red carpet
-
కార్పొరేట్లకు రెడ్ కార్పెట్
ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన మార్కెట్లలో భారత్ది మూడో స్థానం. పదేళ్ల వ్యవధిలో (2024 ఏప్రిల్ నాటికి) సీటింగ్ సామర్థ్యం 79 లక్షల నుంచి 1.55 కోట్లకు పెరిగింది. విమానయానం మరింతగా వృద్ధి చెందుతున్న అంచనాల మధ్య వేల కొద్దీ విమానాలకు ఆర్డర్లిచ్చిన ఎయిరిండియా, ఇండిగో లాంటి దిగ్గజాలు.. గణనీయంగా పెరుగుతున్న కార్పొరేట్ ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ మార్కెట్ (హోటళ్లు, విమానయాన సంస్థలు, రైళ్లు, క్యాబ్లు కలిపి) దాదాపు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ఎయిర్లైన్స్ మార్కెట్ వాటా 53 శాతంగా (5.6 బిలియన్ డాలర్లు) ఉంది. కార్పొరేట్ల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా ఈ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో కార్పొరేట్, సంపన్న ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశ విదేశ ఎయిర్లైన్స్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎస్ఎంఈ) ఎయిరిండియా దృష్టి సారించింది. సాధారణంగా మార్కెటింగ్పరంగా వాటిని చేరుకోవడం కొంత కష్టతరం కావడంతో, అవే నేరుగా బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ విడిగా పోర్టల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన చార్జీలను కూడా ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు విస్తారా ను విలీనం చేసుకున్న తర్వాత సేల్స్ టీమ్ పటిష్టం కావడం, నెట్వర్క్ విస్తరించడం వంటి అంశాలు కార్పొరేట్ బిజినెస్ పెంచుకునేందుకు ఎయిరిండియాకు ఉపయోగపడుతున్నాయి. గత కొన్నాళ్లుగా కంపెనీ సుమారు 1,700 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లను దక్కించుకుంది. మరోవైపు బడ్జెట్ విమానయా న సంస్థగా పేరొందిన ఇండిగో కూడా కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక రూట్లలో బిజినెస్ క్లాస్ను ప్రవేశపెడుతోంది. గతేడాది నవంబర్లో ప్రారంభించిన ఈ కొత్త సర్వీసులకు మంచి స్పందన రావడంతో ఢిల్లీ–చెన్నై రూట్లో కూడా ఈ కేటగిరీని ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 2025 ఆఖరు నాటికి 45 విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయని కంపెనీ సీఈవో పీటర్స్ ఎల్బర్స్ పేర్కొన్నారు. 2025 జూన్ నాటికే ఇలాంటి 94 విమానాలను సమకూర్చుకోవాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక సదుపాయాలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. ఇండిగోలో సీట్ల వరుసల మధ్య స్థలం 38 అంగుళాలుగా ఉంటే, ఎయిరిండియాకు 40 అంగుళాల స్థాయిలో ఉంటోంది. ఇండిగో సీట్లు అయిదు అంగుళాల మేర రిక్లైన్ అయితే, ఎయిరిండియావి 7 అంగుళాల వరకు రిక్లైన్ అవుతాయి. ఇక రెండు ఎయిర్లైన్స్ చెకిన్, బోర్డింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విషయాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి.అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కూడా.. ఆర్థిక పరిస్థితులపై సానుకూల దృక్పథంతో ప్రయాణాలు మరింతగా పుంజుకుంటాయన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ క్లాస్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కూడా పోటీపడుతున్నాయి. మలేసియా ఎయిర్లైన్స్ కొన్నాళ్ల క్రితమే తమ కార్పొరేట్ ట్రావెల్ ప్రోడక్ట్ను సరికొత్తగా తీర్చిదిద్దింది. అప్గ్రెడేషన్, అదనపు బ్యాగేజ్ అలవెన్స్ మొదలైన వాటికి రివార్డు పాయింట్లను అందించడంతో పాటు వాటిని రిడీమ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అలాగే ఎస్ఎంఈలకు ప్రత్యేక చార్జీలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన తోడ్పాటు అందిస్తోంది. తమ దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్సులు, ఈవెంట్లను నిర్వహించుకునేందుకు క్లయింట్లను ప్రోత్సహించేలా ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ మారిషస్ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ స్కీము కింద గ్రూప్ సైజు, ప్రయాణించిన ప్యాసింజర్లను బట్టి ఒక్కొక్కరి మీద రూ. 500–1,000 వరకు కమీషన్లు ఇస్తోంది. అజర్బైజాన్, జార్జియా, కజక్స్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ పెరగడంతో, ఆయా దేశాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని థామస్ కుక్ ఇండియా వర్గాలు తెలిపాయి. థామస్ కుక్ ఇండియాకి సంబంధించి బిజినెస్ ట్రావెల్ సెగ్మెంట్ వార్షికంగా సుమారు 13 శాతం పెరిగింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మాజీ సైనికులకు కార్పొరేట్ ‘సెల్యూట్’!
రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికోద్యోగులకు కార్పొరేట్ కంపెనీలు రారమ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలవోకగా పని చేసే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ప్రాజెక్టుల అమలులో కచ్చితత్వం వంటి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేస్తున్నా యి. కొన్ని విభాగాల్లో నిపుణుల కొరతను అధిగమిస్తున్నాయి. దేశంలో మాజీ సైనికుల వెంట పడుతున్న టాప్ కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా 2,000 మంది మాజీ సైనికోద్యోగులను నియమించుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడో వంతు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రక్షణ దళాల మాజీ సిబ్బంది 7,500 మందికి ఎగబాకారు. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్–సర్వీస్మెన్ ఉన్న కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు సృష్టించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా గ్రూప్ కంపెనీలు, మారుతీ తో పాటు అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వేదాంత, సొడెక్సో, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వంటి సంస్థలు సైతం మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటున్న జాబితాలో టాప్లో ఉన్నాయి. ఏటా 60,000 మంది పదవీ విరమణ... త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) ఏటా పదవీ విరమణ చేస్తున్న రక్షణ సిబ్బంది సంఖ్య దాదాపు 55,000–60,000 వరకు ఉంటుందని అంచనా. వీరిలో ఆఫీసర్ ర్యాంకుల్లో ఉన్నవారు 1,200–1,300 (సుమారు 2%) మంది వరకు ఉంటారు. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా రిటైర్ అయ్యేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం. ఇలా వైదొలగుతున్న వారిలో ఎక్కువగా రిలయన్స్, అదానీ, ఎల్అండ్ టీ, టాటా గ్రూప్ వంటి బడా కార్పొరేట్ కంపెనీల్లో హెచ్ఆర్, అడ్మిన్, సరఫరా వ్యవస్థలు ఇతరత్రా విధుల్లో చేరుతున్నారని త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం చీఫ్ మెంటార్, పూర్వ అధ్యక్షుడు కమోడోర్ సుదీర్ పరకాల చెబుతున్నారు. సరుకు రవాణా (లాజిస్టిక్స్), ఈ–కామర్స్, వేర్–హౌసింగ్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్, తయారీ, విద్యుదుత్పత్తి, టెలికం వంటి రంగాల్లో ఎక్స్–సరీ్వస్మెన్కు దండిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెషీన్ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ప్రత్యేక సామర్థ్యాలు ప్లస్... మాజీ సైనికోద్యోగులకు అత్యుత్తమ ఫిట్నెస్కు తోడు క్రమశిక్షణ వంటి ప్రత్యేకతల కారణంగా సంస్థకు అదనపు బలం చేకూరుతోందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను పక్కాగా అమలు చేసే సామర్థ్యం, సంక్లిష్ల పరిస్థితులను అధిగమించే నైపుణ్యాలు, ప్రతికూల ప్రదేశాలను తట్టుకుని పని చేసే ధైర్య సాహసాలు... కంపెనీలు ఏరికోరి మరీ వారిని నియమించుకునేలా చేస్తున్నాయన్నారు. దీనివల్ల వైవిద్యంతో పాటు కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీరుతుందనేది హైరింగ్ నిపుణుల మాట. ‘రక్షణ దళాల్లో ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు అలవడిన క్రమశిక్షణ, వారికి ఇచ్చే కఠోర శిక్షణ కారణంగా మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక సామర్థ్యాలు అలవడతాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కార తీరు, టీమ్ వర్క్, మల్టీ టాస్కింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో వారు ఆరితేరి ఉంటారు. అందుకే టాటా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్అండ్టీ, వేదాంత గ్రూప్ వంటి బడా కార్పొరేట్లు మాజీ సైనికుల హైరింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నాయి’ అని సియెల్ హెచ్ఆర్ అంటోంది.ఓఎన్జీసీ: కంపెనీ నిబంధనల మేరకు మాజీ సైనికోద్యోగులకు ఎగ్జిక్యూటివ్ స్థాయి నియామకాల్లో 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించింది. రిలయన్స్: గత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది మాజీ సైనికులను నియమించుకుంది. ఈ సంఖ్య 7,500కు చేరింది.వేదాంత: రక్షణ దళాల మాజీ సిబ్బంది నియామకం కోసం 2023–24లో ప్రత్యేక పాలసీ చర్యలు చేపట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కాన్స్లో ఆ ముగ్గురు
కాన్స్ ఫెస్టివల్లో సినిమాలకు ఎంట్రీ దొరికినా సెలబ్రిటీలకు ఆహ్వానం దొరికినా చాలా ఘనత. ఈసారి కాన్స్లో చాలా ఏళ్ల తర్వాత ఒక భారతీయ సినిమా ప్రదర్శితం కానుంది. అదలా ఉంటే మన దేశానికి చెందిన ముగ్గురు యువ ఇన్ఫ్లుయెన్సర్లను కాన్స్ ఆహ్వానించింది. మే 14–25 మధ్య జరగనున్న ఈ ఫెస్టివల్లో ఆర్జె కరిష్మా, ఆస్థా షా,నిహారికా ఎన్.ఎమ్ రెడ్ కార్పెట్ మీద దర్జాగా నడవనున్నారు.వారి పరిచయాలు.ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేటి నుంచి (మే 14) నుంచి ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో ్ర΄ారంభం కానుంది. ఆస్కార్ అవార్డ్స్తో సమానంగా కాన్స్ అవార్డులను భావిస్తారు. ఈసారి భారతదేశం నుంచి ΄ాయల్ క΄ాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా మెయిన్ కాంపిటీషన్లో ఎంట్రీ సాధించింది. సినిమాకు, సంస్కృతికి ్ర΄ాధాన్యం ఇచ్చే ఈ ఫెస్టివల్లో భారతదేశం నుంచి కొంతమంది యువ ఇన్ఫ్లుయెన్సర్లకు ఆహ్వానం అందింది. అతిరథ మహారథులతో కలిసి రెడ్ కార్పెట్ మీద నడిచే అవకాశం వీరు ΄÷ందారు. స్ఫూర్తినిచ్చే తమ జీవితాల ద్వారా, ప్రతిభ, విజయం ద్వారా వీరు అవకాశం ΄÷ందారు. అలాంటి ముగ్గురి పరిచయం.ఆస్థా షాసోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తన జీవిత ΄ోరాటంతో ప్రభావం చూపుతున్న ఆస్థా షాది ఢిల్లీ. 24 ఏళ్ల ఆస్థా 8 ఏళ్ల వయసు నుంచి విటిలిగో (తెల్లమచ్చలు) బారిన పడింది. పూర్తిగా నివారణ లేని ఈ చర్మవ్యాధి ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రతి ఒక్కరూ ‘ఈ అమ్మాయికి పెళ్లవుతుందా’ అని తల్లిదండ్రులను వేధించేవారు. అన్ని రకాల వైద్య విధానాలతో విసిగి΄ోయిన ఆస్థా నేను ఎలా ఉన్నా నా జీవితం ముఖ్యం అనుకుని చదువు మీద దృష్టి పెట్టింది. మంచి ప్రతిభ చూపి ఇప్పుడు హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్లో ఫైనాన్షియల్ అనలిస్ట్గా పని చేస్తోంది. ఇన్స్టా, ట్విటర్ ద్వారా ΄ాపులర్ అయ్యి డబ్బు సం΄ాదిస్తోంది. ‘ఆడపిల్లలకు విటిలిగో ఉంటే ఆ అమ్మాయిలను తల్లిదండ్రులే ఇంటి నుంచి బయటకు రానీకుండా చూస్తారు. ఆమెను న్యూనతకు గురి చేస్తారు. విటిలిగో కేవలం ఒక చర్మస్థితి. ఇప్పుడు నేను పూర్తి విటిలిగోతో తెల్లగా అయి΄ోయాను. కాని నా జీవితాన్ని సమర్థంగా జీవిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారో అలా కనపడుతూ ముందుకు సాగి΄ోండి’ అని చెప్పి లక్షలాది మంది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెంచుతోంది ఆస్థా. అందుకే ఆమెకు ఆహ్వానం.ఆర్జె కరిష్మాసోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నెలకు 30 లక్షలు సం΄ాదిస్తున్న కరిష్మా బహురూ΄ాలు వేసి కామెడీ చేయడంలో నేర్పరి. చిన్నప్పుడు ఒకరోజు కరిష్మా గదిలో నుంచి రకరకాల గొంతులు వినిపిస్తుంటే తల్లి కంగారు పడి తలుపు తట్టి ‘కరిష్మా నీతో ఎవరున్నారు’ అని అడిగితే తలుపు తెరిచిన కరిష్మా అవన్నీ తాను మిమిక్రీ చేస్తున్న గొంతులని చెప్పింది. జమ్ము కశ్మీర్కు చెందిన కరిష్మా నటి కావాలనుకుని ఆర్.జె. అయ్యి ఆ తర్వాత కామెడీ బిట్స్ చేసే యూట్యూబర్గా ఖ్యాతి ΄÷ందింది. ఇండోర్లో రెడ్ ఎఫ్.ఎం. లో పని చేసేటప్పుడు ఆమె షో సూపర్హిట్ అయ్యింది. మానవ ప్రవర్తనల్లోని భిన్నత్వాన్ని ఆమె చూపే విధానం వల్ల చాలా సీరియస్ విషయాలను కూడా తేలిగ్గా తీసుకుని ముందుకు సాగవచ్చనే ధిలాసా ఇస్తుంది. అందుకే ఆమెకు ఈ ఆహ్వానం.నిహారికా ఎన్.ఎమ్.బెంగళూరులో పుట్టి పెరిగి ఇప్పుడు లాస్ ఏంజెలిస్లో ఉంటున్న నిహారికకు తెలుగు బాగా వచ్చు. బహుశా తెలుగు మూలాలు ఉండొచ్చు. యూట్యూబ్లో, ఇన్స్టాలో నిహారిక చేసే వీడియోలకి లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. నిహారికతో షో చేస్తే ప్రచారం లభిస్తుందని భావించే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు. 27 ఏళ్ల ఈ ఇన్ఫ్లుయెన్సర్ లోపలొకటి బయటొకటిగా ఉండే మనుషులను గేలి చేస్తూ బోలెడన్ని వీడియోలు చేసి నవ్విస్తుంటుంది. ‘మార్కులు వస్తేనే జీవితం. గొప్ప మార్కులు వచ్చినవారే గొప్ప జీవితాన్ని గడపగలరు అనే భావన నుంచి తల్లిదండ్రులు బయటపడాలి. పిల్లల తెలివితేటలు, ఆసక్తిని బట్టి వారిని ్ర΄ోత్సహిస్తే వారు సక్సెస్ అవుతారు. నేను డాక్టరో ఇంజనీరో కావాలని మా అమ్మా నాన్నలు అనుకున్నారు. కాని లక్షలాది మంది అభిమానించే యూ ట్యూబర్ని అయ్యాను. కలలు కని ముందుకు సాగండి’ అనే సందేశం ఇస్తుంటుంది నిహారిక. ఆమె ఇప్పుడు రెడ్ కార్పెట్ మీద హంగామా చేయనుంది. -
తడబడినా భలే గమ్మత్తుగా కవర్ చేసింది ఈ ముద్దుగుమ్మ!
ప్రముఖ ఇంటర్నెట్ సెన్సెషన్ యూట్యూబర్, హాలీవుడ్ నటి లిజా కోశి ఆస్కార్ అవార్డు షో కార్యక్రమానికి హాజరయ్యింది. ఆ కార్యక్రమంలో రెడ్ కార్పెట్పై నడుస్తూ సడెన్గా తడబడి పడిపోయింది. అయితే ఆమె మాత్రం ఆ ఘటనను కవర్ చేస్తూ ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. ఆమె అందరిముందు పడిపోవడాన్ని అవమానంగా భావించకుండా చాలా సమయస్ఫూర్తిగా కవర్ చేసుకుంది. అక్కడున్న వాళ్లంతా ఆమె పడిపోయిందని సహాయం చేసేందుకు ముందుకొచ్చిన వాళ్లనే షాక్కి గురి చేసింది. వాళ్లు కూడా కాస్త గందరగోళానికి లోనయ్యారనే చెప్పొచ్చు. ఎందుకుంటే? పడిపోయి దాన్నే స్టైయిలిష్గా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నట్లు పెట్టడంతో..వాళ్లు పడిపోలేదా? పొరపడ్డామా? అన్నట్టు సందేహంగా చూడటం వాళ్ల వంతయ్యింది. కోశి ఈ వేడుకల్లో ఎరుపు రంగు ఫుల్ లెంగ్త్ గౌనుతో తళుక్కుమంది. అనుకోని ప్రమాదం జరిగినా ముఖంపై ప్రశాంతతను చెదరనివ్వకుండా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఎంతైన నటి కథ ఆ మాత్రం కవర్ చేయాల్సిందే అంటూ సెటైరికల్ కామెంట్లతో పోస్టులు పెట్టారు. Liza Koshy stuns in red dress at The Oscars 2024 #Oscars #Oscars2024 pic.twitter.com/Y1Xlnowt8A — joe (@vetoedjoe) March 10, 2024 (చదవండి: ఆ ఆటో డ్రైవర్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్కి యూకే టూరిస్ట్ ఫిదా!) -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నగరవాసి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై నగరానికి చెందిన బిజినెస్ టైకూన్ సుధా రెడ్డి సందడి చేశారు. ప్రఖ్యాత డైరెక్టర్ మార్టిన్ స్క్రోసేస్, హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో చిత్రం ’కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ నేషనల్ ప్రీమియర్లో భాగంగా ఆమె రెడ్ కార్పెట్ వాక్ చేశారు. స్టార్–స్టడెడ్ ఫెస్టివల్లో ప్రపంచ ప్రముఖులతో అలరించే రెడ్ కార్పెట్పై వాక్ చేసిన మొట్టమొదటి సినిమాయేతర సెలబ్రిటీ సుధారెడ్డి కావడంవిశేషం. ఈ సందర్భంగా ఆమె కస్టమ్–మేడ్ ఫల్గుణి షేన్ పీకాక్ పీచ్ పెర్ల్ డ్రెప్ చీరలో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిష్టాత్మకమైన బీచ్ డెస్టినేషన్, ప్లేజ్ హోటల్ బారియర్ లే మెజెస్టిక్లో జరిగిన మేడమ్ ఫిగరో ఈవెంట్లో తళుక్కుమన్నారు. -
రాజ్యసభలో రెడ్, లోక్సభలో గ్రీన్ కార్పెట్.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ: మన దేశంలోని నూతన పార్లమెంట్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, పార్లమెంట్ నూతన భవన ప్రారంభాన్ని బహిష్కరించేందుకు 19 విపక్షపార్టీలు ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొత్త పార్లమెంట్ నిర్మాణ శైలి, హంగుల గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అధికార బీజేపీ పక్షం నూతన పార్లమెంట్ భవన నిర్మాణం మొదలుకొని వివిధ అంశాలలో రికార్డులు నెలకొల్పిందని చెబుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫొటోలలో రాజ్యసభ హాలులో రెడ్ కార్పెట్, లోక్సభ హాలులో గ్రీన్ కలర్ కార్పెట్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. చాలామంది దీనిని డిజైన్ అని అనుకుంటారు. కానీ, దీని వెనుక ఒక కారణం ఉంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ విధానం నూతన పార్లమెంట్లోనే కాదు పాత పార్లమెంట్ భవనంలోనూ కొనసాగింది. కొత్త భవనంలో పలు మార్పులు చోటుచేసుకున్నప్పటికీ కార్పెట్ రంగుల విషయంలో ఎటువంటి మార్పులేదు. పార్లమెంట్లోని ఉభయ సభలకు భిన్నమైన ప్రత్యేకత ఉంది. రెండు సభలలో సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలోనూ ఎంతో తేడా ఉంది. లోక్సభలోని సభ్యులు నేరుగా ప్రజల చేత ఎన్నికయినవారై ఉంటారు. అదేవిధంగా రాజ్యసభ విషయానికొస్తే సభ్యులను ప్రజా ప్రతినిధులు ఎన్నుకుంటారు. లోక్సభ సభ్యులంతా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే వీరు కింది స్థాయి(నేల)తో విడదీయరాని అనుబంధం కలిగివుంటారు. భూమితో ముడిపడివున్న వ్యవసాయానికి గుర్తుగా పచ్చరంగును పేర్కొంటారు. అందుకే లోక్సభలో పచ్చరంగు కార్పెట్ వినియోగిస్తారు. రాజ్యసభలో రెడ్ కార్పెట్ ఎందుకంటే.. రాజ్యసభలోని సభ్యులు.. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైనవారై ఉంటారు. వీరి ఎంపిక ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. ఎరుపు రంగును గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. రాజ్యసభలోని ప్రజాప్రతినిధులను ప్రత్యేక సభ్యులుగా గుర్తిస్తారు. అందుకే రాజ్యసభలో ఎరుపురంగు కార్పెట్ను వినియోగిస్తారు. ఇది కూడా చదవండి: రాజదండం సాక్షిగా... పార్లమెంటులో చోళుల సెంగోల్ -
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఊహించని ఘటన.. మహిళ ఒంటిపై ‘రక్తం’ పోసుకుని
అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్కు సంఘీభావంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక మహిళ తెలిపిన నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఫ్రాన్స్లో జరుగుతున్న ఫెస్టివల్లో ఆదివారం సాయంత్రం ఫ్రెంచ్ చలనచిత్ర దర్శకుడు జస్ట్ ఫిలిప్పోట్ చిత్రం యాసిడ్ ప్రీమియర్కు ముందు ఓ మహిళ ఉక్రెయిన్ జెండా రంగులున్న దుస్తులు ధరించి రెడ్ కార్పెట్పైకి నడుచుకుంటూ వెళ్లి, ఓ చోట నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. అనంతరం తన వెంట తెచ్చిన బాటిల్ను తెరిచి అందులోని ఎరుపు రంగుని తన తలపై పోసుకుని నిరసన తెలపడం మొదలుపెట్టింది. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించి వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. గత సంవత్సర కాలంగా రష్యా ఉక్రెయిన్పై జరుపుతున్న దాడులు కారణంగా అక్కడ నెత్తుటి దారులు ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంకేతంగా ఆ మహిళ నకిలీ రక్తంతో ఈ రకంగా తన నిరసన ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అయితే సదరు మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఉక్రెయిన్ దేశస్థురాలిగా అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడులకు వ్యతిరేకిస్తూ ఈ ఏడాది కూడా రష్యా ప్రతినిధులు, ఫిల్మ్ కంపెనీలపై కేన్స్ నిషేధం విధించారు. గతేడాది కూడా ఓ మహిళ ఇలాగే అనూహ్యంగా నిరసనకు దిగి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. At the Cannes Film Festival, a brave young lady dressed in the colors of Ukraine doused herself in fake blood. She did it on the red carpet before the screening of the Russian film "Acid". The security service quickly ran up to her and rushed her away. 🇺🇦💙💛… pic.twitter.com/rqx2CNlJ0N — Snodgrass (@Snodgrass9876) May 22, 2023 చదవండి: సూడాన్: అమెరికా, సౌదీ దౌత్యం.. సంబురపడేలోపే కథ మళ్లీ మొదటికి! -
‘రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు వద్దు.. కేంద్రం తెలివి తక్కువ పని’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చలామణిలో ఉన్న రూ. 2 వేల నోటు రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టారు. అదొక తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. పైగా నలధనాన్ని వెలికి తీసేందుకే ఈ పెద్ద నోట్లని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు వేల రూపాయల నోటు మార్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు, ఆధారాలు అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. అంటే దీని అర్థం నల్లదనాన్ని మార్చుకునే వారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ వెసులుబాటు కల్పించినట్లేగా అని ఎద్దేవా చేశారు. నిజానికి సాధారణ ప్రజల వద్ద రూ. 2 వేల రూపాయల నోట్లు ఉండనే ఉండవు. 2016లో డీ మానిటైజేషన్ పేరిట ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో ప్రజలు పెద్ద నోట్లకు చాలా దూరంగా ఉన్నారన్నారు. అయినా రోజువారి చిల్లరకు ఆ నోటు సామాన్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు కూడా అని చెప్పారు. నల్లధనాన్ని కూడబెట్టేవారికి సులభంగా దాచుకునేందుకు మాత్రమే ఆ నోటు ఉపయోగపడుతుందన్నారు. 2016 తర్వాత సరిగ్గా ఏడేళ్లకి ఈ మూర్ఖపు చర్యను తీసుకున్నందుకు సంతోషం అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారమే భారత రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటుని చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రజలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వడమే గాక అందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ రూ. 2 వేల రూపాయల నోటుని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపదని, కేవలం అక్రమ డబ్బు తరలింపును కష్టతరం చేయడానికేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పడం విశేషం. (చదవండి: శ్రీనగర్లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు) -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా..
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు. రెడ్ కార్పెట్ మీద భార్య ప్రియా దాగర్తో కలిసి అడుగులు వేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇలా రెడ్ కార్పెట్పై నడిచిన మొదటి భారతీయ పారిశ్రామిక వేత్త ఆయనే. అమన్ గుప్తా తొలిసారిగా కేన్స్ ప్రదర్శన కోసం భార్య ప్రియా దాగర్తో కలిసి వచ్చారు. ఈ మేరకు అమన్ గుప్తా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్తను నేనే కావడం గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Aman Gupta (@boatxaman) మరోవైపు బాలీవుడ్ తారలు సారా అలీ ఖాన్, మానుషి చిల్లర్, ఈషా గుప్తా, మృణాల్ ఠాకూర్ వంటి వారు ఈ సంవత్సరం కేన్స్లోకి అడుగుపెట్టారు. కేన్స్ వెటరన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్గా 21వ సారి ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చింది. -
ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..?
వాషింగ్టన్: బాలీవుడ్ స్టార్ దిపికా పదుకొణె ఆస్కార్ వేదికపై సందడి చేశారు. 95వ అకాడెమీ అవార్డుల ప్రధానోత్సవానికి తొలిసారి ప్రెజెంటర్గా వెళ్లిన ఆమె రెడ్కార్పెట్పై నల్ల గౌనులో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్గా మారాయి. నల్ల రంగు గౌను, వెల్వెట్ గ్లౌస్, డైమండ్ నెక్లెస్తో హాలీవుడ్ గ్లామర్ భామలను తలదన్నేలా దీపిక తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే దిపికా పదుకొణెకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నా.. హాలీవుడ్ మీడియా సంస్థ ఏఎఫ్పీతో పాటు గెట్టీ, వోగ్ మెగజీన్ను ఆమెను గుర్తుపట్టలేకపోయాయి. దిపికాను బ్రెజిల్ మోడల్, డిజైనర్ క్యామిలా అనుకొని పొరపడ్డాయి. దీపికా గతంలో కేన్స్ జ్యూరీ, ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లో కూడా సందడి చేశారు. అయినా ఆమెకు, క్యామిలాకు మధ్య వ్యత్యాసాన్ని హాలీవుడ్ సంస్థలు పసిగట్టలేకపోయాయి. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Camila Alves McConaughey (@camilamcconaughey) -
జిన్పింగ్ సౌదీ పర్యటనతో..టెన్షన్లో పడిన అమెరికా
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బుధవారం నుంచి సౌదీ అరేబియాలో మూడు రోజుల అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా జిన్పింగ్ సౌదీలోని చైనా గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు జిన్పింగ్ తన మూడు రోజుల అధికారిక పర్యటన కోసం అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు గల్ఫ్ కింగ్డమ్కి చేరుకుంటారని సౌదీ మీడియా పేర్కొంది. ఈ పర్యటనలో సౌదీ రాజు సల్మాన్ అధ్యక్షతన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఉంటుంది. దీనికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్సల్మాన్ హాజరవుతారని సౌదీ ప్రభుత్వ మీడియా నివేదికలో పేర్కొంది. అలాగే ఆరుగురు సభ్యులతో కూడిన జీసీసీకి చెందిన పాలకుల శిఖరాగ్ర సమావేశానికి జిన్ పింగ్ హాజరవుతారని, పైగా మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాల నాయకులతో కూడా సమావేశమై చర్చలు జరుపుతారని నివేదికలో వెల్లడించింది. జీసీసీ అనేది బహ్రెయిన్ , కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్లతో కూడిన ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ రాజకీయ ఆర్థిక సంఘం. ఐతే ప్రస్తుతం జిన్పింగ్ సౌదీ రాక అమెరికాను కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చమురు అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో సౌదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి రెడ్కార్పెట్ పరిచి ఆహ్వానించటం అనేది యూఎస్ని టెన్షన్కి గురి చేసే అంశమే. అదీగాక అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ మధ్య ప్రాచ్యాన్ని బీజింగ్కి అప్పగించదు అని తేల్చిన నేపథ్యంలో జరుగుతున్న జిన్పింగ్ పర్యటనే కావడం. అంతేగాక వాషంగ్టన్ని ప్రభావితం చేసే దేశాలతో లింక్ అప్ పెంచుకోవాలనే చైనా కోరికను తేటతెల్లం చేస్తోంది ఈ పర్యటన. మరోవైపు సౌదీ ముడి చమురుకి సంబంధించి చైనా ఏ అతిపెద్ద కస్టమర్ కూడా. ఐతే ఈ పర్యటనలో సౌదీ ఆర్థిక వ్యవస్థను చమురు నుంచి వైవిధ్యపరచాలనే ప్రిన్స్ మహ్మద్ ఆలోచనకు అనుగుణంగా మెగాప్రాజెక్టులలో చైనా సంస్థలు మరింతగా భాగస్వామ్యమయ్యేలా ఒప్పందాలపై ఇరు దేశాల నాయకులు చర్చిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. జిన్పింగ్ చివరిసారిగా 2016లో సౌదీ అరేబియాను సందర్శించారు. (చదవండి: సినీఫక్కీలో దోపిడీ: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల విలువైన కార్లను కొట్టేశారు: వీడియో వైరల్) -
‘బాగా నిద్రపోగలరా..జాబిస్తాం! జీతంతోపాటు మరో ఆఫర్ కూడా!
ఉద్యోగులెవరైనా ఆఫీసు వేళల్లో గుర్రుపెట్టి నిద్రపోతే ఏం జరుగుతుంది? ఏముంది.. ఆ పనేదో ఇంటికెళ్లి చేసుకోండంటూ సంస్థ వారిని ‘సాగనంపుతుంది’. కానీ అలాంటి వారే తమకు కావాలని ఏదైనా కంపెనీ ముందుకొస్తే?! అమెరికాలోని న్యూయార్క్కు చెందిన క్యాస్పర్ అనే పరుపుల కంపెనీ నిద్రపోవడంలో అసాధారణ ప్రతిభ చూపగల ఔత్సాహికులకు రెడ్కార్పెట్ పరుస్తోంది. నిద్రా నిపుణుల కోసం ఉద్యోగ ప్రకటన సైతం జారీ చేసింది. ‘వీలైనంత సేపు నిద్రపోవాలన్న కోరిక ఉండటంతోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిద్రాభంగం కలగని సామర్థ్యం ఉన్న వారి కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. ‘మా స్టోర్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రాంతాల్లో నిద్రపోండి. మీ నిద్రానుభవాన్ని టిక్టాక్ తరహా కంటెంట్ ద్వారా మా సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఇతరులతో పంచుకోండి’ అని సూచించింది. నిద్రకు సంబంధించిన అన్ని రకాల అంశాలను ఇతరులతో పంచుకోగలగడం, నిద్ర గురించి మాట్లాడే జిజ్ఞాస కలిగి ఉండటం అభ్యర్థులకు అదనపు అర్హత అవుతుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు తగిన జీతంతోపాటు కంపెనీ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తామని మరో ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు పైజామాల్లో ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది. నిద్రకు నిద్ర, జీతానికి జీతం కావాలనుకొనే ఔత్సాహికులు దరఖాస్తులు సమర్పించేందుకు గురువారమే చివరి రోజు.. త్వరపడండి మరి. -
స్కర్ట్ వేసుకున్న స్టార్ హీరో.. వరల్డ్వైడ్గా చర్చ
Brad Pitt Explains On Why He Wore Skirt On Bullet Train Red Carpet: ఇప్పటివరకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన దుస్తులు ధరించి ట్రోలింగ్కు గురి కావడం చూశాం. తాజాగా ఇలాంటి డిఫరెంట్ వేర్తో దర్శనమిచ్చి వైరల్గా మారాడు ఓ స్టార్ హీరో. హాలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో బ్రాడ్ పిట్ ఒకరు. యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఆస్కార్ విన్నర్. ఈ హీరో కూడా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటాడు. బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్కు ముందు పలు దేశాల్లో ప్రీమియర్ షోలను వేస్తున్నారు. ఇలానే కొన్ని వారాల క్రితం బెర్లిన్లో 'బుల్లెట్ ట్రైన్' ప్రీమిర్ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్పై స్కర్ట్ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రాడ్ పిట్. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్, బూట్లు, వదులుగా ఉండే నార షర్ట్, జాకెట్తో దర్శనమిచ్చిన బ్రాడ్ పిట్ లుక్ వరల్డ్వైడ్గా వైరల్ అయింది. బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా లాస్ ఏంజెల్స్తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్. చదవండి: సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్ ఈ ప్రీమియర్ షోకు సాధారణ దుస్తుల్లో వచ్చన బ్రాడ్ పిట్.. 'బెర్లిన్లో అలా ఎందుకు చేశానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనిపించింది' అని స్కర్ట్ వేసుకోవడంపై వివరణ ఇచ్చాడు. అలాగే తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'నేను రిటైర్ అవుతున్నాననే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. ప్రస్తుతం నేను మిడిల్ ఏజ్లో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను అంతే' అని పేర్కొన్నాడు. చదవండి: 4కె ప్రింట్తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా.. -
ఆ హీరోయిన్స్ను జిరాఫీలు అన్న అదితి రావ్.. ఎందుకంటే ?
Aditi Rao Hydari About Cannes Film Festival 2022 Debut Experience: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాలతో అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో తళుక్కుమంది. బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్ మాధవన్, పూజా హెగ్డేతోపాటు అదితి పాల్గొంది. వేడుకలో భాగంగా ఐదో రోజు రెడ్ కార్పెట్పై రెడ్ అండ్ పింక్ గౌన్లో అందంగా నడిచి ఆకట్టుకుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి రావ్ హైదరీ. 'నేను చాలా పొట్టిగా ఉంటాను. అందుకే కేన్స్ ఫెస్టివల్లో ఉన్న జిరాఫీలతో (మిగతా హీరోయిన్స్ తనకన్నా హైట్గా ఉంటారన్న ఉద్దేశ్యంతో) పోటీపడలేనని మాటల సందర్భంలో సబ్యసాచితో (డిజైనర్) చెప్పాను. నేను నటిని. పొట్టిగా ఉన్నప్పటికీ నాకు బాధ లేదు. ఎందుకంటే నాలాగా ఉండటానికి నేను ఎంతో సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను. అందుకే ధైర్యం చేసి ఫెస్టివల్లో పాల్గొంటాను. నేను చాలా తెలివితక్కువ పని చేయబోతున్నాను. రెడ్ కార్పెట్పై నడిచేప్పుడు కచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేస్తాను. అప్పుడు నన్ను అందరు విమర్శిస్తారు. అయినా పర్లేదు. అంతా మన మంచికే. దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు.' అని అదితి చెప్పుకొచ్చింది. అయితే రెడ్ కార్పెట్పై ఎలాంటి పొరపాటు లేకుండా హొయలు పోయింది అదితి రావ్ హైదరీ. చదవండి: లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ? View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) -
కులాల లెక్కన...‘ఆకర్ష్’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రస్తుతం కులాలు, వర్గాల వారీగా ఓట్లను రాబట్టగల నేతలను ఆకర్షించడంపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రధాన కులాలను ప్రభావితం చేయగల సమర్ధులైన కీలక నేతలపై ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు, వారిని చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా యూపీలో అధికారాన్ని కాపాడుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే ఫిరాయింపుదారులకు రెడ్కార్పెట్ వేయగా, ఎన్నికల షెడ్యూల్ అనంతరం సమాజ్వాదీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీ వ్యూహాన్ని చిత్తుచేసే పనిలో పడింది. మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్లు రాజీనామా చేసి బీజేపీని వీడటం, వారి బాటలోనే బీజేపీకి మరో నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో వలసల పర్వం హీటెక్కుతోంది. ముందే చేరికలను తెరతీసిన బీజేపీ గడిచిన ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ప్రస్తుత ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల కన్నా ముందుగానే మేల్కొన్న పార్టీ అధిష్టానం గత ఏడాది నవంబర్ నుంచే ప్రభావవంతమైన నేతలను ఆకట్టుకునే యత్నాలు ఆరంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు లక్ష్మీకాంత్ బాజ్పాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కాళీచరణ్, మహారాజ సుహేల్దేవ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బాబన్ రాజ్భర్ను పార్టీలో చేర్చుకుంది. 2.4 శాతంగా ఉన్న రాజ్భర్లు గతంలో బీజేపీతోనే ఉన్నా సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో వీరి ఓట్ల అటువైపుకు వెళ్లకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక బ్రాహ్మణ వర్గాలు ఏమాత్రం చేజారిపోకుండా కాంగ్రెస్కు చెందిన మాజీ హోంమంత్రి, ప్రయోగ్రాజ్ నుంచి మూడుస్లార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేంద్ర త్రిపాఠితో పాటు మరో మాజీ మంత్రి జై నారాయణ్ తివారీ, మరో కీలక నేత విజయ్ మిశ్రాలను పార్టీ కండువా కప్పింది. బీఎస్పీ నుంచి ఎస్పీకి దళిత ఓటు బ్యాంకు వెళ్లకుండా ఎస్సాలోని ప్రముఖ దళిత నేత సుభాస్ ఫసికి కాషాయ కండువా కప్పింది. ఎస్పీని బలహీనపర్చే యత్నంలో గత నవంబర్లో పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రవిశంకర్సింగ్, నరేంద్రసింగ్ భాటి, సీపీచాంద్, రామ్ నిరంజన్లను పార్టీలోకి లాగేసింది. వీరంతా ఠాకూర్ వర్గానికి చెందిన వారే. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా నేపథ్యంలో మేల్కొన్న బీజేపీ బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ, ఎస్పీ ఎమ్మెల్యే హరిఓంలను పార్టీలో చేర్చుకుంది. æ ఆటలో వేడి పెంచిన ఎస్పీ చేరికలపై బీజేపీ కమిటీ ఏర్పాటు చేసిన మరుక్షణమే వారికి షాక్ ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్లోనే ఆరుగురు బీఎస్పీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో ఆట మొదలు పెట్టిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ప్రస్తుతం మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ల రాజీనామాతో వేడి పెంచారు. స్వామి ప్రసాద్ సహా ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలు 14న ఎస్పీలో చేరే అవకాశం ఉంది. ఓబీసీ వర్గాల్లో స్వామి ప్రసాద్కు గట్టు పట్టు ఉండగా, మిగతా ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే వారే. వీరితో పాటు మరో 13 నుంచి 17 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా ఓబీసీ, రాజ్పుత్, బ్రాహ్మణ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ముస్లిం వర్గాల్లో గట్టి పట్టున్న ఇమ్రాన్ మసూద్ను ఎస్పీ చేర్చుకోగా, ఆయనతో పాటే ఇద్దరు ఎమ్మెల్యేలు నరేశ్ సైనీ, మసూద్ అక్తర్లో ఎస్పీలో చేరారు. 19 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు చీలకుండా ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీలలో మైనారిటీ నేతలందరినీ పార్టీలో చేర్చుకునేలా అఖిలేశ్ వ్యూహ రచన చేస్తున్నారు. -
ఆస్కార్ 2021: రెడ్ కార్పెట్ మీద హొయలు ఒలికించిన తారలు
-
బాలీవుడ్ భామలు .. లేత మెరుపు తీగలు
-
సైమా అవార్డ్స్ రెడ్ కార్పెట్
-
సోనమ్ సందడి
‘ఫ్యాషన్ ఐకాన్’ సోనమ్ కపూర్ ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కాన్స్ చలన చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్నారు. ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సోనమ్ ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ప్రతి ఏడాది కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఈసారి కూడా అలానే వెళ్లారు. దాంతో పాటు ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ‘చారిటీ డిన్నర్’లో కూడా పాల్గొన్నారామె. రెడ్ కార్పెట్పై అందంగా క్యాట్ వాక్ చేసి, అందర్నీ ఆకట్టుకున్నారు. అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్న పాకిస్తానీ యాక్ట్రెస్ మహీరా ఖాన్కు ఆత్మీయంగా ముద్దు పెట్టారు. 2011 నుంచి ప్రతి ఏడాదీ సోనమ్ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. మహీరా ఖాన్కి ఇదే ఫస్ట్ టైమ్. అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో మహీరా రెడ్ కార్పెట్పై అడుగులు వేసి, భేష్ అనిపించుకున్నారు. అన్నట్లు.. రేపు సోనమ్ ఇండియా వచ్చేస్తారు. -
కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఐశ్వర్య ప్రత్యేక ఆకర్షణ
-
కేన్స్లో మెరిసిన దీపిక పదుకొనె
-
తళుక్కుమన్న తారాలోకం
-
రెడ్ కార్పెట్పై సెల్ఫీలు బ్యాన్
ఒలంపిక్స్ తర్వాత అతిపెద్ద ఆకర్షణ గల వేడుక ఏదైనా ఉంది అంటే అది కేన్స్ ఫిలిం ఫెస్టివలే. ఏటా నిర్వహించే ఈ వేడుకలు ప్రపంచ దేశాల నుంచి నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు రెడ్కార్పెట్పై హోయల పోయేందుకు తహతహలాడుతుంటారు. ఆయా సినిమాల ప్రీమియర్ షో ప్రదర్శనలప్పుడు తాజా ఫ్యాషన్ను పరిచయం చేస్తూ నటీనటులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ. అయితే ఈ సారి కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ సెల్ఫీలను బ్యాన్ చేసేశారు. మే 8 నుంచి మే 17 వరకు జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు సంబంధించి కొత్త ప్రొటొకాల్స్ జారీ అయ్యాయి. ఈ ప్రొటోకాల్స్లో ప్రెస్ వారి కోసం నిర్వహించే మార్నింగ్ స్క్రీనింగ్లను తీసేశారు. దాంతో పాటు రెడ్కార్పెట్పై హోయల్ పోతూ.. నటీనటులు దిగే సెల్ఫీలను కూడా బ్యాన్ చేసినట్టు తెలిసింది. వెరైటీకి ఇచ్చిన డైరెక్టర్స్ ఇంటర్వ్యూలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రీమాక్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ప్రెస్ కోసం ఉదయం పూట ప్రదర్శించే సినిమాలను రద్దు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అతిథులతో పాటే, జర్నలిస్టులు, విమర్శకులు సినిమాలను సాయంత్రం సమయంలోనే చూడాల్సి ఉందన్నారు. రెడ్ కార్పెట్పై సెల్ఫీలను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘దీనిపై కొంతమంది ప్రతికూలంగా స్పందిస్తూ.. నిరసనలు చేయొచ్చు. కానీ 10 ఏళ్ల క్రితం అసలు సెల్ఫీలనేవే లేవు. ప్రపంచంలో ఇది అసలు అంత ముఖ్యమైన విషయమే కాదు. కేన్స్కు వెళ్లేది సినిమాలు చూడటానికి, సెల్ఫీలు తీసుకోవడానికి కాదు’ అని తెలిపారు. కాగ, మే 8 నుంచి అంగరంగ వైభవంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్లో జరుగబోతోంది. దీనిపై అధికారిక ఎంపిక ఏప్రిల్ 12న ప్రకటించనున్నారు. అంతకముందు దీన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్గా పిలిచేవారు. -
బ్లాక్ డ్రెస్కు రెడ్ కార్పెట్
‘మీ టూ’ హాష్ ట్యాగ్ ఉద్యమం వృ«థా కాలేదు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఫలితం కనిపించింది. రెడ్ కార్పెట్ ఆహ్వానాన్ని నలుపు దుస్తుల వస్త్రధారణ నిరసనగా మార్చింది. ప్రపంచాన్ని మొత్తం తనవైపు తిప్పుకునే íసినిమా అవార్డులు రెండే రెండు. ఒకటి ఆస్కార్, రెండు గోల్డెన్ గ్లోబ్! ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్స్టీన్ లైంగిక వేధింపుల గురించి మొదట ఓ బాధితురాలు ‘మీ టూ’ ఆన్లైన్ ఉద్యమంలో వెళ్లబోసుకుంది. అప్పటి నుంచి అతని మీదా, హాలీవుడ్ పరిశ్రమలో ఉన్న ఇలాంటి వేధింపుల మీదా మాట్లాడే ధైర్యాన్ని తెచ్చుకున్నారు బాధితులు. ఈ అరాచకాలను ఖండించడానికి, అణచివేయడానికి ఎలాంటి అవకాశం దొరికినా జారవిడుచుకోకూడదని ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోని మహిళలు ఒక ప్రమాణం చేసుకున్నట్టుంది! అందుకే హాలీవుడ్తో పాటు మొత్తం ఎంటర్టైన్మెంట్ మీడియాలో జరుగుతున్న ఈ అకృత్యాలకు.. హార్వీ వైన్స్టీన్, ఇంకా హాలీవుడ్లోని అలాంటి ప్రబుద్ధులకు వ్యతిరేకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన ప్రముఖులంతా నల్ల దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇది మంచి పరిణామం! ‘మీ టూ’ ఉద్యమం బలహీనపడకుండా ఊపిరిపోసే శుభ సంకేతం. -
అక్రమాలకు రెడ్కార్పెట్
– యథేచ్ఛగా నగరంలో అక్రమ కట్టడాలు – చేష్టలుడిగి చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అనంతపురం న్యూసిటీ : అధికార పార్టీ అండ.. టౌన్ ప్లానింగ్ అధికారుల బాధ్యతారాహిత్యంతో నగరంలో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల లోపాయికార ఒప్పందాలకు అధికార పార్టీ నేతల ప్రోత్సాహం తోడవడంతో అనధికార కట్టడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సుమారు వందకు పైగా అక్రమ కట్టడాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్థంగా తయారవుతున్న తరుణంలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి నగరాన్ని మరింత రద్దీ చేసేందుకు పాలకులు, అధికారులే కంకణం కట్టుకున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. బీపీఎస్తో లింక్ నగరంలో అక్రమ కట్టడాలకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)తో ముడిపెడుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రభుత్వం బీపీఎస్కు అనుమతి ఇస్తుందని అప్పటి వరకు ఏవిధంగా కట్టినా పర్వాలేదన్న ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా బిల్డర్లు, యజమానులు వారికి నచ్చినట్లు కట్టడాలు చేపడుతున్నారు. వాస్తవంగా 2014 డిసెంబర్లోపు నిర్మాణాలు చేపట్టిన వారికి ప్రభుత్వం బీపీఎస్ను ప్రవేశపెట్టింది. నగరంలో బీపీఎస్ కింద 1068 దరఖాస్తు చేసుకోగా అందులో 768 మంది క్లియరెన్స్ రాగా ఇంకా 300 వరకు పరిష్కారానికి నోచుకోలేదు. బీపీఎస్ క్లియర్ చేసుకోని వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సెల్లార్లకు రెడ్కార్పెట్ సెల్లార్లకు పూర్తీ స్థాయిలో అనుమతి లేదు. కమర్షియల్ ఆలోచనతో ఇష్టారాజ్యంగా సెల్లార్లు నిర్మిస్తున్నారు. కమర్షియల్కు 500 చదరపు అడుగులు (12 1/2 సెంట్లు) ఉంటే సెల్లార్కు అనుమతి ఉంటుంది. అదే రెసిడెన్షియల్కు 750 (18 1/2 సెంట్లు) చదరపు అడుగుంటే సెల్లార్కు అనుమతిస్తారు. అలాంటిది రెండు, మూడు సెంట్ల స్థలం ఉన్నా అందులో సెల్లార్లు నిర్మిస్తున్నారు. భారీ వర్షాలు వస్తే సెల్లార్ మునిగిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. 2016 జూన్ 27న కురిసిన భారీ వర్షంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ సెల్లార్ మునిగిపోవడం దీనికి చక్కది ఉదాహరణ. అన్నీ అతిక్రమణలే.. నగరంలో భవన అతిక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు సాక్షాత్తు కమిషనర్ పీవీవీఎస్ మూర్తినే చెబుతున్నారు. ఇలాంటివి ప్రధాన ప్రాంతాల్లోనే 31 మంది భవనాలను గుర్తించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలకు చెక్ పెడుతాం – పీవీవీఎస్ మూర్తి , కమిషనర్ నగరంలో అక్రమ నిర్మాణాలున్న మాట వాస్తవమే. కొందరు ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇలాంటి కట్టడాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. త్వరలోనే అక్రమ నిర్మాణాలకు చెక్ పెడతాం. -
కళకళలాడిన కేన్స్
-
తొలిసారిగా ఓ ముస్లిం నటుడికి ఆస్కార్
-
2017 ఆస్కార్ విజేతలు
లాస్ఏంజిల్స్: చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. డాల్బీ థియెటర్లో జరుగుతున్న ఈ 89వ ఆస్కార్ అవార్డుల వేడుకకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఉత్తమ సహాయనటుడు విభాగంలో పోటీపడిన దేవ్ పటేల్కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో మూన్లైట్ చిత్రంలో నటించిన మహేర్షాలా అలీని అవార్డు వరించింది. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి ముస్లిం నటుడు మహేర్షాలా అలీనే కావడం విశేషం. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ను విధించిన నేపథ్యంలో.. మహేర్షాలా ఆస్కార్ గెలవడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 2017 ఆస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం: మూన్లైట్ ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ) ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్) ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా లాండ్) ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ(మూన్లైట్) ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్(ఫెన్సెస్) ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్ట్స్ ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: హాక్సారిడ్జ్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్మ్యాన్(ఇరాన్) బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ద జంగిల్ బుక్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్ బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా లాండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్( లా లా లాండ్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే: మాంచెస్టర్ బై ద సీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: మూన్లైట్ మహేర్షాల అలీ -
విదేశీ ఇన్వెస్టర్లకు రెడ్కార్పెట్!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లకు నిబంధనలను మరింత సరళతరం చేయడంపై సెబీ దృష్టిసారించింది. ప్రధానంగా దేశీ క్యాపిటల్ మార్కెట్లో కొన్ని విభాగాలకు చెందిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ)కు నేరుగా ట్రేడింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ముందుగా డెట్ మార్కెట్లో(బాండ్స్) ఇందుకు అనుమతించి... క్రమంగా ఈక్విటీ మార్కెట్లకూ వర్తింపజేయనున్నట్లు సెబీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై నేడు(శుక్రవారం) జరగనున్న బోర్డు సమావేశంలో సెబీ చర్చించనున్నట్లు సమాచారం. ఎఫ్పీఐలకు ఈ అనుమతులపై సెబీ ముందుగా చర్చాపత్రాన్ని విడుదల చేయనుందని.. వివిధ పక్షాల నుంచి అభిప్రాయాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎఫ్పీఐలు భారత్ మార్కెట్లో దేశీ స్టాక్ బ్రోకర్ల ద్వారా ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు.కాగా, కేటగిరీ-1, 2 ఎఫ్పీఐలకు సెబీ ఈ ప్రత్యక్ష ట్రేడింగ్ అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో సావరీన్ వెల్త్ ఫండ్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇక కేటగిరీ-2లో మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులకు చోటుంది. అయితే, హెడ్జ్ ఫండ్స్, వ్యక్తిగత ఇన్వెస్టర్లతోపాటు ఇతర హై-రిస్క్ విదేశీ ఇన్వెస్టర్లకు ఈ సదుపాయం లేనట్టే. ప్రధానంగా దేశీ క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ నిధులను మరింత వెల్లువెత్తేలా చేయడమే సెబీ తాజా ప్రతిపాదనల ఉద్దేశం. అయితే, ఇది దేశీ బ్రోకరేజి సంస్థల మనుగడపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సెబీవద్ద రిజిస్టర్ అయిన ఎఫ్పీఐలు ఇప్పటివరకూ దేశీ మార్కెట్లో రూ.11.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో రూ.8.45 లక్షల కోట్లు ఈక్విటీ(స్టాక్స్)ల్లో, రూ.3.06 లక్షల కోట్లు బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. చర్చించనున్న ఇతర ప్రతిపాదనలు... * కంపెనీలు నాన్-ప్రమోటర్ల(ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్)కు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు మైనారిటీ ఇన్వెస్టర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. * రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు(ఇన్విట్స్)లో పెట్టుబడులకు మరింత సరళతరమైన నిబంధనలు. ఇప్పటికే దీనిపై సంప్రతింపుల ప్రక్రియ కొనసాగుతోంది. 2014లో వీటిని సెబీ నోటిఫై చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ ట్రస్ట్ల ఏర్పాటు, వీటిని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడానికి దారులుతెరిచింది. * స్టార్టప్ల లిస్టింగ్ నిబంధనల సరళతరం. 2015 ఆగస్టులో సెబీ దీన్ని అమల్లోకి తీసుకురాగా, ఇప్పటివరకూ ఒక్క స్టార్టప్ కూడా లిస్ట్ కాలేదు. -
ఎఫ్డీఐలకు రెడ్ కార్పెట్..
పౌర విమానయానం,ఆహార రంగంలో 100%కి పెంపు * రక్షణ, ఫార్మా రంగాల్లో ఎఫ్డీఐల నిబంధనలకు సడలింపు * ఫలించిన యాపిల్ కృషి... దుకాణాల ఏర్పాటుకు తొలగిన అడ్డంకి న్యూఢిల్లీ: మోదీ సర్కారు మరోమారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. రక్షణ, పౌర విమానయాన, ఫార్మా, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ ఎఫ్డీఐ నిబంధనలను సరళీకరించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో జరిగిన అత్యున్నత సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ రెండో విడత ఆ బాధ్యతలు చేపట్టడం లేదంటూ ప్రకటించిన రెండు రోజులకే... వృద్ధి దిశగా సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో తాము సానుకూలంగానే ఉన్నట్టు మోదీ సర్కారు పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో యాపిల్ కంపెనీ స్టోర్లు ప్రారంభించేందుకు కూడా మార్గం సుగమం అయింది. ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్, శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటికే టీవీ ప్రసారాలు అందించే సంస్థల్లో (డీటీహెచ్), కేబుల్ టీవీ ప్రసారాలు, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, జంతు, మత్స్య పరిశ్రమల వృద్ధి దిశగా నూరు శాతం ఎఫ్డీఐలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్డీఐలకు సర్కారు ద్వారాలు తెరిచినట్టయింది. తాజా నిర్ణయంతో భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఓపెన్ మార్కెట్గా మారిందని ప్రధాని కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, దేశంలో ఉద్యోగావకాశాల కల్పన దిశగా ఎఫ్డీఐ విధానాన్ని మరింత సరళీకరించాలని ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం గతేడాది నవంబర్లో ఎఫ్డీఐ విధానాన్ని గణనీయంగా సరళీకరించగా.. తాజాగా రెండోసారి అదే స్థాయిలో నిబంధనలను సులభతరం చేస్తూ సంస్కరణలను వేగవంతం చేసింది. ఫార్మా రంగానికి ఊతం దేశీయ ఫార్మా రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే దిశగా ఆటోమేటిక్ మార్గంలో 74 శాతం ఎఫ్డీఐలకు సర్కారు పచ్చజెండా ఊపింది. దీంతో విదేశీ సంస్థలు భారతీయ ఫార్మా కంపెనీల్లో (బ్రౌన్ఫీల్డ్) ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏకంగా 74 శాతం వాటా వరకూ సొంతం చేసుకోవచ్చు. అంతకుమించి 100 శాతం వరకు వాటాల కొనుగోలుకు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. ఇంతకుముందు కూడా దేశీయ ఫార్మా కంపెనీల్లో 100 శాతం ఎఫ్డీఐలకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ అనుమతి తప్పకుండా తీసుకోవాలనే నిబంధన ఉంది. తాజాగా దాన్ని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇక గ్రీన్ ఫీల్డ్ ఫార్మా (నూతనంగా ఏర్పాటు చేసే) కంపెనీల్లో ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్డీఐలకు గతంలోనే ప్రభుత్వం అనుమతించింది. దేశీయ ఫార్మా కంపెనీలను విదేశీ కంపెనీలు హస్తగతం చేసుకుంటుండడంతో ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆటోమేటిక్ మార్గంలో ప్రభుత్వం 74 శాతం వరకు దారులు తెరిచింది. ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్లో 100 శాతం ఎఫ్డీఐ ఈ కామర్స్ వేదికలు సహా ఇతర మార్గాల్లో ఆహారోత్పత్తుల ట్రేడింగ్కు సంబంధించి కూడా నూరు శాతం ఎఫ్డీఐలకు సర్కారు ద్వారాలు తెరిచింది. ఇందుకు గాను ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2012 ఏప్రిల్ నుంచి 2015 డిసెంబర్ మధ్య దేశీయ ఆహారశుద్ధి రంగం 528 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలను ఆకర్షించిన విషయం గమనార్హం. రక్షణలో ఆధునికత రక్షణ రంగంలో 49 శాతానికి మించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించడం అన్నది ప్రస్తుతం ఆయా ప్రతిపాదనలపై ఆధారపడి ఉంది. ఈ నిబంధనల్లో ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. అత్యాధునిక, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించినది అయితే, ప్రభుత్వం అనుమతితో భారత కంపెనీలతో కలసి సంయుక్త భాగస్వామ్య కంపెనీలో 49 శాతానికి మించి ఎఫ్డీఐలకు అవకాశం కల్పించింది. దేశీయ చిన్నతరహా ఆయుధాలు, మందుగుండు సామగ్రి కంపెనీలకు కూడా ఈ అవకాశం కల్పించింది. పౌర విమానయానంలో నూరు శాతం ఎఫ్డీఐలు..! దేశీయ విమానయాన సంస్థల్లో విదేశీ సంస్థలు 100% వాటా కొనుగోలుకు మార్గం సుగమం అయింది. షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ (ప్రయాణ, కార్గో సేవలు అందించేవి)/ దేశీయ షెడ్యూల్డ్ పౌర విమానయాన సేవల కంపెనీలు, ప్రాంతీయ విమాన సేవల సంస్థల్లో 100% ఎఫ్డీఐలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే, విదేశీ విమానయాన కంపెనీలకు ఈ అవకాశం లేదు. వేరే రంగాలకు చెందిన కంపెనీలకే ఈ వెసులుబాటు కల్పించారు. 49% ఆటోమేటిక్ మార్గంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంతకు మించితే మాత్రం ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ షెడ్యూల్డ్ విమానయాన సేవల్లో 49% వరకే ఎఫ్డీఐలకు అవకాశం ఉంది. డీటీహెచ్, కేబుల్ టీవీల్లో... ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల్లో ఇప్పటి వరకు 49 శాతం ప్రభుత్వ అనుమతితో ఎఫ్డీఐలకు అవకాశం ఉంది. దీన్ని ఆటోమేటిక్ విధానంలో74 శాతం వరకు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ మార్గంలో టెలివిజన్ ప్రసారాల సేవల విభాగాల్లోనూ 100 శాతం ఎఫ్డీఐలకు సర్కారు అనుమతించింది. డీటీహెచ్, కేబుల్ నెట్వర్క్లు, మొబైల్టీవీలు, టెలిపోర్టుల సేవల్లో 49 శాతానికి మించి తాజాగా చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధిత శాఖ అనుమతి గానీ, లెసైన్స్ గానీ అవసరం లేదని సర్కారు స్పష్టం చేసింది. అయితే, యాజమాన్యం చేతులు మారుతున్నా, ప్రస్తుత వాటాదారు నుంచి ఆ వాటా విదేశీ పెట్టుబడిదారుడి చేతికి వెళుతున్నా ఎఫ్ఐపీబీ అనుమతి తీసుకోవాలని పేర్కొంది. రక్షణ, టెలికామ్, ప్రైవేటు సెక్యూరిటీ లేదా సమాచార ప్రసారాలకు సంబంధించిన వ్యవహారాల్లో విదేశీ కంపెనీలు శాఖల ఏర్పాటుకు భద్రతా పరమైన క్లియరెన్స్ లేదా ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్న నిబంధన ప్రస్తుతం ఉంది. దీని స్థానంలో ఎఫ్ఐపీబీ లేదా సంబంధిత శాఖ లేదా నియంత్రణ సంస్థల అనుమతిని అమల్లోకి తీసుకురానుంది. జంతు సంరక్షణ రంగానికి సంబంధించి కఠిన నియంత్రణలనూ పక్కన పెట్టాలని సర్కారు నిర్ణయించింది. యాపిల్ స్టోర్లకు లైన్ క్లియర్ యాపిల్ తన సొంత దుకాణాలను భారతీయ మార్కెట్లో ప్రారంభించేందుకు వీలుగా కేంద్రం సింగిల్ బ్రాండ్ రిటైల్ నిబంధనలను సడలించింది. దేశంలో సింగిల్ బ్రాండ్ (ఒకే బ్రాండ్ పేరుతో దుకాణాలు) పేరుతో ఏర్పాటు చేసే దుకాణాలు స్థానికంగానే 30 శాతం వరకు ముడిసరుకులు సమకూర్చుకోవాలన్న నిబంధనకు మూడేళ్ల మినహాయింపు కల్పించింది. అలాగే, స్టేట్ ఆఫ్ ఆర్ట్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీల (ప్రత్యేకమైన సాంకేతికతతో ఉన్నవి)కు ఐదేళ్ల సడలింపు ఇచ్చింది. తమ ఉత్పత్తులు అత్యున్నత సాంకేతికతతో కూడినవని, స్థానికంగానే ముడిసరుకులు సమకూర్చుకోవాలనే నిబంధనను సడలించాలంటూ యాపిల్ కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. యాపిల్ సీఈవో టిమ్కుక్ ఇటీవల భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతోనూ ఇదే విషయమై చర్చలు జరిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో యాపిల్ సహా ఇతర విదేశీ రిటెయిల్ కంపెనీలు భారత్లో స్టోర్లను ప్రారంభించేందుకు మార్గం సుగమం అయింది. ఉద్యోగాల సృష్టికే... ప్రభుత్వ తాజా ప్రయత్నాల వల్ల ప్రపంచంలో ఎఫ్డీఐలకు మరింతగా ద్వారాలు తెరిచిన ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందుతుంది. వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుంది. దేశంలో ఉద్యోగాలు సృష్టించాలనే దృష్టితో ప్రభుత్వం విప్లవాత్మకంగా ఎఫ్డీఐ విధానాన్ని సరళీకృతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. - ట్విట్టర్లో ప్రధాని మోదీ రెగ్జిట్తో సంబంధం లేదు... రాజన్ ఆర్బీఐని వీడి వెళుతున్నందున తీసుకున్న నిర్ణయాలు కావు ఇవి. ఎఫ్డీఐ సంస్కరణలపై కొన్ని నెల లుగా కార్యాచరణ జరిగింది. ఈ పనంతా ఒక్కరోజులో పూర్తి అవుతుందా? - వాణిజ్య మంత్రి, నిర్మలా సీతారామన్ పెట్టుబడుల ఆకర్షణ... పౌరవిమానయానం, ఫార్మా, రక్షణ, సింగిల్ బ్రాం డ్ రిటైల్ రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను సరళీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఉద్యోగాల సృష్టికి వీలు కల్పిస్తుంది. - చంద్రజిత్ బెనర్జీ, డైరక్టర్, సీఐఐ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం... పౌరవిమానయానం, రక్షణ రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనల సరళీకరణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సానుకూలం. - దిదార్ సింగ్, సెక్రటరీ జనరల్, ఫిక్కీ రక్షణ రంగానికి ఊపు... రక్షణ రంగంలోకి అత్యాధునిక సాంకేతికతను, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు నిర్ణయాలు ఉపకరిస్తాయి. - డీఎస్ రావత్, సెక్రటరీ జనరల్, అసోచామ్ రాజనే కారణం... ఎఫ్డీఐల విషయంలో కేం ద్రం నిర్ణయాలు భయాందోళన కారణంగా తీసుకున్నవే. రాజన్ ప్రకటన రాకుంటే ప్రభుత్వం నుంచి కూడా ఈ నిర్ణయాలు వచ్చి ఉండేవి కావు. - జైరాం రమేశ్, కేంద్ర మాజీ మంత్రి -
ఆయనకు అరవై... ఆమెకు ఇరవై అయిదు... కెమిస్ట్రీ అదుర్స్!
ముగిసిన కాన్స్ చలన చిత్రోత్సవాలు ఉత్తమ చిత్రం: ‘ఐ, డేనియల్ బ్లేక్ ఉత్తమ దర్శకుడు: ఒలీవియర్ అసయస్ ఉత్తమ నటుడు : షాహెబ్ హొస్సేని ఉత్తమ నటి: జాక్లెన్ జోస్ ఫ్రాన్స్ నగరంలోని ఫ్రెంచ్ రివెరియా తీరంలో ఈ నెల 11న ఆరంభమైన కాన్స్ చలన చిత్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. విదేశీ తారలతో పాటు మన దేశీ తారలు కూడా పాల్గొన్న ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ని ఆకట్టుకున్నాయి. అవార్డు విజేతల వదనాల్లో ఆనందం వెల్లివిరిసింది. రెడ్ కార్పెట్ పై తారలు చేసిన సందడికి కొదవ లేకుండా పోయింది. మొత్తం మీద ముగింపు ఉత్సవాలు కనువిందుగా జరిగాయి. కొన్ని మెరుపులూ, విరుపులూ ఈ విధంగా... ♦ ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘పామ్ డ ఓర్’ (గోల్డెన్ పామ్) అవార్డు ‘ఐ, డేనియల్ బ్లేక్’ చిత్రాన్ని వరించింది. కెన్ లోచ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. పదేళ్ల క్రితం ఇదే దర్శకుడు తీసిన ‘ద విండ్ దట్ షేక్స్ ద బార్లీ’ చిత్రానికి ఇదే అవార్డు వచ్చింది. రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్న తొమ్మిదో ఫిలిం మేకర్గా కెన్ రికార్డు సాధించారు. చిత్రోత్సవాల ముగింపు చిత్రంగా కూడా ‘ఐ, డేనియల్ బ్లేక్’ ప్రదర్శితమైంది. ♦ చివరి రోజు ఉత్సవాల్లో ప్రధానంగా ఓ జంట అందర్నీ ఆకట్టుకుంది. నలుపు రంగు సూటూ బూటూ ధరించి, 60 ఏళ్ల నటుడు-దర్శకుడు మెల్ గిబ్సన్ తన 25 ఏళ్ల గాళ్ఫ్రెండ్, నటి రోసలిండ్ రోజ్తో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని రెడ్ కార్పెట్పై వాక్ చేశారు. అది మాత్రమే కాకుండా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను బహిరంగంగా బయటపెట్టారు. ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకునే సీన్ని కెమెరా కళ్లు క్లిక్మనిపించాయి. ♦ మాజీ ప్రేమికులైన నటుడు సీన్ పెన్, నటి చార్లెస్ థెరాన్ ఈ వేడుకల్లో అందరూ ఊహించినట్లుగా ఎడమొహం పెడ మొహంగా వ్యవహరించారు. ప్రేమికులుగా ఉన్నప్పుడు ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘ద లాస్ట్ ఫేస్’ చిత్రాన్ని విడిపోయాక జాయింట్గా ప్రమోట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇబ్బందిపడ్డారు. ఇద్దరూ ‘హలో’ చెప్పుకున్న విధానం నలుగురూ మాట్లాడుకునేంత అసహ్యంగా అనిపించిందట. తమ చిత్రం ప్రదర్శితమయ్యాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయేటప్పుడు చిన్న హగ్ ఇచ్చుకుని, టాటా చెప్పేసుకున్నారు. ♦ ఇక.. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవారిలో ఎరిన్ మొరియార్టి, కిరిస్టన్ డన్ట్స్, ఎలెజాండ్రా ఆంబ్రోసియో, ఐసబెలి ఫోంటేనా, క్యాట్రినెల్ మార్లన్, ఇరీనా షేక్ తదితరులు ఉన్నారు. -
బంగారు వర్ణం గౌనులో మెరిసిన ఐశ్వర్యరాయ్
-
అందమైన భామలు... లేత మెరుపు తీగలు...
ఇంత పొడవాటి గౌనులు వేసుకుని అంత అందంగా ఎలా నడుస్తారు? పైగా ఎత్తు మడమల చెప్పులతో అంత వయ్యారంగా ఎలా వాక్ చేస్తున్నారు? మెడ, చెవులనంటి పెట్టుకున్న ఆ ఆభరణాలు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాయి.. అని కాన్స్ చలనచిత్రోత్సవాల్లో పాల్గొంటున్న అందాల తారల గురించి అనుకోని వారుండరు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న ఈ ఉత్సవాలపైనే అందరి దృష్టి. ఈ వేడుకల్లో పాల్గొంటున్న తారల తళుకులను చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదని సౌందర్యారాధకులు మురిసిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకూ ఆడవాళ్లందరూ పొడవాటి గౌను, ఎత్తు మడమ చెప్పులు, వజ్రాభరణాలు ధరించి, ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఎర్ర తివాచీపై ఈ తారలు చేసే క్యాట్ వాక్ని కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు తెగ తాపత్రయపడిపోతారు. అందుకే, పొరపాటున గౌను తొలగినా, ఎవరైనా జారి పడినా కెమెరా కన్ను నుంచి తప్పించుకోలేరు. గురువారం ప్రముఖ అందాల తార జూలియా రాబర్ట్స్ అలా ఓ విషయంలో కెమెరాలకు దొరికిపోయారు. అదేంటంటే... ‘జూలియా.. వాటె కలర్ యార్’ అనుకునే రేంజ్లో తెల్లగా ఉంటారీ బ్యూటీ. నలుపు రంగు గౌనులో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు జూలియా. ఆ గౌనులో ఆమె తెల్లని దేహం మెరిసిపోయింది. వజ్రాల కంఠాభరణం మినహా ఒంటి మీద వేరే ఏ ఆభరణం లేకపోయినా ఆమె తళుకులీనారు. ఎత్తు మడమ చెప్పులతో వచ్చిన జూలియా మెట్లు ఎక్కేటప్పుడు జారి పడిపోతానని భయపడ్డారేమో. వాటిని విడిచేసి, వట్టి కాళ్లతో మెట్లెక్కేశారు. రెప్పపాటులో జరిగిపోయిన ఈ తతంగాన్ని కెమెరా కళ్లు క్యాప్చర్ చేసేశాయి. మెట్లెక్కేసిన తర్వాత సహాయకుడు చెప్పులు తెస్తే, తొడుక్కున్నారామె. ఇదో విషయమా అనుకునేరు. మామూలుగా ఇలాంటి పెద్ద పెద్ద వేడుకలకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆడవాళ్లేమో లాంగ్ ఫ్రాక్స్, హై హీల్స్ వేసుకోవాలి. మగవాళ్లు సూటూ, బూటూ ధరించాల్సిందే. గతేడాది కొంతమంది తారలు ఎత్తు మడమ చెప్పులు కాకుండా ఫ్లాట్స్ వేసుకుని వస్తే, అనుమతించలేదు. వాళ్లు వెనుతిరగాల్సి వచ్చింది. అలాంటిది జూలియా వట్టి కాళ్లతో మెట్లెక్కితే ఊరుకుంటారా?.. ఊరుకున్నారు. ఎందుకంటే ఆమె జూలియా రాబర్ట్స్ కాబట్టి. ఏదేమైనా ఇంట్లో ఉన్నప్పుడు జూలియా కాళ్లను చెప్పులు అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే పాదరక్షలు లేకుండా ఆమె కాసేపే నడిచినా పెద్ద టాపిక్ అయ్యింది. అయ్యో పాపం... అమల్! నటుడు జార్జ్ క్లూనే సతీమణి, నటి అమల్ క్లూనే పాపం ఇబ్బందిపడే పరిస్థితి తెచ్చుకున్నారు. భర్త చెయ్యి పట్టుకుని అందంగా నడుచుకుంటూ వచ్చిన అమల్ పొరపాటున తన పొడవాటి గౌను పైన కాలు వేశారు. రెండు చీలికల్లా డిజైన్ చేయబడిన ఆ గౌను అటూ ఇటూ కావడంతో అమల్ ఇబ్బందిపడిపోయారు. కంగారుగా గౌను సర్దుకుని, పాలిపోయిన మొహంతో ముందుకు సాగారామె. ఊడీ... పరమ మూడీ! రసవత్తరంగా జరుగుతున్న వేడుకల్లో ఆనందపడేవాళ్లూ, అలిగే వాళ్లూ ఉంటారు. అలా దర్శకుడు ఊడీ అలెన్ అలిగారు. తన కుమార్తె ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెపై ఊడీ అత్యాచారం చేశారనే అభియోగం ఉంది. ఈ విషయం గురించి వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫ్రెంచ్ హాస్యనటుడు లారెంట్ లఫిట్టె జోక్ చేశారు. యూరోపియన్ దర్శకుడు రోమన్ పొలాన్స్కీతో ఊడీని పోల్చారు లఫిట్టె. రోమన్ తన 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచార ప్రయత్నం చేసిన విషయం బయటకు రావడంతో, అభియోగాలు భరించలేక ఆయన ఏకంగా యూఎస్ నుంచి యూరోప్ పారిపోయి అక్కడ సినిమాలు చేసుకుంటున్నారనీ, ‘మరి మీ మీద అత్యాచార ఆరోపణలు నిర్ధారణ కాకపోయినా సరే మీరెందుకు రోమన్లా యూరోప్లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అని లఫిట్టె చమత్కరించడంతో ఊడీ మొహం ఎర్రబారింది. లఫిట్టె మాటల్లో గూఢార్థం ఉంది. ఊడీ అత్యాచార యత్నం చేశారు కాబట్టే, యూఎస్లో ఎక్కువ సినిమాలు చేయడంలేదన్న భావం వ్యాఖ్యాత మాటల్లో కనపడింది. అది విని కొంతమంది నవ్వేసరికి, ఊడీ ముఖం కందగడ్డలా మారింది. లఫిట్టె ఇలా ‘రేప్ జోక్’ చేయడం కొంతమందికి అస్సలు నచ్చలేదు. కొందరు హాలీవుడ్ నటీమణులు బాహాటంగానే అతణ్ణి విమర్శించారు. దాంతో ఊడీ మనసు కొంచెం శాంతించి ఉంటుంది. ఇదిలా ఉంటే... గురువారం ఈ వేడుకలకు హాజరైనవారిలో... నటీమణులు అన్నా కెండ్రిక్, చెరిల్ కోల్, నయోమీ వాట్స్, జెస్సికా చేస్టైన్, క్రిస్టెన్ స్టీవాట్ తదితరులు ఉన్నారు. -
రెడ్ కార్పెట్పై ఎమీ జాక్సన్!
ప్రతిష్ఠాత్మకమైన ‘కాన్స్ చలనచిత్రోత్సవం’ ఈసారి కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సహజంగానే ఈసారి అక్కడ ‘రెడ్ కార్పెట్’పై అందాలు ఒలికించే భారతీయ తారలు ఎవరని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ప్రముఖ హీరోయిన్లు ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనమ్ కపూర్లు ఈ తడవ కూడా ‘కాన్స్’లో సందడి చేయనున్నారు. కాగా ప్రముఖ బ్రిటీష్ మోడల్, నటి అయిన ఎమీ జాక్సన్ కూడా ఆ జాబితాలో చేరుతున్నారు. ఇప్పటికే తెలుగులో రామ్చరణ్ ‘ఎవడు’తో సహా తమిళంలో ‘ఐ’, ఇటీవలి ‘తంగమగన్’ (తెలుగులో ‘నవ మన్మథుడు’), ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’), రానున్న ‘2.0’ (రోబో-2) లాంటి చాలా సినిమాలతో ఎమీ మన దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచితమే. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని ఈ అందాల రాశి ప్రస్తుతం ఒక పక్క షూటింగ్, మరోపక్క ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో భోజన సమావేశానికి హాజరై, తన హిందీ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతున్న ఆమె సిరియా శరణార్థుల కోసం ఒక సహాయ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. వీటన్నిటి మధ్యనే ‘కాన్స్’ ఉత్సవంలోనూ మెరిసేందుకు తీరిక చేసుకుంటున్నారు. ఇంతకీ, అంతర్జాతీయ సినీ ప్రముఖులందరూ విచ్చేసే ‘కాన్స్’ వేడుక కోసం ఏ దుస్తులు వేసుకోవాలన్నది ఎమీ ఇంకా నిర్ణయించుకోలేదట! రిస్క్ తీసుకోవడానికి సిద్ధమనీ, ఈ వేడుక కోసం దాదాపు పాతిక నుంచి 30 దాకా దుస్తులు తయారు చేయించుకుంటున్నాననీ ఎమీ అంటున్నారు. అవును మరి... అందరి ముందూ అందంతో మెరిసిపోవాలంటే, ఆ మాత్రం హంగామా ఉండాల్సిందే కదూ! -
కన్నీళ్లు.. కరతాళ ధ్వనుల మధ్య లేడీ గగా!
ఆస్కార్ వేడుకల్లో ఎమోషనల్ మూమెంట్స్ అనదగ్గవాటిలో లేడీ గగా పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కాలేజీ క్యాంపస్లలో జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో రూపొందించిన ‘ది హంటింగ్ గ్రౌండ్’ అనే లఘు చిత్రంలోని ‘టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు’ అనే పాటను ఆమె పాడారు. డాయనె వారెన్ అనే రచయితతో కలిసి లేడీ గగా ఈ పాట రాసి, పాడి, నటించారు. ఈ పాట ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. పాట పాడుతూ చివర్లో కన్నీటి పర్యంతమైన గగాకి, చెమర్చిన కళ్లతో, కరతాళ ధ్వనులతో వీక్షకులు అభినందనలు తెలియజేశారు. గగా ఈ పాట పాడే ముందు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మాట్లాడుతూ- ‘‘ఆడవాళ్లపై మాత్రమే కాదు.. మగవాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వీటిపై ప్రతి విద్యార్థీ పోరాడాలి. మనందరం ఈ దాడులను అంతం చేయడానికి నడుం బిగిస్తే, బాధితులే ఉండరు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు. అంతకుముందు రెడ్ కార్పెట్పై గగా మాట్లాడతూ - ‘‘ఐదుగురు అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి, 20మంది అబ్బాయిల్లో ఒక్క అబ్బాయి చదువు పూర్తి చేసేలోపే లైంగిక వేధింపులకు గురవుతాడు’’ అని పేర్కొన్నారు. 19 ఏళ్ల వయసులో తనపై జరిగిన అత్యాచారాన్ని గుర్తు చేసుకుంటూ గగా ఈ మాటలు మాట్లాడినట్లుగా అనిపించింది. ఆ చేదు సంఘటన తాలూకు బాధ ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. -
పర్ఫెక్ట్ పోజుతో ప్రియాంక హల్ చల్
లాస్ ఏంజిల్స్: ఆస్కార్ వేదికపై బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అదరగొట్టింది. వైట్ షౌల్డర్ గౌనులో స్టన్నింగ్ లుక్ తో దర్శనమిచ్చిన ప్రియాంక 88వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గోల్డెన్ బ్రౌన్ స్మోకీ ఐస్, స్ట్రాప్ లెస్ వైటు గౌనుతో రెడ్ కార్పెట్ మీద పర్ఫెక్ట్ పోజు అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఈ మాజీ మిస్ వరల్డ్ కనిపించింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఈ అమ్మడు ఈ సందర్భంగా అక్కడే ఉన్న యాకంర్ తో సరదాగా ముచ్చటించింది. బాలీవుడ్ కు , హాలీవుడ్ కు పెద్దగా తేడా లేదని, రెండూ కూడా అత్యద్భుతంగా దూసుకుపోతున్నాయని పేర్కొంది. మరి రెడ్ కార్పెట్ మీద పర్ఫెక్ట్ పోజు ఎలా ఉండాలని అడిగితే.. ఈ 'క్వాటింకో' బ్యూటీ 'ఎస్' (S) ఆకృతిలో సోయగంగా ఒదిగిపోయి.. ఇదిగో ఇలా ఉంటూ చూపించింది. ఇప్పటికే ఏబీసీ టీవీ థ్రిల్లర్ షో 'క్వాంటికో'లో నటించడం ద్వారా ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యింది. త్వరలో 'బే వాచ్' సినిమాలో నటించడం ద్వారా హాలీవుడ్ చిత్రసీమకు పరిచయం కాబోతున్నది. 'పీపుల్స్ చాయిస్ అవార్డు' అందుకున్న తొలి బాలీవుడ్ పర్సన్ అయిన ప్రియాంక హాలీవుడ్ సినీ దిగ్గజాలతో కలిసి ఆస్కార్ వేదికపై విజేతలకు అవార్డులు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నది. -
అవార్డులు మీ తెల్లవాళ్లకేనా?
లండన్: హాలీవుడ్ చిత్రపరిశ్రమలో తెల్లజాతీయులు, పురుషుల ఆధిపత్యమే సర్వత్రా రాజ్యమేలుతుండటం ఇప్పుడు పెద్ద వివాదమే రేపుతోంది. హాలీవుడ్లో భిన్నత్వమే లేకపోవడం, నల్లజాతీయులకు, మహిళలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఇప్పుడు నిరసన వ్యక్తమవుతోంది. అవార్డుల ప్రదానోత్సవంలోనూ ఈ వివక్ష కొట్టొచ్చినట్టు కనబడుతుండటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హాలీవుడ్లోని ఈ వివక్షను వ్యతిరేకిస్తూ క్రియేటివ్ ఆఫ్ కలర్ నెట్వర్క్ గ్రూప్ అనే హక్కుల సంస్థ.. బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనకు 'ఎలియన్ 3' నటుడు లియోన్ హెర్బర్ట్ నేతృత్వం వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఉద్యమకారులు నలుపు, తెలుపు దుస్తులు ధరించి.. 'లైట్, యాక్షన్, డైవర్సిటీ' అంటూ నినాదాలు చేశారు. బాఫ్టా మాస్కులతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. లండన్లోని రాయల్ ఓపెరా హౌస్ బయట ఈ నిరసన ప్రదర్శన ప్రశాంతంగా జరిగింది. హాలీవుడ్ సినిమా/టీవీ పరిశ్రమలో అందరికీ అవకాశాల కల్పన, భిన్నత్వం లేకపోవడం పట్ల 1990 నుంచి ఉద్యమం జరుగుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదని, బాఫ్టా అవార్డుల నామినేషన్ల విషయంలోనూ నల్లజాతి కళాకారులకు అన్యాయమే జరిగిందని, ఏదో నామమాత్రంగా వారికి నామినేషన్లు ప్రకటించారని ఉద్యమకారులు తమ ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. -
రెడ్ కార్పెట్పై లేడి గాగా ఘాటు ముద్దు!
ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా పాప్ సింగర్ లేడీ గాగా, ఆమె ఫియాన్సీ టైలర్ కిన్నీ సందడి చేశారు. ఇటీవల 'వీ' మ్యాగజైన్ కోసం పూర్తి నగ్నంగా పోజిచ్చి.. సంచలనం సృష్టించిన ఈ జంట గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్పై కలిసి నడిచింది. ఈ సందర్భంగా ఇరువురు పెదవులు కలుపుతూ ఓ ముద్దు పెట్టుకొని తమ మధ్య అనుబంధాన్ని చాటుకున్నారు. తన సహజ ధోరణికి కాస్త భిన్నంగా నలుపు రంగు దుస్తుల్లో చూడచక్కగా ముస్తాబై లేడీ గాగా ఈ కార్యక్రమానికి హాజరైంది. అన్నట్టు గోల్డెన్ గ్లోబ్ ప్రదానోత్సవంలో లేడీ గాగాను కూడా ఓ పురస్కారం వరించింది. అమెరికన్ హర్రర్ స్టోరీ 'హోటల్'లో నటించినందుకు టీవీ మూవీ కేటగిరీలో ఉత్తమ నటి అవార్డు ఆమెకు దక్కింది. KISS ME DAMN IT @TaylorKinney111 @ladygaga #GoldenGlobes pic.twitter.com/oZSuOEPro5 — Scoopla (@Scoopla) January 11, 2016 -
ఆమెకది అలవాటేనట!
మాడ్రిడ్: హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ మరోసారి కాలు జారింది. ప్రఖ్యాత అమెరికన్ రచయిత సుజానే కోలిన్స్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సిరీస్ 'ద హంగర్ గేమ్స్.. మాకింగ్ జే పార్ట్ 2' మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె కాలు జారి పడిపోయింది. పొడవాటి తెల్లగౌనులో మెరిసిపోతూ మెట్లు ఎక్కుతున్నపుడు తడబడిందో, హైహీల్స్ మూలంగా బ్యాలెన్స్ తప్పిందో ఏమో తెలియదుకానీ, కాలు జారి కింద పడిందట. వెంటనే తేరుకుని గాల్లో చేతులు ఊపుతూ అభిమానులను నవ్వుతూ పలకరించిందట. ముద్దుగుమ్మ కిందపోయిన ఈ వీడియో ఇపుడు నెట్ హల్ చల్ చేస్తోంది. అటు ద హంగర్ గేమ్స్ ప్రొడ్యూసర్ నైనా జాకబ్ సన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆమె క్షేమం గురించి మీడియా ప్రశ్నించినపుడు ఆమెకిది అలవాటేగా.. షి ఈజ్ ఫైన్ అని కామెంట్ చేశారట. . మరోవైపు లారెన్స్ ఇలా వేదికలపై కాలు జారడం ఇదే మొదటి సారి కాదు. ఆమె నటించిన 'సిల్వర్ లైనింగ్స్ ప్లేబ్యాక్' సినిమాకుగాను 2013లో ఆస్కార్ అవార్డు స్వీకరిస్తున్నపుడు కూడా రెడ్ కార్పెట్ పై అలా కాలు జారి పడింది. అలాగే 2014 ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో కారులోంచి దిగుతూ కూడా అమ్మడి కాలు స్లిప్ అయింది. కాగా ఇటీవల విడుదలైన 'ద హంగర్ గేమ్స్.. మాకింగ్ జే పార్ట్ 2' ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నవంబరు 20న థియేటర్లను పలకరించనున్న ఈ మూవీపై హాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
భర్తనుంచి విడిపోయి మళ్లీ రెడ్ కార్పెట్కు..
లాస్ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ గార్నర్కు మరోసారి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. తన భర్త బెన్ అఫ్లెక్నుంచి విడిపోయిన తర్వాత తిరిగి ఆమె గౌరవపూర్వక కార్యక్రమాల్లోకి ప్రవేశించింది. తక్కువ ఆదాయంగల కుటుంబంలోని చిన్నారులకు సహాయం చేసేందుకు నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా బేబే 2 బేబీ అనే పేరిట ఓ చారిటీ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరైంది. ఈ సందర్భంగా మొకాళ్లవరకు స్లీవ్ లెస్ దుస్తులు ధరించి కళ్లు చెదిరే హొయలతో ఎర్రతివాచీపై నడకసాగించింది. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఆమె తన భర్త నుంచి విడిపోయింది. -
పోప్కు తెలుపు.. మోదీకి ఎరుపు..
అక్కడ రోజులు, విషయాలు సర్వసాధారణంగా జరిగిపోతుంటాయి. సీఈవోల నుంచి సాధారణ ఉద్యోగుల వరకు క్యాజువల్ టీషర్ట్స్ ధరించి..ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన టెక్ సాధనాలను నడిపించేపనిలో ఉంటారు. ఒక్క ఉద్యోగులనే కాదు నాన్ టెక్నికల్ స్టాఫ్, ఉద్యోగులకు భోజనాలు తయారు చేసే చెఫ్ లు, ఆఫీస్ బాయ్ లు లక్షల మందికి అసలు డ్రస్ కోడ్ అనేదే లేదు. కానీ శనివారం మాత్రం పరిస్థితి తలకిందులైంది. వీకెండ్ అయినప్పటికీ విశిష్ట వ్యక్తి వస్తున్నందున తమంతట తామే క్యాజువల్ నుంచి ఫార్మల్స్ లోకి మారిపోయారు సిలికాన్ టెక్కీలు.. ఆయా కంపెనీల సీఈవోలూ! 'అవును భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం క్యాజువల్ సిలికాన్ వ్యాలీ ఫార్మల్ గా మారిపోయింది' అంటూ అమెరికా మీడియాలో ఒకటే వార్తలు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం కాలిఫోర్నియాలోని మినేటా శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి అరుదైన ఘన స్వాగతం లభించింది. 33 ఏళ్ల తర్వాత అక్కడ అడుగుపెడుతోన్న భారత ప్రధానిని సగర్వంగా ఆహ్వానిస్తూ 30 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పులతో ప్రత్యేకంగా తయారుచేయించిన రెడ్ కార్పెట్ ను పరిచారు సిలికాన్ వ్యాలీ ప్రొటోకాల్ అధికారులు. 'హాలీవుడ్ నటుడు జోయ్ పెస్కి('ర్యాగింగ్ బుల్' ఫేమ్) సలహామేరకు న్యూజెర్సీకి చెందిన రెడ్ కార్పెట్ స్లోర్స్ డాట్ కామ్ వారిచే ప్రత్యేక రెడ్ కార్పెట్ ను తయారుచేయించాం' అని సిలికాన్ వ్యాలీ ప్రొటోకాల్ చీఫ్ డియాన్నా ట్రయాన్ తెలిపారు. కాగా, తొలిసారిగా అమెరికాకు వచ్చిన పోప్ ప్రాన్సెస్ కు ఫిలడెల్ఫియాలో ఏర్పాటు చేసిన స్వాగత వేడుకలోనూ ఇదే కంపెనీ తయారుచేసిన తెలుపు రంగు కార్పెట్ ను వినియోగించినట్లు చెప్పారు. -
సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్
రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సీడ్ కేపిటల్ ప్రణాళికను సమర్పించేందుకు రాజమండ్రి వచ్చిన సింగపూర్ బృందానికి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది. ఇక్కడి విశేషాలు వారికి చూపించేందుకు పుష్కర యాత్రికులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. తొలుత ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికార యంత్రాంగం వారికి వంగివంగి సలాములు చేస్తూ స్వాగతం పలికారు. సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ నేతృత్వంలోని 29 మంది సభ్యుల బృందాన్ని రాజమండ్రికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఆ విమానంలో మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన బృందానికి స్వయంగా సీఎం ఎదురెళ్లి స్వాగతం పలికారు. పలువురు మంత్రులు ఆయన వెంట ఉండి బృంద సభ్యులకు ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి ఈశ్వరన్, ముఖ్య సభ్యులను సీఎం హెలికాప్టర్లో 45 నిమిషాలపాటు ఏరియల్ వ్యూ ద్వారా గోదావరి నది, ఘాట్లు, అక్కడికొచ్చిన జనాన్ని చూపిం చారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలోని హెలిప్యాడ్లో దిగి సీడ్ కేపిటల్ సమర్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశానికి స్వయంగా తీసుకెళ్లారు. మిగిలిన బృంద సభ్యులను విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో మంత్రులు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ హోటల్కు తీసుకెళ్లారు.విలేకరుల సమావేశంలోనూ సీఎం చంద్రబాబు.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్, బృంద సభ్యుల పనితీరును మెచ్చుకుంటూ పొగడడానికి ఉత్సాహం చూపించారు. విలేకరుల సమావేశాన్ని సమన్వయపరిచిన పరకాల ప్రభాకర్ పలుమార్లు ఈశ్వరన్ను హిజ్ ఎక్సెలెన్సీ అంటూ సంభోదించడం ఆశ్చర్యపరిచింది. అనంతరం ఈశ్వరన్ను సీఎం తన కారులో ఎక్కించుకుని పుష్కరఘాట్లో జరిగే నిత్యహారతి కార్యక్రమానికి తీసుకెళ్లారు. ఇందుకోసం హోటల్ షెల్టన్ నుంచి ఘాట్కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ను నిలిపివేశారు. లక్షల సంఖ్యలో పుష్కర యాత్రికులు రోడ్లపై ఉన్నా వారిని ఇబ్బంది పెట్టే రీతిలో ట్రాఫిక్ను క్లియర్ చేశారు.పుష్కరాల ప్రారంభం రోజున చంద్రబాబు, వాహనశ్రేణి వల్ల ఇబ్బంది ఏర్పడిన విషయం తెలిసిందే. బృంద సభ్యుల కోసం తమ బుగ్గ కార్లను వదిలి మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ తదితరులు బస్సులో ఎక్కడం గమనార్హం. -
కొత్త ఆలోచనలకు రెడ్కార్పెట్
వైద్యం, విజ్ఞానం కలిస్తే అద్భుతం మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో: కొత్త ఆలోచనలతో వచ్చే యువతకు ప్రభుత్వం రెడ్కార్పెట్ వేస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో జరిగిన ఇంజనీరింగ్ ది ఐ వర్క్షాప్నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా మేమంటే మేమే తయారు చేశామని కొంత మంది రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారని, నిజానికి ఇది ఏ ఒక్కరి కృషితోనో సాధ్యం కాలేదన్నారు. వైద్య రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం వల్ల అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇంజినీర్లకు, ఐటీ సాంకేతిక, వైద్య నిపుణులకు, డిజైనర్లకు ఇదో చక్కటి అవకాశమని సూచించారు. నేత్ర వైద్య చికిత్సలో ఎల్వీప్రసాద్ వైద్య నిపుణులు చూపుతున్న చొరవ, అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్రావు మాట్లాడుతూ నేత్ర సంరక్షణ కోసం ఆధునిక వైద్య సేవలను ఆవిష్కరించేలా వర్క్షాప్ దోహదపడుతుందన్నారు.ఎంఐటీ మీడియా ల్యాబ్స్ కెమెరా కల్చర్ గ్రూప్ ప్రాజెక్ట్ ఇన్నొవేటర్ జాన్వెర్నర్, సెయెంట్ ఎండీ బీవీఆర్ మోహన్రెడ్డి, పాల్గొన్నారు. -
పారిస్లో మోదీకి ఘనస్వాగతం
-
అక్టోబర్లో రాష్ట్రానికి ‘చైనా పెట్టుబడిదారులు
పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంలో రెడ్కార్పెట్ ‘హువాయి’ ఆర్ అండ్ డీ విభాగం ప్రారంభోత్సవంలో మంత్రి ఆర్.వి.దేశ్పాండే బెంగళూరు: కర్ణాటకలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలైన సహాయ సహకారాలు అందించే విధంగా ‘రెడ్ కార్పెట్’ స్వాగతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుకుతోందని రాష్ట్ర ఉన్నత విద్య, పర్యాటక శాఖ మంత్రి ఆర్.వి.దేశ్పాండే తెలిపారు. చైనాకు చెందిన ప్రముఖ ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ) రంగ సంస్థ హువాయి నగరంలో మొత్తం 20 ఎకరాల్లో 170 మిలియన్ల యూఎస్ డాలర్లతో నిర్మించిన ‘హువాయి రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యాంపస్’ను ఆర్.వి.దేశ్పాండే గురువారమిక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....చైనాకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి చర్చించిందని చెప్పారు. కర్ణాటకలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సిద్ధరామయ్య ఆహ్వానించారని తెలిపారు. ఇందుకు స్పందించిన చైనా ప్రతినిధులు రానున్న అక్టోబర్లో తమ పారిశ్రామిక వేత్తల బృందంతో బెంగళూరు వస్తామని, అదే సమయంలో వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పన, సమాచార శాఖ మంత్రి రోషన్బేగ్ మాట్లాడుతూ....దేవనహళ్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వైట్ఫీల్డ్లోని ఐటీపీఎల్ ప్రాంతానికి చేరుకోవడానికి ట్రాఫిక్ కారణంగా ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. అందువల్ల ఐటీపీఎల్ నుంచి హెబ్బాళ ఫ్లై ఓవర్ వరకు ఎక్స్ప్రెస్ వేను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మరిన్ని ఇండస్ట్రియల్ పార్క్ల దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వీటి ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబేరేగౌడ, హువాయి ఇండియా సీఓఓ విల్సన్ వాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ అవకాశాల స్వర్గం...రండి
టోక్నో : భారత్ అవకాశాల స్వర్గం.... రండి కలిసి పని చేద్దామని... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...జపాన్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం జపాన్ పారిశ్రామిక వేత్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పెట్టుబడులకు భారత్ కంటే ఉత్తమమైన దేశమేదీ లేదన్నారు. పారిశ్రామిక నిబంధనలు సరళతరం చేస్తామని, పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని మోడీ తెలిపారు. రక్షణ సహా అన్ని రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, జపాన్ల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయన్నారు. పదేళ్లలో జపాన్లో సాధించిన అద్భుతాన్ని భారత్లో రెండేళ్లలో ఆవిష్కరించ వచ్చని తెలిపారు. ఆసియాను బలోపేతం చేసేందుకు చేయి చేయి కలుపుదామని మోడీ సూచించారు. గత ప్రభుత్వం మూడేళ్లలో చేయలేనిది ....తాము వంద రోజుల్లో చాలా చేసి చూపించామని ఆయన తెలిపారు. -
తెలుగమ్మాయిని పట్టించుకోని టాలీవుడ్
-
వైయస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం : ప్రజలు
-
విజయమ్మపై కక్ష.. చంద్రబాబుకు రక్ష...
* విజయమ్మ అడుగు పెట్టకుండా అడ్డంకులు * చంద్రబాబు పర్యటనకు పోలీసుల రెడ్ కార్పెట్ * తోక ముడుచుకున్న జిల్లా మంత్రులు * ఆద్యంతం పోలీసు పహారా నడుమ టీటీడీ అధినేత పర్యటన మొన్న.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నల్లగొండ జిల్లాలోకి అడుగు పెట్టకుండా సరిహద్దుల్లోనే మంత్రుల ప్రోద్బలంతో పోలీసులు అడ్డుతగిలారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిల ఆదేశాల మేరకు పోలీసులు ఆటో యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లను బెదిరించారు. రాత్రికి రాత్రే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు. రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపి రాళ్లు వేశారు. వీటిని సాకుగా చూపి.. పోలీసులు రెచ్చిపోయి జిల్లాలో పర్యటించకుండా విజయమ్మను హైదరాబాద్ పంపించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. నిన్న.. రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించే చంద్రబాబుకు కాంగ్రెస్ నాయకులు రెడ్ కార్పెట్ పరచి జిల్లా పర్యటన కు స్వాగతిం చారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి పర్యటన సజావుగా సాగేలా సహకరించారు. తెలంగాణ పౌరుడిగా సమైక్యవాదులను అడ్డుకున్నామని ప్రకటన చేసిన ఓ మంత్రి... చంద్రబాబును అడ్డుకోవడంలో మాత్రం తీవ్రంగా విఫలమయ్యారు. పలుచోట్ల తెలంగాణవాదుల నుంచి మినహా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కనీసం నినదించిన, నిరసన వ్యక్తం చేసిన దాఖలాలూ లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కుకు ఇది పరాకాష్ట. సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఖాకీల పహారాలో సాగింది. దామరచర్ల మండలం విష్ణుపురంలోని ఇండియా సిమెంట్ కంపెనీ అతిథి గృహం నుంచి బయలుదేరింది మొదలు.. కట్టంగూరులో రాత్రి పర్యటన ముగిసే దాకా పోలీసులు చంద్రబాబును నీడలా వెన్నంటే ఉన్నారు. వందల సంఖ్యలో ఖాకీలు అడుగడుగునా బందోబస్తు నిర్వహించారు. పలుచోట్ల తెలంగాణవాదుల నుంచి నిరసనలు వ్యక్తం కాగా, వారిని పోలీసులు పక్కకు నెట్టివేశారు. ఇది మినహా బాబు పర్యటనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి నిరసన వ్యక్తం కాలేదు. ఈ ఘటన ద్వారా కాంగ్రెస్, టీడీపీల తెరవె నుక బాగోతం మరోసారి బట్టబయలైంది. జిల్లాలో గురువారం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు అడ్డుతగిలిన తీరు.. సజావుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన పర్యటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. విజయమ్మ పర్యటన సందర్భంగా సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి నానా రభస చేశారు. రెండు రోజులూ తన నియోజకవర్గంలోనే మకాం వేసి స్థానికులు, పక్క నియోజకవర్గాలకు చెందిన తన అనుయాయులను ఉసిగొల్పిన విషయం తెలిసిందే. ఎస్పీని సైతం క్షేత్రంలోకి తీసుకొచ్చి పలు జిల్లాలకు చెందిన పోలీసులను మోహరించారు. ఎలాగైనా విజయమ్మను అడ్డుకోవాలన్న ముందస్తు వ్యూహంలో భాగంగానే అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేగాక పర్యటనను అడ్డుకుంటామని జిల్లాకు చెందిన సీనియర్ మంత్రితోపాటు ఎంపీ కూడా ప్రకటనలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి వారు తెలంగాణ అంశంపై ఎటూ తేల్చని చంద్రబాబు పర్యటన సాఫీగా జరిగేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా సహకరించడం విశేషం. తరచూ ప్రెస్మీట్లు ఏర్పాటు చేసి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే ఓ ఎంపీ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అదే చంద్రబాబు తిరిగినా పట్టించుకోలేదు. తెలంగాణవాదులను చితకబాదిన పోలీసులు బాబు పర్యటన సందర్భంగా తెలంగాణవాదులపై పోలీ సులు లాఠీ ఝుళిపించారు. చంద్రబాబు కాన్వాయ్ దామరచర్లకు చేరుకోగానే తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలుపుతూ, ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలంగాణవాదులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. ఇదే సమయంలో పోలీసులు తెలంగాణవాదులపై లాఠీ ఝుళిపించారు.