PSB
-
బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలు
బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసులను మరింత సమర్థంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థల మధ్య సాధారణ చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రత్యేక వేదిక ఏర్పాటు..?బ్యాంకు మోసాలపై సీబీఐలో చాలా కేసులు నమోదవుతున్నాయి. వాటి దర్యాప్తులో అవసరమయ్యే కీలక సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి సమాచారం అందించేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటాయి. అయితే ఎలాంటి కేసుల్లో ఎలాంటి సమాచారం అందించాలనే విషయంపై స్పష్టత వచ్చేందుకు సీబీఐ, బ్యాంకర్లు పరస్పరం చర్చించాల్సి ఉంది. అందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా..కేసులకు సంబంధించి సీబీఐ చేసిన అభ్యర్థనలను బ్యాంకర్లు పరిశీలించనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంపై భవిష్యత్తులో కస్టమర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సీబీఐ నుంచి బ్యాంకర్లకు రక్షణ ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. సీబీఐ, బ్యాంకర్ల మధ్య పరస్పరం సహకారం వల్ల ఫిర్యాదుల దాఖలుకు సంబంధించిన కార్యాచరణ అంశాలు, దర్యాప్తును క్రమం తప్పకుండా సమీక్షించడం, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సులువవడం వల్ల త్వరగా కేసులు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!అనుమతుల్లేక కేసులు పెండింగ్2018లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aలో చేసిన సవరణ ప్రకారం.. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆమోదించిన తర్వాతే బ్యాంకు మోసాలపై దర్యాప్తు ఏజెన్సీ ఉద్యోగులను విచారించే అధికారం ఉంటుంది. పీఎస్యూ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఇన్వెస్ట్గేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వారి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజా సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు కొందరు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు బ్యాంకు యాజమాన్యాలు తమ ఉద్యోగులపై విచారణకు అనుమతి ఇవ్వనందున వందలాది కేసులు పెండింగ్లో ఉన్నాయని ఫిర్యాదు చేశాయి. -
బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా
వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్తో సహా ఓ ఎన్బీఎఫ్సీ సంస్థపై చర్యలు తీసుకున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది . ఏ బ్యాంకుకు ఎంత జరిమానా? 'రుణాలు, అడ్వాన్సులు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు' అలాగే 'ఇంట్రా-గ్రూప్ లావాదేవీలు, ఎక్స్పోజర్ల నిర్వహణపై మార్గదర్శకాలు' గురించి ఆర్బీఐ జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు ఎస్బీఐకి రూ. 1.3 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 'రుణాలు, అడ్వాన్స్లు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు', కేవైసీ మార్గదర్శకాలు, 'ఆర్బీఐ (డిపాజిట్లపై వడ్డీ) మార్గదర్శకాలు-2016'ను ఉల్లంఘించినందుకు ఇండియన్ బ్యాంక్కి రూ. 1.62 కోట్ల జరిమానా విధించింది. ఇక డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్లోని నిర్దిష్ట నిబంధనలను పాటించనందుకు గానూ పంజాబ్ & సింధ్ బ్యాంక్కు రూ. 1 కోటి పెనాల్టీని విధించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో మానిటరింగ్ మోసానికి సంబంధించిన ఆదేశాలలో పేర్కొన్న కొన్ని నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు గానూ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు రూ. 8.80 లక్షల జరిమానాను విధించినట్లు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. -
ప్రభుత్వ బ్యాంకుల చీఫ్లతో ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులతో కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి వివేక్ జోషి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జన సురక్ష, ముద్రా యోజన వంటి వివిధ ఆర్థిక స్కీములను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని బీమా పథకాల్లో మరింత మందిని చేర్చే దిశగా బ్యాంకులు తమ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ నెట్వర్క్ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లోన వీటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జోషి సంనట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రోజంతా సాగిన ఈ సవవేశంలో పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, హౌసింగ్ తదితర శాఖల సీనియర్ అధికారులు, నాబార్డ్ చైర్మన్, ఎన్పీసీఐ సీఈవో మొదలైన వారు కూడా పాల్గొన్నారు. స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి తదితర స్కీముల పురోగతిని సైతం ఇందులో సమీక్షించారు. -
జనవరిలో 15 రోజులు పని చేయని బ్యాంకులు, సెలవుల జాబితా ఇదే!
2023 జనవరికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు జనవరి 2023లో 15 రోజుల వరకు పని చేయవు( ఆ తేదిలలో బ్యాంకులకు సెలవు). ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు కూడా ఉన్నాయి. కనుక కస్టమర్లు జనవరిలో ఏవైనా బ్యాంకు పనులుంటే దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. జనవరి 2023లో దేశవ్యాప్తంగా బ్యాంకులు చాలా రోజులు మూసివేసి ఉంటాయి. ప్రతి నెల రెండు, నాలుగు మినహాయిస్తే తొలి, మూడవ శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. సెలవుల్లో కొన్ని బ్యాంకులకు ప్రాంతీయ సెలవులుంటే..మరికొన్ని బ్యాంకులకు జాతీయ సెలవులున్నాయి. జనవరిలో ఏ తేదిన ఉన్నాయో ఓ లుక్కేద్దాం! సెలవుల జాబితా ఇదే 1 జనవరి 2023 ఆదివారం న్యూ ఇయర్ 2 జనవరి 2023 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఐజ్వాల్లో సెలవు 3 జనవరి 2023 ఇంఫాల్లో సెలవు 4 జనవరి 2023 ఇంఫాల్లో గణ ఎన్గయీ సందర్భంగా సెలవు 8 జనవరి 2023 ఆదివారం 12 జనవరి 2023 స్వామి వివేకానంద జన్మదినం (కోల్కతాలో బ్యాంకులు పని చేయవు) 14 జనవరి 2023 రెండో శనివారం 15 జనవరి 2023 ఆదివారం 16 జనవరి 2023 తిరువల్లూర్ దినోత్సవం (చెన్నైలో సెలవు) 17 జనవరి 2023 ఉజ్ఞావార్ తిరునాళ్లు సందర్భంగా చెన్నైలో సెలవు 22 జనవరి 2023 ఆదివారం 23 జనవరి 2023 నేతాజీ జన్మ దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్లో సెలవు 26 జనవరి 2023 రిపబ్లిక్ డే (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు) 28 జనవరి 2023 నాలుగో శనివారం 29 జనవరి 2023 ఆదివారం -
లాభాల బాటలో ప్రభుత్వ బ్యాంకులు.. కారణం ఇదే!
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బాకీలను తగ్గించుకుని, రికార్డు లాభాలు నమోదు చేశాయి. రుణాలకు భారీగా డిమాండ్ నెలకొనడం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జోరును కొనసాగించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రైవేట్ రంగంలో స్థిరీకరణ కనిపిస్తుందని వారు తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం, సిటీబ్యాంక్ రిటైల్ పోర్ట్ఫోలియోను యాక్సిస్ బ్యాంక్ టేకోవర్ చేయడం 2023లో పూర్తి కానుంది. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేటును మరో పావు శాతం పెంచి 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ తెలిపారు. ఇదే జరిగితే, బ్యాంకులు రుణాలపై పెంచినంతగా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచటం లేదు కాబట్టి వాటి లాభదాయకతకు మరింతగా తోడ్పడగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఒకసారి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ బ్యాంకింగ్ రంగంలో కొన్ని పరిణామాలు చూస్తే.. ► మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో దాదాపు 60 శాతం వాటా ఉన్న 12 పీఎస్బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 32 శాతం అధికంగా నికర లాభాలు నమోదు చేశాయి. రూ. 40,991 కోట్లు ఆర్జించాయి. సెప్టెంబర్ క్వార్టర్లో పీఎస్బీలన్నింటి నికర లాభం 50 శాతం పెరిగి రూ. 25,685 కోట్లకు ఎగిసింది. ► ఇదే తీరు కొనసాగితే పీఎస్బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22కు మించి లాభాలు సాధించవచ్చని అంచనా. 2021–22లో 12 పీఎస్బీల లాభాలు 110 శాతం పెరిగి రూ. 31,816 కోట్ల నుంచి రూ. 66,539 కోట్లకు చేరాయి. ► మొండి బాకీలను తగ్గించేందుకు, అదనపు మూలధనం ఇచ్చి బ్యాంకులను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల అభిప్రాయపడ్డారు. 2022 మార్చి ఆఖరు నాటికి మొండి బాకీలు 9.11 శాతం నుంచి 7.28 శాతానికి దిగి వచ్చాయని ఇటీవల తెలిపారు. కార్పొరేట్లు కూడా రుణాలు తీసుకోవడం పెరుగుతుండటంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ► ప్రైవేట్ రంగం విషయానికొస్తే యస్ బ్యాంకులోకి రెండు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు (కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్) రూ. 8,896 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. చెరో 9.99 శాతం వాటా తీసుకున్నాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ డీల్తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీ ఆర్థిక సేవల దిగ్గజంగా ఆవిర్భవించనుంది. 2023–24 రెండో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. ► వ్యాపార వృద్ధి ప్రణాళికల్లో భాగంగా సిటీబ్యాంక్ రిటైల్ వ్యాపారాన్ని రూ. 12,325 కోట్లకు కొనుగోలు చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, వినియోగదారు రుణాలు తదితర వ్యాపార విభాగాలు ఉన్నాయి. విలీనం పూర్తయితే యాక్సిస్ బ్యాంక్ వద్ద 2.85 కోట్ల పొదుపు ఖాతాలు, 1.06 కోట్ల క్రియాశీలక క్రెడిట్ కార్డులు ఉంటాయి. చదవండి: జొమాటో షాకింగ్ రిపోర్ట్: పూణె వాసి యాప్ ద్వారా రూ.28 లక్షల పుడ్ ఆర్డర్! -
బలహీనంగానే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు
న్యూఢిల్లీ: పెద్ద స్థాయిలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇంకా బలహీనంగానే ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. బలహీన అసెట్లు, అధిక రుణ వ్యయాలు, అంతంత మాత్రం ఆదాయాలతో ఆయా పీఎస్బీల పరిస్థితి భారంగా ఉందని 2023 అంతర్జాతీయ బ్యాంకింగ్ అంచనాల నివేదికలో పేర్కొంది. ఆర్థిక సంస్థల పనితీరు మిశ్రమంగానే ఉండవచ్చని ఇందులో వివరించింది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దిగ్గజ ప్రైవేట్ బ్యాంకులు తమ తమ మొండి బాకీల సవాళ్లను చాలా మటుకు పరిష్కరించుకున్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థను మించి వాటి లాభదాయకత మెరుగుపడుతోందని నివేదిక పేర్కొంది. ఆర్థిక రికవరీ నేపథ్యంలో రుణ వ్యయాలు కనిష్ట స్థాయులకు తగ్గాయని తెలిపింది. బ్యాంకుల దగ్గర నిధులు పుష్కలంగా ఉండటం.. డిమాండ్ అధికంగా ఉండటం వంటి అంశాల కారణంగా రుణాల వృద్ధికి ఊతం లభించవచ్చని, కానీ డిపాజిట్ల వృద్ధి మాత్రం మందగించవచ్చని నివేదిక వివరించింది. అటు పరపతి విధానాలు కఠినతరం చేస్తుండటం, అధిక ద్రవ్యోల్బణంతో వినియోగదారులు సతమతమవుతుండటం వంటి కారణాలతో జీడీపీ వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. అయినప్పటికీ మధ్యకాలికంగా భారత ఆర్థిక వృద్ధి అవకాశాలు పటిష్టంగానే ఉంటాయని, 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5–7 శాతం వృద్ధి నమోదు కావచ్చని వివరించింది. చదవండి: ఎలాన్ మస్క్కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
కెనరా బ్యాంక్కు ఈజ్ 4.0 సంస్కరణల సూచీ అవార్డు
ముంబై: ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్కు ప్రతిష్టాత్మక ‘ఈఏఎస్ఈ (ఈజ్) 4.0 సంస్కరణల సూచీ అవార్డు, 2022’ లభించింది. అత్యుత్తమ పనితీరుకు గాను 2021–22 మార్చి త్రైమాసికానికి సంబంధించి ఈజ్ అవార్డు మూడవ ర్యాంక్ను దక్కించుకున్న బ్యాంక్, ‘ప్రూడెంట్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషనలైజింగ్ థీమ్’ కింద మొదటి బహుమతిని కూడా అందుకుంది. ముంబైలో ఐబీఏ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చేతుల మీదుగా ఈజ్ 4.0 సంస్కరణల సూచీ అవార్డును అందుకుంటున్న బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ ఎల్వీ ప్రభాకర్ను చిత్రంలో తిలకించవచ్చు. దీర్ఘకాల సుస్థిర వ్యాపారవృద్ధి, డిజిటల్ సామర్థ్యాల విభాగాల్లో బ్యాంక్ చక్కటి పనితీరు కనబరుస్తున్నట్లు ప్రభాకర్ ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
మరో బాదుడు.. కెనరా బ్యాంక్ రుణ రేటు పెంపు
ఇప్పటికే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నెలలో ద్రవ్యోల్బణం కట్టడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుని పెంచిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారమనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. పెంచిన రేట్లు బుధవారం(సెప్టంబర్ 7) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. తాజా పెంపుతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయి. తాజా పెంపుతో ఏడాది రుణ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. ఓవర్నైట్, నెల వ్యవధుల ఎంసీఎల్ఆర్ 0.10% మేర పెరిగింది. -
బ్యాంకుల ప్రైవేటీకరణ.. అలా చేస్తే మంచి కన్నా చెడు ఎక్కువ: ఆర్బీఐ
ముంబై: వేగవంతంగా, ఒక్కసారిగా పెద్ద ఎత్తున చేపట్టే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ప్రైవేటీకరణ మంచికన్నా ఎక్కువ చెడు పరిణామాలకే దారితీస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులిటిన్లో జారీ అయిన ఆర్టికల్స్ రచయితలు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ అంగీకరించాల్సిన అవసరం లేని ఈ ఆర్టికల్ అభిప్రాయాల ప్రకారం, ఒక క్రమ పద్దతిలో మంచి, చెడులను పరిగణనలోకి తీసుకుంటూ ఆచితూచి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ప్రైవేటీకరణ జరిగితే తగిన మెరుగైన ఫలితాలను చూడవచ్చు. ఈ పక్రియ హడావిడిగా జరగడం ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం అనుసరించే ప్రైవేటీకరణ విధానం సామాజిక లక్ష్యాన్ని నెరవేరుస్తుందో లేదో జాగ్రత్తగా పరిశీలించాలని ఆర్టికల్ సూచించింది. అందరికీ బ్యాంకింగ్లో భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా విలీన పక్రియ జరగాలని సూచించింది. 2020లో కేంద్రం 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీన ప్రక్రియను నిర్వహించింది. దీనితో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గింది. 2017లో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. చదవండి: Emirates Airbus A380: ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం.. మొదటిసారిగా ఆ నగరానికి! -
మీకు లోన్ కావాలా.. అది కూడా గంటలోపు.. ఇలా అప్లై చేస్తే చాలు..
ఇటీవల కాలంలో యువత చేస్తున్న ఉద్యోగాలలో వాళ్లకిచ్చే జీతం వారి జీవన విధానానికి సరిపోవడం లేదు. అందుకు కొంత మంది రెగుల్యర్ జాబ్తో పాటు ఫ్రీలాన్సర్గా చేస్తూ ఆర్జిస్తుంటే, మరి కొంతమంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. అయితే అధిక శాతం మాత్రం వారి అవసరాల కోసం ముందుస్తుగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేందేకు మొగ్గు చూపుతున్నారు. గతంలో లోన్ తీసుకోవాలంటే రోజుల తరబడి బ్యాంక్ చూట్లూ తిరిగి, డ్యాంకుమెంట్లు సమర్పించి, ఆపై వెరిఫికేషన్ ఇవన్నీ పూర్తి చేసి చేతికి డబ్బులు రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ రోజులు పోయాయి. మీ వద్ద కావాల్సిన డ్యాకుమెంట్లు అన్నీ ఉంటే ఒక్క రోజులోనే మీ లోన్లు మంజూరవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ (PSB Loan in 59 Minutes) అని ఓ ప్లాట్ఫామ్ కూడా రూపొందించింది. మొదట్లో ఈ ప్లాట్ఫామ్ ద్వారా కేవలం బిజినెస్ లోన్స్ మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ లాంటి అనేక సేవలు అందిస్తోంది. అసలేంటి పీఎస్బీ(PSB).... ఏం పని చేస్తుంది! పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్( psbloansin59minutes.com) ప్లాట్ఫామ్ 2018 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఇది బిజినెస్ లోన్ కేటగిరీలో 2,01,863 రుణాలు మంజూరై, రూ.39,580 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. రీటైల్ లోన్ కేటగిరీలో 17,791 రుణాలు మంజూరు కాగా, రూ.1,689 కోట్లు మంజూరు చేశాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్ఫామ్లో మీరు కూడా ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. వ్యాపారం కోసం అయితే జీఎస్టిఐఎన్, జీఎస్టీ యూజర్ నేమ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డాక్యుమెంట్స్ వంటి వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా రిజిష్టర్ చేసుకోండి: 1: PSB అధికారిక వెబ్సైట్ psbloansin59minutes.comకి వెళ్లి రిజిస్టర్పై క్లిక్ చేయండి 2: రిజిష్టర్ ప్రక్రియలో పేరు, ఈమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ నింపి, ‘గెట్ OTP’పై క్లిక్ చేయండి 3: మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్కు వచ్చిన OTPని ఆ ఎంటర్ చేయండి 4: టెర్మ్స్ అండ్ కండీషన్స్ చెక్బాక్స్పై క్లిక్ చేసి అంగీకరించండి 5: అక్కడ ఉన్న కాలమ్స్ నింపిన తర్వాత ‘ప్రొసీడ్’పై క్లిక్ చేయండి 6: మీరు రిజిష్టర్ అయినా అకౌంట్కు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఇలా చేస్తే లోన్ వచ్చేస్తుంది.. 1: మీరు క్రియేట్ చేసిన అకౌంట్లోకి లాగిన్ అవ్వండి 2: వ్యాపారం లేదా ఎంఎస్ఎంఈ(MSME) లోన్ పొందడానికి మీ ప్రొఫైల్ను ‘బిజినెస్’గా ఎంచుకోండి, లేదా (పర్సనల్ లోన్ కోసం రీటైల్ ఎంచుకోండి) తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి 3: ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆపై మీ వ్యాపార పాన్ వివరాలను నమోదు చేసి, 'ప్రొసీడ్'పై క్లిక్ చేయండి 4: గత 6 నెలలకు సంబంధించిన మీ GST వివరాలు, పన్ను రిటర్న్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను నింపండి 5: మీ ITRని అప్లోడ్ చేయండి, ఇతర ముఖ్యమైన వివరాలను ఎంటర్ చేయండి 6: మీ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయండి 7: మీ వ్యాపార వివరాలను నమోదు చేయండి. అలాగే ఇప్పటికే ఉన్న ఏదైనా లోన్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 8: మీకు OTP వస్తుంది దీని ద్వారా మీ ఈమెయిల్ వెరిఫై చేయబడుతుంది. 9: ఆ తర్వాత ఏ బ్యాంకు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నాయో కనిపిస్తుంది. అందులో మీరు అప్లై చేయాలనుకున్న బ్యాంక్తో పాటు ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీకు బ్యాంకు నుంచి ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది. చదవండి: పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం! -
ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్ చేస్తే చాలు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ కస్టమర్ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్బీ అలయన్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్బీ అలియన్స్ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్ మిరాఖుర్ను పీఎస్బీ అలియన్స్ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది. నమూనాపై కసరత్తు.. ‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్బీల పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్ను పీఎస్బీ అలయన్స్ నియమించుకుంది. రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్లను అధ్యయనం చేసేందుకు పీఎస్బీలు ‘కార్డెక్స్ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్బీ అలయన్స్గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్బీలు అన్నీ కలసి ప్రమోట్ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్ చెప్పారు. ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్బీ అలయన్స్ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజ్కిరణ్రాయ్ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. కొన్ని బ్యాంకుల పరిధిలో.. ‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్బీ అలయన్స్ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్ మిరాఖుర్ తెలిపారు. నాన్ ఫైనాన్షియల్ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్ నివేదిక ఇవ్వడం, టీడీఎస్ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను కూడా ఆర్డర్ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్, మొబైల్ యాప్, ఫోన్కాల్ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్కు బ్యాంకులు చెల్లిస్తాయి. -
ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులే ఆయుధం
ముంబై: ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులదీ కీలక పాత్ర అని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి పీఎస్బీ అలయెన్స్ కార్యక్రమాన్ని బుధవారం ఆమె ఆవిష్కరించారు. ప్రజలకు మరింత చేరువకావడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంకింగ్ తమ వ్యాపార కార్యకలాపాలతో పాటు ఆర్థికవృద్ధి, సంక్షేమం పట్ల కూడా దృష్టి కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. ‘‘ రుణాలు ఇవ్వడం... తద్వారా డబ్బు సంపాదించడం. ఇది మీ చట్టబద్ధమైన కార్యక్రమం. దీనిని మీరు మర్చిపోవక్కర్లేదు. మీరు మీ విధిని నిర్వహించాల్సిందే. అయితే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావడంపైనా బ్యాంకింగ్ దృష్టి పెట్టాలి’’ అని ఆమె అన్నారు. ప్రైవేటు బ్యాంకుల సహకారం అవసరం ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడానికి ప్రైవేటు రంగంలోని బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఆర్థికమంత్రి అన్నారు. బ్యాంకుల ద్వారా అమలు జరిగే ప్రభుత్వ పథకాల వివరాలు అన్నింటినీ సిబ్బంది తెలుసుకోవాలని ఆమె అన్నారు. ‘‘పలు పథకాలను కేంద్రం మీ ద్వారానే ప్రజలకు అందిస్తుంది. అందువల్ల ఈ పథకాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవడమూ మీ బాధ్యతే. ఉద్యోగులకు సంబంధించి ప్రతి స్థాయిలో ఆయా అంశాలను తెలుసుకుంటారని భావిస్తున్నా’’ అని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా అన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలు పొందాలనుకునే ప్రజలకు బ్యాంకింగ్ మరింత చేరువవుతుందన్నారు. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ సేవల విస్తరణకు ఉద్దేశించిన పీఎస్బీ అలయెన్స్ కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా కూడా చిత్రంలో ఉన్నారు -
బడ్జెట్లో పీఎస్బీలకు నిధుల కేటాయింపులు ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: రానున్న 2020–21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్బీలు) నిధుల కేటాయింపును ప్రకటించకపోవచ్చని, బదులుగా మొండి బకాయిలు (ఎన్పీఏలు) వసూలుకు, మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ దిశగా వాటిని ప్రోత్సహించొచ్చని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులు తమకు అనుబంధ కంపెనీల్లో, జాయింట్ వెంచర్లలో ఉన్న వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు కొన్నింటికి బీమా, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్కార్డుల వ్యాపారంతోపాటు ఎన్ఎస్ఈ తదితర సంస్థల్లో వాటాలు సైతం ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించనున్నారు. -
59 నిమిషాల్లోనే బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: ‘59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) రుణాలు’ పోర్టల్ సేవలు రిటైల్ రుణాలకూ విస్తరించడం జరిగింది. రిటైల్ రుణ లభ్యతకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి కూడా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలపాయి. ఇప్పటి వరకూ ఈ సేవలు లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) మాత్రమే అందుబాటులో ఉంది. 2018 నవంబర్లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎంఎస్ఎంఈలకు కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ నుంచి బ్యాంక్ అకౌంట్ల వరకూ అందుబాటులోఉన్న పలు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పరిశీలనలోకి తీసుకుని వచ్చే డేటా పాయింట్లను అత్యుధునిక ఆల్గోరిథమ్స్ ద్వారా విశ్లేషించి తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం. 2019 మార్చి 31వ తేదీ వరకూ అందిన గణాంకాల ప్రకారం- ఈ రుణాల కోసం 50,706 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 27,893 ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. -
‘59 మినిట్స్’తో రూ. 5 కోట్లు!
‘పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్’ వేదిక ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) రూ.5 కోట్ల వరకూ రుణాలను ఆఫర్ చేయాలని ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్లు ఉన్నాయి. 2018 నవంబర్లో ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. రూ.కోటి వరకూ ఆఫర్తో ఈ పథకం ప్రారంభమైంది. -
పీఎస్బీలకు తగ్గనున్న మూలధన భారం
ముంబై: మూలధన పరిరక్షణ కోసం ఉద్దేశించిన నిల్వలను (సీసీబీ) తగిన స్థాయిలో సమకూర్చుకునేందుకు మరింత గడువు లభించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై (పీఎస్బీ) ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్ల మేర భారం తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీల మూలధన అవసరాల అంచనాలు రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ. 85,000 కోట్లకు తగ్గుతాయని వివరించింది. అయితే, బ్యాంకుల పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్రమే ఈ నిధులను సమకూర్చాల్సి రావొచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. సీసీబీ విధానాన్ని 2008లో ప్రవేశపెట్టారు. దీని కింద అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వచ్చేలా సాధారణ సమయాల్లో బ్యాంకులు కొంత క్యాపిటల్ బఫర్ను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకులు 8.875% క్యాపిటల్ అడెక్వసీ రేషియోను పాటించాలి. ఇందులో సీసీబీ వాటా 1.875%. సీసీబీని వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 0.625% పెంచుకోవాల్సి ఉంది. అయితే, ఈ గడువును 2020 మార్చి దాకా పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. -
తక్షణం రూ. 1.2 లక్షల కోట్లు కావాలి!
ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలను పాటించే క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) రాబోయే అయిదు నెలల్లో రూ. 1.2 లక్షల కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. పీఎస్బీలు బలహీన మార్కెట్ వాల్యుయేషన్స్, మొండిబాకీలతో కుదేలైన నేపథ్యంలో ఇందులో సింహభాగం భారం ప్రభుత్వమే మోయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, ఒకవేళ ప్రభుత్వం ఈ మేరకు నిధులు సమకూర్చిన పక్షంలో ఆర్థిక గణాంకాలు లెక్క తప్పే ప్రమాదముందని, ఈసారి ద్రవ్య లోటును 3.3 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం చేరుకోలేకపోవచ్చని నివేదికను రూపొందించిన క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. పీఎస్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల అదనపు మూలధనం సమకూరుస్తామంటూ 2017 అక్టోబర్లో కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా ఇందులో రూ. 1.12 లక్షల కోట్లు సమకూర్చగా, బ్యాంకులు మరో రూ. 12,000 కోట్లు మాత్రమే మార్కెట్ల నుంచి సమీకరించుకోగలిగాయి. పనితీరు అంతంతమాత్రంగానే ఉండటం, వాల్యుయేషన్లు బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతల కారణంగా పీఎస్బీలు ప్రస్తుతం మార్కెట్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించుకునే పరిస్థితి లేదని కృష్ణన్ తెలిపారు. అయితే, పటిష్టమైన బ్యాంకుల్లో బలహీనంగా ఉన్న వాటిని విలీనం చేయడం ద్వారా అదనపు మూలధన అవసరాలు కొంత మేర తగ్గొచ్చని క్రిసిల్ అసోసియే ట్ డైరెక్టర్ వైద్యనాథన్ రామస్వామి చెప్పారు. మార్కెట్ల నుంచే మూలధనం సమీకరించుకునేలా మెరుగ్గా ఉన్న బ్యాంకులను ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ.. కార్యకలాపాల విస్తరణ తదితర అవసరాల కోసం రూ. 20,000 కోట్లు సమీకరించనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సహా వివిధ మార్గాల్లో ఈ నిధులు సమీకరించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు డిసెంబర్ 7న బ్యాంక్ షేర్హోల్డర్లు సమావేశం కానున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. -
బ్యాంకుల చీఫ్లతో నేడు జైట్లీ భేటీ
న్యూఢిల్లీ: వార్షిక ఆర్థిక పనితీరు సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చీఫ్లతో భేటీ కానున్నారు. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తీసుకుంటున్న చర్యల పురోగతితో పాటు పలు అంశాలు ఇందులో చర్చకు వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ వృద్ధి, బాకీల రికవరీకి తీసుకుంటున్న చర్యలు, చట్టపరంగా ప్రభుత్వం అందించే తోడ్పాటు మొదలైనవి కూడా చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి.మొండిబాకీలను రాబట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న బ్యాంకులు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇప్పటికే రూ. 36,551 కోట్లు రాబట్టాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వసూలైన మొండిబాకీలతో పోలిస్తే ఇది 49 శాతం అధికం. మూడు పీఎస్బీలను (బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా, దేనా బ్యాంక్) విలీనం చేయాలంటూ ప్రత్యామ్నాయ యంత్రాంగం సిఫార్సు చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2017–18లో పీఎస్బీల నష్టాలు రూ. 87,357 కోట్ల పైచిలుకు నమోదయ్యాయి. 21 పీఎస్బీల్లో రెండు మాత్రమే (ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్) లాభాలు ప్రకటించాయి. ఎన్బీఎఫ్సీలకు లిక్విడిటీ కోసం చర్యలు: జైట్లీ నిధుల కష్టాల వార్తలతో ఆర్థిక సంస్థల షేర్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), మ్యూచువల్ ఫండ్స్కి తగింత లిక్విడిటీ ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కావడానికి ముందు.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. రుణాలు బాకీ పడిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్తో పాటు లిక్విడిటీ సమస్యల వార్తలతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు కుప్పకూలడం.. వాటితో పాటు మార్కెట్లు పతనం అవుతుండటం తెలిసిందే. -
చిన్న సంస్థలకు రుణాల్లో ప్రైవేట్ బ్యాంకుల జోరు
ముంబై: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మార్కెట్ వాటాను ప్రైవేట్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కొల్లగొడుతున్నాయి. 2016 లో ఈ విభాగానికి సంబంధించి 59.4 శాతంగా ఉన్న 21 పీఎస్బీల వాటా 2017 జూన్ నాటికి 55.8 శాతానికి తగ్గింది. తాజాగా 2018 జూన్ నాటికి ఇది 50.7 శాతానికి పడిపోయింది. ఆర్థిక సేవల సంస్థ ట్రాన్స్యూనియన్ సిబిల్, సిడ్బి రూపొందించిన త్రైమాసిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాదిలో జూన్ దాకా ఎంఎస్ఎంఈ విభాగానికి రుణాలు 16.1 శాతం మేర పెరిగాయి. ఈ విభాగానికి పీఎస్బీల రుణాల వృద్ధి 5.5 శాతం, ప్రైవేట్ బ్యాంకుల వృద్ధి 23.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద ఈ విభాగానికి రుణాల విషయంలో 2017 జూన్లో 28.1 శాతంగా ఉన్న ప్రైవేట్ బ్యాంకుల మార్కెట్ వాటా ఈ ఏడాది జూన్ నాటికి 29.9 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఎన్బీఎఫ్సీల వాటా 9.6 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగింది. ఎంఎస్ఎంఈలకు దూకుడుగా రుణాలిస్తున్నప్పటికీ.. ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల రుణ నాణ్యత మెరుగ్గానే కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ విభాగంలో పీఎస్బీల మొండిబాకీలు 14.5 శాతం నుంచి 15.2 శాతానికి పెరగ్గా, ప్రైవేట్ బ్యాంకులవి స్వల్పంగా 4 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గాయి. రుణ మంజూరుకు సంబంధించి దరఖాస్తు ప్రాసెసింగ్కి పట్టే టర్నెరౌండ్ సమయం (టీఏటీ) గణనీయంగా తగ్గింది. -
కార్పొ బ్రీఫ్స్...
ఎల్ అండ్ టీ: కంపెనీ ఆస్తులు, ఉద్యోగుల సంక్షేమ నిధి పరంగా నిర్వహణ లోపం చోటు చేసుకుందంటూ ఉదయ్ దీక్షిత్ అనే మాజీ ఉద్యోగి ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఈ అంశంపై కంపె నీ స్పందించింది. పిటిషనర్ వాదన నిరాధారమైనదని వ్యాఖ్యానించింది. ల్యాంకో ఇన్ఫ్రాటెక్: లిక్విడేషన్ నేపథ్యంలో కంపెనీ షేర్ల ట్రేడింగ్ను సెప్టెంబరు 14 నుంచి నిలిపివేస్తున్నట్టు బీఎస్ఈ ప్రకటించింది. ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్: బెంగళూరుకు చెందిన గ్రాఫిన్ సెమి కండక్టర్ సర్వీసెస్ కంపెనీలో వంద శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.93 కోట్లని, ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఈ డీల్ పూర్తవుతుందని ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ పేర్కొంది. బజాజ్ ఆటో: క్వాడ్రిసైకిల్, మూడు చక్రాల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 10 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు పర్మిట్ మినహాయింపులిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీఏఐటీ: వాల్మార్ట్– ఫ్లిప్కార్ట్ డీల్పై నిరసన వ్యక్తం చేస్తున్న ట్రేడర్స్ సంఘం – సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్) ఈ నెల 28న దేశవ్యాప్తంగా ఒక రోజు బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ‘భారత్ ట్రేడ్ బంద్’కు దాదాపు 7 కోట్ల మంది వర్తకులు మద్దతిచ్చినట్లు తెలిపింది. పాలసీబజార్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల ఆదాయాన్ని అంచనావేస్తున్నట్లు ఆన్లైన్ బీమా సర్వీసుల సంస్థ పాలసీబజార్ డాట్ కామ్ వెల్లడించింది. ఎల్ఐసీ కొనుగోలు సైతం తమ ప్లాట్ఫామ్ నుంచి జోరందుకున్న నేపథ్యంలో ఈ సారి ఆదాయంలో రెట్టింపు వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. టాటా స్టీల్: పర్యావరణానికి మేలు చేసే నూతన స్టీల్ ఉత్పత్తి టెక్నాలజీని ఆవిష్కరించింది. నెదర్లాండ్స్లో పరీక్షలు పూర్తిచేసుకున్న ఈ టెక్నాలజీతో కార్బన్ డయాక్సైడ్ విడుదల సగానికి తగ్గిపోతుందని వెల్లడించింది. విస్తారా: బ్రిటిష్ ఎయిర్వేస్తో కోడ్ షేరింగ్ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్లోని పలు ప్రాంతాలలో బ్రిటీష్ ఎయిర్వేస్ సేవలను తమ సంస్థ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. ఎస్బీఐ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరుగా అన్షులా కాంత్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఎస్బీఐలో డిప్యూటీ ఎండీగా విధులు నిర్వర్తించారు. పీఎన్బీ: నాన్– సీటీఎస్ (చెక్ టర్న్కేషన్ సిస్టమ్) చెక్కులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రొసెస్ చేయబోమని ప్రకటించింది. గడువు తేదీలోపుగా పాత చెక్కులను బ్యాంకుకు సమర్చించి, నూతన చెక్ బుక్లను పొందాల్సిందిగా కస్టమర్లకు తెలియజేసింది. -
పీఎస్బీలకు నిర్వహణ స్వేచ్ఛ ఉండాలి
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకూ (పీఎస్బీ) నిర్వహణాపరమైన స్వేచ్ఛ ఉండాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జి. పద్మనాభన్ చెప్పారు. అప్పుడే మొండిబాకీలు సహా పలు సమస్యలను పీఎస్బీలు వాటంతట అవే పరిష్కరించుకోగలవని ఆయన తెలిపారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ పాలసీ రీసెర్చ్ (సీఈపీఆర్) నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో శుక్రవారం పాల్గొన్న సందర్భంగా పద్మనాభన్ ఈ విషయాలు చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో పద్మనాభన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ రంగంలో చాలా మటుకు సమస్యలు నిర్వహణపరమైన అంశాలే తప్ప యాజమాన్యపరమైనవి కావని ఆయన పేర్కొన్నారు. ‘యాజమాన్య అధికారాలపరంగా పీఎస్బీలకు కొన్ని పరిమితులు ఉన్నాయి.. అయితే వీటిని సులువుగానే పరిష్కరించుకోవచ్చు. అయితే, నిర్వహణ విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించేందుకు ప్రైవేట్ రంగ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా వెసులుబాటు ఉండాలి‘ అని పద్మనాభన్ చెప్పారు. బీవోఐ విషయానికొస్తే తమ మొండిబాకీల్లో చాలా మటుకు రుణాలు ఇన్ఫ్రా రంగం నుంచి రావాల్సినవేనని ఆయన తెలిపారు. తమది లీడ్ బ్యాంక్ కాకపోయినా.. ఇవన్నీ కన్సార్షియంలో భాగంగా ఇచ్చిన రుణాలేనని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు రూ. 8.31 లక్షల కోట్లకు పెరిగిన సంగతి తెలిసిందే. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21 పీఎస్బీల్లో రెండు మినహా.. 19 బ్యాంకులు ఏకంగా రూ. 87,357 కోట్ల నష్టాలను ప్రకటించాయి. విజయా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మాత్రమే లాభాలు నమోదు చేశాయి. -
రూ. 50వేల కోట్లకుపైగా పీఎస్బీల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.50,000కోట్లకు పైగా నిధుల సమీకరణ ప్రణాళికలతో ఉన్నాయి. వ్యాపార వృద్ధికితోడు, నియంత్రణల పరంగా అంతర్జాతీయ నిబంధనలను చేరుకునేందుకు నిధుల సమీకరణ తలపెట్టాయి. ఎన్పీఏలు భారీగా పెరిగిపోవడంతో వ్యాపార అవసరాలకు బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 21 పీఎస్బీల్లో 13బ్యాంకుల బోర్డులు ఈక్విటీ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణకు ఆమోదం తీసుకున్నాయి. ఈ బ్యాంకుల ఉమ్మడి నిధుల సమీకరణ రూ.50వేల కోట్లకుపైగా ఉంది. సెంట్రల్ బ్యాంకు రూ.8,000 కోట్లు, కెనరా బ్యాంకు రూ.7,000 కోట్లు, బీఓబీ రూ.6,000 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.5,000 కోట్ల మేర నిధులను సమీకరించనున్నాయి. ఈ జాబితాలో ఓబీసీ, కార్పొరేషన్ బ్యాంకు, దేనా, యూకో అలహాబాద్ బ్యాంకు కూడా ఉన్నాయి. -
బ్యాంకుల్లో ప్రజల సొమ్ము పదిలమే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని (పీఎస్బీ) ప్రజల సొమ్ముకు ’అత్యంత భద్రత’ ఉంటుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పీఎస్బీలకు నూటికి నూరు శాతం ప్రభుత్వ మద్దతుంటుందని ఆయన చెప్పారు. 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో మంగళవారం సమావేశమైన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలియజేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో (పీఎన్బీ) దాదాపు రూ.14,000 కోట్ల కుంభకోణం సహా బ్యాంకింగ్ రంగంలో పలు స్కామ్లు బయటపడుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రజల సొమ్ము భద్రంగానే ఉంటుందని.. కాకపోతే భారీగా ఆదాయ పన్ను బాకీలు పడ్డ ప్రైవేట్ కంపెనీల్లోకి మళ్లిన ప్రజల నిధులు ఎంత మేర భద్రంగా ఉంటాయన్నది తాను చెప్పలేనని గోయల్ వ్యాఖ్యానించారు. మోసాలు చేసినది ప్రైవేట్ కంపెనీలే తప్ప ప్రభుత్వ బ్యాంకులు కాదన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రజల సొమ్ముకు నూటికి నూరు శాతం భద్రత ఉంటుందని భరోసా ఇస్తున్నాను. పీఎస్బీలకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. రిజర్వ్ బ్యాంక్కు పూర్తి అధికారాలున్నాయి.. పీఎస్బీలను సమర్థంగా నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్కి అన్ని అధికారాలు ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆర్బీఐ కోరుతున్నట్లుగా మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. పీఎస్బీలను నియంత్రించేందుకు తమకు మరిన్ని అధికారాలు అవసరమని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇటీవల పార్లమెంటరీ కమిటీకి తెలిపిన సంగతి తెలిసిందే. ‘రిజర్వ్ బ్యాంక్కి పూర్తి అధికారాలు ఉన్నాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అయినప్పటికీ, మరిన్ని అధికారాలు అవసరమైతే ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఈ విషయాలపై ఆర్బీఐ, ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకుంటాయి‘ అని గోయల్ చెప్పారు. చిన్న సంస్థలకు రుణాలపై పీఎస్బీల దృష్టి.. పీఎస్బీలు ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలపై దృష్టి సారిస్తున్నాయని గోయల్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా నిఖార్సయిన కార్పొరేట్ కంపెనీలకు కూడా తోడ్పాటునివ్వాలని బ్యాంకులు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ఎంఎస్ఎంఈలు, నిఖార్సయిన మంచి కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ తదితర రుణ అవసరాలు తీర్చడంపై మళ్లీ దృష్టి పెట్టాలని పీఎస్బీలు నిర్ణయించాయి‘ అని మంత్రి పేర్కొన్నారు. రెండు దశల్లో దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. తొలి దశలో రూ. 200 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల దాకా రుణాలు ఉన్న కంపెనీలను, రెండో దశలో రూ. 200 కోట్ల దాకా రుణాలున్న కంపెనీల అవసరాలను పీఎస్బీలు పరిశీలించి, నిర్ణయం తీసుకుంటాయని గోయల్ చెప్పారు. మళ్లీ మొండిబాకీల సమస్య తలెత్తకుండా ఈ విషయంలో బ్యాంకులు విడివిడిగా గాకుండా కన్సార్షియంగా కలిసి పనిచేస్తాయని తెలిపారు.అసెట్ రీకన్స్ట్రక్షన్ లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటుపై పీఎన్బీ చైర్మన్ సునీల్ మెహతా సారథ్యంలో ఏర్పాటైన సబ్ కమిటీ త్వరలో నివేదిక సమర్పించనుందని ఆయన చెప్పారు. బ్యాంకర్లతో భేటీలో మొండిబాకీలపై చర్చ.. బ్యాంకింగ్ చీఫ్లతో మంత్రి భేటీ సందర్భంగా బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండిబాకీలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోని బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అనుబంధ బ్యాంకుల విలీనాల అనుభవాలను ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్కి సంబంధించిన లోటుపాట్ల గురించి కూడా చర్చించినట్లు సమావేశం అనంతరం విలేకరులకు ఆయన తెలిపారు. -
ఉర్జిత్ పటేల్కు ఆర్బీఐ యూనియన్ బాసట
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) పీడిస్తున్న మొండిబాకీలు తదితర సమస్యల పరిష్కారం విషయంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తీసుకుంటున్న కఠిన చర్యలకు ఆర్బీఐ ఉద్యోగుల సంఘం మద్దతు పలికింది. బ్యాంకులను ఆర్బీఐ మరింత క్రియాశీలకంగా పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ కేవలం ఆఫ్సైట్ సర్వేయర్గా ఉండిపోకుండా అప్రమత్తంగా ఉండే ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాలని అభిప్రాయపడింది. అఖిల భారత రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఈ మేరకు ఉర్జిత్ పటేల్కు లేఖ రాసింది. ఇటీవలే పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. పీఎస్బీల నియంత్రణకు మరిన్ని అధికారాలు అవసరమని చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, భారీగా బాకీ పడిన 40 మొండిపద్దులపై దివాలా కోర్టుకెళ్లాలన్న ఆర్బీఐ ఆదేశాలతో పీఎస్బీల పరిస్థితి మరింత దిగజారడంతో పాటు తమ ఉద్యోగాలకూ ముప్పు తప్పదంటూ బ్యాంక్ ఆఫీసర్ల యూనియన్లు ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో పటేల్ కఠిన వైఖరికి మద్దతుగా ఆర్బీఐ యూనియన్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజర్వ్ బ్యాంక్కు ఉన్న పరిమితులను పార్లమెంటరీ స్థాయీసంఘానికి స్పష్టీకరించినందుకు పటేల్ను ప్రశంసిస్తూనే.. మరోవైపు, ఆర్బీఐ మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్న సంగతి కూడా యూనియన్ గుర్తు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ను ప్రస్తావిస్తూ.. బ్యాంకుల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, అవి ఇచ్చే నివేదికలను పూర్తిగా నమ్మొచ్చని ఆర్బీఐ గానీ భావిస్తే.. తన విధులను విస్మరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. అలా కాకుండా, రిస్క్ ఆధారిత పర్యవేక్షణ, ఆఫ్సైట్ నిఘా, నిర్వహణ వ్యవస్థలను ఆన్సైట్లో తనిఖీలు చేయడం వంటి త్రిముఖ వ్యూహాన్ని పాటించవచ్చని పేర్కొంది. -
రుణ వృద్ధికి ఆ నిధులు సరిపోవు!
ముంబై: కేంద్ర ప్రభుత్వం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2017 అక్టోబర్లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్లు బ్యాంకింగ్ రుణ వృద్ధికి ఎంతమాత్రం సరిపోవని మూడీస్ పేర్కొంది. ఇది కేవలం రెగ్యులేటరీ (నియంత్రణా పరమైన) మూలధన అవసరాలకు తగిన మొత్తమేనని విశ్లేషించింది. 2017–18, 2018–19లకు సంబంధించి బ్యాంకులకు కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల తాజా మూలధనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఏడాది బడ్జెట్లో రూ. 65,000 కోట్లు కేటాయించింది. ఈ అంశాలపై మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అల్కా అంబరసు అభిప్రాయాల్లో ముఖ్యమైనవి చూస్తే... ళి ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధన కొరతను ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ నుంచి అదనపు క్యాపిటల్ను బ్యాంకింగ్ సమీకరించుకోలేకపోవడం దీనికి కారణం. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ ధరలు దాదాపు 19 శాతం తగ్గాయి. ►కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల ప్యాకేజ్ని ప్రకటిస్తున్న సమయంలో బ్యాంకులు కూడా ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.58,000 కోట్లు సమీకరించుకోగలవన్న అంచనాతో ఉంది. అయితే ఇప్పటి వరకూ దాదాపు రూ.10,000 కోట్లు మాత్రమే సమీకరించుకోగలిగాయి. ► అంతర్గత మూలధన సృష్టి సామర్థ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులకు గణనీయంగా పడిపోయింది. వాటి బలహీన ఫైనాన్షియల్ పరిస్థితులు దీనికి కారణం. ఇక మరోవైపు ప్రభుత్వ బాండ్ ఈల్డ్ పెరగడం బ్యాంకుల పెట్టుబడుల ఆదాయంపై ప్రభావం చూపుతోంది. ఆయా అంశాలన్నీ దీర్ఘకాలంలో బ్యాంకింగ్ మూల«ధన సమస్యలు సృష్టించేవే. భారత్ వ్యయాల తగ్గింపు తప్పదు.. ఇదిలావుండగా, ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పిత్తి (2018–19)లో 3.3 శాతానికి కట్టడి చేయడం కేంద్రానికి కీలకమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఇందుకుగాను వ్యయాలను తగ్గించే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. ‘అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో ఉన్న చమురు ధరల నేపథ్యంలో, పెట్రోలియం, డీజిల్ ప్రొడక్ట్స్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ఇబ్బందే. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు తగ్గుతాయి. ద్రవ్యలోటు పెరుగుతుంది. ఇది దేశ సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్పై ఒత్తిడి తెచ్చే అంశం’’ అని మూడీస్ విశ్లేషించింది. మూడీస్ గత ఏడాది 13 యేళ్లలో మొట్టమొదటిసారి భారత్ సావరిన్ రేటింగ్ను స్టేబుల్ అవుట్లుక్తో ‘బీఏఏ2’కు పెంచిన సంగతి తెలిసిందే. పీఎస్బీల చీఫ్లతో నేడు కేంద్రం భేటీ న్యూఢిల్లీ: పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చీఫ్లతో కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ శుక్రవారం సమావేశం కానున్నారు. ఆయా బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. ముంబైలో జరిగే ఈ సమావేశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు ప్రాంతాలకు చెందిన పీఎస్బీలకు సంబంధించి 15 మంది సీఈవోలు దీనికి హాజరు కానున్నారు. 2017–18 ఆర్థిక ఫలితాలు వెల్లడైన తర్వాత పీఎస్బీల చీఫ్లతో కేంద్రం సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం చాలా మటుకు బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొండిబాకీల పరిష్కారానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలో మొత్తం 11 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 7 బ్యాంకులు పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే. ఆర్బీఐ వాచ్లిస్ట్లో అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి. నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నాలుగో త్రైమాసికంలో ఏకంగా రూ. 13,417 కోట్లు నష్టం ప్రకటించింది. కుంభకోణానికి సంబంధించిన రూ. 14,356 కోట్ల మొత్తంలో సుమారు సగభాగం .. అంటే రూ. 7,178 కోట్లకు పీఎన్బీ ప్రొవిజనింగ్ చేసింది. మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు త్రైమాసికాల్లో సర్దుబాటు చేయనుంది. మరోవైపు, ఎస్బీఐ సైతం జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 7,718 కోట్ల నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఏడాది నాలుగో త్రైమాసికంలో నమోదైన రూ. 3,442 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు. -
బ్యాంకులిక గట్టెక్కినట్లే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) గడ్డుకాలం దాటిపోయినట్లేనని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. మొండిబాకీల ప్రక్షాళన నేపథ్యంలో మరో ఒకటి రెండు త్రైమాసికాలు కొంత నష్టాలు నమోదైనా ఫర్వాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోని ఏ బ్యాంకూ దివాలా తీసే పరిస్థితి ఉండబోదని, వాటికి అవసరమైన స్థాయిలో కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్ స్పష్టం చేశారు. ‘బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనలో భాగంగా మొండిబాకీలను పారదర్శక రీతిలో గుర్తించడం జరుగుతోంది. ఈ క్రమంలో బ్యాంకులు అధిక కేటాయింపులు జరపాల్సి వచ్చినా.. ఒకటి రెండు త్రైమాసికాల్లో నష్టాలు నమోదు చేసినా ఫర్వాలేదు. ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం. బ్యాంకులకు ఇక కష్టకాలం దాటిపోయినట్లే. ఇక నుంచి అంతా సానుకూలంగానే ఉండగలదు‘ అని ఆయన చెప్పారు. మొండిబాకీల భారంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాకీల ఎగవేత సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని కుమార్ చెప్పారు. బ్యాంకులను గట్టెక్కించేందుకు ప్రతిపాదించిన రూ. 2.11 లక్షల కోట్లలో ఇంకా రూ. 65,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ప్రభుత్వం ఏ బ్యాంకునూ దివాలా తియ్యనివ్వదని ఆయన చెప్పారు. పీఎస్బీలు అమలు చేసే సంస్కరణల ఆధారంగా వాటికి ర్యాంకింగ్స్ ఇవ్వనున్నామని కుమార్ వివరించారు. మరోవైపు, పలు పీఎస్బీల్లో సీఈవో, ఎండీల స్థానాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ జాబితాలో ఆంధ్రా బ్యాంక్ సహా దేనా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. ఈ–కామర్స్ సంస్థలతో ఆర్థిక శాఖ భాగస్వామ్యం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ–కామర్స్ సంస్థలతో జతకట్టింది. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలను అందించేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓలా, ఉబెర్ సహా 24కుపైగా సంస్థలతో చేతులు కలిపామని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. చిన్న వ్యాపార రుణాలను అందించడమే ఈ త్రిముఖ (రుణదాత, పరిశ్రమ, ప్రభుత్వం) భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల వరకు రుణాలను అందించాలనే లక్ష్యంతో పీఎంఎంవై పథకాన్ని ఆవిష్కరించింది. బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈ రుణాలను జారీచేస్తాయి. ‘ఓలా, ఫ్లిప్కార్ట్, ఉబెర్, డబ్బావాలాలు, కేబుల్ ఆపరేటర్లు, జొమోటొ వంటి పలు కంపెనీలున్నాయి. ఇవి చిన్న వ్యాపార భాగస్వాములను కలిగి ఉంటాయి. వీరికి రుణ సదుపాయం అవసరముంటుంది. ముద్రా స్కీమ్ కింద వీరికి సాయం చేయాలని భావిస్తున్నాం’ అని రాజీవ్ కుమార్ తెలిపారు. -
బ్యాంకులకు ‘భూషణ’ం
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా తీసిన భూషణ్ స్టీల్ను టాటా స్టీల్ కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ లావాదేవీతో పీఎస్బీల మొండిబాకీలు (ఎన్పీఏ) సుమారు రూ. 35,000 కోట్ల మేర తగ్గుతాయని ఆయన తెలియజేశారు. ఒక్కో పీఎస్బీ ఎన్పీఏలు సుమారు రూ.500 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల దాకా తగ్గగలవని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆయన తెలిపారు. అలాగే, పీఎస్బీలకు 6 కోట్ల పైగా షేర్లు కూడా దాఖలుపడతాయని, ఇది కూడా ప్రయోజనకరమైన విషయమేనని ఆయన పేర్కొన్నారు. టాటా స్టీల్ తన అనుబంధ సంస్థ ద్వారా భూషణ్ స్టీల్లో 72.65 శాతం వాటాలను వేలంలో రూ.36,400 కోట్లు వెచ్చించి దక్కించుకున్న సంగతి తెలిసిందే. విక్రయంపై స్టేకి ఎన్సీఎల్ఏటీ నిరాకరణ.. భూషణ్ స్టీల్ను టాటా స్టీల్ కొనుగోలు చేయడంపై స్టే విధించేందుకు నేషనల్ కంపెనీ లా అïప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. దివాలా పరిష్కార ప్రక్రియ యథాప్రకారం కొనసాగుతుందని పేర్కొంది. అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడి దివాలా పరిష్కార ప్రక్రియ ముగింపు ఉంటుందని తెలిపింది. భూషణ్ స్టీల్తో లాభమే: టాటా స్టీల్ ఉక్కు ప్లాంట్ను ఏర్పాటు చేయాలంటే సుదీర్ఘ కాలం పట్టేసే నేపథ్యంలో.. భూషణ్ స్టీల్ను కొనుగోలు చేయడం తమకు ప్రయోజనకరమేనని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ చెప్పారు. టేకోవర్ విషయంలో నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నామన్నారు. -
ప్రైవేటీకరణ పరిష్కారం కాదు
హైదరాబాద్/న్యూఢిల్లీ: మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదా ఒక దానిలో మరొకదాన్ని విలీనం చేయాలన్న ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీనమో, ప్రైవేటీకరణో.. బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమార్గం కాబోదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.నిర్వహణ లోపాలు కేవలం పీఎస్బీలకు మాత్రమే పరిమితం కాదని... గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వంటి దిగ్గజ ప్రైవేట్ బ్యాంకు కూడా విఫలమైందని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల బోర్డులకు మరింత సాధికారతనివ్వాలని, రాజకీయ జోక్యం లేకుండా సమర్థంగా పనిచేసే పరిస్థితులు కల్పించాలని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో వి.బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఇంకా చాలా మటుకు జనాభాకు బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో లేనందున.. వారికి ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకే కాకుండా సామాజిక కోణంలో చూసినా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. సీఈవోల ఎంపిక, వారి జీతభత్యాలు, పనితీరు మదింపు, స్వతంత్ర బోర్డు సభ్యుల ఎంపిక తదితర అంశాల్లో బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోకు (బీబీబీ) మరిన్ని అధికారాలు ఉండాలన్నారు. ‘బ్యాంకుల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. కఠినతరమైన నియంత్రణ, పర్యవేక్షణ యంత్రాంగంతో పాటు సంస్థాగతంగా సరైన వ్యవస్థ ఉంటే పీఎస్బీలు రాణించేందుకు అవకాశముంది’’ అని బాలకృష్ణన్ పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మెరుగ్గా పనిచేసేందుకు మరింత స్వేచ్ఛ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇన్ఫీ మరో మాజీ సీఎఫ్వో టీవీ మోహన్దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యాజమాన్యమే వాటిని సరిగ్గా పనిచేయనివ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరో ఏడాది దాకా ప్రైవేటీకరణ ఉండదు .. పీఎస్బీల ప్రైవేటీకరణ ఇప్పుడిప్పుడే ఉండబోదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాబోయే సంవత్సర కాలంలో ప్రభుత్వ రంగానికి చెందిన ఏ బ్యాంకును ప్రైవేటీకరించడం లేదా ఇతర బ్యాంకులో విలీనం చేయడమో ఉండదని పేర్కొంది. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన అనంతరం అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఈ విషయం చెప్పారు. ‘వచ్చే సంవత్సర కాలంలో ఏ పీఎస్బీని విలీనం చేయడమో లేదా ప్రైవేటీకరించడమో జరగదని ఆర్థిక మంత్రి హామీనిచ్చారు. బ్యాంకులను మెరుగుపర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అయినప్పటికీ.. ప్రస్తుతానికి కనీసం ఏడాది వ్యవధిలో వాటిని ప్రైవేటీకరించే యోచనేదీ లేదని ఆయన చెప్పారు’ అని వెంకటాచలం వివరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న భారీ స్కామ్, కుట్రదారు నీరవ్ మోదీని వెనక్కి తెప్పించే విషయంలో తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు జైట్లీతో భేటీ అయినట్లు ఆయన వివరించారు. పీఎన్బీ స్కాంపై విచారణ చురుగ్గా కొనసాగుతోందని మంత్రి భరోసానిచ్చినట్లు వెంకటాచలం చెప్పారు. మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు: వినోద్ రాయ్ బ్యాంకింగ్ నియామకాల విషయంలో ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ప్రభుత్వానికి బీబీబీకి మధ్య ఎటువంటి సమన్వయ లోపం లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించిందని ఆయన స్పష్టం చేశారు. పలు అంశాలకు సంబంధించి బీబీబీ, ప్రభుత్వానికి మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయ్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగురపర్చే లక్ష్యంతో 2016 ఏప్రిల్ 1న ఏర్పాటైన బీబీబీ కాలపరిమితి ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. గడిచిన రెండేళ్లలో ఆర్బీఐ, ప్రభుత్వ సహకారంతో బీబీబీ తమకు అప్పగించిన పని విషయంలో గణనీయమైన పురోగతి సాధించిందని రాయ్ ఒక ఇంట ర్వ్యూలో వివరించారు. నియామక ప్రక్రియల్లో కేంద్రం ఎన్నడూ జోక్యం చేసుకోలేదని తెలిపారు. -
బ్యాంకుల్లో కేంద్రం వాటా తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో కేంద్రం తనకున్న వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకోవాలని అసోచామ్ సూచించింది. పీఎన్బీలో బయటపడిన రూ.11,400 కోట్ల కుంభకోణం వాటా తగ్గింపునకు బలమైన సంకేతంగా పేర్కొంది. వాటాదారులకు జవాబుదారీగా, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో, ప్రైవేటు బ్యాంకుల మాదిరిగా పనిచేసేలా ప్రభుత్వరంగ బ్యాంకులను అనుమతించాలని అసోచామ్ సూచించింది. ‘‘చారిత్రకంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకులు ఒక సంక్షోభం తర్వాత ఒక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. వీటిలో ప్రభుత్వం ప్రధాన వాటాదారుగా ఉన్నప్పటికీ పన్ను చెల్లింపులదారుల డబ్బుతో వీటిని ఒడ్డున పడేసే విషయంలో ఒక పరిమితి అంటూ ఉంది’’అని అసోచామ్ తన ప్రకటనలో పేర్కొంది. బ్యాంకుల్లో ఉన్నత పదవులను ప్రభుత్వ ఉద్యోగాలకు కొనసాగింపుగా భావించే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకుంటే, వాటికి మరింత స్వతంత్రతతోపాటు సీనియర్ మేనేజ్మెంట్లో బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతాయని అసోచామ్ సూచించింది. -
బ్యాంకులకు సానుకూల రేటింగ్
ముంబై: మొండి బాకీల సమస్య నుంచి గట్టెక్కే దిశగా అదనపు మూలధనం లభించనున్న 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) రేటింగ్పై క్రిసిల్ సంస్థ సానుకూలంగా స్పందించింది. వాటి అంచనాలను నెగటివ్ నుంచి స్టేబుల్ (స్థిర) స్థాయికి పెంచింది. ఆయా బ్యాంకులు పటిష్టంగా మారడానికి అదనపు మూలధనం ఉపయోగపడగలదని క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. రుణాలకు డిమాండ్ కూడా పుంజుకుంటే బ్యాంకుల మొత్తం పనితీరు కూడా మెరుగుపడగలదని పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 88,139 కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీఎస్బీల అంచనాలపై క్రిసిల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర 18 బ్యాంకుల అంచనాలను స్థిర స్థాయికి క్రిసిల్ పెంచింది. అయితే, ప్రభుత్వం నుంచి ఏకంగా రూ. 8,800 కోట్లు అందుకోనున్న దిగ్గజం ఎస్బీఐ గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆంధ్రా బ్యాంక్, బీవోబీ సహా తొమ్మిది పీఎస్బీల బాసెల్ త్రీ టైర్ 1 బాండ్ల రేటింగ్స్ను, అంచనాలను (నెగటివ్) యధాతథంగా కొనసాగిస్తున్నట్లు క్రిసిల్ తెలిపింది. రీక్యాపిటలైజేషన్ ప్రక్రియ.. ప్రభుత్వ మద్దతును సూచించడంతో పాటు పీఎస్బీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నది కూడా గుర్తు చేస్తుందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. -
అర్హులకు సులభంగా బ్యాంకు రుణాలు
న్యూఢిల్లీ: ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణలతో నిజాయితీగల రుణగ్రహీతలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నుంచి రుణాలు పొందడం సులభం కాగలదని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. నిజాయితీకి పెద్ద పీట వేయడమనేది ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రక్రియ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆయన చెప్పారు. కచ్చితంగా అవసరం ఉండి, నిజాయితీగా వ్యవహరించే రుణగ్రహీతలకు ఏ ఆటంకాలూ లేకుండా రుణాలు లభించేలా చూడటం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ‘‘జీఎస్టీ రిటర్నులు, వివిధ ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా రుణమివ్వటంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. మదింపు ప్రక్రియ కఠినతరం చేయడం వల్ల రుణాలను రాబట్టుకునే ప్రక్రియ మెరుగుపడుతుంది’’ అని కుమార్ వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏకంగా రూ. 8 లక్షల కోట్ల మేర మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొండిబాకీలతో కుదేలైన పీఎస్బీలను గట్టెక్కించేందుకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం రూ. 88,139 కోట్ల మేర అదనపు మూలధనాన్ని అందిస్తోంది. అయితే, నిర్దేశిత సంస్కరణలు అమలు చేయడాన్ని బట్టి కేటాయింపులు ఉంటాయంటూ షరతు విధించిన సంగతి తెలిసిందే. -
మూలధన బాండ్లకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చే ప్రతిపాదనకు లోక్సభ గురువారం ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు మరిన్ని సంస్కరణలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. ఏ బ్యాంకుకు ఎంత ఇవ్వాలి తదితర అంశాలకు సంబంధించి ఆర్థిక సర్వీసుల విభాగం ఇప్పటికే సమగ్రమైన ప్రణాళిక రూపొందించిందని సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అంశంపై జరిగిన చర్చలో ఆయన వివరించారు. మొండిబాకీలను పెంచుకుంటూ కూర్చున్న పీఎస్బీలకు అదనపు మూలధనం సరైనది కాకపోయినప్పటికీ... వాటిని గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా బ్యాంకులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు, మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకోగలిగే సత్తాను పెంచుకునేందుకు ఇది ఉపయోగపడగలదని జైట్లీ చెప్పారు. రీక్యాపిటలైజేషన్ కింద జారీ చేసే బాండ్లకు ఎస్ఎల్ఆర్ హోదా ఉండదని, ట్రేడింగ్కి అనుమతి ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ. 7.33 లక్షల కోట్ల మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎస్బీలను పటిష్టపర్చేందుకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల ప్రణాళికను కేంద్రం గత ఆక్టోబర్లో ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1.35 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీతో పాటు బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా రూ.58,000 కోట్లు సమకూర్చనుంది. -
ప్రభుత్వ బ్యాంకుల్లో శాఖల కోత
న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) ఇక వ్యయ నియంత్రణపై తీవ్రంగా దృష్టిపెట్టనున్నాయి. ఇందులో భాగంగా శాఖలకు కత్తెర వేయనున్నాయి. కేంద్రం కూడా బ్యాంకుల శాఖల క్రమబద్ధీకరణ దిశగా చర్యలు మొదలుపెట్టింది. బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా... ఖర్చులను తగ్గించుకోవడం కోసం నష్టాలతో నడుస్తున్న దేశ, విదేశీ శాఖలను క్రమబద్ధీకరించుకోవాలని ఆర్థిక శాఖ సూచించింది. ‘‘నష్టాలను ఎదుర్కొంటున్న బ్యాంకు శాఖలను కొనసాగించాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ షీట్లపై భారం మోయాల్సిన అవసరం లేదు. కనుక బ్యాంకులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు భారీ పొదుపు చర్యలపైనే కాకుండా ఈ తరహా చిన్న వాటిపైనా దృష్టి పెట్టాలి’’ అని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రభుత్వరంగంలోని అగ్రగామి బ్యాంకులు ఎస్బీఐ, పీఎన్బీ ఇప్పటికే ఈ చర్యలను అమల్లో పెట్టడం గమనార్హం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు దేశవ్యాప్తంగా తనకు 59 ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా, వాటిని ఏకంగా 10 ప్రాంతీయ శాఖలకు తగ్గించుకుంది. వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతోపాటు, పరిపాలన వ్యయాలను తగ్గించుకునేందుకు ఇలా చేసింది. ఒక దేశంలో ఒక్క బ్యాంకు చాలు... విదేశీ శాఖల క్రమబద్ధీకరణ విషయమై చర్చించి, లాభసాటిగా లేని వాటిని మూసివేయడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఒక దేశంలో ఒకటికి మించిన బ్యాంకులు ఉండాల్సిన అవసరం లేదన్నది ఆర్థిక శాఖ ఆలోచనగా అధికార వర్గాలు తెలిపాయి. ఐదారు బ్యాంకులు కలసి ఓ సబ్సిడరీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా నిధుల ఆదాపై దృష్టి సారించాలని సూచించింది. శాఖలను మూసేయడం, సబ్సిడరీలను విక్రయించడంతోపాటు అధిక రాబడులను ఇచ్చే మార్కెట్లపై మరింత దృష్టి సారించే చర్యల్ని బ్యాంకులు పాటించనున్నాయి. ఆర్థిక శాఖ సూచనల మేరకు పీఎన్బీ బ్రిటన్ సబ్సిడరీ అయిన పీఎన్బీ ఇంటర్నేషనల్లో వాటాను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ కూడా విదేశీ శాఖల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాయి. బ్యాంకు ఆఫ్ బరోడాకు 24 దేశాల్లో మొత్తం 107 శాఖలు, కార్యాలయాలు ఉన్నాయి. ఎస్బీఐకి 36 దేశాల్లో 195 కార్యాలయాలు ఉన్నాయి. -
ప్రభుత్వ బ్యాంకుల విలీనం:కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి, ఇప్పటికే విలీన ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిన ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వం ని మంత్రివర్గ ప్యానెల్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విలీనం కార్యక్రమాన్ని పరిశీలించనున్నారని కేంద్రం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియకు ప్రత్యామ్నాయ మార్గంగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రుల బృందం(గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, జీవోఎం) ఏర్పాటుచేసిది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెడ్ గా ఉంటే ప్యానెల్ లో కేంద్రమంత్రులు పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విలీనం చేయదలిచే ప్రభుత్వం బ్యాంకుల వివరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే బ్యాంకుల విలీనం అంశంపై స్వయంగా ఈ కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకుల ఆదాయం, లాభాలు, బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలు, బ్యాంకుల ఆస్తుల నాణ్యత మూలధన నిష్పత్తులు అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది ఆగస్టులో బ్యాంకుల విలీన ప్రక్రియకు క్యాబినెట్ సూత్రప్రాయం ఆమోదం తెలిపింది. బ్యాంకింగ్ కంపెనీల చట్టం, 1970 ప్రకారమే విలీన ప్రక్రియ ఉండనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకుల విలీనమే.. మందు!!
♦ అసెట్ క్వాలిటీ కష్టాలకు చెక్ ♦ ప్రభుత్వ రంగంలో పటిష్టమైన బ్యాంకుల ఆవిర్భావం ♦ ప్రతికూలతల కన్నా ప్రయోజనాలే అధికం ♦ అనువుగా పీఎన్బీ, కెనరా తదితర బ్యాంకులు సాక్షి, బిజినెస్ విభాగం : ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీన ప్రక్రియలను వేగవంతం చేస్తూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంలో చర్చనీయమవుతున్నాయి. ఓ వైపు సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలతో తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ... మరోవైపు కేంద్రం మాత్రం విలీనాల దిశగా చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర కూడా వేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణిస్తూ... విలీనానికి వాణిజ్యపరమైన ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని, ఆయా బ్యాంకుల బోర్డులే మెర్జర్ల ప్రతిపాదనలను ముందుకు తేవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పీఎస్బీల విలీనాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. చిన్న స్థాయిలోనే మిగిలిపోతున్న పలు పీఎస్బీలకు విలీనాలు ప్రయోజనకరమే అంటున్నారు విశ్లేషకులు. నిధుల సమీకరణ వ్యయాలు తక్కువ స్థాయిలో ఉంచుకుంటూ.. లాభదాయకంగా ఉంటే భారీ, పటిష్ట బ్యాంకుల ఏర్పాటే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని వారు చెబుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ సమస్యల గురించి అందరికీ తెలిసినవే కాబట్టి... ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటు ప్రకటన సమయం గురించి పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాతిపదికలు ఇవే కావొచ్చు.. అనలిస్టుల అభిప్రాయం ప్రకారం ప్రాంతీయంగా ఆయా పీఎస్బీలకి ఉన్న పట్టు.. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి, ఆదాయాల వృద్ధి తదితర అంశాలే విలీనాలకు ప్రాతిపదిక కావచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మొదలైనవి విలీనాలకు శ్రీకారం పలికే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బ్యాంకులకు తమ తమ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉండటం.. విలీన ప్రతిపాదనకు ఊతమిస్తోంది. గడిచిన ఆరు నెలలు, ఏడాది కాలంలో ఏదో ఒక సందర్భంలో విలీనాలకు తాము అనుకూలమేనని ప్రకటించడమే కాక రైట్స్ ఇష్యూ తదితర మార్గాల్లో సొంతంగా వనరులు సమకూర్చుకునే సామర్థ్యాన్ని కూడా ఇవి చాటుకున్నాయి. విలీన ప్రక్రియపై కొంత మేర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కూడా బరిలో ఉండగలదని అంచనా. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మెర్జర్కి అనువైన బ్యాంకులుగానే కనిపిస్తున్నప్పటికీ.. విలీనాలకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్కు మరింత మూలధనం అవసరం అవుతుందని ఓ బ్రోకరేజి సంస్థకు చెందిన ఈక్విటీస్ విభాగం హెడ్ చెప్పారు. ఇక ఇండియన్ బ్యాంక్ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. విలీనాల బరిలో దూకేంత పెద్ద బ్యాంకు కాదని పేర్కొన్నారు. ప్రధాన కారణాలు ఏంటంటే... విలీనాలకు ప్రధానంగా రెండు కారణాలు చూపుతున్నారు. కరెంటు అకౌంటు, సేవింగ్ అకౌంటు (కాసా) నిష్పత్తి తక్కువగా ఉండటం ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రధానమైన బలం. కాసా డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు 34% వాటా ఉంటే.. ప్రైవేట్ బ్యాంకులకు 30% ఉంది. ఇక బ్యాంకుల్లో జరిగే డిపాజిట్లలో సుమారు 70% వాటా పీఎస్బీలదే. ఇప్పుడిప్పుడే ప్రైవేట్ బ్యాంకులు పుంజుకుంటున్నప్పటికీ.. పీఎస్బీల్లోకి వచ్చి పడే డిపాజిట్ల పరిమాణం భారీగానే ఉంటోంది. గతేడాది పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇది మరోసారి సుస్పష్టంగా కనిపించింది. పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు కోతతో.. డిపాజిట్లు తరలిపోకుండా తమ దగ్గరే అట్టే పెట్టుకోవడానికి కూడా పీఎస్బీలకు విలీనాలు తప్పనిసరిగా మారుతోంది. రుణాలకు డిమాండ్ పుంజుకున్న పక్షంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది చాలా కీలకం. చాలా బ్యాంకులకు ఎస్బీఐ, పీఎన్బీ వంటి అగ్రశ్రేణి బ్యాంకుల స్థాయి లేకపోవడంతో భారీ కార్పొరేట్ రుణాలు వంటి వాటి విషయంలో అవి చిన్నా, చితకా బ్యాంకులుగానే కొనసాగాల్సి వస్తోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నా విలీనాలే ఉత్తమ మార్గంగా పరిశీలకులు చెబుతున్నారు. -
జోరుగా బ్యాంకుల విలీనాలు..
♦ ప్రతిపాదనల పరిశీలనకు ప్రత్యామ్నాయ యంత్రాంగం ♦ కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ: పటిష్టమైన, భారీ బ్యాంకుల ఏర్పాటు దిశగా మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. విలీన ప్రతిపాదనలను పరిశీలించి, సత్వర నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏఎం ఏర్పాటు యోచన ద్వారా పీఎస్బీల విలీనానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘పటిష్టమైన, పోటీతత్వంతో కూడిన బ్యాంకుల ఏర్పాటు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది‘ అని వివరించింది. పీఎస్బీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏఎం ఏర్పాటు నిర్ణయాన్ని వివరిస్తూ.. విలీనానికి సంబంధించి ఆయా పీఎస్బీల బోర్డుల నుంచి వచ్చే ప్రతిపాదనలను ప్రత్యామ్నాయ యంత్రాంగం పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేకం ఉన్నాయి. పటిష్టమైన బ్యాంకుల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటిదాకా జరిపిన విలీనాల అనుభవం సానుకూలంగానే ఉంది‘ అని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న రుణ అవసరాలు తీర్చేందుకు, నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా పీఎస్బీలు సొంతంగా వనరులను సమకూర్చుకునేందుకు కన్సాలిడేషన్ దోహదపడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విలీనాలపై కొంత పురోగతి ఉండొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఎస్బీఐలో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఎస్బీఐ కాకుండా 20 పీఎస్బీలు ఉన్నాయి. విలీనాల వార్తలతో పీఎస్బీల షేర్లు బుధవారం పెరిగాయి. బీఎస్ఈ బ్యాంకెక్స్ 1.39% లాభంతో 27,455 వద్ద ముగిసింది. వ్యాపారాంశాలే ప్రాతిపదిక.. పటిష్టమైన బ్యాంకుల ఏర్పాటు నిర్ణయానికి వ్యాపారపరమైన అంశాలే పూర్తి ప్రాతిపదికని జైట్లీ చెప్పారు. ఈ విలీనాల ఊతంతో.. మార్కెట్లపరంగా వచ్చే షాకులను తట్టుకుని నిల్చేలా బ్యాంకింగ్ వ్యవస్థ సామర్ధ్యం సంతరించుకోగలదని తెలిపారు. కన్సాలిడేషన్ ప్రతిపాదనలు ఆయా బ్యాంకుల బోర్డుల నుంచే రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విలీన విధివిధానాల రూపకల్పనకు సూత్రప్రాయ ఆమోదం కోసం బ్యాంకుల నుంచి వచ్చే ప్రతిపాదనలను ఏఎం పరిశీలిస్తుందని జైట్లీ చెప్పారు. పర్యవేక్షణకు మంత్రుల కమిటీ కూడా ఉంటుందని, ఇందులో సభ్యుల ఎంపికపై ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బ్యాంకుల విలీనాలు ఉండొచ్చన్న విషయంపై ఇదమిత్థంగా ఆయన సంఖ్యేమీ వెల్లడించలేదు. దేశీయంగా బ్యాంకులు కొన్ని ఉన్నా గానీ.. పటిష్టమైనవిగా ఉండాలని 1991లో నరసింహం కమిటీ సిఫార్సు చేసినప్పటికీ.. 2016లో గానీ చర్యలు పూర్తి స్థాయిలో సాకారం కాలేదని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఎస్బీఐలో 6 బ్యాంకుల విలీనం రికార్డు సమయంలో జరిగిందని తెలిపింది. ఉద్యోగాల కోత ఉండదు.. ఈ కన్సాలిడేషన్తో ఉద్యోగాల కోత ఉండబోదని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి. విలీనానంతరం ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలేవీ ఉండకుండా ప్రభుత్వం చూస్తుందని పేర్కొన్నాయి. బ్యాంక్ జాతీయీకరణ చట్టానికి లోబడి పీఎస్బీల విలీనాలు ఉంటాయని తెలిపాయి. ఏఎం నుంచి సూత్రప్రాయ ఆమోదం వచ్చాక మిగతా నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, షేర్ల బదలాయింపు నిష్పత్తిని నిర్ణయించాల్సి ఉంటుందని వివరించాయి. అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత విలీనానికి క్యాబినెట్ తుది అనుమతి ఇస్తుంది. మరోవైపు, పీఎస్బీల విలీన అంశంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా ఉద్యోగులు సహా అన్ని వర్గాలను సంప్రదించాలని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్వోబీడబ్ల్యూ) వైస్ ప్రెసిడెంట్ అశ్విని రాణా కోరారు. -
ఇక.. బ్యాంకుల విలీన మేళా!!
♦ క్యూ1 ఫలితాల తర్వాత నుంచి ప్రక్రియ షురూ ♦ పనితీరు, ఆర్థిక భారం తదితర అంశాలే ప్రాతిపదిక న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీన ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదంటున్నప్పటికీ.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలన్నీ వెల్లడైన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. విలీనాలపై నిర్ణయాలు తీసుకునే ముందు ఆయా బ్యాంకుల ఆర్థిక పనితీరుతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చని వివరించారు. ప్రాంతీయంగా సమతుల్యత, భౌగోళికంగా విస్తరణ, ఆర్థిక భారం, మానవ వనరుల ఏకీకరణ మొదలైనవి ఇందులో ఉండగలవని పేర్కొన్నారు. బలహీన బ్యాంకును బలమైన బ్యాంకులో విలీనం చేస్తే పటిష్టమైన బ్యాంకు కూడా కూలిపోయే అవకాశం ఉన్నందున అటువంటి చర్యలు ఉండబోవని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదంతా కూడా సంక్లిష్టమైన ప్రక్రియగా ఆయన అభివర్ణించారు. ఏదైతేనేం బ్యాంకుల జూన్ త్రైమాసిక ఫలితాలు వెల్లడయ్యాక.. ప్రక్రియ ప్రారంభం కాగలదని అధికారి తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్తో పాటు అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు.. ఎస్బీఐలో విలీనమైన తర్వాత నుంచి మిగతా పీఎస్బీల విలీనంపైనా వార్తలు వస్తున్నాయి. మొండిబకాయిలు, ఆర్థిక స్థితిగతులు, ఉపయోగిస్తున్న టెక్నాలజీ తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు దేనా బ్యాంకు సహా కొన్ని పీఎస్బీలతో ఆర్థిక శాఖ కొన్నాళ్ల క్రితం సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే, పీఎస్బీల విలీన ప్రతిపాదనేదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదంటూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వారం రోజుల క్రితం లోక్సభకు తెలిపారు. ఈ నేపథ్యంలో క్యూ1 ఫలితాల తర్వాత పీఎస్బీల విలీన ప్రక్రియ మొదలుకావొచ్చన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. -
మిగిలేవి పదో.. పన్నెండో!
♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు ♦ 3–4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దే ప్రయత్నాలు ♦ ఆంధ్రా బ్యాంకు స్వతంత్రంగానే కొనసాగే అవకాశాలు న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ద్వారా మొత్తం మీద 3–4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) 21 ఉండగా.. విలీనాలతో ఈ సంఖ్య 10–12కి తగ్గనుంది. ఎస్బీఐ స్థాయిలో మరో 3–4 బ్యాంకులను తయారు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి పెట్టే ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుతో పాటు మరికొన్ని మధ్యస్థాయి బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగే అవకాశముందని వివరించాయి. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనంతో ఊపు మీద ఉన్న కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మొండి బకాయిలు అదుపులోకి వస్తే మరో విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సాలిడేషన్పై మరింతగా కసరత్తు జరుగుతోందంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అటు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సైతం వ్యవస్థలో కొన్ని పెద్ద బ్యాంకులు, కొన్ని చిన్నవి, ఇంకొన్ని స్థానిక బ్యాంకులు మొదలైనవి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్బీహెచ్ సహా అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును ఈ ఏడాది ఏప్రిల్ 1న విలీనం చేశారు. దీంతో ఎస్బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల జాబితాలో చేరింది. ఈ విలీనంతో ఎస్బీఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు, శాఖలు 24,000కు, ఏటీఎంల సంఖ్య 59,000కు చేరింది. పీఎన్బీ తదితర బ్యాంకుల్లో విలీనం: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) వంటి పెద్ద పీఎస్బీల్లో కొన్ని చిన్న బ్యాంకులను విలీనం చేసేందుకు ఆస్కారముందని మరో అధికారి తెలిపారు. ప్రాంతీయంగా సమతుల్యత, భౌగోళికంగా విస్తరణ, ఆర్థిక భారం, సులభతరమైన మానవ వనరుల బదలాయింపు ప్రక్రియ మొదలైన అంశాలన్నీ విలీనాలపై తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరీ బలహీనమైన బ్యాంకును పటిష్టమైన బ్యాంకులో విలీనం చేస్తే పెద్ద బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి.. అటువంటి ప్రతిపాదనలేమీ ఉండబోవని సంబంధిత అధికారి పేర్కొన్నారు. -
నిధుల వేటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు
♦ రూ.58,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు ♦ జాబితాలో ఎస్బీఐ, బీవోబీ, ఐడీబీఐ బ్యాంకులు ♦ బాసెల్–3 అవసరాల నేపథ్యంలో తప్పనిసరి న్యూఢిల్లీ: బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా మూలధన అవసరాలను చేరుకునేందుకు, తమ ఖాతాల ప్రక్షాళనకు వీలుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు)... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాజా ఈక్విటీ జారీ ద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేయనున్నాయి. ఎస్బీఐ, బీవోబీ, ఐడీబీఐ బ్యాంకు సహా పలు బ్యాంకులు ఈ దిశగా సన్నాహాలను ప్రారంభించాయి. ముఖ్యంగా ఎస్బీఐ ఒక్కటే రూ.15,000 కోట్ల సమీకరణ యత్నాల్లో ఉంది. అర్హత సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్యూఐపీ) ద్వారా నిధులను సేకరించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివరికి పూర్తికావచ్చు. ఇక, బీవోబీ రూ.6,000 కోట్లు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.16,500 కోట్లను సమీకరించనున్నాయి. ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, ఐడీబీఐ బ్యాంకులు ఒక్కోటీ రూ.5,000 కోట్ల సమీకరణకు గాను ఇప్పటికే బ్యాంకు బోర్డుల ఆమోదాన్ని తీసుకున్నాయి. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,950 కోట్లను సమీకరించనుంది. అలాగే, కార్పొరేషన్ బ్యాంకు, సిండికేట్బ్యాంకు రూ.3,500 కోట్ల చొప్పున, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రూ.2,000 కోట్ల సమీకరణ ప్రణాళికలతో ఉన్నాయి. కేంద్రం రూపొందించిన ఇంద్రధనుష్ క్యాక్రమంలో భాగంగా పీఎస్బీలు మార్కెట్ల నుంచి రూ.1.10 లక్షల కోట్లను సమీకరించాల్సి ఉంది. 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్న బాసెల్–3 ప్రమాణాలను అందుకునేందు గాను నిధుల సమీకరణ అవసరం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం సైతం రూ.70,000 కోట్లను తనవంతు సాయంగా అందించనుంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.50,000 కోట్లను సమకూర్చగా, 2018–19 నాటికి మిగిలిన నిధులను అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,000కోట్లను ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించడం తెలిసిందే. మరోవైపు, పీఎస్బీల ఎన్పీఏలు రూ.6లక్షల కోట్లకు చేరినందున ఖాతాల ప్రక్షాళన అవసరం కూడా ఏర్పడింది. -
మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు
♦ 2016–17లో 35 శాతం పైకి ♦ ప్రైవేటు బ్యాంకుల్లోనూ పెరిగిపోతున్న ఎన్పీఏలు ♦ 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు ♦ యాక్సిస్, యస్ బ్యాంకుల ఖాతాల్లో తేడాలు ♦ ఐవోబీ, ఐడీబీఐ బ్యాంకుల్లోనూ తార స్థాయికి ♦ సరైన స్థాయిలోలేని నిధుల కేటాయింపులు న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు 2016–17 ఆర్థిక సంవత్సరంలోనూ మొండి బకాయిల సమస్య నుంచి బయటపడలేకపోయాయి. సరికదా గత కాలపు రుణాల సమస్యలు వాటిని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. బడా కార్పొరేట్ సంస్థల నుంచి ఛోటా మోటా కంపెనీల వరకు, ఔదార్యంతో భారీగా రుణాలను మంజూరు చేసేసిన బ్యాంకులు... ఇప్పుడు వాటిని వసూలు చేసుకోలేక, రద్దు చేసి అందుకు సరిపడా నిధులు కేటాయించలేక (ప్రొవిజన్స్) ‘మింగలేక కక్కలేక’ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకూ మొండి బకాయిలు (వసూలు కాకుండా మొండిగా మారినవి/ఎన్పీఏలు) ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)కే ఎక్కువ శాతం పరిమితం అనుకుంటుంటే... ఇన్నాళ్లు వాటిని కప్పి పెట్టిన ప్రైవేటు రంగ బ్యాంకుల దాపరికాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎన్పీఏలను వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపిస్తున్నట్టు ఇటీవలి యెస్ బ్యాంకు ఉదంతం తెలియజేస్తోంది. మొత్తానికి దేశీయ స్టాక్ మార్కెట్లో నమోదిత బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.7.7 లక్షల కోట్లకు చేరి సవాల్గా మారాయి. ఏడాదిలోనే భారీగా పెరుగుదల మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యాంకులు ప్రకటించాయి. సిటీ యూనియన్ బ్యాంకు వెల్లడించాల్సి ఉంది. ఇటీవలే ఐదు బ్యాంకులను తనలో కలిపేసుకున్న ఎస్బీఐ సైతం కన్సాలిడేటెడ్ ఫలితాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన అన్ని బ్యాంకుల ఖాతా పుస్తకాల ప్రకారం స్థూల ఎన్పీఏలు రూ.7.7 లక్షల కోట్లకు చేరినట్టు స్పష్టమవుతోంది. 2016 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో స్థూల ఎన్పీఏలు రూ.5.70 లక్షల కోట్లు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొండి రుణాలు 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నికర ఎన్పీఏలు 58 శాతం పెరిగిపోవడం గమనార్హం. కానీ, బ్యాంకులు మొండి బాకీల కోసం చేస్తున్న కేటాయింపులు అరకొరగానే ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాల ప్రక్షాళన కార్యక్రమాన్ని 2015–16 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల నుంచే మొదలు పెట్టగా... ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం ఈ ప్రక్రియను గత ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించాయి. దీంతో వాటి ఖాతాల్లోని మకిలి బయటకొస్తోంది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు ఏకంగా 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు చేరడం దీన్నే సూచిస్తోంది. మరి అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్బీఐలో కలిసిన బ్యాంకులను మినహాయించి చూస్తే) ఎన్పీఏల పెరుగుదల చాలా తక్కువగా 20 శాతంగానే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో ఒక విధంగా తమ ఖాతాల ప్రక్షాళనను భారీగానే నిర్వహించాయి. ఆర్బీఐ సమీక్షతో వెలుగులోకి పీఎస్బీల్లో మొండి బకాయిల ప్రక్షాళన కార్యక్రమం 2015–16 ద్వితీయార్ధం నుంచి ఆరంభమైంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించిన (ఏక్యూఆర్) ఆర్బీఐ... వసూలు కాకుండా ఒత్తిడిలో ఉన్న రుణాలను ఎన్పీలుగా ప్రకటించి వాటికి నిధులు కేటాయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఫలితం 2015 డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్థిక ఫలితాల్లో కనిపించడం ఆరంభమైంది. ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు 2015 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ఉన్న స్థూల ఎన్పీఏలను విశ్లేషించి చూస్తే ఆ తర్వాతి కాలంలో పీఎస్బీల కంటే ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల పెరుగుదల 300% మించి ఉంది. ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు ఈ రెండు బ్యాంకులు ఎన్పీఏలను తక్కువ చేసి చూపించినట్టు స్పష్టమవుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఎన్పీల విషయమై ఆర్బీఐ నిర్ధారణకు, తమ అంచనాలకు మధ్య తేడా ఉన్నట్టు ఈ రెండు బ్యాంకులు ఇటీవలే ప్రకటించాయి కూడా. ఈ తేడా రూ.9,478 కోట్లు అని యాక్సిస్ బ్యాంకు వెల్లడించగా... యాక్సిస్ ఖాతాల పరంగా వెలుగు చూడని ఎన్పీఏలు రూ.4,177 కోట్లు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో యునైటెడ్ బ్యాంక్, ఐడీబీఐ ఎన్పీఏలు భారీగా పెరిగాయి. పరిమితి దాటితే ఆంక్షలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఎన్పీఏల శాతం గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా సత్వర దిద్దుబాటు చర్యల్ని చేపట్టాల్సి ఉంటుంది. అంటే నియమకాలు నిలుపుచేయడం, శాఖల విస్తరణకు బ్రేక్వేయడం వం టివి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చూస్తే... నికర ఎన్పీఏలు 6–9% ఉంటే ఆ బ్యాంకులు రిస్క్ కేటగిరీ–1 పరిధిలోకి వస్తాయి. ఎన్పీఏలు 9–12% ఉంటే రెండో రిస్క్ విభాగంలోకి, 12%పైన ఉన్న బ్యాంకులు మూడో కేటగిరీ కిందకు వస్తాయి. నికర విలువను దాటేసిన ఎన్పీఏలు: మెకిన్సే కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కో దేశీ బ్యాంకుల మొండి బకాయిల సంక్షోభంపై తాజాగా నివేదిక విడుదల చేసింది. దేశీయ బ్యాంకులకు చెందిన ఒత్తిడిలో ఉన్న మొత్తం రుణాలు (పునరుద్ధరించిన రుణాలు సహా) ఈ రంగం మొత్తం నెట్వర్త్ను మించిపోయాయి. ఈ రంగం నికర విలువ రూ.9.24 లక్షల కోట్లు కాగా, ఒత్తిడిలో ఉన్న రుణాల విలువ రూ.9.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు మెకిన్సే వివరించింది. ‘‘తక్కువ వడ్డీ రేట్ల వాతావరణంలోనూ రుణాల్లో వృద్ధి లేకపోవడం, ఒత్తిడితో కూడిన రుణాలు అధిక స్థాయికి చేరడం, టెక్నాలజీ, నియంత్రణల పరంగా వచ్చిన మార్పులు భారత బ్యాంకింగ్ రంగానికి తుఫాను మాదిరి వాతావరణాన్ని కల్పించాయి’’ అని మెకిన్సే పేర్కొంది. ఎన్పీఏ ఆర్డినెన్స్ పరిధిలో 15 రోజుల్లో ప్రణాళిక! న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ)ల సమస్య పరిష్కారానికి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో పక్షం రోజుల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేయనుంది. ఎన్పీఏలు రూ. 8 లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశలో ఆర్బీఐకి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ ఇటీవలే కేంద్రం ఒక ఆర్డినెన్స్ను జారీ చేయడం తెలిసిందే. ఎన్పీఏలకు సంబం ధించి సమస్యల గుర్తింపునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు, సమ స్య పరిష్కార ప్రక్రియలో సమయ కేటాయింపు, నిర్ణయం వంటి అంశాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్ల డించాయి. ఈ సమస్య 60 నుంచి 90 రోజులు ఉంటుందని కూడా తెలుస్తోంది. బడా మొండిబకాయిలకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ 50 కేసులను గుర్తించినట్లు సమాచారం. ఆర్డినెన్స్ అమలు పర్యవేక్షణకు కమిటీ ఎన్పీఏ ఆర్డినెన్స్ను ఆచరణలో పెట్టే దిశగా ఆర్బీఐ చర్యల్ని ఆరంభించింది. ఇందు కోసం తన అధికార పరిధిలో పర్యవేక్షణ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. అలాగే, సమస్య తీవ్రత దృష్ట్యా కమిటీని విస్తరించి మరింత మంది సభ్యులకు చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. -
17 బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణలు!!
ఐడీబీఐ తరహాలో వీటిపైనా నియంత్రణలకు అవకాశం: ఇక్రా న్యూఢిల్లీ: ఒకటి రెండు కాదు ఏకంగా 17 ప్రభుత్వరంగ బ్యాంకులు ఐడీబీఐ బ్యాంకు తరహాలో ఆర్బీఐ నియంత్రణలను ఎదుర్కొనే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ ఇక్రా పేర్కొంది. ఆస్తులపై ప్రతికూల రాబడులను ఎదుర్కొంటూ నికర ఎన్పీఏలు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు తాజాగా ఆర్బీఐ నియంత్రణల పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజా మూలధనాన్ని సర్దుబాటు చేయడం, శాఖల విస్తరణ, రుణాల మంజూరు, డైరెక్టర్ల ఫీజులు, డివిడెండ్ పంపిణీ వంటి పలు అంశాలపై నియంత్రణా చర్యలు విధించే అధికారం ఆర్బీఐకి ఉంటుంది. ఐవోబీ, యూకో, పీఎన్బీ, ఓబీసీ, యూబీఐ, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, దేనా బ్యాంకుల ఎన్పీఏలు ఆర్బీఐ నిర్దేశించిన గరిష్ట మార్కును దాటేశాయి. -
బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు!
♦ ఎస్బీఐ బాటలో మరిన్ని బ్యాంకులు ♦ చిన్న బ్యాంకులను సొంతం చేసుకోనున్న పీఎన్బీ, బీవోబీ ♦ ఈ దిశగా కేంద్ర సర్కారు కసరత్తు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రక్షాళణలో భాగంగా తదుపరి విలీనాలపై కసరత్తు జరుగుతోంది. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే దిశగా నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం అనంతరం మరోసారి ఈ రంగంలో స్థిరీకరణపై కేంద్ర సర్కారు దృష్టి సారించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లు చిన్న బ్యాంకులను విలీనం చేసుకోవచ్చని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ప్రభుత్వం విలీనం చేయాల్సిన బ్యాంకులపై దృష్టి పెట్టిందని... పలు చిన్న బ్యాంకులకంటే కొన్ని పెద్ద బ్యాంకులు ఉండాలన్నది ప్రధానమంత్రి కార్యాలయం యోచన అని ఆ వర్గాలు వెల్లడించాయి. పరిశీలనలో ఇవే... ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనల ప్రకారం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు పీఎన్బీలో విలీనమయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా బీవోబీ దక్షిణాదిన ప్రముఖ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును తనలో కలిపేసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు పలు ప్రతిపాదనలపై చర్చించినట్టు సంబంధిత వర్గాల తెలిపాయి. అయితే, ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని, వీటిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి ఆర్బీఐతో కలసి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తాజా విలీనాల అంశం తెర ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్బీఐ గత వారం తీసుకొచ్చిన కఠిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నియంత్రణ పరమైన నిబంధనావళిని బ్యాంకులు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్థిరీకరణకు దిశగా అడుగులు వేయక తప్పదు. కాగా, విలీనం విషయంలో చట్టపరంగా నడుచుకుంటామని, విలీనానికి ముందు బ్యాంకులకు అవకాశం ఇవ్వనున్నట్టు, అవసరమైతే కాంపిటీషన్ కమిషన్ అనుమతులు తీసుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రక్షాళనతోపాటు వాటిబలోపేతానికి గాను ఇంద్ర ధనుష్ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2015లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. -
ఎఫ్పీఓ బాటలో ఆరు బ్యాంకులు!
♦ స్టాక్ మార్కెట్ల జోరు నేపథ్యం... ♦ ఆర్థిక శాఖ అంచనా... ♦ జాబితాలో ఎస్బీఐ, బీఓబీ, పీఎన్బీ న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు జోరుమీదుండటంతో కంపెనీల నిధుల సమీకరణ వేగం పుంజుకుంటోంది. ఇదే మంచి తరుణమంటూ లిస్టింగ్కు వస్తున్న అనేక ఐపీఓలు హిట్ కొడుతున్నాయి కూడా. ఇప్పుడు బ్యాంకులు కూడా తమ పెట్టుబడి అవసరాల కోసం మార్కెట్ తలుపుతట్టేందుకు రెడీ అవుతున్నాయి. కనీసం ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లు త్వరలో ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీఓ) రూట్లో నిధులను సమీకరించే అవకాశం ఉందనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల అంచనా. దీనివల్ల మూలధన నిధులను అందించే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్థిఖ శాఖ భావిస్తోంది. ‘నిధుల కోసం బ్యాంకులు క్యాపిటల్ మార్కెట్ను ఆశ్రయించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం ఆరు పీఎస్బీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయని అంచనా వేస్తున్నాం. అయితే, ఎప్పుడు, ఎంత మొత్తంలో నిధులను సమీకరించాలనేది ఆయా బ్యాంకులే నిర్ణయించాల్సి ఉంటుంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) నిధుల సమీకరణకు సిద్ధంగా ఉన్నవాటిలో తొలివరుసలో ఉన్నాయి’ అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. రూ.1.1 లక్షల కోట్లు లక్ష్యం... పీఎస్బీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రధనుష్ పథకం ప్రకారం.. ఎఫ్పీఓ సహా ఇతరత్రా పద్దతుల్లో మార్కెట్ల నుంచి పీఎస్బీలు 2019 మార్చిలోగా రూ.1.1 లక్షల కోట్లను సమీకరించుకోవాల్సి ఉంటుంది. మార్చి, 2019 నుంచి బాసెల్–3 నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. కాగా, ఇంద్రధనుష్లో భాగంగా కేంద్రం పీఎస్బీలకు రూ.70,000 కోట్ల మూలధనాన్ని అందించనుంది. ఇప్పటికే రూ.50,000 కోట్లను గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇచ్చింది. మిగతా మొత్తాన్ని 2018–19 చివరిలోపు ఇవ్వనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలకు రూ.10,000 కోట్లు ఇవ్వనున్నామని.. అవసరమైతే మరింత మొత్తాన్ని సమకూరుస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కాగా, మార్కెట్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.15,000 కోట్లను సమీకరించేందుకు ఇప్పటికే ఎస్బీఐ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిధుల సమీకరణ ఎఫ్పీఓ, క్యాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ), రైట్ ఇష్యూ, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, అమెరికన్ డిపాజిటరీ రీసీట్స్ వీటిలో ఏదైనా మార్గంలో లేదా రెండుమూడు మార్గాల్లో కలిపి ఉండొచ్చని ఎస్బీఐ పేర్కొంది. -
ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం: జైట్లీ
ముంబై: ఒత్తిడిలో ఉన్న మొండి బకాయిల సమస్య పరిష్కరించుకునేలా త్వరలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)లను బలోపేతం చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అవినీతి నిరోధక చట్ట సవరణలకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ముంబైలో జరిగిన ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో జైట్లీ మాట్లాడుతూ... పీఎస్బీల ఆరోగ్య స్థితి ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. ఇతరులతో పోటీపడి పని చేసేలా పీఎస్బీలకు అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎస్బీలకు ప్రభుత్వ ఉద్యోగులే అడ్డుగా పేర్కొన్నారు. అలాగే, అవినీతి నిరోధానికి సంబంధించిన ప్రస్తుత చట్టం (పీసీఏ 1988) సైతం వారిని వాణిజ్య కోణంలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందని వివరించారు. చట్ట సవరణతో మార్పు వస్తుందన్నారు. గ్రామీణ భారతం, మౌలికరంగాలను పైకి తీసుకురావడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రెండు రంగాల్లో పెట్టుబడుల లోటు భారీ స్థాయిలో ఉందన్నారు. బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందాకొచర్, కోటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్, అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ తదితరులు -
నిధుల సమీకరణ ప్రతిపాదనలు పంపండి
పీఎస్బీలను కోరిన ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: మార్కెట్ నుంచి నిధుల సమీకరణపై ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ)ను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. పీఎస్బీలకు రూ.22,915కోట్ల నిధుల సాయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలి సిందే. దీంతో బ్యాంకుల ఆర్థిక సామర్థ్యం ఇనుమడిస్తుందని, దాంతో నిధుల సమీకరణకు వెసులుబాటు లభిస్తుందని ఆర్థిక శాఖ భావి స్తోంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు, ప్రాధాన్యేతర ఆస్తుల విక్రయం తదితర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు గల అవకాశాలపై ప్రణాళికలు పంపించాలని ఆర్థిక శాఖ కోరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఆర్థిక శాఖ రూపొందించిన ఇంద్రధనుష్ రోడ్ మ్యాపు ప్రకారం పీఎస్బీలకు నాలుగేళ్ల వ్యవధిలో కేంద్రం రూ.70వేల కోట్ల నిధుల సాయం అం దిస్తుంది. అదే సమయంలో బ్యాంకులు సైతం రూ.1.1 లక్షల కోట్లను మార్కెట్ నుంచి సమీకరించాలి. బాసెల్-3 నిబంధనల మేరకు బ్యాంకులకు ఈ మేరకు మూలధన నిధుల అవసరం ఉంటుంది. -
ప్రభుత్వ బ్యాంకులు రద్దు చేసిన రుణాలు రూ. 59,547 కోట్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.59,547 కోట్లమేర రుణాల్ని రద్దు చేశాయని కేంద్రం తెలిపింది. వీటిల్లో ఎస్బీఐ రూ.15,763 కోట్ల రుణాల్ని రద్దు చేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇక పీఎన్బీ రూ.7,340 కోట్ల రుణాల్ని, ఐడీబీఐ రూ.5,459 కోట్ల రుణాల్ని, కెనరా బ్యాంక్ రూ.3,387 కోట్ల రుణాల్ని రద్దు చేశాయని తెలిపారు. -
బ్యాంకుల ఏకీకరణతోసమస్యలు: మూడీస్
♦ సొంతంగా ఆర్థిక బలం లేదు ♦ దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభావం ♦ ప్రభుత్వ సహకారంతోనే విలీనం సాధ్యం న్యూఢిల్లీ: ప్రస్తుత బలహీన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను ఏకీకరణ ద్వారా కుదించాలన్న ప్రయత్నాలు పలు సమస్యలకు దారి తీయనున్నట్టు రేటింగ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. ఫలితంగా దీర్ఘకాలిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. 2012 నుంచి భారతీయ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని... ఆస్తుల నాణ్యత పరంగా చూస్తే చాలా వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) బ్యాలన్స్ షీట్ల క్షీణత సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. దీంతో సొంత ఆర్థిక వనరుల పరంగా చూస్తే ఏ బ్యాంకుకీ విలీన ప్రక్రియ చేపట్టేంత ఆర్థిక సామర్థ్యం లేదని పేర్కొంది. ఈ మేరకు మూడీస్ ‘భారత్లో బ్యాంకులు: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకరణతో సవాళ్లు’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ప్రభుత్వ సహకారంతోనే..: ప్రస్తుతం ఉన్న 27 పీఎస్బీలను విలీనాల ద్వారా 8 నుంచి 10కి కుదించాలన్నది ప్రభుత్వ ధ్యేయంగా మూడీస్ తెలిపింది. ప్రభుత్వం నుంచి గణనీయ స్థాయిలో సహకారం లభించకుంటే ఏకీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందకుండా పోతాయని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ విశ్లేషకుడు అల్కా అన్బరసు పేర్కొన్నారు. ‘క్రెడిట్ పరంగా చూస్తే ఏకీకరణ ప్రక్రియ బ్యాంకుల కొనుగోలు శక్తిని పటిష్ట పరుస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఈ రంగంలో పర్యవేక్షణ, కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగుపడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలకు ఏకీకరణ వల్ల ఎదురయ్యే సవాళ్లు విఘాతంగా మారతాయని విశ్లేషించింది. ‘ఇప్పటికే మొండి బకాయిల కారణంగా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు బుక్ విలువ కంటే తక్కువకు ట్రేడ్ అవుతున్నాయి. దీంతో విలీనాలకు అవసరమైన అదనపు నిధుల సాయాన్ని పొందే అవకాశాలను పరిమితం చేస్తుంది’ అని మూడీస్ వెల్లడించింది. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మూలధన నిధుల రూపంలో సహకారం అవసరం అవుతుందని అభిప్రాయపడింది. ఉద్యోగుల వైపు నుంచి సమస్యలు బ్యాంకుల ఉద్యోగుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకానుండడం కూడా ఏకీకరణకు ప్రధాన సవాలుగా పేర్కొంది. దీనివల్ల ఏకీకరణ ప్రయత్నాలకు విఘాతం కలిగుతుందని... ఒకవేళ విలీనం చేసినా వేతనాల మధ్య తేడాలను పూడ్చేందుకు, ఇతర ప్రయోజనాల రూపంలో ఖర్చులు పెరిగిపోతాయని తెలిపింది. -
భారత్ రేటింగ్పై ఎన్పీఏల ప్రభావం: మూడీస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య భారత్ సావరిన్ క్రెడిట్ రేటింగ్పై ప్రతికూల ప్రభావం చూపుతుందని రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ పేర్కొంది. మొండి బకాయిల సమస్య పరిష్కారంలో ప్రభుత్వం నుంచి తగిన చొరవలు అవసరమని అభిప్రాయపడింది. మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ కష్టమవుతున్న తరుణంలో బడ్జెట్ కేటాయింపులకన్నా అధికంగా... భారీ మూలధన కల్పన విషయంలో ప్రభుత్వం నుంచే తగిన చర్యలు అవసరమని అభిప్రాయపడింది. వచ్చే నాలుగేళ్లలో బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2015 ఏప్రిల్లో మూడీస్ భారత్ అవుట్లుక్ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు అప్గ్రేడ్ చేసింది. అయితే రేటింగ్ను ‘బీఏఏ3’గానే ఉంచింది. ‘చెత్త’స్థాయికి ఇది ఒక మెట్టు అధికం. -
బ్యాంకింగ్ కు మరింత మూలధనం సమకూర్చాలి
ప్రభుత్వానికి మూడీస్ సూచన న్యూఢిల్లీ: మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నందున, కేంద్రమే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) తగిన మూలధనం సమకూర్చాలని రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్) అల్కా అంబరసు పేర్కొన్నారు. మూలధనం సమకూర్చే విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకోకపోతే- బ్యాంకింగ్ క్రెడిట్ ప్రొఫైల్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. ఆయన అభిప్రాయాల్లో మరికొన్నింటిని చూస్తే... బకాయిలు రాబట్టుకోవడంలో బ్యాంకింగ్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బ్యాలెన్స్ షీట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. డిసెంబర్ నాటికి మొండిబకాయిల పరిణామం రూ.3.7 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా అసెట్ క్వాలిటీ సమీక్షలు, తగిన ప్రొవిజనింగ్ కేటాయింపులు బ్యాంకింగ్పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. -
మొండిబకాయిల పరిష్కారానికి కమిటీ
ఆర్థిక సర్వీసుల కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల భారం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక సర్వీసుల కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ తెలిపారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సారథ్యం వహించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో ఆర్థిక మంత్రి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు వివరించారు. జూన్ ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మొండి బకాయిలు (ఎన్పీఏ) 6.03 శాతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు నాటికి ఇవి 5.20 శాతం స్థాయిలో ఉన్నాయి. ఎన్పీఏలు ఎక్కువగా ఉన్న ఉక్కు, అల్యూమినియం, టెక్స్టైల్ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని దుగ్గల్ వివరించారు. ప్రధానమంత్రి ‘జన ధన్’ యోజనకి మంచి స్పందన వచ్చిందని, ఈ పథకం కింద డిపాజిట్లు రూ. 27,000 కోట్ల పైగా వచ్చాయని ఆమె తెలిపారు. జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య 35 శాతానికి తగ్గిందన్నారు. మరోవైపు, ఎన్పీఏలు పెరిగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని సిన్హా చెప్పారు. -
2014-15లో 9 పీఎస్బీలకు కేంద్రం రూ. 6,990 కోట్లు
న్యూఢిల్లీ : తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు కేంద్రం 2014-15 ఏడదిలో రూ.6,990 కోట్ల పెట్టుబడులను అందించింది. కేపిటల్ బేస్ పటిష్టత లక్ష్యంగా ఈ నిధులను అందించినట్లు బ్యాంకులు బీఎస్ఈకి తెలిపాయి. వీటిలో ఎస్బీఐ(రూ. 2,970 కోట్లు), పీఎన్బీ(870 కోట్లు), బీఓబీ(1,260 కోట్లు), కెనరా బ్యాంక్ (570 కోట్లు), సిండికేట్ బ్యాంక్ (460 కోట్లు), అలహాబాద్ బ్యాంక్ (320 కోట్లు), ఇండియన్ బ్యాంక్(280 కోట్లు) దేనా బ్యాంక్ (140 కోట్లు), ఆంధ్రాబ్యాంక్(120 కోట్లు) ఉన్నాయి. బాసెల్-3 ప్రమాణాల ప్రకారం 2018 నాటికి పీఎస్బీలకు కేంద్రం ఈక్విటీగా రూ.2.4 లక్షల కోట్లు సమకూర్చాల్సి ఉంటుందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పేర్కొన్నారు. -
ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి
పీఎస్బీల్లో నియామకాలపై ఎస్బీఐ అరుంధతీ భట్టాచార్య ముంబై: ఐఐటీ, ఐఐఎంల నుంచి అభ్యర్థులను ఉద్యోగులుగా ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు కూడా ఇవ్వాలని ఎస్బీఐ కోరింది. ఐఐటీ, ఐఐఎంల వంటి ఉన్నత స్థాయి సంస్థల ఏర్పాటుకు ప్రజాధనం వినియోగమవుతోందని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. దేశంలోని ఉన్నత స్థాయి ప్రతిభావంతులు ఈ సంస్థల్లో ఉంటారని, కానీ వీరిని నియమించుకోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు వీలు లేదని వివరించారు. ఇతర ప్రైవేట్ సంస్థల మాదిరే ఐఐటీ, ఐఐఎంలో క్యాంపస్ రిక్రూట్మెంట్లను నిర్వహించి మంచి ప్రతిభ గల అభ్యర్థులను ఉద్యోగులుగా తీసుకునే వెసులుబాటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇవ్వాలని తెలిపారు. ఇలాంటి అవకాశం లేకపోవడం వల్ల ప్రైవేట్ బ్యాంకులతో పీఎస్ బ్యాంకులు పోటీపడలేకపోతున్నాయని వాపోయారు. ఇలాంటి సంస్థల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించరాదని సుప్రీం కోర్టు పేర్కొందని వివరించారు. పీఎస్యూ బ్యాంకుల్లో ఏర్పడే ప్రతి ఖాళీని ప్రకటించాలని, అర్హత గల ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు అభిప్రాయమని పేర్కొన్నారు. -
నిర్భయంగా నిర్ణయాలు తీసుకోండి
* నిష్పక్షపాతంగా వ్యవహరించండి * ప్రభుత్వ రంగ బ్యాంకర్లకు * ఆర్థిక శాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. అలాగే, ఇతరత్రా ఒత్తిళ్లను పట్టించుకోరాదని సూచించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల (ఎఫ్ఐ) అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండబోదని హామీ ఇచ్చింది. ఆర్థిక శాఖ సోమవారం ఈ మేరకు పీఎస్బీలు, ఎఫ్ఐలు, బీమా సంస్థల చీఫ్లకు ఆదేశాలు పంపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని అందులో పేర్కొంది. రుణం తీసుకునేవారి పలుకుబడికి, ఒత్తిడికి ప్రభావితం కారాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పక్షపాత ధోరణితో వ్యవహరించిన పక్షంలో దానికి పూర్తి బాధ్యత వారిదే అవుతుందని స్పష్టం చేసింది. బదిలీలు, నియామకాల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని, ఆఖరికి ఆర్థిక శాఖ నుంచి సిఫార్సులు వచ్చినా పరిగణించనక్కర్లేదని పేర్కొంది. ఒకవేళ ఏదైనా ప్రత్యేక సందర్భంలో మినహాయింపునిచ్చినా అందుకు గల కారణాలను సీఎండీ స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ సూచించింది. పీఎస్బీల్లో ప్రభుత్వ జోక్యం ఉండబోదంటూ ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాఖ తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీఎస్బీల్లో ఇప్పుడే వాటాలు విక్రయించం.. పీఎస్బీల్లో ప్రభుత్వ వాటాలు విక్రయించాల్సిన అవసరమేమీ ప్రస్తుతం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఇప్పుడున్న వేల్యుయేషన్లను బట్టి చూసినా.. ఇది అభిలషణీయం కాదన్నారు. 27 పీఎస్బీల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోవాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్ నాటికి బాసెల్ 3 ప్రమాణాలను అందుకునేందుకు కావాల్సిన నిధులను బ్యాంకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నందున వాటాల విక్రయ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, పీఎస్బీల్లో నిరర్ధక ఆస్తుల సమస్య ఆమోదయోగ్యం కానంత అధిక స్థాయిలో ఉందని సిన్హా చెప్పారు. 2014 సెప్టెంబర్ ఆఖరు నాటికి పీఎస్బీల్లో స్థూల ఎన్పీఏలు రూ. 2.43 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఇక, పీఎస్బీల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదల్చుకోలేదని, ఆయా బ్యాంకుల యాజమాన్యాలు క్రియాశీలకంగా, ప్రొఫెషనలిజంతో పనిచేయాలని సిన్హా సూచించారు. -
ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిల విలువ ఇది... న్యూఢిల్లీ: గడచిన అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) ఏకంగా రూ. 1,06,170 కోట్ల మేర రుణాలను మొండి బకాయిల కింద రద్దు చేశాయి. పునర్వ్యవస్థీకరించిన రుణాల మొత్తం గడచిన మూడేళ్లలో రెట్టింపయ్యాయి. 2011-12లో రూ. 20,752 కోట్లుగా ఉన్న ఈ మొత్తం .. ఈ ఏడాది మార్చి నాటికి రూ. 44,447 కోట్ల స్థాయికి చేరింది. మొండి బకాయిలు పెరగడానికి ఆర్థిక వ్యవస్థ మందగమనం తదితర అంశాలు కారణమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం రాజ్యసభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, మార్చి 31 నాటి దాకా గణాంకాల ప్రకారం రూ. 25 లక్షలు పైగా బకాయిపడిన వారిలో 1,600 మందిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించినట్లు ఆయన వివరించారు. సమస్యను ముందుగానే గుర్తించేందుకు, సత్వరం దిద్దుబాటు..రికవరీకి చర్యలు తీసుకునేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణ వంటి విధానాలు, లోక్ అదాలత్ వంటి వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని సిన్హా పేర్కొన్నారు. అటు పోంజీ తరహా మోసపూరిత స్కీముల నిర్వాహకులను కఠినంగా శిక్షించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు సిన్హా తెలిపారు. సాధారణంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) లేదా ఉమ్మడి పెట్టుబడి పథకాలు(సీఐఎస్) రూపంలో ఇలాంటివి జరుగుతున్నట్లు ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో 55 కంపెనీలు సీఐఎస్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గుర్తించిందని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సొమ్ము వాపసు చేశాక, స్కీములను నిలిపివే యాలని 19 కేసుల్లో సెబీ తుది తీర్పునిచ్చింది.