ్ఎస్ఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ బల్బులు అమర్చడం వల్ల గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడదని, పెట్టుబడి లేకుండా పంచాయతీలు విద్యుత్ ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. థర్డ్ వైర్ సౌకర్యం ఉన్న పంచాయతీలు ముందుకు వస్తే ఈఎఫ్ఎస్ఎల్.. ఆయా గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. పంచాయతీలు సొంతంగా లేదా విద్యుత్ శాఖ ద్వారా లేదా 14వ ఫైనాన్స్ నిధుల నుంచి థర్డ్ వైర్ సౌకర్యం కల్పించుకోవచ్చన్నారు. 72 గంటల్లో పునరుద్ధరణ బల్బుల పనితీరును ఆన్లైన్ ద్వారా ఈఎఫ్ఎస్ఎల్ సంస్థ ప్రతినిధులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వెలగని బల్బులను 72 గంటల్లో తిరిగి పునరుద్ధరిస్తారని, అలా పునరుద్ధరించకుంటే.. రోజుకి బల్బుకి రూ.5 చొప్పున పంచాయతీకి కంపెనీ చెల్లిస్తుందన్నారు. గ్రామ పంచాయతీలు సంస్థతో 5, 7, 10 ఏళ్లు ఒప్పందం కుదుర్చుకోవచ్చని తెలిపారు. ఒప్పందాన్ని బట్టి ఆదా అయిన డబ్బులో 80 శాతం సంస్థకు, 20 శాతం పంచాయతీకి దక్కుతుందన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు ఉపయోగించుకోవాలన్నారు. -
దేశానికే ఆదర్శంగా నైపుణ్య శిక్షణ
- తెలంగాణలో ఉపాధికి కొదవ లేదు - ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవంలో జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఉపాధి కల్పనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా 10 కోట్ల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని, వాటిని దక్కించుకునేందుకు నైపుణ్యం అవసరమన్నారు. శనివారం ఇక్కడి హైటెక్స్లోని నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవానికి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నేర్పు తెలంగాణ ప్రజల సొంతమని... అవకాశాలను అందిపుచ్చుకునే నైపుణ్యం అలవర్చుకుంటే ఉపాధికి కొదవ లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప సంస్థలన్నీ తెలంగాణలో కార్యకలాపాలు సాగించేందుకు ఆసక్తి చూపుతున్నాయని జూపల్లి చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలకు ఏ మాత్రం కొదవ లేదని... కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్య పథకం కింద దాదాపు 18 వేల మంది యువతీ యువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించామన్నారు. గతేడాది నైపుణ్య శిక్షణలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని ఈసారి మొదటి స్థానంలో నిలిపేలా శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. మంజూరు చేసిన దానికి అదనంగా మరో 50 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. అలాగే ప్రతి జిల్లాలోనూ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉపాధి అవకాశాలు దక్కించుకున్న వెయ్యి మంది యువతీ యువకుల విజయగాథలతో రూపొందించిన పుస్తకాన్ని జూపల్లి ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం శిక్షణ కేంద్రాల నిర్వాహకులు, ఉపాధి కల్పించిన సంస్థల ప్రతినిధులకు మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ సీఈవో నీతూ ప్రసాద్ పాల్గొన్నారు. -
తెలంగాణ సెర్ప్కు జాతీయ పురస్కారం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడంలో విశేష కృషి చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు జాతీయ పురస్కారం దక్కింది. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 4వ జాతీయ దివస్ ఢిల్లీలోని విజ్ఞానభవన్లో బుధవారం జరిగింది. బ్యాంకుల సహకారంతో గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు తెలంగాణ సెర్ప్కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు ను సెర్ప్ డైరెక్టర్ బాలయ్యకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అందజేశారు. రాష్ట్రాల మధ్య పోటీ తత్వాన్ని పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం వివిధ సంస్థలు, బ్యాంకులకు కేంద్రం అవార్డులు ఇస్తోంది. గత మూడేళ్లలో గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడంలో అగ్రగామిగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. సెర్ప్ ద్వారా 32 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణకు ఈ అవార్డు దక్కడం పట్ల పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. -
పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ‘ఆసరా’
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.200 పింఛన్ రావాలంటే ఇంకొకరి చావుకోసం ఎదురు చూడాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక మా ప్రభుత్వ హయాంలో చిన్నచిన్న అవసరాలకు ఎవర్నీ దేహీ అనకుండా ‘ఆసరా’పథకం నిరుపేద వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. మొత్తంగా మూడేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపింది’అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడేళ్లలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. 17ఏళ్ల తన రాజకీయ జీవితం 14ఏళ్ల పాటు అసంతృప్తితోనే గడిచిందని, గత మూడేళ్ల పాలనలోనే ఎంతో సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే ఇందుకు కారణమని చెప్పారు. ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో, నాడు చెప్పిన ప్రతి మాటను ఆచరణలో చూపి, చేతలకు, మాటలకు బేధం లేదని చెప్పగలిగామన్నారు. రూ.3,775 కోట్లతో గ్రామీణ రహదారులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,775 కోట్లతో గ్రామీణ రహదారులకు శ్రీకారం చుట్టిందని, గత మూడేళ్లలో 18,169 రహదారి పనులను పూర్తి చేశామని మంత్రి జూపల్లి తెలిపారు. మిగిలిపోయిన రహదారులను కూడా వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేస్తామన్నారు. దాదాపు 37లక్షలమందికి ఆసరా పథకం కింద నెలకు రూ.వెయ్యి చొప్పున అందజేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 4 (ఆదివారం) నుంచి 1.08 లక్షలమంది ఒంటరి మహిళలకు ఆర్థికభృతిని అందించనున్నామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా పేదవర్గాలకు ఏటా రూ.2,500 కోట్ల మేరకు పనులను కల్పిస్తూ దేశంలోనే నంబర్వన్గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. 2018 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ తెలంగాణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం ఉపాధిహామీ పథకం కిందనే చేపట్టామన్నారు. -
జాతీయ జెండాకు సెల్యూట్ చేయని కలెక్టర్
- తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన - చర్చనీయాంశమైన కలెక్టర్ వ్యవహారశైలి సాక్షి, నాగర్కర్నూల్: జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన జెండావిష్కరణలో సెల్యూట్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పతాకావిష్కరణ చేశారు. అనంతరం మంత్రితోపాటు ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, నాగర్కర్నూల్, అచ్చంపేట ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాల్రాజులు జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయగీతం ఆలపించారు. ఇదే వేదికపై ఉన్న కలెక్టర్ మాత్రం సెల్యూట్ చేయలేదు. గతంలో జనవరి 26 గణతంత్ర వేడుకల్లోనూ కలెక్టర్ ఇలాగే వ్యవహరించారు. అటెన్షన్లో ఉంటే చాలు: జాతీయజెండా అంటే తనకు గౌరవమని, సెల్యూట్ చేయాలన్న నిబంధనేమీ లేదని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. అయితే.. అటెన్షన్లో నిలబడితే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తనకు శిక్షణ సమయంలో చెప్పారని, అదే పాటిస్తున్నానని వివరించారు. యూనిఫామ్లో ఉన్న పోలీస్ సిబ్బంది మాత్రం తప్పనిసరిగా సెల్యూట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. త్రివిధ దళాల్లోని వారికి సెల్యూట్ తప్పనిసరి అని, తమకు అవసరం లేదన్నారు. -
ట్రాన్స్కో జీఎం ఇంటర్వ్యూకు సీఎం, మంత్రి పీఆర్వోల హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో)లో జనరల్ మేనేజర్(కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పోస్టు భర్తీకి సోమవారం విద్యుత్ సౌథలో ఇంటర్వూ్యలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సమాచార, ప్రజాసంబంధాల శాఖ కార్యదర్శి నవీన్మిట్టల్, ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాస్రావుతో కూడిన ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ పీఆర్వో కె.విజయ్కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయ పీఆర్వో చెన్నమనేని కళ్యాణ్, ఏపీ ట్రాన్స్కో పీఆర్వో అబ్దుల్ బషీర్, సంగారెడ్డి డీపీఆర్వో యామిని, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీఆర్వో వేణుగోపాల్రెడ్డి ఉన్నారు. హ్యూమానిటీస్లో డిగ్రీ, జర్నలిజంలో పీజీ, న్యాయశాస్త్రంలో డిగ్రీలతో పాటు జర్నలిజంలో కనీసం 15 ఏళ్ల అనుభవంతో పాటు ప్రభుత్వ పీఆర్వోగా కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులని నిబంధన పెట్టడంతో ఐదుగురు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఫలితాన్ని మంగళవారం ప్రకటించే అవకాశముంది. -
ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురు సస్పెండ్
జైపూర్: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగపూర్(ఎస్) గ్రామంలో బుధవారం ఉపాధి హామీపనులను పరిశీలించిన మంత్రి స్థానిక శ్రమశక్తి సంఘ సభ్యులతో ముఖాముఖీ చర్చలో పాల్గొని వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. 100 రోజులు పని కల్పించకపోవడంతో బాధ్యులైన వీఆర్వో సుదర్శన్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకన్న, గ్రామ కార్యదర్శి రాజేష్లను సస్పెండ్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఉన్నారు. -
మే నెల నుంచి పోస్టాఫీసుల ద్వారానే ఆసరా
అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్లను వచ్చేనెల నుంచి పూర్తిగా పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ఆసరా లబ్ధిదారులకు బయోమెట్రిక్ లేదా ఐరిస్ విధానం ద్వారానే ఇకపై పింఛన్ల పంపిణీ జరగాలని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన 10 రోజుల్లోపే లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పోస్టాఫీసులోనూ ఐరిస్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని తపాలా అధికారులను మంత్రి కోరారు. కూలీలకు జాబ్ కార్డులు ఇప్పించడంతో పాటు, పెద్ద ఎత్తున పనులు చేపట్టేలా మహిళా సంఘాలు చొరవ చూపాలని, ఆయా సంఘాలను చైతన్య పరిచేందుకు వీవోఏలను వినియోగించుకోవాలని సూచించారు. -
‘కార్బైడ్’పై కయ్యం
- సమస్యలు పరిష్కరించాలంటూ వ్యాపారుల మెరుపు సమ్మె - గడ్డిఅన్నారం మార్కెట్లో ఆగిన మామిడి, బత్తాయి కొనుగోళ్లు - అవస్థలు పడిన రైతులు - చైర్మన్ హామీతో సద్దుమణిగిన వ్యాపారుల ఆందోళన హైదరాబాద్: కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు తమ సమస్యల పరిష్కారానికి రైతు మెడపై కత్తిపెట్టి మెరుపు సమ్మెకు దిగారు. మామిడి, బత్తాయి కొనుగోళ్లు నిలిపివేసి పాలకవర్గం, అధికారులతో బేరసారాలు చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన మామిడి, బత్తాయి కొనుగోళ్లు నిలిపిపేయడంతో వివిధ జిల్లాల నుంచి తమ పంటను తెచ్చిన రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. అసలే మద్దతు ధరరాక నష్టాల పాలవుతున్నామని.. సమ్మెతో తమ బతుకులు మరింత అన్యాయమవుతాయని మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఒక వైపు రైతులు, మరోవైపు వ్యాపారుల ఆందోళనలతో సోమవారం మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి సమాచారం తెలుసుకుని వచ్చిన మార్కెట్ చైర్మన్ పుటం పురుషోత్తంరావు వ్యాపారులతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం కానరాలేదు. దీంతో సుమారు 604 వాహనాల్లో మామిడి(3వేల టన్నుల మామిడి), 270 లోడుల బత్తాయి (400 టన్నులు) కొనుగోళ్లు ఆగాయి. వ్యాపారులపై చర్య తీసుకోవాలి: మంత్రి జూపల్లి కొనుగోళ్లు ఆపేయడంతో ఇబ్బందులు పడుతున్నామని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రైతులు కొందరు విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకురాగా హుటాహుటిన గడ్డిఅన్నారం మార్కెట్కు చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కొనుగోళ్లు నిలిచిపోవడానికి దారి తీసిన పరిస్థితిపై మార్కెట్ ఎస్జీఎస్ ఎల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు సమ్మె చేయడాన్ని తప్పుపట్టారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని, అవసరమైతే రైతుల నష్టాన్ని వ్యాపారుల నుంచి వసూలు చేసి వారి లైసెన్సులు రద్దు చేయాలన్నారు. రైతులు నష్ట పోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. వ్యాపార సంఘ నాయకులతో అధికారుల సమావేశం వ్యాపార సంఘం నాయకులతో పురుషోత్తంరావు, మార్కెటింగ్, పోలీస్ అధికారులు చర్చించారు. కార్బైడ్ నిషేధించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంతో తాము నష్టపోతున్నామని, గతంలో రద్దుచేసిన లైసెన్సులను పునరుద్ధరించాలని, అద్దె బకాయిపై న్యాయం చేయాలని అసోసియేషన్ ప్రతి నిధులు తాజుద్దీన్, అశోక్లు డిమాండ్ చేశారు. సమస్యలపై సమ్మె నోటీసు ఇచ్చినా అధికారులు స్పందించటం లేదని అందుకే మెరుపు సమ్మె చేయడం జరిగిందన్నారు. నెలరోజుల్లోగా తమ పరిధిలో ఉన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తానని చైర్మన్ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో మధ్యాహ్నం 3 గంటలకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెటింగ్ జేడీ రవికుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ మలిపెద్ది వెంకట్రామ్రెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. కొనుగోళ్లు ఆలస్యమైతే తీవ్రంగా నష్టపోతాం ఏడాదంతా శ్రమకోర్చి పండించిన పంటను 100 కిలోమీటర్లు రవాణా చేసి తీసుకొస్తే వ్యాపారులు కొనకపోతే తీవ్రంగా నష్టపోతాం. ఎండ వేడికి లారీల్లోని మామిడి పాడైపోయి మరింత నష్టపోతాం. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – పైలా యాదిరెడ్డి, రైతు, ఒలిగొండ, యాదగిరిగుట్ట జిల్లా వ్యాపారుల తీరు అన్యాయం అప్పులు చేసి వడ్డీలు కట్టి పంట పండిస్తే మార్కెట్లోకి వచ్చిన తరువాత వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. గత సంవత్సరం మామిడి కిలో 50 నుంచి 70 ధర పలకగా ఈఏడాది 25 మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మూలంగా తీవ్ర అన్యాయం జరుగుతోంది. – సుగూర్ శాంతన్, రైతు, కొల్లాపూర్, నాగర్కర్నూల్జిల్లా -
పోస్టాఫీసుల ద్వారానే ‘ఆసరా’ పింఛన్లు
లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా సర్కారు చర్యలు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచి ‘ఆసరా’ పింఛన్లను పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 2,551 గ్రామాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోందని, మండలంలో ఉండే ఒక బ్యాంక్ వద్దకే అన్ని గ్రామాల నుంచి లబ్ధిదారులు రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలోనూ బయోమెట్రిక్ విధానంతో పింఛన్లను అందించాలని నిర్ణయించామన్నారు. పంచాయతీలకు సమీపంలో తండాల్లోని లబ్ధిదారులు కూడా వారి ఇంటివద్దనే పింఛన్ సొమ్ము అందుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో.. వేలి ముద్రలు సరిపోలని వారికి పంచాయతీ కార్యదర్శి ద్వారా పింఛన్ సొమ్మును అందజేశామని, అందులోనూ అవకతవకలు జరుగుతున్నందున, ఐరిస్ విధా నాన్ని అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం గోపులాపూర్లో ఓ వృద్ధురాలికి గత 4 నెలలుగా పింఛన్ సొమ్ము ఇవ్వకుండా, అక్రమాలకు పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు మంత్రి జూపల్లి పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధిహామీ పనులు 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,618 కోట్ల పనులు జరిగాయని, గత 10 సంవత్సరాలతో పోల్చితే అత్యధికంగా ఉపాధిహామీ నిధులు ఖర్చు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పదేళ్లలో దాదాపు రూ.3,827 కోట్లు ఖర్చు చేయక పోవడంతో ఆ నిధులు మురిగి పోయాయన్నారు. 2017–18లో సుమారు రూ. వెయ్యికోట్ల మేర సిమెంట్ రహదారుల నిర్మాణానికి వెచ్చించాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పనికోరిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ద్వారానే జాబ్ కార్డు మంజూరు చేసి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బాలరాజు, రామ్మోహన్రెడ్డి, రవికుమార్, మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్ భాస్కర్ తదితరులున్నారు. -
ప్రాజెక్టు డిజైన్ మార్పుపై చర్చకు సిద్ధమేనా!
మంత్రి జూపల్లికి వంశీచంద్ సవాల్ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌజు డిజైన్ మార్పులో అవినీతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగచర్చకు సిద్ధ మేనా అని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి సవాల్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముడుపుల కోసమే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పంపుహౌజుల డిజైన్లు మారుస్తు న్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలకు అనుకూలంగా జూపల్లి పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై బహిరంగచర్చకు సిద్ధమని, మంత్రి తాను చేసిన వాదన తప్పు అని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తా అని సవాల్ చేశారు. మంత్రికి రూ.50 కోట్లు ముడుపులుగా ముట్టాయని ఆరోపించారు. -
కాంట్రాక్టర్లతో హరీశ్, జూపల్లి కుమ్మక్కు: నాగం
నాగర్కర్నూల్: భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావులు కాంట్రాక్టర్లతో కుమ్మ క్కయ్యారని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు.శుక్రవారం నాగర్కర్నూల్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం ప్రజాధనం వృథా చేస్తోందని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా 18 ప్యాకేజీలు ఉంటే నాలుగు ప్యాకేజీలు అర్హతలేని వారికి కట్ట బెట్టారని ఆరోపించారు. ఇవ్వలేదని నిరూ పిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పు కుంటానని నాగం సవాల్ విసిరారు. డబ్బు లకు కక్కుర్తి పడి హరీశ్, జూపల్లి స్వప్ర యోజనాల కోసం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు ప్రాజెక్టుల పేరుతో చేసిన అవినీతి బాగోతంపై తన వద్దనున్న ఆధారాలతో నాగర్ కర్నూలులో ఎగ్జిబిషన్ పెడతానని చెప్పారు. -
జూపల్లి రాజీనామా చేయాలి: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కుదించడం ద్వారా ప్రభుత్వం రైతుల పొట్టగొడుతుంటే జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి ప్రశ్నించారు. కల్వకుర్తి నియోజకవర్గం ఎడారిగా మారుతున్నా ఏమీ చేయలేని జూపల్లి పదవిలో కొనసాగడం ద్వారా ప్రజలకు ద్రోహం చేస్తున్నాడని శుక్రవారం విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై ప్రణాళికసంఘం వైస్చైర్మన్ నిరంజన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. -
కార్యదర్శులే గ్రామాలకు కలెక్టర్లు
పంచాయతీ సెక్రటరీల సదస్సులో స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: జిల్లాలకు కలెక్టర్లు లానే.. గ్రామ పంచాయతీలకు కార్యదర్శులే స్థానిక కలెక్టర్లని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. రాజేంద్రనగర్లోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ (టీసీపార్డ్)లో ఆదివారం జరిగిన టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శుల సదస్సులో స్వామి గౌడ్ ప్రసంగించారు. గ్రామాలకు సర్పంచ్లు ముఖ్యమంత్రులైతే, వార్డు మెంబర్లు మంత్రు ల్లాంటి వారన్నారు. గ్రామాల అభివృద్ధికి వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత కార్యదర్శు లపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కార్యదర్శు లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ శాఖకు జూపల్లి కృష్ణా రావు లాంటి సమర్థు డైన మంత్రి ఉన్నా రని, సమస్యల వద్దకే ఆయనే వెళ్లి పరిష్కరి స్తారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణతోనే వారికి నివాళి.. తెలంగాణ కోసం అమరులైన వారి ఆకాంక్షల ను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉంద ని, బంగారు తెలంగాణ సాధనే అమరులకు అసలైన నివాళి అని మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని, అందరం సంఘటితంగా పనిచేసి బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలని కోరారు. కష్టపడి కాకుండా ఇష్ట పడి పనిచేస్తేనే నిర్దేశించుకున్న లక్ష్యాలు సులువుగా అధిగమించగలమన్నారు. ఇప్ప టికే టీఎస్ఐపాస్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయవంటి కార్యక్రమాలతో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, పంచాయతీ రాజ్ శాఖనూ ఆదర్శంగా నిలిపేందుకు కార్యదర్శులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. 2018 అక్టోబర్ 2నాటికి తెలంగాణను వంద శాతం బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా మార్చడంలో కార్యదర్శులు కీలకం గా వ్యవహరించాలన్నారు. గ్రామ కార్యద ర్శులను రేషనలైజేషన్ చేయడం ద్వారా పనిభారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి జూపల్లి చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం రూపొం దించిన నూతన సంవత్సర డైరీని, కేలండర్ను జూపల్లి, స్వామిగౌడ్ ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాదరావు, అధ్యక్షుడు కారెం రవీందర్రెడ్డి, పంచాయతీ కార్యద ర్శుల సంఘం ప్రతినిధులు పర్వతాలు, శేషు, రాజేందర్, రామకృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ రికార్డులన్నీ ఇకపై ఆన్లైన్లోనే..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై డీపీవోలతో మంత్రి జూపల్లి సమీక్ష హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలను కంప్యూటరీకరించాలని పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్)లో శుక్ర వారం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, ఆస్తులు, పన్నుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్కు, డీపీవోలకు సూచించారు. 5వేల గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాల న్నారు. ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర సమాచా రంతో డేటా బ్యాంక్ నిర్వహించాలని సూచించారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి. ఉపాధిహామీ కింద మంజూరైన గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా సర్పంచ్లను సమాయత్తం చేయాలని డీపీవోలను మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది గాంధీ జయంతిలోగా రాష్ట్రాన్ని 100% బహిరంగ మలవిసర్జన లేకుండా మార్చా లని, అన్ని గ్రామాల్లోనూ 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా కృషిచేయాలని అధికా రులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరి తగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పంచా యతీ సిబ్బందిని హేతుబద్ధీకరించడంతో పాటుగా ఇతర శాఖలకు డిప్యూటేషన్లనూ నిలిపివేశామని కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ తెలిపారు. క్లష్టర్ గ్రామాల నుంచి సేకరించిన వివరాలను కమిషనరేట్కు పంపేలా చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించారు. -
నీళ్లు తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?
జూపల్లికి ఎమ్మెల్యే వంశీచంద్ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: కరువుతో అల్లాడు తున్న పాలమూరు జిల్లాకు నీరివ్వ కుండా డిండి రిజర్వాయరుకు నీళ్లు తీసుకుపోతుంటే జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి ప్రశ్నించారు. మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గం లోని 62వేల ఎకరాలకు నీళ్లు అంది స్తా మన్న టీఆర్ఎస్.. మోసం చేస్తోందన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అడగ్గానే కల్వకుర్తి ఆయకట్టుకు నీరివ్వకుండా ఆయకట్టులో లేని డిండి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోతున్నారని ఆయన విమర్శిం చారు. ఈ విషయమై మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి జూపల్లికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా కోసం మాట్లాడాలని కోరారు. జూపల్లి అసమర్థత, చేతకాని తనంతోనే పాలమూరుకు మరోసారి అన్యాయం జరుగుతోందని వంశీచంద్ విమర్శించారు. -
పంచాయతీరాజ్లో పూర్తి నగదురహితం
జనవరి 10 నుంచి అమలు: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలో వచ్చేనెల పదో తేదీ నాటికి వంద శాతం నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇందుకు బ్యాంకర్లు, పోస్టల్ అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో వంద శాతం నగదు రహిత లావాదేవీల అమలుపై బుధవారం సచివాలయంలో బ్యాంకర్లు, పోస్టల్ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ రాష్ట్రంలో ప్రతినెల 35.96 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఇందులో 17.81 లక్షల పింఛన్లు పోస్టాఫీస్ ద్వారా, 13.63 లక్షల పింఛన్లు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నామన్నారు. మరో 4.52 లక్షల లబ్ధిదారులకు నేరుగా నగదు ఇస్తున్నామన్నారు. వీరికి ఈ నెలాఖర్లోగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో బ్యాంకు రెండు గ్రామాలను దత్తత తీసుకుని, ఈ నెల 31లోగా అందరికీ ఖాతా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. జనవరి పదిలోగా ఖాతాలను ఆధార్తో సీడింగ్ చేసి రూపే కార్డులు ఇవ్వాలన్నారు. ఇకపై ఆసరా పింఛన్దారులు, ఉపాధిహామీ కూలీలకు వచ్చేనెల పదినుంచి పూర్తిగా బయోమెట్రిక్ పద్ధతిలో డబ్బులు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. గ్రామ పంచాయతీల్లో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలని బ్యాంకర్లకు సూచించారు. -
పంచాయతీలకు వసూళ్లే వసూళ్లు
- వారంలో రూ.32.08 కోట్ల ఆస్తి పన్ను వసూలు - 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపు సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటుకు గ్రామ పంచాయతీల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో రూ.32,08,29,499 పన్ను వసూలైంది. వారం రోజుల్లో ఆస్తి పన్ను వసూలు తీరు పరిశీలిస్తే.. 11న అత్యధికంగా రూ.8.16 కోట్లు, శుక్రవారం రూ.2.45 కోట్ల పన్ను వసూలు జరిగింది. 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపులు జరిగాయి. కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.8.38కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.4.96 కోట్ల పన్ను వసూలైంది. సంగారెడ్డి జిల్లాలో రూ.2.54 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.1.75 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.1.32 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.1.23 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.1.21 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.1.10 కోట్లు, నల్లగొండ జిల్లాలో రూ.1.07 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 10 వరకు రూ.73.50 కోట్ల ఆస్తి పన్ను వసూలవగా, వారం రోజుల్లోనే రూ.32.08 కోట్లు వసూలవడం గమనార్హం. ఈ నెల 24 వరకు పాత నోట్లతో పన్ను చెల్లించేందుకు ఉన్న వెసులుబాటును గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని బకారుులు చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. గ్రామాల్లో అన్ని కుటుంబాలు ఆస్తిపన్ను చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
బెల్ట్ షాపులు బంద్ పెట్టేదెప్పుడు?
• స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశంలో మంత్రి జూపల్లిని ప్రశ్నించిన మహిళలు • వీధికో బెల్ట్ షాపుంటే మా బతుకులెట్లా బాగుపడతారుు? సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాగానే బెల్ట్షాపులు బంద్ పెడ్తామన్నారు. గ్రామ్ర గామాన వీధికో షాపులెక్కన వెలిసినయ్. బెల్ట్ షాపులను సర్కారు బంద్ పెట్టకుంటే మా బతుకులెట్లా బాగుపడతాయ్ సారూ..’’ అంటూ మహిళలు మంత్రి జూపల్లి కృష్ణా రావును నిలదీశారు. మంగళవారం హైదరా బాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘స్త్రీనిధి’ బ్యాంకు రెండో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సాధికా రత కోసం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం సలహాలు, సూచనలివ్వాలని మంత్రి కోరారు. దీంతో పలువురు మహిళలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, స్త్రీనిధి బ్యాంకు అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపారు. నల్లగొండ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుమలత బెల్ట్ షాపుల అంశంపై నిలదీశారు. వడ్డీ రీరుుంబర్స్ ఏది? వడ్డీ లేని రుణాల (వీఎల్ఆర్) పథకం కింద తీసుకున్న రుణాలతో పాటు తాము చెల్లించిన వడ్డీని 11 నెలలైనా ప్రభుత్వం రీరుుంబర్స్ చేయలేదని సమావేశంలో జయశంకర్ జిల్లాకు చెందిన ఫర్హానాబేగం నిలదీశారు. ఏడాదిగా అభయహస్తం పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి చెప్పాలని వరంగల్ జిల్లా పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు ప్రకాశమ్మ పట్టుబట్టారు.జిల్లాకో కలెక్టర్ను నియమించినపుడు స్త్రీనిధి బ్యాంక్లో రెండేసి జిల్లాలకు ఒక్కో డెరైక్టర్ను ఏర్పాటు చేస్తామ నడం సరికాదని సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళలు ఆక్షేపించారు. గ్రామ సమాఖ్యలకు ఇచ్చిన విధంగానే పట్టణ సమాఖ్యలకు కూడా వ్యాపారాలకు, పరిశ్రమల స్థాపనలకు రుణా లివ్వాలని సరూర్నగర్కు చెందిన పద్మ స్త్రీనిధి బ్యాంకు అధికారులకు సూచించారు. రుణ ప్రణాళికకు ఆమోదం... ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని పాలకమండలి చేసిన ప్రతిపాదనకు స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొత్తం రుణ ప్రణాళికలో రూ.1,450 కోట్లు సెర్ప్ ద్వారా, రూ.15 కోట్లు మెప్మా ద్వారా పంపిణీ చేయాలని నిర్ణరుుంచారు. నికరలాభం రూ.18.54 కోట్లలో ఒకశాతం విద్యానిధికి, ఒకశాతం స్వంత భవనాల ఏర్పాటుకు వెచ్చించాలని సమావేశం నిర్ణరుుంచింది. సిబ్బందికి 30 శాతం వేతనపెంపు, సెర్ప్ నుంచి ఉద్యోగులను డిప్యుటేషన్పై తీసుకోవడం, ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ వర్తింపు తదితర అంశాలను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. గ్రామాల్లో బ్యాంకుల తరపున మహిళా సమాఖ్యల సభ్యులు బిజినెస్ కరస్పెండెంట్లుగా పనిచేసే విధంగా బ్యాంక్ నియమావళిలో సవరణలు చేసేం దుకు ఆమోదం లభించింది. సమావేశంలో బ్యాంక్ పాలకమండలి అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి కమల, కోశాధికారి స్వరూప, ఎండీ జీవీఎస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, సెర్ప్ సీఈవో నీతూకు మారి ప్రసాద్, డెరైక్టర్లు రాజేశ్వర్రెడ్డి, వెంగళ్ రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికే అప్పుఇచ్చే స్థారుుకి చేరాలి: జూపల్లి స్త్రీనిధి బ్యాంక్ ఆదాయం ఏటా పెరుగుతుండడం అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బ్యాంకు మూలధనంలో ప్రభుత్వ వాటా కంటే మహిళా సమాఖ్యల వాటానే ఎక్కువగా ఉందని, అవసరమైతే ప్రభుత్వానికీ అప్పు ఇవ్వగలిగే స్థారుుకి స్త్రీనిధి బ్యాంక్ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళలు కోరిన విధంగా రాష్ట్రంలో బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ పెరిగిందని చెప్పారు. అభయహస్తం పింఛన్లు, వడ్డీలేని రుణాల విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త జిల్లాలకు డెరైక్టర్ల ఎన్నికలను నెలరోజుల్లో పూర్తి చేయాలని స్త్రీనిధి బ్యాంక్ అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. -
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా అన్నివర్గాల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారు(డీఆర్డీవో)లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల నేపథ్యం లో నూతనంగా నియమితులైన డీఆర్డీవోలకు డీఆర్డీఏ, డ్వామా వంటి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన అవగాహన శిబిరాన్ని జూపల్లి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దరికి సంక్షేమ ఫలాలను చేర్చడమే చిన్న జిల్లాల ఏర్పాటు లక్ష్యమన్నారు. గ్రామాలు స్వయంసమృద్ధిని సాధించే విధం గా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యం కావాలి అన్ని జిల్లాల్లో అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డీఆర్డీవోలను ఆదేశించారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు మహిళా, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఇప్పటికే విద్యుత్ సరఫరా, నూతన పారిశ్రామిక విధానం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల ద్వారా దేశానికే రాష్ట్రం ఆదర్శంగా మారిందని మంత్రి చెప్పారు. కొన్నేళ్లుగా నిస్తేజంగా మారిన మహిళా సంఘాలను సంఘటిత శక్తిగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఆర్డీవోలను ఆదేశించారు. 60 శాతం కుటుంబాలకు ఉపాధి ప్రతి గ్రామంలో కనీసం 60 శాతం కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జూపల్లి ఆదేశించారు. ఉపాధి హామీ పనులపై కరపత్రాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, కూలీ లకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలని సూచించారు. -
గ్రూపు రాజకీయాలకు జూపల్లి ఆజ్యం
మాజీ ఎంపీ మందా జగన్నాథం ధ్వజం ఇటిక్యాల: అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నాగర్కర్నూ ల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం కొండేరులో ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అలంపూర్లో గ్రూపులను ఏర్పాటు చేసి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని, ఇక్కడ దళితులు పార్టీ ఇన్చార్జిలుగా ఉండటం ఆయనకు ఇష్టంలేదన్నారు. పార్టీకి చెందని నాయకులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులను అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రక్రియను టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు అడ్డుకోవడంతో జీర్ణించుకోలేక రాజీనామాల పేరిట తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అలంపూర్ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉంటే తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలని డిమాండ్ చేశారు. -
అక్షరాలా అరకోటి!
పదో రోజు పుష్కరాలకు పోటెత్తిన జనం - మహబూబ్నగర్లో 37 లక్షలు, నల్లగొండలో 13 లక్షల మంది స్నానాలు సాక్షి ప్రతినిధులు, మహబూబ్నగర్/నల్లగొండ: కృష్ణా తీరం జనసంద్రమైంది. ఆది వారం సెలవు రోజు కావడం, మరో రెండ్రోజుల్లో పుష్కరాలు ముగియనుండడంతో జనం పోటెత్తారు. వరుసగా 10వ రోజు భక్తులతో ఘాట్లు కిటకిటలాడాయి. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో 50 లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్నగర్ జిల్లాలోనే 37 లక్షలకుపైగా స్నానాలు చేశారు. నల్లగొండ జిల్లాలో 13 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే హైదరాబాద్-కర్నూల్ జాతీయ రహదారి పుష్కర యాత్రికుల వాహనాలతో కిక్కిరిసిపోయింది. పాలమూరు జిల్లాలో రంగాపూర్లో 9.5 లక్షలు, నది అగ్రహారంలో 8.57 లక్షలు, బీచుపల్లిలో 6.5 లక్షలు, సోమశిలలో 5.91 లక్షలు, గొందిమళ్లలో 3.15 లక్షలు, పాతాళగంగలో 1.55 లక్షలు, పస్పులలో 1.5 లక్షలు, కృష్ణ ఘాట్లో 1.52 లక్షల మంది స్నానాలు ఆచరించారు. అయితే నీటిమట్టం తగ్గడం వల్ల పలుచోట్ల స్నానాలకు అవకాశం లేకపోవడంతో అధికారులు భక్తులను మునగాన్దిన్నె, బూడిదపాడు, పంచదేవ్పహాడ్, గుమ్మడం, జటప్రోలు, క్యాతూర్, పాతాళగంగ ఘాట్లకు తరలించారు. నీటిమట్టం తగ్గడంతో ఆదివారం జూరాల పుష్కరఘాట్ను మూసివేశారు. మరోవైపు జనం తండోపతండాలుగా కదలడంతో షాబాద్ నుంచి అలంపూర్ వరకు వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. సోమశిల, కొల్లాపూర్ ప్రధాన రహదారి జనసంద్రంగా మారడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా వాహనాలను క్రమబద్ధీకరించారు. బీచుపల్లిలో సినీనటుడు సునీల్ పుష్కర స్నానం చేశారు. నల్లగొండలో జనమే జనం.. నల్లగొండ జిల్లాలోని 28 ఘాట్లలో 13 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. వాడపల్లిలో తెలంగాణ అమరవీరులకు పిండ ప్రదానం చేశారు. నదిలో పడి బాలుడి మృతి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిన్నమునిగల్లో విషాద కర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన ముత్తినేని లక్ష్మణ్, సుధారాణి దంపతులు పుష్కర స్నానం ఆచరించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరి పెద్దకుమారుడు హార్థిక్ (12) ప్రమాదవశాత్తు నదిలోని ఓ గుంతలో పడిపోయాడు. వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మరోవైపు పెదవూరం మండలం సంగారం స్టేజీ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, మినీ బస్సు ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో బెలూన్లు తెరచుకోవడంతో డ్రైవర్కు స్వల్పగాయాలు మినహా ఎవరికీ ఏమీ కాలేదు. బలవంతంగా టోల్ వసూలు షాద్నగర్/అడ్డాకుల: పుష్కరాలకు వెళ్లే జనంతో మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా, అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరుసార్లు రాయికల్ టోల్గేట్లను ఎత్తివేశారు. కానీ శాఖాపూర్ వద్ద బలవంతంగా టోల్ వసూలు చేశారు. -
ఆ ముగ్గురూ మూర్ఖులే!
జైపాల్, రేవంత్, నాగంపై మంత్రి జూపల్లి ధ్వజం కల్వకుర్తి: ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేయడం తగదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, టీడీపీ నేత రేవంత్రెడ్డి ముగ్గురూ మూర్ఖులుగా వ్యవహరిస్తూ అడుగడుగునా అడ్డం పడుతున్నారన్నారు. రైతులకు అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లిస్తున్నా.. కావాలనే కుట్రపూరితంగా ఆటంకాలు సృష్టిస్తూ పగటి వేషగాళ్ల వలే వ్యవహరిస్తున్నారన్నారు. -
జిల్లాలో 4.50లక్షల ఎకరాలకు సాగునీరు
పాన్గల్: భీమా, కేఎల్ఐ, నెట్టంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వారా పాలమూరు జిల్లాలో ఖరీఫ్కు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని వివిధ గ్రామాల గుండా ప్రవహించే భీమా కాల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో రైతులకు సాగునీరు అందుతుందన్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, 24 గంటల విద్యుత్, ప్రతి ఇంటికి తాగునీరు, మహిళలకు దీపం సిలిండర్లు తదితర పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోనే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. భీమా ఈఈపై ఆగ్రహం భీమా ప్రాజెక్టు ఈఈ ఉమాపతిరావుపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర సముద్రం వద్ద రెండు మోటార్లు ఏర్పాటు చేసి కాల్వలకు నీరు విడుదల చేయాలని చెప్పినా ఒకే మోటారు ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదేశించినా పనులు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నీరు సరఫరా అవుతున్న తీరు అధికారులు కాల్వల వెంట నిత్యం పరిశీలించాలని, నీటి ప్రవాహానికి కాల్వలు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దాడిచేసిన వారిపై క్రిమినల్ కేసులు అధికారులపై దాడిచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. కాల్వల ద్వారా నీరు సరఫరా కావడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, బీజేపీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి అధికారులపై దాడులు చేస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని వారిపై నాన్బెయిల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేష్నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్, విండో చైర్మన్ బాల్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్యాదవ్, భీమా, మండలస్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
పల్లె పచ్చగుండాలి : మంత్రి జూపల్లి
అలంపూర్రూరల్: బంగారు తెలంగాణ ఆవిర్భవించాలంటే గ్రామగ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. శనివారం టీఆర్ఎస్ తాలూకా ఇన్చార్జ్ మంద శ్రీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన హరితహారం కార్యక్రమమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్టాండ్, కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున కదలివచ్చి చెట్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మందజగన్నాథం, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మల్లికార్జున్, తహసీల్దార్ మంజుల, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ టి.నారాయణరెడ్డి, సర్పంచ్ జయరాముడు, స్థానిక ఎస్ఐలు పర్వతాలు, గిరీష్కుమార్, టీఆర్ఎస్అధ్యక్షుడు మహేష్గౌడ్, నాయకులు విక్రమ్సేనారెడ్డి,ఆత్మలింగారెడ్డి, వడ్డేపల్లి శ్రీనివాసులు ఉన్నారు. -
వారు తోడుదొంగలు
నాగం, రేవంత్లపై జూపల్లి ధ్వజం కొల్లాపూర్: తెలంగాణ ప్రయోజనాల ను కొందరు లం గలు ఆంధ్ర నేతల కు తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి మాట్లాడుతూ నాగం జనార్దన్రెడ్డి, రేవంత్రెడ్డి, డీకే అరుణలపై పరుష పదజాలంతో ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రాలో తీర్మా నం చేస్తే రేవంత్, రమణ దాన్ని వ్యతిరేకించకుండా సభలో బాబుకు స్వీట్లు తిని పించారని మండిపడ్డారు. నాగం, రేవంత్లిద్దరూ తోడు దొంగలని, వీరు చంద్ర బాబుకు వంతపాడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టును జూరాల వద్ద నుంచి కొల్లాపూర్కు కమీషన్ల కోసమే మార్చారని విమర్శలు చేస్తున్నవారికి మెదడు ఉందో లేదోనని డీకే అరుణ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
నువ్వెంత అంటే నువ్వెంత!
♦ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే రేవంత్ వాగ్వాదం ♦ శిలాఫలకానికి గులాబీ పరదా విషయంలో గలాట ♦ బాబుపై జూపల్లి వ్యాఖ్యలకు రేవంత్ అభ్యంతరం ♦ టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల నినాదాలు.. పోలీసుల లాఠీచార్జి కోస్గి: మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలంలో గురువారం జరిగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో రభస చోటుచేసుకుంది. శిలాఫలాకానికి గులాబీ పరదా వేయడాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలపడం.. మరో సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి వ్యాఖ్యలు చేస్తుండగా మైక్ను లాక్కునేందుకు యత్నించడంతో గందరగోళం నెలకొంది. ఒక దశలో మంత్రి, ఎమ్మెల్యే ‘నువ్వెంతంటే.. నువ్వెంత’ అని వాగ్వాదం చేసుకున్నారు. వివరాలు.. కోస్గి మండలంలో మంత్రి జూపల్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట అమ్లికుంట్లలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న క్రమంలో శిలాఫలకానికి గులాబీ పరదాను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సంబంధిత అధికారులను పిలిచి ‘ఇది ప్రభుత్వ కార్యక్రమమా.? పార్టీ కార్యక్రమమా?’అని ప్రశ్నించడంతో అక్కడే ఉన్న మంత్రి జూపల్లి రంగుదేముందిలే! అని నచ్చజెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. బోగారంలో బీటీ రోడ్డును ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో జూపల్లి మాట్లాడుతూ పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు ఆనాడు తెలంగాణను రాకుండా అడ్డుకున్నారని, ఈరోజు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎవరు అడ్డుకున్నా ప్రాజెక్టులను కట్టి తీరుతామంటుండ గా.. రేవంత్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రజల సమావేశంలో రాజకీయాలు ఎందుకని మైక్ను లాక్కునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా గొడవ ప్రారంభమైంది. చంద్రబాబు ఇచ్చే మూటల కోసం పని చేస్తున్నావని మంత్రి, జగన్తో కుమ్మక్కై ప్రా జెక్టుల పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని రేవంత్ పరస్పర ఆరోపణలు చేసుకున్నా రు. పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం మంత్రి సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. -
వాయిదా
కోరం లేకపోవడంతోనే.. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ప్రకటన ► జెడ్పీ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యుల గైర్హాజరు ► జెడ్పీ చైర్మన్ ప్రకటనపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ► ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి మధ్య మాటల యుద్ధం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : జిల్లాలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం, తాగునీటి ఎద్దడి, కరువు సాయంపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. మూడు నెలలకోసారి జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడడంతో పలు కీలక అంశాలు, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రారంభమే కాలేదు. సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాల్రాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్కుమార్, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి తదితరులు సకాలంలోనే హాజరయ్యారు. అయితే సమావేశం నిర్వహించడానికి అవసరమైన జెడ్పీటీసీ సభ్యుల కోరం పూర్తికాకపోవడంతో మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూశారు. జిల్లా పరిషత్ చైర్మన్తో కలిపి కేవలం 20 మంది మాత్రమే హాజరుపట్టికలో సంతకాలు చేశారు. జెడ్పీటీసీ సభ్యులకు నిధులు-విధులు కేటాయించకుండా ప్రభుత్వం తమ పదవులను అలంకారప్రాయం చేస్తుందని, మండలాల్లో ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉండాల్సిన పరిస్థితి నెలకొందంటూ పలువురు జెడ్పీటీసీలు జెడ్పీ సమావేశానికి హాజరుకావద్దని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు ఎవరు సమావేశానికి హాజరుకాలేదు. టీఆర్ఎస్నుంచి జెడ్పీటీసీలు పలువురు తొలుత సమావేశ మందిరానికి వచ్చారు. హాజరుపట్టికలో సంతకాలు చేసిన వారు కేవలం 20 మందే కావడంతో సమావేశం నిర్వహించడానికి అవసరమైన 1/3వ వంతు సభ్యుల హాజరు లేకపోవడంతో వాయిదా వేస్తున్నామని, జెడ్పీటీసీ సభ్యులకు వివాహ కార్యక్రమాలు, ఇతర అత్యవసర పనులుండడంతో హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ ప్రకటించారు. అభ్యంతరం తెలిపిన ఎమ్మెల్యే సంపత్ జెడ్పీచైర్మన్ సమావేశం వాయిదా ప్రకటన చేయకముందే సభా వేదికపై మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ తదితరులు కూర్చున్నారు. సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగానే అలంపూర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్కుమార్ లేచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, పశుగ్రాసం కొరతతో జిల్లా అల్లాడుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో కీలకమైన అంశాలను చర్చించి ప్రజలకు ఉపశమనం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశం నిర్వహణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని, పెళ్లిళ్ల సాకుతో వాయిదా ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని తమ పార్టీకి చెందిన 20 మంది సభ్యులు సమావేశానికి వచ్చారని, మీ పార్టీకి చెందిన సభ్యులు ఒక్కరు కూడా హాజరుకాకుండా ఈ తరహా బేకార్ మాటలు మాట్లాడడం తగదని వ్యాఖ్యానించారు. ఒక ప్రజాప్రతినిధి పట్ల ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ సంపత్కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సభ్యులు కొందరు మినహా మిగతా సభ్యులెవరూ అటువైపే రాకపోవడంతో సమావేశం వాయిదా వేయక తప్పలేదు. మంత్రి నచ్చజెప్పి చూసినా... నిధులు-విధులు, ఇతర సమస్యలకు సంబంధించి అన్ని పార్టీలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి ముందుగానే మంత్రి జూపల్లి కృష్ణారావును ఆర్అండ్బీ అతిథి గృహంలో కలిసి విన్నవించారు. అయితే సమావేశానికి హాజరై మీ అభిప్రాయాలను తీర్మానం రూపంలో ప్రభుత్వానికి పంపించవచ్చని, లేదా సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసే అవకాశం ఉంటుందని ఆయన వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అనేక మంది జెడ్పీటీసీలు జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో జెడ్పీ సమావేశం నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీకి సొంత పార్టీ సభ్యుల నుంచే కొంత సహకారం కొరవడడం చర్చనీయాంశంగా మారింది. మంత్రుల ఇలాఖానుంచే గైర్హాజరు.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అదే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు మాత్రమే హాజరుకావడం సమావేశ ప్రాంగణంలో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్కు చెందిన ఏ ఇద్దరు సభ్యులు హాజరైనా కోరం పూర్తయి సమావేశం సజావుగా సాగేదని, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉండేదని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడడం గమనార్హం. -
చేనేత ఉత్పత్తులకు ఆన్లైన్ ట్రేడింగ్
అమెజాన్ ద్వారా ఆన్లైన్ విక్రయాలను ప్రారంభించిన మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులకు ఆన్లైన్ ట్రేడింగ్ సదుపాయం కల్పించడం ద్వారా కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ ఆన్లైన్ విక్రయ సంస్థ అమెజాన్ ద్వారా ‘టెస్కో’ ఉత్పత్తుల విక్రయాలను ఆప్కోహౌస్లో శుక్రవారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోచంపల్లి, నారాయణ్పేట్, గద్వాల్ తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు తయా రుచేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో ప్రదర్శించడం వలన మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయన్నారు. దళారుల ప్రమేయం తగ్గడం ద్వారా, రాష్ట్రంలోని 1.20లక్షల మంది కార్మికుల ఉత్పత్తులకు మంచి డిమాండూ వస్తుందన్నారు. టెస్కో ఉత్పత్తుల కోసం ‘షాప్.తెలంగాణఫ్యాబ్రిక్స్.కాం’ వెబ్సైట్ సందర్శిం చవచ్చన్నారు. హస్తకళల విక్రయాల కోసం ఇటీవల ప్రారంభించిన ఆన్లైన్ట్రేడింగ్ సత్ఫలితాలనిస్తుంద న్నారు. ఆధునిక ఉత్పత్తులు తయారు చేసేలా చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హ్యాండ్లూమ్స్ విభాగం డెరైక్టర్ ప్రీతీమీనా, జాయింట్ ఎండీ సైదా, టెస్కో జీఎం యాదగరి పాల్గొన్నారు. -
అన్ని స్థానాల్లో దూసుకెళ్లిన కారు
20 20 ► ఊహకందని రీతిలో ఓటర్ల తీర్పు ► ప్రతిపక్షంలేని నగర పంచాయతీ ► కంగుతిన్న విపక్షాల ఐక్యకూటమి ► ఫలించిన మంత్రి జూపల్లి వ్యూహం అచ్చంపేట మండల రిసోర్సు భవనంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. మొదటిరౌండ్ లెక్కింపు ప్రారంభం.. కాసేపట్లోనే ఒకటవ వార్డు ఫలితం వెల్లడి.. టీఆర్ఎస్ గెలిచిందని అధికారిక ప్రకటన. ఆ తర్వాత రెండో వార్డు, మూడో వార్డు, నాలుగో వార్డు.. ఇలా 20 వార్డుల వరకు ఒకటే ప్రకటన..అదే టీఆర్ఎస్ విజయం.. గులాబీ శ్రేణులు ఉరిమే ఉత్సాహం..బాణసంచా పేలుళ్లు.. మరోవైపు విపక్షాలకు ఎటూ పాలుపోని పరిస్థితి.. ఇదీ..అచ్చంపేటలో బుధవారం కౌంటింగ్ కేంద్రం వద్ద కనిపించిన దృశ్యాలు. అచ్చంపేట ‘నగర’వాసుల విలక్షణ తీర్పు విపక్షాల దిమ్మతిరిగేలా చేసింది.. ఊహించనిరీతిలో కారు యమస్పీడ్తో దూసుకెళ్లింది. నగర పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. అచ్చంపేట : అచ్చంపేట మండల రి సో ర్సు భవనంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. మొదటిరౌండ్ లె క్కింపు ప్రారంభం..కాసేపట్లోనే ఒకటవ వార్డు ఫలితం వెల్లడి.. టీఆర్ఎస్ గెలి చిం దని అధికారిక ప్రకటన. ఆ తర్వాత రెం డో వార్డు, మూడో వార్డు, నాలుగో వార్డు ఇలా 20 వార్డుల వరకు ఒకటే ప్రకట న..అదే టీఆర్ఎస్ విజయం.. గులాబీ శ్రేణులు ఉరిమే ఉత్సాహం.. విపక్షాలకు ఎటూ పాలుపోని పరిస్థితి.. అచ్చంపేట ‘నగర’వాసుల విలక్షణ తీర్పు విపక్షాల దిమ్మతిరిగేలా చేసింది.. ఊహిం చని రీతిలో కారు యమస్పీడ్తో దూసుకెళ్లిం ది. నగర పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అన్నిరౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యమే కనిపించింది. ఐక్య కూటమి ఎత్తులను చిత్తుచేస్తూ.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఐక్యకూటమి ఎ త్తులను చిత్తుచేస్తూ అధికారపార్టీ అలవోకగా విజయం సాధించింది. పట్టణంలో ని 20వార్డులకు అన్నివార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అచ్చం పేట మండల రిసోర్సు భవనంలో భారీ బందోబస్తు మధ్య బుధవారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రా రంభమైంది. అచ్చంపేటలో 18,614 మంది ఓటర్లు ఉండగా ఈనెల6న జరి గిన పోలింగ్లో 13,193మంది తమ ఓ టుహక్కును వినియోగించుకున్నారు. మ రో 85మంది ఓటర్లు నోటాకు ఓటువేశా రు. 20 వార్డుల పరిధిలోని 20 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఐదు రౌండ్లలోనే పూర్తయింది. ఓటర్ల వి లక్షణ తీర్పును చూసి విపక్షాల కూటమి నాయకులు కంగుతిన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 13, టీడీపీ 4, బీ జేపీ 3వార్డుల్లో పోటీచేయగా స్వతంత్రులు17మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఆ మూడువార్డుల్లోనే పోటాపోటీ! ఒకటో వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఎం.యాదయ్య టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంతుకు గట్టి పోటీఇచ్చారు. 8, 9, 14 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఐక్యకూటమి గట్టిపోటీ ఇచ్చారు. అతితక్కువగా 8వ వార్డులో 32, 9లో 33, 14లో 68 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. 4వ వార్డులో సుల్తాన్బీ 431ఓట్లు, 10వ వార్డులో జి.శివ 401ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 3వ వార్డులో చైర్మన్ అభ్యర్థి కె.తులసీరాం 279ఓట్ల మెజార్టీ విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్కు రెండురోజుల ముందే మారిన రాజకీయ సమీకరణలు టీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేశాయని ప్రచారం జరుగుతోంది. కాగా, కొన్నివార్డులో స్వతంత్రులుగా పోటీలో నిలిచిన అభ్యర్థులను బరిలో నుంచి తప్పించి టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం కూడా కలిసొచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నా మినేషన్లు వేసింది మొదలుకుని అ చ్చంపేటలోనే మకాంవేసి వ్యూహాత్మకం గా వ్యవరించారు. సొంత సర్వేలు, ఇం టలిజెన్సీ నివేదికలు మొదలుకుని అ న్నింటినీ తమకు అనుకూలంగా మలుచుకుని టీఆర్ఎస్ గెలుపుకోసం శ్రమించారు. నోటా ఓటు వినియోగించుకున్న ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరణ ఓటు అవకాశం కల్పించింది. బరిలో ఉన్న అభ్యర్థులు తమకు ఎవరు నచ్చలేదని చెప్పేందుకు ఈవీఎంల్లో నోటా బటన్ను ఏర్పాటుచేసింది. నగరపంచాయతీ ఎన్నికల్లో 85మంది ఈ బటన్ను ఉపయోగించుకున్నారు. వార్డులో పోటీచేసిన అభ్యర్థులు తమకు నచ్చలేదని ఈ ఓటు ద్వారా తెలియజేశారు. -
తెలంగాణ.. పెట్టుబడులకు స్వర్గధామం
♦ 8 నెలల్లో రూ.29,905 కోట్ల పెట్టుబడులు ♦ పెట్టుబడులతో వచ్చే వారికి ప్రత్యేక రాయితీలు ♦ తెలంగాణ ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక పెట్టుబడులతో తరలివచ్చే వారికి తెలంగాణ స్వర్గధామమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మేకిన్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా గురువారం ముంబైలో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇన్వెస్టర్ల సదస్సు’లో జూపల్లి మాట్లాడారు. 450కిపైగా జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకున్న సానుకూలతలను వివరించారు. నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్) ఆవిష్కరించిన ఎనిమిది నెలల్లోనే రాష్ట్రానికి రూ.29,905 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన 356 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. ఈ పరిశ్రమల స్థాపన ద్వారా 90,324 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న మేకిన్ ఇండియా కోవలోనే రాష్ట్రం కూడా ఐపాస్ను ప్రవేశపెట్టిందన్నారు. పెట్టుబడులకు భౌగోళిక తెలంగాణ అత్యంత అనుకూల ప్రాంతంగా పేర్కొంటూ.. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ లా యూనివర్సిటీతో పాటు అనేక ప్రతిష్టాత్మక వర్సిటీలున్నాయని జూపల్లి వెల్లడించారు. పెట్టుబడులతో వచ్చే వారిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన టీ-ఐడియా ద్వారా అనేక రాయితీలు ఇస్తున్నామన్నారు. నిరంతర విద్యుత్, పారిశ్రామిక అవసరాలకు 10 శాతం నీరు, పరిశ్రమల స్థాపనకు 1.45 లక్షల ఎకరాలతో భూ బ్యాంకు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు తదితరాల రూపంలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జూపల్లి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలు, సౌర విద్యుత్ విధానం, ముచ్చర్ల ఫార్మాసిటీ, స్పైసెస్ పార్కు తదితరాలపై పరిశ్రమల ప్రతినిధులు సందేహాలను లేవనెత్తగా జూపల్లితో పాటు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, శాఖ కమిషనర్ మాణిక్కరాజ్ నివృత్తి చేశారు. సమావేశంలో సీసీఐ తెలంగాణ చాప్టర్ చైర్మన్ వనితా దాట్ల, ఫ్టాప్సీ అధ్యక్షుడు అనిల్రెడ్డి వెన్నం, ఐటీ రంగ ప్రతినిధి, శ్రీనివాస్ కొల్లిపర తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేకిన్ ఇండియాలో భాగంగా వివిధ రాష్ట్రాలు, పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను జూపల్లి సందర్శించారు. -
మేకిన్ ఇండియాలో పెట్టుబడుల ఆకర్షణ
ముగింపు కార్యక్రమానికి మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: ముంబైలో జరుగుతున్న ‘మేకిన్ ఇండియా’ వారోత్సవాలు వేదికగా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 13న ప్రారంభమైన వారోత్సవాల్లో తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. రోజుకు సగటున 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తెలంగాణ స్టాల్ను సందర్శించారు. వారికి రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్) ప్రత్యేకతలతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. స్టాల్ను సందర్శించిన సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్కు చెందిన పరిశ్రమల ప్రతినిధులతోపాటు, ఎయిర్బస్, సిప్లా వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. స్టాల్ను సందర్శించిన సంస్థల వివరాలు సేకరించిన పరిశ్రమల శాఖ.. పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న 25 సంస్థల జాబితాను సిద్ధం చేశారు. గురువారం జరిగే వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు. -
అటకెక్కిన చేనేత, టెక్స్టైల్ పార్కులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత, వస్త్ర పార్కుల ఏర్పాటు ప్రక్రియ ఒక అడుగు ముందుకు, ఆరడుగులు వెనక్కి చందంగా సాగుతోంది. పార్కుల్లో ప్లాట్లు పొందిన ఔత్సాహికులు ఆ తర్వాత పనులు ప్రారంభించకపోవడంతో పార్కుల నిర్వహణ ప్రభుత్వానికి భారమవుతోంది. మరోవైపు యూనిట్లు ప్రారంభమైన చోట ప్రభుత్వం నుంచి సాంకేతిక సాయం, మార్కెటింగ్ సహకారం అందడం లేదు. పార్కుల్లో అరకొర సౌకర్యాలను సాకుగా చూపుతూ పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం లేదు. చేనేత, వస్త్ర పార్కుల్లో నెలకొన్న సమస్యలపై మంత్రి జూపల్లి తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా గాడిన పడటం లేదు. పార్కుల్లో ప్రతిపాదనలు పట్టాలెక్కకపోవడంతో నేత కార్మికులకు అండగా నిలవాల్సిన టెక్స్టైల్ పార్కులు గుదిబండలా తయారవుతున్నాయి. వివిధ జిల్లాలకు మంజూరైన చేనేత, టెక్స్టైల్ పార్కుల్లో ప్రస్తుత పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే... ► మహబూబ్నగర్ జిల్లా గద్వాల లో 2006-07లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.8.21 కోట్లతో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే పార్కు అభివృద్ధి పనుల ప్రాథమిక దశలోనే ప్రాజెక్టు నివేదికను మళ్లీ రూపొందించాలనే సాకుతో నిలిపేశారు. అత్యాధునిక సౌకర్యాలతో పార్కును అభివృద్ధి చేసేందుకు రూ. 70 కోట్లు అవసరమవుతాయని తాజాగా అంచనా వేశారు. ► నల్లగొండ జిల్లా మల్కాపూర్లో 2003-04లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3.31 కోట్లతో 50 ఎకరాల్లో పార్కు అభివృద్ధిని ప్రతిపాదించగా అధికారులు ఆ తర్వాత అంచనాలను సవరించి ఇప్పటి వరకు రూ.8.3 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.5 కోట్లు కేటాయిస్తే తప్ప పనులు కొలిక్కి వచ్చేలా లేవు. 110 ప్లాట్లకుగాను 8 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి ప్రారంభించడం గమనార్హం. పనులు ప్రారంభించని వారికి భూ కేటాయింపులు రద్దు చేయాలని మంత్రి జూపల్లి ఇటీవల అధికారులను ఆదేశించారు. ► కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత, టెక్స్టైల్ పార్కును టీసీఐడీఎస్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2002-03లో మంజూరు చేశాయి. బద్దెనపల్లిలోని 60 ఎకరాల్లో రూ. 77.33 కోట్లతో పార్కు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు పార్కు అభివృద్ది కోసం రూ. 9.46 కోట్లు ఖర్చు చేశారు. మురుగు కాల్వలు, అంతర్గత రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాల పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పక్కనే ఉన్న మరో 15 ఎకరాల్లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులూ నిలిచిపోయాయి. పార్కులో తీవ్ర నీటి కొరత నెలకొంది. ► మెదక్ జిల్లా పటాన్చెరు పాశమైలారంలోనూ టీసీఐడీఎస్ కింద 2002-03లో టెక్స్టైల్ పార్కు మంజూరైంది. రూ. 9.03 కోట్లతో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 50 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినా, 88 ప్లాట్లకు గాను 48 ప్లాట్లలో పునాది కూడా తీయలేదు. ► వరంగల్లో 2005-06లో ఏర్పాటు చేయతలపెట్టిన మినీ టెక్స్టైల్ పార్కు ప్రతిపాదన కూడా ముందుకు సాగడం లేదు. రూ.12.80 కోట్లతో పార్కును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించి, హౌజింగ్ బోర్డు నుంచి భూ సేకరణ కూడా జరిపారు. లే ఔట్ అనుమతులు లభించినా మౌళిక సౌకర్యాల కల్పన ఇంకా ప్రాథమిక దశలోనే వుంది. -
మీ భరోసా ఎవరి కోసం?
విపక్షాలకు మంత్రి జూపల్లి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగం సమస్యలపై అసెంబ్లీలో జరగాల్సినంత చర్చ జరిగిందని, మరి ఎవరికోసం భరోసా యాత్ర చేపడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. అరవై ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీల పాలనలో రైతులకు జరిగిన మేలు కంటే 15 నెలల టీఆర్ఎస్ పాలనలో ఎక్కువే చేశామన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రణాళికలతో వారి పునాదులు కదులుతుంటే కేవలం ఉనికి కోసమే రైతు భరోసా యాత్ర చేస్తామని ప్రకటించారని, ప్రతిపక్షాలకు కనీసం సిగ్గూ శరం లేవని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు కట్టడానికి వారికి పాతికేళ్లు పట్టిందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే చేయలేక పోయారని, సర్వే కోసం రూ.7 కోట్లు ఇవ్వడానికి ఇరవై ఏళ్లు పట్టిందని జూపల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో యువతీ యువకుల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎందుకు భరోసా యాత్రలు చేపట్టలేదని నిలదీశారు. నాగం చేపట్టింది కిసాన్ బచావో యాత్రకాదని, నాగం బచావో యాత్రని ఎద్దేవాచేశారు. ప్రతిపక్షాల చర్యలకు కచ్చితంగా తమ ప్రతిచర్యలు ఉంటాయని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. -
ఆ రెండు పార్టీలు చెంపలేసుకోవాలి: జూపల్లి
హైదరాబాద్: తమ హయాంలో ప్రజలకు చేసిన అన్యాయాలకు, పాపాలకు కాంగ్రెస్, టీడీపీలు రెండు చెంపలు వేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన పాపాలను కడిగేసుకోవడానికి వారికి ఒక జీవితకాలం సరిపోదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశ ంలో మంత్రి మాట్లాడారు. మహబూబ్నగర్ జెడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పోడియం వద్దకు వచ్చి ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కులం పేరుతో దూషించడం వల్లే గొడవ జరిగిందని జూపల్లి వివరించారు. ఈ సంఘటనను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఏపీ సీఎం విదేశీ పర్యటనలకు రూ.22 కోట్లు వెచ్చించడంపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ను సస్పెండ్ చేసిన మంత్రి
గద్వాల్ (మహబూబ్నగర్) : గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి సరైన వివరాలు తెలుపకపోవడంతో.. ఫీల్డ్ అసిస్టెంట్ను విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ మండలంలోని జమ్మిచేడ్ వద్ద జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో శనివారం జరిగింది. గ్రామజ్యోతి కార్యక్రమానికి వెళ్లిన పౌర సరఫరాల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుకు గ్రామానికి సంబంధించి సరైన వివరాలు తెలపకపోవడంతో ఆగ్రహం చెందిన ఆయన వెంటనే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు గౌడ్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
సరిహద్దులో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : జిల్లాకు ఎగువనుంచి వచ్చే నీటిని అడ్డుకునే విధంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో గిరిజాపూర్ వద్ద నిర్మిస్తున్న అక్రమబ్యారేజీని మంగళవారం పరిశీలించేందుకు వెళ్లిన జిల్లా ప్రజాప్రతినిధులకు అడుగడుగునా అడ్డగింతపర్వం ఎదురైంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహబూబ్నగర్ ఎంపీ జితేందర్రెడ్డిని కర్ణాటకలో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేకవాహనాల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు కర్ణాటకలోని గిరిజాపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. కర్ణాటక ప్రాంతానికి వెళ్లే బ్రిడ్జి వద్ద కర్ణాటక పోలీసులు మంత్రి జూపల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. గిరిజాపూర్లో నిర్మిస్తున్న బ్యారేజీని పరిశీలించేందుకు వచ్చామని, ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చామని అక్కడి పోలీసులకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో మంత్రి కర్ణాటక పోలీస్ అధికారులతో ఫోన్లో చర్చలు జరిపారు. రాయిచూర్ జిల్లాలోని గిరిజాపూర్, శక్తినగర్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని అనుమతించడం కుదరదని పోలీసులు స్పష్టం చేసి ఇక్కడినుంచి వెళ్లిపోవాలని గట్టిగానే హెచ్చరించారు. అరగంట పాటు తర్జనభర్జనపడిన కర్ణాటక పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించి బ్రిడ్జి మీద నిరీక్షిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్రెడ్డితో పాటు మరో ముగ్గురిని గిరిజాపూర్ బ్యారేజీ నిర్మాణస్థలిని పరిశీలించేందుకు అనుమతించారు. రాయిచూర్ ఎంపీ, ఎమ్మెల్యే చర్చలు ఈ సమయంలో రాయిచూర్ ఎమ్మెల్యే శివరాాజ్పాటిల్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్రెడ్డి వద్దకు వచ్చి చర్చలు జరిపారు. బ్యారేజీ నిర్మాణంపై అనేక అపోహలు లేవనెత్తుతున్నారని, వాస్తవంగా ఆ పరిస్థితి లేదని కేవలం రాయిచూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్కు అవసరమైన నీటిని వినియోగించుకునేందుకు చట్టానికి లోబడే రోడ్డుకం బ్యారేజీని నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. అదే సమయంలో రాయిచూర్ ఎంపీ నాయక్ సైతం అక్కడకు చేరుకుని వారితోచర్చించారు. ఈ సమయంలో పోలీసులు కల్పిస్తున్న ఆటంకాలపై ఎంపీ జితేందర్రెడ్డి, మంత్రి జూపల్లి వారికి వివరించి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రాయిచూర్ జిల్లా అధికారులతో అక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడి టీఆర్ఎస్ నేతలు గిరిజాపూర్కు చేరుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. మీడియాను మాత్రం అనుమతించలేదు. తప్పని నిరీక్షణ గంటపాటు నిరీక్షణ అనంతరం గిరిజాపూర్ బ్యారేజీ నిర్మాణానికి బయలుదేరిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్రెడ్డి బ్యారేజీ నిర్మాణం ప్రాంతంలో దాదాపు గంటసేపు గడిపారు. అక్కడ ఎంత నీటినిల్వ సామర్థ్యం ఉన్న బ్యారేజీని పరిశీలిస్తున్నారు.. అనుమతులు ఏమిటన్న అంశంపై అక్కడి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. బ్యారేజీ నిర్మాణానికి తమకు కృష్ణ రివర్బోర్డు అనుమతి ఉందని అక్కడి అధికారులు చెప్పగా వాటికి సం బంధించిన ఆధారాలు, వివరాలు కావాలని కోరారు. గిరిజాపూర్ వద్ద నిర్మించే బ్యారేజీ ద్వారా నిల్వ చేసే 0.4 టీఎంసీ నీటిని రాయిచూర్ థర్మల్ పవర్స్టేషన్లో విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నామని, ఈ విద్యుత్ను మహబూబ్నగర్ జిల్లాలోని సగం ప్రాంతానికి పంపిణీ చేస్తున్నామని వివరించారు. అనుమతుల్లేకుండా బ్యారేజీ నిర్మాణం కొనసాగుతోందని, దీనిపై కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్రెడ్డి తెలిపారు. పదేపదే జలదోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక ప్రభుత్వం తీరుపై న్యాయపోరాటం చేస్తామని, దీనిపై పార్లమెంట్లో నిలదీస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శివకుమార్, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కృష్ణమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జూపల్లి
కవాడిగూడ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. గురువారం ఆయన ఇందిరాపార్కు సమీపంలోని ఆప్కో లీవరీ విభాగాన్ని (స్టాక్ సప్లై) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్ సప్లై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, స్టాక్ వివరాలు సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. కంప్యూటర్లో వివరాలను చూపించాలని ఆదేశించినా సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేయడంతో డేటాను పెన్డ్రైవ్లో తీసుకువెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో చేనేత శాఖ మంచి రోజులు రాబోతున్నాయన్నారు. జూన్ 2వ తేదీ తర్వాత ఆప్కో విభజన జరుగుతుందన్నారు. వీటిలో స్టాక్, బ్యాంకు బ్యాలెన్స్లో అధిక వాటా తెలంగాణకే దక్కుతుందన్నారు. పాఠశాలలు, ఆర్టీసీ, ఆసుపత్రులు, అంగన్ వాడీలకు ఆప్కో వస్త్రాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆప్కో మార్కెటింగ్ అధికారి వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.