Nellimarla
-
జనసేన ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిన గెలుపు నాదే
-
చైతన్యం వెల్లివిరిసిన నెల్లిమర్ల
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని వివరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు నియోజకవర్గంలో భారీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వివరించారు. యువత బైక్లతో ర్యాలీ చేశారు. నెల్లిమర్ల డైట్ కాలేజీ మీదుగా కొండవెలగాడ, జర్జాపుపేట వరకూ యాత్ర సాగింది. కొండవెలగాడలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించారు. సాయంత్రం 4 గంటలకు నెల్లిమర్ల మొయిదా జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ – జైజై జగన్, జగనే కావాలి – జగనే రావాలి నినాదాలు సభలో హోరెత్తాయి. పేదల పెన్నిధి సీఎం జగన్ : ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం వైఎస్ జగన్ పేదల పెన్నిధి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గిరిజనులు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గిరిజనుడైన తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే జగన్ వల్లే నని అన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందర్నీ మోసం చేశారన్నారు. వ్యవస్థల్లో సమూల మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. పేదల కోసం విద్య, వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి, అధునాతనంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబం మంచి విద్యను, మంచి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుకుంటున్నాయని తెలిపారు. విభజన తర్వాత పదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి వచ్చిన చంద్రబాబు కొత్త రాజధానిని రాజ్యాంగం, చట్టం ప్రకారం గాకుండా వ్యాపారంగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో పెద్ద పట్టణం, అన్ని హంగులూ ఉన్న విశాఖని కాదని, తన అనుయాయులతో భూములు కొనిపించిన ప్రాంతంలో అర్ధరాత్రి రాజధానిని ప్రకటించిన పాపం చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్ది సుపరిపాలన: మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను అక్కున చేర్చుకొని, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అవమానించిన చంద్రబాబును అందరూ సమష్టిగా మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు. భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అమర్నాథ్ నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ ఇటీవల భూమిపూజ చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రూ.4,750 కోట్లతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సారిపల్లి ఇండ ్రస్టియల్ పార్కు అప్గ్రేడ్ పనులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. నెల్లిమర్లలో రూ.1172 కోట్ల సంక్షేమం: ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో రూ.1,172 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం వైఎస్ జగన్ వెచ్చించారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. రామతీర్థంలో విధ్వంసాన్ని టీడీపీ రాజకీయం చేస్తే, సీఎం జగన్ మాత్రం రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారని తెలిపారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు, ఎమ్మెల్యేలు శంబంగి అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, నవరత్నాల వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు. -
భోగాపురంలో బట్టబయలైన అక్రమాలు.. ‘మిరాకిల్’ భూ కబ్జాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు కానున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భూముల ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. అలాంటి చోట నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు మాధవి భర్త లోకం ప్రసాద్ 14.22 ఎకరాల ప్రభుత్వ భూములను గత సర్కారు హయాంలో ఆక్రమించారు. అవన్నీ ఇటు చెన్నై–హౌరా జాతీయ రహదారి (ఎన్హెచ్ 16), విమానాశ్రయ నిర్మాణం కోసం సేకరించిన భూమికి ఆనుకుని ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం అక్కడ ఎకరా విలువ రూ.2 కోట్లకు పైమాటే! ఆక్రమించి.. ప్రహరీ కట్టేసి భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలను లోకం ప్రసాద్ ఏర్పాటు చేశారు. కాలేజీ హాస్టళ్లు, కెఫేటేరియా, సాఫ్ట్వేర్ సంస్థ భవనాలు, ఉద్యోగుల వసతి కోసం సమీపంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలి బాటలన్నీ కలిపేసి రోడ్డు నిర్మించారు. కొన్ని కల్వర్టులను సొంతంగా కట్టుకుని భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు. కన్నెత్తి చూడని టీడీపీ సర్కారు.. ముంజేరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 293/1లో ఎకరా, 293/5లో 60 సెంట్లు, 296లో అర ఎకరా, 337లో 0.61 సెంట్లు, 343లో 3.52 ఎకరాలు, 342లో 5.02 ఎకరాలు, 391లో 1.52 ఎకరాలు, 392లో 1.16 ఎకరాలు, సర్వే నంబరు 393లో 29 సెంట్ల మేర ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు తాజాగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ పక్కనే కొంగవానిపాలెం గ్రామ రెవెన్యూ పరిధి 98/2పీ సర్వే నంబరులో 40 సెంట్ల బంజరు భూమి కూడా ‘మిరాకిల్’ ఆక్రమణలోనే ఉంది. ఈ వ్యవహారం అంతా గత టీడీపీ పాలనలో దఫాదఫాలుగా జరిగింది. గత పాలకులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల ఆ భూముల చుట్టూ మిరాకిల్ యజమానులు ప్రహరీ నిర్మించి పెద్ద గేట్లు అమర్చడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. పక్కాగా సర్వే నిర్వహించడంతో మిరాకిల్ ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డీ పట్టా భూములనూ వదల్లేదు.. మిరాకిల్ యజమానుల గుప్పిట్లో డీ పట్టా భూములు కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కంచేరు, ముంజేరు, కొంగవానిపాలెం గ్రామాల పరిధిలో మొత్తం 8.52 ఎకరాల వరకు ఉన్నట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిజమేనంటూనే.. ఆక్రమణలు నిజమేనని లోపాయికారీగా అంగీకరించిన మిరాకిల్ యాజమాన్యం ప్రభుత్వ భూమి చేజారిపోకుండా ఎత్తుగడలు వేస్తోంది. మిరాకిల్ ఉద్యోగులను, స్థానిక జనసేన కార్యకర్తలను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. ప్రభుత్వ భూముల్లో తమ సంస్థ భవనాలేవీ నిర్మించనప్పుడు ఎలా స్వాధీనం చేసుకుంటారని అడ్డగోలుగా వాదిస్తున్నారు. గెడ్డలు కప్పేసి తయారు చేసిన మైదానం యువత క్రికెట్ ఆడుకోవడానికి ఉపయోగపడుతోందంటూ రెవెన్యూ అధికారులతో వాదనకు దిగుతున్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాం.. ముంజేరు, కొంగవానిపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయి సర్వేతో పాటు డ్రోన్ సర్వే చేశాం. పక్కాగా ఆక్రమణలను గుర్తించాం. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. స్వాధీనం చేసుకోవడానికి పోలీసు శాఖ సాయం కోరాం. అవన్నీ కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. – కోరాడ శ్రీనివాసరావు, తహసీల్దారు, భోగాపురం, విజయనగరం జిల్లా -
Nellimarla: రామకోనేరుకు మహర్దశ
నెల్లిమర్ల రూరల్ (విజయనగరం జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి ఆలయం పక్కనున్న రామకోనేరుకు మహర్దశ కలగనుంది. కోనేరు అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అమృత సరోవర్ కార్యక్రమంలో భాగంగా కోనేరును బాగుచేసేందుకు రూ.1.50 కోట్ల వ్యయంతో దేవదాయశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఉపాధిహామీ సిబ్బంది రామకోనేరుకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. జలవనరుల శాఖ అధికారులు కోనేరుకు కొలతలు వేసి అభివృద్ధి పనులపై అంచనాలు రూపొందించే పనిలో నిమఘ్నమయ్యారు. 12 ఎకరాల్లో రామకోనేరు రామకోనేరు 12 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రామక్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందుగా కోనేరులో పుణ్య స్నానమాచరించిన తరువాత సీతారామస్వామిని, ఉమా సదాశివుడిని దర్శించుకుంటారు. ప్రస్తుతం రామకోనేరులో రెండు పుష్కర ఘాట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల కోనేరుల అభివృద్ధిలో భాగంగా ఆ శాఖ అధికారులు తాజాగా అమృత సరోవర్ పథకం కింద రామతీర్థం కోనేరును ఎంపిక చేశారు. పనులు పూర్తయితే రామక్షేత్రానికి మరింతి శోభ సాక్షాత్కరించనుంది. కోనేరు అభివృద్ధి ఇలా... రామకోనేరులోకి నీరు వచ్చి పోయేందుకు ఇన్లెట్, ఔట్లెట్ నిర్మాణాలు పూర్తి చేస్తారు. కోనేరు చుట్టూ ఉన్న గట్టును మరింత పటిష్టం చేయనున్నారు. కోనేరులో పూడికతీత పనులు, చుట్టూ రాతి కట్ట నిర్మాణాలు, పడమర వైపు సువిశాలంగా పుష్కర ఘాట్ నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్ల వద్ద అదనపు షెడ్ల నిర్మాణం, మూడు అడుగుల ఎత్తులో గట్టు, రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు పూర్తిచేస్తారు. వీటితో పాటూ 100 మీటర్ల పోడవు, 5 మీటర్ల వెడల్పుతో కూడిన సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కోనేరు అభివృద్ధి పనులకు సుమారు రూ.3 కోట్లు అవసరమవుతాయని దేవస్థాన ఈఓ ప్రసాదరావు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులకు కొలతలు రామతీర్థం దేవస్థానాన్ని ఇరిగేషన్ జేఈ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులకు ఈఓ ప్రసాదరావుతో కలిసి కోనేరు చుట్టూ కొలతలు వేశారు. పుష్కరిణి గట్టుతో పాటు ఇన్లెట్, ఔట్లెట్ చానళ్లను పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులకు సంబంధించి పూర్తి నివేదికను అందజేస్తామని ఆయన తెలిపారు. (క్లిక్: రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్ సీఈవోగా) -
అశోక్ గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు
విజయనగరం: రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను పోలీసులు అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. కాగా,, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో అశోక్ గజపతిరాజు కేసు నమోదైన సంగతి తెలిసిందే. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా అశోక్ గజపతిరాజుకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. -
అశోక్గజపతిరాజుపై కేసు నమోదు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్గజపతిరాజుపై కేసు నమోదైంది. బుధవారం రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర.. కాగా, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. -
దళిత యువకుడిపై దాడి
-
యువకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి, విజయనగరం : నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు శంకు ఆపన్నపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు బుధవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. అప్పన్న పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. టీడీపీ నేత, గ్రామపెద్ద పంచాది సూర్యనారాయణ వారి అనుచరులతో కలిసి అప్పన్న బైక్ తాళం , సెల్ ఫోన్ తీసుకొని అతనిపై దాడికి పాల్పడ్డారు. కాగా అప్పన్న ఆర్టీఏ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే గ్రామంలో జరిగిన భూ ఆక్రమణలపై అప్పన్న రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు తనపై దాడి చేసినట్లు శంకు అప్పన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అయ్యో పాపం.. కుక్కలు, పందులకు బలైన చిన్నారి..!!
విజయనగరం, నెల్లిమర్ల : ఏ తల్లి కన్నబిడ్డో... నడిరోడ్డుపై కుక్కలు, పందులకు ఆహారంగా మారిపోయింది. ఆడపిల్లని భారంగా భావించారో... పరువు పేరుతో నిర్దాక్షిణ్యంగా విసిరేశారో... నెల్లిమర్ల యాతవీధిలో ఓ పసికందు విగతజీవిగా పడి ఉంది. ఓ వైపు దట్టంగా కురుస్తున్న మంచు... మరోవైపు చలిగాలులకు కన్ను కూడా తెరవని ఆ చిన్నారి ఏడుపు సమీప కుటుంబాల చెవిన శుక్రవారం వేకువఝామున పడింది. తలుపుతెరుచుకుని వచ్చి చూస్తే ఆ శిశువును చీల్చేస్తున్న పందులు కనిపించాయి. వెంటనే ఆ పందులను తరిమి చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రాణాలు వదిలిన ఆ చిన్నారిని వారే శ్మశానంలో పూడ్చిపెట్టారు. నెల్లిమర్ల పట్టణంలోని శ్రీనివాసా థియేటర్ ఎదురుగా యాతవీధిలో ఖాళీగా నున్న ప్రదేశంలో ఆ పసికందును ఎవరో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు విసిరేసినట్టు తాను చూశానని ఓ బాలుడు చెబుతున్నాడు. కనీసం బొడ్డు కూడా కోయకుండా తీవ్రమైన చలిలో పడేశారు. అక్కడే సంచరిస్తున్న పందులు, కుక్కలు చిన్నారిని చీల్చుకు తిన్నాయి. సంఘటన చూసిన స్థానికులు చలించిపోయారు. -
276వ రోజు ప్రజాసంకల్పయాత్ర నెల్లిమర్ల విజనగరం జిల్లా
-
బోడికొండకు ప్రేమజంటల తాకిడి
నెల్లిమర్ల రూరల్ విజయనగరం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీరామస్వామివారి క్షేత్రానికి సమీపంలోని బోడికొండపై ప్రేమజంటల సందడి పెరగడంతో భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సీతారామ చంద్ర ప్రభువులు వారు కొండపై సంచరించారని భక్తులు విశ్వసిస్తారు. పాండవులు నడయాడిన నేలగా, బౌద్ధుల ఆవాసమైన ప్రాంతమైన బోడికొండపై ఇటీవలి కాలం నుంచి ప్రేమజంటల తాకిడి పెరిగింది. సీతమ్మవారి పురిటి మంచం, భీముని గుహ, మెట్ల మార్గం, కోదండరామస్వామి ఆలయం సమీపంలో పదుల సంఖ్యలో రోజూ జంటలు వస్తూ తమ చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ చూపి ప్రేమ జంటల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
తమ్ముడి కోసం అస్సాం నుంచి ఆంధ్రాకి..
నెల్లిమర్ల విజయనగరం : ఊరు కాని ఊరు. భాష తెలియని ప్రాంతం. ఆచారాలు.. సంప్రదాయాలు.. అన్నీ భిన్నమైన ప్రాంతం. తోడబుట్టిన వాడి కోసం ఓ అక్క అన్వేషించింది. రాష్ట్రాలు దాటి తరలి వచ్చింది. సోదరుడి ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరైంది. తమ్ముడు కనిపిస్తే చెప్పండని ఫొటోలు చూపించింది. గుండెల్ని పిండేసే ఈ దృశ్యానికి నెల్లిమర్ల పోలీసు స్టేషన్ వేదికైంది.అసోం రాష్ట్రానికి చెందిన పూర్ణ సింగ్లామా అనే వ్యక్తి అసోం-గౌహతి రైలులో ప్రయాణిస్తుండగా జూన్ నెల 15న నెల్లిమర్ల-చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో మార్గ మధ్యంలో తప్పిపోయాడు. మూడు రోజుల తరువాత నెల్లిమర్లలో కొండపేట గ్రామానికి చెందిన నడిపేన లోకేష్ అనే యువకుడికి తారసపడ్డాడు. ఆయన మొబైల్ను అడిగి అసోంలోని తన అక్క లబ్బాకు ఫోన్ చేశాడు. అప్పటికే తప్పిపోయిన తమ్ముడి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు ఈ ఫోన్ కాల్ కొంత ఊరటనిచ్చింది. తమ్ముడు క్షేమంగానే ఉన్నాడని.. ఇక ఇంటికి వచ్చేస్తాడని భావించారు. తమ్ముడి ఆచూకీ కోసం తరచూ ఫోన్ చేస్తుండటంతో విసుగు చెందిన లోకేష్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. రోజులు గడుస్తున్నా తమ్ముడి ఆచూకీ తెలియకపోవడం.. లోకేష్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఫోన్ నంబర్ లొకేషన్ ఆధారంగా బుధవారం నెల్లిమర్లకు వచ్చారు. నెల్లిమర్ల పోలీస్స్టేషన్కు వెళ్లి ఫోన్ చేసిన యువకుడిని పిలిపించారు. కొండపేటకు చెందిన లోకేష్ మాట్లాడుతూ ఒక వ్యక్తి తన మొబైల్ అడిగి ఫోన్ చేశాడని.. తరువాత వెళ్లిపోయాడని.. అంతకుమించి వివరాలు తెలియవని సమాధానమిచ్చాడు. దీంతో పూర్ణ సింగ్లామా అక్క, ఇతర కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. రైల్వే జీఆర్పీని సంప్రదించమని నెల్లిమర్ల ఎస్ఐ ఉపేంద్రరావు సూచించారు. చేసేది లేక పూర్ణ సింగ్లామా అక్క లబ్బా వెంట తెచ్చుకున్న తమ్ముడి ఫొటోను పోలీస్ స్టేషన్కు వచ్చిన వారికి చూపిస్తూ ఆచూకీ తెలిస్తే తెలపండని తమ భాషలో ప్రాధేయపడింది. కంటతడి పెడుతూ నెల్లిమర్ల పట్టణం మొత్తం తిరిగి గోడలకు తన తమ్ముడి ముఖ చిత్రాలను స్వయంగా అంటించింది. ఆచూకీ తెలిస్తే 9957971910 నంబర్కు తెలియజేయాలని కోరింది. తమ్ముడి ఆచూకీ కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన అక్క ఆరాటాన్ని చూసిన వారంతా చలించిపోయారు. -
‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా నెల్లిమర్ల గురుకులం
నెల్లిమర్ల: పట్టణంలోని మిమ్స్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న జూనియర్ కళాశాలను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా గుర్తించినట్లు ఆ విద్యాసంస్థల అకడమిక్ గైడెన్స్ అధికారి ఎస్ఎస్ఎన్.రాజు తెలిపారు. పట్టణంలోని బీసీ బా లికలు, మత్స్యకార బాలుర పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన ఇప్పటికే విడుదల చేశామన్నారు. వచ్చేనెల 1నుంచి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ తరగతులతో పాటు ఎంసెట్, నీట్, ఐఐటీ, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి సింహాచలంలో బీసీ బాలుర గురుకుల జూనియర్ కళాశాలను ప్రారంభించినట్లు ఎస్ఎస్ఎన్ రాజు తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు ఆ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే 12 కళాశాలలతో పాటు జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తించామన్నారు. అన్ని పాఠశాలల్లో ఈ నెల 15న 5వ తరగతి విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ గురుకులాలతో కలిసి అకడమిక్ మీట్ కార్యక్రమాన్ని వచ్చేనెలలో నిర్వహిస్తామని రాజు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. బీసీ గురుకులాల జిల్లా కన్వీనర్ రఘునాధ్, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ రామినాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నెల్లిమర్లలో ‘బయోపార్క్’
చుట్టూ పచ్చదనం పరచుకునే వనాలు... గుబురుగా పెరిగే చెట్లు... ప్రకృతి సిద్ధమైన సౌందర్యం... ఆహ్లాదాన్ని పంచే వాతావరణం... రకరకాల పక్షుల కిలకిలారావాలు... అందులోనే విహారానికి అనువైన ఏర్పాట్లు... పర్వతారోహకులను ప్రోత్సహించే సౌకర్యాలు... ఇవన్నీ ఒకే చోట ఉంటే అది ఇలలో వెలసిన స్వర్గం అంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి ప్రాంతాన్నే జిల్లాలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు నెల్లిమర్ల ప్రాంతాన్ని అటవీశాఖాధికారులు ఎంపిక చేశారు. ఇదే పూర్తయితే పర్యాటకంగా ఈ ప్రాంతానికి ఓ గుర్తింపు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నెల్లిమర్ల : పచ్చనైన వనం మధ్యన పిల్ల లకు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అడవి మధ్యలో ఆటలాడుకునేందుకు పార్కులు, కొండలెక్కేందుకు ట్రెక్కింగ్, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల పరిధిలోని సారిపల్లి సెంట్రల్ నర్సరీలో బయోపార్క్ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం అటవీశాఖ అధికారులు 10హెక్టార్లు కే టాయించారు. అంతేగాకుండా ఆ పార్కులో వివిధ పనులు చేపట్టేందు కు మొదటి విడతగా ప్రభుత్వం తాజాగా రూ కోటి కేటాయించింది. నగరవనం స్థానే బయోపార్కు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ నగరవనాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచించిన సంగతి తెలిసిందే. అడవులు అంతరించిపోతున్న నేపథ్యంలో నగరాలకు సమీపంలో ఎక్కువ విస్థీర్ణంలో మొక్కలను పెంచాలన్నది దాని లక్ష్యం. అంతేగాకుండా అదే నగరవనంలో అన్నివర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అవసరమయ్యే పార్క్లు, ట్రాక్లు ఏర్పాటుచేయాలని పేర్కొంది. విజయనగరంలో మాత్రం ఇంతవరకు నగరవనం ఏర్పాటుకాలేదు. దాని స్థానంలో ‘బయోపార్క్’ ఏర్పాటుచేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. సారిపల్లి సెంట్రల్ నర్సరీలో ఏర్పాట్లు జిల్లాకు తాజాగా వచ్చిన ఆ శాఖ పీసీసీఎఫ్(రాష్ట్ర ప్రధాన అటవీశాఖ అధికారి) ఈ మేరకు బయోపార్క్ వెంటనే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు విజయనగరం–నెల్లిమర్ల ప్రధాన రహదారినుంచి సారిపల్లి గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న ‘సారిపల్లి సెంట్రల్ నర్సరీ’లో బయో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో వనాల ప్రాధాన్యాన్ని వివరించేందుకు ‘వనవిజ్ఞాన కేంద్రం’ నెలకొల్పుతున్నారు. ఈ కేంద్రంలో వివిధరకాల మొక్కలు, వాటి ప్రాధాన్యతను వివరిస్తారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్క్, ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా సెంటర్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేస్తారు. సమీపంలోనున్న కొండను ఎక్కేందుకు ట్రెక్కింగ్ సౌకర్యం కల్పిస్తారు. అంతేగాకుండా వివిధరకాల ఔషధ మొక్కలతో రాశివనం, నక్షత్రవనం తదితరాలను ఏర్పాటుచేస్తున్నారు. అలాగే అటవీ ఉత్పత్తులతో కూడిన క్యాంటీన్, ప్రదర్శనలు ఉంటాయి. ఇప్పటికే సారిపల్లి సెంట్రల్ నర్సరీలో బయోపార్క్ పనులు ప్రారంభమయ్యాయి. క్యాంటీన్, వన ఉత్పత్తుల ప్రదర్శనలకు సంబంధించిన భవనాల నిర్మాణం పూర్తయ్యింది. నక్షత్రవనం, రాశివనాల ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. చురుగ్గా బయోపార్కు పనులు వనాల ప్రాముఖ్యాన్ని వివరించేందుకు, వనాల్లో అన్నివర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు బయోపార్క్ ఏర్పాటు చేస్తున్నాం. సారిపల్లి సెంట్రల్ నర్సరీలో 10 హెక్టార్లలో పార్క్ ఏర్పాటవుతోంది. ఆ పార్క్లో వనవిజ్ఞాన కేంద్రం, చిల్డ్రన్స్ పా ర్క్, యోగాకేంద్రం, ట్రెక్కింగ్ తదితరాలను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి విడతగా మంజూరైన రూ కోటితో ఆ పనులు ప్రస్థుతం చురుగ్గా జరుగుతున్నాయి. – గంపా లక్ష్మణ్, డీఎఫ్ఓ, విజయనగరం -
11 ఇళ్లు దగ్ధం: రూ.6 లక్షల నష్టం
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక థామస్పేట కాలనీలో అగ్నిప్రమాదం జరిగి 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ ప్రమాదంతో 11 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. -
ఏసీబీ వలలో వీఆర్ఓ
నెల్లిమర్ల : మండలానికి చెందిన గ్రామరెవెన్యూ అధికారి(వీఆర్వో) ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టాదారు పాస్పుస్తకం కోసం రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సాక్షాత్తూ రెవెన్యూ కార్యాలయంలోనే ఈ సంఘటన జరగడంతో నెల్లిమర్ల పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ డీఎస్పీ సి.హెచ్.లక్ష్మీపతి అందించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన లెంక అప్పలరాజు.. తన పెద్దమ్మ లెంక నారాయణమ్మ ఇచ్చిన 99 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాస్పుస్తకం కోసం సుమారు ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఏవో కారణాలు చూపించి గ్రామరెవెన్యూ అధికారి తిరస్కరించాడు. అనంతరం అప్పలరాజు మరో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. అయినా పట్టాదారు పాస్పుస్తకం మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో పాస్పుస్తకం మంజూరు చేసేందుకు రైతు అప్పలరాజును వీఆర్వో మజ్జి యేసు రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రైతు అప్పలరాజు ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. వారి సూచనల మేరకు తహసీల్దారు కార్యాలయంలోనే సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సి.హెచ్.లక్ష్మీపతి ఆధ్వర్యంలో సీఐలు లక్ష్మోజీ, రమేష్ తదితరులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీఆర్వో యేసుపై కేసు నమోదు చేశారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
గరికిపేట (నెల్లిమర్ల రూరల్): విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గరికిపేటలో శని వారం చోటుచేసుకుంది. గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పతివాడ లక్ష్మి (35) పచ్చగడ్డి కోసేందుకు సమీపంలో గల వ్యవసాయ భూమిలోకి వెళ్లిం ది. అరుుతే సంబంధిత భూ యజమాని వెలుతురు కోసం పొలానికి విద్యుత్ బల్బు ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ విషయం గమనించని లక్ష్మి గడ్డికోస్తూ పొరపాటున కిందనున్న వైరును తాకింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందిం ది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉపేంద్ర సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. -
ఈ పాపం ఎవరిది..?
ఏడాదిగా నిలిచిన రిజిస్ట్రేషన్లు దేవాదాయశాఖ అధికారుల నిర్వాకంతో ఇక్కట్లు ఎన్ఓసీ కోసం ఎదురుచూస్తున్న విక్రయదారులు నెల్లిమర్ల: దేవాదాయ శాఖ అధికారులు చేసిన నిర్వాకంతో నెల్లిమర్ల పట్టణ వాసులు అవస్థలు పడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఏడాది కాలంగా పట్టణంలోని పలు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, షాపుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. పట్టణంలోని ప్రధాన రహదారికి ఎదురుగా ఉన్న ఆస్తుల క్రయవిక్రయాలన్నీ ఆగిపోయాయి. ఇంత జరుగుతున్న ఆ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్న పట్టణవాసులు.. నెల్లిమర్ల పట్టణంలోని విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారికి ఎగువనున్న సర్వేనంబరు 104 సబ్డివిజన్ 1లోని స్థలాలన్నీ జిరాయితీనే. ఈ సర్వేనంబరులో సుమారు 14 ఎకరాల స్థలముంది. స్థానికులు దశాబ్దాల తరబడి ఇక్కడ పక్కా ఇళ్ళు, షాపులు నిర్మించుకుని ఉంటున్నారు. కానీ ఏడాది కాలంగా ఈ ప్రాంతంలోని ఆస్తుల క్రయ విక్రయాలు ఆగిపోయాయి. దీనికి కారణం కేవలం దేవాదాయ శాఖ అధికారులు చేసిన తప్పిదమేనని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈప్రాంతంలోని భూమంతా దేవాదాయ శాఖదేనని, వాటిని రిజిస్ట్రేషన్ చెయ్యోద్దని ఆ శాఖాధికారులు గతంలో నెల్లిమర్ల సబ్ రిజిస్టార్కు వినతి ఇచ్చారు. దీంతో అప్పటినుంచి ఆ సర్వే నంబరులోని స్థలాలను రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. వాస్తవానికి మండలంలోని గొర్లిపేట గ్రామానికి చెందిన సర్వే నంబరు 104లోని సబ్డివిజన్ 1లోని భూమి రామతీర్థం దేవస్థానానికి చెందిది. కానీ అప్పట్లో గొర్లిపేట వీఆర్వో పొరపాటున సర్వే నంబరును రిజిస్టార్ కార్యాలయానికి అందించినట్లు సమాచారం. దీంతో అప్పటినుంచి ఇక్కడున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రోడ్డుకు ఎగువన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆర్వోబి వరకు ఉన్న స్థలాల్లో ఒక్కటి కూడా క్రయవిక్రయాలు జరుపుకోలేదు. దేవాదాయశాఖకు చెందిన భూముల సర్వే నంబర్ల జాబితా నుంచి ఈ ప్రాంతాన్ని తొలగించాలని స్థానికులు మొరపెట్టుకుంటున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు కల్పించుకుని నెల్లిమర్ల పట్టణంలోని సర్వేనంబరు 104 సబ్ డివిజన్ 1లోని భూములను దేవాదాయశాఖ భూముల జాబితానుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
నెల్లిమర్ల రూరల్ : భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళి తే... విశాఖపట్నం జిల్లా తగరపువలస సమీపంలో గల కొం డపేట గ్రామానికి చెందిన లక్ష్మి(25)కి నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అలుగోలు జగన్నాథంతో ఎని మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త మద్యం సేవిస్తూ ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం తాగవద్దని ఎంతచెప్పినా వినకపోవడంతో లక్ష్మి ఈనెల 20న భర్త ఇంట్లో ఉంటుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచింది. పరారీలో భర్త ఘటన జరిగిన దగ్గర నుంచి భర్త జగన్నాథం పరారీలోనే ఉన్నాడు. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. తమ కుమార్తె మృతికి భర్తే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిత్యం మద్యం సేవించి గొడవలకు దిగేవాడని, కుటుంబ పోషణను కూడా పట్టించుకునేవాడు కాదని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు అందిన సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేశామని ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. ఇప్పటికే మృతిరాలి వద్ద నుంచి మేజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం కూడా తీసుకున్నాయని చెప్పారు. జగన్నాథం విశాఖపట్నంలో ఉన్నట్లు తెలిసిందని, రెండు రోజుల్లో పట్టుకొని పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పారు. -
నెల్లిమర్లకు ఎన్నికలు?
ఏప్రిల్లోనే జరిగే అవకాశం నెల్లిమర్ల, జరజాపుపేటల్లో జోరందుకున్న ఊహాగానాలు ఎన్నికలను అడ్డుకోవాలని జరజాపుపేట వాసుల ప్రచారం నెల్లిమర్ల : నగరపంచాయతీకి ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయా? దీనిపై మున్సిపాలిటీ అధికారులకు ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయా? ప్రస్తుతం నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో జరుగుతున్న చర్చ ఇదే. మున్సిపాలిటీ అధికారులు కూడా ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నగరపంచాయతీనుంచి తమ ప్రాంతాన్ని తప్పించాలని, లేదంటే ఎన్నికలను అడ్డుకోవాలని జరజాపుపేట ప్రజలు పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాద్వారా ప్రచారం చేస్తున్నారు. 2013 నుంచి గ్రేడ్-3 మునిసిపాలిటీగా... నెల్లిమర్ల, జరజాపుపేట మేజరు పంచాయతీలను కలిపి నగరపంచాయతీ(గ్రేడ్-3 మున్సిపాలిటీ)గా 2013 మార్చిలో అప్పటి ప్రభుత్వం స్థాయి పెంచింది. తమకు నగరపంచాయతీ వద్దని, తిరిగి గ్రామపంచాయతీలుగా మార్చాలని ఈ రెండు ప్రాంతాల ప్రజలు అప్పటినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రధానంగా జరజాపుపేటవాసులు ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి తిరిగి గ్రామపంచాయతీగా మార్చాలని విన్నవించారు. గతంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం కాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. మళ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు నగరపంచాయతీ ఏర్పాటై మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా ఎలాగైనా ఏప్రిల్లో నెల్లిమర్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికోసం సమగ్ర సమాచారం పంపించాలని మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలతో పాటే నెల్లిమర్లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. ఇదే విషయమై నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. -
ఉపాధికి నిబంధనాలా?
నెల్లిమర్ల: ఉపాధిహామీ పథకంలో వందరోజుల నిబంధన కూలీలకు గుదిబండగా మారింది. ఒకే జాబ్కార్డులో ఉండే వేతనదారులంతా కలిసి ఆర్థిక సంవత్సరంలో వంద పనిదినాలు పూర్తిచేయడంతో వారికి అధికారులు పనులు నిలిపేశారు. ఈ విధంగా మండలంలోని 472 కుటుంబాలకు చెందిన సుమారు 1200మంది పనిలేక ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండునెలల పాటు పనిలేకపోతే ఎలా బతకాలని వాపోతున్నారు. మండలంలోని 26పంచాయతీల్లో మొత్తం 8వేల జాబ్కార్డులున్నాయి. వీరికి సంబంధించి 15వేల మంది కూలీలు ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్నారు. గత ఏప్రిల్ నెలనుంచి ఇప్పటివరకు 472 జాబ్కార్డులకు చెందిన కూలీలు వందరోజుల పని పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే ఆర్థిక సంవత్సరంలో వందరోజులు పని పూర్తిచేసుకున్నవారికి మరి పని కల్పించకూడదు. అందువల్ల వీరిని సోమవారంనుంచి పనులకు రానివ్వకుండా ఉపాధిహామీ అధికారులు నిలిపివేశారు. వారంతా లబోదిబోమంటున్నారు. వాస్తవానికి ఒక్కో జాబ్కార్డులో ముగ్గురేసి, నలుగురేసి కూలీలు ఉన్నారు. దీనివల్ల ఒక్కొక్కరు నెలరోజులు చేసినా వందరోజులు పూర్తయిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలలుండగా ఇకపై తమకు ఉపాధి ఎలా అన్నదే ప్రశ్న. వేరే పనులకు వెళ్దామన్నా ప్రస్తుతం వ్యవసాయ పనులు కూడా లేవని వాపోతున్నారు. -
నిరుద్యోగులూ.. తస్మాత్ జాగ్రత్త
నెల్లిమర్ల: నెల్లిమర్లకు చెందిన ఓ నిరుద్యోగ అభ్యర్థి ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నిర్వహించిన టెస్ట్లో అర్హత సాధించాడు. శారీరక సామర్థ్య పరీక్షలో కూడా పాసయ్యాడు. అదే అభ్యర్థి గతంలోనూ పలుమార్లు టెస్ట్, శారీరకసామర్థ్య పరీక్షల్లో పాసైనా ఉద్యోగం రాలేదు. దీంతో ఈ సారి కూడా ఉద్యోగం వస్తుందో..రాదోననే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం ఓ దళారి(బ్రోకర్)కి తెలిసింది. ఇంకేం ఆ అభ్యర్థి తల్లిదండ్రులను కలిశాడు. తనకు రైల్వే మంత్రి తెలుసునని..రూ 3 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ బలికాడు. దీంతో సందిగ్ధంలో ఉన్న సదరు అభ్యర్థి తల్లిదండ్రులు రూ. 2 లక్షలకు ఆ దళారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్న మొత్తాన్ని సదరు బ్రోకరుకు ఇచ్చేశారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మెరిట్పై ఆ అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. అయితే తానే ఉద్యోగం వేయించానని రూ. 2లక్షలు చల్లగా జేబులో వేసుకున్నాడు సదరు బ్రోకర్. ప్రస్తుతం నెల్లిమర్ల మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు జరుగుతోంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే నిరుద్యోగుల బలహీనతను బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. బాగా ప్రయత్నించి..ఒకట్రెండుసార్లు త్రుటిలో ఉద్యోగాలు తప్పిపోయిన అభ్యర్థులనే ఎంచుకుంటారు. తమకు సాక్షాత్తూ మంత్రులు, పెద్దస్థాయి అధికారులు తెలుసునని నమ్మబలుకుతారు. తమ ఫోన్లలో తమకు కావాల్సిన వారి నంబర్లనే మంత్రులు గాను, పెద్దస్థాయి అధికారులగాను నోట్ చేసుకుంటారు. అభ్యర్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచే ఆ నంబరుకు డయల్ చేసి లౌడ్స్పీకర్లో మాట్లాడి అందరినీ నమ్మిస్తారు. ఉద్యోగాలు వేయిస్తామని నమ్మబలికి బేరం కుదర్చుకుంటారు. అభ్యర్థి తన సామర్థ్యం మీద ఉద్యోగం సంపాదిస్తే తానేచెబుతూ మొత్తం సొమ్ము కాజేస్తాడు. ఒకవేళ ఉద్యోగం రాకపోతే సంవత్సరాల తరబడి తిప్పి కొంత సొమ్ము ఖర్చు చెప్పి అతి కొద్ది మొత్తం తిరిగిస్తారు. దీన్నిబట్టి అభ్యర్థికి ఉద్యోగం వచ్చినా, రాకపోరుునా బ్రోకర్ల పంట పండుతుంది. ఎక్కువగా బ్యాంకు, రైల్వే పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థుల నుంచి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే మున్సిపాలిటీల్లోనూ ఉద్యోగాలు వేయిస్తామని ఇటీవల చాలా మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్క నెల్లిమర్ల మండల పరిసర ప్రాంతాల నుంచే సుమారు కోటి రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రోకర్ల నుంచి అభ్యర్థులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. దళారులనునమ్మి మోసపోవద్దు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థులెవ్వరూ దళారులను నమ్మవద్దు. ప్రస్తుతం కేవలం సామర్థ్యం మీదే ఉద్యోగాలు వస్తున్నాయి. దళారుల విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో నిఘా సారిస్తున్నాం. ఎవరికి ఉద్యోగాలు వచ్చినా పోలీస్ విచారణ ఉంటుంది కాబట్టి బ్రోకర్ల విషయం బయటపడుతుంది. అభ్యర్థులు దళారులకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఉద్యోగాలిస్తాం అని వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. -రవికుమార్, విజయనగరం రూరల్ సీఐ -
నెల్లిమర్లలో నాలుగు పూరిళ్లు దగ్ధం
విజయనగరం : ప్రమాదవశాత్తు నిప్పంటుకుని నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఆత్మారామం అగ్రహారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇంట్లోని వారంతా నిద్రిస్తున్న సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో నిద్రిస్తున్న వారంతా బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న మరో పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు వెల్లడించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లిమర్లలో విజృంభిస్తున్నడయేరియా
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతిలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే నెల్లిమర్ల, జరగాపుపేటకు చెందిన సుమారు 200 మంది డయేరియా బారిన పడగా.. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. -
ఆ దుప్పిని వండుకు తినేశారు!
నెల్లిమర్ల: సుమారు 15 రోజుల క్రితం నెల్లిమర్ల పట్టణంలోకి ప్రవేశించిన దుప్పి ఏమైంది? అటవీశాఖ అధికారులే దానిని చంపి మాంసంతో విందు చేసుకున్నారా? లేదంటే తమ ఉన్నతాధికారులకు గాని, ప్రజాప్రతినిధులకు గాని కానుకగా ఇచ్చి స్వామిభక్తిని చాటుకున్నారా?... స్థానికుల ఆరోపణలు, అటవీశాఖ అధికారుల పొంతన లేని సమాధానాలను బట్టి దుప్పిని వారే చంపి వండుకు తినేశారని స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే.. నెల్లిమర్ల పట్టణానికి సమీపంలో ఉన్న కొండపైనుంచి సుమారు 15 రోజుల క్రితం 60 కిలోల బరువున్న ఓ దుప్పి జనారణ్యంలోకి ప్రవేశించింది. ముందుగా రామతీర్ధం జంక్షన్ పాఠశాలలోకి ప్రవేశించి అనంతరం రోడ్డు మీద పరుగులు పెట్టిన దుప్పిని స్థానికులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ బీట్ అధికారి కేవిఎన్ రాజు ఆ దుప్పిని ఓ ఆటోలో పూల్బాగ్లో ఉన్న అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ దుప్పికి ప్రథమ చికిత్స అందించినట్లు విలేకరులకు సమాచారమందించారు. తర్వాత విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలకు అప్పగించినట్లు ఒకసారి, గంట్యాడ మండలంలోని పెదమజ్జిపాలెంను ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్కు తరలించినట్లు మరోసారి, అడవిలోకి తరలిస్తుండగా మరణించిందని మరోసారి చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి. దుప్పిని అటవీశాఖ అధికారులే చంపేసి దాని మాంసంతో విందు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపించారు. స్వామిభక్తిని చాటుకునేందుకు బడా ప్రజాప్రతినిధులకు అప్పగించినట్లు మరికొంతమంది చెప్పారు. దీనిపై రేంజర్ లక్ష్మీనరసింహంను వివరణ కోరగా నెల్లిమర్లనుంచి తీసుకొచ్చిన దుప్పిని అడవిలోకి తరలిస్తుండగా అదే రోజు చనిపోయిందన్నారు. ఆధారాలు చూపించమని కోరగా వేరే ఉద్యోగి దగ్గర ఉన్నాయని నీళ్లు నమిలారు. కాగా వన్యప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ అధికారులే ఇలా చేస్తే ఎలాగని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే దారుణానికి పాల్పడిందెవరో తేలుతుందని చెబుతున్నారు. -
కొడుకుతో సహా తండ్రి ఆత్మహత్య
-
కొడుకుతో సహా తండ్రి ఆత్మహత్య
విజమనగరం : కుటుంబ కలహాలతో ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో శుక్రవారం జరిగింది. కుటుంబసభ్యులతో వచ్చిన గొడవల కారణంగా ఏడేళ్ల కొడుకుతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... నారాయణపట్టణం గ్రామానికి చెందిన దన్నాల బోజి(30) ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. కుటుంబంలో తరచూ వస్తున్న గొడవలతో కలత చెందిన బోజి తన ఏడేళ్ల కొడుకుతో కలిసి గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం శుక్రవారం తెల్లవారు జామున నారాయణపట్టణం రైల్వే గేట్ వద్ద పట్టాలపై కొడుకుతో పాటు తల పెట్టి బోజి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన తల, మొండెం వేరుకాగా, బాలుడి మృతదేహం పట్టాలపై పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసి, ఆత్యహత్య కారణాలపై దర్యాప్తు చేపట్టారు. (నెల్లిమర్ల) -
'మంచి కథ కోసం చూస్తున్నా'
నెల్లిమర్ల: మంచి కథ కోసం వేచిచూస్తున్నానని గోపాల గోపాల చిత్ర నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు తనయుడు అభిరామ్ అన్నారు. ఆయన రామతీర్థంలోని శ్రీ రాముడ్ని శనివారం సందర్శించారు. ఆలయ అర్చకులు అభిరామ్ పేరిట ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ వృత్తాంతాన్ని వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్ విలేకరులతో మాట్లాడుతూ గోపాల గోపాల సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రను బ్రేక్ చేస్తుందన్నారు. అంచనాలకు మించి ఆదరణ లభిస్తోందని చెప్పారు. సినిమా ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లను సందర్శిస్తున్నట్టు చెప్పారు. గోపాలగోపాల వంటిమంచి చిత్రాలు నిర్మించేందుకు కథల కోసం వేచి చూస్తున్నామన్నారు. ఇప్పటికే పలువురు రచయితలు తమకు కథలు వినిపించారని, అయితే మరింత విభిన్నమైన కథల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం దేవస్థానాన్ని దర్శించుకోవడంతనకెంతో ఆనందం కలిగించిందని చెప్పారు. ఆయనతో పాటు స్టూడియో పంతులు ఉన్నారు. nellimarla, raamatheertham, gopala gopala movie, daggubati abhiram, నెల్లిమర్ల, రామతీర్థం, గోపాల గోపాల చిత్రం, దగ్గుబాటి అభిరామ్ -
ఇదేం ప్రచారం...?
నెల్లిమర్ల: ‘‘నెల్లిమర్ల నగర పంచాయతీ త్వరలోనే రద్దవుతుంది. నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాలను తిరగి పంచాయతీలుగా ప్రభుత్వం మార్పు చేస్తుంది. ఇందుకు సంబంధించిన జీవో త్వరలోనే జారీకానుంది. ఇదీప్రస్తుతం నగర పంచాయతీలో జోరుగా జరుగుతు న్న ప్రచారం. దీంతో నగర పంచాయతీకి చెందిన నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల ప్రజలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంటి పన్ను, ఆస్తి పన్ను చెల్లించేందుకు వెనుకంజ వేస్తున్నారు. మండలంలోని నెల్లిమర్ల, జరజాపుపేట మేజరు పంచాయతీలను గతేడాది మార్చిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నగర పంచా యతీగా మార్పు చేసిన సంగతి తెలిసిందే.అప్పట్లో దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది. అయితే నగర పంచాయతీగా మార్పు చేయడం తమకు ఇష్టం లేదని ఇరు ప్రాంతాలకు చెందిన ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో ప్రస్తుతం ఈ కే సు నడుస్తోంది. విషయం కోర్టు పరిధిలో ఉండడంతో మొన్నటి ఎన్నికల్లో నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు ఇటీవల సంబంధిత మంత్రులను కలి సారు. నగర పంచాయతీని ర ద్దు చేసి, గ్రామ పంచాయతీలుగా మార్పు చేసే అంశాన్ని పరిశీ లిస్తామని సదరు మంత్రులు చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాలు మళ్లీ గ్రామ పంచాయతీలుగా మారుతాయని ప్రచా రం చేయడం మొదలుపెట్టారు. ఈ తతంగం మున్సిపాలిటీ అధికారులకు తలనొప్పిగా మారింది. ఎప్పుడైతే ఈ ప్రచారం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి స్థానికులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంటి పన్నులు, ఆస్తిపన్ను లు చెల్లించడం మానేసారు. గతంలో ఎంత మొత్తంలో అయితే పన్నులుగా వసూలు చేసేవారో..నగర పంచాయతీగా మారిన తరువాత కూడా అంతే మొత్తం వసూలు చేస్తున్నారు. అయినా స్థానికులు పన్నులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారన్నది అధికారుల వాదన. దీంతో కొంతకాలంగా నగర పంచాయతీకి రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రతినెలా రూ.లక్షల్లో వసూలయ్యే మొత్తం ప్రస్తుతం వేలల్లో కూడా రావడం లేదు. దీంతో మౌలిక సదుపాయాల కల్పన జరగక అభివృద్ధి కుంటుపడుతోంది. అంతేకాకుండా సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి దాపురించిం ది. ప్రజలే కాకుండా సంస్థలు కూడా ఆస్తిపన్ను చెల్లించడం లేదు. నగర పంచాయతీ రద్దు విషయమై ఎటువంటి ప్రకటనా రాలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నగర పంచాయతీని రద్దు చేసినా ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని ఈలోగా పన్నులు చెల్లించకపోవడం దురదృష్టకరమని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగర పంచాయతీ అభివృద్ధి కుంటుపడుతుందని స్పష్టం చేస్తున్నారు. -
సంతోషి జిల్లాకే గర్వకారణం
నెల్లిమర్ల : కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధిం చిన సంతోషి జిల్లాకే గర్వకారణమని.. అటువంటి బిడ్డను కన్న మీరు ధన్యులని... సంతోషి తల్లిదండ్రులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని అభినందించారు. సంతోషి తల్లిదండ్రులను అభినందించేందుకు మంత్రి శనివారం కొండవెలగాడ విచ్చేశారు. ఈ సందర్భంగా సంతోషి తల్లిదండ్రులు రాముల మ్మ, రామారావు తమ బిడ్డ సాధించిన విజయూలను వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థా యి క్రీడల్లో వచ్చిన పతకాలను, ధ్రువీకరణ పత్రాలను చూపించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ 2005 నుంచి సంతోషి వెయిట్ లిఫ్టింగ్లో రాణించడం అభినందించదగ్గ విషయమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థారుులో పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసిందన్నారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. సంతోషి ప్రతిభ అంతా తల్లిదండ్రులకే దక్కుతుందన్నారు. సంతోషి ఉన్నత విద్యకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. వివిధ స్థారుులో నిర్వహించే క్రీడా పోటీల్లో పాల్గొనేం దుకు అయ్యే ఖర్చును సైతం ప్రభుత్వం తరఫున అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం గ్రామంలో వెయిట్లిఫ్టర్లు సాధన చేసే వ్యాయూమ శాలను మంత్రి సందర్శించారు. సంతోషికి శిక్షణ ఇస్తున్న కోచ్ చల్లా రాముతో మాట్లాడారు. శిక్షణలో ఎదురయ్యే సమస్యలను కోచ్ మంత్రికి వివరించారు. సాధన చేసేందుకు వ్యాయూమశాల కూడా గ్రామంలో లేదన్నారు. క్రీడా పరికరాలు కూడా తామే సొంత డబ్బుతో కొనుగోలు చేస్తున్నామని పలువురు క్రీడాకారు లు మంత్రి వద్ద వాపోయూరు. స్పందించిన మంత్రి మల్టీజిమ్ను, వ్యాయూమశాలకు అవసరమయ్యే భవనాన్ని మంజూరు చేస్తానని హామీనిచ్చారు. మంత్రి వెంట అధికారులు కృష్ణమోహన్, రవీంద్రకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు ఉన్నారు. సంతోషికి పెనుమత్స అభినందనలు నెల్లిమర్ల: కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పతకం సాధించిన సంతోషిని తమ పార్టీ తరఫున అభినందిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు చెప్పారు. విలేకరులతో శనివారం మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఇప్పటికే పలు పతకాలు సాధించిన సంతోషి మరోసారి కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించి సత్తా చాటిందన్నారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కోచ్ చల్లా రాము, తల్లిదండ్రులు రాములమ్మ, రామారావులను కూడా అభినందించారు. అభినందనల వెల్లువ విజయనగరం మున్సిపాలిటీ : స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో దేశం నుంచి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన తెలుగు తేజం మత్స సంతోషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పోటీల్లో 53 కిలోల విభాగంలో దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంతోషి క్లీన్ అండ్ జర్క్లో 105 కేజీలు, స్నాచ్ లో 83 కేజీలు బరువులు ఎత్తి కాంస్య పతకం దక్కించుకు న్న విషయం విదితమే. సంతోషి సాధించిన ఘనత ద్వారా జిల్లా ఖ్యాతి ఎల్లలు దాటాయని పలు క్రీడాసంఘాలు అభినందనలు వ్యక్తం చేస్తున్నాయి. సంతోషికి అభినందనలు తెలిపిన వారిలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. మనోహర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దన్నాన తిరుపతిరావు, వల్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు వల్లూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సముద్రాల గురుప్రసాద్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన సాధూరావు, కార్యదర్శి అట్టాడ లక్ష్మున్నాయుడుతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతి నిధులు, క్రీడాభిమానులు ఉన్నారు. వ్యాయూమశాల పూర్తికి నిధులిస్తాం.. నెల్లిమర్ల : వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు పుట్టినిల్లయిన కొండ వెలగాడలో నిర్మాణంలో ఉన్న వ్యాయామశాలను పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హామీనిచ్చారు. కామన్వెల్త్ క్రీడల్లో గ్రామానికి చెందిన మత్స సంతోషి కాంస్య పతకం సాధించిన సందర్భంగా ఆమె తల్లిదండ్రులు రాములమ్మ, రామారావులను కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం సత్కరించారు. కొండవెలగాడలోని సంతోషి స్వగృహానికి చేరుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొండవెలగాడలోని వ్యాయామశాల నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో సంతోషి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీలక్ష్మి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, యడ్ల రమణమూర్తి, ఆదిరాజు పాల్గొన్నారు. -
బీజేపీ బలోపేతానికి కృషి
నెల్లిమర్ల రూరల్ : జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయూలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన నెల్లిమర్లలోని గాంధీనగర్ కాలనీలో జరిగి న ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతా ల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, అధిష్ఠానంతో మాట్లాడిన తరువాత వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పివి గో పాలరావు మాట్లాడుతూ ప్రజలు నాయకులను ఎన్నుకున్నప్పుడే వారి గుణగుణాలు చూడాలన్నారు. కష్టపడి పని చేసే కార్యకర్తల కు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరకవలస నాగమోహ న్కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. అశోక్, మండల అధ్యక్షుడు నడిపేన నారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
వ్యయం జాస్తి సాయం నాస్తి
అరకొరగా విత్తనాల సరఫరా నెల్లిమర్ల: సోమవారం ఉదయం ఏఓ సూరినాయుడు, ఏఈఓ ఉషారాణి క్షేత్రస్థాయికి వెళ్లారు. మరో ఏఈఓ ప్రశాంతి కార్యాలయంలోనే ఉండి రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు స్లిప్పులు రాస్తున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న 56 గ్రామాల్లో ఈ ఖరీఫ్లో మొత్తం ఆరువేల ఎకరాల్లో వరి పంట వేసేందుకు సిద్ధమయ్యారు. వరిసాగు చేసే రైతులకు అవసరమయ్యే విత్తనాలు మొత్తం వెయ్యి క్వింటాళ్లు కాగా ఇప్పటిదాకా కేవలం 360 క్వింటాళ్లు మాత్రమే సబ్సిడీపై సరఫరా చేసేందుకు మండలానికి వచ్చా యి. మొక్కజొన్న సాగు చేసే రైతులకు సైతం విత్తనాలు అందుబాటులో లేవు. ఇప్పటిదాకా ప్రభుత్వం మొక్కజొన్న విత్తనాలపై సబ్సిడీ ప్రకటించలేదు. దీంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. డెంకాడ: డెంకాడ మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సోమవారం ఉదయం 10.15 గంటలకు ఏఈవో భాను తెరిచారు. మరో ఏఈఓ జగన్నాథం చొల్లంగిపేట రైతుల అవసరాలపై అక్కడకు వెళ్లారు. మరో ఏఈవో ప్రశూతి సెలవుపై ఉన్నారు. మండల వ్యవసాయాధికారి హరిక్రిష్ణ రాలేదు. 1001, నెల్లూరి సన్నాలు, రాగోలు సన్నాలు వంటి వరి విత్తనాలు మినహా, ఈ ప్రాంతంలో ఎక్కువగా వేసే సోనామసూరి, స్వర్ణ రకం విత్తనాలు లేవు. వేరుశనగ విత్తనాలు సమయం మించినా ఇంకా రాలేదు. ఇక్కడ ఐదుగురు ఏఈఓలు ఉండేవారు. ఇప్పుడు ముగ్గురే ఉన్నారు. పూసపాటిరేగ: ఖరీఫ్ సీజనుకు సంబంధించి సబ్సిడీపై వచ్చిన వరి విత్తనాలు అరకొరగానే వచ్చాయి. వ్యవసాయ అధికారి తిరుపతిరావు సెలవులో ఉన్నారు. విస్తరణాధికారులు శ్రీలక్ష్మి ,సూర్యప్రకాశరావులు కార్యాలయంలోనే ఉన్నారు. విస్తరణాధికారి రామకోటి ఫీల్డ్లో ఉన్నారు. మండలంలో 350 బస్తాల సాంబమసూరి, 120 బస్తాల 1001 మాత్రమే సబ్సిడీలో ఉన్నాయి. సిబ్బంది కొరత చీపురుపల్లి: మండలానికి నలుగురు వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. చీపురుపల్లిలో గల వ్యవసాయ కార్యాలయానికి రోజుకి 50 నుంచి వంద మంది వరకు వస్తున్నారు. ఏఓ కార్యకలాపాలు చక్కగా ఉన్నాయి. ప ర్మిట్లు రాసేందుకు ఒకే ఏఈఓ అయిపోవడంతో వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులకు జాప్యం జరుగుతోంది. కార్యాలయానికి వస్తున్న రైతులకు ఏ రకం విత్తనాలు మంచివో వివరించడం ఏఈఓనే చూసుకోవాలి. మెరకముడిదాం: మండ లానికి చెందిన ఇన్చార్జి వ్యవసాయాధికారి కె.అరుణ్కుమార్ గరివిడి ఫుల్చార్జ్ కావడంతో మండలానికి చెందిన రైతులకు అందుబాటులో ఉండలేకపోతున్నారు. మండలానికి చెందిన ఏఈఓలు ముగ్గురు ఉన్నారు. వాళ్లు ముగ్గురు ప్రతీరోజు వ్యవసాయకార్యాలయంలో రైతులకు అందుబాటులో ఉంటున్నారు. సోమవారం వ్యవసాయాధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకూ వ్యవసాయ కా ర్యాలయాన్ని తెరవలేదు. మెరకముడిదాం గ్రామంలో 10 గ్రామాలకు చెందిన రైతులకు అవ గాహన సదస్సును నిర్వహించడంతో 12.30 కు కార్యాలయాన్ని తెరిచారు. గరివిడి(చీపురుపల్లి రూరల్): గరివిడిలో వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయాధికారి ఉన్నా లేనట్టేనని రైతులు తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు వ్యవసాయాధికారులు ఎవరూ లేరు. పది మంది రైతులు అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు మూడు రోజులుగా ఖరీఫ్లో సాగుచేసే విత్తనాల కోసం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాత్రం కనిపించటం లేదని రైతులు చెబుతున్నారు. గుర్ల: రైతుల కోసం మండల కేంద్రం గుర్లలో ప్రభుత్వ పక్కా భవనంతో కూడిన వ్యవసాయ కార్యాలయం అందుబాటులో ఉంది. ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఒక ఏఈఓ పోస్టు ఖాళీగా ఉంది. సలహాలు, సూచనల కోసం సుమారు 20 నుంచి 30 మంది రైతులు వస్తుంటారు. అలాగే విత్తనాల సీజనులో 200 నుంచి 300 మంది వస్తుంటారు. అధికారులున్నా లాభం లేదు... నా పేరు మడపాన నారాయణరావు. నాది వెదుళ్లవలస గ్రామం. గత మూడు రోజులుగా వరి విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయానికి తిరుగుతున్నాను. ఎప్పుడు వచ్చినా అధికారులు కనిపించడం లేదు. రోజూ ఇదే తంతు. వ్యవసాయాధికారుల నుంచి ఏమాత్రం సలహాలు, సూచనలు అందటం లేదు. అతి కొద్దిమందికే... విజయనగరం రూరల్ : మండల పరిధిలో సుమారు 12 వేల మంది రైతులు ఉండగా వీరిలో వ్యవసాయాధికారులను సలహాలకు సంప్రదించేది అతికొద్ది మంది మాత్రమే. మండలం లో ఒక వ్యవసాయాధికారి, ముగ్గురు వ్యవసాయ విస్తరణాధికారులు పనిచేస్తున్నా రు. గ్రామాలకు వెళ్లి పంటలు, ఎరువుల వాడకంపై సలహాలు ఇవ్వాల్సిన వ్యవసాయాధికారులు కేవలం ఖరీఫ్ సీజన్కు ముందు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పంట నష్ట సమయంలో ఆదర్శ రైతులు కాంగ్రెస్ పార్టీకి, వారి కుటుంబ సభ్యులకే పంటనష్ట పరిహారం అందేలా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో ఐదు వేల ఎకరాల్లో పల్లం భూములు, నాలుగు వేల ఎకరాల్లో మెట్టు భూములు ఉన్నాయి. ఖరీఫ్లో విత్తనాల సరఫరాపై గ్రామ గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించాల్సిన అధికారులు ఐదారు గ్రామాలకు ఒకే చోట సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో అధికారులు బొబ్బిలి రూరల్: మండల వ్యవసాయశాఖాధికారి కార్యాలయానికి రైతులు సలహాల కోసం రోజూ పది మంది వరకు వస్తుంటారు. ఎరువులు ఎంత మోతాదులో వేయాలి? ఈ వాతావరణంలో విత్తనాలు నాటవచ్చా? ఏయేరకాలు ఈ ప్రాంతానికి అనుకూలం? నెల్లూరు సన్నాలు చీడలకు తట్టుకోగలవా? వంటి సందేహాలు రైతులు సోమవారం వ్యక్తం చేశారు. మండల వ్యవసాయశాఖాధికారిగా ఏ.రవీంద్ర వ్యవహరిస్తుండగా, ఆయన సోమవారం విజయనగరంలో జేడీతో సమావేశానికి వెళ్లారు. ఆయన సేవలపై రైతులు సంతృప్తి వ్యక్త ంచేస్తున్నారు. అలాగే ముగ్గురు ఏఈఓలు జోగినాయుడు, రామమూర్తి, కిరణ్కుమార్లు ఉన్నారు. సోమవారం ఇద్దరు ఏఈఓలు విత్తనాల పంపిణీకి మనగ్రోమోర్ సెంటర్కు వెళ్లగా ఏఓ కార్యాలయంలో ఏఈఓ కిరణ్కుమార్ అందుబాటులో ఉన్నారు. తెర్లాం రూరల్: తె ర్లాంలోని మండల వ్యవసాయ కార్యాలయం సోమవారం ఉదయం 10 గంటలకు తెరచి ఉంది. మండల వ్యవసాయ అధికారి బి. శ్రీనివాసరావు, ఏఈఓ తమ్మినాయుడులు విధుల్లో ఉన్నారు. రఘు, ఇందిర అనే మరో ఇద్దరు ఏఈఓలు 10.15 గంటలకు కార్యాలయానికి వచ్చి, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. 1001 రకం వరి విత్తనాల కోసం మండలంలోని కొల్లివలస, పూనువలస, లోచర్ల, కుమ్మరిపేట, కాలంరాజుపేట గ్రామాల నుంచి రైతులు వ్యవసాయ కార్యాలయానికి వచ్చారు. విత్తన శుద్ధి తప్పని సరిగా చేయాలని ఏఓ రైతులకు సలహా ఇచ్చారు. బాడంగి: రైతులకు అవసరమైన వరి విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్నారు. విత్తనాల కోసం సోమవారం గొల్లాది, పెదపల్లి, వీరసాగరం,పిండ్రంగివలస, కోడూరు,రావివలస, గూడెపువలస, మళ్లంపేట గ్రామాలకు చెందిన సుమారు 12 మంది రైతులు కార్యాలయానికి చేరుకుని అధికారుల కోసం వేచి చూస్తున్నారు. అధికారులు సమయపాలన పాటించడం లేదని రైతులు చెబుతున్నారు. రామభద్రపురం : స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సోమవారం రైతులు బారులు తీరారు. దీనిపై ఆందోళన కార్యక్రమం జరుగుతుందని వ్యవసాయ అధికారి చిం తాడ ప్రసాద్ పోలీసుల సహాయంతో మూడో విడతగా వచ్చిన 1001 వరి విత్తనాలను 540 బస్తాలను పంపిణీ చేశారు. ఒక్కో పాస్ పుస్తకానికి ఒక బస్తా ఇస్తామని ఏఓ తెలుపగా దానికి మించి కావాలని ఎక్కువ భూమి ఉన్న వారు అడిగారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విత్తనాలను సరఫరా చేయాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏఓ ప్రసాద్ని వివరణ కోరగా 100 క్వింటాళ్లు ఈ ఏడాది తక్కువగా సరఫరా చేసింద ని త్వరలో వాటి ని తీసుకొచ్చి రైతులకు అందిస్తామన్నారు. -
ఆగని మరణాలు
నెల్లిమర్ల రూరల్: వేడి గాలులకు జనం ప్రాణాలు వదులుతున్నారు. వారం రోజుల్లో మండలానికి చెందిన ఏడుగురు వడదెబ్బకు గురయ్యారు. ఆదివారమే మండలంలో ము గ్గురు మృతి చెందారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలోని లక్ష్మీదేవిపేటలో ఆదివారం ఉద యం కనకల సరోజిని(60) వడగాలులకు తట్టుకోలేక ప్రా ణాలు వదిలింది. అదే గ్రామానికి చెందిన జూట్మిల్లు కా ర్మికుడు తొగరాపు నాగేశ్వరరావు(53) కూడా తీవ్రమైన వే డి గాలులకు తట్టుకోలేక మృతి చెందారు. ఈయనకు భా ర్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అలాగే పారసాం గ్రా మానికి చెందిన చోడవరపు వెంకమ్మ(55) కూడా ఆది వారం సూర్యుని ప్రతాపానికి బలైంది. వడదెబ్బకు గురైన వెంటనే కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందారు. గొల్లుపాలెంలో ముగ్గురు మృతి దేవుపల్లి (బొండపల్లి ) : గొల్లుపాలెం గ్రామంలో ఆదివా రం వడదెబ్బకు మాదాబత్తుల సూర్యనారాయణ(60), పే కేటి తిరుపతి(52), తామరాపల్లి అప్పలకొండమ్మ(50) లు మృతిచెందారు. మృతి చెందిన విషయాన్ని గ్రామ సర్పంచ్ పల్లి రామునాయుడు, తహశీల్దార్కు, ఆర్డీఓకు తెలియజేశారు. ఇద్దరు మృతి... వేపాడ: వేపాడ మండలంలో వడగాలులకు ఆదివారం ఇద్ద రు మృతి చెందారు. వేపాడలో రెడ్డి పైడితల్లి (75) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోందని, ఎండ తీవ్రతకు తట్టుకోలేక శనివారం రాత్రి చనిపోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలు పైడితల్లికి ఇద్దరు కుమార్తె లు గోకేడ దేముడమ్మ, చింతల దేముడమ్మలున్నారు. పైడితల్లి భర్త కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. అలాగే వల్లంపూడి గ్రామానికి చెందిన తోటాడ సన్యాసి(56) వారం రో జులుగా వీస్తున్న వేడి గాలులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఆయాసం ఎ క్కువవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించామని, రాత్రి 10.30 సమయంలో మృతి చెందినట్లు కుటుం బ సభ్యులు తెలిపారు. మృతుడు సన్యాసికి భార్య పెంట మ్మ, కుమార్తె సింహాచలం(వివాహమైంది) ఇద్దరు కుమారులు దేముడు, రాజు ఉన్నారు. బొబ్బిలిలో ఇద్దరు... బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలో ఆదివారం వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు పత్తిగుళ్ల రా మరాజ్యం (34) ఆదివారం మృతి చెందింది. గత మూడు రోజులుగా ఎండ వేడిమి తట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు వదిలినట్లు బంధువులు తెలిపారు. అలాగే నా యుడుకాలనీకి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు ఉరిటి వెం కటరమణ పట్నాయక్ (87) ఆదివారం మృతి చెందారు. పట్నాయక్ మృతి చెందిన సమాచారం తెలియగానే టీచర్లు అధిక సంఖ్యలో వెళ్లి నివాళులు అర్పించారు. గేదులవానిపాలెంలో... గేదులవానిపాలెం(లక్కవరపుకోట): గేదులవానిపాలేనికి చెందిన గేదుల చంద్రమ్మ(68) ఆదివారం వడదెబ్బకు గురై మృతి చెందింది. వారం రోజులుగా వీస్తున్న వేడి గాలులకు తట్టుకోలేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధుడు... జామి: అలమండ పంచాయతీ నారాయణపురం గ్రామం లో ఎండ వేడికి తట్టుకోలేక పల్ల పోలిపల్లి (68) ఆదివారం మృతి చెందాడు. ఉదయం వరకు బాగానే ఉన్న పోలిపల్లి మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగడంతో అస్వస్థతకు గురై సొమ్మసిల్లి మృతి చెందాడు. మృతుడికి భార్య అప్పయ్య మ్మ, కుమార్తె ఎర్నమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. వృద్ధురాలు... మెరకముడిదాం: బాడాం గ్రామానికి చెందిన రెడ్డి సూరమ్మ(63) వడదెబ్బకు గురై ఆదివారం మృతి చెందారు. రోజూ లాగానే పొలం పనులు చేసుకునేందుకు వెళ్లిన సూరమ్మ మధ్యాహ్నం అయ్యే సరికి ఇంటికి తిరిగి వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. కుటుంబ సభ్యులు నీళ్లు తాగించడానికి లే వదీసే సరికే ఆమె చనిపోయింది. మృతురాలికి కుమారు డు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒకరు మృతి... గజపతినగరం: దత్తిరాజేరు మండలం పెదమానాపురం ఎ స్సీ కాలనీకి చెందిన గోటివాడ లచ్చయ్య (55) ఆదివారం వడ దెబ్బకు గురై మృతి చెందారు. లచ్చయ్య గ్రామంలో గల చర్చికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ స్పృహ కోల్పోయారు. స్థానికులు ఇంటికి తీసుకువస్తుండగా మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కొంకడివరంలో... గరుగుబిల్లి: కొంకడివరం గ్రామంలో వడదెబ్బకు గురై అ ల్లు అప్పలస్వామి (65) ఆదివారం మృతి చెందాడు. అనారోగ్యంగా ఉందని ఆయన ఆదివారం పార్వతీపురం హో మియో క్లినిక్ బయలుదేరారు. బస్టాండ్ నుంచి హోమియో క్లినిక్కు నడిచివెళ్తూ సొమ్మసిల్లిపడిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు పార్వతీపురంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స ప్రారంభించకముందే ఆయన కన్ను మూసినట్లు వైద్యులు తెలిపారు. -
మందు పార్టీల కర్సు రూ.50 కోట్లు
నెల్లిమర్ల, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మద్యం ఏరులైపారింది. ఎన్నికలకు నెలరోజుల ముందే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మద్యాన్ని కొనుగోలుచేసి నిల్వ ఉంచారు. 20 రోజుల ముందునుంచే కార్యకర్తలకు మందు పోయడం మొదలుపెట్టారు. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లు 50 కోట్ల రూపాయల మద్యాన్ని గుటకాయ స్వాహా చేశారు. దీనిలో రూ.నలభైకోట్ల విలువైన మద్యం జిల్లాలోని గొడౌన్ నుంచే సరఫరా కాగా, మరో పదికోట్ల రూపాయల విలువైన మద్యం పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అయింది. ఎన్నికల సందర్భంగా మొత్తం 1.10 లక్షల బ్రాందీ కేసులు, 77వేల బీరుకేసులు అమ్ముడయ్యాయంటే మందుబాబులు ఎంత మజా చేసుకున్నారో అర్థమవుతోంది. గత ఏడాది కంటే అదనంగా మద్యాన్ని సరఫరా చేయరాదనే నిబంధన ఉండకపోతే ఈ విక్రయాలు మరింత పెరిగేవి.ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు చెందిన అభ్యర్థులు నెలరోజుల ముందు నుంచే మద్యం కొనుగోలుచేసి నిల్వ చేయడం మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగానున్న సుమారు 200 మద్యం దుకాణాల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మద్యం కొనుగోలుచేసి నిల్వ ఉంచారు. ఈ విధంగా మొత్తం రూ.40 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. దీనిలో 1.10 లక్షల వైన్ కేసులున్నాయి. అలాగే మరో 77 వేల బీరు కేసులున్నాయి. ఎన్నికలకు ముందు ఈ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే నెల్లిమర్లలోని గోదాము నుంచి మద్యాన్ని సరఫరా చేశారు. రెండు రోజుల్లో 6,558 వైన్ కేసులు, 6,100బీరు కేసులు ఉన్నాయి. వీటి విలువ రూ 2.66కోట్లు. మద్యం పంపిణీపై ప్రభుత్వం నియంత్రణ విధించడంతో ఓటర్లకు సరిపడేలా పంపిణీ చేసేందుకు మద్యం లభ్యం కాలేదు. దీంతో పొరుగు రాష్ట్రాలపై పడ్డారు. ముఖ్యంగా గోవా, ఒడిశా రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తీసుకొచ్చారు. ఈ విధంగా దిగుమతి చేసుకున్న మద్యం విలువ పది కోట్ల రూపాయలు దాటే ఉంటుందని అంచనా. అంతేకాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పలువురు అభ్యర్థులు మద్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక్కొక్క గ్రామానికి అన్ని పార్టీలు కలిపి వంద మద్యం కేసులు సరఫరా చేశాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో యువత మస్తుగా మజాచేశారు. యువతను తమవైపు తిప్పకునేందుకు అభ్యర్థులు ఈసారి మందు పార్టీలు ఇచ్చారు. -
చంద్రబాబు అబద్ధాలకోరు
* విజయనగరం జిల్లా వైఎస్సార్ జనభేరిలో వైఎస్ విజయమ్మ ధ్వజం నెల్లిమర్ల(విజయనగరం), న్యూస్లైన్: ‘‘చంద్రబాబు ఓ అబద్ధాలకోరు.. తొమ్మిదేళ్ల ఆయన హయాంలో ఎన్నో కంపెనీలను తన బినామీలైన సీఎం రమేష్, సుజనాచౌదరి, బిల్లీరావులాంటివాళ్లకు అప్పనంగా కట్టబెట్టాడు. ఎన్నో కంపెనీలను మూయించి ఏడున్నర లక్షలమంది కార్మికులను రోడ్డున పడేశాడు. 26 వేలమందిని ఉద్యోగాల నుంచి తీసేశాడు. అటువంటి చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెబుతున్నాడు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొత్తం మూడున్నర కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసి, పలు కంపెనీలను మూసివేయించి 7.5 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్తే ఎవరూ నమ్మబోరు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ‘‘చంద్రబాబూ... రాష్ట్ర బడ్జెట్ ప్రస్తుతం రూ.1.2 లక్షల కోటు.్ల రైతుల రుణాలు మాఫీ చేయాలంటే 1.5 లక్షల కోట్లు కావాలి. అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తావు? కరెంటు బిల్లులు కట్టలేదని రైతులను జైల్లో పెట్టించిన నువ్వు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు. 2004లో రుణమాఫీ కోసం రాజశేఖరరెడ్డి హామీ ఇస్తే కేంద్రాన్ని ఒప్పించేందుకు మూడేళ్లు పట్టిందన్నారు. కే ంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి 60 వేల కోట్లు రుణమాఫీగా ప్రకటిస్తే, అందులో రాష్ట్రానికి 12వేల కోట్లు కేటాయించారని చెప్పావు. అప్పట్లో రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా అప్పటికే చెల్లించిన రైతులకు వైఎస్సార్ అయిదు వేల రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు అందజేశారని గుర్తు చేశారు. విజయమ్మ బుధవారం విజయనగరంలో, చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి, నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ, ఒమ్మి, సతివాడ గ్రామాల్లో వైఎస్సార్ జనభేరి సభల్లో ప్రసంగించారు. -
నెల్లిమర్లలో ఫ్యాన్ గాలి జోరు
నెల్లిమర్ల, న్యూస్లైన్: నియోజకవర్గంలో నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ ఉంది. సవరించిన జాబితాతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 1,89, 988. వీరిలో ఒక్క నెల్లిమర్ల నగర పంచాయతీలోనే పదో వంతు ఓటర్లు ఉన్నారు. నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ మరింత బలంగా ఉంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే స్థానికుల అభీష్టానికి అనుగుణంగా నెల్లిమర్ల, జర జాపుపేట గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్పు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో స్థాని కులు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని పార్టీ అభ్యర్థి పెనుమత్స సురేష్బాబు ప్రకటించడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. నెల్లిమర్ల మండలంలో పార్టీకి మె జార్టీ తెప్పించేందుకు కొంతకాలం క్రితం పార్టీలో చేరిన ఏఎంసీ చైర్మన్ అంబళ్ళ శ్రీరాములనాయుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, తదితరులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో వైఎస్సార్ సీపీకి స్ప ష్టమైన ఆధిక్యం వస్తుందన్నది రాజకీయ వర్గాల అంచనా. ముఖ్యంగా భోగాపురం మండలంలో గతంలో పీఆ ర్పీ తరఫున పోటీ చేసిన కందుల రఘుబాబు, మాజీ ఎంపీ కొ మ్మూరు అప్పలస్వామి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆ మండలంలో ఇప్పటికే పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ లభించే అవకాశం ఉంది. ఈ మండలంలో టీడీపీ మూడో స్థానానికే పరిమితమైంది. అంతేకాకుండా వైఎస్సా ర్ సీపీ అభ్యర్థి డాక్టర్ పెనుమత్స సురేష్బా బు ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లా రాజకీయాల్లో తన తండ్రికి ఉన్న మంచిపేరుతో నాలుగు మండలాల్లో నూ,నగర పంచాయతీలోనూ ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటించి అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలకు చెందిన కార్యకర్తలు, నేతలను తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారు. రెండు నెలల్లో పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లోని చాలా పంచాయతీలను పార్టీలోకి తీసుకురాగలిగారు. ఒక టీడీపీ విషయూనికి వస్తే..నగర పంచాయతీ విషయంలో ఇప్పటికీ ఆ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నగర పం చాయతీ వాసులు ఆ పార్టీని నమ్మడం లేదు. దీంతో ఆ పార్టీ చెందిన నాయకులు పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడుకు పట్టున్న గ్రామాల్లో కూడా వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి నారాయణస్వామి నాయుడు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్డ కొండ అప్పలనాయుడు పరిస్థితి ఆయన కంటే దారుణంగా ఉంది. -
మంత్రి హామీ ఏమైంది...?
నెల్లిమర్ల, న్యూస్లైన్:‘‘మీకు చెల్లించాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లిస్తాం.. మున్సిపల్ డెరైక్టర్తో మాట్లాడి, అభివృద్ధి పనులు చేపట్టేందు కు మంజూరైన నిధుల నుంచి వేతనాలు అందేలా చూస్తాం.. వెంటనే మీరు సమ్మె విరమించి విధుల్లో చేరండి.. రచ్చబండ కార్యక్రమం సజావుగా జరిగేందుకు మాకు సహకరించండి.. ఇవీ.. గత ఏడాది నవంబరులో సమ్మెబాట పట్టిన నెల్లిమర్ల నగర పంచాయతీ కార్మికులకు పీసీసీ చీఫ్, మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన హామీ. ఇదే విషయాన్ని నగర పంచాయతీ ప్రత్యేకాధికారి గోవిందస్వామి, కమీషనర్ అచ్చింనాయుడు, స్థానిక అధికార పార్టీ నేతలు కూడా స్వయంగా విలేకరుల సమక్షంలో కార్మికులకు వెల్లడించారు. దీంతో అప్పటికే సుమారు 15 రోజుల పాటు సమ్మెలో ఉన్న కార్మి కులు విధుల్లో చేరి...రచ్చబండ సభలు సజావుగా సాగేందుకు సహకరించారు. అయితే మంత్రి హామీ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. సమ్మె విరమి ంచి నాలుగు నెలలైనా ఇప్పటివరకు కేవలం ఐదు నెలల వేతనాలు మాత్రమే చెల్లించారు. ఇంకా ఎనిమిది నెలల బకాయిలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. దీంతో కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లిమర్ల నగర పంచాయతీలో పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, నీటి సరఫరా తదితర విభాగాల్లో మొత్తం 35 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులున్నారు. నెల్లిమర్ల, జరజాపుపేట మేజరు పంచాయతీలుగా ఉన్నప్పటి నుంచి వారు ఇక్కడ పనిచేస్తున్నారు. పంచాయతీలుగా ఉన్నప్పుడు అధికారులు వీరికి సక్రమంగా జీతాలు చెల్లించేవారు కాదు. అయితే గత ఏడాది మార్చిలో నెల్లిమర్ల, జరజాపు పేట మేజరు పంచాయతీలను ప్రభుత్వం నగర పంచాయతీగా మార్పు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ కష్టాలు తీరుతాయని, తమకు ప్రతి నెలా జీతాలు సక్రమంగా చెల్లిస్తారని కార్మికులు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. నగర పంచాయతీగా మార్పు చేసినా పరిస్థితి లో మార్పురాలేదు. దీంతో గత ఏడాది కాలంగా వీరికి జీతాలు అందలేదు. ప్రతి నెలా రెండున్నర లక్షల చొప్పున మొత్తం రూ. 30 లక్షలు వీరికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి మున్సిపాలిటీగా మార్పు చేసిన తరువాత ఇక్కడి రెగ్యులర్ కార్మికులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లిం చాలి. కానీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో రెగ్యులర్ కార్మికులకు సైతం సక్రమంగా జీతాలు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబరులో తమ పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరుతూ కార్మికులంతా సమ్మెబాట పట్టారు. సుమారు 15 రోజుల సమ్మె అ నంతరం రచ్చబండ కార్యక్రమం రావడంతో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ అధికా రులను ఆదేశించారు. ఈ మేరకు అప్పటికే అభివృద్ధి పనుల కోసం విడుదలైన రెండు కోట్ల రూపాయల నుంచి వారికి జీతాలు చెల్లించాలని ఆదేశా లు జారీ చేశారు. దీంతో కార్మికులు సమ్మె విరమించి, విధుల్లో చేరారు. అయితే అనంతరం వారికి ఐదు నెలల బకాయి మాత్రమే అధికారులు చెల్లించారు. మేజరు పంచాయతీగా ఉన్నప్పటి ఎనిమిది నెలల బకాయిలు చెల్లించేందుకు వెనుకంజవేస్తున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. నగర పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మళ్లీ సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్వయానా మంత్రి ఇచ్చిన హామీ నే నెరవేర్చకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఎనిమిది నెలల బకాయిలు చెల్లించకపోతే సమ్మెబాట పట్టడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. -
ముగిసిన మిమ్స్ ఉద్యోగుల సమ్మె
నెల్లిమర్ల రూరల్, న్యూస్లైన్ : మిమ్స్ వైద్యకళాశాల ఉద్యోగులు చేస్తున్న సమ్మె మంగళవారంతో ముగిసింది. యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు బుధవారం విధులకు హాజరయ్యారు. 2011లో యాజమాన్యం ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందం 2013 ఆగస్టు లో ముగిసింది. మరలా వేతన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి యూనియన్ నాయకులు యాజ మాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. దీంతో నూతన వేతన ఒప్పం దాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగులు గత నెల 23 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. చివరకు చర్చలు ఫలించడంతో కార్మికులు విధుల కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో యూని యన్ నాయకులు బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు టీవీ రమణ మాట్లాడు తూ, వార్డ్ బాయ్స్, ఆయాలకు నెలకు రూ.800, కర్ల్, అటెండర్లు, ఏఎన్ఎంలు, ప్లంబింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి రూ. 1100, స్టాఫ్నర్స్లకు రూ.1200, టెక్నీషియన్లకు రూ.1600 చొప్పున జీతం పెరిగిందన్నారు. అలాగే ఐదేళ్లు సీనియారిటీ ఉన్న ల్యాబ్ అసిస్టెంట్లకు టెక్నీషియన్లుగా గుర్తించడం, రెండు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారికి కనీస వేతనం వర్తింపజేయడానికి యాజమాన్యం ఒప్పుకుందన్నారు. అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి కూడా అంగీకరించినట్లు చెప్పారు. యాజమాన్యం తరపున చర్చల్లో మిమ్స్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, వినయ్వర్మ, లక్ష్మీకుమార్ పాల్గొన్నారన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు మధుసూదనరావు, రాంబాబు, జమ్ము రమణారావు, స్వర్ణల త, శంకుతల, సీఐటీయూ నాయకులు కిల్లంపల్లి రామారావు, వి. రామచంద్రరావు పాల్గొన్నారు. -
ఆధార్...ఉద్యోగుల బేజార్
నెల్లిమర్ల, న్యూస్లైన్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆధార్తో ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎన్నాళ్ళో నిరీక్షించిన మీదట ఎట్టకేలకు ప్రభుత్వం ప్రారంభించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు ఆధార్తో లింకు పెట్టడంతో జిల్లాలో సుమారు 16 వేలమంది ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 75 శాతం మందికి ఆధార్ లేకపోవ డం, ఇప్పటికీ జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రా లు ఏర్పాటు చేయకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. దాదాపు అన్ని కుటుంబాల్లోనూ సభ్యులం దరికీ పూర్తిస్థాయిలో ఆధార్కార్డులు లేకపోవడంతో ఏం చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు. ఓవైపు న్యాయస్థా నం ఏ పథకానికీ ఆధార్తో లింకు పెట్టవద్దని తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం హెల్త్స్కీమ్ కు ఆధార్ను లింకు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చివరకు గత్యంతరం లేక జిల్లా కేంద్రంలోని ప్రైవేటు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్య ఉద్యోగులకు ప్రత్యేకంగా ైవె ద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతనెల 5 నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకానికి జిల్లాలో సుమారు 16వేల మంది ఉద్యోగులను అర్హులుగా గుర్తించారు. వీరిలో సుమా రు పదివేల మంది ఉపాధ్యాయులే ఉన్నారు. అంతేకాకుండా ఈ ఉద్యోగులపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు మరో 50 వేల మంది సైతం ఈ పథకం కిందకు వస్తారు. వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిస్తే అందరికీ తాత్కాలిక కార్డులు అందించాల్సి ఉంది. అయితే హెల్త్స్కీమ్కు ఆధార్కార్డులను లింకు పెట్టడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. పథకానికి అర్హులైన వారంతా తమ ఆధార్కార్డును జతచేయాలని ప్రకటించడంతో ఆందోళనకు గురవుతున్నారు. 0 నుంచి 5సంవత్సరాల వరకు వయస్సున్న పిల్లలకు మాత్రం జనన ధ్రువీకరణ పత్రాన్ని జతచేస్తే చాలు. మిగిలిన వారందరికీ తప్పనిసరిగా ఆధార్కార్డులు ఉండాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. వాస్తవానికి మొత్తం ఉద్యోగుల్లో 25 శాతం మందికి మాత్రమే ప్రస్తుతం ఆధార్కార్డులున్నాయి. మిగిలిన 75 శాతం మందికి ఆధార్కార్డులకు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఆధార్ తప్పనిసరి చేయడంతో ఇప్పటికీ కార్డులు లేనివారు ఏంచేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొంతమంది జిల్లాకేంద్రంలోనున్న రెండు ప్రైవేటు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అయితే వేలసంఖ్యలో క్యూ కట్టడంతో సదరు కేంద్రాల నిర్వాహకులు డబ్బులు గుంజేందుకు తెగబడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అంతేగాకుండా కేంద్రాలవద్ద కొంతమంది దళారుల అవతారమెత్తి డబ్బులు గంజుతున్నట్లు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఆధార్నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు గానీ ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆధార్ లేక చాలామంది ఆరోగ్య పథకానికి అనర్హులుగా మారే అవకాశముందని అంటున్నారు. ఓవైపు న్యాయస్థానం దేనికీ ఆధార్ను లింకు పెట్టవద్దని తీర్పు ఇచ్చినా...ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
నిరుద్యోగుల బలహీనతే... ఇంధనం
సర్కారీ కొలువు సంపాదిస్తే ఆ సంతోషమే వేరబ్బా... ఇది నిరుద్యోగుల అంతరంగంలో గూడుకట్టుకున్న బలహీనత. ఇదే దళారులకు అయాచిత వరంగా మారింది. ప్రభుత్వం ఏదైనా కొలువుల నోటిఫికేషన్ విడుదల చేసిందే తడవుగా రంగంలోకి దిగి పోతున్నారు. దళారులను నమ్మవద్దని..ఉద్యోగాలు పారదర్శకంగానే భర్తీచేస్తామని ఓవైపు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ నిరుద్యోగులు మాత్రం గుడ్డిగా వారినే నమ్ముతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా వీఆర్ఓ,వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు దళారులకు సంక్రాంతికి ముందే పండగ సీజన్ వచ్చేసింది. నిరుద్యోగుల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లిమర్ల, న్యూస్లైన్:నెల్లిమర్ల నగరపంచాయతీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని స్థానికనేత ఒకరు సుమారు 20మంది నుంచి తలా రూ.50 వేల చొప్పున మొత్తం వసూలు చేశారు. డబ్బులు వసూలుచేసి నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా ఆ ఉద్యోగాలకు అతీగతీ లేకపోవడంతో డబ్బులు ముట్టజెప్పిన నిరుద్యోగులు కక్కలేక.. మింగలేక అన్నట్లు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. అలాగే గత ఏడాది జూలైలో గుర్ల మండలం రౌతుపేట గ్రామానికి చెందిన ఇద్దరు నిరుద్యోగులనుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ నేత ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తలా రెండులక్షలు చొప్పున కాజేశాడు. ఇప్పటిదాకా ఉద్యోగాలు వేయించక పోవడంతో బాధితులు సదరు నేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిం చేందుకు సన్నద్ధమవుతున్నారు. అదే మండ లం పల్లిగండ్రేడు గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగినుంచి అధికారపార్టీ నేత ఒకరు వీఆర్ఓ ఉద్యోగం వేయిస్తానని చెప్పి సుమారు ఏడాది క్రితం లక్షరూపాయలు తీసుకున్నారు. అయితే అక్కడ కూడా అదే పరిస్థితి. స్థానిక నేతలను నమ్మి వీరే గాదు జిల్లాలోని వందలాదిమంది నిరుద్యోగులు ఇలాగే మోసపోతున్నారు. ఇప్పటిదాకా హోంగార్డులుగానూ, వీఆర్వోలుగానూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగానూ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలికి పలువురు చోటా రాజకీయ దళారులు వందలాదిమందిని మోసం చేశారు. నేతలను నమ్మి డబ్బులు అప్పజెప్పిన నిరుద్యోగులు మాత్రం తాము మోసపోయిన విషయాన్ని ఇప్పటికీ బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు కొత్తగా దళారులు పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ అండదండలున్నవారే ఈ అవతారమెత్తుతున్నట్లు సమాచారం. నిన్నమొన్నటిదాకా పలు విభాగాల్లో ఉద్యోగాలు వేయిస్తామని డబ్బులు గుంజిన దళారులు ఇప్పుడు వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ దండుకునేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు సంబంధించి తాజాగా నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా 137వీఆర్ఏ, 90 వీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా అధికారుల సమాచారం మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 28న పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు నేతలు నిరుద్యోగుల తల్లిదండ్రులకు నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల అనుచరులే ఈ విధంగా నమ్మిస్తున్నట్లు సమాచారం. వీఆర్వో పోస్టు ఇప్పించేందుకు రూ ఐదు లక్షలదాకా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే వీఆర్ఏ పోస్టుకు రూ.రెండులక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరి కొంతమంది దళారులు ఓ అడుగు ముందుకేసి డబ్బులు ఇచ్చినా..టెస్ట్కు బాగా ప్రిపేర్ అవ్వాలని ఉచిత సలహాలు కూడా పారేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఒకవేళ అభ్యర్థి ప్రతిభతో ఉద్యోగం వచ్చినా తమకిచ్చిన డబ్బు నొక్కేయవచ్చుననే ఉద్దేశంతోనే ఇలా చెబుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కనీసం పదిమంది దగ్గర డబ్బులు వసూలుచేస్తే వారిలో ఒక్కరికి ఉద్యోగం వచ్చినా రూ.ఐదులక్షలు సంపాదించుకోవచ్చని, మిగిలిన వారి సొమ్ములో ఖర్చుల నిమిత్తం కొంతమొత్తం ఉంచేసుకోవచ్చని ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఈ విషయాలేవీ తెలియని నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు మాత్రం అమాయకంగా నేతలను నమ్మి డబ్బు ముట్టజెబుతున్నారు. తమకు రావాల్సిన ఉద్యోగం ఎక్కడ చేజారిపోతుందోనని డబ్బు ముట్టజెప్పడంలో పోటీకూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అధికారులు పట్టించుకుని నిరుద్యోగులను మరింత చైతన్యపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సమస్యలపై.. దొంగ నిద్ర!
నిద్రపోయేవారిని లేపగలం గాని, దొంగనిద్ర నటిస్టున్న వారిని లేపడం ఎవరి తరమూ కాదు. సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యల విషయంలో సర్కార్ దొంగనిద్ర నటిస్తూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. సంక్షేమ బాట కార్యక్రమంలో భాగంగా అధికారులు హాస్టళ్లలో రాత్రులు నిద్రపోయి, అక్కడి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలి. మొదటి మూడేళ్లు బాగా నడిచిన ఈ పథకాన్ని తరువాత పట్టించుకోవడం మానేశారు. దీంతో సమస్యలు పరిష్కారం కాక విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. నెల్లిమర్ల, న్యూస్లైన్: వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన సంక్షేమబాట కార్యక్రమానికి ప్రస్తుత సర్కారు తిలోదకాలిచ్చింది. ఏటా అధికారులు వసతిగృహాలను సందర్శించి, అక్కడి సమస్యలను గుర్తించాలన్న ఉద్దేశంతో 2008లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత సర్కారు నీరుగార్చుతోంది. రెండేళ్లుగా అధికారులు వసతిగృహాలను సందర్శించకపోవడం, సమస్యల పరిష్కారానికి సంబంధించి నిధులు విడుదల చేకపోవడమే దీనికి నిదర్శనం. వివరాల్లోకి వెళితే..జిల్లా వ్యాప్తంగా మొత్తం 163 సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 58 వెనుకబడిన తరగతులకు చెందినవి కాగా, 62 సాంఘిక సంక్షేమ వసతి గృహాలున్నాయి. అలాగే మరో 43 గిరిజన సంక్షేమ వసతిగృహాలున్నాయి. ఈ వసతిగృహాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు 2008లో ప్రభుత్వం సంక్షేమబాట కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే జిల్లావ్యాప్తంగానున్న అన్ని వసతి గృహాలను అధికారులు సందర్శించాలి. విద్యార్థులతో పాటు వసతిగృహాల్లోనే నిద్రపోవాలి. వారితో మమేకమై ఆయా వసతి గృహాల్లోని సమస్యలు గుర్తించాలి. గుర్తించిన సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలి. అధికారులు నివేదిక ప్రకారం సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం అవసరమయ్యే నిధులు విడుదల చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదటి మూడేళ్లూ సక్రమంగానే నిర్వహించింది. అయితే గత రెండేళ్లుగా కార్యక్రమం ఊసే ఎత్తలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు ఏడు నెలలైనా ఇప్పటిదాకా సంక్షేమబాట చేపట్టలేదు. దీంతో అన్ని హాస్టళ్లలో ప్రతి ఏటా సమస్యలు పెరిగిపోతున్నాయి. నెల్లిమర్ల మండలంలోని అలుగోలు బీసీ బాలుర వసతి గృహంలో సుమారు 250 మంది విద్యార్థులుండగా కేవలం నాలుగు గదులే ఉన్నాయి. రెండేళ్ల క్రితం నిర్వహించిన సంక్షేమబాటలో ఈ వసతి గృహానికి ప్రభుత్వం అదనపు భవనాన్ని మంజూరుచేసింది. అయితే నిధులు చాలకపోవడంతో ఆ భవనం ఇప్పటికీ పూర్తికాలేదు. అదే సంక్షేమబాట కార్యక్రమం చేపట్టి ఉంటే భవన నిర్మాణం పూర్తయ్యేది. అలాగే ఇక్కడి విద్యార్థుల కోసం నూతన మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ నీటి సదుపాయం లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. రామతీర్థం ఎస్సీ బాలుర వసతిగృహం భవనం శిథిలమై మూడేళ్ల క్రితమే కూలిపోయింది. అయితే సంక్షేమబాట కార్యక్రమం చేపట్టకపోవడంతో మొన్నటిదాకా నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరుకాలేదు. సంక్షేమబాట కార్యక్రమం చేపట్టకపోవడంతో ఇదే పరిస్థితి దాదాపు జిల్లాలోని అన్ని వసతిగృహాల్లోనూ నెలకొంది. చాలా వసతిగృహాల్లో విద్యార్థులు నిద్రించేందుకు గదులు సైతం లేవు. అలాగే పలు వసతి గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించలేదు. కొన్ని హాస్టళ్లలో నీటి సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా సంక్షేమబాట కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే సమస్యలు ప్రతి ఏటా పేరుకుపోయి ఉండేవి కాదని వసతిగృహాల సంక్షేమాధికారులు సైతం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్షేమబాట కార్యక్రమం చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రైలు ఢీకొని ముగ్గురి మృతి
నెల్లిమర్ల, న్యూస్లైన్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్వోబీ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయనగరం పట్టణం కొత్తగ్రహారంలో ఉంటున్న ఎస్.బాలాజీసింగ్(40), భార్య అనుపమ, కుమారులు పురుషోత్తం(8), అనీష్(4)లతో కలసి ఆదివారం నెల్లిమర్ల చంపావతి నది వద్దకు విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నెల్లిమర్ల ఆర్వోబీ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన తండ్రి, ఇద్దరు కుమారులూ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు రావడంతో మరో ట్రాక్పైకి వెళ్లారు. అదే సమయంలో ఆ ట్రాక్పై వచ్చిన ప్యాసింజర్ రైలు వారిని ఢీకొంది. ఈ దుర్ఘటనలో తండ్రీ, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు.