Ranji match
-
కోహ్లి తెచ్చిన కిక్...
సాధారణంగా రంజీ మ్యాచ్ జరుగుతోందంటే.. వంద మంది ప్రేక్షకులు ఆట చూసేందుకు రావడం కూడా కష్టమైన ఈ రోజుల్లో... గురువారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం (గతంలో ఫిరోజ్ షా కోట్లా మైదానం) కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే... ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు రంజీ మ్యాచ్ చూసేందుకు పోటెత్తారు. సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి 2012 తర్వాత తొలిసారి ఢిల్లీ జట్టు తరఫున రంజీ మ్యాచ్ ఆడుతుండటంతో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచే క్యూ లైన్లు నిండిపోగా... ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) చేసిన ఏర్పాట్లకు మించి ప్రేక్షకులు మైదానానికి తరలివచ్చారు. అభిమానులు భారీగా వస్తారని ముందే అంచనా వేసిన డీడీసీఏ... స్టేడియంలోని 6 వేల సామర్థ్యం గల ‘గౌతమ్ గంభీర్ స్టాండ్’ను తెరవగా... కాసేపట్లోనే అది నిండిపోయి స్వల్ప తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో మైదానం వెలుపల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమం జరుగుతుండటంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది... 11 వేల సామర్థ్యం గల ‘బిషన్ సింగ్ బేడీ స్టాండ్’లోకి అభిమానులను అనుమతించారు. తొలి రోజు ఏకంగా 27 వేల మంది కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరైనట్లు సమాచారం. న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగితే... దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు కూడా కళకళలాడు తాయని నిజమైంది. రంజీ ట్రోఫీ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లో భాగంగా గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్కు ప్రేక్షకుల నుంచి అసాధారణ స్పందన లభించింది. 2012 తర్వాత భారత దిగ్గజం విరాట్ కోహ్లి రంజీ మ్యాచ్లో ఆడేందుకు సిద్ధం కావడమే దీనికి కారణం. కోహ్లి ఆటతీరును ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఉదయం నుంచే ఎగబడ్డారు. ఫలితంగా మైదానం అభిమానులతో నిండిపోయింది. ‘రంజీ ట్రోఫీలో ఇలాంటి సందడి గతంలో ఎప్పుడూ చూడలేదు. దేశవాళీ మ్యాచ్లు చూసేందుకు అభిమానులు ఈ స్థాయిలో వస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ఇదంతా కేవలం ఒక్క వ్యక్తి కోసమే. వచ్చిన వాళ్లంతా కోహ్లి నామస్మరణ చేస్తున్నారు’ అని మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించిన ఓ భారత మాజీ క్రికెటర్ అన్నాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ మాట్లాడుతూ... ‘30 ఏళ్లుగా ఢిల్లీ క్రికెట్ను గమనిస్తున్నా. రంజీ ట్రోఫీలో ఇలాంటి దృశ్యాలు చూడలేదు. కోహ్లి ఆదరణకు ఇది నిదర్శనం. మొదట ఒక గేట్ ద్వారానే అభిమానులను అనుమతించాం. తర్వాత పరిస్థితిని బట్టి మైదానంలోని అన్ని గేట్లు తెరిచాం’ అని అన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్లో చివరగా ఆడిన రంజీ మ్యాచ్కు ఇప్పటి వరకు అత్యధికంగా 8 వేల పైచిలుకు మంది అభిమానులు హాజరు కాగా... గురువారం రైల్వేస్–ఢిల్లీ మ్యాచ్ చూసేందుకు 27 వేల మందికి పైగా ప్రేక్షకులు పోటెత్తారు. ఈరోజు క్రీజులోకి రానున్న కోహ్లి ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఢిల్లీ కెపె్టన్ ఆయుశ్ బదోనీ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నా... అభి మానుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ‘గంటలకొద్దీ నిలబడి మైదానంలోకి వచ్చింది... కోహ్లిని చూసేందుకే. అతడు ఫీల్డింగ్ చేసినా మాకు ఆనందమే’ అని ప్రేక్షకుల్లోని ఒక గృహిణి పేర్కొనగా... కోహ్లి ఆట చూసేందుకే పాఠశాల నుంచి వచ్చామని పలువురు విద్యార్థులు చెప్పారు. రెండో స్లిప్లో ఫీల్డింగ్ చేసిన కోహ్లి... అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేయగా... ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి కోహ్లి కాళ్లకు నమస్కరించాడు. మొదట బ్యాటింగ్కు దిగిన రైల్వేస్ తొలి ఇన్నింగ్స్లో 67.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఉపేంద్ర యాదవ్ (95; 10 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ ( 50; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నవ్దీప్, సుమిత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది. శుక్రవారం కోహ్లి బ్యాటింగ్కు రానున్న నేపథ్యంలో... మరింత మంది అభిమానులు మైదానానికి పోటెత్తడం ఖాయమే!చదవండి : 2 పరుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
హైదరాబాద్ 536/8 డిక్లేర్డ్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పుదుచ్చేరితో పోరులో బ్యాటర్లంతా కలిసి కట్టుగా కదం తొక్కడంతో హైదరాబాద్ జట్టు 163 ఓవర్లలో 536/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (328 బంతుల్లో 173; 13 ఫోర్లు, 2 సిక్స్లు) భారీ సెంచరీతో విజృంభించగా... రోహిత్ రాయుడు (84; 7 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ (60; 7 ఫోర్లు), తనయ్ త్యాగరాజన్ (53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించారు. ఓవర్నైట్ స్కోరు 290/1తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. రెండో వికెట్కు తన్మయ్, రోహిత్ 220 పరుగులు జోడించడంతో గట్టి పునాది పడింది. కెపె్టన్ రాహుల్ సింగ్ (27), వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (24) ఎక్కువ సేపు నిలవలేకపోగా... చామా మిలింద్ (7) ఆకట్టుకోలేకపోయాడు. మిడిలార్డర్ విఫలమైనా... ఆఖర్లో తనయ్ త్యాగరాజన్ మెరుపులు మెరిపించాడు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 3, సతీశ్ రెండు వికెట్లు పడగొట్టారు. కొండంత స్కోరు చేసిన అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... చివరి గంటలో బ్యాటింగ్కు వచ్చిన పుదుచ్చేరి బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పుదుచ్చేరి 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. శ్రీధర్ రాజు (19), సాగర్ (0) అవుట్ కాగా... వికెట్ కీపర్ అజయ్ రొహెరా (3) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న పుదుచ్చేరి జట్టు... హైదరాబాద్ స్కోరుకు ఇంకా 512 పరుగులు వెనుకబడి ఉంది. గౌరవ్ యాదవ్ (0 బ్యాటింగ్), ఆకాశ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) (సబ్) విఘ్నేశ్వరన్ (బి) అంకిత్ శర్మ 173; అభిరత్ రెడ్డి (సి) అరుణ్ కార్తీక్ (బి) సాగర్ 68; రోహిత్ రాయుడు (బి) ఫాబిద్ అహ్మద్ 84; హిమతేజ (సి) అమన్ (బి) సతీశ్ 60; రాహుల్ సింగ్ (సి) గంగ శ్రీధర్ రాజు (బి)గౌరవ్ యాదవ్ 27; రాహుల్ రాధేశ్ (సి అండ్ బి) అంకిత్ శర్మ 24; చామా మిలింద్ (బి) సతీశ్ 7; తనయ్ త్యాగరాజన్ (నాటౌట్) 53; అనికేత్ రెడ్డి (బి) అంకిత్ శర్మ 12; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 17, మొత్తం (163 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్) 536. వికెట్ల పతనం: 1–111, 2–231, 3–345, 4–397, 5–440, 6–458, 7–460, 8–486. బౌలింగ్: గౌరవ్ యాదవ్ 35–9–102–1; సాగర్ 31–5–98–1; ఫాబిద్ అహ్మద్ 30–6–78–1; అమన్ ఖాన్ 11–1–55–0; అంకిత్ శర్మ 35–1–117–3, సతీశ్ 20–2–72–2. -
రాణించిన రాహుల్ రాధేశ్, హిమతేజ
డెహ్రాడూన్: మిడిలార్డర్ రాణించడంతో ఉత్తరాఖండ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ పోరాడుతోంది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న ఈ పోరులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 78 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (174 బంతుల్లో 82 బ్యాటింగ్; 9 ఫోర్లు), కొడిమేల హిమతేజ (147 బంతుల్లో 78; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో రాణించారు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (30; 4 ఫోర్లు), కెప్టెన్ రాహుల్ సింగ్ (21; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించగా... అభిరత్ రెడ్డి (0), రోహిత్ రాయుడు (7) విఫలమయ్యారు. ఉత్తరాఖండ్ బౌలర్లు రాణించడంతో తొలి ఓవర్లోనే హైదరాబాద్ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో బంతికే అభిరత్ రెడ్డి వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు పడటంతో ఒక దశలో హైదరాబాద్ 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హిమతేజ, రాహుల్ రాధేశ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ జంట ఐదో వికెట్కు 142 పరుగులు జోడించడంతో హైదరాబాద్ జట్టు కోలుకోగలిగింది. ఉత్తరాఖండ్ బౌలర్లలో దేవేంద్రసింగ్ బోరా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 313/8తో శనివారం తొల ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ చివరకు 325 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 4 వికెట్లు పడగొట్టగా... మిలింద్, రోహిత్ రాయుడు చెరో రెండు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్లో మెరుగైన ప్రదర్శనే చేస్తున్న హైదరాబాద్ జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 81 పరుగులు వెనుకబడి ఉంది. రాహుల్ రాధేశ్తో పాటు తనయ్ త్యాగరాజన్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్: 325; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బి) దేవేంద్రసింగ్ బోరా 30; అభిరత్ రెడ్డి (సి) ఆదిత్య (బి) దీపక్ ధాపోలా 0; రాహుల్ సింగ్ (సి) వైభవ్ భట్ (బి) అభయ్ నేగీ 21; రోహిత్ రాయుడు (ఎల్బీడబ్ల్యూ) ఆకాశ్ మధ్వాల్ 7; హిమతేజ (సి) అవనీశ్ సుధ (బి) దేవేంద్రసింగ్ బోరా 78; రాహుల్ రాధేశ్ (నాటౌట్) 82; తనయ్ త్యాగరాజన్ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 9, మొత్తం (78 ఓవర్లలో 5 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–1, 2–39, 3–53, 4–64, 5–206, బౌలింగ్: దీపక్ ధాపోలా 13–2–31–1; ఆకాశ్ మధ్వాల్ 10–0–41–1; అభయ్ నేగీ 16–2–40–1; దేవేంద్ర సింగ్ బోరా 15–1–51–2; అవనీశ్ సుధ 10–2–21–0; స్వప్నిల్ సింగ్ 13–3–46–0; రవికుమార్ సమర్్థ1–0–6–0. -
ఢిల్లీ లక్ష్యం 84
న్యూఢిల్లీ: ఢిల్లీతో జరుగుతోన్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ ఓటమి అంచున నిలిచింది. ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్ తన రెండో ఇన్నింగ్స్లో 70.2 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటై... 84 పరుగుల విజయలక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. ఢిల్లీ శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 7 ఓవర్లలో 24 పరుగులు చేసింది. కునాల్ (6), శిఖర్ ధావన్ (15) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 20/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన హైదరాబాద్ను ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (154 బంతుల్లో 103; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో ఆదుకున్నాడు. 97 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాభవం తప్పదనుకున్న స్థితిలో... తన్మయ్ టెయిలెండర్లతో పలు కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. తనయ్ త్యాగరాజన్ (70 బంతుల్లో 34; 6 ఫోర్లు)తో కలిసి 7వ వికెట్కు 93 పరుగులు... మెహదీ హసన్ (62 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు)తో కలిసి 8వ వికెట్కు 60 పరుగులు జోడించి హైదరాబాద్కు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించాడు. ఇషాంత్ శర్మ 4 వికెట్లతో రాణించాడు. -
బెంగాల్ 289 ఆలౌట్
కోల్కతా: ఆంధ్ర బౌలర్లు చీపురుపల్లి స్టీఫెన్ (4/78), శశికాంత్ (4/64) తమ పేస్ బౌలింగ్తో హడలెత్తించడంతో బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్లో 289 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 241/4తో గురువారం ఆట కొనసాగించిన బెంగాల్ మరో 48 పరుగులు జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. వెలుతురు లేమి కారణంగా రెండో రోజు ఆట 21 ఓవర్లకు మాత్రమే పరిమితం కావడంతో ఆంధ్ర ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. గాందీకి ప్రవేశం లేదు! ఆంధ్ర, బెంగాల్ రంజీ మ్యాచ్ సందర్భంగా వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. బెంగాల్ మాజీ క్రికెటర్, ప్రస్తుత సీనియర్ జట్టు సెలక్టర్ దేవాంగ్ గాంధీని బెంగాల్ జట్టు డ్రెస్సింగ్ రూమ్నుంచి అనూహ్యంగా బయటకు పంపించారు. సీనియర్ క్రికెటర్ మనోజ్ తివారి ఇందుకు కారణమని తెలుస్తోంది. టీమ్ డ్రెస్సింగ్ రూమ్లో జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది మాత్రమే ఉండాలని, బయటి వ్యక్తులు ఎవరూ రాకూడదనేది నిబంధన. గాంధీ అనుమతి లేకుండా వచ్చారని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే వారు అతడిని బయటకు పంపినట్లు సమాచారం. అయితే తాను ఎలాంటి నిబంధనలను అతిక్రమించలేదని గాంధీ స్పష్టం చేశాడు. ఈ విషయంలో గాందీకి మద్దతుగా నిలిచిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) తివారీపై చర్య తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు జట్టు బౌలింగ్ కోచ్ రణదేబ్ బోస్ను బహిరంగంగా తిట్టడం వల్లే ఈ మ్యాచ్లో సీనియర్ బౌలర్ అశోక్ దిండాను తప్పించినట్లు తెలిసింది. అతనిపై క్రమశిక్షణాచర్యల్లో భాగంగానే చివరి నిమిషంలో జట్టునుంచి దూరంగా ఉంచారు. -
హైదరాబాద్ 69 ఆలౌట్
న్యూఢిల్లీ: ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 29 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటై... ఫాలోఆన్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పో యి 20 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే హైదరాబాద్ ఇంకా 195 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోర్ 269/6తో రెండో రోజు ఆట కొనసాగించిన ఢిల్లీ 71.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఓపెనర్ అక్షత్ రెడ్డి (0) గోల్డెన్ డక్తో ఆరంభమైన హైదరాబాద్ పతనం రవి కిరణ్ (0) వరకు నిరాటంకంగా కొనసాగింది. హైదరాబాద్ టాప్ స్కోర్ సందీప్ చేసిన 16 పరుగులు కావడం గమనార్హం. -
ఢిల్లీకి ఆధిక్యం
న్యూఢిల్లీ: వెటరన్ బ్యాట్స్మన్ గౌతం గంభీర్ కెరీర్ చివరి మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు. ఆంధ్రతో జరుగుతోన్న రంజీ మ్యాచ్లో ఢిల్లీ తరఫున బరిలో దిగిన గంభీర్ (185 బంతుల్లో 112; 10 ఫోర్లు) శతకంతో ఆకట్టుకోగా... ధ్రువ్ షొరే (98; 6 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 409 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 190/1తో శనివారం ఆట కొనసాగించిన ఢిల్లీని ఆంధ్ర బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. గంభీర్ క్రితం రోజు స్కోరుకు 20 పరుగులు జతచేసి వెనుదిరగ్గా... ఆ తర్వాత ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యత ధ్రువ్ తీసుకున్నాడు. అతను జాంటీ సిద్ధూ (30), లలిత్ యాదవ్ (29), అనూజ్ రావత్ (27)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో ఢిల్లీకి స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ ఖాన్, మనీశ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సాయి కృష్ణకు ఓ వికెట్ దక్కింది. చేతిలో మరో 3 వికెట్లు ఉన్న ఢిల్లీ ప్రస్తుతం 19 పరుగుల ముందుంది. వశిష్ట్ (12 బ్యాటింగ్), సుభోద్ భాటి (1బ్యాటింగ్) క్రీజు లో ఉన్నారు. ఆదివారం మ్యాచ్కు చివరి రోజు. -
బ్యాట్స్మెన్దే భారం
హైదరాబాద్ లక్ష్యం 219 ప్రస్తుతం 13/1 రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఆంధ్ర జట్టు హైదరాబాద్ ముందు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లకు సహకరిస్తున్న ఈ పిచ్పై ఇది కష్టసాధ్యమైన లక్ష్యమే కాగా... దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ మూడో రోజు ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్సలో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (9) రనౌటయ్యాడు. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (2 బ్యాటింగ్), బి. అనిరుధ్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్రకే ఆధిక్యం మూడో రోజు ఆటలో ఆంధ్ర ఆటగాళ్లే పైచేయి సాధించారు. ముందుగా బౌలర్లు... శుక్రవారం 81/5 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన హైదరాబాద్ను తొలి ఇన్నింగ్సలో 74.5 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ చేశారు. ప్రధాన బ్యాట్స్మెన్తో పాటు మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేయడంతో ఆంధ్రకు తొలి ఇన్నింగ్సలో 47 పరుగుల ఆధిక్యం లభించింది. టెరుులెండర్లలో సి.వి. మిలింద్ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స టాప్ స్కోర్ కాగా... ఆకాశ్ భండారి 23 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, శివకుమార్, భార్గవ్ భట్ చెరో 2 వికెట్లు తీశారు. మొదటి రోజు ఆటలో ఆంధ్ర తొలి ఇన్నింగ్సలో 190 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రాణించిన విహారి అనంతరం రెండో ఇన్నింగ్స ఆరంభించిన ఆంధ్ర జట్టు కూడా 51 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. భార్గవ్ భట్ (22), రవితేజ (22)లను సి.వి.మిలింద్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన హనుమ విహారి (54 బంతుల్లో 57; 5 ఫోర్లు) వేగంగా పరుగులు జతచేశాడు. ప్రశాంత్ (32 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (4/52) స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆంధ్రా వెన్నువిరిచాడు. క్రీజులో పాతుకుపోరుున విహారి, ప్రశాంత్లతో పాటు రికీ భుయ్ (2), ప్రణీత్ (10)లను పెవిలియన్కు చేర్చాడు. దీంతో పిచ్ పూర్తిగా బౌలింగ్కు సహకరిస్తున్నట్లు గమనించిన ఆంధ్ర కెప్టెన్ విహారి... 29.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్సను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స ఆధిక్యం 47 పరుగులు కలుపుకొని హైదరాబాద్ ముందు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. -
హోరాహోరీగా హైదరాబాద్-ఆంధ్ర మ్యాచ్
లక్నో:హైదరాబాద్-ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్-సిలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 190 పరుగులకే కుప్పకూలిన ఆంధ్ర.. ఆ తరువాత హైదరాబాద్ను 143 పరుగులకే కట్టడి చేసింది. 81/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ మరో 62 పరుగులు సాధించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది.హైదరాబాద్ ఇన్నింగ్స్ లో చామా మిలింద్(29 నాటౌట్) దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆంధ్ర బౌలర్ విజయ్ కుమార్ నాలుగు వికెట్లు సాధించగా,శివ కుమార్, భార్గవ్ భట్లు తలో రెండు వికెట్లు సాధించారు. ఈ గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించడంతో పాటు వచ్చే ఏడాది పై గ్రూప్లోకి ప్రమోట్ అవుతాయి. హైదరాబాద్ ప్రస్తుతం 30 పాయింట్లతో నాకౌట్కు బాగా చేరువలో ఉంది. చివరి మ్యాచ్లో హైదరాబాద్ను ఓడిస్తే హనుమ విహారి నాయకత్వంలో ఆడుతోన్న ఆంధ్ర (ప్రస్తుతం 25 పాయింట్లు) జట్టుకూ ఆ అవకాశం ఉంటుంది. అయితే వీరికి పోటీగా 25 పాయింట్లతో ఉన్న హరియాణా, తమ చివరి మ్యాచ్లో త్రిపురలాంటి బలహీన జట్టుతో ఆడుతుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. హైదరాబాద్ను ఆంధ్ర ఓడించి, మరోవైపు హరియాణా గెలవకుండా ఉంటే... హైదరాబాద్, ఆంధ్ర కలిసి ముందుకు దూసుకెళతాయి. -
చేతులెత్తేసిన బ్యాట్స్మెన్
హైదరాబాద్ 81/5 ఆంధ్రతో రంజీ ట్రోఫీ మ్యాచ్ లక్నో: బౌలర్ల ప్రదర్శనతో తొలి రోజు ఆటలో పైచేయి సాధించిన హైదరాబాద్... బ్యాట్స్మెన్ వైఫల్యంతో రెండో రోజు విలవిలలాడింది. ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో 10/0 ఓవర్నైట్ స్కోరుతో గురువారం ఆటకొనసాగించిన హైదరాబాద్ ఆట నిలిచే సమయానికి 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఆంధ్ర పేసర్లు విజయ్ కుమార్ (2/18), శివ కుమార్ (2/30) టాపార్డర్ బ్యాట్స్మెన్ను వణికించారు. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట నిలిచే సమయానికి అనిరుధ్ (26 బ్యాటింగ్), కె. సుమంత్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఉదయం పొగమంచు కారణంగా ఆట సాధ్యపడలేదు. దీంతో తొలి సెషన్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. లంచ్ విరామం తర్వాతే ఆట కొనసాగగా... కేవలం 38 ఓవర్లే జరిగాయి. తన్మయ్ విఫలం గత మ్యాచ్లో రెండు ఇన్నింగ్సల్లో సెంచరీలు సాధించిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (12) విఫలమయ్యాడు. అతనితో కలిసి రెండో రోజు ఆట కొనసాగించిన అక్షత్ రెడ్డి (10) మొదట పెవిలియన్ చేరాడు. ఆట మొదలైన మరుసటి ఓవర్లోనే అక్షత్ను విజయ్ కుమార్ ఔట్ చేశాడు. తర్వాత కెప్టెన్ బద్రీనాథ్ (5)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 21 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అనంతరం కాసేపటికే శివకుమార్ బౌలింగ్లో తన్మయ్ క్లీన్బౌల్డయ్యా డు. మరో రెండు పరుగులు చేరాయో లేదో... జట్టు స్కోరు 36 పరుగుల వద్ద మళ్లీ శివ కుమార్ హైదరాబాద్ను కోలుకోలేని దెబ్బ తీశాడు. బావనక సందీప్ (2)నూ పెవిలియన్కు పంపాడు. ఈ దశలో అనిరుధ్, హిమాలయ్ అగర్వాల్ (22) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఐదో వికెట్కు 45 పరుగులు జోడించాక హిమాలయ్ రనౌటై వెనుదిరిగాడు. హైదరాబాద్ చేతిలో ఇంకా 5 వికెట్లుండగా... 109 పరుగుల వెనుకంజలో ఉంది. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 190 హైదరాబాద్ తొలి ఇన్నింగ్స: తన్మయ్ (బి) శివకుమార్ 12; అక్షత్ (సి) భరత్ (బి) విజయ్ 10; బద్రీనాథ్ (సి) ప్రశాంత్ (బి) విజయ్ 5; అనిరుధ్ బ్యాటింగ్ 26; సందీప్ (సి) భరత్ (బి) శివకుమార్ 2; హిమాలయ్ రనౌట్ 22; కె. సుమంత్ బ్యాటింగ్ 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (45 ఓవర్లలో 5 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1-11, 2-21, 3-34, 4-36, 5-81 బౌలింగ్: విజయ్ 16-8-18-2, శివకుమార్ 15-5-30-2, భార్గవ్ 5-2-15-0, స్టీఫెన్ 9-3-17-0. -
బెంబేలెత్తించిన మిలింద్, రవికిరణ్
ఆంధ్ర 190 ఆలౌట్ రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ లక్నో: హైదరాబాద్ పేసర్లు సీవీ మిలింద్ (5/28), రవికిరణ్ (4/33) చెలరేగారు. ఆంధ్ర బ్యాట్స్మెన్ను హడలెత్తించారు. దీంతో మొదటిరోజు ఆటలోనే ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స 59 ఓవర్లలో 190 పరుగుల వద్ద ముగిసింది. ప్రణీత్ (88 బంతుల్లో 63; 11 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (63 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అకాశ్ భండారీకి ఒక వికెట్ దక్కింది. తర్వాత తొలి ఇన్నింగ్స ఆడిన హైదరాబాద్ ఆట నిలిచే సమయానికి వికెట్ కోల్పోకుండా 10 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (1 బ్యాటింగ్), అక్షత్ రెడ్డి (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తడబడిన ఆంధ్ర బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర 4 పరుగుల వద్దే ఓపెనర్ శ్రీకర్ భరత్ (3) వికెట్ను కోల్పోయింది. అతన్ని క్లీన్బౌల్డ్ చేసిన రవికిరణ్ ఆంధ్ర పతనాన్ని శాసించాడు. తర్వాత మరో ఓపెనర్ ప్రశాంత్ (27), విహారి (17)తో కలిసి కాసేపు కుదురుగా ఆడారు. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద రవికిరణ్ నిప్పులు చెరిగే బౌలింగ్తో విహారి, రికీ భుయ్ (0)లను ఔట్ చేశాడు. అదే స్కోరు వద్ద ప్రశాంత్ కూడా భండారీ బౌలింగ్లో నిష్క్రమించడంతో ఆంధ్ర 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాణించిన ప్రణీత్, అశ్విన్ ఈ దశలో ప్రణీత్, అశ్విన్ బాధ్యతాయుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆరో వికెట్కు 91 పరుగులు జోడించిన అనంతరం 171 పరుగుల జట్టు స్కోరు వద్ద మొదట అశ్విన్ను రవికిరణ్ ఔట్ చేశాడు. తర్వాత రెండు పరుగుల వ్యవధిలో మిలింద్... ప్రణీత్, శివ కుమార్ (0), సీవీ స్టీఫెన్ (0)లను పెవిలియన్ పంపాడు. తర్వాత భార్గవ్ భట్ (12) కూడా మిలింద్ బౌలింగ్లోనే నిష్క్రమించడంతో ఆంధ్ర ఇన్నింగ్స 190 పరుగుల వద్ద ముగిసింది. -
ఒకే రోజు 18 వికెట్లు...
ఛత్తీస్గఢ్ 188 ఆలౌట్ రెండో ఇన్నింగ్సలో హైదరాబాద్ 115/9 రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ వల్సాడ్: హైదరాబాద్, ఛత్తీస్గఢ్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో మూడో రోజు ఆటలో ఇరు జట్ల బౌలర్లు మెరిశారు. దీంతో ఒక్క రోజే 18 వికెట్లు నేలకూలారుు. మొదట హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఛత్తీస్గఢ్ 85.1 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స ఆడిన హైదరాబాద్ కూడా తడబడింది. ఆట నిలిచే సమయానికి 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోరుు 115 పరుగులు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ 278 పరుగుల ఆధిక్యంలో ఉంది. రాణించిన ఆకాశ్, మిలింద్ మూడో రోజు లభించిన పిచ్ సహకారాన్ని హైదరాబాద్ బౌలర్లు ఆకాశ్ భండారి (3/27), సీవీ మిలింద్ (3/47), సిరాజ్ (2/36), మెహదీ హసన్ (2/39) సద్వినియోగం చేసుకున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను క్రీజులో కుదురుకోకుండా దెబ్బతీశారు. దీంతో బుధవారం 124/1 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఛత్తీస్గఢ్ అనూహ్యంగా మరో 64 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లు కోల్పోరుుంది. ఆట మొదలైన తొలి ఓవర్ రెండో బంతికే మిలింద్... అభిమన్యు చౌహాన్ (55)వికెట్ తీయడంతో ఛత్తీస్గఢ్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన వారిలో కాంత్ సింగ్ 22, అశుతోష్ సింగ్ 17, మహ్మద్ కైఫ్ 11 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్కు తొలి ఇన్నింగ్సలో 163 పరుగుల ఆధిక్యం లభించింది. విజృంభించిన పంకజ్, అభిషేక్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన ఆనందంతో రెండో ఇన్నింగ్స ప్రారంభించిన హైదరాబాద్ బ్యాట్స్మెన్ కూడా క్రీజులో నిలిచేందుకు అపసోపాలు పడ్డారు. పంకజ్ (4/37), అభిషేక్ తమ్రకర్ (4/19) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో హైదరాబాద్ కోలుకోలేదు. ఓపెనర్ తన్మయ్ గాయం కారణంగా బెంజమిన్ థామస్ (19)తో కలిసి అక్షత్ రెడ్డి (4) ఇన్నింగ్స ఆరంభించాడు. అరుుతే 34 పరుగులకే ఓపెనర్లిద్దరిని పంకజ్ పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ బద్రీనాథ్ (11) సహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. లోయర్ మిడిలార్డర్లో భండారి (29 బ్యాటింగ్) టాప్స్కోరర్గా నిలిచాడు. ఆట నిలిచే సమయానికి ఇతనితో పాటు రవికిరణ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తన్మయ్ తలకు గాయం హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. మనోజ్ సింగ్ కొట్టిన పుల్ షాట్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్లో ఉన్న తన్మయ్ తలకు బలంగా తగిలింది. వెంటనే అతడిని అంబులెన్సలో ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. అయితే కోలుకొని తిరిగి బ్యాటింగ్కు వచ్చిన తన్మయ్ ఐదు బంతులాడి డకౌట్ అయ్యాడు. -
59 పరుగులకు ఆలౌట్!
కోల్కతా:రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టు సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. నగరంలోని ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్లో విదర్భను తొలి ఇన్నింగ్స్ లో 59 పరుగులకే కుప్పకూల్చింది. మహారాష్ట్ర మీడియం పేసర్ అనుపమ్ సంక్లేచా ఏడు వికెట్లతో అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 11 ఓవర్లలో 25 పరుగులిచ్చిన అనుపమ్.. ఏడు వికెట్లు సాధించి విదర్భ వెన్నువిరిచాడు. విదర్భ ఆటగాడు శ్రీవాస్తవ (19) ఒక్కడే రెండంకెల మార్కును చేరగా, మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజట్ కే పరిమితమయ్యారు. ఇది విదర్భకు రంజీల్లో ఐదో అత్యల్ప స్కోరు. అనంతరం మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో 332 పరుగులు చేసింది. నౌషద్ షేక్(127),అంకిత్ బావ్నే(111) శతకాలతో మెరిశారు. -
హైదరాబాద్ను ఆదుకున్న సందీప్, హసన్
ముంబై: ఓపెనర్ అక్షత్ రెడ్డి (64; 9 ఫోర్లు), వన్డౌన్ బ్యాట్స్మన్ అనిరుధ్ (49; 7 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ భాగస్వామ్యం అందించడం... ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ తడబడటం... చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ బాధ్యతాయుతంగా ఆడటంతో... సర్వీసెస్తో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో హైదరాబాద్ గౌరవప్రద స్కోరును సాధించడంలో సఫలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 89 ఓవర్లలో 7 వికెట్లకు 303 పరుగులు సాధించింది. వికెట్ నష్టానికి 136 పరుగులతో పటిష్టంగా కనిపించిన హైదరాబాద్... ఒక్కసారిగా 7 పరుగుల తేడాలో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ బద్రీనాథ్ (0) ఖాతా తెరువకుండానే రనౌట్ కాగా... వికెట్ కీపర్ కొల్లా సుమంత్ (0) కూడా డకౌట్ అయ్యాడు. ఆకాశ్ భండారి (4) నిరాశపరిచాడు. దాంతో 6 వికెట్లకు 141 పరుగులతో డీలాపడిన హైదరాబాద్ను బావనాక సందీప్ (129 బంతుల్లో 83 బ్యాటింగ్; 11 ఫోర్లు), లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ (83 బంతుల్లో 61; 11 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడి ఏడో వికెట్కు 135 పరుగులు జతచేశారు. హసన్ అవుటయ్యాక సీవీ మిలింద్ (14 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి సందీప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. సర్వీసెస్ బౌలర్లలో రౌషన్ రాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. -
రిషబ్ పంత్ బ్యాటింగ్ రికార్డు
త్రివేండ్రం:ఈ రంజీ సీజన్లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. గ్రూప్ -బిలో భాగంగా జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ అత్యంత వేగంగా సెంచరీ బాదాడు. ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా 48 బంతుల్లో శతకం సాధించి రంజీ చరిత్రలో వేగవంతంగా ఆ ఘనతను నమోదు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్గా 135 పరుగులు చేసిన రిషబ్.. 8 ఫోర్లు, 13 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. దాంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక మ్యాచ్లో అత్యధికంగా సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రిషబ్ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఎనిమిది సిక్సర్లు కొట్టిన రిషబ్.. రెండో ఇన్నింగ్స్లో 13 సిక్సర్లను కొట్టాడు. అయితే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మున్రో పేరిట ఉంది. 2015లో మున్రో ఒక మ్యాచ్ లో 23 సిక్సర్లు సాధించాడు. ఇదిలా ఉండగా, ఈ సీజన్లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో రిషబ్ ట్రిపుల్ సాధించిన సంగతి తెలిసిందే. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రిషబ్ 308 పరుగులు సాధించాడు.తాజాగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి మరోసారి మెరిశాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాజేశ్ బారోహ్, వీబీ చంద్రశేఖర్ లు సంయుక్తంగా 56 బంతుల్లో నమోదు చేసిన ఫాస్టెస్ట్ రికార్డు చెరిగిపోయింది. -
విజయం దిశగా పంజాబ్
ఉత్తర్ ప్రదేశ్తో రంజీ మ్యాచ్ హైదరాబాద్: ఉత్తర్ప్రదేశ్తో జరుగుతోన్న రంజీట్రోఫీ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో విజయానికి కేవలం 51 పరుగుల దూరంలో నిలిచింది. పంజాబ్ చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నారుు. 243/3 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం తొలిఇన్నింగ్సను ప్రారంభించిన పంజాబ్ను బౌలర్లు అంకిత్ రాజ్పుత్ (3/58), ఇంతియాజ్ అహ్మద్ (3/57) కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి ఓవర్నైట్ స్కోరుకు మరో 76 పరుగులు జోడించి పంజాబ్ ఆలౌటైంది. యువరాజ్ (85), మన్దీప్ సింగ్ (63) రాణించారు. దీంతో ఉత్తర్ప్రదేశ్కు 16 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స ప్రారంభించిన ఉత్తర్ప్రదేశ్... 38.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ (6/27) చెలరేగి ఉత్తర ప్రదేశ్ వెన్నువిరిచాడు. యూపీ జట్టులోరింకు సింగ్ (43 నాటౌట్) టాప్ స్కోరర్. తర్వాత 112 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన పంజాబ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సలో 18 ఓవర్లలో 2 వికెట్లకు 61 పరుగులు చేసింది. మనన్ వోహ్రా (34), జీవన్ జోత్ సింగ్ (27 నాటౌట్) తొలి వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఉదయ్ కౌల్ (0 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నాడు. -
పంజాబ్ దీటైన జవాబు
రాణించిన యువరాజ్ యూపీతో రంజీ మ్యాచ్ హైదరాబాద్: ఉత్తర్ప్రదేశ్తో జరుగుతోన్న రంజీట్రోఫీ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో యువరాజ్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఆదివారం స్థాయికి తగిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 3 వికెట్లకు 243 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (107 బంతుల్లో 72 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్) బ్యాట్ ఝుళిపించాడు. మనన్ వోహ్రా (59), జీవన్జ్యోత్ సింగ్ (62) అర్ధసెంచరీలతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సౌరభ్ కుమర్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 300/6 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఉత్తర్ప్రదేశ్ మరో 35 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్సలో మొత్తం 102.5 ఓవర్లలో 335 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (71), సౌరభ్కుమార్ (52) రాణించారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగగా... శుబేక్ సింగ్ గిల్ 3 వికెట్లు పడగొట్టాడు. -
22 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లు
రాయ్పూర్:దేశవాళీ లీగ్ల్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో బరోడా కుప్పకూలింది. గ్రూప్-ఎలో తమిళనాడుతో శనివారం ఆరంభమైన మ్యాచ్లో బరోడా తొలి ఇన్నింగ్స్ లో 93 పరుగులకే చాపచుట్టేసింది. 71 పరుగుల వరకూ వికెట్ మాత్రమే కోల్పోయి పోటీనిస్తున్నట్లు కనబడిన బరోడా.. ఆపై మరో 22 పరుగులు చేసి మిగతా తొమ్మిది వికెట్లను నష్టపోయింది. తమిళనాడు మీడియం పేసర్లు కృష్ణమూర్తి విఘ్నేష్, అశ్విన్ క్రిష్ట్లు బరోడాను చావు దెబ్బ తీశారు. విఘ్నేష్ ఐదు వికెట్లు సాధించగా, అశ్విన్ క్రిష్ట్కు నాలుగు వికెట్లు తీశాడు. బరోడా ఆటగాళ్లలో దేవ్ ధార్(26), మిస్త్రీ(23), సోలంకి(14)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా, మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్లుగా వెనుదిరిగారు. ఆ తరువాత 79/1 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్న తమిళనాడు లంచ్ ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. తమిళనాడు ఆటగాడు అభినవ్ ముకుంద్(100)శతకం సాధించాడు. -
జమ్మూ కశ్మీర్కు ఆధిక్యం
ముంబై: ఆంధ్రతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్లో జమ్మూ కశ్మీర్కు తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది. శనివారం మూడో రోజు ఆంధ్ర తొలి ఇన్నింగ్సలో 99.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటరుుంది. రవితేజ (81), ప్రదీప్ (47) రాణించారు. జమ్మూ బౌలర్లలో అజీజ్ ఐదు, రసూల్ మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సలో 79 పరుగుల ఆధిక్యం సాధించిన జమ్మూ కశ్మీర్ జట్టు... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సలో 18.5 ఓవర్లలో రెండు వికెట్లకు 31 పరుగులు చేసింది. హైదరాబాద్ తడబాటు భువనేశ్వర్లో కేరళతో జరగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్లో హైదరాబాద్ తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సలో 87 ఓవర్లలో ఏడు వికెట్లకు 231 పరుగులు చేసింది. సందీప్ (53) అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్సను 181 ఓవర్లలో 9 వికెట్లకు 517 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
పసలేని హైదరాబాద్ బౌలింగ్
భువనేశ్వర్: కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్-సి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. దీన్ని ఆసరాగా చేసుకొని లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగిన ఇక్బాల్ అబ్దుల్లా (214 బంతుల్లో 157 బ్యాటింగ్; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో కేరళ తొలి ఇన్నింగ్సలో భారీస్కోరు చేసింది. శుక్రవారం 223/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కేరళ ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ సచిన్ బేబి (209 బంతుల్లో 80; 8 ఫోర్లు), జలజ్ సక్సేనా (130 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఐదో వికెట్కు 147 పరుగులు జోడించారు. జలజ్ నిష్ర్కమణ తర్వాత వచ్చిన ఫెర్నాండెజ్ (12) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. దీంతో ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్కు దిగిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా స్పెషలిస్టు బ్యాట్స్మన్ను తలపించాడు. పసలేని హైదరాబాద్ బౌలింగ్పై సుదీర్ఘ ఇన్నింగ్సకు శ్రీకారం చుట్టాడు. క్రీజులో పాతుకుపోయిన తర్వాత పరుగుల వరద పారించాడు. అదును చిక్కినప్పుడల్లా భారీ సిక్సర్లతో అలరించాడు. ఇతనికి మొదట సచిన్ బేబి, తర్వాత మోనిశ్ (152 బంతుల్లో 40; 4 ఫోర్లు) చక్కని సహకారం అందించారు. మోనిశ్ అండతో సెంచరీ పూర్తి చేసుకున్న ఇక్బాల్ అబ్దుల్లా తర్వాత కూడా తన జోరు తగ్గించలేదు. కుదురుగా ఆడుతూ 150 పరుగుల మైలురాయిని అధిగమించాడు. దీంతో జట్టు స్కోరు 500 పరుగులు దాటింది. ఆట ముగిసే సమయానికి ఇతనితో పాటు సందీప్ వారియర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్కు 3 వికెట్లు దక్కాయి. రవికిరణ్ 2, సి.వి.మిలింద్, సిరాజ్, ఆకాశ్ భండారీ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
90 పరుగులకే కుప్పకూలింది!
కోల్ కతా: దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో భాగంగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఢిల్లీ విలవిల్లాడింది. గ్రూప్ -బిలో గురువారం ఆరంభమైన మ్యాచ్లో ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్ లో 35.5 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఉన్ముక్త్ చంద్(0), గౌతం గంభీర్(2) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. అలా మొదలైన ఢిల్లీ పతనం కడవరకూ కొనసాగింది. అయితే మధ్యలో రిషబ్ పంత్(24), షోరే(24)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ఏడుగురు ఢిల్లీ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆ జట్టు స్వల్ప పరుగులకే పరిమితమైంది. కర్ణాటక బౌలర్లు ఎస్ అరవింద్ నాలుగు వికెట్లు, గౌతమ్ మూడు వికెట్లు, మిథున్ రెండు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటక తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా శుక్రవారం రెండో రోజు లంచ్ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. -
చెలరేగిన దినేశ్ కార్తీక్
బిలాస్పూర్: రైల్వేస్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో తమిళనాడు ఆటగాడు దినేశ్ కార్తీక్ చెలరేగిపోయాడు. తమిళనాడు రెండో ఇన్నింగ్స్లో దినేశ్ కార్తీక్(163;145బంతుల్లో 24 ఫోర్లు) భారీ శతకం సాధించి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. గ్రూప్-ఎలో భాగంగా రైల్వేస్ తో జరుగుతున్న మ్యాచ్లో ఇంద్రజ్ జిత్(52)తో కలిసి దినేశ్ కార్తీక్ 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు కెప్టెన్ అభినవ్ ముకుంద్(100;181 బంతుల్లో 10 ఫోర్లు) శతకం సాధించాడు. వీరితో పాటు రంగరాజన్(51 నాటౌట్), కౌశిక్ గాంధీ(42) రాణించడంతో తమిళనాడు తన రెండో ఇన్నింగ్స్ ను ఎనిమిది వికెట్ల నష్టానికి 452 పరుగుల వద్ద ఉండగా డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో తమిళనాడు 121 పరుగులకు ఆలౌట్ కాగా, రైల్వేస్ మొదటి ఇన్నింగ్స్ లో 173 పరుగులు చేసింది. దాంతో రైల్వేస్ కు తమిళనాడు 401 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రైల్వేస్ చివరి రోజైన నాల్గో రోజు లంచ్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా రైల్వేస్ విజయానికి 226 పరుగులు అవసరం కాగా, తమిళనాడు గెలుపుకు ఏడు వికెట్లు అవసరం. -
చహాల్ చేతిలో ఢమాల్
జంషెడ్పూర్: సీజన్ తొలి మ్యాచ్లో అద్భుత విజయంతో ఆశలు రేపిన హైదరాబాద్ రంజీ జట్టు రెండో మ్యాచ్లో తడబడింది. హరియాణాతో ఇక్కడ కీసన్ స్టేడియంలో ప్రారంభమైన గ్రూప్-సి మ్యాచ్లో జట్టు బ్యాట్మెన్ విఫలమయ్యారు. ఫలితంగా తొలి రోజు హైదరాబాద్ 82.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. సందీప్(120 బంతుల్లో 44;5 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడాడు. హరియాణా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్(6/44) ఆరు వికెట్లతో హైదరబాద్ వెన్నువిరిచాడు. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే ఆరంభంలోనే తన్మయ్(13) రనౌట్ కాగా,మరుసటి ఓవర్లోనే అక్షత్ రెడ్డి(13)ని హర్హల్ పటేల్ బౌల్డ్ చేశాడు. అనిరుథ్(17),కెప్టెన్ బద్రీనాథ్(27) కూడా ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. ఈ దశలో సందీప్, కొల్లా సుమంత్ కలిసి జట్టును ఆదుకునే యత్నం చేశారు.వీరిద్దరూ ఐదో వికెట్కు 71 పరుగులు జోడించారు.అయితే తక్కువ వ్యవధిలోనే వీరిద్దర్ని అవుట్ చేసి చహాల్ హైదరాబాద్ను దెబ్బతీశాడు. లోయర్ ఆర్డర్లో ఎవరూ నిలబడలేకపోవడంతో జట్టు 14 పరుగుల వ్యవధిలో మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. దాంతో చహాల్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. గతంలో 21 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయని అతను ఈ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీయడం విశేషం. -
ఆంధ్ర 203 ఆలౌట్
తమిళనాడుతో రంజీ మ్యాచ్ చెన్నై: తమిళనాడుతో జరుగుతున్న గ్రూప్ ‘బి’ రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి రోజే కుప్పకూలింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి శనివారం తమ తొలి ఇన్నింగ్స్లో 77.2 ఓవర్లలో కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రదీప్ (159 బంతుల్లో 78; 6 ఫోర్లు; 1 సిక్స్), భరత్ (123 బంతుల్లో 56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా రికీ భుయ్ (65 బంతుల్లో 35; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. చంద్రశేఖర్కు నాలుగు, రంగరాజన్కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన తమిళనాడు ఒక ఓవర్ ఆడగా పరుగులేమీ చేయలేదు. -
రెండో రోజే ఆంధ్ర ఓటమి
* దెబ్బతీసిన గుర్కీరత్ * ఏడు వికెట్లతో పంజాబ్ విజయం పటియాల: పంజాబ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం వహించిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియగా పంజాబ్ ఏడు వికెట్లతో నెగ్గింది. ఈ విజయంతో పం జాబ్కు ఆరు పాయింట్లు దక్కాయి. తొలి ఇన్నిం గ్స్లో 80 పరుగులకే కుప్పకూలిన ఆంధ్ర.. శనివారం తమ రెండో ఇన్నింగ్స్లో 41.4 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్ గుర్కీరత్ సింగ్ (5/38) కెరీర్ ఉత్తమ గణాంకాలతో రెచ్చిపోయి ఆంధ్రను వణికించాడు. ఓపెనర్ శ్రీకర్ భరత్ (45 బంతుల్లో 39; 6 ఫోర్లు), ప్రశాంత్ (82 బంతుల్లో 29; 2 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్లు. రజ్వీందర్ సింగ్కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 67 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 19.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు తమ తొలి ఇన్నింగ్స్లో పంజాబ్ 55 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రశాం త్కు నాలుగు వికెట్లు దక్కాయి. మొత్తం తొమ్మిది వికెట్లతో గుర్కీరత్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో రెండు రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలడం విశేషం. హైదరాబాద్ 113/2 సాక్షి, హైదరాబాద్: జమ్ము అండ్ కశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 57 బ్యాటింగ్; 8 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీ సహాయంతో హైదరాబాద్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి తమ తొలి ఇన్నింగ్స్లో 41 ఓవర్లలో రెండు వికెట్లకు 113 పరుగులు చేసింది. క్రీజులో అక్షత్ రెడ్డి (15 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతం ప్రత్యర్థికన్నా 347 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు కశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్లో 131.2 ఓవర్లలో 460 పరుగులకు ఆలౌటయింది. రసూల్ (120 బంతుల్లో 75; 12 ఫోర్లు), రాయ్ దయాల్ (109 బంతుల్లో 48;7 ఫోర్లు) రాణించారు. అన్వర్ అహ్మద్కు ఐదు వికెట్లు దక్కాయి. -
ఓజా యాక్షన్ క్లియర్
రంజీ మ్యాచ్ ఆడనున్న స్పిన్నర్ న్యూఢిల్లీ: లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు ఊరట లభించింది. సందేహాస్పద యాక్షన్తో నిషేధానికి గురైన ఈ హైదరాబాద్ బౌలర్ తన బౌలింగ్ను సరిదిద్దుకున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ను సరైనదిగా నిర్ధారిస్తూ తాజాగా బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో అతను శుక్రవారంనుంచి ఉప్పల్లో హిమాచల్ప్రదేశ్తో జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. ‘అవును, నా యాక్షన్ను సరైనదిగా గుర్తిస్తూ బీసీసీఐ మెయిల్ పంపించింది. ఇకపై నేను పోటీ క్రికెట్ బరిలోకి దిగవచ్చు. ఇన్నాళ్ల నా వేదన తీరింది. ఇక ఈ అంకం ముగిసినట్లే’ అని ఓజా చెప్పాడు. -
రంజుగా సాగిన రంజీ
జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండులో ప్రారంభమైన మొట్టమొదటి రంజీ మ్యాచ్లో తొలిరోజైన మంగళవారం బౌలర్ల దూకుడుతో ప్రారంభమయింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి త్రిపుర జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులకు కుప్పకూలగా, ఆంధ్రా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 97 పరుగులతో కొనసాగుతోంది. ఒంగోలు : ఆంధ్రా-త్రిపుర జట్ల మధ్య స్థానిక ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో మంగళవారం ప్రారంభమైన మొట్టమొదటి రంజీ మ్యాచ్లో బౌలర్ల హవా కొనసాగింది. ఆంధ్రా బౌలర్ శివరాం ధాటికి త్రిపుర టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలిరోజు మొత్తం 77.5 ఓవర్లలో కేవలం 21 బంతులు మాత్రమే బౌండరీకి తరలాయి. వీటిలో త్రిపుర జట్టువి 16 బౌండరీలు కాగా ఆంధ్రా జట్టువి 5 ఉన్నాయి. త్రిపుర జట్టు తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 97 పరుగులతో కొనసాగుతోంది. టాస్ గెలిచిన ఆంధ్రా జట్టు.. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందని గుర్తించి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆంధ్రా జట్టు ఊహించినట్లే తొలి సెషన్లో త్రిపుర జట్టు వికెట్లు టపటపా కూలాయి. త్రిపుర కేవలం 83 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ ఎనిమిది మందిలో ఆర్కే సోలంకి 39 బంతుల్లో 7 బౌండరీల సాయంతో 37 పరుగులు చేశాడు. ఆదుకుంటాడని భావించిన త్రిపుర కెప్టెన్ ఆర్డీ బానిక్ 9 బంతులాడి ఒక బౌండరీ మాత్రమే చేశాడు. ఆంధ్రా బౌలర్ శివకుమార్ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేయడంతో త్రిపుర జట్టు తీవ్ర నిరాశకు లోనైంది. తర్వాత వచ్చిన బ్యాట్స్మన్లు కూడా వెనువెంటనే పెవిలియన్ బాట పట్టడంతో ఒక దశలో లంచ్ సమయానికే త్రిపుర తొలి ఇన్నింగ్స్ ముగుస్తుందని అంతా భావించారు. టెయిలెండర్ రాణా దుత్తా జాగ్రత్తగా ఆడుతూ ఆంధ్రా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తం 64 బంతులు ఆడి 41 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆంధ్రా జట్టు క్రీడాకారులు 5 లెగ్బైస్, ఆరు నోబాల్స్తో మొత్తం 11 పరుగులు అదనంగా ఇచ్చారు. ఆంధ్రా కెప్టెన్ మహ్మద్ కైఫ్ తొలి స్లిప్లో ఉండి రెండు అద్భుతమైన క్యాచ్లు పట్టడంతో కైఫ్ ...కైఫ్ అంటూ అభిమానులు పెద్దపెట్టున అరిచారు. లంచ్ తర్వాత త్రిపుర తొలి ఇన్నింగ్స్ ముగియడంతో ఆంధ్రా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. త్రిపుర జట్టు కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో ఒక దశలో ఆంధ్రా జట్టు ఎదురీదుతుందన్న భావన కనిపించింది. అయితే కెప్టెన్ కైఫ్ జాగ్రత్తగా ఆడుతూ కేవలం సింగిల్స్, డబుల్స్ మాత్రమే తీస్తూ స్కోరు బోర్డు పెంచాడు. తొలి ఓవర్ రెండోబంతికే ఆంద్రా జట్టు ఓపెనర్ కేఎస్ భరత్ డక్ అవుట్ అయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన డీబీ ప్రశాంత్కుమార్ కూడా కేవలం 8 బంతులు ఎదుర్కొని 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అనంతరం వన్డౌన్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగిన ఎంయూబీ శ్రీరాం 37 బంతులు ఎదుర్కొని 4 బౌండరీల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. సెకండ్ డౌన్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగిన కైఫ్ 82 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఏజీ ప్రదీప్ 12 పరుగులకు ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన రికీ భుయి 11 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. -
ప్రేక్షకుడిని కొట్టిన యూసుఫ్ పఠాన్
వడోదరా: పేలవ ఫామ్తో భారత జట్టులో చోటు కోల్పోయిన యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. జమ్మూ కశ్మీర్తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా యూసుఫ్ ఓ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపిం చాడు. మంగళవారం మూడో రోజు ఆటలో యూ సుఫ్ (9) అవుటై వెళ్తున్న సందర్భంలో పెవిలియన్ దగ్గర కూర్చొన్న ప్రేక్షకుడు ఒకరు అసభ్య పదజాలంతో దూషించాడు. తర్వాత కొంత మంది ప్రేక్షకులు జాదవ్, రాయుడులను కూడా గెలి చేయడంతో యూసుఫ్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ ప్రేక్షకుడిని డ్రెస్సింగ్ రూమ్కు పిలిపించి తిడుతూ చెంపమీద ఓ దెబ్బ వేశాడు. యూసుఫ్ చేసిన తప్పు లెవల్-3 కిందకు వచ్చినప్పటికీ ఇదే తొలిసారి కావడంతో బోర్డు మందలింపుతో సరిపెట్టింది. -
ఆంధ్ర 160/3
సర్వీసెస్తో రంజీ మ్యాచ్ న్యూఢిల్లీ: సర్వీసెస్తో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్లో తొలిరోజు ఆంధ్ర బ్యాట్స్మెన్ రాణించారు. ఆట ముగిసే సమయానికి 60 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేశారు. పొగమంచు కారణంగా తొలి రోజు 60 ఓవర్ల ఆట సాధ్యమైంది. టాస్ గెలిచిన సర్వీసెస్ జట్టు ఆంధ్రకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ భరత్ (72 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 47) రాణించగా... ప్రశాంత్ కుమార్ (28 బంతుల్లో 2 ఫోర్లతో 14), చిరంజీవి (111 బంతుల్లో 4 ఫోర్లతో 31) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఏజీ ప్రదీప్ (99 బంతుల్లో 6 ఫోర్లతో 47 బ్యాటింగ్), రాకేశ్ (52 బంతుల్లో 2 ఫోర్లతో 15 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. సర్వీసెస్ బౌలర్లలో సూరజ్ యాదవ్, రోషన్ రాజ్, సౌరభ్ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. -
హైదరాబాద్ 281/6
ఆంధ్రతో రంజీ మ్యాచ్ సాక్షి, విశాఖపట్నం: రంజీ సీజన్ను హైదరాబాద్ బ్యాట్స్మెన్ గౌరవప్రదంగానే మొదలుపెట్టారు. ఆంధ్రతో ఆదివారం మొదలైన మ్యాచ్లో తొలిరోజు హైదరాబాద్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 281 పరుగులు చేసింది. కెప్టెన్ రవితేజ (96) కొద్దిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఓపెనర్ అక్షత్ రెడ్డి (55) అర్ధసెంచరీ చేయగా... సుమన్ (35), అనిరుధ్ (45) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్కుమార్, అయ్యప్ప రెండేసి వికెట్లు తీసుకున్నారు. గంభీర్ సెంచరీ న్యూఢిల్లీ: కెప్టెన్ గౌతం గంభీర్ (270 బంతుల్లో 123; 14 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో సత్తా చాటుకున్నాడు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలం కావడం తో సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఢిల్లీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సెహ్వాగ్ 9 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ఇక హరియాణాతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ బ్యాట్స్మన్ యువరాజ్ (99 బం తుల్లో 59; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో పంజాబ్ 81.4 ఓవర్లలో 273కు ఆటౌట్ కాగా హరియాణా తొలి ఇన్నింగ్స్లో ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. -
జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్లకు చేదు అనుభవం
జమ్మూ: ఓ మిలిటెంట్ను వెతికి పట్టుకునే క్రమంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రంజీ ఆటగాళ్లను పోలీసులు భయాందోళనలకు గురిచేశారు. అర్ధరాత్రి ఒక్కసారిగా వారి హోటల్ గదులకు వచ్చి తనిఖీలు చేసి విచారించారు. దీంతో ఆటగాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రంజీ మ్యాచ్ గ్రూప్ సిలో భాగంగా హైదరాబాద్తో తమ చివరి రోజు (బుధవారం) ఆటకు ముందు రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఉదంతాన్ని ఆల్రౌండర్ షమీయుల్లా బేగ్ తన ఫేస్బుక్ పేజీలో వివరించాడు. ‘ఆ రాత్రి మేమంతా నిద్రపోలేదు. అర్ధరాత్రి సాయుధ పోలీసులు వచ్చి తెల్లవారుజాము వరకు మమ్మల్ని ప్రశ్నించారు. రొటీన్ చెకప్ అని చెబుతున్నా వారి ప్రవర్తన దారుణంగా ఉంది. రాష్ర్టం తరఫున ఆడుతున్న ఆటగాళ్లపై ఇలాంటి వైఖరి సరికాదు’ అని బేగ్ అన్నాడు. మరోవైపు పోలీసులు తమ వైఖరిని సమర్థించుకున్నారు. ఇది చాలా రొటీన్గా జరిగే వ్యవహారమేనని, ఆ హోటళ్లో రంజీ ఆటగాళ్లు ఉన్న విషయం తమకు తెలీదని, వారిని టార్గెట్ చేసుకుని సోదాలు చేయలేదని జమ్మూ పోలీస్ ఐజీ రాజేష్ కుమార్ అన్నారు. -
హైదరాబాద్కు మూడు పాయింట్లు
పొర్వోరిమ్ (గోవా): ఊహించినట్టుగానే గోవాతో జరిగిన రంజీ మ్యాచ్ను హైదరాబాద్ జట్టు డ్రాతో ముగించింది. అయితే చివరి రోజు ఆటలో స్పిన్నర్ అమోల్ షిండే (3/92) కీలక సమయంలో వికెట్లు తీసి గోవా బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. దీంతో హైదరాబాద్కు 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ కారణంగా జట్టుకు మూడు పాయింట్లు రాగా ఓవరాల్గా ఆడిన ఆరు మ్యాచ్ల్లో 15 పాయింట్లు సాధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళతో ఇంకా మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. అయితే దాదాపుగా జట్టు ఈ సీజన్ను కూడా నిరాశాజనకంగా ముగించక తప్పదు. ఎందుకంటే ఈ రెండు మ్యాచ్లను హైదరాబాద్ గెలుచుకుని, పోటీగా ఉన్న మిగతా జట్లు తమ అన్ని మ్యాచ్లను ఓడితే తప్ప లాభం లేదు. అలాంటి పరిస్థితి దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో మంగళవారం గోవా 164.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటయ్యింది. దర్శన్ మిసల్ (151 బంతుల్లో 57; 5 ఫోర్లు), షాదాబ్ జకాతి (159 బంతుల్లో 80; 10 ఫోర్లు; 1 సిక్స్) పోరాడారు. రవికిరణ్కు మూడు, అబ్సొలెమ్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 11 పరుగులతో చివరి రోజును ముగించింది. సెంచరీ భాగస్వామ్యం 273/5 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన గోవాను ఆదిలోనే షిండే దెబ్బతీశాడు. గడేకర్ (73 బంతుల్లో 26; 4 ఫోర్లు)ను బౌల్డ్ చేయడంతో బరిలోకి దిగిన జకాతి జట్టును ఆదుకున్నాడు. మిసల్తో కలిసి చక్కటి ఇన్నింగ్స్ ఆడుతూ బౌలర్లను విసిగించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడి జోరుగా ఆడడంతో ఓ దశలో గోవా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కేలా కనిపించినా అబ్సొలెమ్ రాకతో పరిస్థితి మారిపోయింది. క్రీజులో కుదురుకున్న మిసల్ను చక్కటి బంతితో ఊరించగా వికెట్ కీపర్కు చిక్కాడు. దీంతో ఏడో వికెట్కు 101 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అమిత్ యాదవ్ (72 బంతుల్లో 29; 2 ఫోర్లు)తో కలిసి పోరాడిన జకాతి... సందీప్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో గోవా ఆశలు అడుగంటాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్కు దిగిన హైదరాబాద్ చివరి రోజు ముగిసేలోపు 5 ఓవర్లు ఆడి 11 పరుగులు చేసింది. సుమన్ (1), అక్షత్ (10) నాటౌట్గా నిలిచారు. -
రంజీ మ్యాచ్ డ్రా
కడప స్పోర్ట్స్, న్యూస్లైన్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో నాలుగురోజులుగా ఆంధ్రా-మహారాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది. ఆంధ్రా జట్టు రెండవ ఇన్నింగ్స్లో 27 పరుగుల ఓవర్నైట్తో బరిలోకి దిగగా ఆంధ్రా బ్యాట్స్మన్ చివరిరోజు మ్యాచ్లో 90 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేశారు. జట్టులోని చిరంజీవి 12 ఫోర్లు 2 సిక్సర్లతో చెలరేగి ఆడటంతో సెంచరీ దిశగా సాగినా 85 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఒక ఓవర్లో మూడు వరుస బంతుల్లో 2ఫోర్లు 1 సిక్సర్తో అభిమానులను అలరించాడు. జట్టు ఓపనర్ కేఎస్ భరత్ 24 పరుగులు, ఏజీ ప్రదీప్ 25 పరుగులు చేసి అవుటయ్యారు. లోకల్బాయ్ సురేష్ బాధ్యతా యుతంగా ఆడుతూ 38 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈయనకు జతగా హరీష్ 16 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మహారాష్ట్ర జట్టు బౌలర్స్ సంక్లేచా 3, భరత్ సోలంకి, బావ్నే, దనేకర్ తలా ఒక్కో వికెట్ తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ప్రదర్శించిన మహారాష్ట్ర జట్టుకు 3 పాయింట్లు, ఆంధ్రాకు 1 పాయింట్ దక్కింది. రంజీ మ్యాచ్ చివరి రోజు కావడం, అందునా ఆదివారం కావడంతో మ్యాచ్ను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు మైదానానికి తరలివచ్చారు. -
ఆంధ్ర, మహారాష్ట్ర మ్యాచ్ డ్రా
కడప, న్యూస్లైన్: ఆంధ్ర, మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన మహారాష్ట్రకు మూడు పాయింట్లు దక్కగా ఆతిథ్య జట్టుకు ఒక పాయింట్ లభించింది. గ్రూప్-సి లో భాగంగా వైఎస్ రాజారెడ్డి మైదానంలో ఆదివారం నాలుగో రోజు ఆంధ్ర జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో ఏడు వికెట్లకు 237 పరుగులు చేసింది. చిరంజీవి (209 బంతుల్లో 85; 12 ఫోర్లు; 2 సిక్స్), సురేశ్ (115 బంతుల్లో 38; 3 ఫోర్లు) రాణించారు. సంక్లేచకు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు 27/1 ఓవర్నైట్ స్కోరు తో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ప్రదీప్ (37 బంతుల్లో 25; 5 ఫోర్లు) తో కలిసి ఐదో వికెట్కు 49 పరుగులు, సురేశ్తో కలిసి ఆరో వికెట్కు 55 పరుగులు జోడించిన చిరంజీవి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. -
నేటి నుంచి రంజీ మ్యాచ్
కడప స్పోర్ట్స్, న్యూస్లైన్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రంజీ మ్యాచ్ నిర్వహించనున్నారు. మహారాష్ట్రతో నిర్వహించే రంజీ మ్యాచ్లో ఆంధ్రా జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. గత 4 మ్యాచ్లలో ఆంధ్రా జట్టు పేలవ ప్రదర్శనతో గురువారం జరగనున్న మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటికే ఒక మ్యాచ్ విజయం సాధించిన మహారాష్ట్ర జట్టు మంచి జోష్ మీద ఉంది. మూడు మ్యాచ్లలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి, ఒక మ్యాచ్ ఓడిన ఆంధ్రా జట్టు సమిష్టి ఆటతీరును ప్రదర్శించి విజయం సాధిస్తే తప్ప ప్రయోజనం లేదు. ఆంధ్రా జట్టు విజయమే ధ్యేయంగా రెండు రోజులుగా తీవ్రంగా సాధన చేస్తున్నారు. కడపలో నిర్వహిస్తున్న మూడవ రంజీ మ్యాచ్లో కడప క్రీడాకారులు పైడికాల్వ విజయ్కుమార్, మారుపూరి సురేష్ ఆడుతుండటంతో క్రీడాభిమానుల ఆసక్తి పెరిగింది. ఆంధ్రా జట్టుకు అమోల్ మజుందార్, మహారాష్ట్ర జట్టుకు రోహిత్ మోత్వాని కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ను ప్రజలు ఉచితంగా వీక్షించవచ్చని జిల్లా క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. ముమ్మరంగా ఇరుజట్ల సాధన వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో ఆంధ్రా, మహారాష్ట్ర జట్టు క్రీడాకారులు ఉదయం కోచ్, ఫిట్నెస్ ట్రైనర్ల సమక్షంలో మూడు గంటల పాటు సాధన చేశారు. ఇరుజట్ల కెప్టెన్లు అమోల్ మజుందార్, రోహిత్ మోత్వానీలు క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ విజయం పట్ల ధీమాను కనబరుస్తూ సాధన చేశారు. -
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పోయినా నెగ్గిన హైదరాబాద్
ధర్మశాల: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయినా హైదరాబాద్ జట్టు సమష్టి కృషితో చక్కటి విజయాన్ని సాధించింది. అహ్మద్ ఖాద్రి (154 బంతుల్లో 101 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకం సహాయంతో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించగా ఆ తర్వాత బౌలర్లు చెలరేగారు. దీంతో రంజీ మ్యాచ్ గ్రూప్ సి విభాగంలో హిమాచల్ ప్రదేశ్పై హైదరాబాద్ జట్టు 185 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో జట్టుకు ఆరు పాయింట్లు దక్కాయి. హెచ్పీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో చివరి రోజు ఆదివారం హైదరాబాద్ 113.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 355 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. దీంతో 296 పరుగుల ఆధిక్యం లభించింది. అక్షయ్ చౌహాన్కు ఐదు, రిషి ధావన్కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 297 పరుగుల లక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన హిమాచల్ జట్టు... హైదరాబాద్ పేసర్ రవికిరణ్ (4/42) ధాటికి 35.5 ఓవర్లలో 111 పరుగులకు కుప్పకూలింది. పరాస్ డోగ్రా (84 బంతుల్లో 37; 7 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. అబ్సొలెం, ఓజా రెండేసి వికెట్లు తీయగా నాయుడు, విహారిలకు ఒక్కో వికెట్ దక్కింది. ఖాద్రి మెరుపులు అంతకుముందు 319/7 ఓవర్నైట్ స్కోరుతో హైదరాబాద్ చివరి రోజు ఆట ప్రారంభించగా టెయిలెండర్ల సహాయంతో అహ్మద్ ఖాద్రి చకచకా స్కోరు పెంచాడు. దీంతో 77 పరుగుల తన ఓవర్నైట్ స్కోరుకు మరో 24 పరుగులు చేర్చి సెంచరీ సాధించాడు. చివర్లో తనకు అబ్సొలెం (11), ఓజా (5) సహకరించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన హిమాచల్ ఏ దశలోనూ విజయం వైపు పయనించలేదు. పర్యాటక జట్టు బౌలర్లు వారిని కుదురుకోనీయలేదు. ఆరో ఓవర్ నుంచే వికెట్ల పతనం ప్రారంభమైంది. 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా స్పిన్నర్ ఓజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బ తీశాడు. ఇక నిలకడగా ఆడుతున్న డోగ్రాతో పాటు ధావన్ను వరుస బంతుల్లో రవికిరణ్ పెవిలియన్కు పంపడంతో 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. ఇదే జోరుతో హైదరాబాద్ బౌలర్లు ఆరు ఓవర్లలో మిగిలిన నాలుగు వికెట్లను నేలకూల్చి జట్టుకు విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 237 ఆలౌట్ హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: సుమన్ (సి) ఆతిశ్ (బి) రిషి ధావన్ 30; అక్షత్ (సి) ఆతిశ్ (బి) అక్షయ్ చౌహాన్ 43; రవితేజ (సి) ఆతిశ్ (బి) రిషి ధావన్ 73; విహారి (సి) ఆతిశ్ (బి) అక్షయ్ చౌహాన్ 41; సందీప్ (బి) అక్షయ్ చౌహాన్ 9; అహ్మద్ ఖాద్రీ నాటౌట్ 101; హబీబ్ అహ్మద్ (సి) రిషి ధావన్ (బి) అక్షయ్ చౌహాన్ 28; కనిష్క్ నాయుడు (సి) చోప్రా (బి) అక్షయ్ చౌహాన్ 0; అబ్సొలెం (సి) చోప్రా (బి) ధావన్ 11; ఓజా నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 18; మొత్తం (113.5 ఓవర్లలో 8 వికెట్లకు) 355. వికెట్ల పతనం: 1-58, 2-99, 3-181, 4-195, 5-231, 6-290, 7-292; 8-339. బౌలింగ్: విక్రమ్జిత్ 26-7-86-0, రిషి ధావన్ 38-12-85-3, అహ్మద్ 18.5-3-48-0, బిపుల్ శర్మ 2-0-14-0, అక్షయ్ చౌహాన్ 26-3-98-5, అభినవ్ బాలి 3-0-15-0. హిమాచల్ ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: చోప్రా (సి) అహ్మద్ (బి) నాయుడు 7; సంగ్రామ్ సింగ్ ఎల్బీడబ్ల్యు (బి) విహారి 5; డోగ్రా ఎల్బీడబ్ల్యు (బి) రవికిరణ్ 37; బాలి (సి) సందీప్ (బి) ఓజా 15; మోహిల్ (సి) సందీప్ (బి) ఓజా 0; భలైక్ ఎల్బీడబ్ల్యు (బి)అబ్సొలెం 12; ధావన్ (సి) సబ్ షిండే (బి) రవికిరణ్ 0; విపుల్ (సి) రవితేజ (బి) అబ్సొలెం 4; మాలిక్ (సి) అహ్మద్ (బి) రవికిరణ్ 10; చౌహాన్ (సి) అహ్మద్ (బి) రవికిరణ్ 12; అహ్మద్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (35.5 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1-9; 2-30; 3-59; 4-59; 5-73; 6-73; 7-82; 8-89; 9-105; 10-111. బౌలింగ్: అబ్సొలెం 8-0-27-2; నాయుడు 9-3-20-1;రవికిరణ్ 8.5-0-42-4; విహారి 4-0-11-1; ఓజా 6-4-8-2. -
ఆంధ్ర 233/5
అనంతపురం, సాక్షి: అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో తొలి రోజు ఆంధ్ర 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ (70) అర్ధసెంచరీతో రాణించాడు. సుమంత్ (56 బ్యాటింగ్) అర్ధసెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లు విఫలం హైదరాబాద్, సాక్షి: మహారాష్ట్రతో రంజీ మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు విఫలమయ్యారు. తొలిరోజు మహారాష్ట్ర జట్టు 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 337 పరుగలు చేసింది. ఖడీవాలే (107), కేదార్ జాదవ్ (175 బ్యాటింగ్) సెంచరీలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్, అమోల్ షిండే రెండేసి వికెట్లు తీశారు. -
భారీ స్కోరు దిశగా అస్సాం
గువాహటి: అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. రెండో రోజంతా బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశారు. దీంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ గోకుల్ శర్మ (285 బంతుల్లో 126 బ్యాటింగ్, 17 ఫోర్లు), శివశంకర్ రాయ్ (373 బంతుల్లో 134, 17 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా బార్సాపర స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో శుక్రవారం ఆట ముగిసే సమయానికి అస్సాం తొలి ఇన్నింగ్స్లో 180 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 422 పరుగుల భారీ స్కోరు చేసింది. 181/5 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన అస్సాం మరో 241 పరుగులు జోడించింది. ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ శివశంకర్ రాయ్, గోకుల్ సెంచరీలతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. దీంతో ఇన్నింగ్స్ దూకుడుగా కాకుండా సాఫీగా సాగిపోయింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి పదే పదే బౌలర్లను మార్చి ప్రయోగించినప్పటికీ లాభం లేకపోయింది. ఇద్దరు ఆరో వికెట్కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో మొదట శివశంకర్ తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అనంతరం జట్టు స్కోరు 285 పరుగుల వద్ద రాయ్... ఆశిష్ రెడ్డి బౌలింగ్లో సందీప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సయ్యద్ మహ్మద్ (117 బంతుల్లో 52 బ్యాటింగ్, 6 ఫోర్లు) కూడా క్రీజులో నిలదొక్కుకోవడంతో హైదరాబాద్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఇతని సహకారంతో గోకుల్ శర్మ కూడా సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో గోకుల్కిది మూడో సెంచరీ కాగా... ఆట ముగిసే సమయానికి సయ్యద్, గోకుల్లిద్దరూ అభేద్యమైన ఏడో వికెట్కు 137 పరుగులు జోడించి క్రీజులో ఉన్నారు. సంక్షిప్త స్కోర్లు అస్సాం తొలి ఇన్నింగ్స్: 180 ఓవర్లలో 422/6 (శివశంకర్ 134, గోకుల్ 126 బ్యాటింగ్, సయ్యద్ 52 నాటౌట్; షిండే 3/124, ఆశిష్ 1/52, సుమన్ 1/8)