real esate
-
ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్: ఎన్ని కొట్లో తెలుసా?
సినీతారలు, క్రికెటర్స్ లేదా పారిశ్రామిక వేత్తలు చాలామంది ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, ప్లాట్స్ వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది ముంబై వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఆస్తులను కొనుగోలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి నటి 'సన్నీ లియోన్' (Sunny Leone) కూడా చేరింది. కోట్ల రూపాయలు వెచ్చించి ఓ కమర్షియల్ బిల్డింగ్ కొనుగోలు చేసింది.బర్త్ డే సాంగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా పాపులర్ అయిన సన్నీ లియోన్.. ముంబైలోని ఓషివారాలో రూ. 8 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ వెల్లడించింది. ఇక్కడే ఆమె తన కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది.బిగ్ బి, అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్ కార్యాలయాలు ఉన్న భవనంలోనే సన్నీ లియోన్ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. కొనుగోలుకు సంబంధించిన లావాదేవీ ఫిబ్రవరి 2025లో జరిగినట్లు సమాచారం.సన్నీ లియోన్ ఆస్తిని.. ఆనంద్ కమల్నాయన్ పండిట్ & రూపా ఆనంద్ పండిట్ యాజమాన్యంలోని ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుంచి కొనుగోలు చేసింది. ఆనంద్ పండిట్.. టోటల్ ధమాల్, చెహ్రే మరియు ది బిగ్ బుల్ వంటి చిత్రాలను నిర్మించారు.ఇదీ చదవండి: కొత్త బిజినెస్లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?సన్నీ లియోన్ కొనుగోలు చేసిన ఆఫీస్ స్థలంలో 176.98 చదరపు మీటర్ల (1,904.91 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా, 194.67 చదరపు మీటర్ల (2,095 చదరపు అడుగులు) బిల్ట్ అప్ ఏరియా వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 35.01 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, మరో రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. -
రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్
ప్రపంచ కుబేరులలో ఒకరు, దిగ్గజ ఇన్వెస్టర్.. బెర్క్షైర్ హాత్వే సహ వ్యవస్థాపకుడు 'వారన్ బఫెట్' (Warren Buffett) ఎట్టకేలకు తన వారసుడిని ప్రకటించారు. తన రెండో కుమారుడు 'హోవార్డ్ బఫెట్' (Howard Buffett)ను 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 86.55 లక్షల కోట్లు) వ్యాపార సామ్రాజ్యానికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.ది వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దాదాపు తన మిగిలిన సంపదనంతా కొత్త ఛారిటబుల్ ట్రస్ట్కు మళ్లించనున్నట్లు వారన్ బఫెట్ వెల్లడించారు. అయితే తన ముగ్గురి పిల్లలైన 'సూసీ, హోవార్డ్, పీటర్'లకు తన సంపదలో తక్కువ భాగాన్ని మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించిన 140 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్షైర్ స్టాక్లను ఈ ముగ్గురూ పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు.హోవార్డ్ బఫెట్ను వారసుడిగా ప్రకటించిన తరువాత, నా ముగ్గురు బిడ్డలకు నేను బలంగా విశ్వసిస్తాను అని వారన్ బఫెట్ చెప్పారు. అయితే హోవార్డ్ కూడా నా బిడ్డే కాబట్టి అతనికి వారసత్వ అవకాశం లభించిందని అన్నారు. 30 సంవత్సరాలకు పైగా బెర్క్షైర్ బోర్డులో డైరెక్టర్గా పనిచేసిన హోవీ.. ఇప్పుడు చైర్మన్ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.ఎవరీ హోవార్డ్ బఫెట్?➤హోవార్డ్ బఫెట్ పూర్తి పేరు 'హోవార్డ్ హౌవీ బఫెట్'. ఈయనను 'హౌవీ' అని కూడా పిలుస్తారు. చదువు పూర్తయిన తరువాత తండ్రి బాటలో అడుగులు వేసిన హోవార్డ్.. వారెన్ బఫెట్ సలహా మేరకు లాస్ ఏంజెల్స్కు వెళ్లి బెర్క్షైర్ హాత్వే యాజమాన్యంలోని సీస్ క్యాండీస్ అనే కంపెనీలో పని చేశాడు. ఆ సమయంలో వ్యాపారానికి సంబంధించిన అనేక కీలక విషయాలను నేర్చుకున్నారు.➤వారెన్ బఫెట్.. హౌవీ కోసం ఒక పొలాన్ని కొనుగోలు చేశారు. దానిని వాడుకున్నందుకు కూడా కొడుకు నుంచి అద్దె వసూలు చేశారు. ఆ తరువాత కాలంలో హౌవీ భూమిని దున్నకుండానే సాగు చేస్తూ.. కొత్త వ్యవసాయ విధానాలపై దృష్టిపెట్టారు.➤1989లో హౌవీ బఫెట్ కౌంటీ బోర్డ్ ఆఫ్ కమీషనర్లలో చేరారు. తరువాత నెబ్రాస్కా ఇథనాల్ బోర్డ్ సభ్యునిగా చేరి.. చివరికి ఛైర్మన్ అయ్యారు. 2017 నుంచి 2018 వరకు అతను ఇల్లినాయిస్లోని మాకాన్ కౌంటీకి షెరీఫ్గా పనిచేశారు.➤1993 నుంచి.. హోవీ బఫెట్ బెర్క్షైర్ హాత్వే, కోకా కోలా ఎంటర్ప్రైజెస్, లిండ్సే కార్పొరేషన్, స్లోన్ ఇంప్లిమెంట్, కొనాగ్రా ఫుడ్స్ & వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ జీఎస్ఐ గ్రూప్తో సహా పలు ప్రముఖ కంపెనీల బోర్డులలో డైరెక్టర్గా పనిచేశారు.ఇదీ చదవండి: పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..➤హోవీ బఫెట్ తండ్రి మాదిరిగానే.. దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించి స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అంతే కాకుండా వన్య పరిరక్షణ, వన్యప్రాణులు సంబంధిత అంశాలపై ఎనిమిది పుస్తకాలను కూడా రచించారు. ఈయన డెవాన్ మోర్స్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హోవార్డ్ వారెన్ బఫెట్ అనే కుమారుడు ఉన్నారు. -
హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు - కారణం ఇదే..
హైదరాబాద్ (Hyderabad) ఇళ్ల మార్కెట్ నీరసించింది. ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది కంటే 5 శాతం తక్కువగా నమోదు కావొచ్చంటూ రియల్ ఎస్టేట్ (Real Estate) కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 58,540 యూనిట్ల అమ్మకాలు ఉంటాయని అంచనా వేసింది. క్రితం ఏడాది విక్రయాలు 61,715 యూనిట్లుగా ఉన్నాయి.హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 4 శాతం తగ్గి రూ.4.6 లక్షల యూనిట్లుగా ఉండొచ్చంటూ.. 2024 ఏడాదిపై అంచనాలతో అనరాక్ నివేదిక విడుదల చేసింది. గతేడాది ఇవే నగరాల్లో 4,76,530 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాకపోతే గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాల విలువ ఈ ఏడాది 16 శాతం పెరిగి రూ.5.68 లక్షల కోట్లుగా ఉంది.ఒక ఇల్లు సగటు విక్రయ ధర ఈ ఏడాది 21 శాతం పెరిగింది. భూముల ధరలు, కార్మికుల వేతనాలు, ముడి సరుకుల ధరలు పెరగడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే, సాధారణ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియంత్రణ పరమైన అనుమతుల్లో జాప్యంతో కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల ప్రారంభం నిదానించడాన్ని కూడా కారణంగా పేర్కొంది.ఇదీ చదవండి: రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!ఇళ్ల ధరలు పెరగడంతో అమ్మకాల విలువ గతేడాది కంటే అధికంగా ఉన్నట్టు వివరించింది. ‘‘భారత హౌసింగ్ రంగానికి 2024 మిశ్రమంగా ఉంది. సాధారణ ఎన్నికలకు తోడు, నిర్మాణ అనుమతుల్లో జాప్యం నెలకొంది. నూతన ఇళ్ల సరఫరాపై దీని ప్రభావం పడింది. గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాలు సంఖ్యా పరంగా తగ్గినప్పటికీ, ధరల పెరగుదలతో అమ్మకాల విలువ 16 శాతం పెరిగింది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.సరఫరాలో క్షీణత➤తాజా ఇళ్ల సరఫరా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 7 శాతం తగ్గి, 4,12,520 యూనిట్లుగా ఉండొచ్చు.➤ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోల్చితే 6 శాతం తగ్గి 61,900 యూనిట్లుగా ఉంటాయి. గతేడాది 65,625 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ➤ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో అమ్మకాలు ఒక శాతం పెరిగి 1,55,335 యూనిట్లకు చేరొచ్చు.➤బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 65,230 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా. ➤పూణేలో 6 శాతం తక్కువగా 81,090 యూనిట్ల విక్రయాలు నమోదు అవుతాయి.➤కోల్కతాలో 20 శాతం క్షీణతతో 18,335 యూనిట్లకు అమ్మకాలు పరిమితం కావొచ్చు.➤చెన్నైలో 11 శాతం తగ్గి 19,220 యూనిట్లుగా ఉంటాయని అనరాక్ నివేదిక అంచనా వేసింది. -
అక్కడ ఒక్కో ఇల్లు రూ. 100 కోట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
న్యూఢిల్లీ: జీవితంలో ఓ సొంతిల్లు కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇందుకోసం పైసాపైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్న వారు లేదా కొనుక్కున్న వారు ఉంటారు. ఈ క్రమంలో సామాన్యులు తమ తాహతుకు మించే ఖర్చు చేస్తారు. అయితే మన దేశంలో వంద కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?లగ్జరీ రియల్ ఎస్టేట్కు కొత్త నిర్వచనంన్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లో లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవరపర్స్(డీఎల్ఎఫ్) సంస్థ ‘ది కామెల్లియాస్’ పేరుతో అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్కు కొత్త నిర్వచనాన్ని అందించే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. ‘ది కామెలియాస్’లో ఒక్కో అపార్ట్ మెంట్ ధర రూ.100 కోట్ల వరకు ఉంది. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సీఈఓలు, అత్యంత ధనవంతులకోసం ‘ది కామెల్లియాస్’ నిర్మితమయ్యింది. ఈ ప్రాజెక్ట్ విలాసవంతమైన ఇంటీరియర్స్, సాటిలేని విసాలవంతమైన సౌకర్యాలకు నెలవుగా ఉంది.పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన ఇళ్ల ధరలు2014లో ‘ది కామెలియాస్’ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు చదరపు అడుగు ధర రూ.22,500. కానీ నేడు దాని ధర చదరపు అడుగు రూ.85,000కు పైగానే పలుకుతోంది. అంటే పదేళ్లలో 4 రెట్లు పెరిగింది. గతంలో దాదాపు రూ.25-30 కోట్లకు అమ్ముడుపోయిన ఇక్కడి ఫ్లాట్ ధర నేడు రూ.100 కోట్లకు చేరుకుంది. ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియాలు, గురుగ్రామ్లోని పాష్ ఏరియాల మధ్య ధరల వ్యత్యాసం ఇప్పుడు తగ్గుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇటీవల, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్పై ఒక నివేదికను అందించింది.బాల్కనీలోంచి చూస్తే..డీఎల్ఎఫ్ ది కామెల్లియాస్లోని ఫ్లాట్లో 72 అడుగుల గాజు బాల్కనీ ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అతిథులు కోసం మరొకటి ఆ ఫ్లాట్లోని వారి కోసం రూపొందించారు. ఈ బాల్కనీ వినోదాలకు కేంద్రంగా ఉంటుంది. దీనిలో డైనింగ్ ఏరియా, ఫార్మల్ సీటింగ్, ఫ్యామిలీ మీటింగ్స్ కోసం ప్రత్యేక కార్నర్లు ఉన్నాయి. ఈ బాల్కనీలోంచి చూస్తే బయటనున్న స్విమ్మింగ్ పూల్, పచ్చని చెట్లు కనిపిస్తాయి.లగ్జరీ లివింగ్లో కొత్త బెంచ్మార్క్ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్లో సింపుల్గా ఉంటుంది. క్లాస్సి, స్పెషల్ ఫర్నిషింగ్ను ఇందుకోసం వినియోగించారు. డీఎల్ఎఫ్కు చెందిన ఐకానిక్ ప్రాజెక్ట్లు ‘ది అరాలియాస్’, ‘ది మాగ్నోలియాస్’ మాదిరిగా ఈ ప్రాజెక్ట్ కూడా ఢిల్లీ- ఎన్సీఆర్లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ కోసం కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. కాగా ది కామెల్లియాస్కు మించిన పెద్ద ప్రాజెక్ట్ను త్వరలో ప్రారంభించేందుకు డీఎల్ఎఫ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.కొత్త ప్రాజెక్టులో..డీఎల్ఎఫ్ దహ్లియాస్ పేరుతో నిర్మితమవుతున్న ఈ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ గోల్ఫ్ కోర్స్ రోడ్, గురుగ్రామ్లో నిర్మింతం కానుంది. సగటున ఒక అపార్ట్మెంట్కు దాదాపు రూ.100 కోట్లు ఖర్చుకానుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 34,000 కోట్లుగా అంచనా. ఇందులో 9,500 చదరపు అడుగుల నుండి 16,000 చదరపు అడుగుల వరకు నివాస స్థలాలు ఉంటాయి. దహ్లియాస్లో 2,00,000-చదరపు అడుగుల క్లబ్హౌస్ ఏర్పాటు కానుంది. ఇది కామెల్లియాస్లోని క్లబ్హౌస్ కంటే చాలా పెద్దదిగా ఉండనుంది. ఇది లగ్జరీ మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా మారనుంది.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
‘రియల్’ ఆస్తులే టాప్!
దేశంలోని మొత్తం కుటుంబాల ఆస్తుల్లో సగం శాతానికి పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు ఇళ్లరూపంలోనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఈ మేరకు అమెరికాలో ప్రముఖ పెట్టుబడి సంస్థగా పేరున్న జెఫరీస్తో పాటు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాగణాంకాల ఆధారంగా వాణిజ్య వార్తా కథనాలు మాత్రమే ప్రసారం చేసే ప్రముఖ టీవీ ఛానల్ నివేదిక స్పష్టంచేస్తోంది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలోని కుటుంబాల అన్ని రకాల ఆస్తుల మొత్తం విలువ 11.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. (రూ.పదికోట్ల కోట్లు) ఈ ఆస్తులు ఏ రంగాల్లో ఉన్నాయో పరిశీలించిన ఆ టీవీ ఛానల్ .. సగానికి పైగా అనగా 50.7 శాతం వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటుఇళ్ల రూపంలోనే ఉన్నాయని గుర్తించింది. – సాక్షి, అమరావతిపీఎఫ్లో కన్నా ఇన్సూరెన్స్లోనే పెట్టుబడులు అధికంవృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్లో పెట్టుబడులు కన్నా మన దేశంలోని కుటుంబాలు అత్యధిక మొత్తం ఇన్సూరెన్స్ పాలసీల రూపంలోనే పెట్టిన పెట్టుబడులే అధికమని ఆ గణాంకాలు మరో ఆశ్చర్యకరమైన అంశాన్ని వెలుగులో తీసుకొచ్చాయి. దేశీయ కుటుంబాలు కలిగి ఉన్న మొత్తం ఆస్తుల్లో 5.8 శాతం మేర ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్ రూపంలో ఉండగా, ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో 5.9 శాతం మేర ఆస్తులున్నాయి. మన దేశ మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం.. దేశీయ మొత్తం ఆస్తుల్లో రెండో అతి పెద్ద స్థానంలో 15.5 శాతం మేర ఉండడం గమనార్హం. -
మూడేళ్ళలో 15 రెట్లు.. అక్కడ దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్
దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకెళ్తోంది. గత మూడేళ్లలో అయోధ్యలో భూముల ధరలు 15 రెట్లు పెరిగాయని 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) చైర్మన్ 'అభినందన్ లోధా' అన్నారు.ఒక ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభినందన్ లోధా మాట్లాడుతూ.. 2021లో అయోధ్యలో భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. అప్పట్లో ఒక ఎకరా భూమి ధర రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలు మధ్య ఉండేది. కానీ ప్రాంతాన్ని బట్టి నేడు అయోధ్యలో ఎకరం భూమి ధర రూ. 5 కోట్లు వరకు ఉందని ఆయన అన్నారు.2021లో కొనుగోలు చేసిన భూమిని మేము ఈ ఏడాది విక్రయించడం ప్రారంభించాము. 7 నెలల్లో 1400 ప్లాట్లను విక్రయించాము. మేము ఈ సంవత్సరం చివరగా అమ్మిన భూమి చదరపు గజం విలువ రూ. 15,000. మా సంస్థ మొత్తం 1400 రైతుల దగ్గర నుంచి ఇప్పటికే 51 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని అభినందన్ లోధా పేర్కొన్నాడు.పవిత్ర నగరమైన అయోధ్యలో భూముల విక్రయం మాత్రమే కాకుండా.. 6,000 చెట్లను నాటడం, 30కి పైగా స్థానిక జాతులను సంరక్షించడం, 1000 చెట్లను పెంచడం వంటివి కూడా చేసినట్లు లోధా చెప్పారు.ఇదీ చదవండి: 38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అయోధ్యలో 15000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు. అయోధ్య ఇప్పుడు మతపరమైన నగరంగా మారిన తరువాత.. వారణాసి, బృందావన్లలో ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు లోధా ప్రకటించారు. ముంబైకి సమీపంలోని అమృత్సర్, బృందావన్, వారణాసి, సిమ్లా, నాగ్పూర్, ఖోపోలీలో 352 ఎకరాలు భూసేకరణను ఇటీవలే ముగించినట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. -
విల్లా కొంటే.. లంబోర్ఘిని కారు ఫ్రీ
భారతదేశంలోని చాలామంది వాహన ప్రియులు జీవితంలో ఒక్కసారైనా లంబోర్ఘిని కారును డ్రైవ్ చేయాలనుకుంటారు. అయితే దీని ధర రూ. కోట్లలో ఉండటం వల్ల అందరికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి కారు ఫ్రీగా ఇస్తానంటే? ఎవరు మాత్రం వద్దంటారు. అయితే లంబోర్ఘిని కారు కావాలంటే.. ఓ విల్లా కొనాల్సి ఉంటుంది.ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జేపీ గ్రీన్స్ ఈ ప్రకటన చేసింది. ఇందులో లగ్జరీ విల్లా కొనుగోలు చేసినవారికి రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లంబోర్ఘిని కారును ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ ఓ విల్లా కొనుగోలు చేయాలంటే.. రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలువిల్లా కోసం రూ. 26 కోట్లు చెల్లిస్తే అంతటితో సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కారు పార్కింగ్ చేయడానికి, క్లబ్ మెంబర్షిప్ కోసం, గోల్ఫ్ కోర్స్ కోసం ఇలా దాదాపు మరో రూ. కోటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Noida’s got a new Villa Project coming up at 26 Cr that's offering 1 Lamborghini with each of those! 🙄 pic.twitter.com/gZqOC8hNdZ— Gaurav Gupta | Realtor (@YourRealAsset) October 27, 2024 -
ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ
గత కొన్నాళ్లుగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. విడాకుల రూమర్స్ దీనికి కారణం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడిపోనున్నారనే టాక్ బాలీవుడ్లో గట్టిగా వినిపిస్తుంది. ఇందుకు నిమ్రత్ కౌర్ అనే నటి కారణమని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది పక్కనబెడితే అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఒకేసారి 10 ఫ్లాట్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)ప్రభాస్ 'కల్కి'లో ఆశ్వద్ధామగా అదరగొట్టేసిన అమితాబ్.. గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ములంద్ ఏరియాలోని ఒబెరాయ్ రియల్టీ, ఒబెరాయ్ ఎటెర్నియాలో 10 ఫ్లాట్స్ ఒకేసారి కొనుగోలు చేశారు. వీటి ధర రూ.24.95 కోట్లు అని తెలుస్తోంది. అక్టోబర్ 9న రిజిస్టేషన్ జరిగిన ఈ కొనుగోలు కోసం కోటిన్నర వరకు స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించారట.ఈ పదింటిలో ఆరు అభిషేక్ పేరు మీద రిజిస్టర్ చేయించగా.. నాలుగింటిని అమితాబ్ పేరుపై రిజిస్టర్ చేయించారు. ఇకపోతే గత 20 ఏళ్లలో బచ్చన్ ఫ్యామిలీ దాదాపు రూ.200 కోట్ల మేర రియల్ ఎస్టేట్ కోసం డబ్బు పెడుతున్నారు. లాభాలు ఆర్జిస్తున్నారు. మరోవైపు పలు సినిమాలతో తండ్రికొడుకు ఫుల్ బిజీగా ఉన్నారు. విడాకులు రూమర్స్ కావొచ్చు, ఫ్లాట్స్ కొనడం కావొచ్చు, ఏదో రకంగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల విక్రయాలు: తొమ్మిది నెలల్లో..
హైదరాబాద్లో 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య రూ. 36,461 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ తన నివేదికలు వెల్లడించింది. ఈ సేల్స్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు సమాచారం. ఇళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య (59,386) కూడా గణనీయంగా పెరిగింది.నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2023లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 6,304 యూనిట్లు (రూ. 3,459 కోట్లు). 2024 సెప్టెంబర్లో ఈ అమ్మకాలు కేవలం 4,903 యూనిట్లు (రూ.2,820 కోట్లు) మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఇళ్ల అమ్మకాలు ఈ సెప్టెంబర్లో 22 శాతం తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్లో రూ. 50 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల విక్రయాలు 9 శాతం నుంచి 14 శాతానికి చేరాయి.సెప్టెంబర్ 2024లో హైదరాబాద్లో రిజిస్టర్ అయిన ఆస్తులలో ఎక్కువ భాగం 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల పరిధిలో కేంద్రీకృతమై ఉన్నాయి. 2000 అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తుల సేల్స్ కూడా ఆశాజనంగానే ఉన్నాయి.జిల్లా స్థాయిలో, మేడ్చల్-మల్కాజ్గిరి మార్కెట్లో 42 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయి. సెప్టెంబర్ 2023లో ఈ రిజిస్ట్రేషన్స్ 45 శాతం కావడం గమనార్హం. మొత్తం రిజిస్ట్రేషన్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు వరుసగా 39 శాతం, 19 శాతం వాటా కలిగి ఉన్నాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధర సెప్టెంబర్ 2024లో 3 శాతం పెరిగింది. మేడ్చల్-మల్కాజ్గిరిలో అత్యధికంగా 7 శాతం పెరుగుదల జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డిలు వరుసగా 3 శాతం, 2 శాతం పెరుగుదల జరిగింది. -
క్యూ3లో 25 రియల్ ఎస్టేట్ డీల్స్..
దేశీ రియల్టీ రంగంలో ఈ కేలండర్ సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో 25 డీల్స్ జరిగినట్లు కన్సల్టింగ్ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదిక పేర్కొంది. వీటి విలువ 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,760 కోట్లు)గా తెలియజేసింది. ప్రధానంగా డెవలపర్స్ చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)దే వీటిలో ప్రధాన వాటాగా వెల్లడించింది. ‘రియల్టీ, రీట్స్ డీల్ ట్రాకర్– ఎంఅండ్ఏ, పీఈ డీల్ ఇన్సైట్స్’ పేరుతో విడుదల చేసిన నివేదిక వివరాలు చూద్దాం..కొత్త రికార్డ్ రియల్టీ రంగ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ3)లో ఏకంగా 25 డీల్స్ నమోదయ్యాయి. పరిమాణంరీత్యా ఇది సరికొత్త రికార్డుకాగా.. విలువ(రూ. 11,760 కోట్లు)రీత్యా 2023 ఏడాది క్యూ2 తదుపరి గరిష్ట విలువగా నమోదైంది. ప్రధానంగా క్విప్ జారీ పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వీటికి రెసిడెన్షియల్, వాణిజ్య విభాగాలలో పీఈ నిధులు జత కలిశాయి. అంతేకాకుండా రియల్టీ టెక్నాలజీ కంపెనీలలోనూ ఒప్పందాలు కలిసొచ్చాయి. డీల్స్ తీరిలా క్యూ2లో నమోదైన మొత్తం డీల్స్లో 5.1 కోట్ల డాలర్ల విలువైన 8 ఒప్పందాలు కొనుగోళ్లు, విలీనం(ఎంఅండ్ఏ) విభాగంలో జరిగాయి. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) విభాగంలో 40.1 కోట్ల విలువైన 12 డీల్స్ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్–జూన్(క్యూ2)లో లభించిన 1.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా క్షీణించాయి. కాగా.. క్యూ3లో 4.9 కోట్ల డాలర్ల విలువైన ఒక ఐపీవోసహా 94 కోట్ల డాలర్ల విలువైన క్విప్లు జారీ అయ్యాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్లు బలపడటం సహకరించింది. క్విప్లో 94 కోట్ల డాలర్ల విలువైన 4 డీల్స్ జరిగాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 60.2 కోట్ల డాలర్ల డీల్ దీనిలో కలసి ఉంది. ఇవి క్యూ2తో పోలిస్తే ఆరు రెట్లు అధికం. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ కొంత నీరసించింది. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం క్షీణించగా, దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సగటున 5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ఎనిమిది పట్టణాల్లో 96,544 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,01,221 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త ఇళ్ల ఆవిష్కరణలు (తాజా సరఫరా) సెప్టెంబర్ త్రైమాసికంలో 25 శాతం తక్కువగా 91,863 యూనిట్లుగానే ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్టైగర్ విడుదల చేసింది. నూతన ఇళ్ల సరఫరా తగ్గడానికి తోడు, ధరలు పెరగడం విక్రయాలు క్షీణించడానికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 20 శాతం పెరగడంతో ధరల అందుబాటుపై ప్రభావం చూపించినట్టు వివరించింది. పట్టణాల వారీగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్లో 11,564 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 14,191 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంటే 19 శాతం క్షీణత కనిపిస్తోంది. బెంగళూరులోనూ 11% తక్కువగా 11,160 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. చెన్నైలో 8 శాతం తక్కువగా 3,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్కతాలో అమ్మకాలు 2,796 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాలతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. చదవండి: ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో అమ్మకాలు ఒక శాతం తక్కువగా 30,010 యూనిట్లుగా నమోదయ్యాయి. పుణెలోనూ విక్రయాలు 3 శాతం తగ్గి 18,004 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల అమ్మ కాలు 29% పెరిగాయి. 10,098 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 7,800 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 9,352 యూనిట్లుగా నమోదయ్యాయి.పండుగల సీజన్తో అమ్మకాలకు ఊతం ‘‘వార్షికంగా చూస్తే సెపె్టంబర్ క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు, కొత్త ఇళ్ల ఆవిష్కరణలు తగ్గడం ధరల పెరుగుదలకు స్పందనగా కనిపిస్తోంది. మార్కెట్ కార్యకలాపాలు మోస్తరు స్థాయికి చేరడం చూస్తున్నాం. ఇది స్థిరమైన వృద్ధిని తీసుకొస్తుంది. అంతిమంగా వినియోగదారులకు మేలు చేస్తుంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఇళ్ల ధరలు కొన్ని ప్రాంతాల్లో 3 శాతం నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. ఇది తక్షణ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తోంది’’ అని ప్రాప్టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ వివరించారు. కొత్త ధరలకు వినియోగదారులు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. దేవీ నవరాత్రులతో పండుగల సీజన్ ఊపందుకుందని, అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, పుణె మార్కెట్లో డెవలపర్లు డిమాండ్కు అనుగుణంగా సరఫరా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. -
పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో 5 శాతం పెరిగాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతుల (స్పేస్) లీజింగ్ సైతం 18% పెరిగింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది పట్టణాలకు సంబంధించిన డేటాను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్ కాలంలో 87108 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 82,612 యూనిట్లుగా ఉన్నాయి.స్థూల ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ పట్టణాల్లో 18% పెరిగి 19 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎప్టీ) చేరింది. బహుళజాతి కంపెనీలు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ల (జీసీసీ) నుంచి అధిక డిమాండ్ నెలకొంది. జూలై–సెప్టెంబర్లో ఇళ్ల అమ్మకాలు పెరిగాయన్న అనరాక్, ప్రాప్ ఈక్విటీ సంస్థల అంచనాలకు భిన్నంగా నైట్ఫ్రాంక్ గణాంకాలు ఉండడం గమనార్హం. ‘‘2024లో ఇళ్ల మార్కెట్లో సానుకూల ధోరణి నెలకొంది. క్యూ3లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి’’అని నైట్ఫ్రాంక్ నివేదిక తెలిపింది. రూ.1 కోటికి మించి ధర కలిగిన ప్రీమియం ఇళ్లకు ఏర్పడిన డిమాండ్ అమ్మకాల వృద్ధికి సాయపడుతున్నట్టు నైట్ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ వెల్లడించారు. అందుబాటు ధరల విభాగంలో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్టు చెప్పారు. ఇళ్ల లభ్యత, వాటి ధరల పరంగా సవాళ్లు నెలకొన్నట్టు తెలిపారు. జీసీసీల ముఖ్య భూమిక‘‘భారత్లో వ్యాపార సంస్థలు, జీసీసీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. వృద్ధిలో వీటిదే ప్ర ముఖ పాత్ర. ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ ఇదే ధోరణి ఉంటుందని అంచనా వేస్తున్నాం. 2024 మొత్తం మీద ఆఫీస్ స్థలాల లీజింగ్ 70 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించొచ్చు. నికరంగా 10 మిలియన్ ఎస్ఎఫ్టీ ఎక్కువ. క్రితం ఏడాది కంటే 20% అధికం. అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతుండడాన్ని ఈ అసాధారణ వృద్ధి తెలియజేస్తోంది’’అని శిశిర్ బైజాల్ వివరించారు. హైదరాబాద్లో 9 శాతం వృద్ధి➤హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 2024 జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 9 శాతం పెరిగి 9,114 యూనిట్లుగా ఉన్నాయి. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 26 శాతం తగ్గి 2.2 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ 2.9 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండడం గమనార్హం. ➤ముంబై మార్కెట్లో రికార్డు స్థాయిలో 24,222 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల కంటే 9 శాతం ఎక్కువ. కానీ, ఆఫీస్ స్పేస్ లీజింగ్ మాత్రం 17 శాతం తగ్గిపోయి 2.7 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది. ➤బెంగళూరులో 11 శాతం వృద్ధితో 14,604 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఇక్కడ రెండున్నర రెట్లు పెరిగి 5.3 మిలియన్ చదరపు అడుగులకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 2.1 మిలియన్ ఎస్ఎఫ్టీగానే ఉంది.➤పుణెలో ఇళ్ల అమ్మకాలు కేవలం ఒక శాతమే పెరిగి 13,200 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్క డ కార్యాలయ స్థలాల లీజింగ్ 14 శాతం క్షీణించి 2.6 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది.➤అహ్మదాబాద్లో 11 శాతం వృద్ధి నమోదైంది. 4,578 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ సైతం 69 శాతం వృద్ధిని నమోదు చేసింది. 0.3 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు చోటుచేసుకున్నాయి. ➤కోల్కతాలోనూ 14 శాతం అధికంగా 4,309 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. స్థూల ఆఫీస్ స్థలాల లీజింగ్ 38 శాతం తక్కువగా 0.18 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.➤ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 7 శాతం తగ్గాయి. 12,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 26 శాతం పెరిగి 3.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది.➤చెన్నైలో 4,105 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాల కంటే 6 శాతం తక్కువ. చెన్నైలో ఆఫీస్ స్పేస్ 35 శాతం వృద్ధితో 2.6 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది.➤జూలై–సెప్టెంబర్ కాలంలో మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్లో జీసీసీలు తీసుకున్నదే 37 శాతం (7.1 మిలియన్ ఎస్ఎఫ్టీ)గా ఉంది. -
హైడ్రా కూల్చివేతలు.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు.. వీటికే ఎక్కువ డిమాండ్
రియల్ ఎస్టేట్ మార్కెట్లో రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లలో భూముల అమ్మకాలు, ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2024 ఆగష్టులో రూ. 4043 కోట్ల విలువైన గృహాలు హైదరాబాద్లో అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన నివేదికలో ప్రస్తావించింది. ఇది అంతకు ముందు ఏడాది కంటే 17 శాతం ఎక్కువ.ఆగష్టు 2024లో హైదరాబాద్లో 6439 ఇళ్ల రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు సమాచారం. ఈ రిజిస్ట్రేషన్స్ అంతకు ముందు ఏడాది ఆగష్టు నెల కంటే కూడా ఒక శాతం తక్కువ. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగష్టు నెల వరకు హైదరాబాద్లో 54483 (ఎనిమిది నెలల కాలంలో) ఇల్లు అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే 41 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఆగష్టులో 50 లక్షల రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు 67 శాతం. రూ. కోటి కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 15 శాతం. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది ఇదే నెలకంటే కూడా ఎక్కువే అని గణాంకాలు చెబుతున్నాయి. -
2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!.. జేఎల్ఎల్ రిపోర్ట్
ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ 2030 నాటికి రూ. 2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించగలదని రియల్ ఎస్టేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ జేఎల్ఎల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2023లో సిటీ రెసిడెన్షియల్ విక్రయాల విలువ రూ. 1 లక్ష కోట్లను అధిగమించింది. 2024లో ఇది రూ.1.35 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉందని చెబుతోంది.ముంబైలో రియర్ ఎస్టేట్ రంగం గణనీయంగా ముందుకు దూసుకెళుతోంది. దీనికి కారణం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL), నవీ ముంబై సబర్బన్ రైల్, మెట్రో లైన్ల కనెక్టివిటీ పెరగటం అని తెలుస్తోంది. 2030 నాటికి మల్టీమోడల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో కొనసాగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లు కొత్త రెసిడెన్షియల్ హబ్లను ప్రోత్సహిస్తాయని జేఎల్ఎల్ నివేదికలో వెల్లడించింది.2024 మొదటి అర్ధభాగంలో ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ భారీగా వృద్ధి చెందింది. ఈ అమ్మకాలు 2023లో నమోదైన మొత్తం సేల్స్ కంటే కూడా 57 శాతం ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే 2030 నాటికి తప్పకుండా 2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించగలదని స్పష్టంగా అర్థమవుతోంది. -
ముంబైలో 'యోహాన్ పూనావాలా' కొత్త ఇల్లు: ఎన్ని కోట్లో తెలుసా?
బిలియనీర్, ప్రముఖ పారిశ్రామికవేత్త యోహాన్ పూనావాలా, అతని భార్య మిచెల్ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ. 500 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వెచ్చించి ఓ ఇల్లు కొనుగోలు చేశారు. ఈ ఖరీదైన భవనం విస్తీర్ణం 30,000 చదరపు అడుగులు. ఈ విశాలమైన.. విలాసవంతమైన భవనం ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన నివాసాలలో ఒకటి. దీనిని 'పూనావాలా మాన్షన్' అని పేరు పెట్టారు.యోహాన్ పూనావాలా.. పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్. ఈయన తండ్రి జవరాయ్ పూనావల్లా.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కో ఫౌండర్. కాబట్టి యోహాన్ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. యోహన్ భార్య మిచెల్ పూనావల్ల ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్.రూ.500 కోట్లతో కొనుగోలు చేసిన కొత్త భవనం విశాలమైన లేఅవుట్స్, విశాలమైన డాబాలను కలిగి ఉంది. ఇందులో కొంత భాగాన్ని పూనావాలా ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. ఇందులో మిచెల్ ఆయిల్ పెయింటింగ్లు, ఇతర విలువైన మొక్కలు ఉంటాయి.ముంబైలో ఆస్తులను కలిగి ఉన్న ప్రముఖులుదక్షిణ ముంబైలో సెలబ్రిటీలు ఎక్కువగా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ఉన్నారు. విరాట్ కోహ్లీ వర్లీ 'ఓంకార్ 1973' ప్రాజెక్ట్లో 34 కోట్ల విలాసవంతమైన అపార్ట్మెంట్ను, రోహిత్ శర్మ వర్లీలోని అహుజా టవర్స్లో రూ 30 కోట్ల ఆస్తిని & యువరాజ్ సింగ్ అదే పరిసరాల్లో రూ.64 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఫలించిన ఆలోచన.. 150 రోజుల్లో రూ.268 కోట్లు - ఎవరీ 'రాహుల్ రాయ్'?క్రికెటర్లు మాత్రమే కాకుండా సినీ నిర్మాత, డైరెక్టర్ 'దినేష్ విజన్' కూడా ముంబైలోని 9,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. సుహానా ఖాన్ అలీబాగ్లోని 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని, అలియా భట్ ప్రొడక్షన్ హౌస్ బాంద్రాలోని 2,497 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. -
ఆస్తులు అమ్మేస్తున్న శ్రీదేవి భర్త!
సీనియర్ సినీ నిర్మాత బోనీ కపూర్, అతని కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ముంబైలోని అంధేరి శివారులో ఉన్న తమ నాలుగు అపార్ట్మెంట్లను విక్రయించినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైలోని అంధేరీ వెస్ట్లో రెండు ఫ్లాట్లను రూ. 6.02 కోట్లకు విక్రయించారు. దీనికి సంబంధించిన ఒప్పందం 2023 నవంబర్ 2 నమోదైనట్లు తెలుస్తోంది. రెండు అపార్ట్మెంట్లు లోఖండ్వాలా కాంప్లెక్స్లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. రెండు ఫ్లాట్ల విస్తీర్ణం 1870.57 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్లు ఒక ఓపెన్ కార్ పార్కింగ్తో వస్తాయి. ఈ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు సిద్ధార్థ్ నారాయణ్, అంజు నారాయణ్గా చెబుతున్నారు. అదే కాంప్లెక్స్లో ఉన్న మరో రెండు అపార్ట్మెంట్లను వారు మరో రూ. 6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2023 అక్టోబర్ 12 న జరిగినట్లు సమాచారం. 1614.59 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు రెండు కార్ పార్కింగ్లతో వస్తాయి. వీటిని ముస్కాన్ బహిర్వానీ, లలిత్ బహిర్వానీలకు విక్రయించినట్లు సమాచారం. 2022లో బోనీ, జాన్వీ, ఖుషీలు 65 కోట్ల రూపాయల విలువైన బాంద్రాలో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ని కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 6421 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఇందులో ఐదు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే.. గతంలో ఆస్తులు విక్రయించిన సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఖరీదైన ప్లాట్లను కొనుగోలు చేయడం, విక్రయించడం కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం నటుడు 'రణవీర్ సింగ్' ముంబైలోని ఒక లగ్జరీ టవర్లోని రెండు ఫ్లాట్లను రూ.15.24 కోట్లకు విక్రయించాడు. నవంబర్లో నటి 'ప్రియాంక చోప్రా' ఓషివారాలోని లోఖండ్వాలా కాంప్లెక్స్లో 2,292 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో ఉన్న రెండు పెంట్హౌస్లను రూ. 6 కోట్లకు విక్రయించింది. -
విలాస భవనాలకు గిరాకీ.. ఈ ఏడాది అదే టాప్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాసవంతమైన ఇళ్లకు (అల్ట్రా లగ్జరీ) అధిక గిరాకీ నెలకొన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.40 కోట్లకు పైగా విలువ చేసే ఇళ్ల అమ్మకాలు రూ. 4,063 కోట్ల మేర నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణె పట్టణాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 58 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2022 ఏడాది మొత్తం మీద ఈ విభాగంలో అమ్ముడుడైనవి 13 యూనిట్లుగానే ఉన్నాయి. వీటి విలువ రూ. 1,170 కోట్లుగా ఉంది. ‘‘కరోనా మహమ్మారి తర్వాత నుంచి లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. ధనవంతులు (హెచ్ఎన్ఐ), అధిక ధనవంతులు (అల్ట్రా హెచ్ఎన్ఐలు) ఖరీదైన ఇళ్లను పెట్టుబడి కోసం, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా కొనుగోలు చేస్తున్నారు’’అని అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్న నేపథ్యంలో హెచ్ఎన్ఐలు తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో మార్పులు చేయడం అల్ట్రా లగ్జరీ ఇళ్లకు డివండ్ను పెంచినట్టు చెప్పారు. ముంబై టాప్.. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అత్యంత ఖరీదైన ఇళ్లు 58 యూనిట్లు అమ్ముడుపోగా, అందులో 53 యూనిట్లు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో నాలుగు యూనిట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లోనూ ర.40 కోట్ల పైన విలువ చేసే ఒక యూనిట్ విక్రయం నమోదైంది. ముంబైలోని 53 యూనిట్లలో మూడు ఇళ్ల ధర రూ. 200 కోట్లపైనే ఉంది. ఏడు ఇళ్ల ధర రూ. 100–200 కోట్ల మధ్య ఉంది. ఢిల్లీలో రెండు యూనిట్ల ధర రూ.100 కోట్లపైన ఉంది. ‘‘ఇటీవలి కాలంలో సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష అన్ని ఆదాయ వర్గాల వారిలో పెరిగింది. జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఇందుకు కారణం. మరింత విలాసవంతమైన ఇల్లును కలిగి ఉండాలన్న ధోరణి ధనవంతుల్లో పెరిగింది’’అని గురుగ్రామ్కు చెందిన క్రిసూమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ పేర్కొన్నారు. -
ఇళ్ల అమ్మకాల జోరు.. హైదరాబాద్లో భారీ వృద్ధి!
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 14,190 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే మూడు నెలల కాలంలో అమ్మకాలు 10,570 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 34 శాతం వృద్ధి నమోదైంది. అంతేకాదు, ఈ ఏడాది జూన్తో ముగిసిన మూడు నెలల్లో అమ్మకాలు 7.690 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు అమ్మకాలు 85 శాతం పెరిగినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లోనూ సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 22 శాతం పెరిగి 1,01,200 యూనిట్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రాప్టైగర్ డాట్ కామ్ నివేదిక తెలిపింది. ఎనిమిది పట్టణాల్లో నూతన ఇళ్ల సరఫరా (కొత్త ప్రాజెక్టులు) 17 శాతం పెరిగి 1,23,080 యూనిట్లుగా ఉంది. పట్టణాల వారీగా.. బెంగళూరు మార్కెట్లో 12,590 యూనిట్లు ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చినప్పుడు 60 శాతం, క్రితం త్రైమాసికంతో పోల్చిచూసినప్పుడు 86 శాతం చొప్పున పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 44 శాతం అధికంగా 7,800 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్కతా మార్కెట్లో 3,620 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇక్కడ 43 % వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్లో 31 అధికంగా 10,300 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ముంబై మార్కెట్లో 30,300 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక్కడ 5 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. జూన్ త్రైమాసికంతో పోల్చిచూస్తే అమ్మకాలు ఫ్లాట్గా ఉన్నాయి. పుణె మార్కెట్లో 18 శాతం అధికంగా 18,560 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. చెన్నైలో క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు అమ్మకాలు 12 శాతం క్షీణించి, 3,870 యూనిట్లకు పరిమితమయ్యాయి. సానుకూల సెంటిమెంట్ ‘‘టాప్8 పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. సానుకూల వినియోగ సెంటిమెంట్ డిమాండ్కు మద్దతుగా నిలుస్తోంది’’అని ప్రాప్టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ తెలిపారు. గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, ఖర్చు చేసే ఆదాయం పెరగడం, స్థిరమైన వడ్డీ రేట్లు కొనుగోళ్ల సెంటిమెంట్కు మద్దతునిచ్చే అంశాలుగా తెలిపారు. -
కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొన్న ప్రీతి జింటా!
ప్రముఖ నటి 'ప్రీతి జింటా' (Preity Zinta) ముంబైలోని బాంద్రాలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు 'రియల్టీ ప్లాట్ఫామ్ ఇండెక్స్టాప్.కామ్' ద్వారా తెలిసింది. ఈ అపార్ట్మెంట్ ధర ఎంత? ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రీతి జింటా ముంబైలోని పాష్ బాంద్రాలో సుమారు 1,474 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్మెంట్ను రూ. 17.01 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 23న జరిగినట్లు తెలుస్తోంది. కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్ దీనిని విక్రయించినట్లు, దీని కోసం నటి రూ. 85.07 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం. ప్రీతి జింటా మొత్తం ఆస్తుల విలువ ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు. ముంబై రియల్ ఎస్టేట్ ముంబై రియల్ ఎస్టేట్ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి, అతని భార్య షబానా బాజ్పేయి ముంబైలోని ఓషివారా ప్రాంతంలో రూ. 32.94 కోట్లతో 7,620 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నాలుగు ఆఫిస్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు! సినీ నటులు అమితాబ్ బచ్చన్ , కార్తీక్ ఆర్యన్ గతంలో ముంబై, దాని పరిసర ప్రాంతాలలో స్థలాలను కొనుగోలు చేశారు. ఎక్కువ మంది నివాస స్థలాల కంటే ఎక్కువ అద్దె రాబడి కోసం కమర్షియల్ ఆస్తుల మీద పెట్టుబడులు పెడుతున్నారు. -
అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా?
Country Garden: కరోనా మహమ్మారి ప్రపంచ పరిస్థితులనే తలకిందులు చేసింది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించేశాయి. ఇప్పటికి కూడా ఆ ప్రభావం ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉంది. చైనాలో ఒక దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీ గతంలో దాదాపు రూ. 6 లక్షల కోట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.. కాగా ఇదే బాటలో మరో కంపెనీ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రాపర్టీ డెవలపర్ 'కంట్రీ గార్డెన్' నష్టాల్లో కూరుకుపోయినట్లు, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి సుమారు 7.6 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 57వేల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కంపెనీ షేర్లు కూడా చాలా వరకు కుప్పకూలాయి. ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగినిపై నిఘా - పర్ఫామెన్స్ చూసి ఖంగుతిన్న కంపెనీ! గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 265 మిలియన్ డాలర్ల లాభంతో ఉండేది, ఆ తరువాత క్రమంగా నష్టాల్లోనే ముందుకు సాగింది. మొత్తం మీద అటు లాభాలు.. ఇటు కంపెనీ షేర్లు పతనమవుతున్నాయి. దీంతో కంట్రీ గార్డెన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా.. కంట్రీ గార్డెన్ కంపెనీ దాదాపు మూడువేల హోసింగ్ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు, ఇందులో సుమారు 70 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఇదే తీరుగా నష్టాల్లోనే పయనిస్తే వీరందరి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. -
అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?
HDFC: ప్రపంచ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి అమాంతం ముందుకు దూసుకెళుతోంది. ఈ కారణంగా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లకు చేరిన సంగతి తెలిసింది. కాగా అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో ఒక బ్యాంకు నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లిస్తూ ఐదు సంవత్సరాల అగ్రిమెంట్తో ఆఫీస్ స్పేస్ లీజుకి తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెలకు రూ. 1.62 కోట్లు అద్దె.. నివేదికల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ ముంబైలోని వన్ ఇంటర్నేషనల్ సెంటర్లో తన ఆఫీస్ కోసం 64,337 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలానికి నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీని కోసం సంస్థ ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తరువాత అగ్రిమెంట్ కాలవ్యవధి పెరుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బ్యాంకు 7వ అంతస్తులో మూడు యూనిట్లు, 8వ అంతస్తులో రెండు యూనిట్లను లీజుకు తీసుకుంది. ఇవి టవర్స్ 2, 3లో ఉన్నాయి. ఈ డీల్ కోసం బ్యాంక్ దాదాపు రూ.9.73 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అయితే అద్దె సంవత్సరానికి 4.5 శాతం పెరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ఐదు సంవత్సరాలకు అద్దె ఇలా.. దీని ప్రకారం మార్చి 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అద్దె రూ. 1.62 కోట్లు. 2024 ఆగష్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు అద్దె నెలకు రూ.1.69 కోట్లు. 2025 ఆగష్టు 1 నుంచి 2026 జూలై 31 వరకు అద్దె రూ. 1.77 కోట్లు. 2026 ఆగష్టు 1 నుంచి 2027 జులై 31 వరకు అద్దె రూ.1.85 కోట్లు ఉండనున్నట్లు సంస్థ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! గత కొన్ని రోజులకు ముందు హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. వీరికి తిరుగులేదండోయ్!
భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ రంగాలలో ఒకటి 'రియల్ ఎస్టేట్' అని అందరికి తెలుసు. ప్రస్తుతం ఈ రంగంలో దేశవ్యాప్తంగా సుమారు 7.1 కోట్ల ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్లకు చేరే అవకాశం ఉందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నైట్ఫ్రాంక్ ఇండియా, రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ సర్వేయర్స్ ప్రకారం.. ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి మరింత అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోందని.. ఈ తరుణంలో ఉద్యోగులకు డిమాండ్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో ఉద్యోగులకు డిమాండ్.. ఇప్పటి వరకు నిర్మాణ రంగంలో ఉన్న చాలా మంది ప్రజలకు సరైన నైపుణ్యాలు లేవని.. అలాంటి నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువని చెబుతున్నారు. కావున రానున్న రోజుల్లో ఈ రంగంలో అనుభవం ఉన్నవారికి డిమాండ్ భారీగా ఉండనుంది. అంతే కాకుండా ఈ రంగానికి తగిన విధంగా మార్చుకోవడానికి కంపెనీలు కూడా తమ వంతు పాటుపడాలని కొంత మంది సూచిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పనిచేస్తున్న 7.1 కోట్ల మందిలో 44 లక్షలు ఇంజినీర్లు, టెక్నీషియన్స్ ఉన్నారు. మిగిలిన వారికి ఈ రంగంలో ఎక్కువ నైపుణ్యాలు లేకపోవడం గమనార్హం. కావున రానున్న రోజుల్లో సరైన మెళుకువలున్నవారు ఈ రంగంలో అడుగుపెడితే తప్పకుండా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన వంటి లక్ష్యాలను చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. -
బాలానగర్లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవం కలిగిన రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో అద్బుతమైన ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బాలానగర్లో ఏ2ఏ లైఫ్ స్పేసెస్ అపార్ట్మెంట్, సెంటర్ మాల్ ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తి చేసిన సంస్థ.. తాజాగా ఏ2ఏ హోమ్ ల్యాండ్ ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది. బాలానగర్లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇదేనని కంపెనీ తెలిపింది. రఘురామ్ ఇన్ఫ్రా ఇప్పటివరకు 40 లక్షలకు పైగా చ.అ.లలో 38 పైగా ప్రాజెక్ట్లను నిర్మించింది. సుమారు 4 వేలకు పైగా కస్టమర్లున్నారు. ►ఫేజ్–1లో 12 ఎకరాలలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 7 బ్లాకులుంటాయి. మొత్తం 1,158 ఫ్లాట్లుంటాయి. అన్నీ త్రీ బీహెచ్కే ప్రీమియం ఫ్లాట్లే. 1,700 చ.అ. నుంచి 2,260 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. (ఈస్ట్ హైదరాబాద్ రయ్ రయ్! ఎందుకో తెలుసా?) ► ఈ ప్రాజెక్ట్లో 93 వేల చ.అ. విస్తీర్ణంలో రెండు క్లబ్హౌస్లతో పాటు క్రచ్, ఇండోర్ గేమ్స్, లెర్నింగ్ సెంటర్, బిజినెస్ లాంజ్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, లైబ్రరీ, జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు, యోగా సెంటర్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. ► బాలానగర్ మెట్రో జంక్షన్, కూకట్పల్లి వై జంక్షన్లకు కూతవేటు దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రధాన నగరంలో ఉండటంతో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి కొదవే లేదు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్కు గ్రీన్ సిగ్నల్) మరిన్ని రియల్ ఎస్టేట్ వార్తలకు,బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్ ఎస్టేట్ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..
దేశంలోని మూడు మెట్రోపాలిటన్ నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలనంటాయి. వాటి ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 2022లో ధరల పెరుగుదలను నమోదు చేసింది. ఈ మూడు నగరాలు నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్ఐ 100)లో ఉన్నత స్థానాలకు చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్లు (రూ.8,24,43,400)కు ఏయే నగరాల్లో ఎంత స్థలం కొనుగోలు చేయొచ్చో నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ గణాంకాలను విడుదల చేసింది. (ఇదీ చదవండి: టయోటా కార్లపై తగ్గని మోజు.. భారీగా పెరిగిన అమ్మకాలు!) నైట్ ఫ్రాంక్ డేటా ప్రకారం.. అమెరికన్ డాలర్ల పరంగా ముంబై ప్రపంచంలో 18వ అత్యంత ఖరీదైన ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్. ఈ నగరం ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 6.4 శాతం ధరల పెరుగుదలను నమోదు చేసింది. 2021లో 92వ స్థానంతో పోలిస్తే 2022 పీఐఆర్ఐ 100 సూచీలో 37వ స్థానానికి చేరుకుంది. ముంబైలో ఒక మిలియన్ డాలర్లతో 113 చదరపు మీటర్ల వరకు కొనుగోలు చేయవచ్చు. 2023లో కూడా ముంబై ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ విలువు 3 శాతం మేర పెరగనుంది. ఇక ఢిల్లీలో ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ 1.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2021లో 93వ ర్యాంక్తో ఉండగా 2022లో 77వ ర్యాంక్కు చేరుకుంది. ఇక్కడ ఒక మిలియన్ డాలర్లతో 226 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు. (ఇదీ చదవండి: సిమ్కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!) బెంగళూరు ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్ విలువ 3 శాతం పెరిగింది. 2021లో 91వ ర్యాంక్తో పోల్చితే 2022లో ఇండెక్స్లో 63వ స్థానానికి చేరింది. ఈ నగరంలో ఒక మిలియన్ డాలర్లతో 385 చదరపు మీటర్లను కొనుగోలు చేయవచ్చు. నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. ‘భారత రెసిడెన్షియల్ మార్కెట్లు గత అనేక త్రైమాసికాలుగా డిమాండ్లో వృద్ధిని కనబరుస్తూ విలువలు పెరిగాయి. దేశంలోని ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్ హై-ఎండ్ ప్రాపర్టీల అమ్మకాల ఊపును పెంచింది’ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఇతర మార్కెట్ల విలువలు క్షీణిస్తున్నప్పటికీ, టోక్యో తర్వాత ఏపీఏసీ మార్కెట్లలో 6.4 శాతం పెరుగుదలతో ముంబై రెండవ స్థానంలో ఉందన్నారు. (ఇదీ చదవండి: ట్విటర్కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) -
సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు చేశారనే అభియోగాలపై సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్లో నమోదైన కేసులో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అమీన్పూర్లో ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్ఫ్రా మోసాలు చేసిందని కేసు నమోదైంది. 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు రాగా, 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ. 900 కోట్లు సాహితీఇన్ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. -
షరపోవా, షుమాకర్లపై చీటింగ్, క్రిమినల్ కేసులు.. ఏం జరిగింది?
రష్యన్ టెన్నిస్ దిగ్గజం మరియా షరపోవాతో పాటు ఫార్ములావన్ మాజీ చాంపియన్ మైకెల్ షుమాకర్లపై గుర్గావ్ పోలీస్ స్టేషన్లో చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని చత్తార్పూర్ మినీఫామ్కు చెందిన షఫాలీ అగర్వాల్ అనే మహిళ ఫిర్యాదు మేరకు గుర్గావ్ పోలీసులు షరపోవా, షుమాకర్ సహా 11 మంది వ్యాపారులపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షఫాలీ అగర్వాల్ మాట్లాడుతూ.. రియల్టెక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమని మోసం చేసిందని తెలిపారు. సెక్టార్ 73లోని షరపోవా ప్రాజెక్ట్ పేరిట షుమాకర్ టవర్స అపార్టమెంట్లో ఒక ఫ్లాట్ కోసం కంపెనీ ప్రతినిధులు సుమారు రూ.80 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. 2016లో ఫ్లాట్ను అందిస్తామని నమ్మించి ఇంతవరకు మాకు అందించలేదని తెలిపారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగలేదని.. జాతీయ వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించగా.. వారిపై క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదు చేయమని కోర్టు వెల్లడించిందని పేర్కొన్నారు. కాగా 2016లో సదరు కంపెనీకి షరపోవా, షుమాకర్లు అంబాసిడర్గా వ్యవహరించడంతో పాటు భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు కంపెనీ ప్రతినిధులతో కలిసి షరపోవా, షుమాకర్లు డిన్నర్ పార్టీల్లో పాల్గొన్నట్లు తేలింది. ఫార్ములావన్లో మెర్సిడెస్కు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన మైకెల్ షుమాకర్ ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్గా నిలిచాడు. ప్రస్తుత చాంపియన్ లుయీస్ హామిల్టన్ కూడా ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్షిప్ను గెలిచాడు. ఇక షుమాకర్ రికార్డులు పరిశీలిస్తే.. 2012లో రిటైర్ అయ్యేవరకు 91 విజయాలు, 155 ఫోడియమ్స్, 1566 కెరీర్ పాయింట్లు, 68 పోల్ పోజిషన్స్, 77 ఫాస్టెస్ట్ లాప్స్ అందుకున్నాడు. ఇక మహిళల టెన్నిస్ విభాగంలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరచుకుంది. 2001లో అంతర్జాతీయ టెన్నిస్లో అరంగేట్రం చేసిన షరపోవా.. టెన్నిస్లో అందాల రాణిగా నిలిచింది. 2001-2020 మధ్య ఐదుసార్లు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గడంతో పాటు 18 ఏళ్ల వయసులోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2005లో 21 వారాలపాటు షరపోవా మహిళల టెన్నిస్ నెంబర్వన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఇక కెరీర్ గ్రాండ్స్లామ్(యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్) అందుకున్న క్రీడాకారిణిగా షరపోవా చరిత్ర సృష్టించింది. చదవండి: PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు -
రియల్ ఎస్టేట్ రంగంలో తగ్గనున్న పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2021లో 20 శాతం మేర తగ్గొచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. 2020లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రియల్ ఎస్టేట్ రంగంలో ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 298 కోట్ల డాలర్లుగా (రూ.22,350కోట్లు) ఉన్నాయి. 2020 ఇదే కాలంలో పెట్టుబడులు 153 కోట్ల డాలర్లతో (రూ11,475) పోలిస్తే సుమారు రెట్టింపయ్యాయి. కానీ, 2020 చివరి మూడు నెలల్లో భారీ ఒప్పందాలు (3.2 బిలియన్ డాలర్ల మేర) నమోదయ్యాయి. దీంతో 2020 మొత్తం మీద ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లకు దూసుకుపోయాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండకపోవచ్చన్నది జేఎల్ఎల్ అంచనా. భారీ పెట్టుబడుల ఒప్పందాలు చోటు చేసుకుంటే మినహా.. 2021 మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 3.8–4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది ఆశాజనకమే 2022పై ఆశావహ అంచనాలనే జేఎల్ఎల్ ఇండియా వ్యక్తం చేసింది. 5 బిలియన్ డాలర్ల మార్క్ను (రూ.37,500 కోట్లు) అధిగమించొచ్చని పేర్కొంది. 2017–2020 మధ్య పరిశ్రమలోకి ఇదే స్థాయిలో పెట్టుబడులు వార్షికంగా రావడం గమనార్హం. ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలను ఇనిస్టిట్యూషన్స్గా పేర్కొంటారు. ఫ్యామిలీ ఆఫీసులు అంటే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నుల వ్యక్తిగత పెట్టుబడుల వేదికలు. -
అనుమతుల ఆలస్యంతోనే ప్రీలాంచ్ విక్రయాలు!
నెల తర్వాత చేసే ప్రయాణం కోసం ముందుగానే విమాన టికెట్లు బుకింగ్ చేసుకుంటాం. అభిమాన హీరో సినిమా వస్తుందంటే వారం ముందే ఆన్లైన్లో టికెట్లు కొనేస్తాం. ఎందుకు? తీరా టైంకి టికెట్లు దొరకవనో లేక దొరికినా ఎక్కువ రేట్లు ఉంటాయనో కదా. పైగా ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటే ధర కూడా కలిసొస్తుంది. మరి, ముందస్తు బుకింగ్స్ రియల్ ఎస్టేట్లో చేస్తే తప్పేంటి? సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్, సాఫ్ట్లాంచ్.. పేర్లు ఏవైనా వాటి అర్థం మాత్రం ఒక్కటే. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విక్రయాలను మొదలుపెట్టడం అని! ఈ తరహా విక్రయాలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. ప్రీలాంచ్తో కొనుగోలుదారులకు, డెవలపర్లకు ఇద్దరికీ లాభమే. కస్టమర్లకేమో ఫ్లాట్ తక్కువ ధరకు దొరికితే.. బిల్డర్లకేమో ముందుగానే కొంత సొమ్ము చేతికి అందుతుంది. ఈ సొమ్ము తక్షణమే నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో లేక అనుమతుల ఫీజుల కోసమో ఉపయోగపడుతుంది. ప్రీలాంచ్లో డెవలపర్లు 10–15 శాతం వరకు ఫ్లాట్లను విక్రయిస్తుంటారు. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్ట్ తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు అమ్మకాలను ప్రకటిస్తుంటారు. ప్రీలాంచ్లో విక్రయాలు ఎందుకంటే.. ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు ల్యాండ్ ఓనర్తో అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి అనుమతులు వచ్చే వరకు ఏడాదిన్నర కాలం పాటు డెవలపర్ వేచి చూడాలి. ఈలోపు ప్రాజెక్ట్ రుణానికి బ్యాంక్ వడ్డీ డెవలపర్ భరించాల్సిందే. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఇవన్నీ డెవలపర్లకు భారమే. పోనీ, అనుమతుల వరకూ వేచి ఉంటే మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు డిమాండ్ అవకాశాలు కోల్పోతామనే పోటీతో డెవలపర్లు ప్రీలాంచ్ విక్రయాలను చేస్తున్నారని ఓ డెవలపర్ తెలిపారు. స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను నిర్ధారించుకున్నాకే కొనుగోలుదారులు ప్రీలాంచ్లో కొనుగోలుకు సిద్ధం కావాలి. నచ్చిన ప్రాంతం, తక్కువ ధర, పేరున్న బిల్డర్ అయితే కొనుగోలులో సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్మాణం పూర్తి కావడానికి 3–5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే ముందస్తుగానే కొనుగోలు చేస్తే చక్కటి లాభాల్ని అందుకోవచ్చు. అనుమతుల్లో జాప్యం ఎందుకంటే? టీఎస్–బీపాస్లో నిర్మాణ అనుమతులు వారం లోపే వస్తున్నాయనేది అధికారులు, లీడర్ల మాట. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్, ఫైర్, పోలీస్, ఎయిర్పోర్ట్ అథారిటీ.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటి కోసం ఏడాదిన్నర పైనే సమయం పడుతుందని ఓ డెవలపర్ తెలిపారు. హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్ లేకపోవటం, ఉన్న అధికారులు ఆఫీసులలో అందుబాటులో ఉండకపోవటం అనుమతుల ఆలస్యానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఏం చేయాలంటే? హైదరాబాద్లో ప్రీలాంచ్లో కొనుగోలు చేసి మోసపోయామనే కస్టమర్లు చాలా తక్కువ. ఏ డెవలపర్ ప్రీలాంచ్లో విక్రయిం చేసి చేతులుదులుపుకోడు. చాలా వరకు డెవలపర్ల మీద కొనుగోలుదారులు చేసే ప్రధానమైన ఫిర్యాదులు.. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదనే. జీహెచ్ఎంసీతో పోల్చితే హెచ్ఎండీఏ పరిధిలో ప్రీలాంచ్ విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో అధికారుల కొరత లేదు. దీంతో ఫీజు కట్టాక నెలన్నర లోపే ప్లానింగ్ అనుమతులు వస్తున్నాయి. అదే హెచ్ఎండీఏ పరిధిలో అయితే ఏడాదిన్నర అయినా గ్యారంటీ లేదు. ► హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్ను, రెరాకు శాశ్వత చైర్మన్ను నియమించాలి. మున్సిపల్ శాఖ టౌన్ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
మై హోమ్ టర్నోవర్ రూ.6 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్స్ట్రక్షన్, సిమెంట్, ఎంటర్టైన్మెంట్, ఫార్మా రంగాలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన మై హోమ్ గ్రూప్.. మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల టర్నోవర్ను సాధించింది. ఇందులో రూ.3 వేల కోట్లు కన్స్ట్రక్షన్స్, రూ.2,500 కోట్ల సిమెంట్.. మిగిలినవి ఎంటర్టైన్మెంట్, ఫార్మా విభాగాల వాటా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధిని సాధిస్తామని పేర్కొంది. మై హోమ్ కంపెనీ ప్రారంభమై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారమిక్కడ మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మై హోమ్ ఎండీ జూపల్లి శ్యామ్ రావు మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి 3.5 కోట్ల చదరపు అడుగులలో 25 ప్రాజెక్ట్లను డెలివరీ చేసిన ఘనతను సాధించనున్నామని.. ఇందులో ఇప్పటికే 2.7 కోట్ల చ.అ.లను డెలివరీ చేసేశామని.. మరొక 80 లక్షల చ.అ. నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. అనంతరం మైహోమ్ హోల్టైం డైరెక్టర్ జూపల్లి రాము రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం కోకాపేటలో 2.7 కోట్ల చ.అ.లలో ఆసియాలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్, సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్లతో పాటు బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం) 6డీ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనున్నామని చెప్పారు. అలాగే తెల్లాపూర్లో అంకుర పేరిట తొలి విల్లా ప్రాజెక్ట్ను, ఇదే ప్రాంతంలో త్రిదాస ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లను కూడా నిర్మిస్తున్నామన్నారు. ఆయా ప్రాజెక్ట్లలో ప్రాజెక్ట్ విజిటింగ్ నుంచి ఫ్లాట్ బుకింగ్, లావాదేవీలు చెల్లింపులు అన్నింటినీ ఆన్లైన్లోనే చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోల్ టైం డైరెక్టర్ జూపల్లి వినోద్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ జూపల్లి రజితా రావు, సీఎఫ్ఓ ఏ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. -
సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే!
సాక్షి, హైదరాబాద్: 90వ దశాబ్ధం వరకు సొంతిల్లు కొనాలంటే పొదుపు చేసిన సొమ్ముతోనే లేక పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. 45–55 ఏళ్ల వయసు గల వాళ్లే గృహ కొనుగోలుదారులుగా ఉండేవాళ్లు. బ్యాంక్ రుణాలపై అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. 20వ దశాబ్ధం నుంచి గృహ కొనుగోలుదారుల వయసు 35–45 ఏళ్లకు తగ్గిపోయింది. గృహ రుణాలు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. యువ ఉద్యోగులు కూడా దాచుకున్న డబ్బుతో కాకుండా రుణంతో కొనాలని భావిస్తున్నారు. బ్యాంక్లు కూడా తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్నాయి. చదవండి: బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ కొత్త ఎడిషన్ కార్లు : వారికి మాత్రమే బంగారం కొనే వారికి గుడ్న్యూస్ -
పెద్ద సైజ్ అపార్ట్మెంట్లు హైదరాబాద్లోనే..
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రియల్టీ పెట్టుబడులు క్షీణిస్తుంటే.. ఫ్లాట్ల విస్తీర్ణాలు మాత్రం పెరిగాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్ సగటు పరిమాణం 10 శాతం వృద్ధి చెంది 1,150 చదరపు అడుగులు (చ.అ.)లకు చేరింది. విస్తీర్ణం ఎక్కువ ఉన్న ఫ్లాట్లకు డిమాండ్ పెరగడమే వృద్ధికి కారణామని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 2019లో దేశంలో సగటు ఫ్లాట్ల విస్తీర్ణం 1,050 చ.అ.లుగా ఉంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్లోనే అపార్ట్మెంట్ల సైజ్లు బాగా వృద్ధి చెందాయి. 2019లో నగరంలో సగటు ఫ్లాట్ల విస్తీర్ణం 1,700 చదరపు అడుగులుగా ఉండగా.. గతేడాది 3 శాతం పెరిగి 1,750 చదరపు అడుగులకు పెరిగిందని అనరాక్ తెలిపింది. 2016 నుంచి ప్రతి సంవత్సరం సగటు గృహ విస్తీర్ణం తగ్గుతూ వస్తుంటే.. గతేడాది మాత్రం పెరిగింది. ఆదాయ స్థోమత, నిర్వహణ చార్జీల తగ్గింపు కోసం గతంలో గృహ కొనుగోలుదారులు చిన్న సైజ్ అపార్ట్మెంట్లను ఇష్టపడేవాళ్లు. అందుకు తగ్గట్టుగానే తక్కువ ధరలతో మిలీనియల్స్ను ఆకర్షించేందుకు డెవలపర్లు కూడా చిన్న సైజ్ గృహాలనే నిర్మించేవాళ్లు. కానీ, 2020లో కోవిడ్–19 నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ ప్రారంభం కావటంతో కొనుగోలుదారుల గృహ ప్రాధాన్యతలో మార్పులు వచ్చాయని అనరాక్ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. అందుకే గత నాలుగేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా 2020లో అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: పెరిగిన హౌసింగ్ సేల్స్.. కారణాలు ఇవే! -
ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా
ముంబై, సాక్షి: రెసిడెన్షియల్ విభాగంలో ఈ కేలండర్ ఏడాది(2020) ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా నమోదైంది. జులై-డిసెంబర్ మధ్య కాలంలో దేశీయంగా రూ. 50 లక్షల విలువకు పైబడిన ఇళ్ల అమ్మకాల వాటా 57 శాతాన్ని తాకింది. ఇదే సమయంలో అందుబాటు ధరల గృహ విక్రయాలు 43 శాతానికి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ప్రభావం చూపినట్లు రియల్టీ రంగ విశ్లేషణ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలియజేసింది. (రియల్టీ రంగానికి స్టీల్ షాక్) హైఎండ్లో ఈ ఏడాది విలాసవంత విభాగంలో గృహాల కొనుగోలుకి వినియోగదారులు అధిక ఆసక్తిని చూపినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. మార్కెట్లో ప్రవేశించేందుకు 2020 అనుకూలమని అత్యధికులు భావించినట్లు తెలియజేసింది. దీనికితోడు ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్న వర్గాలకు హౌసింగ్ రుణాల అందుబాటు తదితర అంశాలు జత కలసినట్లు వివరించింది. దీర్ఘకాలిక రుణ చెల్లింపుల సామర్థ్యం కలిగిన వ్యక్తులు గృహ కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు అభిప్రాయపడింది. (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) హైదరాబాద్ టాప్ రెసిడెన్షియల్ విభాగంలో అధిక పరిమాణంలో అమ్మకాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో రియల్టీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఈ విషయంలో త్రైమాసిక ప్రాతిపదికన ముంబై, పుణే 121 శాతం పురోగతిని చూపినట్లు పేర్కొంది. అయితే కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టడంలో హైదరాబాద్ 480 శాతం వృద్ధితో తొలి ర్యాంకులో నిలిచినట్లు పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో మొత్తం 1,46,228 యూనిట్ల ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు తెలియజేసింది. అయితే ఇవి అంతక్రితం ఏడాదితో పోలిస్తే 34 శాతం తక్కువేనని తెలియజేసింది. -
బ్లాక్ మండే- 812 పాయింట్లు డౌన్
ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. వెరసి గత ఆరు నెలల్లోలేని విధంగా మార్కెట్లు బోర్లా పడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,000 స్థాయిని సైతం కోల్పోయింది. చివరికి 812 పాయింట్లు పడిపోయి 38,034 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 255 పాయింట్లు పతనమై 11,250 వద్ద నిలిచింది. తొలుత అటూఇటుగా మొదలైన మార్కెట్లలో మిడ్సెషన్ నుంచీ ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా 38,991 పాయింట్ల గరిష్టం నుంచి సెన్సెక్స్ ఒక దశలో 37,946 వరకూ జారింది. ఇక నిఫ్టీ 11,535- 11,219 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. వెరసి ఇంట్రాడే కనిష్టాల సమీపంలోనే మార్కెట్లు స్థిరపడటం గమనార్హం! వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో కేంద్రానికి ఎదురవుతున్న సవాళ్లు, చైనాతో సరిహద్దు వివాదాలు, యూరోపియన్ దేశాలలో మళ్లీ తలెత్తుతున్న కోవిడ్-19 కేసులు తదితర ప్రతికూలతలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు పలు గ్లోబల్ బ్యాంకులలో అవకతవకలు జరిగాయంటూ వెలువడిన ఆరోపణలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు తెలియజేశారు. బేర్.. బేర్ ఎన్ఎస్ఈలో ఐటీ 0.7 శాతం నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ 6-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్ మాత్రమే అదికూడా 0.8-0.25 శాతం మధ్య బలపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇతర బ్లూచిప్స్లో ఇండస్ఇండ్, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎయిర్టెల్, ఇన్ఫ్రాటెల్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, సిప్లా, మారుతీ, యాక్సిస్, గెయిల్, నెస్లే, జీ, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, బ్రిటానియా, ఐవోసీ, ఎస్బీఐ, టైటన్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 8.6-3.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నేలచూపులోనే డెరివేటివ్ విభాగంలో ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, బీఈఎల్, పీవీఆర్, బంధన్ బ్యాంక్, ఐడియా, టాటా కన్జూమర్, సెయిల్, ఆర్బీఎల్ బ్యాంక్, పిరమల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, అశోక్ లేలాండ్, గ్లెన్మార్క్, పీఎన్బీ, బాలకృష్ష, బయోకాన్ 13-6.5 శాతం మధ్య కుప్పకూలాయి. నిఫ్టీ దిగ్గజాలను మినహాయిస్తే.. లాభపడ్డ కౌంటర్లు లేకపోవడం గమనార్హం! బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 3.7 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 2,165 నష్టపోగా.. కేవలం 594 లాభాలతో ముగిశాయి. స్వల్ప కొనుగోళ్లు.. నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 205 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 250 కోట్లు, డీఐఐలు రూ. 1,068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రియల్టీ షేర్లకు మరాఠీ జోష్
కోవిడ్-19 కారణంగా ఎదురవుతున్న సవాళ్లనుంచి రియల్టీ రంగానికి ఉపశమనాన్ని కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంప్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. గృహ వినియోగదారులకు మద్దతుగా స్టాంప్ డ్యూటీ తగ్గింపు నిర్ణయాన్ని ఈ ఏడాది డిసెంబర్వరకూ అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా 2021 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ 3 శాతం స్టాంప్ డ్యూటీని మాత్రమే విధించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో స్టాంప్ డ్యూటీ 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గనుంది. 2021 జనవరి- మార్చి మధ్య కాలంలో 2 శాతంగా అమలుకానుంది. కరోనా వైరస్ విస్తృతితో ఇటీవల డీలాపడ్డ రియల్టీకి మద్దతుగా స్టాంప్ డ్యూటీని తగ్గించమంటూ కొంతకాలంగా రియల్టీ కంపెనీలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లు నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వార్తలతో ఒక్కసారిగా రియల్టీ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో రియల్టీ రంగం 3.3 శాతం ఎగసింది. ప్రస్తుతం పలు కౌంటర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ర్యాలీ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సన్టెక్ రియల్టీ 8.5 శాతం దూసుకెళ్లి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఒబెరాయ్ రియల్టీ 6.3 శాతం జంప్చేసి రూ. 390ను తాకగా.. ఇండియాబుల్స్ రియల్టీ 4.7 శాతం ఎగసి రూ. 73కు చేరింది. ఇతర కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్ 4.5 శాతం పెరిగి రూ. 889 వద్ద, శోభా లిమిటెడ్ 2.25 శాతం బలపడి రూ. 261 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదేవిధంగా ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 2 శాతం పుంజుకుని రూ. 245 వద్ద, బ్రిగేడ్ 2 శాతం లాభంతో రూ. 175 వద్ద కదులుతున్నాయి. ఇక ఒమాక్స్ 1.2 శాతం పెరిగి రూ. 75ను అధిగమించగా.. ఫీనిక్స్ 0.7 శాతం బలపడి రూ. 655 వద్ద, డీఎల్ఎఫ్ 0.7 శాతం లాభపడి రూ. 161 వద్ద ట్రేడవుతున్నాయి. -
4వ రోజూ- రియల్టీ, బ్యాంకింగ్ జోరు
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్ 220 పాయింట్లు జంప్చేసి 39,294కు చేరింది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 11,613 వద్ద ట్రేడవుతోంది. వరుసగా నాలుగో రోజు బుధవారం యూఎస్ ఇండెక్సులు ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. రియల్టీ దూకుడు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ 3.3 శాతం జంప్చేయగా.. మీడియా, బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఫార్మా 1.8-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, జీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, యాక్సిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, సిప్లా, బీపీసీఎల్, ఐటీసీ 3-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరో మోటో, బజాజ్ ఆటో, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, శ్రీ సిమెంట్ 1-0.4 శాతం మధ్య నీరసించాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్లస్ ఎఫ్అండ్వో కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, అపోలో టైర్, బంధన్ బ్యాంక్, ఈక్విటాస్, నాల్కో, సెంచురీ టెక్స్, అశోక్ లేలాండ్, మ్యాక్స్ ఫైనాన్స్, జీఎంఆర్ 4.5-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క టీవీఎస్ మోటార్, పెట్రోనెట్, ఎంజీఎల్, కమిన్స్, టాటా కెమ్, ఐజీఎల్, సెయిల్, చోళమండలం 1.6-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1194 లాభపడగా.. 688 నష్టాలతో కదులుతున్నాయి. -
ఓరియంట్ బెల్- ఫీనిక్స్ మిల్స్.. జూమ్
ప్రసిద్ధ ఇన్వెస్టర్ పొరింజు వెలియత్.. ఈక్విటీ వాటా కొనుగోలు చేసిన వార్తలతో సిరామిక్ టైల్స్ తయారీ కంపెనీ ఓరియంట్ బెల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు సింగపూర్ ప్రభుత్వం మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడికావడంతో రియల్టీ సంస్థ ఫీనిక్స్ మిల్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఓరియంట్ బెల్ లిమిటెడ్ కంపెనీలో పొరింజు వెలియత్కు చెందిన ఈక్విటీ ఇంటెలిజెన్స్ తాజాగా వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఓరియంట్ బెల్ కౌంటర్ జోరందుకుంది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 105ను తాకింది. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 99 వద్ద ట్రేడవుతోంది. షేరుకి రూ. 91.87 ధరలో ఈక్విటీ ఇంటెలిజెన్స్ 80,000 ఓరియంట్ బెల్ షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పటికే అంటే.. జూన్కల్లా ఓరియంట్ బెల్లో 1.57 శాతం వాటాను ఈక్విటీ ఇంటెలిజెన్స్ కలిగి ఉంది. ఫీనిక్స్ మిల్స్ లిమిటెడ్ క్విప్ ద్వారా రియల్టీ అభివృద్ధి సంస్థ ఫీనిక్స్ మిల్స్లో సింగపూర్ ప్రభుత్వం 74.38 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. దీంతో ఫీనిక్స్ మిల్స్లో సింగపూర్ ప్రభుత్వ వాటా 4.3 శాతానికి చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ ఎంఎఫ్కు 12.39 లక్షల షేర్లు, ఎస్బీఐ ఎంఎఫ్కు 12.39 లక్షల షేర్లు, ఏబీ సన్ లైఫ్ ఎంఎఫ్కు 5.17 లక్షల షేర్లు చొప్పున ఫీనిక్స్ విక్రయించింది. దీంతో మ్యూచువల్ ఫండ్స్ వాటా తాజాగా 12.61 శాతాన్ని తాకింది. క్విప్లో భాగంగా షేరుకి రూ. 605 ధరలో ఫీనిక్స్ 1.81 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించింది. క్విప్ తదుపరి ఫీనిక్స్ ఈక్విటీ క్యాపిటల్ రూ. 34.32 కోట్లకు ఎగసింది. ఈ నేపథ్యంలో ఫీనిక్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 6.3 శాతం జంప్చేసి రూ. 738ను తాకింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 713 వద్ద ట్రేడవుతోంది. -
పాతాళానికి రియల్టీ సెంటిమెంట్
న్యూఢిల్లీ: కోవిడ్–19 నేపథ్యంలో దేశంలో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆల్టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే వచ్చే ఆరు నెలలూ నిరాశావాద ధోరణే కనిపిస్తోందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్, ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థలు ఫిక్కీ, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెండ్ మండలి (ఎన్ఏఆర్ఈడీసీఓ) నిర్వహించిన 25వ జాతీయ స్థాయి సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేకు సంబంధించిన సూచీ జనవరి–మార్చి మధ్య 31 వద్ద ఉంటే, ఏప్రిల్–జూన్ మధ్య 22కు పడిపోయింది. ఇది ఆల్టైమ్ కనిష్టస్థాయి. ఈ మేరకు వెలువడిన ప్రకటనకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... నిరాశావాద ధోరణి కనిపిస్తున్నప్పటికీ, భవిష్యత్ సెంటిమెంట్ ఇండెక్స్ సమీక్షా కాలంలో 36 నుంచి 41కి పెరిగింది. లాక్డౌన్ మరింత సడలించే అవకాశాలు, పండుగల సీజన్, ఆర్థిక క్రియాశీలత మెరుగుపడే అవకాశాలు ఇందుకు ప్రధాన కారణాలు. జూలై తొలి 2 వారాల్లో జరిపిన సర్వేలో డెవలపర్లు, పీఈ ఫండ్స్, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. డిమాండ్ పెంపు చర్యలు అవసరం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పలు ఉద్దీపన చర్యలు ప్రకటించాయి. అయితే ఆర్థిక వ్యవస్థలో దీని ఫలితాలు కనిపించాలి. ఆర్థిక వ్యవస్థలో సెంటిమెంట్ మెరుగుపడ్డానికి తదుపరి డిమాండ్ పెంపు చర్యలు అవసరం. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగా న్ని చూస్తే, గృహ కొనుగోళ్లకు అదనపు పన్ను ప్రయోజనాలు కల్పించాలి. రుణ లభ్యతనూ పెంచాలి. క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి ఈ రంగాన్ని గట్టెక్కించడానికి డెవలపర్ రుణాల రీస్ట్రక్చరింగ్ జరగాలి. – శిశిర్ బైజాల్, సీఎండీ, నైట్ ఫ్రాంక్ ఇండియా పన్నులు తగ్గించాలి... నిజానికి కోవిడ్–19 మహమ్మారికి ముందే ఆర్థిక వ్యవస్థ బలహీనమై ఇది రియల్టీమీద ప్రభావం చూపింది. కోవిడ్–19 నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో పరిస్థితి మరింత తీవ్రమైంది. క్రియాశీలత పూర్తిగా పడిపోయింది. కనీసం ఒక నిర్దిష్ట కాల వ్యవధిలోనైనా పన్నులు, లెవీలు, స్టాంప్ డ్యూటీలు, జీఎస్టీ తగ్గింపు అవసరం. తద్వారా వ్యవస్థలో డిమాండ్ పెంపునకు దోహదపడవచ్చు. అలాగే రుణ పునర్వ్యవస్థీకరణ దిశగానూ చర్యలు అవసరం. నిరంజన్ హిరనందని, ప్రెసిడెంట్, ఎన్ఏఆర్ఈడీసీఓ -
ఈ రియల్టీ షేరు ఎందుకిలా పడుతోంది?
కొద్ది రోజులుగా భారీ అమ్మకాలను చవిచూస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఒమాక్సీ లిమిటెడ్ షేరు మరోసారి కుప్పకూలింది.కొనేవాళ్లు కరువుకాగా.. అమ్మకందారులు అధికంకావడంతో ఈ షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్ను తాకింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం రూ. 76 దిగువన ఫ్రీజయ్యింది. వెరసి వరుసగా 12వ ట్రేడింగ్ సెషన్లోనూ నేలచూపులకే పరిమితమై కదులుతోంది. జూన్ 26న నమోదైన రూ. 221 స్థాయి నుంచి నిరంతర పతనం కారణంగా ఈ షేరు 66 శాతం విలువను కోల్పోయింది. తద్వారా తాజాగా 11 ఏళ్ల కనిష్టానికి చేరింది. ఇంతక్రితం 2019 జులై 14న మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యింది. కంపెనీ వివరణ కంపెనీ కౌంటర్లో నమోదవుతున్న యాక్టివిటీ పూర్తిగా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా జరుగుతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒమాక్సీ ఈ నెల మొదట్లోనే తెలియజేసింది. కంపపెనీ ప్రాజెక్టులు యథాతథంగా కొనసాగుతన్నాయని, డిమాండ్, సరఫరా అంశాల ఆధారంగానే ట్రేడింగ్లో ఆటుపోట్లు నమోదవుతున్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలను కోవిడ్-19 నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా మాత్రమే వాయిదా వేసినట్లు తెలియజేసింది. ఏం జరిగింది? తనఖాలో ఉంచిన 1.6 లక్షల షేర్లను వారాంతాన(10న) రుణదాత సంస్థ వీనస్ ఇండియా అసెట్ ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సొంతం చేసుకున్నట్లు ఒమాక్సీ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. కంపెనీలో మొత్తం 74.15 శాతం వాటాకు సమానమైన 135.63 మిలియన్ షేర్లను కలిగిన ప్రమోటర్లు మార్చికల్లా 52.32 శాతం వాటాకు సమానమైన 70.97 మిలియన్ ఈక్విటీ షేర్లను తనఖాలో ఉంచినట్లు డేటా వెల్లడించింది. రేటింగ్ దిగ్గజం క్రిసిల్ ఏప్రిల్ 3న ఒమాక్సీ దీర్ఘకాలిక బ్యాంకింగ్ సౌకర్యాలను డౌన్గ్రేడ్ చేసింది. ఇందుకు భారీ రుణ భారంతోపాటు, కంపెనీ మాజీ ఎండీ సునీల్ గోయల్.. మరో డైరెక్టర్ రోహ్తాస్ గోయల్పై చేసిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ పేర్కొంది. తదుపరి జూన్ 29న వెల్లడించవలసిన గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాల విడుదలను కంపెనీ జులై 29కు వాయిదా వేసింది. ఈ ప్రతికూలతల కారణంగా ఒమాక్సీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
పుర పోరులో ‘రియల్ ఎస్టేట్’ దూకుడు!
సాక్షి, యాదాద్రి : డబ్బుంది.. పలుకుబడి ఉంది.. కావాల్సిందల్లా అధికారమే..! అందుకోసమే ఎంతఖర్చయినా సిద్ధమే.!! మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు దూకుడు పెంచారు. ఎలాగైనా పార్టీ టికెట్ దక్కించుకొని చైర్మన్గిరి పట్టాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో హెచ్ఎండీఏ పరిధిలో భువనగిరి, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, వైటీడీఏ పరిధిలో యాదగిరిగుట్ట, భువనగిరి, జాతీయ రహదారి వెంట ఆలేరు మున్సిపాలిటీ ఉంది. ఆయా మున్సిపాలిటీల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అనుకూలంగా రిజర్వేషన్ రాని వారు పక్క వార్డుల నుంచి నామినేషన్ వేశారు. అంతేకాకుండా చైర్మన్ గిరిపై కన్నేసి ఇతర వార్డుల్లోనూ తమ అనుకూల వ్యక్తులను పోటీలో దింపేందుకు వారితో నామినేషన్లు వేయించారు. ఖర్చు కూడా వారే భరించనున్నారు. డబ్బుల సంచులతో సిద్ధం వివిధ పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టికెట్ కోసం చూస్తున్నారు. తమకు పార్టీ టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నవారు చైర్మన్ గిరిపై కన్నేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ బీసీ జనరల్, యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి బీసీ మహిళ, మోత్కూర్ జనరల్ మహిళకు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే. అయితే రియల్టర్లు పెద్ద సంఖ్యలో పోటీలోకి దిగుతున్నారు. నామినేషన్ వేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎక్కువ మంది రియల్టర్లు రంగంలోకి దిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగడంతో జిల్లాలో పలువురు కోట్ల రూపాయలు గడించారు. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని రూ.2కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఈవిషయాన్ని పార్టీ అధిష్టానం వద్ద చెబుతూ చైర్మన్గిరి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పోటీ తీవ్రం కావడంతో అధికార పార్టీలో చైర్మన్ అభ్యర్థుల పేరు ముందుగా ప్రకటించడం లేదు. గెలిచిన తర్వాత చైర్మన్ పేరు ప్రకటిస్తామని చెప్పడంతో ఎవరికి వారు రేసులో దూసుకుపోతున్నారు. బీసీలకు చైర్మన్ సీటు రిజర్వ్ కావడంతో పోటీదారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్లో ఖర్చుకు వెనుకాడకుండా ఆశావహులు ముందుకుసాగుతున్నారు. కౌన్సిలర్ స్థానాలకు సైతం.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలవడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడేది లేదంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగారు. భువనగిరి మున్సి పాలిటీలో అధికార పార్టీ మెజార్టీ సీట్లను కొత్తవారికి కేటాయించడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీలో సైతం డబ్బు సంచులతో వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు చే యడానికి వెనుకాడేది లేదని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు మొండిచేయి చూపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బు లేదన్న కారణంతో చైర్మన్ అభ్యర్థులతో పాటు కౌన్సిలర్లుగా పోటీపడే వారికి కూడా టికెట్లు దక్కడం లేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. అందని బీఫారాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులకు ఇంకా ఖరారు చేయలేదు. అధికార పార్టీలో పెద్ద ఎత్తున రెబెల్స్ బెడద ఉండడంతో బీఫారాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. మోత్కూరులో టీఆర్ఎస్ పూర్తి జాబితా ప్రకటించగా.. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల్లో కొందరికి బీఫారాలు ఇచ్చింది. మిగతా వారికి ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. ఎక్కువ మంది పోటీ ఉండటం వల్లే బీ ఫారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అభ్యర్థులు నామినేషన్లు వేసి బీఫారాల కోసం నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు. ప్రధానంగా డబ్బు ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమేనంటూ టికెట్లు ఆశించే అభ్యర్థులు అధిష్టానాన్ని కోరుతున్నారు. కొందరు పార్టీ పేరుతో నామినేషన్లు వేసినప్పటికీ టికెట్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆయా వార్డుల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్న ఆశావహులకు అవకాశం కల్పించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. డబ్బు ప్రభావం అన్ని పార్టీల్లో స్పష్టంగా కనిపించడం వెనక రియల్టర్లు పెద్ద ఎత్తున పోటీకి దిగడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ టికెట్ రాకున్న పోటీ నుంచి తప్పుకునేది లేదని, పోటీలో ప్రధాన అభ్యర్థులకు ధీటుగా ఖర్చు చేసి విజయం సాధిస్తామని పలువురు రాజకీయ రియల్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగాలని బావిస్తున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో వరదలా డబ్బు ఖర్చు చేయడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: రియల్ ఎస్టేట్ వ్యాపారిని హతమార్చిన భార్య, కుమారులు -
అంతా ఆ బ్యాంకే చేసింది..!
లేహ్: ఆల్టికో క్యాపిటల్లో సంక్షోభానికి ఓ ప్రైవేటు బ్యాంకు స్వార్ధపూరిత వైఖరే కారణమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలు సమకూర్చే బ్యాంకింగేతర ఆరి్థక సంస్థ ఆల్టికో క్యాపిటల్ దేశీయ బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్కు తాజా ఎన్పీఏగా మారే ప్రమాదం వచ్చి పడింది. దీనికి కారణం సదరు సంస్థ గత వారం ఈసీబీ రుణంపై రూ.20 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఓ ప్రైవేటు బ్యాంకు తన రుణాలను కాపాడుకునేందుకు ఆల్టికో ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ (ఫిక్స్డ్ డిపాజిట్)ని సర్దుబాటు చేసుకుంది. దీన్ని ఏక్షపక్ష నిర్ణయంగా రజనీష్ కుమార్ పేర్కొన్నారు. తన సొంత డబ్బులను కాపాడుకునేందుకు అనుసరించిన ఈ చర్య విస్తృతమైన ఆరి్థక వ్యవస్థకు సమస్యలు తెచి్చపెడుతుందన్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు మొత్తంగా రూ.4,500 కోట్ల మేర ఆల్టికో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే, వడ్డీ చెల్లింపుల్లో విఫలం కావడం గత వారమే మొదటి సారి చోటు చేసుకుంది. లేహ్ వచి్చన సందర్భంగా దీనిపై రజనీష్ కుమార్ మీడియా సమక్షంలో స్పందించారు. ‘‘ఏదైనా బ్యాంకు స్వార్ధపూరిత వైఖరి తీసుకుంటే మిగిలిన వ్యవస్థపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రూ.50–100 కోట్ల ఎక్స్పోజర్ను మీరు తీసేసుకుని మీ డబ్బులను కాపాడుకున్నామని సంతోషపడొచ్చు. కానీ, మీరు వ్యవస్థను పాడు చేస్తే అది సరైన విధానం కాదు. పెద్ద కంపెనీల విషయంలోనూ ఓ బ్యాంకు ట్రిగ్గర్ నొక్కితే లేదా రుణాల సరఫరాను నిలిపివేస్తే ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. సమష్టిగా వ్యవహరించాలి... బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా మొత్తం ఆరి్థక వ్యవస్థను కాపాడవచ్చన్నారు రజనీష్ కుమార్. అతిపెద్ద ఎన్పీఏ కేసుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆల్టికో క్యాపిటల్ యూఏఈకి చెందిన మాష్రెక్ బ్యాంకుకు రూ.660 కోట్లు, ఎస్బీఐకి రూ.400 కోట్లు, యూటీఐ మ్యూచువల్ ఫండ్కు రూ.200 కోట్లు, రిలయన్స్ నిప్పన్ ఏఎంసీకి రూ.150 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉందని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. గత వారం మాష్రెక్ బ్యాంకుకు రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమవడమే సంక్షోభానికి కారణం. ఈ నెల 3న ఆల్టికో రేటింగ్ను ఇండియా రేటింగ్స్, కేర్ రేటింగ్స్ జంక్ కేటగిరీకి డౌన్గ్రేడ్ చేశాయి. క్లియర్వాటర్ క్యాపిటల్ పార్ట్నర్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్, వర్దే పార్ట్నర్స్ ఈ సంస్థకు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
రియల్ జోరు
సాక్షి, జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గంలో ‘రియల్’ జోరు కొనసాగుతోంది. పట్టణం నుంచి పల్లెటూళ్ల వరకు ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. పచ్చని పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. నియోజకవర్గానికి నిమ్జ్ రాబోతుండడంతో భూముల రేట్లకుఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయని, అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జహీరాబాద్ పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తుంది. పట్టణానికి హైదరాబాద్ వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. మహీంద్ర అండ్ మహీంద్రతో పాటు చక్కెర కర్మాగారం, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో (జాతీయ పరిశ్రమల ఉత్పాదక మండలి) నిమ్జ్ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఇప్పటికే నిమ్జ్ కోసం 3 వేల ఎకరాల భూమిని సేకరించింది. మరో 9 వేల ఎకరాలు సేకరించనుంది. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. రెండు మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎకరా రూ. 5లక్షల నుంచి రూ.8 లక్షలు పలకగా ప్రస్తుతం రూ.10లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ.కోటికి పైనే పలుకుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల వ్యాపారులు అధిక ధర చెల్లించి ఇక్కడ భూములను కొంటున్నారు. రియల్ వ్యాపారంపై ఆసక్తి వ్యాపారులు జహీరాబాద్ ప్రాంతంలో వెంచర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రహదారి, బైపాస్ రోడ్డులోని భూముల్లో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నారు. జహీరాబాద్ పట్టణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నాయి. చిన్నహైదరాబాద్, హోతి(కె), కాసీంపూర్, పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, దిడ్గి తదితర గ్రామాల పరిధిలో జహీరాబాద్– హైదరాబాద్, జహీరాబాద్–బీదర్, జహీరాబాద్ బైపాస్, అల్లానా రోడ్లలో వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ప్లాట్లు చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నిబంధనలు ఇలా.. పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేయడానికి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూమి రిజిస్ట్రేషన్ విలువల్లో పది శాతం నాలా రుసుము కింది చెల్లించాలి. ఆ తరువాత ఫైల్ను తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఆర్డీఓ కార్యాలయం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తున్నట్లు పత్రం జారీ చేస్తారు. సంబంధిత భూ యజమాని వెంచర్ కోసం 40 ఫీట్స్తో ప్రధాన రోడ్డు, 33 ఫీట్స్తో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, తాగునీటి వసతులు కల్పించాలి. పార్కు, డంపింగ్ యార్డు, అంగన్వాడి కేంద్రాల కోసం మున్సిపల్, పంచాయతీల పేరున భూమిలో 10 శాతం రిజిస్ట్రేషన్ చేయించాలి. మున్సిపల్, పంచాయతీలు, డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకుని ప్లాట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండానే.. జహీరాబాద్ ప్రాంతంలో వెలుస్తున్న వెంచర్లలో అధికశాతం అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జహీరాబాద్– హైదరాబాద్ రహదారిలోని అనేక వెంచర్లు పంట పొలాల్లోనే వెలిశాయి. పెద్ద పెద్ద వెంచర్లు మాత్రం అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతుండగా చిన్న చిన్న వెంచర్లు నామమాత్రపు అనుమతులు తీసుకుని పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అనుమతులు లేకుండా చేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు ఆ తరువాత ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వెంచర్లతో మున్సిపల్, పంచాయతీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
తుర్కపల్లి : అక్రమవెంచర్లకు అడ్డేదీ ?
సాక్షి, తుర్కపల్లి : రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగి పోవడంతో భూముల ధరలు కూడా అమాంతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేసుకొని వాటిలో ప్లాట్లు చేసి వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు.అధికార యంత్రాంగానికి ఈ తంతు తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఈ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది.హైదరాబాద్కు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న తుర్కపల్లి మండలంలో అక్రమ వెంచర్ల హవా కొనసాగుతున్నా అధికారులకు పట్టకపోవడం శోచనీయం. తక్కువ ధరలకు భూముల కొనుగోలు.. వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసుకొని, ఆ భూమిలోనే 200 గజాలు, 100 గజాలు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నా రు. మండల కేంద్రం హైదరాబాద్కు 30 కిలో మీటర్ల దూరంలో ఉం డటం, యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃనిర్మాణం కావడంతో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వ్యవసాయభూములు ఎకరానికి కోటి నుంచి కోటి 50 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల దగ్గర నుంచి ఎకరాల చొప్పున కొనుగోలు చేసుకొని ఎ టువంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అనుమతులు కరువు .. తుర్కపల్లి, మాదాపూర్, దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, వెంకటాపూర్, పల్లెపహాడ్, ముల్కలపల్లి, రుస్తాపూర్ గ్రామాల్లో ఈ రియల్ ఎస్టేట్ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను విక్రయించి వాటిని ప్లాట్లుగా మార్చేటప్పుడు డీటీసీపీ అనుమతులు పొందాలి. కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్శాఖ, అటవీశాఖ, గ్రామపంచాయతీ అనుమతులు, నీటి పారుదల శాఖ ముందస్తు అనుమతులు పొందాలి. అధికారులు వెంచర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. అక్రమ వెంచర్లపై చర్య తీసుకుంటాం.. మండలంలో నిర్వహిస్తున్న అక్రమ వెంచర్లపైన చర్యలు తీసుకుంటాం. గతంలో మా దృష్టికి వచ్చిన వాటికి హద్దురాళ్లు తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన చర్యలు తీసుకున్నాం. గ్రామ కార్యదర్శులకు ఈ విషయంలో అవగాహన కలిగించి సత్వర చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌళి, ఈఓపీఆర్డీ -
లే‘ఔట్’పై దృష్టి
ఖమ్మం : అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట అక్రమ లే అవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలతో..బాధ్యులపై చర్యలకు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు నిఘా పెట్టారు. రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో ఒక వైపు సుడా ఏర్పాటు మరోవైపు ఐటీహబ్.. ఔటర్ రింగ్రోడ్ ఏర్పాట్లతో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా భూ దందా సాగిస్తున్నారనే కోణంలో దృష్టి సారిస్తున్నారు. నగరం చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న లే అవుట్లతో పాటు అక్రమాల నివారణ లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్లో హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగంలో ఓ అధికారి ఏసీబీకి దొరకడంతో ఇప్పుడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చురుగ్గా సాగుతున్న నగరాలపై దృష్టి సారించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే లే అవుట్లు.. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల ధరలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ లే అవుట్లు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్ ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ శాఖ నుంచి ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు తీసుకోవాలి. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అంగీకారం కావాలి. అయితే ఇవేమీ పట్టనట్లు కొందరు అక్రమార్కులు..అనుమతులు లేకుండానే లే అవుట్లను చేసి కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. ఇటీవల ధంసలాపురం ఆర్వోబీ నిర్మాణ సమయంలో భూసేకరణకు సంబంధించి అక్రమంగా ఏర్పాటు చేసిన లే అవుట్లు బయటకు రావడం గమనార్హం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇలా అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీన్బెల్ట్ ఏరియాకు తప్పనిసరిగా స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుంది. మొత్తం లే అవుట్లో 10 శాతం ప్రాంతాన్ని గ్రీన్బెల్ట్ కేటాయించాలి. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో పట్టించుకోవట్లేదు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో వీటి జారీ వెనుక జరుగుతున్న అక్రమాలపై అవినీతి శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మించిన లే అవుట్లలో 50 శాతం మేరకు గ్రీన్బెల్ట్ స్థలాలు మాయమైనట్లు సమాచారం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే తీరుపై నిఘా పెట్టనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు తూట్లు.. అక్రమ లే అవుట్లతోపాటు భవన నిర్మాణ అనుమతులపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధాన రహదారుల వెంబడి అనుమతులకు తిలోదకాలిచ్చి అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. సాధారణంగా పట్టణాల్లో వెయ్యి గజాలపైబడి ఉన్న స్థలాల్లోనే సెల్లార్లు నిర్మించాలి. రైల్వే ట్రాక్ల వెంబడి సెల్లార్ల నిర్మాణాలకు అనుమతులు లేవు. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇష్టారాజ్యంగా సెల్లార్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే వీటి అనుమతులపైన అవినీతి శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలతోపాటు, గత మూడేళ్ల నుంచి వచ్చిన అనుమతులపై సైతం పరిశీలన చేయనున్నారని గుసగుస. ఇప్పటికే హైదరాబాద్లోని హెచ్ఎండీఏపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు మరికొద్ది రోజుల్లో ఖమ్మంలో సైతం అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. విచారణతో బాగోతం బయటపడే అవకాశాలు ఉన్నాయి. -
ప్రాపర్టీ ప్లస్ 7th January 2018
-
ముందు పంట..వెనక ప్లాట్లంట!
పంట భూముల్లో అక్రమ లే అవుట్లు రాత్రుళ్లు రాళ్లు పాతి ప్లాట్లు చేస్తున్న వైనం కొత్త జిల్లా ప్రకటన.. అక్రమార్కులకు ‘కోట్లు’ కురిపిస్తోంది. రియల్ భూమ్ పేరుతో రాత్రికి రాత్రే వ్యవసాయ భూముల్లో అక్రమంగా ప్లాట్లు చేసి.. రూ.లక్షలు గడిస్తున్నారు.. ఎవరికీ అనుమానం రాకుండా.. ముందు నుంచి చూస్తే పొలాలు.. కొద్ది దూరం వెళితే రియల్టర్ల అక్రమ లే అవుట్లు దర్శనమిస్తున్నాయి.. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా.. ఏజెన్సీ.. వ్యవసాయ భూముల్లో ప్లాట్లు విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.. యథేచ్ఛగా ఇంత తతంతం నడుస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – కొత్తగూడెం కొత్త జిల్లా పుణ్యమా అని కొత్తగూడెం తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళారులను ఏర్పాటు చేసుకుని.. కొందరి వద్ద నుంచి తక్కువ ధరలకే భూములను కొనుగోలు చేసి.. వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఎకరం, రెండెకరాలే కాకుండా పది నుంచి ఇరవై ఎకరాల వరకు రాత్రికి రాత్రే అక్రమంగా లే అవుట్లు చేస్తున్నారు. వాటి ముందు చూస్తే పొలాల్లాగే ఉంటాయి.. కానీ.. కొద్దిదూరం లోపలికి వెళితే మాత్రం ప్లాట్లు దర్శనమిస్తాయి. వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకపోగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. మండల పరిధిలోని పలు శివారు ప్రాంతాల్లో సైతం ఇదేవిధంగా భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అవకాశం లేకపోయినా.. పంట భూములను విక్రయించొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు తమ పని తాము చేసుకుంటున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు ప్రకటనలు చేస్తూ.. పట్టణానికి ఇన్ని కిలోమీటర్ల దూరంలో.. ఆకర్షణీయమైన ధరలు అని చెప్పుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. శివారులోనే అక్రమ లే అవుట్లు కొత్తగూడెం శివారు ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. ఇప్పటికే చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చాతకొండ వంటి పలు పంచాయతీల్లో అక్రమంగా భూముల విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్తగూడెం జిల్లా కేంద్రం కానుండటంతో రియల్ వ్యాపారులు భూముల ధరలను అమాంతం పెంచేశారు. ప్రస్తుతం రహదారి పక్కన గల భూములు ఖాళీ లేకపోవడంతో శివారు ప్రాంతాలపై కన్నేశారు. చుంచుపల్లి పంచాయతీ పరిధిలోని విద్యానగర్ కాలనీ, మంగపేట ప్రాంతాల్లో రాత్రికి రాత్రే అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. ఖమ్మం–కొత్తగూడెం ప్రధాన రహదారిలో గల బృందావనం బ్రిడ్జి పక్కన సుమారు 2 కి.మీ లోపలికి సుమారు 20 ఎకరాల భూమిని ప్లాట్లుగా మార్చి అక్రమ లే అవుట్లు చేశారు. రాత్రివేళ ఇక్కడ చెట్లను తొలగించి.. బండరాళ్లు పాతారు. ఇది పంట పొలం.. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నప్పటికీ రియల్ వ్యాపారులు మాత్రం ప్లాట్లుగా మార్చి యథేచ్ఛగా అమ్మకానికి పెట్టారు. మరోవైపు విద్యానగర్ కాలనీ లోపలికి కూడా ఇదే విధంగా మూడెకరాల్లో లే అవుట్లు చేయడం గమనార్హం. ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధం ఒకవైపు ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ.. రియల్ వ్యాపారులు మాత్రం కొందరు అధికారుల అండదండలతో ఇలా అక్రమ లే అవుట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతంలో ఎకరాలకు ఎకరాలు ఈ విధంగా అక్రమ లే అవుట్లు ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థంకాని పరిస్థితి. ఇటువంటి అక్రమ లే అవుట్లలో భూములు కొనుగోలు చేసిన వారు మాత్రం అయోమయానికి గురవుతున్నారు. జిల్లా కేంద్రం అయితే భూములకు మంచి ధరలు వస్తాయని ఆశపడి కొనుగోలు చేస్తున్న వారికి మాత్రం రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ అశోక చక్రవర్తిని వివరణ కోరగా.. అక్రమ లే అవుట్లపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు చేపడతామని వివరించారు.