panama
-
పనామా నిర్బంధ కేంద్రంలో భారతీయులు.. స్పందించిన ఎంబసీ
పనామా సిటీ: భారతీయులు సహా సుమారు 300 మంది అక్రమ వలసదారుల్ని లాటిన్ అమెరికా దేశం పనామాలో ఉంచింది అమెరికా. అయితే.. నిర్బంధ కేంద్రంలో వాళ్లంతా దయనీయమైన స్థితిలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తమకు సాయం అందించాలని కొందరు ఫ్లకార్డులను ప్రదర్శించడమే అందుకు కారణం. అయితే పనామాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ అంశంపై స్పందించింది.పనామా(Panama)లోని ఓ హోటల్లో వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించింది. వాళ్లకు అవసరమైనవన్నీ ఇక్కడి అధికారులు అందిస్తున్నారని, వాళ్ల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత ఎంబసీ ఎక్స్ ద్వారా తెలిపింది.Panamanian authorities have informed us that a group of Indians have reached Panama from US They are safe and secure at a Hotel with all essential facilitiesEmbassy team has obtained consular accessWe are working closely with the host Government to ensure their wellbeing pic.twitter.com/fdFT82YVhS— India in Panama, Nicaragua, Costa Rica (@IndiainPanama) February 20, 2025భారత్,ఇరాన్, నేపాల్,శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, చైనాకు చెందిన అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పనామాకు తరలించారు అధికారులు. హోటల్ అయిన ఆ నిర్బంధ కేంద్రం చుట్టూ తుపాకులతో సిబ్బంది ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే టైంలో.. వలసదారుల్లో కొందరు సాయం కావాలని, తాము తమ దేశంలో సురక్షితంగా ఉండలేమంటూ హోటల్ అద్దాల గదుల నుంచి ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆందోళన మొదలైంది.అయితే అక్రమ వలసదారుల్ని(Illegal Migrants) నేరుగా స్వస్థలాలకు పంపడంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే పనామాను వారధిగా(ట్రాన్సిట్ కంట్రీ) ఉపయోగించుకుంటోంది. ఇక వలసదారుల ఆందోళనలను పనామా తోసిపుచ్చుతోంది. అమెరికాతో ఉన్న వలసదారుల ఒప్పందం మేరకు..వాళ్లను ఇక్కడ ఉంచాల్సి వచ్చిందని పనామా సెక్యూరిటీ మినిస్టర్ ఫ్రాంక్ అబ్రెగో వెల్లడించారు. వాళ్లకు సకాలంలో ఆహారం, మందులు..ఇతర సదుపాయాలు అందుతున్నాయని వెల్లడించారాయన. అయితే..వాళ్లలో చాలామంది హోటల్ దాటే ప్రయత్నాలు చేశారని, అందుకే కాపలా ఉంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.బుధవారం చైనాకు చెందిన ఓ మహిళ పారిపోయే ప్రయత్నంలో పట్టుబడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అక్రమ వలసదారుల్ని ఇక్కడి(పనామా) నుంచే స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారాయన.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్కు 332 మంది అక్రమ వలసదారుల్ని పంపించి వేసింది. ఈ మేరకు మూడు దఫాలుగా అమృత్సర్లో అమెరికా యుద్ధ విమానం వలసదారుల్ని తీసుకొచ్చింది. -
ఎవరైనా చార్జీలు చెల్లించాల్సిందే
పనామా సిటీ: పనామా కాలువ నుంచి అమెరికా యుద్ధనౌకలు ఉచితంగా రాకపోకలు సాగించేలా ఒప్పందం ఏదీ కుదరలేదని పనామా అధ్యక్షుడు జోస్రాల్ ములినో గురువారం స్పష్టంచేశారు. తమ యుద్ధ నౌకల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పనామాతో ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. పనామా కాలువ గుండా రాకపోకలు సాగించే నౌకలకు రుసుము ఖరారు చేయడం గానీ, మినహాయింపు ఇవ్వడం గానీ తాను చేయలేనని పేర్కొన్నారు. అమెరికా నౌకలకు ప్రత్యేక వెసులుబాటు లేదని వివరించారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అన్ని దేశాల నౌకలు రుసుము చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్కు తెలియజేశానని చెప్పారు. అయితే, పనామా అధ్యక్షుడు జోస్రాల్ ములినో అమెరికా సర్కారు ఇంకా స్పందించలేదు. ‘‘అమెరికా ప్రభుత్వ నౌకలు ఇకపై పనామా కాలువలో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చు. దీనివల్ల మనకు మిలియన్ డాలర్ల ఆదా అవుతుంది’’అని అమెరికా బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. -
ట్రంప్ మాస్ వార్నింగ్.. దెబ్బకు దిగివచ్చిన పనామా!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నారు. పనామా కెనాల్ విషయంలో ట్రంప్ కొంత మేరకు తన పంతం నెగ్గించుకున్నారు. తమ యుద్ధ నౌకలు పనామా కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సె వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. గతంలో ట్రంప్ పనామా కాలువను కొనుగోలు చేయాలని కలలు కన్నారు. కానీ అది తీరకముందే పదవిని కోల్పోయారు. ఇక, రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈసారి కచ్చితంగా పనామా కాలువను కొనాలని చూస్తున్నారు. పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకొంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పనామా కాస్త వెనక్కి తగ్గి మరి అమెరికా యుద్ధ నౌకలు పనామా కాలువపై నుంచి ప్రయాణిస్తే ఎలాంటి ఫీజును తీసుకోమని చెప్పింది. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్కు మధ్య ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా.. అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు అని పేర్కొంది. దీని వల్ల అమెరికా ప్రభుత్వ నౌకలకు పెద్ద మొత్తంలో డబ్బులు మిగులుతాయని చెప్పుకొచ్చారు. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకొంది. ఈ విషయాన్ని ఆదివారమే విదేశాంగ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు. ఇక, అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి.ఇదిలా ఉండగా.. అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కాల్వను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది. కానీ, పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో.. 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ కాల్వను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకొన్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది. -
కాలువపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించండి
వాషింగ్టన్: పనామా కాలువపై చైనా ఆధిపత్యం, నియంత్రణను తగ్గించడానికి అత్యవసర మార్పులు చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పనామా దేశాన్ని హెచ్చరించారు. ఆదివారం పనామాలో పర్యటించిన రూబియో.. పనామా దేశాధక్షుడు జోస్ రౌల్ ములినోతో భేటీ అయ్యారు. కాలువపై యథాతథ స్థితి ఆమోదయోగ్యం కాదని, తక్షణ మార్పులు లేకపోతే, ఒప్పందం ప్రకారం తన హక్కులను రక్షించడానికి అమెరికా అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని ములినో స్పష్టం చేశారు. చైనా ఆధిపత్యం గురించి అమెరికా ఆందోళనలను పోగొట్టేందుకు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూబియో పర్యటన వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడం వంటి ఉమ్మడి ఆసక్తులపై దృష్టి పెడుతుందని ములినో ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములినో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన తెలిపారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక అక్రమ వలసదారుల ఏరివేతకు సహకారాన్ని పెంచుతామని ములినో హామీ ఇచ్చారు. రూబియో పర్యటనకు ముందు పనామాలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు ట్రంప్, రూబియో దిష్టి»ొమ్మలను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. -
పనామాపై ఈ ప్రకటన మతలబేమిటి?
ట్రంప్ తన అధ్యక్షపదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో... ‘పనామా కాలువ నిర్వహణ చైనా చేస్తోంది. దాన్ని మేం పనామాకు ఇచ్చాము కానీ చైనాకు కాదు గనుక ఆ కాలువ అధికారాన్ని పనామా నుండి వెనుకకు తీసేసుకుంటాము’ అన్నారు. పనామా కాలువ నిర్వహణను పనామా తటస్థ వైఖరితో చేయాలనీ, చైనా లేదా మరెవ్వరి జోక్యం ఉండ కూడదనీ, అమెరికాపై, దాని నావికాదళంపై, వాణిజ్య నౌకల ద్వారా వ్యాపారం చేస్తున్న కార్పోరేషన్లపై అధిక టోల్ ధరలు, ప్రయాణ రేట్లను వసూలు చేసే అధికారం పనామాకు ఇవ్వలేదనీ ట్రంప్ గత డిసెంబరు 22 నాడు అన్నారు. సెంట్రల్ అమెరికా దగ్గర అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను 80 కిలోమీటర్ల కృత్రిమ పనామా కాలువ కలుపుతుంది.అనేక కష్టాలతో 25 వేలమంది శ్రామికుల బలిదానంతో నిర్మించిన ఈ కాలువను ప్రారంభంలో అమెరికా ఉంచుకొని ప్రెసిడెంట్ కార్టర్ కాలం (1978)లో దశలవారీగా పనామాకు ఇవ్వటానికి ఒప్పుకొని, 1999 నాటికి పూర్తిగా ఇచ్చారు. 2021లో ఈ కాలువ అజమా యిషీకి మరొక 25 సంవత్సరాల గడువు పెంచారు. ప్రస్తుతం నాల్గింట మూడువంతుల నౌకా రవాణా అమెరికా చేస్తుండగా చాలా వ్యత్యాసంతో చైనా 2వ స్థానంలో ఉంది. పనామా జీడీపీలో 7.7% వాటా ఈ కాలువ ద్వారానే లభిస్తోంది. ప్రపంచ నౌకా రవాణా మార్గంలో 6 శాతం ఈ కాలువకు వాటా ఉంది. 80 కిలోమీటర్ల పనామా కాలువ దాటడానికి ఒక నౌకకు 8 గంటలు పడుతుంది. అదే నౌక దక్షిణ అమెరికా చివరి భాగమైన కేప్హోర్న్ మీదుగా ప్రయాణం చేయాలంటే వారం రోజులు పడుతుంది. దూరం సుమారు 20 వేల కిలోమీటర్లు ఉంటుంది. లాటిన్ అమెరికా దేశాలలో చైనా ప్రతిష్ఠ పెరుగుతుండగా, గత 10సంవత్సరాల కాలంలో చైనా అనేక వర్తక, వాణిజ్య ఒప్పందాలు చేసుకొంది.ముఖ్యంగా చైనా ‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రాజెక్టులోకి దక్షిణ అమెరికా దేశాలు చేరు తున్నాయి. ప్రప్రథమంగా 2017లో పనామా చేరింది. చైనా పెట్టుబడులకు ప్రతిఫలంగా పనామా తనకు తైవాన్తో గల దౌత్య సంబంధాలను కూడా రద్దు చేసుకొంది. పనామా కాలువను స్వాధీనం చేసుకోవటం ద్వారా చైనా ఆధిప త్యాన్ని తగ్గించే వ్యూహంలో ట్రంప్ ఉన్నారు.కాలువకు రెండు వైపుల హాంకాంగ్కు చెందిన హాచిసన్ వాంపోవా కంపెనీకి అట్లాంటిక్ వైపు క్రిస్టోబాల్, పసిఫిక్ వైపు బాల్హోవాకి నౌకాశ్రయాలు ఉన్నాయి. హాంకాంగ్ లీజు యూకేతో ముగిసి ప్రస్తుతం స్వయం ప్రతిపత్తిగల దేశంగా ఉన్నప్పటికీ, దౌత్యపరంగా చూస్తే ఎప్పటికైనా చైనాలో అంతర్భాగంగా పరిగణించాలి గనుక బహుశా ఈ రెండు నౌకాశ్రయాల్ని ట్రంప్ చైనాకు చెందినవిగా అనుకొంటూ ఉండవచ్చు. కాలువకు ఆనుకుని ఉన్న మొత్తం 5 ఓడరేవుల్లో అమెరికాకు చెందినది ఒకటీ, మిగతావి విదేశాలకు చెందినవీ ఉన్నాయి. కానీ ఈ ఓడరేవులన్నీ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేస్తున్నాయనేది పనామా వాదన.పనామా కాలువ ఆలోచన మొట్టమొదటిసారిగా స్పానిష్ విజేత వాస్కోలార్బోవా మెదడు నుండి ఉద్భవించి పనామా ఇస్తమన్ను భూమార్గం ద్వారా దాటాడు. ఆ తర్వాత నౌకామార్గం కోసం రెండు అమెరికా ఖండాల మధ్య కాలువను తవ్వాలనే కోరిక యూరప్ దేశాల్లో పుట్టింది. అప్పటికి నేటి అమెరికా ఇంకా లేనే లేదు. సూయిజ్ కెనాల్కు ఆద్యుడు ఫ్రెంచ్ ఫెడినాంగ్ లెస్పెప్స్ ఆలోచనతో ఫ్రాన్స్ సామ్రాజ్యం 1881–1899 మధ్య పనామా కాలువ తవ్వక పనులు చేపట్టింది. అయితే ఆర్థిక ఇబ్బందులు, వర్షారణ్య అడవుల్లో వేలాదిమంది కార్మికులు చనిపోవటంతో మధ్యలోనే ప్రాజెక్టును ఆపేసింది.తదనంతరం నూతన సాంకే తిక పరిజ్ఞానంతో 1904 సంవత్సరం నుండి 1914 వరకూ అమెరికా ఈ కాలువ పనులను ముమ్మరం చేసి అప్పట్లో 40 కోట్ల డాలర్ల వ్యయంతో కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసి, 1999 వరకూ షరతులతో తన ఆధీనంలో ఉంచుకొని ప్రతిఫలాలను అను భవించింది. దీనికోసమై పనామా దేశాన్ని కొలంబియా నుంచి విమోచన చేయించి దౌత్య సంబంధాలను ప్రారంభించింది. తనకు అనుకూల ప్రభుత్వం పనామాలో లేదని 1989లో బుష్ ప్రభుత్వం యుద్ధానికి దిగి తన కీలుబొమ్మ ప్రభు త్వాన్ని స్థాపించుకొంది.ప్రపంచ వాణిజ్యానికి జల రవాణా అతి ప్రధానమైన అంశం గనుకనే ఈ జల మార్గాల దగ్గర అగ్రరాజ్యాలు ముఖ్యంగా అమెరికా అనేక ప్రత్యక్ష లేక పరోక్ష యుద్ధాలకు దిగుతూ ఆధిపత్యం చలాయిస్తోంది. ఈజిప్టు అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేయగానే బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ దేశాలు 1956లో యుద్ధానికి దిగిన సంగతీ ఇక్కడ గమనార్హం. పనామా – ఈజిప్టులు కాలువల ద్వారా ఆర్థికాభివృద్ధి ఎంత సాధిస్తున్నాయో అంతకంటే ఎక్కువ రవాణా ఖర్చు లను, రవాణా సమయాన్ని ప్రపంచ దేశాలన్నీ పొదుపు చేస్తూ ప్రపంచ వాణిజ్యంతో లబ్ధి పొందుతున్నాయనటం అతిశయోక్తి కానేకాదు. ట్రంప్ చైనాను దెబ్బ తీయాలనే తలంపుతో దుందుడుకు ప్రకటనలు చేయడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఒడిదుడుకులపాలు చేస్తోందన్నది వాస్తవం!- బుడ్డిగ జమిందార్వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
ట్రంప్ పనామా జపం వెనక..
పనామా కాలువ. వందేళ్ల క్రితం నిర్మించిన ఇంజనీరింగ్ అద్బుతం. చిన్నపాటి భూభాగం కారణంగా కలవకుండా ఉండిపోయిన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను వందల కోట్లు వెచ్చించి అక్కడి వారి కలను సాకారం చేసింది అగ్రరాజ్యం. పాతికేళ్ల తర్వాత దానిపై అజమాయిషీ కోసం పట్టుబడుతుండటం విచిత్రం. ఆ కాల్వపై అజమాయిషిని నాటి అమెరికా అధ్యక్షుడు స్థానిక దేశానికి ధారాదత్తం చేస్తే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అదేమీ చెల్లవంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. ట్రంప్ బెదిరింపులకు బెదిరేదిలేదని పనామా ప్రభుత్వం చెబుతుండటంతో ఏమౌతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అవసరమైతే సైనిక శక్తితో బెదిరించో, బలవంతపు దౌత్యంతోనో మాట నెగ్గించుకోవడం దశాబ్దాలుగా అమెరికాకు అలవాటు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వారమైనా తిరక్కుండానే ఏకంగా వందకు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులిచ్చిన తెంపరి ట్రంప్ పనామాపై ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి... భారీ రాకపోకలు, అనూహ్య రాబడి అమెరికా నౌకలు ఆసియా ఖండానికి వెళ్లాలంటే గతంలో దక్షిణ అమెరికా ఖండం చుట్టూతా వేల మైళ్లు సముద్రయానం చేయాల్సి వచ్చేది. ప్రయాణఖర్చలు విపరీతంగా ఉండేవి. వీటిని చాలా వరకు తగ్గించేందుకు, ప్రత్నామ్నాయ సముద్రమార్గంగా పనామా కాలువను తెరమీదకు తెచ్చారు. అనుకున్నదే తడవుగా వందల కోట్లు ఖర్చుపెట్టి కాలువను తవ్వి 1914 ఆగస్ట్ 15న కాలువను వినియోగంలోకి తెచ్చారు. కొత్తలో ఈ మార్గం గుండా రోజుకు మూడు నాలుగు నౌకలే రాకపోకలు సాగించేవి. అయితే అత్యంత దగ్గరి దారికావడంతో రానురాను దీని గుండా అంతర్జాతీయ సరకు రవాణా నౌకల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఏటా లక్షలాది నౌకలు వెళ్తున్నాయి. దీంతో కాల్వపై యాజమాన్య హక్కులున్న పనామా దేశానికి ఏటా నికర లాభం ఏకంగా రూ.43,000 కోట్లకు పెరిగిందని ఒక అంచనా. ఏటా ఇంతటి లాభాల పంట పండించే బంగారు కోడిని నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అప్పనంగా పనామాకు అప్పజెప్పారని నేటి అధ్యక్షుడు ట్రంప్ తెగ బాధపడిపోతున్నారు. పనామా దేశ వార్షిక ఆదాయంలో 23.6 శాతం ఒక్క ఈ కాలువ నుంచే వస్తుండటం గమనార్హం. పనామా వాదనేంటి? నాటి కాలువకు నేటి కాలువకు ఎంతో తేడా ఉంది. బాధ్యతలు తమ చేతుల్లోకి వచ్చాక పనామా దేశం ఈ కాలువను మరింతగా తవ్వి పెద్దగా విస్తరించింది. ఏకంగా 5 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో 2016 ఏడాది తర్వాత భారీ నౌకలు సైతం సులభంగా వెళ్లడం మొదలవడంతో యాజమాన్యం అధిక లాభాలను కళ్లజూస్తోంది. ‘‘ మేం సొంతంగా ఎంతో ఖర్చుపెట్టాం. గతంలో పోలిస్తే ఆదాయం 55 శాతం పెరగడానికి గతంలో మేం పెట్టిన పెట్టుబడులే కారణం’’ అని కాలువ మాజీ అడ్మిని్రస్టేటర్ జార్జ్ లూయిస్ క్విజానో తేల్చి చెప్పారు. ‘‘ కాలువ మా దేశంలో, దేశభక్తిలో అంతర్భాగం. దీనిపై యాజమాన్య హక్కులు మాకే దక్కుతాయి’’ అని పనామా దేశస్తులు తెగేసి చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన స్థానికులు పనామా సిటీలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పెద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ కాలువను దక్కించుకోవాలంటే పెద్ద ఘర్షణ చెలరేగి అది అంతర్జాతీయ నౌకాయానంపైనా పెను ప్రభావం పడే ప్రమా దముంది. అమెరికా నౌకలపై అధిక చార్జీలు ఈ కాలువను వాణిజ్య అవసరాలకు అత్యధికంగా వాడుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత చైనా, చిలీ, జపాన్, దక్షిణకొరియాలు అతిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సరకు రవాణా నౌకలతోపాటు చాలా ప్రపంచదేశాలపై నిఘా కోసం, తమ మిత్రదేశాల్లో తమ స్థావరాలకు సైన్యాన్ని తరలించేందుకు యుద్ధనౌకలనూ ఇదే మార్గం గుండా పంపుతోంది. వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికాకు రాకపోకలు చార్జీలు ఎక్కువ అవుతున్నాయి. అయితే మాపైనే అధిక చార్జీలు మోపుతున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే తన వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను ఆయన బయటపెట్టలేదు. పైగా చైనా రహస్యంగా ఈ కాలువ నిర్వాహణ యాజమాన్య హక్కులు పొందిందని ట్రంప్ ప్రధాన ఆరోపణ. కాలువను పనామా దేశం శాశ్వతంగా సొంతంగా మాత్రమే నిర్వహించుకోవాలన్న ‘ టోరిజోస్–కార్టర్’ ఒడంబడికను పనామా కాలదన్నిందని, తటస్థ వైఖరికి తిలోదకాలు ఇచ్చిందని అమెరికా ఆరోపిస్తోంది. కష్టపడి తవ్విన తమకే అధిక చార్జీల వాత పెడుతూ, శత్రుదేశం చైనాకు నిర్వహణ హక్కులు కట్టబెట్టారని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఎలాగైనా సరే పనామా కాలువపై యాజమాన్య హక్కులను తిరిగి సంపాదిస్తామని ప్రమాణస్వీకారం రోజే ట్రంప్ ప్రకటించారు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, పనామా పాలకుడు ఒమర్ టోరిజోస్కు పనామాకాలువ బాధ్యతలు అప్పగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా విస్తరణ కాంక్షకు ‘పనామా’తో ట్రంప్ ఆజ్యం పోస్తున్నారా?
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంలో పనామా కాలువ గురించి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనామా కాలువను బల ప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మున్ముందు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ పనామా కాలువ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ఆరోపించారు. అప్పట్లో కాలువను అమెరికా మూర్ఖంగా పనామాకు ఇచ్చివేసిందని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావించినప్పటికీ డ్రాగన్ దేశ విస్తరణ కాంక్షకు బలమిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. తైవాన్ను, ఇతర ప్రాంతాలను కలిపేసుకునేందుకు ఇదో సాకుగా చూపే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తైవాన్ పట్ల చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమన్న దశాబ్దాల అమెరికా విధానానికి వీడ్కోలు పలుకుతూ ట్రంప్ చేసిన అనూహ్య ప్రకటన తన విస్తరణ కాంక్షకు చట్టబద్ధతగా ఆ దేశం భావించే ప్రమాదముందని చెబుతున్నారు. రష్యా, చైనాల సరసన అమెరికా? అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకమునుపే ట్రంప్ పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై నిపుణులు పెదవి విరిచారు. అలాంటప్పుడు, చైనా, రష్యాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వారన్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తైవాన్ను బలప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామని చైనా బెదిరింపులకు దిగుతోంది. ట్రంప్ కూడా పనామా, గ్రీన్ల్యాండ్లను సైనిక చర్యతో అయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు. ఆ రెండు దేశాలకు, అమెరికాకు తేడా ఏముంటుంది?’అని న్యూయార్క్కు చెందిన జర్నలిస్ట్ గెరాల్డో రివెరా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాదీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని వాషింగ్టన్కు చెందిన మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు. చైనాకు ఓ అవకాశం కానుందా? పనామా కాలువతోపాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్ల్యాండ్ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు.. రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్లవుతుందని సీఎన్ఎన్ యాంకర్ జిమ్ సియుట్టో ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, చైనాకు విస్తరణకు గేట్లు తెరిచినట్లవుతుందని ఆ దేశ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ అమెరికా గ్రీన్ల్యాండ్ను ఆక్రమిస్తే చైనా తైవాన్ను తప్పక స్వా«దీనం చేసుకుంటుందని వాంగ్ జియాంగ్యు అనే హాంకాంగ్ ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన తైవాన్ అంశం సహా అన్ని విషయాలపైనా ట్రంప్తో బేరసారాలకు అవకాశముంటుందని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయని షాంఘైలోని ఫుడాన్ వర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఝావో మింగ్హావో అంటున్నారు. కాలువపై చైనా పెత్తనం నిజమేనా? పసిఫిక్–అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం 1904–1914 సంవత్సరాల మధ్య పనామా కాలువను తవ్వించింది. దీనివల్ల ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70 శాతం అమెరికావే కావడం గమనార్హం. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కాలువను చైనా నియంత్రించడం లేదు, నిర్వహించడం లేదు. కానీ, హాంకాంగ్కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇదికాకుండా, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సీవోఎస్సీవోకు చెందిన ఓట మొదటిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. అదే ఏడాది, చైనా కంపెనీ లాండ్బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం అమెరికాకు కంటగింపుగా మారింది. ‘సాంకేతికంగా కాలువపై హక్కులు మావే. మరో దేశం చేతుల్లోకి కాలువ వెళుతోంది. వాస్తవానికి పరాయి దేశం తన కంపెనీల ద్వారా కాలువపై పెత్తనం సాగిస్తోంది’అని విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం పేర్కొన్నారు. కాలువను అమెరికా కొంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాధ్యత లేని బాల్యచాపల్యం
బాల్యావస్థ చిత్రమైనది. ఆ దశలో కంటిముందు కనబడేవన్నీ తన సొంతం అనుకునే మనస్తత్వం ఉంటుంది. మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ మాదిరి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోంది. అధికారంలోకి రాకముందే ఆయన వరసబెట్టి పొరుగు దేశాలకు తాఖీదులు పంపుతున్నారు. ‘మీరంతా నా దారికి రండి’ అన్నదే వాటి సారాంశం. అమెరికాలో 51వ రాష్ట్రంగా స్థిరపడటానికి కెనడా సిద్ధంగా ఉండాలట. డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్ల్యాండ్ ప్రాంతాన్ని ఆ దేశం వదిలేసుకోవాలట. అలాగే పనామా అధీనంలోని పనామా కాల్వపై అమెరికాకు పూర్తి హక్కున్నదట. తన అభీష్టం నెరవేరటానికి ఆ దేశాలపై టారిఫ్ మోత మోగి స్తారట. ఫలితం రాకపోతే దురాక్రమణకు సిద్ధపడతారట. సోవియెట్ యూనియన్ దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉన్నదని బెదరగొట్టి 1949లో నాటో కూటమిని ఏర్పాటుచేసింది అమెరికాయే. దాని స్థానంలో వచ్చిన రష్యావల్ల కూడా ముప్పు ముంచుకురావచ్చని ఒప్పించి నాటోను కొన సాగిస్తున్నదీ అమెరికాయే. తీరా ట్రంప్ ప్రకటనల తీరు చూశాక నిజమైన ముప్పు అమెరికానుంచే ఉండొచ్చన్న భయాందోళనలు యూరప్ దేశాల్లో కలుగుతున్నాయి. ఏడెనిమిదేళ్లుగా అమెరికా ‘నియమాల ఆధారిత’ ప్రపంచం గురించి మాట్లాడుతోంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డగించటమే లక్ష్యంగా అమెరికా వాడుకలోకి తెచ్చిన ఇండో–పసిఫిక్ వ్యూహానికి ప్రాతిపదిక ‘నియమాల ఆధా రిత’ ప్రపంచమే. ట్రంప్ ప్రకటనలకూ, ఈ వ్యూహానికీ పూర్తిగా చుక్కెదురు. అమలులో ఉన్న నియ మాలను ధిక్కరించి, అంతర్జాతీయ న్యాయానికి భిన్నంగా ప్రవర్తించి ఏ దేశాన్నయినా ఆక్రమించు కోవాలనుకునే మనస్తత్వం దేనికి దారితీస్తుంది? అందుకే యూరప్ దేశాలన్నీ ట్రంప్ ప్రకటనపై విరుచుకు పడుతున్నాయి. సభ్యదేశాల్లో ఎవరిపై దాడి జరిగినా మిగిలిన దేశాలన్నీ అండగా నిలవాలన్నది నాటో నియమం. దానికి అనుగుణంగానే జర్మనీ, ఫ్రాన్స్ మొదలు అన్ని దేశాలూ ట్రంప్ తీరును ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాను ఖండిస్తూ, తైవాన్ను సొంతం చేసుకోవాలనుకునే చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తానే దురాక్రమణదారుగా మారుతుందా అన్నది చెప్పలేం. పూర్వాశ్రమంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఇలాంటి బెదిరింపులకే పాల్పడేవారు. తానొక ప్రమాదకారినన్న భావన కలిగిస్తే చాలు... ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందన్న భ్రమ ఆయనకు ఉండేది. దాన్ని ‘మ్యాడ్మ్యాన్ థియరీ’గా పిలిచేవారు. చివరకు ఆయన హయాంలోనే ఎంతో అప్రదిష్టపాలై ఉత్తర వియత్నాం నుంచి అమెరికా సైనికులు వైదొల గాల్సి వచ్చింది. ట్రంప్ మాటలు ‘మ్యాడ్మ్యాన్ థియరీ’వంటివేనా... నిజంగా ప్రమాదకరమైనవా అనే విచికిత్సలో పడ్డాయి యూరప్ దేశాలు. దౌత్యరంగంలో ఎవరైనా సరే... మరో దేశాధినేత వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమకేం చెప్పారన్నది కాక, వారి బహిరంగ ప్రకటనలనూ, వారి ఆచరణనూ పరిగణనలోకి తీసుకుంటారు. తొలి ఏలుబడిలో సైతం ట్రంప్ ఇలాంటి హెచ్చరికలు చాలా చేసేవారు. ఉత్తర కొరియాపై నిప్పుల వాన కురిపించబోతున్నట్టు ప్రకటనలు చేయటం, చివరకు ఆ దేశానికి అతిథిగా వెళ్లి ఒప్పందం కుదుర్చుకురావటం అందరూ చూశారు. చైనా పైనా అదే తరహాలో చిందులు తొక్కేవారు. కానీ ఎప్పుడూ దాని జోలికిపోలేదు. అయితే ఇరాన్ విషయంలో అలా కాదు. ఆ దేశ అగ్రనేతల్లో ఒకరైన కాసిం సొలేమనిని హత్య చేయించారు. వేరే దేశాల నేతలపై దాడులకు పాల్పడటం, దాన్ని అధికారికంగా ప్రకటించటం అసాధారణం. కనుకనే ట్రంప్ రెండో ఏలుబడిపై అందరిలోనూ ఆందోళన నెలకొన్నది. విస్తరణవాద చాపల్యం అమెరికాకు మొదటినుంచీ ఉన్నదే. కానీ అదంతా మృదువైన భాష వెనక నడిచేది. వేరే దేశాల్లో పాలకుల్ని మార్చకుండానే తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకునేది. నేరుగా బెదిరింపులకు దిగటం ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త ధోరణి. ఏటా కెనడా రక్షణకు రెండువేల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నామని, అందువల్ల ఒరిగేదేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. 51వ రాష్ట్రంగా కలుపుకొంటే అదంతా ఆదా అవుతుందని ట్రంప్ అంటున్నారు. కెనడా వాదన భిన్నంగా ఉంది. అమెరికా–కెనడా సంబంధాల వల్ల ఇరు దేశాలూ బాగుపడుతున్నాయని ఆ దేశం చెబుతోంది. తమనుంచి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఇంధనం మార్కెట్ ధరకన్నా తక్కువకు అమెరికాపొందుతున్నదని, వేలకోట్ల డాలర్ల విలువైన అమెరికా సరుకులు కెనడాలో అమ్ముడవుతున్నాయని, అమెరికా చేసే యుద్ధాలకు కోట్ల డాలర్ల ధనం వెచ్చిస్తున్నామని కెనడా విపక్ష నేత పియే పొలియేరా గుర్తుచేశారు. దండిగా ఖనిజ వనరులున్న గ్రీన్ల్యాండ్పై ట్రంప్ కన్నుపడింది. పద్దెనిమిదేళ్ల ట్రంప్ కుమారుడు ఆ ప్రాంతానికెళ్లి అది తమ సొంత జాగీరన్న అర్థం వచ్చేలా ప్రకటించాడు. నిజానికి గ్రీన్ల్యాండ్ డెన్మార్క్ అధీనంలో కూడా లేదు. 57,000 మంది నివసించే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. కేవలం సైనిక, ఆర్థిక వ్యవహారాలు మాత్రమే డెన్మార్క్ చూస్తుంది. పనామా కాల్వపై హక్కు వదులుకోవటానికి పనామా దేశం కూడా సిద్ధంగా లేదు. ట్రంప్ ఒక తేనెతుట్టె కదిల్చి తమాషా చూడదల్చుకున్నారా... నిజంగానే దురాక్రమణకు సిద్ధపడతారా అన్నది మున్ముందు తేలుతుంది. దురాక్రమణకు సిద్ధపడితే ఇప్పుడు పుతిన్కు ఉక్రెయిన్లో ఎదురవుతున్న పరాభవమే అమెరికాకు తప్పకపోవచ్చు. అంతకన్నా కీలకమైనదేమంటే... అమెరికా విశ్వసనీయతతో పాటు మిత్రులనూ కోల్పోతుంది. ఏకాకిగా మారుతుంది. -
ట్రంప్కు పనామా అధ్యక్షుడి కౌంటర్
పనామాసిటీ:త్వరలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పనామా కాలువ(Panama Canal)ను కొనేస్తానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తాజాగా స్పందించారు. అసలు ఈ అంశంపై ట్రంప్తో చర్చించాల్సిన అవసరమే లేదన్నారు.ఈమేరకు ములినో మీడియాతో మాట్లాడారు. కాలువ పనామేనియన్లకు చెందిందన్నారు. కెనాల్పై ఎవరితోనూ ఎలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అమెరికా(America) వాణిజ్య నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలుచేస్తోందనే ట్రంప్ ఆరోపణలను ములినో ఖండించారు.అదేవిధంగా పనామా కెనాల్లో చైనా జోక్యం లేదన్నారు.కెనాల్ రుసుములు పబ్లిక్ అండ్ ఓపెన్ ప్రాసెస్ కింద అధ్యక్షుడు లేదా అడ్మినిస్ట్రేటర్ పాదర్శకంగా నిర్ణయిస్తారన్నారు.కాగా, ట్రంప్ ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడుతూ..అట్లాంటిక్, పసఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.అమెరికాకు చెందిన వాణిజ్య,నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని,వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అప్పగించాలన్నారు. దీంతో పాటు డెన్మార్క్ అధీనంలోని గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని ట్రంప్ అన్నారు. -
పుట్టింది పనామా, పోషకాల చిరునామా
ప్రాచుర్యంలోకి రాని అద్భుతమైన ఉష్ణమండల పండ్ల జాతిలో ‘స్టార్ ఆపిల్’ ఒకటి. సపోటేసియా కుటుంబానికి చెందిన ఈ పండును వండర్ మిల్క్ ఫ్రూట్ అని వ్యవహరిస్తుంటారు. చూపులకు గుండ్రటి నేరేడు పండులాగా ఉంటుంది. మధ్యకు కోసి చూస్తే నక్షత్రపు ఆకారంలో త్లెని గుజ్జు ఉంటుంది. అందుకే దీన్ని ‘స్టార్ ఫ్రూట్’ అంటారు. దీని రంగును బట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. స్టార్ ఆపిల్ శాస్త్రీయ నామం క్రైసోఫైల్లం కైనిటో. కైనిటో, కైమిటో అని అంటుంటారు. ఈ పదాల మూలాలు పురాతన మయన్ భాషలో ఉన్నాయి. తెల్లని, తియ్యని రసం కలిగి ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చిందట.పుట్టిల్లు పనామాస్టార్ ఆపిల్ మన వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో సాగుకు అనువైన సతత హరిత వృక్షం. పనామా దేశంలోని ఇస్థమస్ దీని పురిటి గడ్డ. అక్కడి నుంచి గ్రేటర్ అంటిల్లెస్, వెస్ట్ ఇండీస్కు విస్తరించింది. ఇవ్వాళ స్టార్ ఆపిల్ విస్తరించని ఉష్ణమండల ప్రాంతాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఈశాన్య ఆసియా దేశాల్లో ఈ పండ్ల చెట్టు ఎంచక్కా ఇమిడిపోయి సాగవుతోంది. స్టార్ ఆపిల్ చెట్టు చాలా వేగంగా పెరుగుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ ఊదా రంగు పండ్లలోని తెల్లని గుజ్జు, రసం తియ్యగా ఉంటుంది. పంట పండే స్థానిక ప్రాంతాల్లో తాజా పండ్ల వినియోగంతో పాటు ఇతర దేశాలకు వాణిజ్యపరంగా ఎగుమతి అవుతుంటాయి. కొన్ని ఉష్ణమండల దేశాల్లోని వ్యవసాయంలో స్టార్ ఆపిల్ ప్రధాన భాగంగా మారిపోయింది. మయన్ భాషలోని కైనిటొ, కైమిటో పదాల నుంచి దీని శాస్త్రీయ నామం పుట్టింది. ఈ పండ్ల రసం తల్లి΄ాలు మాదిరిగా అత్యంత పోషకాలతో కూడినదని చెబుతారు. ఈ పండును అడ్డంగా రెండు ముక్కలుగా కోస్తే.. లోపలి తెల్లని గుజ్జు నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అందువల్లే దీనికి స్టార్ ఆపిల్ అనే పేరు వచ్చింది. ఊదా రంగులో ఉంటుంది కాబట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా అంటారు. ఈ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు పండిన తర్వాత కూడా ఆకుపచ్చగానే ఉంటాయి.మెక్సికో నుంచి పెరూ వరకు.. స్టార్ ఆపిల్ సెంట్రల్ అమెరికాలో పుట్టినట్లు చెబుతున్నప్పటికీ దీని మూలాలు వెస్ట్ ఇండీస్లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. దక్షిణ మెక్సికో నుంచి ఉత్తర అర్జెంటీనా, పెరు వంటి లో–మీడియం ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతోంది. గ్వాటెమల పసిఫిక్ తీర ప్రాంతంలో ఇది విస్తారంగా సాగు అవుతోంది. అక్కడితో దీని విస్తృతి ఆగలేదు. వియత్నాం, భారత్, చైనా, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లోనూ సాగవుతోంది. కోస్టారికా, క్యూబా, డొమినిక, హైతి, హాండూరస్, జమైకా, నెదర్లాండ్స్ అంటిల్లెస్, నికరాగువ, పనామా, ఉరుగ్వే, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఈజిప్ట్, సౌత్ఆఫ్రికా, మొంజాబిక్, జింబాబ్వే తదితర దేశాల్లోనూ సాగులో ఉంది.పోషకాలు పుష్కలంస్టార్ ఆపిల్ గుజ్జు, రసం తియ్యగా ఉండటానికి కారణం అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండటమే. ఈ పండులో నీరు 78–86% వరకు ఉంటుంది. వంద గ్రాముల పండ్లలో 0.71–2.33 గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల పిండి పదార్థం, 9–10 గ్రాముల టోటల్ సుగర్స్ ఉన్నాయి. దీని విత్తనాల్లో శ్యానోజెనిక్ గ్లైకోసైడ్ లుకుమిన్, తదితర యాక్టివ్ కాంపౌండ్లు ఉన్నాయి. స్టార్ ఆపిల్లో ఉన్న జీవరసాయనాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఫెనాల్స్, అల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, స్టెరాయిడ్స్, సపోనిన్స్, టాన్నిన్స్, కార్డియాక్ గ్లైకోసైడ్స్ వంటివి వున్నాయి. 2002లో వెలువడిన ఓ అధ్యయన పత్రం ప్రకారం ఈ పండులో 120 రకాల వొలేటైల్ కాన్స్టిట్యుయెంట్స్ ఉన్నాయి. పచ్చి, పండిన పండ్లలోనూ విటమిన్ సి బాగా ఉంది. ఆకుల్లో కూడా గాల్లిక్ యాసిడ్, ట్రైటెర్పినాయిడ్స్ వంటి ఉపయోగకరమైన కాంపౌండ్స్ ఉన్నాయి. అధిక స్థాయిలో ఫెనోలిక్స్, ఫ్లావనాయిడ్స్ కలిగి ఉండటం వల్ల స్టార్ ఆపిల్కు వ్యాధినిరోధకతను పెంచే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యం మెండుగా ఉంది. ఇందులోని క్యుయెర్సెటిన్ కాంపౌండ్కు అత్యధిక యాంటీఆక్సిడెంట్ గుణం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.గోళాకార పండ్లుఈ చెట్టు ఆకులు ఆకర్షణీయమైన ముదురు ఆకుపచ్చగా ఓవెల్ షేప్లో ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి 5–15 సెం.మీ. పొడవు పెరుగుతాయి. ఊదా–తెలుపు రంగుల్లో ఉండే దీని పూలు చక్కని సుగంధాన్ని వెదజల్లుతూ తేనెటీగలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ చెట్టు స్వీయ పరాగ సంపర్క సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని కాయ గోళాకారంలో 2–3 అంగుళాల డయామీటర్లో ఉంటాయి. ఈ పండ్లను తాజాగా తింటారు. ఈ జాతి పండ్లు ముదురు ఊదా రంగులోను, ఆకుపచ్చ–గోధుమ, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి. ఊదా రంగు పండు తొక్క మందంగా, గుజ్జు గట్టిగా ఉంటుంది. రవాణాకు, నిల్వకు అనువైనవి కాబట్టి ఈ రకం స్టార్ ఆపిల్ తోటలే సాగులో ఉన్నాయి. ఆకుపచ్చ–గోధుమ రంగులో ఉండే రకం పండ్ల తొక్క పల్చగా, గుజ్జు పల్చని ద్రవంలా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పండ్లు చాలా అరుదు. ఈ కుటుంబంలోనే క్రైసోఫైల్లం కైనిటో మాదిరిగానే ప్రజాదరణ పొందుతున్న రెండు స్టార్ ఆపిల్ రకాలు ఆఫ్రికాలో సాగులో విస్తారంగా సాగులో ఉన్నాయి. అవి.. గంబేయ అల్బిద, గంబేయ ఆఫ్రికాన. 3–5 ఏళ్లకు కాపు ప్రారంభంక్రైసోఫైల్లం కైనిటో రకం స్టార్ ఆపిల్ మొక్కలు నాటిన తర్వాత 3–5 ఏళ్లలో కాపు వస్తుంది. 6–7 ఏళ్లకు పూర్తిస్థాయి కాపు తీసుకోవచ్చు. ఫ్రూట్ చాలా త్వరగా సెట్ అవుతుంది కాబట్టి తోటల సాగుదారులకు అనుకూలంగా ఉంటుంది. శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చే దశలో పండ్లు పక్వానికి వస్తాయి. వెస్ట్ ఇండీస్లో ఏప్రిల్–మే మధ్యన స్టార్ ఆపిల్స్ పుష్కలంగా మార్కెట్లోకి వస్తాయి. స్టార్ ఆపిల్ విత్తనాల వ్యాప్తికి గబ్బిలాలు బాగా తోడ్పడుతుంటాయి. ఏ సీజన్లోనైనా పచ్చగా ఉండే స్వభావం వల్ల ఈ చెట్లు వ్యాపించిన చోట్ల పచ్చదనం, పర్యావరణం పరిఢవిల్లుతాయి.అన్ని పండ్లూ ఒకేసారి కోతకు రావుస్టార్ ఫ్రూట్ పక్వానికి రాక ముందు బంక సాగుతూ వగరుగా ఉంటుంది. బాగా పండి పోయిన తర్వాత కోస్తే రవాణా చేయటానికి, నిల్వ చేయటానికి ఇబ్బంది అవుతుంది. అందుకని పండు ముచ్చిక దగ్గర కొంచెం ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసెయ్యాలి. తాజా పండ్లు తినొచ్చు లేదా జెల్లీలుగా మార్చి నిల్వ చేసుకోవచ్చు. ఈ పండులోని విత్తనాలు కూడా పనికొస్తాయి. విత్తనం లోపలి పప్పుతో తయారు చేసే డ్రింక్ బాదం పాల మాదిరిగా ఉంటాయి. అనేక తినుబండారాల్లో వాడుతున్నారు. ఫ్రోజెన్ స్టార్ ఫ్రూట్ గుజ్జును ఐస్క్రీమ్లు, షర్బత్లలో వాడుతున్నారు. కాబట్టి, వాణిజ్యపరమైన సాగుకు అనువైన పండ్ల జాతి. అయితే, నేరేడు మాదిరిగానే ఈ పంటకు కూడా కోత కూలి ఎక్కువ అవుతుంది. -
పనామా వెనక్కి తీసుకుంటాం
ఫీనిక్స్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పొరుగుదేశాలపై కవ్వింపు చర్యలు మొదలుపెట్టారు. మిత్రదేశానికి తెలివితక్కువగా అప్పగించిన పనామా కాలువపై నియంత్రణను తిరిగి పొందడానికి తన కొత్త యంత్రాంగం ప్రయత్నిస్తుందని ట్రంప్ ప్రకటించారు. కీలకమైన ఈ రవాణా మార్గం గుండా వెళ్ళడానికి అత్యధిక రుసుము వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ట్రంప్ ప్రకటనను పనామా కన్జర్వేటివ్ అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తోసిపుచ్చారు. ఇది తమ దేశ సార్వభౌమత్వానికి అవమానమని కొట్టిపారేశారు. ఓవైపు ప్రభుత్వ షట్డౌన్ను నివారించడానికి కాంగ్రెస్ కృషి చేస్తుండగా.. ఫ్లోరిడాలోని తన రిసార్ట్ మార్–ఎ–లాగోలో ఉన్న ట్రంప్.. అక్కడినుంచే తేనెతుట్టలను కదుపుతున్నారు. అమెరికా ఫెస్ట్లో మద్దతుదారులను ఉద్దేశించి ఆదివారం ప్రసంగించారు. తాము అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్న ట్రంప్.. విశ్వాసాన్ని కోల్పోయిన డెమొక్రాట్లు తమవైపు వస్తే స్వాగతిస్తామన్నారు. పనామా కాలువను తమ దేశం మూర్ఖంగా ఇచ్చేసిందని విచారం వ్యక్తం చేశారు. కాలువ విషయంలో అమెరికా పట్ల నైతిక, చట్టపరమైన సూత్రాలను పాటించకపోతే, కాలువను అమెరికాకు తిరిగి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తామన్నారు. తదనుగుణంగా అధికారులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అదెలా సాధ్యమనే విషయాన్ని ఆయన వివరించలేదు. అంతేకాదు.. పనామా అధ్యక్షుడు ములినోను కన్జర్వేటివ్ జనాకర్షకుడని, పలు విషయాల్లో తనతో ఏకీభవిస్తారని ట్రంప్ అభివరి్ణంచారు. పనామా అంతా ఏకమవుతుంది: ములినో ట్రంప్ ప్రకటనపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో స్పందించారు. ట్రంప్ ప్రసంగించిన కొద్దిసేపటికే ‘ఆ కాలువలోని ప్రతి చదరపు మీటర్ పనామాకు చెందినదని, అది తమ దేశానికి చెందుతుందని ములినో ఓ వీడియోను విడుదల చేశారు. ట్రంప్ పేరును ప్రస్తావించకుండా, నిర్వహణ ఖర్చులు, సరఫరా, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని నిపుణుల కమిటీ పన్నులను నిర్ణయిస్తుందని ములినో అన్నారు. సుంకాలు ఇష్టానుసారంగా నిర్ణయించలేదని ములినో చెప్పారు. షిప్ ట్రాఫిక్ను పెంచడానికి పనామా కొన్ని సంవత్సరాలపాటు కాలువను విస్తరించిందని, రుసుముల పెరుగుదల కాలువ అభివృద్ధికే ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాదు.. పనామావాసులు ఇతర అంశాలపై భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉండవచ్చని, కానీ కాలువ, సార్వభౌమాధికారం విషయానికి వస్తే... పనామా అంతా ఏకమవుతుందని స్పష్టం చేశారు. పనామా కాలువపై ఎందుకీ వివాదం.. పనామా.. అమెరికాకు మిత్రదేశం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ కాలువ కీలకమైనది. ఆ ప్రభుత్వ వార్షిక ఆదాయంలో ఐదోవంతు దీనినుంచే వస్తుంది. తన తీరాల మధ్య వాణిజ్య, సైనిక నౌకల రవాణాను సులభతరం చేయడంలో భాగంగా అమెరికా 1900ల ప్రారంభంలో ఈ కాలువను నిర్మించింది. 1977లో అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సంతకం చేసిన ఒప్పందం ప్రకారం 1999 డిసెంబర్ 31న పనామా కాలువపై నియంత్రణను అమెరికా కోల్పోయింది. 2023లో మధ్య అమెరికా కరువుల వల్ల కాలువ తీవ్రంగా ప్రభావితమైంది. సరిపడా జలాలు లేక నౌకలు దాటే స్లాట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సి వచి్చంది. దీంతో కాలువ దాటేందుక వసూలు చేసే రుసుమును కూడా పెంచారు. ఈ ఏడాది చివరి నెలల్లో వాతావరణం సాధారణ స్థితికి చేరుకోవడంతో కాలువపై రాకపోకలు యథాస్థితికి చేరుకున్నాయి. రుసుములు యథాస్థితిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ‘నియంత్రణ’వ్యాఖ్యలు చేశారు -
1200 ఏళ్ల నాటి పురాతన సమాధి..అందులో ఏకంగా కోట్లు..!
మరో పురాతన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు దక్షిణ అమెరికా దేశంలోని పనామా సిటిలో బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధి తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడటంతో శాస్త్రవేత్తలు షాక్కి గురయ్యారు. ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలో ఉన్న ఎల్కానో ఆర్కియాలాజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చింది. సమాధిలో పెద్ద ఎత్తున బంగారు నిధి తోపాటు చాలా మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. ఇది అమెరికాలో యూరోపియన్ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తోంది. ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు. ఆ సమాధిలో బంగారు శాలువా, బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో చేసిన చెవిపోగులు, విలువైన వస్తువు ఉన్నాయని పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో వివరించారు. అందులో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అప్పటి ఆచారం ప్రకారం..ఉన్నత వర్గం ప్రభువు మరణిస్తే ఇలా ఈ 32 మందిని బలిచ్చి, విలువైన వస్తువులు, ఆభరణాలు పాతి పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఆ వ్యక్తుల సంఖ్య ఎంత ఉండొచ్చనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పురావస్తు శాఖ డైరెక్ట్ డాక్టర్ జూలియా. కాగా, సమాధిలో బయటపడ్డ నిధి అత్యంత విలువైనదని పనామా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లినెట్ మెంటోనెగ్రో చెబుతున్నారు. View this post on Instagram A post shared by Fundación Ciudad del Saber (@ciudaddelsaber) (చదవండి: ప్రపంచంలోనే తొలి బంగారు నౌక..ప్రయాణించాలంటే కోట్లు వెచ్చించాల్సిందే..!) -
పనామా కాలువను ఓడలు ఎలా దాటుతాయంటే? చూస్తేనే అర్థమవుతుంది
మానవ నిర్మితమైన 'పనామా కాలువ' (Panama Canal) పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది. ఈ కాలువ ఉత్తర, దక్షిణ అమెరికాలు విడదీస్తుంది. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణించే దూరం ఏకంగా 9500 కిమీ తగ్గిపోయింది. సాధారణంగా సముద్రం మీద వెళ్లినట్లు ఈ కాలువలో షిప్పులు ప్రయాణించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ భూభాగం ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ఇది అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని లాకింగ్ సిస్టం అనే పద్దతి ద్వారా షిప్పులను జాగ్రత్తగా ఒకవైపు నుంచి మరో వైపుకు పంపడం చూడవచ్చు. పనామా కాలువలో షిప్పులు ఎలా ముందుకు వెళతాయి అనేదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్టేట్ నుంచి మరో స్టేజికి వెళ్లాలంటే లాకింగ్ పద్దతిని అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నీటిని ఓకే సమతుల్య స్థానానికి తీసుకు వచ్చిన తరువాత ఇవి ముందుకు కదులుతాయి. ఇలా లాకింగ్ పద్దతిని అనుసరించి అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ సముద్రంలోకి షిప్పులు కదులుతాయి. How ships cross the Panama Canal.. ❤️pic.twitter.com/G5GeuBxK92 — #NaMo Again 🚩 (@BhaktSanatani_) February 29, 2024 -
పనామా కెనాల్లో ఎలా ఉంటుందంటే.?
-
పనామా ట్రాఫిక్జామ్!
అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌకలు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కారణమేమిటి? పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం. మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’ పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనేట్ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని ముందుకు వాలింది. ► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు. ► 2013 ఏడాదిలో హెచ్కేఎన్డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది. అంత ఈజీ కాదు... నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే... ► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది. ► అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి. ► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే. ► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఇదీ పనామా కథ ► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. ► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. ► దీని పొడవు 80 కిలోమీటర్లు. ► పనామా కాలువ మధ్యలో గతూన్ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు ఈ కాలువకు రిజర్వాయర్గా ఉంది. ► ఇటు పసిఫిక్ మహా సముద్రం, అటు అట్లాంటిక్ మహా సముద్రం వైపు కరేబియన్ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్ ఆఫ్ పనామను ఆనుకుని పనామా కాలువ ఉంటుంది. ► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది. ► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి. ఏం జరగనుంది? ► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు. ‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’ – మిషెల్ వైస్ బోక్మ్యాన్, లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్లో సీనియర్ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు -
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో కుప్పకూలి చనిపోయిన పైలట్
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందౌర్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే కో పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ల బృందం ఇవాన్ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్లో వసతి కల్పించారు. ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్లైన్స్లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్లో తమ ఎయిర్లైన్స్కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..! -
రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్బాల్ తరంలో లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్ను మెస్సీ తనదైన శైలిలో గోల్గా మలిచాడు. దీంతో తన కెరీర్లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్స్ మార్క్ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్గా 800 గోల్స్తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం. Lionel Messi with an incredible free-kick 🇦🇷 We are witnessing greatness once again 🐐 pic.twitter.com/QBPUO7B9LY — SPORTbible (@sportbible) March 24, 2023 చదవండి: ఫుట్బాల్లో సంచలనం.. చారిత్రాత్మక గోల్ -
ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి
దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పనామాలో అమెరికాకు వలస వెళ్లే వారిని తీసుకెళ్తున్న బస్సు.. మరో మినీ బస్సును ఢీకొట్టింది. చిరికీలోని గ్వాలకాలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృత్యువాతపడినట్లు పనామా జాతీయ వలసదారుల డైరెక్టర్ సమీరా గోజైన్ బుధవారం తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకుడితోసహా మొత్తం 66 మంది ఉన్నారు. రాజధాని పనామా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చిరీకి ప్రావిన్స్ రాజధాని నగరం డేవిడ్లోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. క్షతగాత్రుల సంఖ్యను, మృతుల వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. తొలుత 15 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మృతుల సంఖ్య 39కు పెరిగింది. కొలంబియా సరిహద్దులోని అడవి ప్రాంతం అయిన డేరియన్ నుంచి వలసదారులతో బస్సు బయల్దేరింది. వీరంతా పనామా, కోస్టా రికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో గుండా చివరికి యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణిస్తున్నారు. -
FIFA World Cup: ప్రపంచ కప్ టోర్నీకి అమెరికా అర్హత
FIFA World Cup Qatar 2022- స్యాన్ జోస్: గత ఫుట్బాల్ ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయిన యూఎస్ఏ జట్టు ఈ సారి ఆ అడ్డంకిని అధిగమించింది. ఖతర్లో ఈ ఏడాది జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్కు అమెరికా క్వాలిఫై అయింది. తమ చివరి క్వాలిఫయర్ పోరులో అమెరికా 0–2తో కోస్టారికా చేతిలో ఓడినా ఆ జట్టు ముందంజ వేయడం విశేషం. గత వారం జరిగిన మరో క్వాలిఫయింగ్ మ్యాచ్లో సొంతగడ్డపై 5–1 తేడాతో పనామాపై ఘన విజయం సాధించడం అమెరికాకు కలిసొచ్చింది. కనీసం ఆరు గోల్స్ తేడాతో ఓడితే గానీ ఇబ్బంది లేని స్థితిలో బరిలోకి దిగిన యూఎస్...చివరకు పరాజయంపాలైనా వరల్డ్ కప్ అవకాశం మాత్రం దక్కించుకోగలిగింది. నవంబర్ 21నుంచి డిసెంబర్ 18 వరకు ఖతర్లో 2022 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. చదవండి: సూపర్ టైమింగ్.. ఎవరికి సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు See you in November. 🇺🇸 🗣 @TimHowardGK pic.twitter.com/ZiX4E4JGir — USMNT: Qualified. (@USMNT) March 31, 2022 -
930 భారతీయులు, వాటిల్లో రూ.20వేల కోట్ల అక్రమ నగదు!
న్యూఢిల్లీ: పనామా, ప్యారడైజ్ పేపర్ లీకేజీ ఘటనల్లో దాదాపు 930 భారతీయులకు సంబంధించిన సంస్థల ఖాతాల్లో ఏకంగా రూ.20,353 కోట్లు జమయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభలో ఈ విషయం చెప్పారు. ‘ఈ ఏడాది అక్టోబర్ ఒకటినాటికి ఆయా ఖాతాల్లోని మొత్తాలపై రూ.152.88 కోట్ల పన్నులను వసూలుచేశాం’ అని మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. చట్టాలను అతిక్రమించిన సంబంధిత వ్యక్తులపై ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుందని చెప్పారు. వీటిపై 52 కేసులు నమోదయ్యాయన్నారు. మరో 130 కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయన్నారు. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టిన కొందరు భారతీయుల పేర్లు బహిర్గతమైన విషయం తెల్సిందే. మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎంఏజీ) ఆధ్వర్యంలో కేసుల దర్యాప్తు జరుగుతోందన్నారు. -
కొస్టారికా, పనామా సరిహద్దుల్లో భూకంపం
-
అజేయ బెల్జియం
కలినిన్గ్రాడ్: ప్రపంచకప్ గెలవగల జట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టిన బెల్జియం... అదే స్థాయి ఆటతో లీగ్ దశను అజేయంగా ముగించింది. వరుసగా మూడో మ్యాచ్లోనూ గెలిచి 9 పాయింట్లతో గ్రూప్ ‘జి’లో అగ్రస్థానం సాధించింది. గురువారం అర్ధరాత్రి ఇంగ్లండ్తో ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 1–0తో నెగ్గింది. జానుజాజ్ (54వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. రెండు జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే నాకౌట్ చేరిన నేపథ్యంలో మ్యాచ్ గణాంకాలు గ్రూప్ టాపర్ ఎవరో తేల్చేందుకే ఉపయోగపడ్డాయి. పనామాపై ట్యూనీషియా విజయం గ్రూప్ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్లో పనామాపై ట్యూనీషియా 2–1తో నెగ్గింది. ట్యూనీషియా ఆటగాడు యాసిన్ మెరాయ్ 33వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేయడంతో పనామాకు ఆధిక్యం దక్కింది. అయితే, బెన్ యూసెఫ్ (51వ నిమిషం), ఖజ్రీ (66వ నిమిషం) గోల్స్ చేసి జట్టును గెలిపించారు. -
ఇంగ్లండ్ అదరహో
నిజ్నీ నొవ్గోరడ్: ఇంగ్లండ్ కెప్టెన్, స్ట్రయికర్ హ్యారీ కేన్ ‘హ్యాట్రిక్’ తుఫాన్లో పనామా విలవిల్లాడింది. ఫుట్బాల్ ప్రపంచకప్లో ఇంగ్లండ్ తమ అత్యధిక గోల్స్తో చరిత్రకెక్కే విజయాన్ని నమోదు చేసింది. కేన్ సేన ఉరిమే ఉత్సాహంతో తొలి అర్ధభాగంలోనే పనామా పనైపోయింది. గ్రూప్ ‘జి’లో ఆదివారం జరిగిన ఈ పోరులో ఇంగ్లండ్ 6–1తో పనామాపై జయభేరి మోగించింది. వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్ తరఫున హ్యారీ కేన్ మూడు గోల్స్ (22వ, 45+1వ, 62వ నిమిషాల్లో) చేయగా... జాన్ స్టోన్స్ రెండు (8వ, 40వ నిమిషాల్లో)... లిన్గార్డ్ (36వ నిమిషంలో) ఒక గోల్ సాధించారు. పనామా తరఫున నమోదైన ఏకైక గోల్ను ఫిలిప్ బెలోయ్(78వ ని.) సాధించాడు . ఆరంభం నుంచే ఎదురులేని ఇంగ్లండ్ దాడులకు పనామా చెల్లాచెదురైంది. ఈ మ్యాచ్లో ఎక్కడా తగ్గని ఇంగ్లండ్ 8వ నిమిషంలోనే గోల్స్ బోణీ కొట్టింది. ప్రత్యర్థి గోల్పోస్ట్ కార్నర్ నుంచి ట్రిప్పియెర్ ఇచ్చిన పాస్ను కనిపెట్టుకున్న స్టోన్స్ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా హెడర్తో గోల్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లో స్టోన్స్కిదే తొలి గోల్. అనంతరం ఇంగ్లండ్ తమ జోరు కొనసాగించగా... పనామా డీలా పడిపోయిం ది. గురువారం బెల్జియంతో జరిగే మ్యాచ్ ఫలితంతో గ్రూప్ టాపర్ ఎవరో తేలుతుంది. బెల్జియం కూడా ఇప్పటికే నాకౌట్కు చేరింది. రెండో మ్యాచ్ల్లోనే 5 గోల్స్తో కేన్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ►5 ఇంగ్లండ్ చరిత్రలో తొలి అర్ధభాగంలోనే ఐదు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. ►3 ప్రపంచకప్లో ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ చేసిన మూడో ఆటగాడు కేన్. జెఫ్ హర్ట్స్ (1966), గ్యారీ లినేకర్ (1986) హ్యాట్రిక్ సాధించారు. ►1 ఇంగ్లండ్ వరల్డ్కప్ చరిత్రలో అతిపెద్ద (6–1) విజయమిది. -
భళా... బెల్జియం
సంచలనమేమీ లేదు... అరంగేట్ర జట్టు ప్రత్యర్థిని నిలువరించనూ లేదు... ప్రపంచకప్ తొలి మ్యాచ్ను కొంత ఆసక్తికరంగానే ప్రారంభించినా కొత్త జట్టు పనామా తర్వాత తప్పులతో తడబడింది. దాని పోరాటం నామమాత్రమే అయింది. క్రమంగా పుంజుకున్న బెల్జియం అసలైన ఆటను బయటకు తీసింది. వరుస దాడులతో ఊపిరి సలపకుండా చేసింది. స్ట్రయికర్లు లుకాకు, మెర్టెన్స్ కళ్లు చెదిరే రీతిలో చేసిన గోల్స్తో విజయదుందుభి మోగించింది. సోచి: ప్రారంభ మ్యాచ్ తర్వాత ప్రపంచ కప్లో ఓ ఏకపక్ష మ్యాచ్. అరంగేట్ర పనామాపై బెబ్బులిలా విరుచుకుపడిన బెల్జియం 3–0 తేడాతో సునాయాస విజయం అందుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘జి’ మ్యాచ్లో ప్రత్యర్థి అనుభవ రాహిత్యాన్ని సొమ్ము చేసుకున్న ఆ జట్టు పూర్తి ఆధిపత్యం చాటింది. మెరుపులా మెరిసిన స్ట్రయికర్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రొమేలు లుకాకు రెండు, డ్రియెస్ మెర్టెన్స్ ఒక గోల్ చేశారు. పోటీతోనే ప్రారంభమైనా... వాస్తవానికి బంతిపై నియంత్రణ, పాస్ల చేరవేతతో ప్రారంభంలో పనామా దీటుగా ఆడింది. మంచి డిఫెన్స్తో గోల్కు అవకాశం ఇవ్వలేదు. అటు బెల్జియం కూడా దాడులు చేయడంలో ఇబ్బందిపడింది. ఓ దశలో ఇద్దరు మినహా ఆ జట్టు ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఏరియాలోకి వెళ్లారు. అయినా స్కోరు చేయలేకపోయారు. దీంతో మొదటి భాగం గోల్ లేకుండానే ముగిసింది. అయితే, రెండో భాగం ప్రారంభంలోనే ఈ నిరీక్షణకు తెరపడింది. బెల్జియం ఒక్కసారిగా దూకుడు పెంచగా, పనామా క్రమంగా లయ తప్పింది. 47వ నిమిషంలో స్ట్రయికర్ డ్రీస్ మెర్టెన్స్... గోల్ పోస్ట్కు కొద్ది దూరంలో అందిన బంతిని చూడచక్కని రీతిలో స్కోరు చేసి బెల్జియంకు ఆధిక్యం అందించాడు. ఇక్కడినుంచి గాడి తప్పిన పనామా ఒకటీ, అరా అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు వరుసగా ఎల్లో కార్డ్కు గురయ్యారు. మరోవైపు 69వ నిమిషంలో డిబ్రుయెన్ అందించిన క్రాస్ను స్ట్రయికర్ లుకాకు... డైవ్ చేస్తూ అద్భుతం అనేలా తలతో గోల్గా మలిచాడు. దీన్నుంచి తేరుకునేలోపే 75వ నిమిషంలో మరో దెబ్బకొట్టాడు. డిబ్రుయెన్, విట్సెల్ నుంచి అందిన పాస్లను ఈడెన్ హజార్డ్... లుకాకుకు చేరవేయగా అతడు వేగంగా పరుగెడుతూ కీపర్ పెనెడోను తప్పిస్తూ గోల్గా మార్చాడు. ఆరు నిమిషాల్లో రెండు గోల్స్ ఇచ్చుకున్న పనామా తర్వాత చేసేదేమీ లేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు ఐదుగురు ఎల్లోకార్డ్ను ఎదుర్కోవడం గమనార్హం. -
వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పనామా వద్ద ఉన్న రైతు చికెన్ బజార్లో పనిచేస్తోన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గిరి అనే వ్యక్తి, చికెన్ షాపులో పనిచేస్తోన్న కృష్ణ చైతన్య(30) అనే వ్యక్తిని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్లో వేసి పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర బస్సు ప్రమాదం, 18 మంది మృతి
పనామా సిటీ: ఉత్తర అమెరికా దేశం పనామాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని పనామా సిటీకి నైరుతి దిశగా 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంటన్లో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో 50 మందికి పైగా కూలీలను తీసుకెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలోనే 16 మంది మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారని సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జోస్ డొండెరిస్ తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్ల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతుఉన్నామని ఆయన వెల్లడించారు. -
పన్ను పారదర్శక కూటమిలోకి పనామా
పారిస్: సీమాంతర పన్ను ఎగవేతదారులపై పోరాటానికి ఏర్పడ్డ ప్రపంచ కూటమిలో పనామా దేశం కూడా చేరింది. దీంతో ఈ కూటమిలో దేశాల సంఖ్య 105కు పెరిగింది. ‘పన్ను విషయాల్లో పరిపాలనా పరమైన సహాయంపై బహుపాక్షిక కూటమి’లో సభ్య దేశంగా గురువారం పనామా చేరింది. కూటమిలో సభ్యదేశాలు పన్నులు చెల్లించేవారి సమాచారాన్ని పంచుకుంటాయి. ఈ ఏడాది ప్రారంభంలో పనామా పేపర్స్ లీక్స్ పేరుతో అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం పలు కంపెనీల బండారం బయట పెట్టడంతో ఒక్కసారిగా పనామా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో భారత్ 2012లో చేరింది. -
అది బినామీ కంపెనీయే: పనామా పత్రాలు
పనామా పత్రాలు బయటకొచ్చినప్పడే.. ఈ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్ అయిన మోటపర్తి శివరామ వరప్రసాద్(67)కు సంబంధించిన టోగోలోని వాసెం కంపెనీ గురించిన విస్తృత కథనాలు బయటకొచ్చాయి. వాసెమ్ కంపెనీలో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న కెన్లెమ్ లిమిటెడ్కు 40 శాతం వాటా ఉన్నట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. అయితే కెన్లెమ్ లిమిటెడ్ కంపెనీలో 24 శాతం షేర్లు మోటపర్తి శివరామ ప్రసాద్వే ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఈ కెన్లెమ్ కంపెనీ యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు అనుమానం వ్యక్తం చేశాయి. దాంతో ఇది బినామీ పేర్ల మీద నడుస్తున్న కంపెనీ అని, దీని అసలు యజమానులు వేరే ఉన్నారని పనామా పత్రాలు వెల్లడించాయి. టోగోలో ఉన్న వాసెం సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు విదేశీయులవే అని, ఈ షేర్ హోల్డర్లలో ఒకరు మోటపర్తి శివరామ ప్రసాద్ అని పనామా పత్రాలు వెల్లడించాయి. నామమాత్రపు కంపెనీ పేరు మీద పన్నులు ఎగ్గొట్టారన్న ఆరోపణలు దీనిపై ఉన్నాయి. ప్రస్తుతం మోటపర్తి ఘనాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్థిక వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించి పన్ను ఎగ్గొట్టే లక్ష్యంతోనే బినామీల పేర్లమీద ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్లు పనామా పత్రాలు పేర్కొన్నాయి. అయితే అక్కడ ఉన్న కంపెనీలలో 61 శాతం షేర్ హోల్డర్లు ఎవరనే విషయం టోగో వారికి తెలియదని పనామా పత్రాలు తెలిపాయి. -
'సంబరాలకు వారికి అవకాశం ఉండదు'
కోల్కతా: ఇటీవల 'పనామా' వివాదంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తన్న ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. వివరాలు బయటికి వచ్చిన తర్వాత కాంగ్రేస్ పార్టీకి సంబరాలు చేసుకోవడానికి ఏమీ ఉండదని ఎద్దేవాచేశారు. ఈ కేసును నిష్పాక్షికంగా విచారణ జరుపుతామని అన్నారు. కోల్కతాలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్టాడుతూ... కేసు విచారణలో ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారనే కాంగ్రెస్ వాదనను ఖండించారు. ఇది అర్థంలేని ఆరోపణ అని కొట్టి పారేశారు. పనామా వివాదంపై బహుముఖ విచారణ జరుగుతోందని, దోషులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఆదాయపన్ను ఎగ్గొడుతున్న వారి సంఖ్య దేశంలో ఎక్కువగానే ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
‘పనామా’పై మౌనమేల?
కమల్పూర్(అస్సాం): నల్లధనాన్ని వెనక్కి తెస్తానని పెద్దపెద్ద హామీలిచ్చిన ప్రధానమంత్రి మోదీ అందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. పనామా పేపర్లలో ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చినా..ఎందుకు దర్యాప్తు ప్రారంభించలేదని ప్రశ్నించారు. అస్సాంలో ఈ నెల 11న రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ శుక్రవారంలో పాల్గొన్నారు. పనామాలో నల్లధనం దాచిన అనేక మంది పేర్లు వెలుగు చూశాయని, ఇందులో అభిషేక్కు పనామాలో అకౌంట్ ఉందని వెల్లడైందని చెప్పారు. దేశం వదిలి పారిపోయిన మాజీ ఐపీఎల్ చీఫ్ లలిత్మోదీని తిరిగి స్వదేశానికి ఎందుకు రప్పించలేదని మోదీని పార్లమెంట్లో ప్రశ్నించానని, అయితే ఆయన నోరు విప్పలేదని అన్నారు. వేల కోట్లు కొల్లగ్గొట్టిన విజయ్మాల్యా దేశాన్ని వదిలి పారిపోయే ముందు పార్లమెంట్ హౌస్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారని ఆరోపించారు. -
పనామా లిస్టులోనూ మాల్యా
♦ తాజా లీక్స్లో వెల్లడి ♦ రుచి గ్రూపు ప్రమోటర్, ఒబెరాయ్ హోటల్స్ పేర్లూ తెరపైకి ♦ బహమాస్, యూఎఈ, సీషెల్స్లోనూ కంపెనీలు ♦ వీటితోనే విదేశాల్లో ఆస్తుల కొనుగోలు న్యూఢిల్లీ: భారతదేశ బ్యాంకులు ఉద్దేశపూర్వక బకాయిదారుగా గుర్తించిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా రెండు నెలలక్రితమే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో కొత్త కంపెనీని కొన్నట్లు పనామా పేపర్స్ తాజా లీక్లో వెల్లడైంది. దీంతో పాటు ప్రముఖ హోటల్స్ కంపెనీ ఒబెరాయ్, 6 బిలియన్ డాలర్ల రుచి గ్రూపు ప్రమోటర్తోపాటు ఢిల్లీకి చెందిన దంపతులు, ప్రముఖ తేయాకు వ్యాపారి కోడలితో పాటు పలువురు ప్రముఖుల పేర్లు శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. భారతదేశ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల అప్పు ఉన్న కింగ్ఫిషర్ కంపెనీ యజమాని మాల్యాకు బ్రిటిష్ వ ర్జిన్ ఐలాండ్స్లో పెద్ద కంపెనీ ఉన్నట్లు వెల్లడైంది. ‘వెంచర్ న్యూ హోల్డింగ్స్ లిమిటెడ్’ అనే కంపెనీ నేరుగా మాల్యా పేరుతోనే ఉందని తేలింది. ఈ కంపెనీని 2016 ఫిబ్రవరి 15నుంచి మాల్యా నిర్వహిస్తున్నట్లు పనామా పేపర్లలో వెల్లడైంది. బెంగళూరులోని విఠల్మాల్యా రోడ్డులోని మాల్యా నివాసం నుంచే ‘వెంచర్ న్యూ హోల్డింగ్స్ లిమిటెడ్’ కంపెనీ వ్యవహారాలన్నీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పీఆర్ఎస్ ఒబెరాయ్, దీపక్ మధోక్ 2010లో ఒబెరాయ్ గ్రూపు, హాంకాంగ్లోని అమెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ కంపెనీలో 45.8 శాతం (45 మిలియన్ డాలర్ల ఒప్పందం) వాటాలున్నట్లు ప్రకటించింది. అమెక్స్ ద్వారా విదేశా హోటళ్లను నిర్వహిస్తామంది. అయితే పనామా లీకేజీలో మాత్రం అమెక్స్తోపాటు జే అండ్ డబ్ల్యూ ఐఎన్సీ (బహమాస్), ఇతర విదేశీ కంపెనీల్లో ఒబెరాయ్ గ్రూపు డెరైక్టర్లుగా ఉన్న పీఆర్ఎస్ ఒబెరాయ్, దీపక్ మధోక్కు వాటాలున్నట్లు తెలిసింది. ఉమేశ్ శాహ్రా, ప్రమోటర్ ‘రుచి’ గ్రూపు 6 బిలియన్ డాలర్ల విలువైన రుచి గ్రూపు ప్రమోటర్ ఉమేశ్ శాహ్రాకు పనామాలో రెండు ప్రైవేటు ఫౌండేషన్లతోపాటు మొత్తం 8 విదేశీ కంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. వన్ వరల్డ్ ట్రస్ట్, ద త్రీవెల్స్ ఫౌండేషన్లు ఈ గ్రూపులోనివేనంది. 2014లో వెలుగుచూసిన బొగ్గు కుంభకోణంలోనూ ఉమేశ్ శాహ్రా పేరుంది. చేతన్ కపూర్, కబీర్ కపూర్.. పనామా లీక్లో చేతన్, కబీర్లకు సంబంధించి 499 పత్రాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొసాక్ ఫొన్సెకా సాయంతో పనామాలో 2010లో ‘ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చారిటబుల్ ఫౌండేషన్’ను కొనుగోలు చేశారు. అంతకుముందు 2007లో ఓప్లర్ అనే కంపెనీని 6,750 డాలర్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2013 జనవరిలో చేతన్ కపూర్ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డుకు 4.9 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించారని పత్రాల్లో వెల్లడైంది. ఐదోరోజు వెల్లడైన మరికొన్ని పేర్లు అమయా కలెక్షన్స్ యజమాని అమృతా ఝవేరీకి సీషెల్స్లో కంపెనీలున్నట్లు తెలిసింది. ఢిల్లీ వ్యాపారి సత్యప్రకాశ్ గుప్త మొసాక్ ఫొన్సెకా సాయంతో రస్ అల్ఖైమాలో స్టెర్లింగ్ గ్లోబల్పార్ట్నర్స్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటుచేసినట్లు వెల్లడైంది. అస్సాం తేయాకు పరిశ్రమ రారాజుగా వెలుగొందిన హేమేంద్ర ప్రసాద్ బరూవా కోడలు గార్గికీ పనామాలోని వాకర్స్ ఫౌండేషన్ను 2010లో కొన్నారు. ఢిల్లీలోని దామోదర్ సునిధి వెంచర్స్ డెరైక్టర్లు నిమిత్త్ రాయ్ తివారీ, అంకితా సెహగల్(దంపతులు)లకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో సన్సెల్ హోల్డింగ్స్ ఎస్ఏ అనే కంపెనీ ఉంది. కాగా, పనామాతోపాటు టాక్స్ హెవెన్స్గా మారిన పలు దేశాలు.. మనీలాండరింగ్ విషయంలో కఠినమైన చట్టాలను అయలు చేయకపోతే ఆంక్షలు తప్పవని యురోపియన్ యూనియన్ హెచ్చరించింది. కాగా, విదేశాల్లో ఏర్పాటుచేసిన కంపెనీల నుంచి తను లాభపడినమాట వాస్తవమేనని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అంగీకరించారు. -
పనామాలో కేసముద్రం వాసి..?
కేసముద్రం :ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పత్రాల’ వ్యవహారంలో కేసముద్రం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి పేరు వినబడడం చర్చనీయూంశమైంది. సదరు వ్యాపారి పేరు బుధవారం వివిధ చానళ్లలో వచ్చింది. ఆ వ్యాపారి కొంతకాలం క్రితం హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఓ కంపెనీని నడుపుతూ స్థిరపడ్డాడు. గత రెండు రోజులుగా పనామాలో డబ్బులు దాచుకున్న పలువురు ప్రముఖుల పేర్లు ఐసీఐజే బయటపెట్టడం సంచలనం రేకిత్తించింది. ఇదే క్రమంలో కొందరి తెలుగువారి పేర్లు పనామా వ్యవహారంలో ఉన్నట్లు బుధవారం పలు టీవీ చానళ్లలో రావడం, అందులో కేసముద్రం వాసి పేరు వినిపించడం కలకలం రేపింది. -
‘పనామా’లో విశాఖ నల్లకూబేరుడు!
ఇక్కడా మోటూరు శ్రీనివాస ప్రసాద్ అవినీతి మూలాలు గతంలో బయోడీజిల్ కేసులో అరెస్టు ఆ తర్వాత లభించని ఆచూకీ విశాఖపట్నం: పనామా ప్రకంపనలు జిల్లాలోనూ ప్రతిధ్వనించాయి. పన్నులు ఎగ్గొడుతూ పనామా రాజధాని హవాయిలో నల్లధనాన్ని దాచుకున్న నల్లకుబేరుల జాబితాలో ఉన్న మోటూరు శ్రీనివాస్ ప్రసాద్ అవినీతి మూలాలు విశాఖలోనూ ఉన్నాయి. ఆయన గతంలో జిల్లాలో పలు అక్రమ వ్యాపారాలు నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. ఓ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. తరువాత శ్రీనివాస్ ప్రసాద్ ఏమయ్యారో తెలీదు. తాజాగా పనామా నల్ల కుబేరుల జాబితాలో ఆయన పేరు ఉండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మోటూరు శ్రీనివాస్ ప్రసాద్ 2006లో దువ్వాడ వీఎస్ఈజెడ్(విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్)లో ఓ బయోడీజిల్ సంస్థను నెలకొల్పారు. యూరోపియన్ దేశాలకు బయోడీజిల్ ఎగుమతి చేసేవారు. అయితే ఈ ముసుగులో ఆయన నిబంధనలకు విరుద్ధంగా అమెరికా నుంచి బయోడీజిల్ను దిగుమతి చేసుకుని.. తిరిగి యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని 2011 డిసెంబర్లో ఆరోపణలు వచ్చాయి. దీనికోసం నిబంధనలకు విరుద్ధంగా వీఎస్ఈజెడ్ అధికారుల నుంచి ఎగుమతులకు అనుమతి పత్రాన్ని పొందారని కూడా వెల్లడైంది. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయన నిబంధనలకు విరుద్ధంగా బయోడీజిల్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారని నిగ్గుతేల్చారు. అప్పట్లోనే 19,300 టన్నుల బయోడీజిల్ను అక్రమంగా ఎగుమతి చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై మరింత లోతుగా విచారిస్తే గానీ ఈ అక్రమ వ్యాపారం గుట్టు బయటపడదని కూడా భావించారు. ఈ మేరకు వీఎస్ఈజెడ్ అధికారుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు శ్రీనివాస్ ప్రసాద్పై కేసు నమోదు చేశారు. 2012 ఏప్రిల్ 2న అతన్ని అరెస్టు చేసి కేసు విచారణ కొనసాగించారు. కానీ అప్పటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ ఏమయ్యారో ఎవరికీ పెద్దగా తెలియదు. తాజాగా పనామా నల్ల కుబేరుల జాబితాలో ఆయన పేరు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యాపార వ్యవహారాలు మొదటి నుంచి కూడా సందేహాస్పదమేనని పోలీసులు చెబుతున్నారు. -
పనామా దోషులకు శిక్ష పడుతుందా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లీకైన పనామా పత్రాల ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, దిగ్గజాల పేర్లు వరుసగా బయటకు వస్తున్నాయి. ఆ పేర్లను చూసి అరే! వీళ్లున్నారే అంటూ మనం ఆశ్చర్యపడుతున్నాం. చట్టం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పేర్లు వెలుగులోకి వచ్చిన వారు సమర్థించుకుంటున్నారు. ఇంతవరకు సరే! భారత్లో పన్నులు ఎగవేస్తూ పనామాలో నకిలీ కంపెనీల పేరిట కోట్లాది రూపాయలు దాచుకున్న బిగ్ షాట్స్పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఆ అక్రమ డబ్బును వెనక్కి తీసుకొస్తుందా? అన్నది ప్రస్తుతం కోటానుకోట్ల రూపాయల ప్రశ్న. పనామా అంత పెద్ద సంఖ్యలో కాకపోయినప్పటికీ ఇంతకుముందు స్విస్, హెచ్ఎస్బీసీ బ్యాంకుల జాబితాలు వెలువడ్డాయి. వాటి విషయంలో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? కనీసం విచారణ ఏ దశలో ఉందన్న వార్తలు కూడా రావడం లేదే! అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల 70 వేలకోట్ల రూపాయలను భారత్కు రప్పిస్తామని బీరాలు పలికిన బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ దిశగా ఇసుమంతా విజయం సాధించలేదే! అలాంటి బీజేపీ ప్రభుత్వం పనామా విషయంలో ముందుకు కదులుతుందా? అంబానీ, అదానీ లాంటి పెద్దల జోలికి వెళ్లే సాహసం చేస్తుందా ? కార్పొరేట్ దిగ్గజాలకు, ప్రభుత్వ పెద్దలకు మధ్యన సాన్నిహిత్యం సాగినంతకాలం, నీరా రాడియాలాంటి లాబీయిస్టుల కారణంగా కార్పొరేట్ సానుకూల చట్టాలు రూపొందినంతకాలం ఎన్ని అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చినా వ్యవస్థలో ఎలాంటి మార్పు కనిపించదు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే పెద్ద చేపలను వదిలేసి చిన్న చేపలను పట్టుకుని అవినీతిపై చర్యలు తీసుకున్నామంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. పనామా లీక్స్ విషయంలో కూడా సరిగ్గా స్పందిస్తామని, ఇంటర్నేషనల్ ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ట్రీటి అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగస్వామి అవడం మాట అటుంచి, కనీసం ఈ ఒప్పందం పట్ల సానుకూలంగా కూడా స్పందించని పనామా ప్రభుత్వం పట్ల ఈ ట్రీటీ కింద ఎలా చర్యలు తీసుకుంటారో అరుణ్ జైట్లీకే తెలియాలి. పైగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ రూపొందించిన ఈ ఒప్పందంలోనే ఎన్నో లొసుగులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చర్యలు ఉంటాయో ఊహించవచ్చు. పనామాలాంటి అవినీతి కేసుల్లో దర్యాప్తు చాలావరకు అంతర్జాతీయ లేఖలు, ప్రత్యుత్తరాల వరకే పరిమితం అవుతుంది. తాము ఎంత చిత్తశుద్ధితో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా పని జరగడం లేదని, అందుకు అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డు వస్తున్నాయని భారత్ లాంటి దేశాలు సాకులు చెప్పి తప్పించుకోవడమూ సహజమే. అడ్డం పడుతున్న ఒప్పందాలు సవరించుకోవచ్చుగదా, వాటి కోసం చిత్తశుద్ధితో కృషి చేయవచ్చుగదా! పనామా చిట్టాల్లో బయటపడ్డ వారిలో ఎక్కువ మంది చట్ట నిబంధనల ప్రకారమే విదేశాల్లో వ్యాపార లావాదేవీలు నెరుపుతుండవచ్చు. చట్టప్రకారమే అయినప్పటికీ వాటిల్లో నైతికతపాలు ఎంతన్నది మనకు ముఖ్యం. నైతికత ఆధారంగా చట్టాలు రూపొందించినప్పుడు, దాని ఆధారంగానే న్యాయవ్యవస్థ తీర్పులు వెలువరించినప్పుడు మాత్రమే ఇలాంటి అంశాల్లో న్యాయం జరుగుతుంది. నైతికత మూలసూత్రంగానే చట్టాలు, శాసనాలతోపాటు ఆర్బీఐ నియంత్రణా వ్యవస్థలో మార్పులు వస్తేగానీ పనామా దోషులకు శిక్ష పడదు. చెట్టాపట్టాలేసుకొని నడుస్తున్న రాజకీయ, కార్పొరేట్ వ్యవస్థలను విడదీసి సరైన చట్టాల రూపకల్పనకు మార్గం పడాలంటే, ప్రభుత్వ తీరులో పారదర్శకత కనిపించాలంటే ప్రజల్లో చైతన్యం రావడమే తక్షణ అవసరం. పనామా స్కామ్లోనే ఐస్లాండ్ ప్రధాన మంత్రిని గద్దె దించిన అక్కడి ప్రజల చైతన్యమే ప్రస్తుతం మనకు స్ఫూర్తికావాలి. -
మన సొమ్ము బయటకు పోకుండా చూడాలి: జేపీ
సాక్షి, హైదరాబాద్ : పనామాలోని మొస్సాక్ ఫోన్సెకా నుంచి బయటపడ్డ నల్లధన ఖాతాలు మచ్చుకు కొన్ని మాత్రమేనని లోక్సత్తానేత జయప్రకాష్నారాయణ అన్నారు. విదేశాల్లో మూలుగుతున్న భారతీయులకు చెందిన 700 మిలియన్ డాలర్లతో పాటు, మనదేశంలో 20 వేల టన్నుల బంగారం రూపంలో వృథాగా పడి ఉన్న సంపదను సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఆయన సూచించారు. తద్వారా మనకు భారీ మౌలిక సదుపాయాలు, లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. బయటపడ్డ కేసులపై చర్యలు తీసుకుంటూ నల్లధనాన్ని తిరిగి రప్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఇక మీదట దేశం నుంచి చట్టవిరుద్ధంగా డబ్బు బయటకుపోకుండా వ్యవస్థీకృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. -
పనామా పత్రాల సునామీ
చీకటి ఖజానాల్లో నల్లడబ్బు గుట్టలు గుట్టలుగా పోగవుతున్న వైనం మరోసారి బద్దలైంది. మాటలే తప్ప చేతలకు సిద్ధపడని ప్రభుత్వాల నిర్వాకం చివరికెలా పరిణమిస్తున్నదో నిరూపిస్తూ కన్షార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజీ) సంస్థ జగదేక శ్రీమంతుల రహస్యాలను బయటపెట్టింది. వృత్తులు వేరైనా... పౌరసత్వం ఏ దేశానిదైనా...సంపాదనా మార్గం ఎలాంటిదైనా...చెప్పే సిద్ధాంతం ఏమైనా వీరందరి ప్రవృత్తీ ఒక్కటే- లెక్కలకెక్కని నిధుల్ని మూడో కంటికి తెలియ కుండా దాచుకోవడం! ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలను అనుసంధా నిస్తూ... కుడి ఎడమల అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలుండే ఓ చిన్న దేశం పనా మాలో కొలువుదీరిన మొస్సాక్ ఫోన్సెకా అనే సంస్థ ఇలాంటి శ్రీమంతుల దొంగ డబ్బుకు తోవలు పరుస్తోంది! ఏ దేశంలో, ఏ బ్యాంకులో దాచుకోవాలో... ఏ పేరు పెట్టుకుని ఖాతా తెరవాలో, ఏ పేరుతో బినామీ సంస్థ నెలకొల్పాలో ఇది సలహాలి స్తోంది. డబ్బు దాచినచోట ప్రభుత్వాల విధానాలు మారబోతున్నాయని తెలిసిన మరుక్షణమే నల్ల కుబేరులను అప్రమత్తం చేసి వారి కనుసైగతో డబ్బును వేరే దేశాలకు బదలాయిస్తోంది. మందీ మార్బలం, అనేక నిఘా సంస్థల దన్ను ఉన్న ప్రభుత్వాలను అపహాస్యం చేస్తూ దశాబ్దాలుగా ఈ దొంగపనులన్నిటినీ సమర్ధవం తంగా నిర్వహిస్తున్న ఫోన్సెకాలో నిండా 500మంది సిబ్బంది కూడా లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నో దేశాల్లో ఈ సంస్థకు శాఖలున్నా, దీని కార్యకలా పాలపై కన్నేసి ఉంచుతున్నామని ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చెబుతున్నా పాత్రికేయుల పరిశోధనా బృందం దృష్టి పెట్టి వెలికి తీసేవరకూ ఈ చాటుమాటు వ్యవహారాలన్నీ గప్చుప్గా సాగిపోయాయి. దేశాధినేతలుగా ప్రభుత్వాల విధానా లను నిర్దేశిస్తూనే...కఠినమైన నిబంధనలు పెట్టినట్టు కనిపిస్తూనే ఆ నేతలే చాటు మాటుగా ఇలాంటి అక్రమార్కులతో కుమ్మక్కవుతున్నారు. ఇప్పటికి వెల్లడైన పేర్లు చూస్తే ఎవరైనా గుండెలు బాదుకోవాల్సిందే. ప్రపం చాన్ని హడలెత్తిస్తున్న మాఫియా డాన్లు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు సరసనే దేశదేశాల అధినేతలు, రాజకీయ నాయకులు, బ్రాండ్ అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తల పేర్లుండటం అందరినీ విస్మయపరుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, బ్రిటన్ ప్రధాని కామెరాన్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఐస్లాండ్ ప్రధాని డేవిడ్ గన్లాగ్సన్, సౌదీ అరేబియా రాజు, ఉక్రెయిన్, అర్జెంటీనా దేశాల అధ్యక్షులు ఈ ‘నల్ల’ మరకలంటినవారిలో ఉన్నారు. ఈ ఘరానా పెద్దల జాబితాలో మన దేశానికి చెందినవారూ చోటుదక్కించుకున్నారు! బాలీవుడ్ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్, డీఎల్ఎఫ్ ప్రమోటర్ కేపీ సింగ్, ఇండియా బుల్స్ ప్రమోటర్ సమీర్ గెహ్లాట్, ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ తనయుడు తదితరులున్నారు. ఇప్పుడు వెల్లడైన పేర్లు చాలా తక్కువే. రాగలరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది గుట్టు రట్టవుతుందంటున్నారు. వివిధ రూపాల్లో ఉన్న మొస్సాక్ ఫోన్సెకాకు చెందిన కోటీ 15 లక్షల పత్రాలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. ఇదంతా 2.6 టెరాబైట్ల సమాచారం. ఇందులో ఛేదించాల్సిన అంశాలింకా చాలానే ఉన్నాయని చెబుతున్నారు. మిగిలిన దేశాల మాటెలా ఉన్నా మన దేశానికి సంబంధించినంతవరకూ నల్ల కుబేరుల పేర్లు బయటపడటం ఇది మొదటిసారి కాదు. లీచెన్స్టీన్ బ్యాంకులో నల్లడబ్బు దాచుకున్న 26మంది భారతీయుల జాబితాను జర్మనీ ప్రభుత్వం 2008లో మన ప్రభుత్వానికి అందించింది. 2011లో ఫ్రాన్స్ 700మంది పేర్లున్న జాబితాను ఇచ్చింది. రెండేళ్లక్రితం మన ప్రభుత్వమే ఇద్దరు ముగ్గురు పేర్లను బయటపెట్టింది. వికీలీక్స్ సంస్థ సైతం కొందరి పేర్లు వెల్లడించింది. నిరుడు ఫిబ్రవరిలో జెనీవాలోని హెచ్ ఎస్బీసీ శాఖలో డబ్బులు దాచిన వేయిమందికిపైగా భారతీయుల జాబితా బయటికొచ్చింది. ఇలా అడపా దడపా అనేకమంది పేర్లు వెల్లడవుతున్నా ప్రభుత్వపరంగా తీసుకొంటున్న చర్యలేమిటో తెలియడం లేదు. 2009 ఎన్నికల సమయంలో బీజేపీ నల్లడబ్బు అంశాన్ని ప్రధానాస్త్రం చేసుకుంది. తాము అధికారంలోకొస్తే అలాంటివారి భరతం పడతామని, ఆ డబ్బంతటినీ వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చింది. అప్పట్లో దాన్ని జనం పెద్దగా పట్టించుకో లేదు. కానీ అన్నా హజారే నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం పర్య వసానంగా అదే అంశం 2014లో ప్రజల్ని ఆకర్షించింది. నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ విజయపతాక ఎగరేయడానికి అది తోడ్పడింది. కానీ ఈ రెండేళ్లలోనూ ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా ఏమీ లేవు. మన ప్రభుత్వం సంగతలా ఉంచి అంతర్జాతీయంగా కూడా అవసరమైన పురోగతి లేదు. బ్యాంకుల గోప్యతకు కాలం చెల్లిందని, తమ వద్ద డబ్బులు దాచుకున్నవారి వివరాలను వెల్లడించాల్సిందేనని 2009లో లండన్లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు తీర్మానించింది. అనంతరకాలంలో అనేక దేశాలు తమ తమ చట్టాలను కఠినం చేశాయి. దానికి సమాంతరంగా పన్ను ఎగవేతదారులకూ, నల్లడబ్బు కూడబెట్టేవారికీ ప్రభుత్వాలు తరచు క్షమాభిక్ష పథకాలనూ, ఇతర వెసులుబాట్లనూ కల్పిస్తుంటాయి. కనుక పట్టుబడితే తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం అన్నిచోట్లా ఉంది. నల్లడబ్బు నానాటికీ పెరగడానికి ప్రధాన కారణం ఇదే. మన దేశానికి సంబంధించినంతవరకూ 2004కు ముందున్న నిబంధనలు ఆ తర్వాత సరళం అయ్యాయి. ఏ ప్రయోజనం కోసమైనా మన పౌరులు విదేశాలకు డబ్బు బదిలీ చేయరాదన్న నిబంధన నీరుగారి 25,000 డాలర్ల వరకూ సరళీకృత చెల్లింపు పథకంకింద పంపవచ్చునన్న నిబంధన వచ్చిచేరింది. అలాగే విదేశాల్లో కంపెనీల ఏర్పాటు విషయంలోనూ నిబంధనలు సులభమయ్యాయి. ఫోన్సెకా ద్వారా ఉనికిలోకొచ్చిన 2,14,000 కంపెనీల్లో ఈ బాపతే అధికం. ఇప్పుడు పేర్లు వెల్లడయ్యాక ఏం చేసినా చట్టబద్ధంగానే చేశామని, తమదేమీ తప్పులేదని పలువురు చెబుతుండటానికి కారణం ఇదే. అందులో అవాస్తవమేమీ ఉండకపోవచ్చు. అయితే చట్టబద్ధమైనదంతా నైతికబద్ధం కాకపోవచ్చునని గుర్తించాలి. అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలనూ మింగేస్తున్న నల్లడబ్బును అదుపు చేయాలంటే అందుకు తావిస్తున్న నిబంధనలు మారి తీరాలి. ఈ పని చేయకుండా ఏం చెప్పినా వ్యర్ధమే. -
ప్రపంచవ్యాప్తంగా పనామా ప్రకంపనలు!
లండన్: 'పనామా పేపర్స్' ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంపన్నులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, తాజా మాజీ దేశాధ్యక్షులు.. ఇలా చాలామంది పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో అక్రమంగా నల్లడబ్బు దాచినట్టు వెలుగులోకి వచ్చిన వివరాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విచారణ ప్రారంభించాయి. పనామాలోని ఓ లా కంపెనీకి చెందిన 1.15 కోట్ల పత్రాలు లీకవ్వడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ సన్నిహితులు, బ్రిటన్ ప్రధాని కామెరాన్, చైనా ప్రధాని జింగ్పింగ్ బంధువులు, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కొడుకులు, ఉక్రెయిన్ ప్రధాని కుటుంబసభ్యులు అక్రమంగా విదేశీ బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. వీరితోపాటు ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖుల నల్లడబ్బు లోగుట్టు కూడా వెలుగుచూసింది. నల్లడబ్బును దాచేందుకు బోగస్ కంపెనీలు సృష్టించడంలో పనామాకు చెందిన మొసాక్ ఫొనెస్కా లా కంపెనీ దిట్ట. ఆ కంపెనీ ఇప్పటివరకు వివిధ ప్రముఖుల కోసం 2.40 లక్షల బోగస్ కంపెనీలు సృష్టించింది. అనేకమంది ప్రముఖులు ఈ కంపెనీల్లో నల్లడబ్బును దాచినట్టు వెలుగులోకి వస్తున్నది. లియోనల్ మెస్సీ, జాకీచాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలో రష్యా మొదలు బ్రిటన్ వరకు అన్ని దేశాలు ఈ బాగోతంపై స్పందించాయి. పుతిన్ సన్నిహితుల నల్లడబ్బు వ్యవహారంపై రష్యా స్పందిస్తూ.. ఇందులో కొత్తదనంకానీ, సమగ్ర ఆధారాలుకానీ లేవని కొట్టిపారేసింది. ప్రధాని డేవిడ్ కామెరాన్ దివంతగ తండ్రికి కూడా ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపై స్పందించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిరాకరించింది. ఇది ప్రైవేటు మ్యాటర్ కాబట్టి స్పందించబోమని పేర్కొంది. తన సన్నిహితుల పేర్లు 'పనామా పేపర్స్'లో ఉండటంపై ఐస్లాండ్ ప్రధాని సిగ్ముందర్ గున్లలగ్సన్ నోరువిప్పలేదు. తన కుటుంబసభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వివరణ ఇచ్చారు. ఇక తమ దేశాల ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, నెదర్లాండ్ తదితర దేశాలు విచారణకు ఆదేశించాయి. మరోవైపు పనామా దేశం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద లీక్ బాగోతంగా భావిస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది.