Photo journalist
-
పుట్టిన రోజు వేడుకలకూ నోచుకోలేదు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. బర్త్డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్లో ప్రదర్శించనున్నారు.ఏడు ప్రావిన్సులు తిరిగి... ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.ఆశలకు ప్రతీకలు కూడా... ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.తాలిబన్లలోనూ విభేదాలు!మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
13 రోజుల్లో.. మూడుసార్లు ఆమె ఎవరెస్ట్ను జయించింది!
పదమూడు రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే మొదటి మహిళగా పూర్ణిమా శ్రేష్ట గుర్తింపు పొందింది. నేపాల్లో వృత్తి రీత్యా ఫొటో జర్నలిస్ట్ అయిన 33 ఏళ్ల పూర్ణిమ, సాటి మహిళలను ప్రోత్సహించడానికి సవాళ్లనే సోపానాలుగా చేసుకుంటున్నాను అంటోంది.‘ప్రపంచంలో ఒకే సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మొదటి మహిళగా గుర్తింపు రావడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పర్వతారోహణలో పాల్గొంటున్న మహిళలను ఇప్పటికీ వేళ్లమీద లెక్కించవచ్చు. వారికి ఆసక్తి ఉంటుంది. కానీ, భయంతో వెనకంజ వేస్తుంటారు.ఇప్పుడు చాలామంది యువతులు పర్వతారోహణ గురించి నన్ను కలుస్తుంటారు. వారిలో ప్రభావంతమైన మార్పును తీసుకు రాగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. రాబోయే రెండేళ్లలో 14 మంది మహిళలను ఎవరెస్ట్ అధిరోహణకు తీసుకెళ్లగలనని నమ్మకం ఉంది.మూస పద్ధతికి స్వస్తి...ఎప్పుడూ ఒక విధమైన జీవనంలో మూసపద్ధతిలో కొనసాగడం నాకు ఇష్టం ఉండదు. అలాగని నేనేమీ సంపన్నుల ఇంట్లో పుట్టలేదు. మా అమ్మానాన్నలు నేపాల్లోని గోర్ఖా ప్రాంతంలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న రైతులు. నా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ నీటి కొరత ఉండేది. రాగిబిందెతో కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చేదాన్ని. ఆ కష్టం నాలో సవాళ్లకు మార్గం చూపింది. ఇప్పటివరకు ఎనిమిది శిఖరాలను అధిరోహించాను. నా సవాళ్ల సాధన కోసం నా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుండి డబ్బు తీసుకున్నాను. గైడింగ్ కంపెనీ నుండి కొంత లోన్ తీసుకున్నాను. తిరిగి ఈ అప్పు తీర్చడానికి మౌంటనీయర్ గైడ్గా చేయాలనుకుంటున్నాను. రికార్డ్ సాధించి, పర్వతారోహణలో మహిళలు పాల్గొనడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నది నా లక్ష్యం. చాలామంది అడ్డు చెప్పారు. కానీ, 8,000 కిలోమీటర్ల రికార్డ్ను సాధించాను. ‘ఒక సాధారణ అమ్మాయి రికార్డ్ బ్రేక్ చేసింది’ అనే మాటలు విన్నప్పుడు, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. అలసట కలిగినా..ఈ వసంత కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు సులువుగానే అధిరోహించాను. తర్వాత మూడవసారి కొంచెం అలసటతో కిందటి నెల 25వ తేదీని అధిరోహణ ప్రారంభమైంది. నా గైడ్, నేను ఈ అధిరోహణకు బయల్దేరాం. అలసటతో నా అడుగులు భారంగా అనిపించాయి. శిఖరాగ్రానికి చేరుకోవడానికి మధ్యలోనే అలసటతో కొంతసేపు నిద్రలోకి జారుకున్నాను.నిద్రలేపడానికి గైడ్ నా ముఖంపైకి మంచుగడ్డలను విసరాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో త్వరగానే తేరుకున్నాను. ఒక్కో అడుగు వేయడంపై దృష్టి పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు శిఖరాగ్రానికి చేరుకుని రికార్డ్ సృష్టించాను. దాదాపు ఒక గంటపాటు పై భాగంలోనే ఉన్నాం. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. కలల సాధనకు కృషిస్కూల్ చదువు పూర్తయ్యాక ఫొటో జర్నలిజం చేశాను. 2017లో ఎవరెస్ట్ మారథాన్ కవర్ చేసే ఫొటోగ్రఫీ అసైన్మెంట్ సమయంలో పర్వతారోహణ ప్రపంచానికి పరిచయం అయ్యాను. పర్వతాలను కలుసుకోవడానికి అంత సమయం పట్టిందే అని చాలా బాధపడ్డాను. శిఖరపు అంచున నిలబడి, అక్కడినుంచి ప్రపంచాన్ని చూడటంలోని కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నాను. చాలా మంది స్త్రీలు ఇంటిపని కోసం మాత్రమే పుట్టారని అనుకుంటారు. గ్రామాల్లో చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తుంటారు.పెళ్ళే జీవనసాఫల్యంగా ఉంటారు. ఆ తర్వాత వెంటనే మాతృత్వం. ఇంటిపనులతో జీవితం. ఇలా ఉండకూడదు నా జీవనం అనుకున్నాను. 2018లో నా పర్వతారోహణ ప్రక్రియను ప్రారంభించాను. 2022లో కాంచన్ జంగా, లోత్సే, మకాలును అధిరోహించాను. అదే నెలలో అతి తక్కువ రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్ను అధిరోహించగలననే నమ్మకం కలిగింది. ఎవరెస్ట్ పైనుంచి కొత్తగా లేదా గొప్ప పనిచేస్తే ప్రజలు ముఖ్యంగా మహిళల్లో మార్పు వస్తుంది అనుకున్నాను. వాళ్లు కూడా తమ పట్ల శ్రద్ధ వహిస్తారని నా నమ్మకం.ప్రజలలో మహిళల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చడమే నా ఉద్దేశ్యం. తమ సామర్థ్యాలను విశ్వసించ లేనివారు కలలను సాకారం చేసుకోలేరు.. మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని మనలోనే అన్వేషించాలి. అప్పుడు మనలోని అంకితభావం, ధైర్యంతో ముందడుగు వేస్తే ఆ ఆశయమే అత్యున్నత శిఖరాలను చేర్చుతుంది’’ అని వివరించే పూర్ణిమ మాటలు యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
ఫొటో జర్నలిస్ట్ గోపాల్పై దాడి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్పై దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్పీజేఏ) అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. స్వల్ప వివాదం కారణంగా మహేష్గౌడ్ అనే వ్యక్తి కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన గోపాల్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. గోపాల్ను సహచర ఫొటో జర్నలిస్టులతో కలసి వారు పరామర్శించారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే గోపాల్పై దాడి చేసిన మహేష్గౌడ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
Photojournalist Smita Sharma: ఉయ్ క్రై ఇన్ సైలెన్స్
ఈ పరిశోధనాత్మక ఛాయాచిత్ర పుస్తకంలో ‘అయ్యో!’ అనిపించే జీవితాలు ఉన్నాయి. కన్నీటి సముద్రాలు ఉన్నాయి. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగి, పరిశోధించి దిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్ట్ రూపొందించిన ఈ పుస్తకం బాధిత హృదయానికి నిలువుటద్దం... దిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుంచి పదిహేడు సంవత్సరాల యువతిని కాపాడారు పోలీసులు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటో జర్నలిస్ట్ స్మితాశర్మకు ‘తెలుసుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి’ అనిపించింది. అలా తన పరిశోధన మొదలైంది. ఏడు సంవత్సరాలు ఎన్నెన్నో కష్టాలు పడి, ఎంతో పరిశోధించి ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ అనే ఫొటోబుక్ తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో ఈ పుస్తకం ప్రచురితం అయింది. తన పరిశోధనలో భాగంగా స్మిత తెలుసుకున్న ముఖ్యవిషయం ఏమిటంటే, చాలా కేసుల్లో మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులతో బలవంతంగా జరగడం లేదు. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాల మోసాలతో ఉచ్చులోకి దించుతున్నారు. ఉదాహరణకు మీనా(పేరు మార్చడమైనది) ఒక రోజు మీనాకు ఒక యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి కలవాలనుకుంటున్నాను’ అన్నాడు. రెండోరోజు మీనా దగ్గరకు వచ్చి ‘ వీరు మా అమ్మా,నాన్నలు’ అంటూ ఇద్దరిని పరిచయం చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ అద్దె తల్లిదండ్రులు కూడా తమ నటనతో రెచ్చిపోయారు. ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’ అని నమ్మించారు. తన సోదరికి దిల్లీలో వస్త్రవ్యాపారం ఉందని, ఇద్దరం అక్కడే పనిచేద్దాం అన్నాడు యువకుడు. వీరి మాయమాటలు నమ్మి దిల్లీకి చేరిన మీనా దుర్మార్గుల బారిన పడింది. బంగ్లాదేశ్కు చెందిన 12 సంవత్సరాల బాలికకు కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయడం అనివార్యం అయింది. తమ కుటుంబంతో కాస్త పరిచయం ఉన్న ఒక వ్యక్తి ‘ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ తీసుకెళ్లి బ్రోతల్ హౌస్కు అమ్మేశాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ అమ్మాయి పోలీసుల సహాయంతో విముక్తి అయింది. ఒక ఆశ్రయంలో చేరింది. కొద్దిరోజులకు ఆమెకు ఒక మహిళ పరిచయం అయింది. ‘మీ దేశం తీసుకెళతాను’ అని నమ్మించి పశ్చిమ బెంగాల్లోని నమ్ఖానా అనే ఊరిలోని బ్రోతల్కు అమ్మేసింది... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎందరో బాధితులు ఉన్నారు. యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్, లాయర్లు, పోలీస్ అధికారుల సహాయంతో మీనాలాంటి ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది స్మిత. దీనివల్ల అమ్మాయిల అమాయకత్వం, నేరగాళ్లు ఎన్ని రకాలుగా నమ్మిస్తారు? ఆ తరువాత ఎలా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు? ఎలా మోసం చేస్తారు? మానవ అక్రమ రవాణా నేరవ్యవస్థ మూలాలు ఏమిటి?... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది స్మిత. కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు ఇల్లు ఎందుకు విడిచి పెట్టాలనుకుంటున్నారనే విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తేవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పొలానికి వెళ్లి పనులు చేయడం... పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ అంతులేని బండచాకిరీతో తమకు తెలియకుండానే ఇల్లు, ఊరు దాటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మోసగాళ్ల బారిన పడుతున్నారు. ‘సున్నితమైన అంశంపై పనిచేస్తున్నాను’ అనే ఎరుకతో కెమెరాను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది స్మిత. బాధితుల ముఖాలు కనిపించకుండా స్పాట్లైట్లు, షాడోస్... ఇతరత్రా క్రియేటివ్ మెథడ్స్ను ఉపయోగించింది. ‘లైట్లు, షాడోస్ నా ప్రాజెక్ట్లో కీలక పాత్ర పోషించాయి’ అంటుంది స్మితా శర్మ. హైదరాబాద్లో జరిగిన ‘ఇండియన్ ఫొటో ఫెస్టివల్–2022’లో పరిశోధనాత్మక ఫొటోబుక్ ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ ఆవిష్కరణ జరిగింది. -
అన్ కండిషనల్ లవ్
మాఫియా దాడిలో తన వారందరినీ పోగొట్టుకుందా గొరిల్లా. రెండు నెలల పసికందుగా నేషనల్ పార్క్ రేంజర్కు దొరికింది. ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు రేంజర్ ఆండ్రే బవుమా. 13 ఏళ్లపాటు కంటికిరెప్పలా కాపాడాడు. ఆ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూ పం ఈ చిత్రం. అనారోగ్యంతో ఉన్న ఆ గొరిల్లా తన ఆఖరి గడియ ల్లోనూ రేంజర్ను వదిలిపెట్టలేదు. అతని ఒడిలోనే శాశ్వతంగా కన్ను మూసింది. కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్లో ఫొటో జర్నలిస్ట్ బ్రెంట్ స్టిర్టన్ తీసిన ఈ చిత్రం... ఫొటో జర్నలిజం కేటగిరీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2022 అవార్డును దక్కించుకుంది. -
ఆదర్శ జీవితానికి కొలమానం
సుప్రసిద్ధ ఫొటో జర్నలిస్టుగా, ప్రజల జీవనాన్ని, వారి సంస్కృతిని జీవితాంతం తన కెమెరాకన్నులో బంధించి పేద ప్రజల బతుకు చిత్రాన్ని అక్షర సత్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా అందిస్తూ వచ్చిన ప్రజా కళాకారుడు భరత్ భూషణ్. ఆయన నిజ జీవితంలో కూడా తిరుగులేని ఒక ఆదర్శ శిఖరం! భరత్ దశాబ్దాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా తన కెమెరా కన్నుకు క్షణం విశ్రాంతి నివ్వలేదు. విద్యావంతురాలైన పేదింటి మహిళా రత్నం సుభద్రను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత రెండు కుటుంబాలకు కనపడకుండా నెలల తరబడి కాదు, కొన్నేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని కూడా గడుపుతూ ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాడు. ఈ జంటను కాపాడుకుంటూ వారి ఆదర్శానికి ఒక దిక్సూచిగా నిలబడవలసిన ధర్మం నాకూ, నా భార్య సుధారాణిపైన పడింది. అలా వారి అజ్ఞాత దాంపత్యం కొత్త చిగుళ్లు తొడిగింది. కలవారి కుటుంబంలో పుట్టిన భరత్, పేద కుటుంబంలో పుట్టిన విద్యావంతురాలైన సుభద్రను చేసుకోవడంతో ఎదురైన కొత్త కష్టాలను ధైర్యంతో, మనో నిబ్బరంతో ఎదు ర్కొంటూ వచ్చాడు. ‘ఉదయం’ దినపత్రిక ద్వారా (1984–86) మొదలైన మా స్నేహం వయోభేదంతో నిమిత్తం లేకుండా, ప్రాంతా లతో సంబంధం లేకుండా ఎదుగుతూ వచ్చింది. అందు వల్ల భరత్ భౌతికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగమైన తెలంగాణకు చెందినా, ఏ కోశానా ప్రాంతాల స్పృహ లేకుండా తెలుగువాళ్లుగా స్నేహ బాంధవ్యం పెరిగి బలపడుతూ వచ్చింది. ఈ బంధం, ఆత్మీయతల అనుబంధంగా పెరుగుతూ వచ్చింది కనుకనే హైదరాబాద్ లోని మా ఇల్లు భూషణ్ దంపతుల సొంతిల్లుగానే మారిపోయింది. ఈ చరిత్ర మన జర్నలిస్టు మిత్రులలో చాలా కొద్దిమందికే తెలుసు. మొన్న భరత్ పేద ప్రజా జీవితాలకు అంకితమైన ఫొటో జర్నలిస్టుగా కన్నుమూసే వరకూ మా కుటుంబాల ఆత్మీయతలు ఎక్కువ మందికి తెలియవు. మొన్నమొన్న భరత్ కన్నుమూసే వరకు, చివరి క్షణాల వరకూ భరత్, సుభద్రలు, వారి కుమార్తె అనుప్రియ, కొడుకు అభినవ్ నాతో భరత్ ఆరోగ్య విషయాల గురించి చెబుతూనే ఉన్నారు. వృద్ధాప్యం వల్ల నేను ఎక్కువసార్లు భరత్ ఇంటికి వెళ్లి ఇంతకు ముందులా అతడిని పరామర్శిస్తూ ముచ్చటలాడటం కుదరలేదు. అందువల్ల కేవలం ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండేవాడిని. తను ఏ చిన్న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నా విధిగా నాకు ఫోన్ చేస్తూ మీరు కూడా వస్తే ‘నాకు దండి’గా ఉంటుందని చెప్పేవాడు. కానీ నా ఆరోగ్య పరిస్థితి, వృద్ధాప్య దశవల్ల నేను వాటిలో కొన్నింటికీ వెళ్లేవాడిని కాదు. ఐనా విధిగా సమాచారం మాత్రం భరత్ అందిస్తూనే ఉండేవాడు. అరుదైన ప్రజల, పేదసాదల ఫొటో జర్నలిస్టుగా, కళాకారుల్లో అరుదైన సమాజ స్పృహ తీవరించి ఉన్న వ్యక్తిగా భరత్ను నేను పరిగణిస్తాను. అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తరువాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తెలంగాణ వాసి అయిన భరత్కు తెలిసినంత లోతుగా తెలంగాణ సంస్కృతీ వైభవానికి చెందిన అనంతమైన పార్వ్శాలు మిగతా తెలంగాణ కళాకారులకు తెలియ వంటే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజా జీవితానికి చెందిన అనేక కోణాలను, చివరికి ఇళ్ల తలుపు చెక్కల సొగసుల్ని, వంటింటి సామాన్ల తీరు తెన్నుల్ని అక్షరబద్ధమూ, చిత్రాక్షర బద్దమూ చేసి చూపరుల్ని ఆశ్చర్యచకితులను చేశాడు భరత్. (క్లిక్: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) అందుకే ఏ తెలంగాణ చిత్రకారునికన్నా, ఫొటో జర్నలిస్టుకన్నా లోతైన అవగాహనతో భరత్ తెలంగాణ ప్రజా జీవన చిత్రాలను ప్రాణావశిష్టంగా మలిచారని చెబితే అతిశయోక్తి కాదు. భరత్ కుంచెలోనూ, కలం లోనూ విలక్షణమైన ఈ శక్తియుక్తులను పెంచి పోషించింది అభ్యుదయ భావ సంప్రదాయాలేనని మనం గుర్తించాలి. సబ్బు ముక్క, తలుపు చెక్క కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే తెలంగాణ పల్లెపట్టుల్లో తలుపు చెక్కల సౌందర్యాన్ని ఫొటో జర్నలిజం ద్వారా చిత్రబద్ధం చేశాడు భరత్. మహాకవి కాళోజి అన్నట్లు ‘‘చావు నీది, పుట్టుక నీది/ బతుకంతా దేశానిది’’. ఈ సత్యాన్ని ఎన్నటికీ మరవకండి! అందులోనే నిజం ఉంది, నిజాయితీ ఉంది!! (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ..
పై రెండు ఫొటోల్లో తేడా గమనించారా? ఏం లేదే మామూలుగానే ఉందని అనుకుంటున్నారా? మళ్లీ ఓ పాలి.. ఓ లుక్కెయ్యండి.. అర్థమైందా.. అవును! పై ఫొటోలో దట్టంగా ఉన్న మంచు కాస్తా.. కింది ఫొటోలో అట్టడుగుకు చేరిపోయింది. ఐతే ఏంటట.. అంటారా? దీనికి ఈ భూమిపై తలెత్తనున్న పెను ప్రమాదాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది మరీ! అందుకే ఈ వివరణంతా... ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. 100 సంవత్సరాల తేడాతో వేసవికాలంలో తీసిన ఫొటోలివి. పై ఫొటో దాదాపు 105 సంవత్సరాలనాటిది. కింది ఫొటో తాజాగా తీసింది. కేవలం వందయేళ్ల కాలంలో ఆర్కిటిక్ ప్రాంతంలో మంచంతా ఇలా నీరుగారిపోయింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నెమ్మదిగా దెబ్బతింటున్న ఆర్కిటిక్కి సంబంధించిన ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యమిది. వాతావరణ మార్పులు తీవ్ర వానలు, వరదల వెనుక దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవం ఇది. చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. ‘గ్లేసియర్ కంపారిజన్ - స్వాల్బార్డ్’ క్యాప్షన్తో క్రిస్టియన్ అస్లాండ్ అనే ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆర్కిటిక్లోని వాతావరణ మార్పుల గురించి డాక్యుమెంటరీ తయారు చేశాడు. ఈ స్వీడిష్ ఫోటో జర్నలిస్ట్ 2017లో నేషనల్ జియోగ్రాఫిక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తన అనుభవాలను పంచుకున్నాడు- ‘నేను ఈ ఫొటోను 2003లో తీశాను. వాతావరణ మార్పు పట్ల నా వైఖరి భిన్నంగా ఉంది. చాలా యేళ్ల తర్వాత సరిగ్గా అదే లొకేషన్ నుండి ఫొటో షూట్ చేయడం ఆనందాన్నిచ్చింది. వాతావరణ మార్పు సమస్య గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలనే ఈ ఫొటో షూట్ చేశాన’ని చెప్పుకొచ్చాడు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? This is Arctic 105 years apart. Both picture taken in summer. Do you notice anything special. Courtesy Christian Åslund. pic.twitter.com/9AHtLDGKRb — Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2021 -
మొదటి ట్రాన్స్జెండర్ ఫొటో జర్నలిస్ట్ కథ చెప్పే క్లిక్
ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఫొటో జర్నలిస్ట్గా జోయా థామస్ లోబో ఇటీవల వార్తల్లో నిలిచారు. ముంబైలో ఉంటున్న 27 ఏళ్ల జోయా యాచకురాలి నుంచి ఫొటోజర్నలిస్ట్గా ఎలా మారిందో తెలుసుకుంటే సాధనమున ఎవరికైనా ఏ పనైనా సాధ్యమే అనిపించకమానదు. ‘రకరకాల జీవన శైలులను బంధించడానికి నా కెమెరాతో వీధుల్లో నడవడం అంటే నాకు చెప్పలేనంత ఇష్టం’ అంటుంది జోయాను కదిలిస్తే. ‘చిత్రం’గా మలుపు ఇంట్లో చుట్టుపక్కలవారి నిరాదరణకు గురైన జోయా 18 ఏళ్ల వయసులో తన కుటుంబంనుంచి బయటకు వచ్చి, ముంబైలోని తన లాంటివారిని వెతుక్కుంటూ వెళ్లింది. కొంతమంది హిజ్రాల బృందంతో కలిసి, వారితో చేరి స్థానిక రైళ్లలో యాచించేది. ప్రతీ ఒక్కరినీ అవకాశాలు పలకరిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారు. అలాంటి విజేతల జాబితాలో జోయా నిలుస్తుంది. ‘‘2018లో ఒక రోజు నా జీవితం అకస్మాత్తుగా మలుపుతీసుకుంది. ఒక షార్ట్ఫిల్మ్ డైరెక్టర్ ట్రాన్స్జెండర్ నటుల కావాలని వెతికారు. నటులు ఎవరూ లేకపోవడంతో నాకు అందులో ఓ పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో చిత్రం ట్రాన్స్జెండర్ల సమస్యల మీద తీశారు. అందులోనూ నటించాను’’ అని తనకు వచ్చిన అవకాశం గురించి ఆనందంగా వివరిస్తుంది జోయా. ఆ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమం లో కుటుంబాలు, సమాజం ట్రాన్స్జెండర్స్ని దూరంగా ఉంచడం అన్యాయమని పలువురు వక్తలు ప్రసగించారు. అప్పుడు జోయా తను ఎదుర్కొన్న సమస్యలను సభాముఖంగా వివరించింది. ఆమె ఉచ్ఛారణ ఆకట్టుకునే విధంగా ఉండటంతో స్థానిక పత్రికా సంపాదకుడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉద్యోగావకాశం ఇచ్చాడు. అలా మొదటిసారి పత్రికా ఆఫీసులో అడుగుపెట్టింది జోయా. అక్కడ ఉపయోగించే కెమెరాలు ఆమెను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సాధనమున ఫొటోగ్రీఫీ కొన్ని నెలల్లో సాధన చేసి, సన్నివేశాన్ని కళ్లకు కట్టే క్లిక్ను ఔపోసన పట్టింది. కిందటేడాది ఏప్రిల్ లాక్డౌన్ సమయంలో ముంబైలోని బాంద్రా స్టేషన్ సమీపంలో చిక్కుకున్న వలస కార్మికుల నిరసనల ఫొటోలను అన్ని పత్రికలు కవర్ చేశాయి. అందులో జోయా తీసిన ఫొటోలు ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాయి. జోయా ఓ కెమరా తీసుకొని, కరోనా మహమ్మారి మధ్య తన పని కోసం కష్టపడుతూ తిరిగింది. ‘ముందు జర్నలిజం గురించి చాలా తక్కువ తెలుసు. కెమెరాతో వర్క్ చేస్తున్నప్పుడు సంఘటనలను ఎలా ఒడిసిపట్టుకోవాలో, వార్తలో ఫొటో ప్రాధాన్యత ఎంతో వర్క్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా అర్ధమైంది’ అంటూ తను నేర్చుకున్న పని గురించి వివరిస్తుంది. యాచన డబ్బుతో కెమెరా సాధనకు మరింత మెరుగులు పెట్టాలంటే అందుకు తగిన వనరులు కూడా ఉండాలి. ‘‘సొంతం గా నా దగ్గర ఒక కెమరా ఉండాలనుకున్నాను. కానీ, అంత డబ్బు నా దగ్గర లేదు. ఫ్రీలాన్సింగ్ జాబ్కి పెద్ద ఆదాయమూ లేదు. అందుకే, రైళ్లలో యాచిస్తూనే ఉండేదాన్ని. అలా వచ్చిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని దాచిపెట్టేదాన్ని. కానీ, అది కూడా చాలా తక్కువ. 2019 దీపావళి సమయంలో మాత్రం డబ్బు కోసం చాలా కష్టపడ్డాను. అలా వచ్చిన దానితో చివరికి నికాన్ డి–510ను కొన్నాను’’ అంటూ జోయా తన పోషణతో పాటు కెమెరా కొనుగోలుకోసం పడిన కష్టాన్ని తెలియజేస్తుంది. ఒక్క క్లిక్తో కథ స్కూల్ దశలోనే వదిలేసిన చదువు. పనిని ఎలా అర్ధం చేసుకుంటారు అని ఎవరైనా అడిగితే– ‘నేను పనిలోకి వెళ్లేటప్పుడు జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు, దానికి సరైన సమాధానం చెప్పగలిగే ఫొటో తీయడంపై దృష్టి పెడతాను. ఒక కథ చెప్పగలిగే ఫొటో ప్రయత్నిస్తాను. వలసకార్మికుల చిత్రాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. సీనియర్ ఫొటో జర్నలిస్టులు నా పనిని మెచ్చుకున్నారు. లైసెన్స్, ఇతర సాంకేతిక విషయాలపై నాకు అవగాహన కల్పించారు. దీంతో నాకు తగినన్ని పనులు వచ్చాయి. డబ్బు గురించి పక్కన పెడితే ఫొటో జర్నలిస్టుగా నా వర్క్ని నేను అమితంగా ఆనందిస్తున్నాను. కథల గురించి వెతకనప్పుడు పక్షులు, జంతువుల ఫొటోలు తీస్తాను. ఇటీవల అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్ఫిషర్ను క్లిక్ చేయగలిగాను. కిందటేడాది వరకు ఆర్థికంగా మార్పేమీ లేదు. రైళ్లలో యాచించవలసి వచ్చేది. లాక్డౌన్ కావడంతో కెమెరాను కూడా అమ్మాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ, అలా జరగలేదు. నాకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిచోటా ట్రాన్స్జెండర్స్ చేయలేని పని ఏదీ లేదంటూ చెబుతూనే ఉన్నాను. వారి కుటుంబాల నుండి వారిని తిరస్కరించడం మానేస్తే, మంచి విద్య లభిస్తే, మిగ™ éవారిలాగే మంచి జీవితాలను గడుపుతారు. అన్ని ఉదోగ్యాలలో ట్రాన్స్జెండర్లు పనిచేస్తారు. యాచించరు’’ అని వివరిస్తుంది జోయా. -
గ్రేట్ జర్నీ... మానస చిత్రం
గిగిల్స్... లిల్లీపుట్ ల్యాండ్ పేరు పైన రెండు బుజ్జి పాదాలు. లోపలికి వెళ్తే ఓ గదిలో పదకొండు నెలల బాబు విహాస్ పియానో ముందు కూర్చుని కీ బోర్డుని పరీక్షగా చూస్తున్నాడు. ఆ బాబు దృష్టి తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తోందామె. ఇంగ్లిష్ రైమ్ మొదలు పెట్టగానే బాబు ఆమె వైపే చూడసాగాడు. ఓ అరనిమిషం పాటు అలాగే చూసి నోరంతా తెరిచి నవ్వాడు. అప్పుడు క్లిక్ మన్నది ఆమె చేతిలోని కెమెరా. ఆమె పేరు మానస అల్లాడి. కెమెరామన్ అనే మాటను సవరిస్తూ కెమెరా పర్సన్ అనే పదాన్ని నిర్ధారించేశారు. అందుకు మహిళలు వేసిన ఓ ముందడుగే కారణం. ఫొటోగ్రాఫర్గా మగవాళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో నిర్ధారణ అయిన పదానికి జెండర్ స్పెసిఫికేషన్ను తుడిచేస్తున్నారు మహిళలు. ఫొటోగ్రాఫర్గా మహిళలు అరుదుగానే అయినా కనిపిస్తున్నారు. వాళ్లు కూడా ఫొటో జర్నలిస్టులు. ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ల విషయానికి వస్తే... ఇంకా మహిళల ప్రస్థానం ఊపందుకోలేదు. అలాంటి సమయంలో ఓ సాహసం చేసింది మానస అల్లాడి. విహాస్ను ఫొటో తీస్తున్న ఉమన్ ఫొటోగ్రాఫర్ మానస ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో కోర్సు చేయడంతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఫొటో స్టూడియో పెట్టింది. మరో ఐదుగురు ఫొటోగ్రాఫర్లకు, ఐదుగురు ఎడిటర్లకు ఉద్యోగం ఇచ్చింది. సొంత స్టూడియో ఆలోచనకు దారి తీసిన కారణం తనలోని తల్లి మనసేనంటోంది. తన పిల్లలను రకరకాల పోజుల్లో చూడాలని ముచ్చటపడింది. డెలివరీ అయిన ఐదో రోజున నిద్రలో నవ్వుతున్న తన బాబుని ఫొటో తీయాలనుకుంది. ఆ క్షణంలో తాను కదల్లేదు. ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లు అందుబాటులో లేరు. అలా ఆ కోరిక తీరకపోవడం వల్ల ఆ పని తానే మొదలు పెట్టింది. సొంతంగా డిజైన్ కరీంనగర్లో పుట్టి పెరిగిన మానస, ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివింది. బీటెక్ పట్టాతో హైదరాబాద్కి వచ్చి ఇన్ఫోసిస్లో ఉద్యోగంలో చేరింది. ఏడేళ్లు ఉద్యోగం ఇవ్వని సంతృప్తి మూడేళ్ల ఫొటోగ్రఫీ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఒక ప్రైవేట్ ఫొటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లో చేరి డిప్లమో కోర్సు చేసింది. సీనియర్ దగ్గర మెళకువలు నేర్చుకుంది. అప్పటికి స్టూడియో పెట్టే ఆలోచన లేదు. కేవలం ఇష్టంతో మాత్రమే నేర్చుకున్నది. ‘‘మా అబ్బాయి ఐదు రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఫొటో తీయడానికి బేబీ ఫొటోగ్రఫీ ప్రొఫెషనల్స్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. నేను లేవగలిగినప్పటి నుంచి బాబుకి నేనే ఫొటోలు తీసుకున్నాను. ప్రతినెలా పుట్టినరోజు చేస్తూ ఒక్కో నెల డ్రెస్కి ఒక్కో థీమ్తో కుట్టించి మరీ ఫొటోలు తీశాను. రెండవసారి మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు సీరియెస్గా ఆలోచించాను. నేనే స్టూడియో పెడతాను. బేబీ ప్రతి మూమెంట్ని, రకరకాల నేపథ్యాలలో కెమెరాలో దాస్తానని ఇంట్లో చెప్పాను. ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. ‘ఏ ప్రయోగం చేయాలన్నా ఇదే సరైన వయసు’ అని ప్రోత్సహించారు. ఇక నేను ఏయే థీమ్స్తో పిల్లల్ని ఫొటో తీయాలని ముచ్చటపడ్డానో అన్ని సెట్టింగులూ చేయించుకున్నాను. మా స్టూడియోలో ఉన్నవేవీ మార్కెట్లో రెడీమేడ్గా దొరికేవి కాదు. ప్రతిదీ నేనే డ్రాయింగ్ వేసి కార్పెంటర్కి వివరించి చేయించుకున్నాను. మొత్తం ముప్పై నేపథ్యాలతో గదులు సిద్ధమయ్యాయి. అన్నీ త్రీ డైమన్షన్ సెటప్లే. ఇండియాలో పెద్ద బేబీ ఫొటో స్టూడియో ఇదే. ఈ ఏడాది మా కరీంనగర్లో కూడా ఓ స్టూడియో పెట్టాను. పిల్లలు మాలిమి అవుతారు ఉద్యోగం చేసినప్పుడు మిగుల్చుకున్న డబ్బు పదిలక్షలతో 2017లో హైదరాబాద్, బోయిన్పల్లిలో స్టూడియో పెట్టాను. అప్పటికి హైదరాబాద్లో న్యూ బార్న్ బేబీ స్టూడియో ఉంది. కానీ మహిళలు ఈ ప్రయత్నం చేయలేదు. నాకు అడ్వాంటేజ్ ఏమిటంటే... చిన్న పిల్లలు మగవాళ్ల కంటే ఆడవాళ్లకే త్వరగా మాలిమి అవుతారు. పిల్లలతో ఓ అరగంట గడిపితే ఆ బేబీకి ఏమిష్టమో అర్థమవుతుంది. అదే సమయంలో పిల్లలకు నేను అలవాటవుతాను. ఒక్కో పిల్లలు రైమ్స్ ఇష్టపడతారు, కొందరు బొమ్మలను ఇష్టపడతారు. ఇక షూట్ చేసేటప్పుడు వాళ్లకు ఇష్టమైనవి చేస్తూ ఉండాలన్నమాట. మగవాళ్లకు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. ఏం చేస్తే వాళ్ల ఏడుపును ఆపవచ్చనేది కూడా వెంటనే స్ఫురించదు. కాబట్టి ఈ ప్రొఫెషన్లో ముఖ్యంగా బేబీ ఫోటోగ్రఫీలో మహిళలకు మంచి అవకాశాలుంటాయి. హాబీగా నేర్చుకున్న వాళ్లు అక్కడితో ఆగిపోకుండా దీనిని ప్రొఫెషన్గా తీసుకోవచ్చు’’ అన్నది మానస. ఒక తొలి అడుగు మరికొన్ని అడుగులకు స్ఫూర్తి అవుతుంది. మానస ఇష్టంగా క్లిక్ మనిపించుకున్న జీవిత చిత్రమిది. ఈ దారిలో మరికొంతమంది యువతులు ఫొటోగ్రాఫర్లుగా ఎదగాలని ఆశిద్దాం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
సిద్ధిఖీ మరణంలో మా ప్రమేయం లేదు!
కాబూల్: అఫ్గానిస్థాన్లో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ ఫొటో జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ మరణించడంలో తమ ప్రమేయం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఎవరి కాల్పుల కారణంగా డానిష్ మరణించాడన్న విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని, అతను ఎలా చనిపోయాడో తమకు తెలియదని తాలిబన్ల ప్రతినిధి జబుల్లా ముజాహిద్ తెలిపారు. వార్జోన్లోకి వచ్చే ప్రతి జర్నలిస్టు తమకు సమాచారం ఇవ్వాలని, అప్పుడే వారి గురించి తగిన రక్షణలు తీసుకుంటామని సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జర్నలిస్టులు తమకు చెప్పకుండా రణ క్షేత్రంలోకి వస్తున్నారని, ఇది బాధాకరమని అభిప్రాయపడ్డారు. డానిష్ మృతదేహాన్ని ఐసీఆర్సీ(ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్క్రాస్)కు అప్పగించారు. తాలిబన్లకు, అఫ్ఘన్ దళాలకు మధ్య జరుగుతున్న కాల్పులను కవర్ చేయడానికి వెళ్లిన డానిష్, అవే కాల్పుల మధ్య చిక్కుకొని మృతి చెందాడు. -
షాకింగ్: ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణల్లో భారతీయ జర్నలిస్టు మృతి
కాందహార్: ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణల్లో భారతీయ ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్ దుర్మరణం పాలయ్యారు. కందహార్ నగరంలోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో సిద్దిఖీ మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ రాయబారి శుక్రవారం తెలిపారు. సిద్ధిఖి మరణం తీవ్ర విచారకరమని రాయబారి ఫరీద్ మముండ్జాయ్ ప్రకటించారు. పులిట్జర్ బహుమతి గ్రహీత రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆకస్మికమరణంపై పలువురు జర్నలిస్టులు, ఇతర మీడియా మితత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ ట్వీట్ చేసిన మూడురోజుల్లోనే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది. ఈ సందర్బంగా ట్విటర్ వేదికగా సిద్ధిఖీ గతంలో అందించిన కథనాలు, షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. కాగా డానిష్ సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్గా తన వృత్తిని ప్రారంభించి, తరువాత ఫోటో జర్నలిస్టుగా మారారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్గా ఉన్నారు. అలాగే ఇండియాటుడే గ్రూప్లో కొంతకాలం కరస్పాండెంట్గా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభ సమయాలను అతి సాహసోపేతంగా కవర్ చేసిన ఘనత సిద్ధిఖీ సొంతం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం, నేపాల్ భూకంపాలు, హాంకాంగ్ నిరసనలు మొదలైనవాటిని కవర్ చేశారు. శ్రీలంక పేలుళ్ల సమయంలో పోలీసు కేసును కూడా సిద్ధిఖీ ఎదుర్కొన్నారు. कल रात कंधार में एक दोस्त दानिश सिद्दीकी की हत्या की दुखद खबर से गहरा दुख हुआ। भारतीय पत्रकार और पुलित्जर पुरस्कार विजेता अफगान सुरक्षा बलों के साथ थे, जब उन पर आतंकवादियों ने हमला किया था। मैं उनसे 2 हफ्ते पहले काबुल के लिए रवाना होने से पहले मिला था। उन्होंने फोटो पत्रकारिता pic.twitter.com/iV79PfjO5i — Farid Mamundzay फरीद मामुन्दजई فرید ماموندزی (@FMamundzay) July 16, 2021 -
మరోసారి తన సహృదయాన్ని చాటుకున్న చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: కేన్సర్తో బాధపడుతున్న ప్రముఖ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్కు సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి రూ.50వేల ఆర్థిక సహాయం చేసి తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న భరత్ భూషణ్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి రక్తనిధి కార్యాలయానికి వెళ్లి చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు, బ్లడ్ బ్యాంక్ బాధ్యుడు రవణం స్వామినాయుడు నుంచి చెక్కు అందుకున్నారు. తనకు సహాయం చేసిన చిరంజీవికి.. భరత్ భూషణ్ కృతజ్ఞతలు తెలిపారు. -
కశ్మీర్ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
శ్రీనగర్: ఈ యేడాది ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు జమ్మూకశ్మీర్కు చెందిన ఫొటో జర్నలిస్టులను వరించింది. అసోసియేట్ ప్రెస్కి చెందిన చెన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసీన్లను ఫీచర్ ఫొటోగ్రఫీ కేటగిరీ కింద ఈ అవార్డులకు ఎంపిక చేశారు. 370 రద్దు సందర్భంలో, కశ్మీర్లో లాక్డౌన్ కాలంలో ప్రజల కష్టాలను తమ కెమెరాల్లో బంధించినందుకుగాను వీరికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ‘ఇది తమకు దక్కిన అరుదైన గౌరవం’ అనీ, క్లిష్టకాలంలో తమకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, అసోసియేటెడ్ ప్రెస్లకు అవార్డుని గెలుచుకున్న జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధనాత్మక రిపోర్టింగ్, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్లో ది న్యూయార్క్ టైమ్స్కి రెండు ప్రైజ్లు దక్కాయి. -
జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్: ఆ పోలీసును అరెస్టు చేయండి
శ్రీనగర్: జాతి విద్వేషాలను రెచ్చగొడుతూ పోస్టులు పెడుతున్న ఫొటో జర్నలిస్టుపై జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయ వ్యతిరేక కార్యకలాపాల(యూపీపీఎ) కింద ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహం చెందిన జర్నలిస్టు సంఘాలు పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నాయి. జమ్ము కశ్మీర్కు చెందిన పోలీసు సోషల్ మీడియాలో గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్ను మరోసారి తెరమీదకు తీసుకు రావడంతో సదరు పోలీసు తన ట్వీట్ను తొలగించాడు. వివరాల్లోకి వెళితే.. 2002లో గుజరాత్లో అల్లర్లు చెలరేగినప్పుడు మోదీకి.. "ముస్లింల ప్రాణాలు పోయినందుకు మనస్తాపం చెందారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానమిస్తూ "కారు కింద కుక్కపిల్ల పడ్డా బాధగానే ఉంటుంద"ని సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. (శభాష్ అనిపించుకున్న ఐఏఎస్ అధికారిణి) దీన్ని ఉటంకిస్తూ సైబర్ విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న తాహిర్ అష్రిఫ్ 2013లో.. ఈ మాటలే మోదీ అసలు స్వభావాన్ని నిరూపిస్తున్నాయంటూ అతన్నో "శాడిస్ట్"గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. తాజాగా ఫొటోగ్రాఫర్ అరెస్టవడంతో ఈ ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. "ముందు ఇతన్ని అరెస్ట్ చేయండి", "జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్న ఇలాంటివారిని పట్టుకోండి" అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో అధికారులు వెంటనే సదరు పోలీసును ట్వీట్ తొలగించాల్సిందిగా ఆదేశించారు. ఇదిలావుండగా జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సమయంలోనూ అనేకమంది జర్నలిస్టులను పోలీసులు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికైనా జమ్మూకాశ్మీర్లో జర్నలిస్టులపై బెదిరింపులు ఆపాలని వారు కోరుతున్నారు. Tahir Ashraf arrest yourself. Your tweet will be threat to national Sovereignty. @Sheikhzahid402 @FaisalMajeed0 pic.twitter.com/sG7zaeetyH — MUSAIB BIN UMEYR (@MusaibUmeyr) April 21, 2020 I guess the enthusiastic cyber police needs to book this person @Tahir_A. Please help purify social media @listenshahid. #FreeSpeech is not absolute. @narendramodi. https://t.co/vfbuwHKtKH pic.twitter.com/RxPqyDEv2Z — AngryKangri (@qazizaid89) April 21, 2020 -
చంపేస్తే అప్పు తప్పుతుందని..
గోవిందరావుపేట: అప్పు తీసుకున్న డబ్బు ఇప్పుడే ఇవ్వాలంటూ కూర్చున్న దేవేందర్రెడ్డిని హత్య చేస్తే మిగతా చిన్నచిన్న అప్పులను తీర్చేయవచ్చని.. ఇదేక్రమంలో హత్య చేశాక మృతదేహాన్ని రాత్రి మాయం చేయాలని భావించాడు.. ఇదే ఆలోచనతో బేకరీ లోపలికి తీసుకెళ్లిన దేవేందర్రెడ్డిని తీవ్రంగా కొట్టాక చనిపోయాడనుకుని బయటకు వచ్చాక సునీల్రెడ్డి కనిపించాడు.. అంతసేపటి వరకు ఒకటే హత్య చేయాలని అనుకున్న నిందితుడు.. రెండో హత్యకు కూడా సిద్ధమయ్యాడు. దీంతోనే సునీల్ను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్యకు పాల్పడ్డాడు. ఇదీ ములుగు జిల్లా పస్రాలో సోమవారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించి నిందితుడు, బేకరీ యజమాని దయానంద్ అలియాస్ దయ పన్నాగంగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. రూ.6లక్షల అప్పు.. కర్ణాటకకు చెందిన దయానంద్ తన మామ ప్రభుతో కలిసి పస్రాలో కొన్నేళ్ల క్రితం బేకరీ ప్రారంభించారు. అయితే, అప్పులు ఎక్కువ కావడంతో కొద్దికాలం క్రితం ఊరు వదిలేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆరునెలల క్రితం వచ్చిన వారు పస్రాలోనే కొత్తగా బేకరీ తెరిచారు. అప్పటికే ఉన్న అప్పులకు తోడు మరికొన్ని అప్పులు చేశారు. ఈ క్రమంలో దయకు రూ.6లక్షలు అప్పు ఇచ్చిన దేవేందర్రెడ్డి నుంచి ఒత్తిడి పెరిగింది. సోమవారం కూడా దేవేందర్రెడ్డి తన స్నేహితుడైన ఫొటో జర్నలిస్ట్ సునీల్రెడ్డితో కలిసి పస్రా వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంతనాలు సాగించినా డబ్బు తిరిగి ఇవ్వడంలో ఎలాంటి పురోగతి కానరాలేదు. తనకు స్థానిక వ్యాపారి ఒకరు డబ్బు ఇవ్వాల్సి ఉందని చెప్పగా.. దేవేందర్, సునీల్ ఆయన వద్దకు వెళ్లి ఆరా తీశారు. అయితే, దయకు తాను డబ్బు పెద్దగా ఇచ్చేది లేదని.. కొంతమొత్తమే ఉన్నా తనకు కుమార్తె వివాహం ముగిశాక ఇస్తానని చెప్పాడు. (ఫొటో జర్నలిస్ట్ దారుణ హత్య) ఇస్తావా.. ఇవ్వవా? వ్యాపారి మొండిచేయి చూపడంతో దేవేందర్, సునీల్ మళ్లీ దయ బేకరీ వద్దకు వచ్చారు. దేవేందర్రెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.6లక్షల విషయమై మళ్లీ ప్రశ్నించాడు. ఉదయం నుంచి నచ్చచెప్పినా వినడం లేదని భావించిన దయ.. తొలుత దేవేందర్రెడ్డిని హత్య చేసి అప్పు వదిలించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే భావనతో పక్కనే ఉన్న మామ ప్రభుకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి 7–30 గంటలకు బేకరీకి వచ్చిన దేవేందర్రెడ్డిని బేకరీలో వెనక ఉన్న బట్టీ వద్దకు తీసుకెళ్లి విచక్షణా రహితంగా తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో చనిపోయాడని భావించి శవాన్ని రాత్రికి మాయం చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా రాగానే సునీల్రెడ్డి కనిపించడంతో దయా తన ఆలోచన మార్చుకున్నాడని సమాచారం. ‘ఇంటికి పోయి మాట్లాడుకుందాం.. అక్కడ నీకు అన్ని విషయాలు, నా ఇబ్బందులు చెబుతా’ అంటూ సునీల్రెడ్డిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దయ మామ, భార్య బేకరీలో ఉన్నారు. ఈ మేరకు ఇంటికి వెళ్లగానే అక్కడ ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సునీల్రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రక్తపు మడుగులో దేవేందర్.. దయ, సునీల్రెడ్డి ఇంటికి వెళ్లాక పనిపై ప్రభు బేకరీలోని బట్టీ వద్దకు వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో దేవేందర్రెడ్డి కనిపించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన స్థానికుల సాయంతో 108లో ములుగు ఆస్పత్రికి చేర్చాడు. ఇంతలోనే దయ భార్య బేకరీ నుంచి ఇంటికి వెళ్లగా లోపలి నుంచి గొడవ వినిపించినట్లు సమాచారం. ఉదయం నుంచి అప్పు విషయమై జరుగుతున్న గొడవగానే ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దయ రక్తపు మరకలు కడుక్కుంటూ ఇంటి నుంచి బయటకు రావడాన్ని చూసిన ఆమె ఏదో జరిగిందని ఊహించినట్లు సమాచారం. ఆ తర్వాత దయా రోడ్డుపైకి రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇంతలోనే దయ నేరుగా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
జాతరలో విషాదం..!
చిత్తూరు అర్బన్ : అప్పటి వరకు తోటి ఫొటోగ్రాఫర్లతో కలివిడిగా తిరిగాడు. పలుచోట్ల కొలువుదీరిన గంగమ్మలను తన కెమెరాలో బంధించాడు. తొలుత తీసిన ఫొటోపై సంతృప్తిచెందక మళ్లీ అమ్మవారి ఫొటో తీయడానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. చిత్తూరుకు చెందిన ఓ దినపత్రిక ఫొటో జర్నలిస్టు అనంతపద్మనాభస్వామి మృత్యువాత పడటంపై జిల్లా కలెక్టర్, పాత్రికేయులు, పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలిలా.. చిత్తూరు గ్రామీణ మండలంలోని బీఎన్ఆర్.పేటకు చెందిన అనంతపద్మనాభస్వామి (38) ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం నగరంలో గంగజాతర సందర్భంగా బజారువీధి, కట్టమంచి, సంతపేట ప్రాంతాల్లో కొలువుదీరిన అమ్మవార్ల ఫొటోలు తీసుకున్నాడు. అయితే కొంగారెడ్డిపల్లె జాతరలో అమ్మవారు, భక్తుల ఫొటోలను చూసి సంతృప్తి చెందకుండా మళ్లీ ఫొటోలు తీయడానికి వెళ్లాడు. జాతర వద్ద ఏర్పాటు చేసిన చలువపందిళ్ల కొయ్యలపైకి ఎక్కి ఫొటో తీస్తుండగా విద్యుత్లైట్ల కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. ఈ ప్రమాదంలో స్వామి తలకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన ఇతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తరలించి, వన్టౌన్ ఎస్ఐ పురుషోత్తంరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురి సంతాపం.. అనంతపద్మనాభస్వామి మరణవార్త తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆసుపత్రికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా రావాల్సిన బీమాను స్వామి కుటుంబానికి అందజేస్తామన్నారు. అలాగే చిత్తూరు ప్రెస్క్లబ్ నాయకులు, జిల్లా వర్కింగ్ జర్నలిస్టు నాయకులు స్వామి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నాయకులు ఎంఎస్.బాబు, జంగాలపల్లె శ్రీనివాసులు, బుల్లెట్ సురేష్, మాజీ మునిసిపల్ చైర్మన్ భాస్కరన్, త్యాగరాజులు, అపోలో మెడికల్ కళాశాల యూనిట్ ఇన్చార్జ్ నరేష్కుమార్రెడ్డి, సీపీఐ నేత నాగరాజన్, గోపినాథ్ తదితరులు స్వామి మృతదేహం వద్ద నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. -
శ్రీలంక పేలుళ్లు; ఫొటో జర్నలిస్టు అరెస్టు
కొలంబో : నిబంధనలు అతిక్రమించాడన్న కారణంగా ఓ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా మే15 వరకు నెగోంబో మెజిస్ట్రేట్ అతడికి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ఈస్టర్ ఆదివారం నాడు శ్రీలంకలో ముష్కరులు సృష్టించిన నరమేధంలో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో నివసించే రాయిటర్స్ జర్నలిస్టు సిద్ధిఖి అహ్మద్ డానిష్ న్యూస్ కవరేజ్ కోసం అక్కడికి వెళ్లారు. ఇందులో భాగంగా నెగోంబో సిటీకి చేరుకున్న ఆయన అనుమతి లేకున్నా ఓ స్కూళ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వరుస పేలుళ్లలో మరణించిన ఓ విద్యార్థి కుటుంబాన్ని కలిసేందుకు అక్కడికి వెళ్లగా పోలీసులు సిద్ధిఖిని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం నెగొంబో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఈనెల 15వరకు రిమాండ్ విధించారు. ఇక ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో నెగోంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో అత్యధికంగా వంద మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించిన సంగతి తెలిసిందే. పేలుళ్లపై ఇంటలెజిన్స్ హెచ్చరికలు పట్టించుకోని పోలీస్ ఛీఫ్పై వేటు వేయడంతో పాటుగా.. ముసుగులు ధరించడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. -
జర్నలిస్టుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి
-
అయితే మాత్రం ఫొటో తీస్తావా..?
సాక్షి, తమిళనాడు: కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో జనాలు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న ఫోటో జర్నలిస్టుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి.. దాడి చేశారు. తమిళనాడులోని విరూద్నగర్ జిల్లాలో శనివారం కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి పెద్దగా జనాలు రాలేదు. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి కూడా ఖాళీ కుర్చీలు కనిపించడంతో ఓ తమిళ వార పత్రిక జర్నలిస్టు అయినా ముత్తురాజ్.. ఆ ఖాళీ కుర్చీలను ఫోటో తీశాడు. ఆది కాంగ్రెస్ కార్యకర్తలకు కోపం తెప్పించింది. ఖాళీ కుర్చీల ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ.. అతని దగ్గరున్న కెమెరాను లాక్కోడానికి ప్రయత్నించడమే కాకుండా అతనిపై దాడికి దిగబడ్డారు. ఇతర జర్నలిస్టులు కలుగజేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన జర్నలిస్టు ముత్తురాజ్ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ గొడవంతా అక్కడి కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ దాడిని ఖండిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలను గూండాల్లా ప్రవర్తించారని బీజేపీ మండిపడింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు. -
ఫోటోగ్రాఫర్ని కాపాడేందుకు ముందుకొచ్చిన రాహుల్ గాంధీ
-
సత్యం చూపిన కన్ను.. ఇక లేదు
కాబూల్: నెత్తుటి మరకలతో అప్ఘనిస్థాన్ రోదించింది. సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 42 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో పది మంది విలేకరులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన మరో దాడిలో బీబీసీ రిపోర్టర్ అహ్మద్ షా మరణించారు. కాబూల్ మృతుల్లో ఏఎఫ్పీ చీఫ్ ఫొటోగ్రాఫర్ షా మరై కూడా ఉన్నారు. షా మరై గురించి... వాస్తవాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. అధికార మార్పిడి, అంతర్యుద్ధంతో సతమతమైన అఫ్ఘన్ చీకటి గతాన్ని రెండు దశాబ్దాలకు పైగా తన కెమెరాలో బంధించారు. ఉత్తర కాబూల్ షమాలి ప్రాంతానికి చెందిన షా మరై తర్వాత కాబూల్కు వలస వెళ్లారు. 1996లో ఏఎఫ్పీ వార్తా సంస్థలో ఓ డ్రైవర్గా తన ప్రస్థానాన్ని ఆయన మొదలుపెట్టారు. అరుదైన ఫోటోలను తాను పని చేసే సంస్థకు అందించి ఫోటోగ్రాఫర్గా మారిపోయారు. ముఖ్యంగా 2001లో అమెరికా సైన్యం అప్ఘనిస్థాన్పై విరుచుకుపడ్డప్పుడు ఆయన ఇచ్చిన ఫోటోలు ప్రపంచాన్ని కదిలించాయి. ఆయన టాలెంట్ను గుర్తించిన ఏఎఫ్పీ..ఆ మరుసటి సంవత్సరమే ఫోటో స్ట్రింగర్గా ఆయన్ని నియమించింది. ఆపై చీఫ్ ఫోటోగ్రాఫర్గా ఆయన పదొన్నతి పొందారు. యుద్ధం అంటే ఇలా ఉంటుందా? ఫోటోల కోసం ఆయన చాలా శ్రమించేవారు. కొన్ని నెలలపాటు ఆయన కుటుంబానికి దూరంగా ఉండేవారు. ఎత్తైన కొండలు, గుహలను దాటుకుని.. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ ఆయన ప్రయాణించేవారు. ఆయన మూలంగానే అఫ్ఘన్లో యుద్ధ పరిస్థితులు ప్రపంచానికి తెలిశాయి. విస్మయపరిచే కోణాల్లో ఆయన తీసిన ఫోటోలు ‘యుద్ధం అంటే ఇలా ఉంటుందా?’ అన్న భావన కలిగించేవి. ఫోటోగ్రఫీని ఓ వృత్తి.. ప్రవృత్తిలా కాకుండా.. ఓవైపు ఉగ్ర కోరలు, మరోవైపు సంయుక్త సైన్యాల దాడులతో నలిగిపోతున్న ప్రజా జీవితాన్ని సమాజానికి తెలియపరచాలనే ఆయన ఆరాటపడేవారు. అలాంటి వ్యక్తి చివరకు ఉగ్ర ఘాతుకానికి బలైపోయారు. మరైకు భార్య, ఆరుగురు సంతానం. ఈ మధ్యే ఆయనకు కూతురు కూడా పుట్టింది. నిబద్ధతకు ప్రతిరూపం... షా మరై మరణంపై ఏఎఫ్పీ స్పందించింది. ‘నిబద్ధత.. నిజాయితీ కలిగిన వ్యక్తి షా మరై. ధైర్యశాలి. ప్రాణాలను పణంగా పెట్టి ఆయన తీసిన ఫోటోలు ఎన్నో. ఆయన కెమెరా కన్నులొంచే యుద్ధ బీభత్సాన్ని ప్రపంచానికి తెలిసింది. అలాంటి కన్ను చివరకు చిధ్రమైపోయింది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని ఏఎఫ్పీ గ్లోబల్ న్యూస్ డైరెక్టర్ మైకేలే లెరిడాన్ ప్రకటన వెలువరించారు. ఆయన తీసిన కొన్ని ఫోటోలు కింద -
ప్రథమ మహిళ..
ఒకప్పుడు గడప దాటాలంటే ఆడవాళ్లకు ఎన్నో ఆంక్షలు. ఎన్నెన్నో కట్టుబాట్లు. ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు అనే భావన. పరిస్థితి మారింది. నేడు ప్రతీ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. కాలానుగుణంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటూనే... తాము ఎవరి కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు. విద్య, వైద్య, న్యాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలు... ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో తామేంటో నిరూపిస్తున్నారు. ఆంక్షలు అణిచివేతలను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన మొదటి మహిళామణులు వీరు... చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ బ్రిటీష్ సంస్థానంలోని మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్లుగా చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ చరిత్రలో నిలిచారు. చంద్రముఖి కలకత్తా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ విభాగంలో 1883లో పట్టా పొందారు. అదే ఏడాది కదాంబినీ కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి యూరోపియన్ మెడిసిన్లో పట్టా పొందారు. 1886లో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మహిళా డాక్టర్గా, ఆనందీ గోపాల్ జోషీ సరసన నిలిచారు. చంద్రముఖి బసు బేతూన్ కాలేజీలో లెక్చరర్గా కెరీర్ ప్రారంభించి, అదే కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యారు. దక్షిణాసియాలో అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ స్థాపించిన మొదటి మహిళగా చరిత్రకెక్కారు. కామినీ రాయ్ బెంగాలీ రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, స్త్రీవాదిగా సుపరిచితమైన కామినీ రాయ్ భారత్లోనే మొదటి ఆనర్స్ పట్టా పొందిన మహిళ. సాహిత్య రంగంలో ఆమె కృషికి మహాశ్వేత, పౌరంకీ, జిబాన్, పుండరీక్, ద్వీప్ ఔర్ ధూప్, నిర్మాల్య వంటి రచనలు నిదర్శనాలు. కర్నాలియా సోరబ్జీ కర్నాలియా భారత్లో మొదటి న్యాయవాదిగా, ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయ విద్యనభ్యసించిన మొట్టమెదటి మహిళగా గుర్తింపు పొందారు. సామాజిక కార్యకర్తగా, రచయితగా భిన్న పార్శ్వాలు కలిగిన వ్యక్తి. విశ్వ విద్యాలయ మహిళా సమాఖ్య, భారత మహిళా సమాఖ్య బెంగాల్ శాఖ, బెంగాల్ లీగ్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఫర్ వుమెన్ వంటి సంస్థలతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆమె చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1909లో ‘ఖైజర్-ఎ-హింద్’ అవార్డుతో సత్కరించింది. హొమి వైర్వాలా భారత్లో మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు. 1930ల్లో కెరీర్ ప్రారంభించిన హొమి ముంబై చేరుకున్న తర్వాత తను తీసిన ఫొటోల ద్వారా దేశమంతటికీ సుపరిచితురాలయ్యారు. ఢిల్లీకి వెళ్లి గాంధీజీ, ఇందిరా గాంధీ, నెహ్రూ వంటి పలు జాతీయ,రాజకీయ నాయకులతో పనిచేశారు. 1970లో రిటైర్ అయిన తర్వాత అనామక జీవితం గడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2011లో దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించింది . ఆసిమా ఛటర్జీ సైన్స్ రంగంలో డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ. పైటోమెడిసిన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రవీణురాలు. మూర్చ నిరోధక, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ప్రతిష్టాత్మక ‘ఖైరా ప్రొఫెసర్షిప్’ పొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా కలకత్తా యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు. 1960లో జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిఫ్కు ఎంపికయ్యారు. 1961లో రసాయనిక శాస్త్రంలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డు పొందారు. బచేంద్రీ పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. 1984లో పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ సాహస యాత్ర చేపట్టి, 7 ప్రపంచ రికార్డులు సృష్టించారు. భారత మహిళా సాహస యాత్రికులకు మార్గదర్శకురాలిగా నిలిచారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు. కల్పనా చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి ఇండో- అమెరికన్ వ్యోమగామిగా చరిత్రలో నిలిచారు. 1995లో నాసా ఆస్ట్రోనాట్ కార్్ప్స బృందంలో చేరి, 252సార్లు భూమిని చుట్టి సుమారు 10.4 మిలియన్ కి.మీ. దూరం ప్రయాణించారు. అంతరిక్ష నౌక ‘కొలంబియా’లో చంద్రగ్రహ యాత్రకు వెళ్లిన బృందంలో ఒకరైన కల్పనా చావ్లాతో సహా ఆరుగురు వ్యోమగాములు మరణించారు. మరణానంతరం కాంగ్రెషనల్ స్సేస్ మెడల్, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, నాసా సర్వీస్ మెడల్ పొందారు. ఆనందిబాయి గోపాలరావు జోషి నేటికీ ఆడపిల్లకు చదువెందుకనుకునే సమాజం ఇది....అలాంటిది 18వ శతాబ్దంలోనే వైద్య విద్యనభ్యసించి దేశంలోనే తొలి మహిళా వైద్యురాలుగా గుర్తింపు పొందారు. అంతేకాదు పాశ్చాత్య వైద్యశాస్త్రంలో శిక్షణ పొందిన తొలి మహిళ, అమెరికా వెళ్లిన మొట్టమొదటి భారతీయ స్త్రీ కూడా ఆనందిబాయి గోపాలరావు జోషినే. శీలా దవ్రే ఆటో డ్రైవర్ అంటే ఇప్పటికి మనకు గుర్తుకు వచ్చేది మగవారే....అలాంటి పురుషాధిక్య రంగంలోకి ప్రవేశించి వారికి ధీటుగా నిలదోక్కుకున్నారు శీలా దవ్రే. పూనాలో జన్మించిన దవ్రే 1988 నుంచి ఆటో నడపడం ప్రారంభించారు. ప్రస్తుతం ఒక అకాడమీని స్థాపించి ఆసక్తి ఉన్న మహిళలకు ఆటో నడపడంలో శిక్షణ ఇస్తున్నారు. రోషిణి శర్మ దేశంలో తొలి మహిళా బైక్ రైడర్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బైక్ పై ప్రయాణించారు. అరుణిమా సిన్హా జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్ గా...ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆమె అధైర్యపడలేదు. ఇంతటితో జీవితం ముగిపోయిందని బాధపడనూలేదు. క్రీడాకారిణిగా గుర్తింపు ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు. రీటా ఫారియా పావెల్ ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఆసియా తొలి మహిళ, తొలి భారతీయురాలు కూడా. బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యానికి కూడా ప్రాధాన్యమిచ్చే పోటీలో నిలిచి గెలిచిన తొలి వైద్యురాలిగా కూడా చరిత్రకెక్కారు. ఆరతి సాహా ఇంగ్లీష్ చానల్ను ఈదిన తొలి ఆసియన్. 1959లో ఈ ఘనత సాధించారు. 1960లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు పొందిన తొలి మహిళా క్రీడాకారిణి కూడా ఆరతినే కావడం విశేషం. ఇందిరా గాంధీ భారత తొలి మహిళా ప్రధాని. తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు ఇందిరా గాంధీ. సుదీర్ఘ కాలంపాటు ప్రధానిగా(1966 నుంచి 1977 వరకూ) పనిచేసి, ‘ఉక్కుమహిళ’ గా గుర్తింపు పొందారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’(1971) అందుకున్న తొలి మహిళగా రికార్డుకెక్కారు. 1999లో బీబీసీ వారు నిర్వహించిన సర్వేలో ‘సహస్రాబ్ది మహిళ’గా నిలిచారు. ప్రతిభా పాటిల్ మన దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. 2007 నుంచి 2012 వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. 2004 నుంచి 2007 వరకు రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు. సుఖోయ్–30ఎమ్కేఐ యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా కూడా గుర్తింపు పొందారు. అంజలి గుప్తా ఫిలాసఫి చదివి, ఆ విద్యతో ఏమాత్రం సంబంధంలేని త్రివిధ దళాల్లో అత్యంత ప్రమాదభరితమైన వాయుసేనలో చేరారు. భారత వాయుసేనలో ఫ్లైయింగ్ ఆఫీసర్గా చేరిన తొలి మహిళ. బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్లో పనిచేశారు. జస్టిస్ ఎమ్ ఫాతిమా బీబీ సుప్రీంకోర్టులో పనిచేసిన తొలి మహిళా న్యాయమూర్తి. మనదేశంలో అత్యున్నత స్థానంలో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ కూడా ఈవిడే. తమిళనాడు గవర్నరుగా కూడా పనిచేశారు. సరళ థాక్రల్ అతిపిన్న వయసులో(21) విమానాలు నడిపేందుకు లైసెన్స్ పొందిన తొలి మహిళ . లైసెన్స్ పొందిన తరువాత, వెయ్యి గంటలపాటు విమానాన్ని నడిపి ‘ఏ’ లైసెన్స్ పొందిన మొదటి మహిళ. ఎయిర్ మెయిల్ పైలట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా కూడా రికార్డు సృష్టించారు. దుర్గా బెనర్జీ ఇండియన్ ఎయిర్లైన్స్ మొదటి మహిళా పైలట్, కెప్టెన్. ‘టొర్నాడో అ–200’ విమానాలను నడిపిన మొట్టమొదటి మహిళ కూడా ఈమెనే. హరితా కౌర్ డియోల్ ఆకాశంలో ఒంటరిగా ప్రయాణించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధీశాలి హరితా కౌర్ డియోల్.1994 లో భారత వైమానిక దళంలో ఒంటరిగా విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళా పైలెట్గా పేరు పొందారు. ప్రియ ఝింగాన్ పోలీసు నేపథ్యం కుటుంబంలో పుట్టి పెరిగారు . సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరికతో 1993 లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో చేరిన మొట్టమొదటి మహిళా క్యాడెట్గా గుర్తింపు పొందారు. - ధరణి, సుష్మారెడ్డి -
నాటి భూకంపం ఫొటోలు తీశాడు.. నేటి భూకంపానికి చిక్కాడు
మెక్సికో : ఆయన పెద్ద పెద్ద విపత్తులు కళ్లారా చూశారు. చూసిన వాటిని తన కెమెరాలో బంధించి రిపోర్టింగ్ చేశారు. 1985లో వచ్చిన భారీ భూకంపం సమయంలో తీసిన చిత్రాలతో ఒక్కసారి ఉన్నత స్థానానికి వెళ్లి మంచిపేరు తెచ్చుకున్న ఆ ఫొటో జర్నలిస్టు తాజాగా చోటుచేసుకున్న మెక్సికో భూకంపంలో మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు చావుతో పోరాడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. వెస్లీ బక్సే అనే అమెరికా ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన రాయిటర్స్ పత్రికకు పనిచేసే సమయంలో 1985లో భారీ భూకంపం వచ్చింది. ఆ సమయంలో పలు అద్భుతమైన చిత్రాలు తన కెమెరాలో బందించడంతో ఆయన కెరీర్లో దూసుకెళ్లారు. ప్రపంచంలోని ప్రధాని సంఘటనలు జరిగిన ప్రతి చోటకు ఆయనే వెళ్లే వారు. యుద్ధాలకు సంబంధించిన ఫొటోలు కూడా తీశారు. దీంతో ప్రస్తుతం ఆయన టైమ్, న్యూస్ వీక్ సంస్థలకు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. మెక్సికోలో ఈ నెల (సెప్టెంబర్) 7.1తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో వెస్లీ ఆయన భార్యతో ఇంట్లో ఉన్నారు. భూకంపంకారణంగా వారి అపార్ట్మెంట్ కూలిపోయి అందులో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు సహాయం చేసేందుకు మిత్రులు గతంలో ఆయన తీసిన చిత్రాలను వేలం పెడుతున్నారు. ఆయనకు ఓ ఐదేళ్ల కూతురు కూడా ఉంది. ఆ పాప స్కూల్కు వెళ్లడంతో ఎలాంటి గాయాలవకుండా బయటపడింది. -
భాస్కరాచారికి వైఎస్సార్సీపీ సన్మానం
మహబూబ్నగర్ అర్బన్: తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్, భాషా సాంస్కతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూస్పిక్షర్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ భాస్కరాచారిని శనివారం వైఎస్సార్సీపీ నాయకులు సన్మానించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా ఫొటోగ్రాఫర్కు ప్రథమ స్థానం రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హైదర్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోస్గి నసీర్, జమీర్పాష, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ వాజిద్, నేత శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
సాక్షి ఫొటోగ్రాఫర్కు రాష్ట్రస్థాయి అవార్డు
న్యూశాయంపేట : ఈ నెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫొటో జర్నలిస్టు ఛాయాచిత్ర ప్రదర్శనలో సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సంపెట వెంకటేశ్వర్లుకు అవార్డు వచ్చింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈ నెల 17 నుంచి 26 వరకు ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్త ప్రదర్శనకు ఫొటో జర్నలిస్టులు 104 ఎంట్రీలతో 683 ఛాయాచిత్రాలను పంపించగా, 145 ఫొటోలను ప్రదర్శనకు పెట్టారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇండియన్ ఫొటో ఫెస్టివల్ డైరెక్టర్ అశ్విన్ మాథ్యూస్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి కేటగిరీల వారీగా బహుమతులకు ఎంపిక చేశారు. మొదటి విభాగం బెస్ట్ న్యూస్ పిక్చర్లో పల్లెవాగులో జలకాలు చిత్రానికి సంపెట వెంకటేశ్వర్లుకు రెండవ ప్రోత్సాహక బహుమతి లభించింది. హన్స్ ఇండియా ఫొటోగ్రాఫర్కూ అవార్డు.. రెండవ విభాగం తెలంగాణ పండుగలు జాతరలు, చారిత్రాత్మక కట్టడాలు సంస్కృతిలో వేయి స్తంబాల గుడి చిత్రానికి ది హన్స్ ఇండియా ఫొటోగ్రాఫర్ గోకారపు శ్యాంకుమార్కు మొదటి ప్రోత్సాహక బహుమతి లభించింది. 26న ఉదయం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో వీరికి మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేస్తారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, శ్యాంకుమార్ను పలువురు అభినందించారు. -
‘సెజ్’ పొమ్మంది..
అరుణ్ రాయ్చౌదరి.. 25 ఏళ్లు ఫొటో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఆయనది. కెమెరా క్లిక్మంటే ఫొటో అయిపోతుంది. కానీ, ఒక్క ఛాయాచిత్రంతో దాని వెనుకున్న కథను చెప్పగలిగితేనే అది ఫొటో జర్నలిజం అవుతుందంటున్న అరుణ్ రాయ్చౌదరితో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్. ఫొటో జర్నలిజం అంటే ఒక స్టిల్ కాదు. మనం నేరుగా చూడలేని అంశాలను కళ్లకు కట్టేది. సబ్జెక్ట్లోకి తొంగి చూడగలగాలి. అలాంటిదే పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్లో నేను తీసిన ఫొటో. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) వివాదం ఆ ఊరిని కల్లోలం చేసింది. ప్రాణభయంతో ఆ గ్రామస్తులను పరుగులు తీసేలా చేసింది. పోలీసులకు, అల్లరి మూకలకు చెలరేగిన ఘర్షణలు అమాయక జనాన్ని కట్టుబట్టలతో ఊరి పొలిమేరల వరకూ తరిమింది. ఆ సమయంలో తీసిన ఫొటో అక్కడున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. ఈ ఫొటో తీసిన ముందు రోజు అదే గ్రామంలో జరిగిన ఘర్షణల్లో 14 మంది అమాయక రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చోటు లేదు... ఒక ఫొటో మాట్లాడుతుంది. అలాంటి చిత్రం చూసిన తర్వాత మాట్లాడటం ఆపేసి... ఆలోచించటం మొదలుపెడతాం. ఈ రోజుల్లో అలాంటి చిత్రాలకు దినపత్రికల్లో చోటు లేదు. మొబైల్స్, డిజిటల్ కెమెరాల్లో రోజుకు ఎన్నో వేల ఫొటోలు క్లిక్మంటున్నాయి. అవన్ని ఫొటో జర్నలిజం కాలేవు. అసలు ఫొటో జర్నలిజం అనేది ఈ రోజుల్లో లేదనే చెప్పాలి. ఇప్పుడు న్యూస్ పేపర్లలో వస్తున్నది కేవలం పేజ్ ఫిల్లింగ్ కోసం తీసిన ఫొటోలు మాత్రమే. న్యూస్ను క్యారీ చేసేవి, వివరించే చిత్రాలకు చోటెక్కడుంది. దీనికి ప్రకటనలు, ఆలోచన ధోరణిలో మార్పు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫొటో జర్నలిజం కంట్రిబూషన్స్ ఈ రోజు హైదరాబాదులో చోటు చేసుకున్న మార్పులకు ఫోటో జర్నలిస్టుల కాంట్రిబూషన్ ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో జూబ్లీ చెక్పోస్ట్ నుంచి దుర్గం చెరువు వెళ్లడానికి ఒక పిల్ల రోడ్డు ఉండేది. వర్షంలో, బురదలో సైకిల్ మీద వెళ్లి ఫొటోలు తీసిన సందర్భాలు నా అనుభవంలో ఉన్నాయి. అప్పట్లో న్యూస్ పేపర్స్లలో ఫొటో ఫీచర్స్ ఉండేవి. వాటి కోసం ఇలాంటి ఎన్నో ఫొటో ఫీచర్స్ చేసిన ఫొటోగ్రాఫర్లను, వారి కంట్రిబూషన్స్ని మరచిపోయారు. ఈ రోజుల్లో అలాంటి ఫీచర్స్ కూడా రన్ చెయ్యట్లేదు ఎవరూ. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావడమే ఇందుకు కారణం. ప్రజెంటర్: ఓ మధు -
ముంబై ఫోటో జర్నలిస్ట్పై అత్యాచారం కేసులో కీలక తీర్పు
-
ముంబై గ్యాంగ్ రేప్ కేసు:నిందితుడు పరారీ
ముంబై: ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేస్తున్న తరుణంలో ఓ నిందితుడు తప్పించుకుని పరారైయ్యాడు. రేప్ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శిరాజ్ రెహ్మమాన్ ఖాన్ తప్పించుకోవడంతో ఈ అంశం పోలీసులకు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయాన్నిప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కోర్టుకు తెలిపారు. పోలీసుల చెరనుంచి తప్పించుకున్న నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫొటో జర్నలిస్ట్ గ్యాంగ్ రేప్ కేసు నిందితుల నేరాల చిట్టా రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వారిలో కొందరు తనపైనా అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి(19) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫొటో జర్నలిస్ట్ రేప్ జరిగిన శక్తి మిల్స్ ప్రాంగణంలోనే తనపై వారు ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపింది. ఈ మేరకు భాండప్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ వినాయక్ దేశ్ముఖ్ తెలిపారు. ‘జూలై 31న ఆమె తన స్నేహితుడితో ఓ పని మీద మహాలక్ష్మి ఏరియాకు వెళ్లింది. అక్కడ కొందరు ఫొటో జర్నలిస్ట్ కేసులో చేసినట్లుగానే వీరినీ మోసపుచ్చి.. భయపెట్టి.. శక్తి మిల్స్ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్నేహితుడిని కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు’ అని పోలీసులు చెప్పారు. దీంతో ఇప్పుడు జూలై 31 రేప్ ఘటనపైనా వారిని ప్రశ్నిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. -
‘సాక్షి’ ఫొటో జర్నలిస్టుపై దాడి
సాక్షి, రాజమండ్రి : విధి నిర్వహణలో ఉన్న ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు గరగ ప్రసాద్పై ఓ కేసులో నిందితులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు గరగ ప్రసాద్, మరో విలేకరి ఎం.సోమరాజు విధి నిర్వహణలో భాగంగా స్థానిక కేంద్ర కారాగారం వద్ద ఉన్నారు. దినచర్యలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జైలు ముందుండగా, కొందరు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. ఎక్కువ మంది ఉండడంతో వారు ప్రధాన కేసులో నిందితులనే భావంతో ఫొటోలు తీసేందుకు సోమరాజు, ప్రసాద్లు ముందుకు వచ్చారు. పోలీసు వాహనం దిగిన నిందితులు వెనువెంటనే ఆ ఇద్దరిపై దాడి చేశారు. గరగ ప్రసాద్ను దారుణంగా కొట్టారు. కెమేరా లాక్కుని, అనుచిత పదజాలంతో దూషించారు. కెమేరాను జైల్లోకి తీసుకుపోయారు. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడంతో వారిద్దరూ భయభ్రాంతులకు గురయ్యారు. జైలు అధికారుల సాయంతో కెమేరాను బయటకు రప్పించగలిగినా, విలువైన ఫొటోలున్న మెమొరీ కార్డులను మాత్రం నిందితులు తస్కరించి, సాయంగా వచ్చిన తమ వారితో మాయం చేశారు. కుట్రపూరిత దాడి వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు గంపల వెంకటరమణపై ఉప్పాడ వద్ద జరిగిన దాడి కేసులో ఈ నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులుగా ఉన్న ఈ ఏడుగురిని రిమాండుకు తరలిస్తుండగా, ‘సాక్షి’ పాత్రికేయులు తారసపడగానే.. సహచరులతో గుర్తుపట్టి.. ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. ఈ దాడిని పాత్రికేయులు తీవ్రంగా ఖం డించారు. అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తిని కలిసి సంఘటనను వివరించారు. దాడికి బాధ్యులైన వారిని వదిలేది లేదని ఎస్పీ హామీ ఇచ్చారు. దాడికి పాల్పడ్డ బందన సురేష్, బందన రమణ, బందన నందీప్, వేలుగు సూరిబాబు, ఉమ్మిడి బాగర్తి, కారె పెంటయ్య, మెరుగు కృష్ణలతో పాటు వీరికి సాయంగా వచ్చి, దాడికి పాల్పడ్డ మరికొందరిపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు సీఐ కేటీవీ రమణారావు తెలిపారు.ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీరామమూర్తి ఈ దాడిని ఖండించారు. -
ఫొటో జర్నలిస్టుపై రేప్ కేసులో.. 600 పేజీల చార్జిషీట్
ముంబై: మహారాష్ట్ర సహా దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు 600 పేజీల చార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నలుగురిపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో వీటిని సమర్పించారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో అతనికి సంబంధించిన అభియోగ పత్రాలను జువెనైల్ జస్టిస్కు అందజేసినట్టు ముంబై పోలీస్ జాయింట్ కమిషనర్(క్రైం) హిమాంశు రాయ్ గురువారం చెప్పారు. నిందితులపై భారత శిక్షా స్మృతి కింద 506(2)-నేర స్వభావం, 376(డి)- గ్యాంగ్రేప్, 377- అసహజ నేరం, 342-అక్రమ నిర్బంధం, 341-అక్రమ నిరోధం, 201-సాక్ష్యాలను ధ్వంసం చేయడం, 120(బి)-నేర పూరిత కుట్ర, 34-ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడడం వంటి సెక్షన్లను నమోదు చేశారు. దీనిపై త్వరలోనే విచారణ ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. -
ఫొటో జర్నలిస్ట్ గ్యాంగ్రేప్ కేసులోవారంలో అభియోగపత్రం
ముంబై: నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేసిన ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై రెండుమూడు రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయమై క్రైం బ్రాంచి అధికారి ఒకరు మాట్లాడుతూ... అభియోగపత్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశాం. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో కోర్టుకు సమర్పిస్తాం. బహుశా మంగళవారం కోర్టుకు అందజేసే అవకాశముంది. కేసు దర్యాప్తు చివరిదశలో లభించిన మరికొన్ని ఆధారాలతో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేస్తాం. చార్జిషీట్లో ఎటువంటి లోపాలు లేకుండా రాష్ట్ర న్యాయవిభాగం కూడా అవసరమైన సహాయాన్ని అందజేస్తుంద’న్నారు. -
అరెస్టులు ఆపండి!
సాక్షి, ముంబై: ఇటీవల శక్తి మిల్లులో ఆవరణలో మహిళా జర్నలిస్టు పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనతో తేరుకున్న నగర పోలీసులు అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా అరెస్టు చేసి పారేస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, బార్లపై తనిఖీలు,దాడులను ఉద్ధృతం చేశారు. మైదానాలు, ఫుట్పాత్లు, నిర్జన ప్రదేశాలు, రైలుపట్టాల వెంబడి తిష్టవేసిన మాదకద్రవ్యాల బానిసలు కనిపించిన వెంటనే బేడీలు వేస్తున్నారు. వీటితోపాటు ఆర్కెస్ట్రా బార్లపై దాడులు పెంచారు. అశ్లీల నృత్యాలు చేసే మహిళలను అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో పోలీసు స్టేషన్లలో లాకప్లు, జైలు కిక్కిరిసిపోతున్నాయి. ఇక దాడులు చేయడం మానుకోవాలని కోరుతూ ముంబై పోలీసులకు జైలు అధికారులు లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారు. దీనికి తోడు తాజాగా ప్రతినిత్యం వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్న ఆకతాయిలు, మాదకద్రవ్యాల బానిసలను జైళ్లకు పంపిస్తున్నారు. వీరందరికీ ఎక్కడ వసతి కల్పించాలో తెలియక జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. శక్తిమిల్లులో మహిళా ఫొటోగ్రాఫర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడింది ఆకతాయిలు, వ్యసనపరులే కావడంతో వీరిపైనే పోలీసులు అధికంగా దృష్టి సారించారు. అత్యాచారాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారంటూ సామాజిక సంఘాలు, విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేయడంతో దొరికినవారిని దొరికినట్లే అదుపులోకి తీసుకుని కోర్టులకు తరలిస్తున్నారు. అందుకే ఏ స్టేషన్లో చూసినా లాకప్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. డ్యాన్స్బార్లు ప్రారంభించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవల అనుమతినిచ్చినప్పటికీ హోంశాఖ ఇంతవరకు అధికారికంగా ఏ ఒక్కరికీ లెసైన్సులు జారీచేయడం లేదు. ఇప్పటికే ఆర్కెస్ట్రా, లేడీస్ వెయిటర్స్ పేర్లతో మహిళా బార్టెండర్లను నియమించుకుంటున్నారు. అక్కడికి వచ్చే వారితో ఈ యువతులు అశ్లీలకృత్యాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. బార్లపై కూడా పోలీసులు దాడులు ఉద్ధృతం చేయడంతో పట్టుబడిన యువతలందరినీ మహిళల సంరక్షణ ఆలయాలకు పంపిస్తున్నారు. వీటిలో కూడా జైళ్ల మాదిరిగా సామర్థ్యానికి మించిన ఖైదీలున్నారు. ఆకస్మాత్తుగా పెరిగిన రద్దీతో జైలు సిబ్బంది, అధికారులు ఆందోళనలో పడిపోయారు. ఇక కొత్తగా వచ్చేవారికి బ్యారక్లలో చోటు లేదని జైలు అధికారులు అంటున్నారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ జైళ్లు, మహిళ వసతిగృహాలు కిటకిటలాడుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. రద్దీ గురించి ప్రశ్నించగా ‘అక్కడ ఉండేందుకు చోటులేదని నిందితులను గాలికి వదిలేస్తామా..? మా విధినిర్వహణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నాం. వీటి ని నిలిపివేయడం సాధ్యపడదు’ అని అన్నారు. ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని, లేకుంటే నేరాలు మరింత పెరిగిపోతాయని సింగ్ స్పష్టీకరించారు. ఇదిలా ఉంటే నేరాల నియంత్రణలో భాగంగా ఇక నుంచి పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు ఇంటి నుంచి యూనిఫారాల్లోనే విధులకు బయల్దేరాలని, ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు కూడా యూనిఫారాన్ని వేసుకునే కనిపించాలని సింగ్ ఆదేశించడం తెలిసిందే. ఈ కొత్త ఆదేశాల ఫలితంగా ఇక నుంచి ఎక్కడ చూసినా పోలీసులే దర్శనమిస్తారు. దీంతో చిల్లరదొంగలు, నేరస్తుల్లో దడపుట్టి నేరాలకు పాల్పడేందుకు కొంతమేర జంకుతారని సింగ్ అభిప్రాయపడ్డారు. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం షిర్డీ: గుర్తుతెలియని నలుగురు 32 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిపారని స్థానిక పోలీసులు శుక్రవారం తెలిపారు. అహ్మద్నగర్ జిల్లా కోపర్గావ్ తాలుకాలోని జేవుర్ పటోటా గ్రామంలో గురువారం ఉదయం ఈ దారుణం జరిగింది. సోదరితోపాటు ఉంటున్న ఆమె బయటికి వెళ్లినసమయంలో దుండగులు పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు. మాటల ద్వారా వివరించడం ఆమెకు సాధ్యం కాకపోవడంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. చికిత్స కోసం బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపులు మొదలుపెట్టామని పోలీసులు తెలిపారు. -
ముంబై అత్యాచారం: నలుగురు నిందితులకు 19 వరకు కస్టడీ
ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఈనెల 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ముంబైలోని ఓ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. షిరాజ్ రెహ్మాన్ ఖాన్, విజయ్ జాదవ్, ఖాసిం బెంగాలీ, సలీమ్ అన్సారీలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని మేజిస్ట్రేట్ యూఎం పద్వాడ్ ఆదేశించారు. వాళ్లతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించాలని క్రైం బ్రాంచి కోరడంతో కస్టడీకి పంపారు. అంతకుముందు విధించిన పోలీసు కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ కేసులో మరో మైనర్ నిందితుడిని ఆగస్టు 30న జువెనైల్ కోర్టులో ప్రవేశపెట్టగా అక్కడినుంచి డోంగ్రిలోని జువెనైల్ రిమాండ్ హోంకు పంపారు. అతడిపై నేరం రుజువైతే గరిష్ఠంగా మూడు సంవత్సరాల శిక్ష మాత్రమే పడుతుంది. అదే ఇతర నిందితులకైతే కనీసం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు పడే అవకాశం ఉంది. నిందితులలో ఒకరి సోదరుడు అతడు చదివిన స్కూలు నుంచి టీసీ తీసుకొచ్చి, అతడు 1997 ఫిబ్రవరిలో పుట్టినట్లు నిరూపించడంతో ఆ నిందితుడిని మైనర్గా నిర్ధరించారు. -
ఆస్పత్రిలో ఓ మహిళపై అత్యాచారం
పుణె: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు యథేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో నిర్భయ. ముంబయిలో ఫోటో జర్నలిస్టులపై అత్యాచార ఘటనలు మరువకముందే తాజాగా మరో దారుణం పుణే ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ మహిళపై వార్డు బాయ్, సెక్యూరిటీ కలిసి అత్యాచారానికి ఒడగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ మహిళకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెను వార్డు షిఫ్ట్ చేయాల్సి రావడంతో అప్పటికే కన్నేసిన కామాంధులు అవకాశం ఎదురుచూశారు. ఆమెను వార్డ మార్చే సమయంలో ఇద్దరు యువకులు కలిసి లిఫ్ట్ లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అరవై నిమిషాలకో అతివ ఆహుతి
దేశంలో వరకట్న సంబంధిత కారణాలతో... 2007 నుంచి క్రమంగా పెరుగుతున్న వరకట్న చావులు కట్నం కోరలకు 2012లో 8,233 మంది మహిళలు బలి నేర నిర్ధారణ మాత్రం 32 శాతమే జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల్లో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో నిర్భయ, ముంబైలో ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం వంటి ఘటనలు ఓవైపు సాగుతుండగా, మరోవైపు వరకట్న జ్వాలల్లోనూ అతివలు ఆహుతి అవుతున్నారు. వరకట్న సంబంధిత కారణాలతో దేశంలో ప్రతి గంటకూ ఓ మహిళ బలి అవుతున్నట్టు తాజాగా వెల్లడైంది. 2007, 2011 మధ్య కాలంలో ఈ తరహా మరణాలు క్రమంగా పెరిగినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎస్సీఆర్బీ) గణాంకాలు పేర్కొన్నాయి. 2012లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 8,233 మంది మహిళలు వరకట్న కోరల్లో చిక్కుకుని మృతిచెందినట్టు అవి వెల్లడించాయి. అంటే ప్రతి అరవై నిమిషాలకూ ఓ మహిళ మరణించినట్టు లెక్క. 2011లో ఈ తరహా మరణాలు 8,618 చోటుచేసుకోగా, నేరనిర్ధారణ రేటు 35.8 శాతం మాత్రమే నమోదైంది. 2012లో ఇది 32 శాతానికి తగ్గడం గమనార్హం. వరకట్న సంబంధిత చావులు 2007, 2011 మధ్య కాలంలో క్రమంగా పెరిగాయి. 2007లో 8,093 మరణాలు చోటుచేసుకోగా, 2008లో 8,172, 2009లో 8,383 మరణాలు సంభవించాయి. 2010లో అవి 8,391గా నమోదయ్యాయి. వరకట్న సమస్య అనేది కేవలం పేద లేదా మధ్యతరగతి వర్గాలకే పరిమితం కాలేదని, ఉన్నతస్థాయి కుటుంబాల్లో సైతం ఈ జాడ్యం ఉందని ఢిల్లీ అదనపు డీసీపీ (మహిళలు, శిశు ప్రత్యేక విభాగం) సుమన్ నల్వా పేర్కొన్నారు. ‘‘సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల్లో కూడా వరకట్న దురాచారం కొనసాగుతోంది. ఉన్నత చదువులు చదువుకున్నవారు కూడా కట్నం వద్దని చెప్పడంలేదు. ఈ దురాచారం మన సామాజిక వ్యవస్థలో లోతుగా పాతుకుపోయింది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘వరకట్న నిషేధ చట్టం, 1961 ప్రకారం.. కట్నం అడగడం, ఇవ్వడం, అంగీకరించడం నేరం. కానీ వివాహ సమయంలో కట్నం అనేది తప్పనిసరి బహుమతి కింద పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. వాటిని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. 1983లో వరకట్న చట్టానికి సవరణలు చేసినా, ఆశించిన ఫలితాలు ఇప్పటికీ అందుకోలేకపోయాం’’ అని నల్వా వివరించారు. అయితే, ఇలాంటి కేసుల్లో ప్రాథమిక దర్యాప్తును పోలీసు శాఖ సరిగా చేయడంలేదని, ఫలితంగా న్యాయ ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కామిని జైశ్వాల్ అభిప్రాయపడ్డారు. వరకట్న సంబంధిత కేసులను త్వరితగతిన విచారణ జరిపి దోషులకు శిక్ష విధించాలని పేర్కొన్నారు. -
ముంబై అత్యాచారం: విచారణకు మీడియా కవరేజి వద్దన్నపోలీసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పట్టపగలే ఓ ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును కోర్టులో విచారించే సమయంలో ఆ విచారణ వివరాలను మీడియా కవర్ చేయకుండా చూడాలంటూ కోర్టును ముంబై పోలీసులు కోరారు. ఈ విషయం బాగా సున్నితమైనది కాబట్టి, విచారణ సమయంలో జరిగే వివరాలు మీడియాలో ప్రచారం అయితే ఇబ్బందికరంగా ఉంటుందని, అందువల్ల ఈ విచారణ ప్రక్రియ మీడియాలో కవర్ కాకుండా చూడాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, అలాంటి ఉత్తర్వులేవీ తాను ఇవ్వలేనంటూ అదనపు మేజిస్ట్రేట్ యు. పడ్వాడ్ స్పష్టం చేశారు. కానీ, కోర్టు ఇంత స్పష్టంగా ఈ విషయంలో తన నిర్ణయం వెల్లడించినా, పోలీసులు మాత్రం కోర్టు హాల్లోకి ప్రవేశించకుండా విలేకరులను అడ్డుకున్నారు. ప్రాథమికంగా, కోర్టు ఉత్తర్వులు ఉండటం వల్లే లోనికి రానివ్వడం లేదని పోలీసులు విలేకరులకు చెప్పారు. కానీ తర్వాత అసలు విషయం చెబుతూ, ముంబై క్రైం బ్రాంచి పోలీసులు కోరడం వల్లనే అడ్డుకున్నట్లు తెలిపారు. పోలీసుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన తర్వాత విలేకరులను కోర్టు హాల్లోకి అనుమతించారు. -
ముంబై రేప్ నిందితుల్లో పోలీస్ ఇన్ఫార్మర్!
సాక్షి, ముంబై: నగరంలో ఇటీవల ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పట్టుబడ్డ ఐదుగురు నిందితుల్లో ఒకరు పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ కాసిం షేక్ అలియాస్ కాసిం బెంగాలీ పోలీసులకు ఇన్ఫార్మర్గా ఉన్నాడని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. గత నెల రోజుల్లో స్థానిక అగ్రిపాడ పోలీసుస్టేషన్లోని ఓ కానిస్టేబుల్కు కాసిం ఏకంగా 60 ఫోన్కాల్స్ చేసినట్లు తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అత్యాచారం జరిగిన మర్నాడు కూడా ఆ కానిస్టేబుల్తో అతను ఫోన్లో మాట్లాడినట్లు తెలియవచ్చింది. కాగా, ఫొటో జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పి తన కొడుకు బోరున విలపించాడని ఖాసిం తల్లి చాంద్బీబీ పేర్కొంది. అలా ఎందుకు చేశావని నిలదీస్తే తల దించుకున్నాడని చెప్పింది. రేప్ జరిగిన శక్తి మిల్స్ స్థలాన్ని గుజరాత్, ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. -
మా వాళ్లు కాదు
ముంబై: గత వారం 23 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్పై అత్యాచారం చేసిన నిందితుల్లో కొందరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందినవారని వచ్చిన ఆరోపణలని ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ కొట్టిపారేశారు. తనతో నిందితులు ఉన్నట్టుగా చూపే ఫొటోని ప్రచురించిన హిందీ డైలీ దూపర్ కా సామ్నాతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సామూహిక అత్యాచారం కేసులో నిందితుల ఫొటోలను ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా విడుదల చేయలేదని ఆయన మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ విషయమై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (క్రైమ్) హిమాన్షు రాయ్తో మాట్లాడానని అన్నారు. పత్రికలో ప్రచురించిన ఫొటోలో తనతో ఉన్న వారికి, నిందితుల ముఖాలకు పొంతన కుదరడం లేదని ఆయన చెప్పారన్నారు. ఏమీ చూసుకోకుండానే ఫొటోను సోమవారం సర్క్యూలేట్ చేసిన ఉపాధ్యాయ్పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ‘దూపర్ కా సామ్నా పత్రికలో ప్రచురితమైన ఓ ఫొటోలో ముగ్గురు వ్యక్తుల ముఖాలను సర్కిల్ చేసి వీరు గ్యాంగ్ రేప్ నిందితులని పేర్కొంది. వారు సచిన్ అహీర్తో కరచాలనం చేస్తున్నట్టుగా ఉంది. 2010 సంవత్సరంలో ఓ ఈద్ కార్యక్రమంలో ఈ ఫొటో తీసినట్టు సేన పబ్లికేషన్ పేర్కొంది. ఈ సంస్థపై కూడా పరువు నష్టం దావా వేస్తాన’ని తెలిపారు. కొంత మంది రేపిస్టులు తనకు దగ్గరివాళ్లని, తన పార్టీ నిరాధారమైందని చేసిన ఆరోపణలను ఖండించారు. నిరాధారమైన కథనంతో వారి మానసిక స్థాయి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ఇంతటి హేయమైన చర్యకు బీజేపీ చేస్తుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. కొంత మంది బీజేపీ నాయకుల వ్యక్తిగత సహాయకులు పార్టీని నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ్ వల్ల ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చిందన్నారు. అయితే పార్టీ నాయకులతో మాట్లాడి ఉపాధ్యాయ్పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ అన్నారు. కఠిన చట్టాలు తీసుకురావాలి: నటి కాజోల్ ముంబై: అత్యాచారాలు చేసే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాల్లో మార్పులు తీసుకరావాలని బాలీవుడ్ నటి కాజోల్ మంగళవారం డిమాండ్ చేశారు. ‘మహిళా ఫోటో జర్నలిస్ట్పై జరిగిన అత్యాచారాన్ని చెప్పేందుకు ఎలాంటి మాటలు రావడం లేదు. అదో భయంకర సంఘటన. ఇది హత్య కన్నా ఏ మాత్రం తక్కువ కాద’ని అన్నారు. దీని గురించి మనం ఎంతో కొంత చేయాల్సి అవసరముందని చెప్పారు. కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రజల్లో భయం కలిగించే రీతిలో శిక్షలో మార్పు తీసుకరావాలి. ఆ మేరకు చట్టాలకు రూపకల్పన చేయాలి. దీనిని సర్కార్ను పట్టించుకోనంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయ’ని ఆమె చెప్పారు. -
నిందితులను పట్టించిన సెల్ఫోన్లు
సాక్షి, ముంబై: నగరంలోని శక్తిమిల్లు ప్రాంగణంలో మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను సెల్ఫోన్ల ఆధారంగానే పోలీసులు పట్టుకోగలిగారు. అత్యాచారం తర్వాత ఐదుగురు నిందితులూ సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. ప్రధాన నిందితుడైన మహమ్మద్ కాసిం హఫీజ్ షేక్ అలియాస్ కాసిం బెంగాలీ మరీన్ లైన్స్ పరిసరాలకు వెళ్లాడు. అప్పటికే అత్యాచారం సంఘటనపై వార్త దావానలంగా వ్యాపించిన విషయాన్ని తెలుసుకుని, అప్రమత్తమయ్యాడు. తన సెల్ఫోన్ను స్విచాఫ్ చేసి రెండురోజులు దాక్కున్నాడు. రెండు రోజుల తర్వాత అతడు సెల్ఫోన్ను ఆన్ చేయడంతో సిగ్నల్స్ ద్వారా పోలీసులు అతడు ఇంకా నాగ్పాడా ప్రాంతంలోనే ఉన్న విషయాన్ని గుర్తించగలిగారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడకు చేరుకునే లోగానే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని వెంటాడిన పోలీసులు ఆదివారం అతడిని పట్టుకోగలిగారు. జైభవానీనగర్ మురికివాడలో నివసించే మరో నిందితుడు చాంద్బాబు సత్తార్ షేక్ను సంఘటన జరిగిన 8 గంటల్లోనే పోలీసులు పట్టుకోగలిగారు. ఈ విషయం తెలియగానే అతడి సహచరుడు సలీం అన్సారీ గోవండిలోని మిత్రుని వద్దకు పారిపోయాడు. అతడి వద్ద కొంత డబ్బు తీసుకుని, కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి రైల్లో ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీకి చేరుకున్నాక అతడు తన మిత్రుడికి ఫోన్ చేయడంతో సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఢిల్లీకి వెళ్లి అతడిని పట్టుకున్నారు. అతడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు అతడిని సెప్టెంబర్ 5 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇదిలాఉండగా, జరిగిన ఘాతుకాన్ని చిత్రించిన మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఫొటో మాత్రమే తీసినట్లు నిందితులు చెబుతున్నారని, అది కూడా మొబైల్లో ప్రస్తుతం లేదని, ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నామని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇప్పటికే ముంబై చేరుకుందని, గుజరాత్ ఫోరెన్సిక్ నిపుణులు త్వరలోనే రానున్నారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్నామన్నారు. నిందితుల్లో ముగ్గురు పాత నేరస్తులేనని చెప్పారు. చాంద్బాబు సత్తార్ షేక్, విజయ్ జాధవ్, మహమ్మద్ కాసింలపై చోరీ, దోపిడీ తదితర పలు కేసులు ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా, బాధితురాలు మెల్లగా కోలుకుంటోందని, మానసిక వైద్యనిపుణులు ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని జస్లోక్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ తరంగ్ జ్ఞాన్చందానీ చెప్పారు. దేశ ప్రజలకు బాధితురాలి కుటుంబం కృతజ్ఞతలు అత్యాచారం సంఘటన తర్వాత తమ కుమార్తెకు అండగా నిలిచిన మహారాష్ట్ర వాసులతో పాటు దేశప్రజలందరికీ, మీడియాకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మీడియాకు లేఖ రాశారు. అందరి అండ లభించడంతో తాము ధైర్యంగా ఉండగలుగుతున్నామన్నారు. -
అత్యాచారాల నగరం!
సాక్షి, ముంబై: శక్తి మిల్లు కాంపౌండ్లో ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన అత్యాచార సంఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. నగరంలో ప్రతిరోజూ సరాసరి మూడు అత్యాచార సంఘటనలు జరుగుతున్నట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కాలంలో ఏకంగా 1,839 మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు. నగరం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన అత్యచారం, వేధింపుల కేసుల్లో అత్యధిక శాతం నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నిందితులకు శిక్షపడకుండా ఉన్న కేసుల విషయంలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. లైంగిక వేధింపుల కేసుల్లో 84 శాతం మంది నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిం చిన వివరాల ద్వారా బయటపడింది. కేవలం 16 శాతం మంది నిందితులకే శిక్ష పడిందని వివరాల ద్వారా తెలిసింది. వివరాలిలా ఉన్నాయి... ఈ ఏడు ముంబైలో జూన్ వరకు అత్యాచార సంఘటనలు 202, అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనలు 553, ఈవ్టీజింగ్ కేసులు 277, అదనపు వరకట్న హత్యలు ఏడు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ముంబైలో సామూహిక అత్యాచారాలు 232, అసభ్యకరంగా ప్రవర్తించడంపై 614, ఈవ్టీజింగ్ 235, అదనపు వరకట్నం వేధింపుల కేసులు 11 నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అదేవిధంగా 2012లో మహారాష్ట్రలో అత్యాచారం కేసులు 1,845, అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై 3,935 కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ ఏడు జూన్ వరకు రాష్ర్టంలో అత్యాచారం కేసులు 1,542, అసభ్యకరంగా ప్రవర్తించినవారిపై 3,835 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు కేసులు రెట్టింపు నమోదైనట్లు స్పషమవుతోంది. కాగా సామూహిక అత్యాచార సంఘటనలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. -
ముంబై అత్యాచారం: వీలైనంత త్వరగా న్యాయం చేస్తామన్న కమిషనర్
ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో వీలైనంత త్వరగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. సాక్ష్యాలు సేకరించి, వీలైనంత త్వరగా చార్జిషీటు దాఖలు చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన విలేకరులతో అన్నారు. చివరి ఇద్దరు నిందితులను కూడా ఆదివారమే అరెస్టు చేయడంతో, ఇప్పుడు మొత్తం నిందితులంతా పోలీసుల అదుపులోనే ఉన్నట్లయింది. తాము ఇప్పటికే సేకరించిన సాక్ష్యాలను ఫోరెన్సిక్ నిపుణులకు అందిస్తామని సత్యపాల్ సింగ్ చెప్పారు. నిందితులు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేయగా అది లభ్యమైందని, బాధితురాలి ఫోన్ను నిందితులు అమ్మేయగా, దాన్ని కూడా తాము స్వాధీనం చేసుకున్నామని సింగ్ చెప్పారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిపై ఇప్పటికే హిస్టరీ షీట్లు ఉన్నాయన్నారు. నిందితుల్లో ఏ ఒక్కరూ మైనర్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకరు మైనర్ అని అతడి తల్లిదండ్రులు వాదిస్తున్నా, అతడు 2011లోనే ఓ కేసులో అరెస్టయ్యాడని చెప్పారు. కేవలం 18 ఏళ్లకు పైన ఉన్నవారినే ప్రశ్నిస్తారన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, అతడి వయసును మరోసారి నిర్ధారించుకోడానికి అవసరమైతే ఎముకల పరీక్ష చేయించే అవకాశం కూడా లేకపోలేదన్నారు. అత్యాచార సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉంది. ఆదివారం నాడు ఆమె కుటుంబ సభ్యులు ఆమె వివరాలు బయటకు వెల్లడించొద్దంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు. ముంబై ఉగ్రదాడి కేసులో అజ్మల్ కసబ్కు ఉరిశిక్ష పడేలా సమర్థంగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్కే ఈ కేసు కూడా అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వారికి తెలిపాయి. -
ముంబై రేప్ కేసులో మరో ఇద్దరు అరెస్టు
ముంబై: ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై మూడు రోజుల కిందట సామూహిక అత్యాచారానికి తెగబడ్డ మొత్తం ఐదుగురు నిందితులనూ పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ ముంబైలోని అగ్రిపడా ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాసిం హఫీజ్ షేక్ అలియాస్ కాసిం బెంగాలీని ఆదివారం వేకువ జామున 4.15 గంటలకు ముంబై సెంట్రల్ స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. అతడి సహచరుడు సిరాజ్ రెహమాన్ ఖాన్ను శనివారం రాత్రే అరెస్టు చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిని ఈనెల 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇంకో నిందితుడు సలీం అన్సారీని ముంబై క్రైమ్బ్రాంచ్ బృందం ఆదివారం వాయవ్య ఢిల్లీలోని భరత్నగర్ ప్రాంతంలో అరెస్టు చేసింది. అతడిని ముంబై తీసుకురానున్న పోలీసులు, సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచే అవకాశాలు ఉన్నాయి. అన్సారీపై సమాచారంతో ఢిల్లీ చేరుకున్న పోలీసులు, తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా అతడు ఉండే ప్రాంతం గురించి భరత్నగర్ పోలీసులను కనుక్కున్నారు. అన్సారీ ఢిల్లీలోని బంధువుల ఇంటికి వెళుతుండగా, ముంబై క్రైమ్బ్రాంచ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తర్వాత అతడికి బాబూ జగ్జీవన్ రామ్ స్మారక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు ఇదివరకే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తొలుత అరెస్టయిన విజయ్ జాదవ్, చాంద్బాబు, సత్తార్ షేక్లను శనివారం కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిని ఈనెల 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మొబైల్ ఫోన్తో ఘాతుకం చిత్రీకరణ... ముంబైలోని శక్తి మిల్స్ ప్రాంగణంలో విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీస్తున్న మహిళా ఫొటో జర్నలిస్టుపై ఈనెల 22న అత్యాచారానికి తెగబడ్డ నిందితులు, తమ కీచకాన్ని మొబైల్ ఫోన్లోని కెమెరాలో చిత్రించారు. ఆమెతో వచ్చిన సహోద్యోగిపై దాడిచేసి, అతడిని కట్టి పడేసిన నిందితులు, మహిళా జర్నలిస్టు మెడపై పగిలిన బీరుసీసా పెట్టి, బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు కోర్టుకు తెలిపారు. జరిగిన ఘటనను ఎవరికైనా చెబితే, మొబైల్లో చిత్రించిన ఫొటోలను బయటపెడతామని బాధితురాలిని బెదిరించినట్లు చెప్పారు. ఈ కేసులో కీలక నిందితుడు కాసిం బెంగాలీ మొబైల్ ఫోన్ను ఎక్కడ దాచిందీ చెప్పడం లేదని, అతడు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయాన్ని కాసిం అంగీకరించాడని చెప్పారు. ఆమెను బెదిరించేందుకు ఉపయోగించిన పగిలిన బీరుసీసాను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై పోలీసులు అత్యాచారం(376-డీ), అక్రమ నిర్బంధం (342), బెదిరించడం(506-2), ఉమ్మడి ఉద్దేశం(34) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ తరఫున వాదించేందుకు ఎవరైనా న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారా అని మేజి స్ట్రేట్ నిందితులు కాసిం, సిరాజ్ ఖాన్లను ప్రశ్నించగా, లేదని వారు బదులిచ్చారు. నిందితుల గుర్తింపు పరేడ్ను ఇంకా నిర్వహించనందున వారిని కస్టడీకి అప్పగించాలని పోలీసులు అభ్యర్థించడంతో, ఈనెల 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఐఫోన్, కెమెరా ఇచ్చేస్తామన్నా వదలని నిందితులు...: శక్తి మిల్స్ వద్ద ఫొటోలు తీసే పని ముగించుకుని మహిళా ఫొటో జర్నలిస్టు, ఆమె సహోద్యోగి అక్కడి నుంచి తిరుగుముఖం పడుతుండగా, తొలుత ముగ్గురు నిందితులు వారిని అటకాయించారు. మరో ఇద్దరికి ఫోన్చేసి, అక్కడకు పిలిపించారు. తమను విడిచిపెడితే, తమ వద్దనున్న ఐఫోన్, ఖరీదైన కెమెరా ఇచ్చేస్తామని చెప్పినా, వారు బాధితులను వదల్లేదని పోలీసులు తెలిపారు. తమ కీచకం ముగిశాక బాధితులిద్దరినీ నిందితులు సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద విడిచిపెట్టారన్నారు. విడిచిపెట్టే ముందు బాధితురాలి చేతే సంఘటనా స్థలాన్ని శుభ్రం చేయించారు. రైల్వేస్టేషన్ వద్ద నుంచి బాధితురాలు తన బాస్కు ఫోన్చేసి, జరిగిన విషయాన్ని చెప్పింది. అక్కడి నుంచి దాదాపు 800 మీటర్లు నడిచి వెళ్లాక, క్యాబ్ దొరకడంతో, బాధితులిద్దరూ జస్లోక్ ఆస్పత్రికి వెళ్లారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉజ్వల్ నికమ్ ముంబైలో మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన గ్యాంగ్రేప్ కేసును వాదించేందుకు ప్రముఖ క్రిమినల్ లాయర్ ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆదివారం పుణేలో తెలిపారు. బాధితురాలికి సత్వర న్యాయం చేకూర్చేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసుపై విచారణ జరిపించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఈ కేసును వాదించాలని ముఖ్యమంత్రి చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ తనను కోరారని, తాను అందుకు అంగీకరించానని నికమ్ తెలిపారు. కాగా, ఉజ్వల్ నికమ్ ఇదివరకు 1993 నాటి ముంబై పేలుళ్లు, 2006లో ఖైర్లాంజీ దళితుల ఊచకోత, 2008 నవంబర్ 26 నాటి ముంబై ఉగ్రవాద దాడులు వంటి కీలకమైన కేసులను కూడా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వాదించారు. -
మరో ఇద్దరు మృగాళ్ల అరెస్ట్
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా ఫొటో జర్నలిస్ట్పై గ్యాంగ్రేప్ కేసులో పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని దక్షిణ ముంబైలోని మదన్పురా ప్రాంతంలో శనివారం వేకువజామున పట్టుకున్నారు. నిందితుడి పేరు విజయ్ జాదవ్(22) అని, విచారణలో ఇతడు నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు సిరాజ్ రెహ్మాన్(25)ను ముంబ్రా పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. త్వరలోనే మిగతా ఇద్దరు నిందితులను పట్టుకుంటామని ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్సింగ్ చెప్పారు. ‘‘పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మిగతావారి వివరాలు కూడా తెలిశాయి. వీరు ముంబైకి కొద్దిదూరంలోనే ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం’’ అని ఆయన చెప్పారు. ముంబైలోని శక్తిమిల్లు కాంపౌండ్లో ఐదుగురు వ్యక్తులు మహిళా ఫొటో జర్నలిస్ట్పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. వీరిలో చంద్బాబు సత్తార్ షేక్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ (19)ను పోలీసులు శుక్రవారమే అరెస్టు చేయగా, శనివారం మరో ఇద్దరు దొరికారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం పోలీసులు 20 బృందాలతో వేట కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితులకు 30 వరకు పోలీసు కస్టడీ రేప్ కేసు నిందితులు మహమ్మద్ అబ్దుల్, విజయ్ జాదవ్లను పోలీసులు శనివారం దాదర్లోని బోయివాడా కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ముందు వీరిద్దరూ నేరాన్ని అంగీకరించారు. కోర్టు నిందితులిద్దరికీ ఈ నెల 30 వరకు పోలీసు కస్టడీ విధించింది. విచారణ సందర్భంగా నేరాన్ని ఒప్పుకున్న మహమ్మద్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తంచేయలేదు. న్యాయమూర్తి ముందు కూడా ఆవలింతలు తీస్తూ నిర్లక్ష్యంగా కనిపించాడు. కోలుకుంటున్న బాధితురాలు సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు జస్లోక్ ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటోంది. శుక్రవారంతోపోలిస్తే ఆమె కాస్త కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ తరంగ్ జ్ఞాన్చందానీ తెలిపారు. ‘మా వాడు మైనర్’ ఈ కేసులోఅరెస్టయిన మొదటి నిందితుడు మహమ్మద్ అబ్దుల్ మైనర్ అని అతడి బంధువులు పేర్కొన్నారు. మహమ్మద్ 1997, ఫిబ్రవరి 26న జన్మించినట్లు పేర్కొంటూ అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను అతడి అమ్మమ్మ సర్ణబాయ్ శనివారం పోలీసులకు అందించింది. అయితే పోలీసులు ఆమె వాదనను కొట్టిపడేస్తున్నారు. నిందితుడిని రక్షించేందుకే వారు ఈ ప్రయత్నం చేస్తున్నారని, మహమ్మద్కు 19 ఏళ్లు ఉన్నాయని చెబుతున్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిందే.. మహిళా ఫొటో జర్నలిస్ట్పై అఘాయిత్యానికి పాల్పడిన కీచకులకు కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివారికి ఉరిశిక్షే సరైందని, అప్పుడే ఇలాంటి నేరాలు ఆగుతాయని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. లోక్సభ ఆందోళన న్యూఢిల్లీ: ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్రేప్పై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న విమర్శల వేడి శనివారం లోక్సభను తాకింది. కఠిన చట్టాలను రూపొందిస్తున్నా ఇలాంటి సంఘటనలు కొనసాగుతుండటంపై వివిధ పార్టీల సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. జీరో అవర్ సందర్భంగా బీజేపీ సభ్యుడు గోపీనాథ్ ముండే మాట్లాడుతూ.. ముంబై గ్యాంగ్రేప్ ఘటన నేపథ్యంలో మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక కోరాలని, సభలో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ జయప్రద మాట్లాడుతూ.. నిర్భయ ఘటన తర్వాత ఎంపీలందరూ ఏకమై క్రిమినల్ లాను సవరించి చట్టం తెచ్చారని, అయినా మహిళలపై నేరాలు కొనసాగుతున్నాయంటూ విచారం వ్యక్తంచేశారు. జీవితం ముగిసినట్లు కాదు: బాధితురాలు ‘‘అత్యాచారం జరిగినంత మాత్రాన జీవితం అంతమైనట్లు కాదు. దోషులందరికీ అత్యంత కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నా. అలాగే వీలైనంత వెంటనే తిరిగి డ్యూటీలో చేరాలని ఉంది’’. ఇదీ ముంబైలో సామూహిక అత్యాచారానికి గురైన మహిళా ఫొటో జర్నలిస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఘటనపై ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలకు ఇచ్చిన సందేశం. తనను పరామర్శించేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సామంత్ ప్రభావాల్కర్తో ఆమె ఈ మాటలు అన్నారు. బీరు బాటిల్తో బెదిరించి... మహిళా ఫొటో జర్నలిస్టుపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. పగిలిన బీరు బాటిల్ చేతిలో పట్టుకొని చంపుతామంటూ బెదిరించి పశువుల్లా ప్రవర్తించినట్లు తెలిసింది. పోలీసులు, ఆమె సహోద్యోగి అందించిన వివరాల ప్రకారం.. తాము పని చేస్తున్న ఇంగ్లిష్ మేగజైన్కు ముంబైలో మిల్లుల పరిస్థితిపై కథనం ఇచ్చేందుకు వారు నిర్మానుష్య ప్రాంతంలోని శక్తిమిల్ వద్దకు వెళ్లారు. ఫొటోలు తీస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి ఇక్కడ ఫొటోలు తీయరాదని చెప్పి వెళ్లారు. కాసేపటికి మరో వ్యక్తితో మొత్తం ముగ్గురు వచ్చి వారిని బెదిరించారు. సహచరుడి చేతులను బెల్టుతో కట్టివేసి చెట్లు, నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ మరో ఇద్దరు తోడయ్యారు. తర్వాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో తల్లి నుంచి ఆమెకు ఫోనొచ్చింది. క్షేమంగానే ఉన్నానని చెప్పాలని, లేదంటే బీరు బాటిల్తో చంపేస్తామని బెదిరించారు. ఆమె భయపడుతూ అలాగే చెప్పి ఫోన్ పెట్టేసింది. అనుమానం వచ్చిన తల్లి మరోసారి ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయొద్దని బెదిరించారు. పాశవికంగా ప్రవర్తించిన తర్వాత ఆ కామాంధులు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమోనన్న అనుమానంతో యువతితోపాటు ఆమె సహచరుడిని సమీపంలోని రైల్వేస్టేషన్ దాకా అనుసరించారు. అసాంఘిక శక్తుల అడ్డా శక్తి మిల్స్ ముంబైలోని మహాలక్ష్మీ ప్రాంతంలో ఉన్న డాక్టర్ ఇ. మోజెస్ రోడ్డులో శక్తిమిల్స్ సుమారు 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. వందేళ్ల క్రితం నాటి ఈ మిల్లు ప్రైవేటు వ్యక్తులది. దీన్ని 30 ఏళ్ల కిందట మూసేశారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ముళ్ల పొదలు, చెట్లతో విస్తరించి చిట్టడవిలా మారింది. పగటిపూట నిర్మానుష్యంగా ఉండే ఈ మిల్లు ప్రాంతం సాయంత్రం కాగానే అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతుంది. మత్తు పదార్థాలకు బానిసలైనవారు, మందుబాబులు ఇక్కడకు చేరుకొని రాత్రంతా నానా హంగామా సృష్టిస్తుంటారు. అందుకే ఈ మిల్లు పరిసర ప్రాంతాల్లో నివసించే స్థానికులు అటువైపు వెళ్లాలంటేనే జంకుతుంటారు. కాగా, మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని ఆమె సహచర ఉద్యోగి పోలీసులకు శనివారం చూపించాడు. ఘటన జరిగిన తీరును వారికి వివరించాడు. ‘ఒళ్లు జలదరిస్తోంది’ ‘‘నేను శక్తి మిల్స్ ఫొటోలను ఎన్నోసార్లు తీశాను. నేను ఫొటో స్టోరీ చేసేందుకు వెళ్లేటప్పుడు బ్యాగులో మిరియాల స్ప్రే వెంట తీసుకెళ్లేదాన్ని. అయితే దాని అవసరం రాకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు ఆకతాయిలను కొట్టేందుకు నా కెమెరాను ఉపయోగించా. ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్రేప్ జరిగిందని తెలియడంతో నోటమాటరాలేదు. నా ఒళ్లంతా భయంతో జలదరించింది. కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవడం, నిరంతరం అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇటువంటి దాడుల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని భావిస్తున్నా’’ - శ్రద్ధా భార్గవ చతుర్వేది (ముంబైలో ఓ మ్యాగజైన్కు పనిచేసే ఫొటోజర్నలిస్టు) -
దుమారం రేపిన రాజ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ఠాక్రే ఉత్తరాదినుంచి ముంబైకి వలస వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వలసవచ్చే వారి ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం వంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పలు పార్టీలు తప్పుబట్టాయి. ఈ విషయమై కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘ స్వలబ్ధికోసం రాజ్ఠాక్రే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. మీరు ఇలా ఎలా అంటారు.ముంబై పోలీసులు ఒక నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితులను సైతం పట్టుకునే అవకాశముంది’ అని అన్నారు. సమంజసం కాదు: నిరుపం అదే పార్టీకి చెందిన మరో నాయకుడు సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ఠాక్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ముంబై నగరంలో ఇటువంటి సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎవరి హృదయాలను గాయపరచకూడదు. కొందరు నేరగాళ్ల దురాగతాల కారణంగా మొత్తం సమాజంపై నిందలు మోపలేం’ అని అన్నారు. -
కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..
న్యూఢిల్లీ: ముంబైలో 23 ఏళ్ల ఫొటో జర్నలిస్ట్పై సామూహిక అత్యాచార ఘటనను దేశం యావత్తూ ముక్త కంఠంతో ఖండించింది. దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపాయి. పార్టీలకతీతంగా నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు గ్యాంగ్రేప్ను ఖండించారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటన అని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు నిర్భయ చట్టాన్ని వర్తింపచేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ముంబైలో ఈ ఘటన జరిగిందని బీజేపీ ఆరోపించింది. శిక్ష పడుతుందనే భయం లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. ఈ తరహా ఘటనలపై కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సీపీఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మాట్లాడుతూ.. మహిళలపై ఈ తరహా దాడులను తీవ్రంగా పరిగణిస్తామని, దేశంలో మహిళలు, చిన్నారులను అభద్రతాభావంలో వదలలేమని చెప్పారు. రాజ్యసభలో దుమారం..: ముంబై సామూహిక అత్యాచార ఘటనపై రాజ్యసభ అట్టుడికింది. జీరో అవర్లో ఈ అంశాన్ని సభ్యులు లేవనెత్తారు. మహిళలపై లైంగిక దాడులు పెరగడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్-బీజేపీ ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని, ముంబై ఘటనను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. దీంతో హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ స్పందిస్తూ.. ఇది విషాదకరమైన ఘటన అని, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్టు తెలిపారు. తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధ్యులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించినట్టు వెల్లడించారు. పాటిల్ రాజీనామా చేయాలి: రాజ్ థాకరే ముంబై: మహారాష్ట్ర హోంమంత్రిగా ఆర్ఆర్ పాటిల్ విఫలమయ్యారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే డిమాండ్ చేశారు. హోంశాఖను నడిపించే సామర్థ్యం పాటిల్కు లేదని, అందువల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించిపోయాయని ఆరోపించారు. బీజేపీ మహారాష్ట్ర శాఖ కూడా పాటిల్ రాజీనామాకు డిమాండ్ చేసింది. హోంశాఖపై ఆయనకు ఏవిధమైన పట్టు లేదని వ్యాఖ్యానించింది. అయితే పాటిల్ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం తగదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ చెప్పారు. సామూహిక అత్యాచార ఘటన ముంబైకి, మానవత్వానికి సిగ్గుచేటని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈ ఘటన ముంబైకి చాలా అవమానమని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. కాగా, జర్నలిస్టులతో పాటు వేలాది మంది ప్రజలు ముంబైలో మౌన నిరసన తెలిపారు. -
ఫోటో జర్నలిస్టుపై గ్యాంగ్రేప్
సాక్షి, ముంబై: దేశం మొత్తాన్నీ కుదిపేసిన ‘నిర్భయ’పై అత్యాచార ఘటన ఇప్పటికీ ప్రజల మది నుంచి తొలగకముందే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున మరో దారుణం చోటుచేసుకుంది. నాడు నిర్భయ తరఫున జరిగిన పోరాటంలో మీడియా తన వంతు పాత్ర పోషిస్తే.. ఈసారి ఏకంగా మీడియా ప్రతినిధిపైనే సామూహిక అత్యాచారం జరిగింది. ముంబైలో ఓ ఇంగ్లిష్ మేగజైన్కు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు గురువారం సాయంత్రం ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మహాలక్ష్మి, లోయర్పరెల్ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న శక్తిమిల్లు కాంపౌండ్లో జరిగిన ఈ సంఘటన ముంబైతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. నిర్భయ ఘటన తర్వాత అత్యాచార కేసులను చాలా సీరియస్గా తీసుకుంటున్న పోలీసులు.. నిందితులను పట్టుకోవడానికి ఒకేసారి 20 బృందాలను రంగంలోకి దించారు. అనేక మందిని విచారించిన మీదట ఓ నిందితుడిని పట్టుకోగలిగారు. అతడి ద్వారా మిగతా నిందితుల వివరాలు తెలుసుకున్నారు. కల్పిత కథతో బెదిరించి.. 22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్ను కల్పిత కథతో బెదిరించి నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ అందించిన వివరాల మేరకు.. తన సహచరునితో విధి నిర్వహణలో భాగంగా గురువారం శక్తి మిల్లు పరిసరాల్లో ఫొటోలు తీసుకునేందుకు ఈ మహిళా జర్నలిస్టు వెళ్లింది. శిథిలావస్థకు చెందిన ప్రాంతం కావడంతో సాధారణంగా అక్కడ ఎవరూ లేరు. దీంతో వీరు తమ పనిలో భాగంగా ఫొటోలు తీసుకుంటుండగా అక్కడకొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ‘మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు’ అంటూ నిలదీశారు. పది రోజుల కిందట ఇక్కడ ఒక హత్య జరిగిందని, అది మీరే చేశారంటూ బెదిరించారు. ఆమె సహచరుడిని చూపిస్తూ.. ఇతనే హంతకుడంటూ మిగతా నిందితులకు ఫోన్ చేసి పిలిచారు. హత్య చేసిన వ్యక్తిలాగానే ఉన్నాడంటూ మిగతా వారు కూడా ఆరోపిస్తూ.. మహిళా ఫొటో జర్నలిస్ట్ సహచరుడిని బెల్ట్తో కట్టివేశారు. అనంతరం మిమ్మల్ని వేర్వేరుగా విచారించాలంటూ మహిళా జర్నలిస్ట్ను సుమారు 20 అడుగుల దూరం.. సహచరునికి కనబడకుండా తీసుకువెళ్లారు. అక్కడ వంతులవారీగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం సాయంత్రంసుమారు 6.30 గంటల ప్రాంతంలో జరిగింది. గ్యాంగ్ రేప్నకు గురవడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెకు మెలకువ వచ్చిన అనంతరం తన సహచరుడి కట్లు విప్పింది. ఇద్దరూ కలిసి 4 కిలోమీటర్ల దూరంలోని జస్లోక్ ఆసుపత్రికి రాత్రి 8 గంటల సమయంలో వచ్చారు. ఆమె రేప్కి గురైనట్లు గుర్తించిన వైద్యులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ప్రస్తుతం బాధితురాలు అక్కడే చికిత్స పొందుతోంది. ఊహాచిత్రాల ఆధారంగా ఒకరి అరెస్టు.. ఈ కేసులో ఊహాచిత్రాల ఆధారంగా ఐదుగురు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. నిందితుడు తన పేరు చాంద్బాబు సత్తార్ షేక్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ (19) అని చెప్పాడన్నారు. ఇతడు నిరుద్యోగి అని, తన సహచరుల పేర్లు విజయ్ జాధవ్, ఖాసిం బెంగాలీ, సలీమ్, అష్ఫాక్ అని చెప్పాడన్నారు. బాధితురాలైన జర్నలిస్టు ముంబై శివారు ప్రాంతానికి చెందినదని తెలిపారు. ‘అత్యాచారానికి గురైన ఫొటో జర్నలిస్ట్ ప్రస్తుతం నగరంలోని జెస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె, ఆమె సహచరుడు చెప్పిన ఆధారాల మేరకు ఊహాచిత్రాలను గీయించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిందితులందరూ సుమారు 20 నుంచి 22 ఏళ్ల వయసున్నవారే. అయితే కేసు దర్యాప్తు దృష్ట్యా నిందితుల పేర్లను వెల్లడించడంలేదు’ అని సత్యపాల్సింగ్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే ఆస్తుల సెటిల్మెంట్ కేసుల్లో రౌడీ షీటర్లుగా ఉన్నారని వివరించారు. స్థిరంగా ఉన్న బాధితురాలి ఆరోగ్యం.. అత్యాచారం సంఘటన కారణంగా ఆమె అవయవాలకు అంతర్గతంగా గాయాలు కావడంతోపాటు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్టు డాక్టర్లు చెప్పారు. జెస్లోక్లో ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరగుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని అయితే పూర్తిగా అన్ని వివరాలు తెలిపేందుకు ఇంకా రెండు మూడు రోజులు పట్టవచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు. నివేదిక కోరిన కేంద్రం గ్యాంగ్రేప్ మీద తక్షణమే నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ముంబై పోలీసులను కోరింది. ‘‘ ముంబై పోలీసు కమిషనర్తో నేను మాట్లాడాను. దరాప్తు వేగంగా జరుగుతోంది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరాం’’ అని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూడాలని కోరామన్నారు. మరోవైపు ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఏకసభ్య విచారణ కమిటీని నియమించింది. పీసీఐ సభ్యుడు రాజీవ్ సబాదే ఈ విచారణ చేపడతారని పీసీఐ చైర్పర్సన్ జస్టిస్ మార్కాండేయ కట్జూ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘నిందితులందరి వివరాలూ మా దగ్గర ఉన్నాయి. వారందరిపై త్వరలోనే చార్జిషీటు వేసేలా చూస్తాం. కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపడతాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తాం’’ అని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధి బృందంతో అన్నారు. 20 బృందాలతో దర్యాప్తు అత్యాచారం సంఘటనకు సంబంధించి 20 బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్సింగ్ తెలిపారు. వీటిలో 10 క్రైమ్ బ్రాంచి బృందాలు ఉన్నాయని, మిగతావి స్థానిక పోలీసులవని చెప్పారు. బాధితురాలు, ఆమె సహచరుడు అందించిన వివరాల మేరకు గురువారం రాత్రి ఊహచిత్రాలను గీయించామని, వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. నిందితులందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. బాధితురాలికి న్యాయం చేయడంతోపాటు నిందితులకు కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిపించాలని కోరనున్నట్టు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి అన్ని రకాల ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామన్నారు. నిందితులపై 341, 376బి, 341 తదితర సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 376బి సెక్షన్ ద్వారా కనీసం 20 ఏళ్లు లేదా జీవిత ఖైదు శిక్ష పడేందుకు అవకాశాలున్నాయన్నారు. -
'హోంమంత్రి పాటిల్ రాజీనామాకు ఇది సమయం కాదు'
ముంబై: ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో హోంమంత్రి పాటిల్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పందించారు. పాటిల్ రాజీనామా కోరేందుకు ఇది సమయం కాదన్నారు. విస్తీర్ణంలోనూ, జనాభాపరంగానూ మహారాష్ట్ర పెద్ద రాష్ట్రమని, ఇలాంటి రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పారు. పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడి, తప్పించుకు తిరుగుతున్నవారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అత్యాచార బాధితురాలి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళ ఫోటో జర్నలిస్ట్ పై సామూహిక అత్యాచార ఘటన దేశవాణిజ్య రాజధాని ముంబైలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రేప్ ఉదంతం చోటు చేసుకున్న అనంతంర నిందితుల కోసం పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఐదుగురి నిందితుల ఊహ చిత్రాలను ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ఆ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురు నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వారు నిందితుల కోసం జల్లెడ పడుతున్నారని, అలాగే ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కు అప్పగించినట్లు పోలీసు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని చెప్పారు. వారిలో నలుగురు తమ అదుపులోనే ఉన్నారని చెప్పారు. -
ముంబై గ్యాంగ్రేప్: ఏపీ ఫొటో జర్నలిస్టుల నిరసన
విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తి మిల్స్ ఆవరణలో సామూహిక అత్యచారం జరగడాన్ని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులకు.. అందునా ముఖ్యంగా మహిళా పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనని ఏపీపీజేఏ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఫొటో జర్నలిస్టులతో పాటు పలువురు పాత్రికేయులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, మరోవైపు ముంబైలో ఫొటో జర్నలిస్టుల సంఘాలు మౌన నిరసన తెలిపాయి. మహారాష్ట్ర వ్యాప్తంగాను, ముంబై మహానగరంలోను శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ క్షీణిస్తోందని ఈ సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్లను కలిసి పాత్రికేయులకు రక్షణ కల్పించాలని వినతిపత్రం సమర్పించాయి. -
ముంబై అత్యాచారాన్ని ముక్తకంఠంతో ఖండించిన పార్టీలు
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముంబైలో పాత్రికేయురాలిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ముక్త కంఠంతో ఖండించారు. ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చెప్పగా, దీన్ని ఏమాత్రం సహించలేని సంఘటనగా బీజేపీ అభివర్ణించింది. ''ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. దుండగుల చేతుల్లో మన మహిళలు, పిల్లలు అభద్రతతో కొట్టుమిట్టాడటాన్ని మన దేశం ఏమాత్రం సహించలేదు'' అని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ పార్లమెంటు వెలుపల చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. ఢిల్లీలో డిసెంబర్ 23న సామూహిక అత్యాచారం జరిగినప్పుడు నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టారని, కనీసం ఇప్పటికైనా దాన్ని అమలుచేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. కాగా, ఈ సంఘటనపై మహారాష్ట్ర సర్కారు సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అత్యాచార ఘటన ఏమాత్రం భరించలేనిదని, ఫొటో జర్నలిస్టు విధి నిర్వహణ కోసం వెళ్లినా ఆమెకు భద్రత లేకపోతే ఇంక అసలు ఎవరికి భద్రత కల్పిస్తున్నారని, అసలు ప్రజాభద్రత అంశంపై ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పి తీరాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ కూడా ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన చట్టం అత్యాచారం నిర్వచనాన్ని మార్చిందని, అయినా ఇప్పటికీ మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.