removal
-
కన్జ్యూమర్ వాచ్డాగ్ చీఫ్ రోహిత్ చోప్రాను తొలగించిన ట్రంప్
పామ్ బీచ్ (యూఎస్): వినియోగదారుల ఆర్థిక రక్షణ సంస్థ డైరెక్టర్ రోహిత్ చోప్రాను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలగించారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. ఇప్పటికీ పదవిలో ఉన్న డెమొక్రటిక్ అధికారుల్లో చోప్రా ఒకరు. చోప్రా తొలగింపును ఈమెయిల్ ద్వారా ఆయనకు తెలియజేశారు. దీంతో తన నిష్క్రమణ గురించి చోప్రా శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఏజెన్సీతో తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించినందుకు శక్తివంతమైన కంపెనీలు, వాటి ఎగ్జిక్యూటివ్లపై చర్యలు తీసుకోవడంలో మీరు మాకు సహాయపడ్డారు. మా పనిని మెరుగుపరిచారు’’అని చోప్రా పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం చోప్రా ఐదేళ్ల పాటు సీఎఫ్పీబీ డైరెక్టర్గా కొనసాగాల్సి ఉంది. అయితే కొత్త అధ్యక్షుడు కోరితే తన పదవి నుంచి తప్పుకుంటానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. చోప్రా తన పదవీకాలంలో క్రెడిట్ రిపోర్టుల నుంచి వైద్య రుణాన్ని తొలగించడం, ఓవర్డ్రాఫ్ట్ల జరిమానాలపై పరిమితులను తొలగించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఆయన చర్యలను రెగ్యులేటరీ అతిక్రమణగా కొందరు వ్యతిరేకించారు. చోప్రా తొలగింపు.. వినియోగదారుల రక్షణ శకానికి ముగింపును సూచిస్తుందని డెమొక్రాట్, కాలిఫోర్నియా ప్రతినిధి మాక్సిన్ వాటర్స్ అన్నారు. వాల్స్ట్రీట్ బిలియనీర్లకు లొంగిపోయి సంస్థను నాశనం చేయడానికి రిపబ్లికన్లు ప్రయత్నిస్తే.. పోరాటం చేస్తామని వారెన్ హెచ్చరించారు. 2008లో ఏర్పాటైన బ్యూరో 2008 ఆర్థిక సంక్షోభం తరువాత తనఖాలు, కారు రుణాలు, ఇతర వినియోగదారుల ఫైనాన్స్ను నియంత్రించడానికి బ్యూరోను ఏర్పాటు చేశారు. దీన్ని రిపబ్లికన్లు, వారి ఆర్థిక మద్దతుదారులు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యూరోను బలహీనపరిచే ఒక సవాలును గతేడాది సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికి నిధులు సమకూర్చే విధానం రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తీర్పు ఇచ్చింది. -
3 జలాశయాల్లో పూడిక తీతకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: కడెం, మిడ్మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో పైలట్ ప్రాజెక్టు కింద పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించడానికి రా ష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిoది. ఇందులోని నిబంధనల మేరకు పూడిక తొలగింపుతో లభ్యమయ్యే ఇసుకను కాంట్రాక్టర్లు అమ్ముకోవచ్చు. ఈ నేపథ్యంలో మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.406.64ను కనీస బిడ్డింగ్ ధరగా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ ధరను ఎప్పటికప్పుడు సవరిస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు తాము కోట్ చేసిన ధర ఆధారంగా ఎంత ఇసుకను తవ్వితే ఆ మేరకు ప్రభుత్వానికి చెల్లింపు లు చేయాల్సి ఉంటుంది. పూడిక తొలగింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణ వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీడబ్ల్యూఆర్డీసీ) ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కాంట్రాక్టర్లు ఇసుక నిల్వలను స్టాక్యార్డులో నిర్వహించాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖ, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)లు దీనిని పర్యవేక్షించనున్నాయి. ఈ మేరకు పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించాలని కరీంనగర్ ఈఎన్సీని ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకుపోయిన పూడిక రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 జలాశయాలున్నాయి. కాగా, ఇందులో సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో పూడిక పెరిగి క్రమంగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమై న సాగునీటికి లోటు ఏర్పడుతోంది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భా గంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పో యినట్టు తేలింది. దేశంలో పీఎం కిసాన్ సించాయ్ యోజన (పీఎంకేఎస్వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది. కాగా, పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మూడు జలాశయాల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. సర్కారుకు ఖర్చు లేకుండా.. జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పూడికతీత కోసం రాజస్తాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ ఆర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) నిర్వ హించనున్నారు. దీనికోసం ప్రభు త్వం ఎలాంటి ఖ ర్చు చేయదు. అత్యధిక ధర కోట్ చేసిన బిడ్డర్లు పన్నులు, సెస్, జీఎస్టీ, రాయల్టీని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపున కు ఇదే విధానాన్ని అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది. పూడిక తొలగింపు గడువు 20 ఏళ్లు! జలాశయాల్లో భారీగా ఉన్న పూడికను ఇప్పటికిప్పుడు తొలగించడం సాధ్యం కాదు. పూడిక తొలగింపునకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లు కాంట్రాక్టర్లతో 20 ఏళ్ల గడువుతో ఒప్పందా లు చేసుకోగా, మరో ఐదేళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్రంలో సైతం ఇదే రీతిలో 20 ఏళ్ల గడువు విధించి, ఆ తర్వాత గరిష్టంగా 5 ఏళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. -
పూడికతీతకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని రాష్ట్రంలో అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఆ మేరకు చేసిన సిఫారసుల ఆధారంగా ఒక జలాశయంలో పైలట్ ప్రాజెక్టుగా పూడిక తొలగింపును చేపట్టడానికి అనుమతిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూడికతీత కోసం రాజస్థాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ అర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసింది.అంటే దీనికోసం ప్రభుత్వం ఖర్చు చేయదు..పైగా ప్రభుత్వానికే ఆదాయం రానుంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) త్వరలో ఏదైనా ఒక జలాశయంలో పూడికతీతకు టెండర్లను ఆహా్వనించి అత్యధిక ధరను కోట్ చేసిన బిడ్డర్కు పూడికతీత పనులను అప్పగించే అవకాశం ఉంది. బిడ్డర్ పన్నులు, సెస్, జీఎస్టీ, రాయలీ్టని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపునకు ఇదే మోడల్ను అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది. సగానికి పైగా జలాశయాల్లో భారీగా పూడిక ⇒ రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 భారీ జలాశయాలున్నాయి. సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో భారీగా పూడిక పేరుకుపోయింది. ⇒ జలాశయాల్లో పూడిక పెరగడంతో క్రమంగా అవి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమైన సాగునీటికి, అలాగే తాగునీటి సరఫరాలో సైతం లోటు ఏర్పడుతోంది. పర్యావరణ సమస్యలూ తలెత్తుతున్నాయి. ⇒ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్టు తేలింది. ⇒ దేశంలో పీఎం కిసాన్ సించాయి యోజన (పీఎంకేఎస్వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది. సిఫారసులు ఇలా.. ⇒ జలాశయాలు, డ్యామ్లు, ఆనకట్టలు, బరాజ్లు, నదులు, కాల్వల్లో పూడికతీత పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రం ఈ మేరకు మినహాయింపు ఇచి్చంది. పూడికతీత ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలి. ⇒ ్శనీటిపారుదల, గనుల శాఖలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పూడికతీత చేపట్టిన రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. ⇒ సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూడికతీత జరగాలి. వాటి రక్షణ విషయంలో రాజీపడరాదు. ⇒ పూడికతీతలో సారవంతమైన మట్టిని వెలికి తీస్తే రైతాంగానికి ఉచితంగా సరఫరా చేయాలి. రవాణా చార్జీలు రైతులే భరించాలి. -
తెలంగాణ సెక్రటేరియట్.. ‘బాహుబలి’ గేటు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రెన్స్ రెండు గేట్లను తొలగింపు చర్యలు చేపట్టారు. గేట్లు తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్ను ఏర్పాటు చేయనున్నారు. తొలగించిన గేటును హుస్సేన్ సాగర్ వైపు గేటు నెంబరు 3 వద్ద పెట్టనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో వాస్తు దోషం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు సమాచారు. దీంతో దాదాపు 6 నెలల నుంచి బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్ గేట్లకు తాళాలు వేసి మూసివేశారు. -
మంత్రి పదవి నుంచి ‘కొండా’ను తప్పిస్తారా? పీసీసీ చీఫ్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీతో స్నేహం వేరు.. శాంతిభద్రతలు వేరని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్పై దాడి విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీలో నేతల చేరికలు జరిగిన చోట కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే చేరికలకు బ్రేక్ వేశాం. దసరాకు రెండో విడత కార్పోరేషన్ పదవులు అనుకున్నాం. కానీ కుదరలేదు. దీపావళి లోపు పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లా పర్యటనకు వెళ్తాను భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి. మూసీ అభివృద్ధికి రు. లక్షా యాబై వేల కోట్లని ఎక్కడా మేం చెప్పలేదు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగింది. ఏఐసీసీ నేతలంత బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం ఆలస్యం అయింది. త్వరలోనే రెండు భర్తీ చేస్తాం. మంత్రి కొండా సురేఖ ఇటీవల తన వాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఆరోజే ఆ వ్యవహారం క్లోజ్ అయింది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్నది ప్రచారం మాత్రమే. వాస్తవం కాదు. ఈ విషయంపై అధిష్టానం ఎటువంటి వివరణ అడగలేదు’’ అని అన్నారు. -
Article 370 Removal: అది మా అజెండాలో ఉంది: బీజేపీ నేతలు
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 2019 ఆగస్టు 5న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చారిత్రక ఘట్టానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు బీజేపీ నేతలు తమ స్పందనలు తెలియజేస్తున్నారు.ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ‘ఇది మా(బీజేపీ) ఎజెండాలో ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దీని కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారు. నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించి స్థానికులకు స్వేచ్ఛ కల్పించారు’ అని అన్నారు. #WATCH | Raipur: Chhattisgarh CM Vishnu Deo Sai says "Today is the third Monday of the 'Sawan' month. I want to extend my wishes to the people of the state. I am travelling to to Kawardha along with Deputy CM Vijay Sharma wherein we will offer prayers to Lord Shiva..."On 5… pic.twitter.com/VC0jJIDzXh— ANI (@ANI) August 5, 2024 జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ ‘2019, ఆగస్టు 5 న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఫలితంగా జమ్ముకశ్మీర్లోని ప్రతి వ్యక్తికి హక్కులు లభించాయి. ఆర్టికల్ 370 తీసుకురావడం ద్వారా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు జమ్ముకశ్మీర్ ప్రజలకు ద్రోహం చేశాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ ‘వన్ ఇండియా-బెస్ట్ ఇండియా’ సంకల్పాన్ని నెరవేర్చారు’ అని అన్నారు. జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ‘ఈరోజు చరిత్రాత్మకమైన రోజు. ఆర్టికల్ 370, 35ఏలను తొలగించడం ద్వారా జమ్ము, కశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్రవాదం అదుపులోకి వచ్చింది. వేర్పాటువాదులు జైలులో ఉన్నారు. స్థానికులు ఉపాధి పొందుతున్నారు. లోయలో శాంతి నెలకొంది’ అని అన్నారు. #WATCH | On the 5th anniversary of the abrogation of Article 370, former Deputy CM of Jammu and Kashmir and BJP leader Nirmal Singh says, "Today is a very historic day. Today on 5 August 2019, the Parliament removed Article 370 and 35A and implemented the Constitution of India in… pic.twitter.com/WY27a5DVZR— ANI (@ANI) August 5, 2024 -
బెంగాల్ డీజీపీ తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తుకు తెరతీసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం శాఖ కార్యదర్శులతోపాటుగా, పశ్చిమబెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను తొలగించాలని ఆదేశా లు జారీ చేసింది. మిజోరం, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల సాధారణ పరిపాలన విభాగాల కార్యదర్శులను కూడా తొలగించింది. గతంలోనూ చర్యలు 2016 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 లోక్సభ ఎన్నికల సమయంలోనూ పశ్చిమబెంగాల్ డీజీపీకి ఎన్నికల విధుల నుంచి ఈసీ తొలగించడం గమనార్హం. తాత్కాలికంగా డీజీపీ రాజీవ్ కుమార్కు ఎన్నికలతో సంబంధం లేని బాధ్యతలను అప్పగించాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీకి ఈసీ సూచించింది. ఆయనకు జూనియర్గా ఉన్న మరో అధికారికి డీజీపీ బాధ్యతలివ్వాలని కోరింది. డీజీపీ పోస్టుకు అర్హులైన ముగ్గురు అధికారుల పేర్లను తమకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వీరికి రెండు విధులు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు సంబంధిత రాష్ట్రాల సీఎం కార్యాలయాల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారని, దీనివల్ల ఎన్నికల సంబంధ విధుల అమలులో ఎంతో కీలకమైన నిష్పా క్షికత, తటస్థత కొరవడే ప్రమాదముందని ఈసీ పేర్కొంది. ముఖ్యంగా శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై ఇది ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వీరిని విధుల నుంచి తప్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బీఎం కమిషనర్ తొలగింపు ఎన్నికల సమయంలో మూడేళ్లు ఒకే చోట బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని, సొంత జిల్లాల్లో విధుల్లో ఉన్న వారిని ఎన్నికల సంబంధ విధుల నుంచి బదిలీ చేయడం ఆనవాయితీ. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తమ సూచనలను పాటించకపోవడంపై ఈసీ అసంతృప్తిగా ఉంది. దీంతో, బృహన్ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లను విధుల నుంచి తప్పించాలని ఆదేశాలిచ్చింది. ఇతర కార్పొరేషన్ల మున్సిపల్ కమిషనర్లు, అదనపు, ఉప కమిషనర్లను కూడా బదిలీ చేయాలని కోరింది. -
fact check: అది మీ బాబు రూటు
సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా... కళ్లకు పచ్చ పసరు రాసుకున్న రామోజీకి అంతా తన ‘బాబు’ లాగే కనిపిస్తున్నారు. తన బాబు దొంగ ఓట్లతో గెలిచాడు కాబట్టి మిగతా వారూ అలానే ఉంటారని భావిస్తూ ‘‘ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు’’ అంటూ జగన్పై ఉన్న అక్కసును బయటపెట్టుకున్నారు. అసలు దొంగఓట్లకు ఆద్యుడు చంద్రబాబేనని, తమిళనాడుకు చెందిన వలస కూలీలను చేర్పించడం ద్వారా ఇన్నాళ్లూ కుప్పంలో గెలుస్తూ వచ్చాడని, ఇప్పుడు ఆ భాగోతం బయటపడటంతో సొంత నియోజకవర్గంలో తన బాబు’ ఓడిపోతాడనే భయంతోనే ఇటువంటి వార్తలు రాస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సేవామిత్ర యాప్ పేరుతో వైఎస్సార్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపు రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను చౌర్యం చేసి ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. వాటిని సేవా మిత్ర యాప్తో అనుసంధానం చేసి, వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. తద్వారా తనకు అలవాటైన రీతిలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేశారు. ఈ కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేలి్చన ఎన్నికల అధికారులు.. 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో అదనంగా చేర్చారు. దాంతో ఆ ఎన్నికల్లో 50 శాతంపైగా ఓట్లు సాధించి.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. ఈసీ స్పష్టం చేసినా వినపడలేదా! అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇటీవల ఓ సమీక్షలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, గంపగుత్తగా ఓట్ల తొలిగింపు, జీరో ఇంటి నెంబర్పై ఓటర్ల నమోదు అంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేసిన బోగస్ ప్రచారంలో వీసమెత్తు నిజం లేదన్న విషయాన్ని ఆయన విస్పష్టంగాచెప్పారు. 2023 జనవరి 6 నుంచి ఆగస్టు 30 మధ్య కాలంలో తొలగించిన 21 లక్షల ఓట్లను సమీక్షిస్తే అందులో కేవలం 13,061 ఓట్లలోనే తప్పులు దొర్లాయని ఆయన తేల్చారు. అంటే తొలగించిన మొత్తం ఓట్లల్లో ఇది కేవలం 0.61 శాతం మాత్రమే. వాటిని తిరిగి సవరించారు. మృతి చెందిన, ఇంటి మార్పు, డూప్లికేట్ ఓటర్ల నమోదుపై 14.48 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 5.65 లక్షల ఓటర్లు చనిపోవడం లేదా శాశ్వతంగా వేరే చోటికి వెళ్లిపోవడం, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటాన్ని గుర్తించి వాటిని తొలగించారు. ఒకే ఇంటి నంబర్పై పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసులను పరిశీలించడానికి 1.57 లక్షల ఇళ్లకు ఎన్నికల సిబ్బంది వెళ్లారు. ఇంటింటి సర్వే నిర్వహించి 20 లక్షల ఓట్లను పరిశీలించారు. జీరో ఇంటి నెంబర్తో 2.52 లక్షల ఓట్లు ఉండగా వాటిలో 97 శాతం అసలైన చిరునామా నమోదు చేసి సరిదిద్దారు. ఎన్నికల సంఘం ఇంత కచి్చతంగా వ్యవహరించినా రామోజీ కళ్లకు ఇవేవీ కనిపించలేదు. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఒకపక్క చెపుతున్నా.. పదేపదే అదే అబద్ధాన్ని రామోజీ ప్రచారం చేస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన బాబు 2014లో దొంగఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు 2019లో కూడా అదే దారిలో వెళ్లి భంగపడ్డారు. సేవామిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఇప్పుడు 2024లో కూడా ఇదే విధంగా దొంగ ఓట్లను చేర్పించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి భారీ సంఖ్యలో గంపగుత్తగా ఫారం–6లను దాఖలు చేస్తూ పచ్చ మీడియా ద్వారా అధికారపార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 99% స్వచ్ఛతతో ఓటర్ల జాబితా తయారు చేయడమే కాకుండా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నా రామోజీ పత్రిక మాత్రం ఓటర్ల జాబితాపై పదేపదే తప్పుడు ఆరోపణలతో విషకథనాలను ప్రచురిస్తోంది. 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు అప్పట్లో ప్రజా సంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని తేల్చాయి. -
కాంగ్రెస్ను వీడనున్న మరో ఎమ్మెల్యే?
బీహార్ కాంగ్రెస్ నేతల్లో తిరుగుబాటు ధోరణి బయటపడింది. పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను నిలదీస్తూ ఎమ్మెల్యే ప్రతిమా దాస్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీహార్లో ఉండే నేతనే రాష్ట్ర అధ్యక్ష పదవిలో నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ సింగ్కు కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలను కూడా కలవడానికి సమయం ఉండటం లేదని ప్రతిమాదాస్ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులెవరూ నామినేషన్ వేయకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొందని అన్నారు. గతంలో కాంగ్రెస్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవారని నాడు కూడా మండలిలో భాగస్వామ్యం ఉండేదన్నారు. ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శాసనమండలిలో పార్టీకి చెందిన సభ్యులెవరికీ చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర పార్టీలో ఇంకా సంస్థాగత విస్తరణ జరగలేదని, బీహార్లో ఉండాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీలో మాత్రమే కనిపిస్తారని ఆరోపించారు. అఖిలేష్ సింగ్ కారణంగానే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడారని ప్రతిమా దాస్ పేర్కొన్నారు. ఈ విమర్శలు చూస్తుంటే ప్రతిమా దాస్ కూడా పార్టీని వీడుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. -
డిస్కమ్ల డైరెక్టర్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లోని డైరెక్టర్లను ప్రభుత్వం తొలగించింది. వారి తొలగింపు తక్షణమే అమలులోకి వస్తుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ రిజ్వీ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు 2012లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిస్కమ్ల సీఎండీలను ఆయన ఆదేశించారు. దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 11 డైరెక్టర్లు కొనసాగుతున్నారు. ఈ 11 మందిలో కేవలం ఇద్దరు డైరెక్టర్లు టి.శ్రీనివాస్ (డైరెక్టర్, ప్రాజెక్ట్స్), టీఎస్ఎన్పీడీసీఎల్ వెంకటేశ్వరరావు (డైరెక్టర్ హెచ్ఆర్) మాత్రమే 2013లో నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్లుగా నియామకమయ్యారని పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిదిమంది డైరెక్టర్లు ఆరేళ్ల క్రితం ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియామకమయ్యారని ఆ ఉత్తర్వుల్లో రిజ్వీ స్పష్టం చేశారు. తొలగించిన ఆ 11మంది ఎవరెవరంటే.. సోమవారం తొలగించిన 11 మంది డైరెక్టర్లలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలోని జె, శ్రీనివాస్రెడ్డి(ఆపరేషన్స్), శ్రీనివాస్(ప్రాజెక్ట్స్), కె.రాములు(కమర్షియల్, ఎనర్జీ ఆడిట్), జీ. పార్వతం(హెచ్ఆర్), సీహెచ్ మదన్మోహన్రావు(ప్రణాళిక, నిర్వహణ), ఎస్,స్వామిరెడ్డి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ), గంపా గోపాల్(ఎనర్జీ ఆడిట్).. కాగా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో బి. వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), పి.మోహన్రెడ్డి (ప్రాజెక్ట్స్), పి. సంధ్యారాణి (కమర్షియల్), పి. గణపతి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ) ఉన్నారు. కొత్త డైరెక్టర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ.. ఇంటర్వ్యూలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త డైరెక్టర్లను నియమించనున్నట్లు సమాచారం, ఇప్పటికే జెన్కో, ట్రాన్స్కోలో డైరెక్టర్లకు ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం విదితమే. ఇప్పుడు పంపిణీ సంస్థల డైరెక్టర్లకు కూడా ఉద్వాసన పలకడం ద్వారా విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్లయింది. ఏళ్ల తరబడి డైరెక్టర్లుగా వాళ్లే కొనసాగడం వల్ల విద్యుత్ సంస్థల్లో పురోగతి లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నప్పటికీ.. నష్టాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వాళ్లు దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా రూ.వేల కోట్లలో నష్టాలు పేరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలున్నాయి, కాగా, వచ్చేనెలలో ఈ డైరెక్టర్ల పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
TN: మంత్రి డిస్మిస్పై వెనక్కి తగ్గిన గవర్నర్!
చెన్నై: తమిళనాట బుధవారం అర్ధరాత్రి దాకా పొలిటికల్ హైడ్రామా సాగింది. గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద నిర్ణయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన మంత్రి వీ సెంథిల్ బాలాజీని.. మంత్రి వర్గం నుంచి తొలగించడం, అదీ సీఎం స్టాలిన్ను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై డీఎంకే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. క్యాష్ ఫర్ జాబ్స్, మనీల్యాండరింగ్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి మంత్రిని సెంథిల్ను తొలగిస్తున్నట్లు.. అందుకోసం గవర్నర్ ఆర్ఎన్ రవి తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అర్ధరాత్రి అటార్నీ జనరల్తో భేటీ అయిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు సమాచారం. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే.. బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలపై స్టాలిన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ పరిణామంపై ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లడారు. గవర్నర్పై ధ్వజమెత్తిన ఆయన.. తన మంత్రివర్గంలోని వ్యక్తిని తొలగించే హక్కు గవర్నర్కు ఉండదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటుందని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించేందుకు గానూ సీనియర్ నేతలను ఆహ్వానించారాయన. శుక్రవారం ఉదయం ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్ కొనసాగుతుండడం గమనార్హం. -
బ్లాక్ ఫిల్మ్లు, నంబర్ ప్లేట్లపై నజర్; 18 నుంచి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలను నగర ట్రాఫిక్ పోలీసులు సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి మరో విడత స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్లు, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత కూడా టీఆర్ నంబర్తో తిరగడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను నేర కార్యకలాపాలకు దోహదపడేవిగానూ పరిగణిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం చార్జిషీట్లు దాఖలు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని హెచ్చరించారు. సంబంధిత వాహనాలను గుర్తిస్తే 90102 03626కు ఫిర్యాదు చేయాలన్నారు. (క్లిక్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి) -
టిక్రిలో రాకపోకల పునరుద్ధరణ
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లో రైతులు నిరసన ప్రదర్శనలకు వేదికైన టిక్రిలో పోలీసులు బారికేడ్లు తొలగించి వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు. శుక్రవారం నుంచి బారికేడ్లను తొలగించడం ప్రారంభించిన పోలీసులు ఢిల్లీ–రోహ్తక్ హైవే మీద ఉన్న టిక్రిలో పనులు శనివారానికి పూర్తయ్యాయి. రైతు సంఘాల నాయకులు, పోలీసుల మధ్య చర్చలు జరిగిన తర్వాత అక్కడ మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ‘‘రైతు సంఘాల నాయకులతో చర్చించాం. హరియాణాకు వెళ్లే మార్గాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాం. ఆ మార్గంలో రాకపోకలు మొదలయ్యాయి’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు పర్వీందర్ చెప్పారు. రైతు సంఘం నాయకులు కొన్ని సమయాల్లో మాత్రమే రాకపోకలను అనుమతిస్తామని అంటున్నారని, తాము మాత్రం 24 గంటలు ట్రాఫిక్ తిరిగేలా రహదారిని పునరుద్ధరించామని చెప్పారు. ఆ రోడ్డుపై చిన్న వాహనాలు రాకపోకలు సాగించవచ్చునని సింగ్ వివరించారు. టిక్రి రహదారిపై రాకపోకల్ని పునరుద్ధరించడంతో ఢిల్లీ నుంచి హరియాణా మీదుగా రాజస్థాన్కు వెళ్లేవారికి ప్రయాణం సులభతరంగా మారుతుంది. మరోవైపు ఢిల్లీ–మీరట్ ఎక్స్ప్రెస్వే మీదనున్న ఘజియాపూర్లో బారికేడ్లు, వైరింగ్లను తొలగించినప్పటికీ సిమెంట్ బారికేడ్లు, తాత్కాలిక శిబిరాలను తొలగించాల్సి ఉంది. అది పూర్తయితే ఆ మార్గంలో కూడా రాకపోకలకు అనుమతిస్తామని పర్వీందర్ తెలిపారు. రైతులకు నిరసనలు చేసే హక్కు ఉన్నప్పటికీ, నిరవధికంగా రహదారుల్ని మూసివేయకూడదంటూ సుప్రీంకోర్టు అక్టోబర్ 21న రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించే ప్రాంతాల్లో బారికేడ్లను ఎత్తివేస్తున్నారు. తమ పోరాటాన్ని ఇకపై ఎలా కొనసాగించాలో వ్యూహరచన చేస్తున్నట్టు రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్ చెప్పారు. -
11 నెలలకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్ల తొలగింపు ప్రారంభమైంది. రైతు ఆందోళనల కారణంగా టిక్రి, ఘాజీపూర్లలో రోడ్లపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాదాపు 11 నెలల తర్వాత గురువారం నుంచి పోలీసులు తొలగిస్తున్నారు. ఈ పరిణామంపై రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..తమ వాదనకు మద్దతు దొరికినట్లయిందని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని సరిహద్దు పాయింట్లను తామెన్నడూ దిగ్బంధించ లేదని స్పష్టం చేశారు. రోడ్లపై నిరసనలను పూర్తిగా ఎత్తివేయాలా వద్దా అనే విషయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయిస్తుందని చెప్పారు. రహదారులపై అడ్డంకులకు పోలీసులే కారణమంటూ రైతు సంఘాలు ఇటీవల సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యంలో బారికేడ్లను తొలగించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. రోడ్లపై అడ్డంకులు ఏర్పాటు చేసింది పోలీసులే తప్ప, రైతులు కాదని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పోలీసులు రోడ్లను తిరిగి తెరుస్తున్నారన్నారు. తదుపరి కార్యాచరణను ఎస్కేం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. సింఘు వద్ద రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాన్ని ఇప్పటికే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అధికారులు మూసివేశారని వారు చెప్పారు. టిక్రి, ఘాజీపూర్, సింఘుల వద్ద రైతు సంఘాలు గత ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల్లో పోలీసులు నాలుగైదు అంచెల్లో వైర్లతో కూడిన ఇనుప, సిమెంట్ బారికేడ్లను నిర్మించారు. సాగు చట్టాలను రద్దు చేయాలి: రాహుల్ ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పోలీసులు తొలగించిన విధంగానే మూడు వివాదాస్పద వ్యవ సాయ చట్టాలను కూడా ఉపసంహరించు కోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలి: వరుణ్ గాంధీ రైతు సమస్యల విషయంలో యూపీ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ ఘాటైన విమర్శలు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద పెచ్చరిల్లిన అవినీతి కారణంగా రైతులు తమ ఉత్పత్తులను దళారులకు తెగనమ్ముకుంటున్నారని అన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతు కుటుంబాలకు ప్రియాంక పరామర్శ యూపీలోని లలిత్పూర్లో ఎరువుల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పరామర్శించారు. అధికారులు, నేతలు, అక్రమార్కుల కారణంగా రైతుల ఎరువులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. -
దీదీ ఎత్తుగడ: ఏకంగా గవర్నర్కే గురి!
పశ్చిమ బెంగాల్ పాలనలో కేంద్రం జోక్యానికి చెక్ పెట్టేందుకు, రివెంజ్ దిశగా మమతా బెనర్జీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గవర్నర్ ధన్ఖర్ను గద్దెదించేందుకు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం. కోల్కతా: పాలనాపరంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మొదటి నుంచే పొసగడం లేదు.ఈ క్రమంలో ఆయన బహిరంగంగానే దీదీ తీరును, పాలనను తప్పుబడుతూ వస్తున్నాడు. ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి ఆ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని గవర్నర్ గిరి నుంచి సాగనంపేందుకు దీదీ పాచికలు కదుపుతోంది. ధన్ఖర్ను సాగనంపే విషయంపై ఇదివరకే మమతా, బిమన్ బెనర్జీతో చర్చించినట్లు సమాచారం. జులై 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశాల్లో మొదటి సెషన్లో.. అది కూడా గవర్నర్ స్పీచ్ అనంతరమే తీర్మానం ప్రవేశపెట్టాలని, తద్వారా తమ పవర్ ఏంటో చూపించాలని టీఎంసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్సభ స్పీకర్కీ.. గవర్నర్ ధన్ఖర్ బెంగాల్ అసెంబ్లీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ స్పీకర్ బిమన్ బెనర్జీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘పెండింగ్ బిల్లులు సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నాడని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. అనైతికంగా గవర్నర్ తీరు ఉందని’ ఫిర్యాదులో బిమన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక టీఎంసీ సీనియర్ నేతలు కూడా గవర్నర్ను దించేయడమే ఎజెండాగా పెట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని నిర్నయించుకున్నారు. ఒక పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గవర్నర్ తీరు హేయనీయంగా ఉందంటూ వరుసగా టీవీ ఛానెల్స్ డిబెట్లలో పాల్గొంటున్నారు. ఇక బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడుతున్న గవర్నర్ను.. తామూ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని బీజేపీ స్టేట్ ఛీఫ్ దిలీప్ ఘోష్ చెబుతున్నాడు. -
సఫారీ కారు..సాధారణ పోలీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒకప్పుడు ఇల్లు కదిలి బయటకు వస్తే రాణి వెడలె రవితేజములలరగా అన్నట్టుగా వాహనాల కాన్వాయ్, చుట్టూ పెద్దసంఖ్యలో కమాండోల రక్షణ వలయం ఉండేది. కానీ ఎస్పీజీ భద్రత తొలగించడంతో ఆమెకు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బదులుగా పదేళ్ల క్రితం నాటి టాటా సఫారీ కారు కేటాయించారు. ఇంటి దగ్గర సాధారణ పోలీసుల రక్షణ మాత్రమే ఉంటుంది. జెడ్ ప్లస్ కేటగిరీ కింద 100 మంది సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉంటారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం గాంధీ కుటుంబ సభ్యులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత కల్పించారు. అప్పట్నుంచి సోనియా, ప్రియాంక బాలిస్టిక్ క్షిపణి దాడుల్నీ తట్టుకునేలా ఆధునీకరించిన రేంజ్ రోవర్ కార్లను వాడారు. ఇక రాహుల్ ఫార్చ్యూనర్ కారును వాడేవారు. ఇప్పడు భద్రత తొలగించి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కేటాయించడంతో ఆ వైభోగం అంతా తగ్గిపోయింది. వాయిదా తీర్మానం తిరస్కృతి, కాంగ్రెస్ వాకౌట్ గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు అంశంపై పార్లమెంటులో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి దీనిపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రైతు సమస్యలు, ఢిల్లీ కాలుష్యం అంశాలు చర్చలు ఉన్నందున తీర్మానాన్ని స్పీకర్ బిర్లా తిరస్కరించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సభ్యులు వెల్లోనికి దూసుకుపోయారు. ఎస్పీజీ భద్రత ఎందుకు తొలగించాలో ప్రధాని వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వాజ్పేయి హయాంలోనూ తొలగించలేదు కాంగ్రెస్ ఎంపీ రంజన్ చౌధరి మాట్లాడుతూ ‘‘సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సాధారణ వ్యక్తులు కాదు. గాంధీ కుటుంబానికి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఎస్పీజీ భద్రత తొలగించలేదు. 1991 నుంచి వారికి ఎస్పీజీ భద్రత ఉంది. ఆ తర్వాత రెండు సార్లు ఎన్డీయే అధికారంలోకి వచ్చినా తొలగించలేదు. మరి ఇప్పుడు ఎందుకు తొలగించాల్సి వచ్చింది’ అని ప్రశ్నించారు. తిరిగి ప్రశ్నోత్తరాల సమయంలోనూ కాసేపు వాగ్వాదాలు నడిచాక కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. జేఎన్యూ వివాదంపై స్తంభించిన రాజ్యసభ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న జేఎన్యూ విద్యార్థులపై పోలీసుల దాష్టీకం, కశ్మీర్లో రాజకీయ నేతల నిర్బంధం అంశాలపై రాజ్యసభ దద్దరిల్లింది. మంగళవారం సభ సమావేశం కాగానే విపక్షాలు ఈ అంశాన్ని లేవనెతాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీనిపై వాయిదా తీర్మానాలు అందాయని, ఆ అంశాలు వచ్చినప్పుడు చర్చ చేపడదామని చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పదే పదే చెప్పినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. తమ స్థానాల్లో కూర్చొనే ఈ రెండు అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. సభకు రాహుల్ గైర్హాజరు లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నకు స్పీకర్ సమయం కేటాయించినప్పటికీ ఆయన సభలో కనిపించలేదు. రాహుల్ ప్రశ్న జాబితాలో ఉంది. సభలో రాహుల్ ఉంటే ఆయనకు అవకాశం వచ్చేది అని బిర్లా వ్యాఖ్యానించారు. రాహుల్ సీటులో కూర్చొని ఎంపీ సురేష్ మాట్లాడబోతే వద్దని వారించారు. కేరళలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై రాహుల్ ప్రశ్న అడగాల్సి ఉండేది. -
ప్రాధాన్యహోదా తొలగిస్తాం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్కు లేఖ అందజేశారు. అమెరికా కాంగ్రెస్, భారత ప్రభుత్వానికి దీనిపై నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లో అమల్లోకి వస్తుంది. ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయం ఇప్పుడు భారత్లో చర్చనీయాంశమైంది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించడానికే సిద్ధమయ్యారు. అయితే, దీని వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాద్వాన్ అంటున్నారు. జీఎస్పీ కింద భారత్ రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తే, ఏడాదికి సుమారు రూ.13 వేల కోట్ల ప్రయోజనం కలుగుతోందని ఆయన చెప్పారు. హోదా తొలగింపు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబం«ధాలపై కూడా పెద్దగా ప్రభావం చూపించదని అనూప్ అభిప్రాయపడ్డారు. ఏమిటీ వాణిజ్య ప్రాధాన్య హోదా? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ)ను 1976లో అమెరికా రూపొందించింది. దీని ప్రకారం 129 అభివృద్ధి చెందుతున్న దేశాలను గుర్తించి ఆయా దేశాల నుంచి ఎగుమతి అయ్యే 4,800 రకాల ఉత్పత్తులకు సుంకాలు విధించరాదని నిర్ణయించింది. 1974 వాణిజ్య చట్టం విధివిధానాలకు అనుగుణంగా 1976లో ఈ వాణిజ్య హోదాను ప్రవేశపెట్టింది. ఈ హోదా ద్వారా ఎక్కువ లబ్ధి పొందిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ప్రస్తుతం ప్రతీ ఏడాది 2 వేల రకాల వస్తువుల్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. అమెరికా విధివిధానాల ప్రకారం వాణిజ్య హోదా అనుభవిస్తున్న దేశం తమ దేశీయ మార్కెట్లలో అమెరికా సులభంగా ప్రవేశించడానికి కూడా వీలు కల్పించాలి. కానీ, భారత్ అలాంటి సూత్రాలు పాటించకుండా అమెరికా ఎగుమతులపై అధికంగా పన్నులు విధిస్తోందని ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆరోపణలు చేస్తున్నారు. కొన్నిటి ధరల నియంత్రణ ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. -
ఉప్పల్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు
-
డంపింగ్ యార్డు తొలగించాల్సిందే..
కాకినాడ : డంపింగ్యార్డు సమస్యతో సతమతమవుతున్న లారీ యజమానులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. లారీ యజమానుల సంఘ కార్యాలయం పక్కనే చెత్త వేసి తగలబెట్టడంతో వచ్చే కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వారు ఆదివారం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోగా రేవు ద్వారా జరిగే రవాణా కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కాకినాడ రాజీవ్ గృహకల్ప సమీపంలోని పర్లోపేట వద్ద ఎఫ్సీఐ గొడౌన్లను ఆనుకుని ఉన్న స్థలంలో చాలా కాలంగా చెత్త డంప్ చేస్తున్నారు. నగరానికి డంపింగ్యార్డు లేకపోవడంతో నిత్యం సేకరించే చెత్తను అక్కడకు తరలించి తగలబెడుతున్నారు. దీంతో ఇదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తతోపాటు జంతు కళేబరాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆస్పత్రి వ్యర్థాలను తగలబెట్టడంతో విపరీతమైన దుర్వాసన, పొగ ఆవరించి ఆ ప్రాంతం మీదుగా వెళ్లలేని దుస్థితి నెలకొందంటూ చాలాకాలంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. పైగా లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులతో పాటు చుట్టుపక్కల ఉండే సంజయ్నగర్, పర్లోపేట, దుమ్ములపేట ప్రాంతవాసులు రోగాలు, వ్యాధులతో సతమతమవుతున్నామని గతంలో కూడా రెండుమూడుసార్లు ఆందోళనకు దిగగా అధికారులు, ప్రజాప్రతినిధులు నచ్చచెప్పడంతో వెనక్కి తగ్గారు. తాజాగా డంపింగ్ యార్డు కోసం సామర్లకోట సమీపంలో స్థలం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, డంపింగ్ సమస్య మాత్రం యథావిధిగా కొనసాగడంపై లారీయజమానులు ఒక్కసారిగా నిరసన గళం విప్పారు. ఆగిన లారీలు... కాకినాడ లారీ అసోసియేషన్ పరిధిలోని దాదాపు 2,500 లారీలను ఆదివారం ఎక్కడికక్కడ నిలిపివేశారు. డంపింగ్యార్డు తరలింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు బంద్ విరమించేదిలేదంటూ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజాన సూర్యప్రకాష్, ముత్యం తేల్చిచెప్పారు. పైగా డంపింగ్కు వాహనాలు వెళ్ళే రహదారి వద్ద లారీని అడ్డంగాపెట్టారు. కార్పొరేషన్ పారిశుద్ధ్య వాహనాలు వెళ్ళకుండా నిరోధించారు. దీంతో దిగివచ్చిన కార్పొరేషన్ యంత్రాంగం, పోలీసులు, ప్రజాప్రతినిధులు లారీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. అయితే తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిర్ణయంలో మార్పులేదని స్పష్టం చేస్తున్నారు. మరో వైపు లారీ అసోసియేషన్ ద్వారా జరిగే రేవు కార్యకలాపాలపై బంద్ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. నిత్యం రేవు ద్వారా సుమారు 300లకు పైగా లారీల ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలకు బియ్యం, బొగ్గు, కెమికల్స్ వంటి వస్తువులను రవాణా చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ దాదాపు స్తంభించిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రవాణారంగంతోపాటు రేవు కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. -
సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అనంతపల్లి నుంచి నందమూరు వరకూ రూ. 143 కోట్లతో యర్రకాల్వ ఆధునీకరణ పనులకు, తాళ్లపూడి మండలానికి నీటిశుద్ది ప్లాంట్కు పైప్లైన్ నిర్మాణం కోసం, వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు సోమవారం మధ్యాహ్నం తాళ్లపూడిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. ఆయన వెళ్లిన గంటకే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను అధికారులు తొలగించడంతో శిలాఫలకాల కోసం ఏర్పాటు చేసిన దిమ్మ బోసిపోయినట్లయింది. విషయం ఏమిటంటే ఆ మూడు పథకాలు... మూడు చోట్ల ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆ మూడు చోట్లకు వచ్చే అవకాశం లేకపోవడంతో జన్మభూమి ప్రాంగణంలోనే మూడు శిలాఫపకాలు ఏర్పాటు చేసి సీఎం చేత ప్రారంభోత్సవం చేయించారు. ఆ తర్వాత ఆ శిలాఫలకాలను ఆయా పథకాల వద్ద ఏర్పాటు చేసేందుకు తొలగించారు. విషయం తెలియని జనం దీనిపై చర్చించుకోవడం కనిపించింది. -
గర్భ సంచి తొలగింపుతో..
మహిళలల్లో గర్భ సంచి తొలగింపు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది. మెనోపాజ్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం... రెండు అండాశయాలను అలాగే ఉంచి... గర్భాశయాన్ని మాత్రమే తొలగించిన సందర్భాల్లోనూ మహిళలకు గుండె జబ్బులు మొదలుకొని జీవక్రియ సంబంధిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తప్పడం లేదు. ఇప్పటివరకూ అండాశయాల తొలగింపుతోనే సమస్యలన్న అంచనా ఉండేదని, తాజా అధ్యయనం అది తప్పని చెబుతోందని షానన్ లాగ్లిన్ టొమ్మాసో అనే శాస్త్రవేత్త తెలిపారు. మహిళల వయసు 35 ఏళ్ల కంటే తక్కువ ఉంటే వారికి ఈ సమస్యలు మరింత ఎక్కువ ఇబ్బందిపెట్టే అవకాశముందని తెలిపారు. 1980 –2002 మధ్యకాలంలో అండాశయాలను ఉంచి, గర్భాశయం మాత్రమే తొలగించిన రెండు వేల మంది మహిళల వివరాలను... రెండింటినీ తొలగించిన వారితో పోల్చి చూడటం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని వివరించారు. గర్భాశయం మాత్రమే తొలగించిన వారిలో 14 శాతం మందికి కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురుకాగా, 13 శాతం మంది అధిక రక్తపోటు, 18 శాతం మంది ఊబకాయం, 33 శాతం మంది గుండెజబ్బులకు గురయ్యారని 35 ఏళ్ల లోపు వారిలో ఈ సమస్యలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని విరించారు. గర్భాశయ తొలగింపు విషయంలో మహిళలు మరింత జాగరూకతతో వ్యవహరించేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. -
పేదలపై జులుం తగదు
లక్షల్లో ఇళ్లు అమ్ముకున్న వారిపై చర్యలు శూన్యం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం రాజమహేంద్రవరం అఖిలపక్ష నాయకులు ద్వజం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) : హౌసింగ్ అధికారులు అర్హులుగా గుర్తించి రూ.60,800 అప్పులు చేసి మరీ ప్రభుత్వానికి చెల్లిస్తే ఎండోమెంట్కాలనీలో ఫ్లాట్లను కేటాయించారని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు లక్షల్లో ఆ ఇళ్లను అమ్ముకోవడం వల్లే పేదవారిని అన్యాయంగా ఖాళీ చేయించారని రాజమహేంద్రవరం అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మజ్జి అప్పారావు అధ్యక్షతన అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ప్రకటించిన 181 మంది ఎందుకు అనర్హులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులు చెప్పాలి ఉండగా, అలా కాదని అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆజ్ఞతో ఏకపక్షంగా కొత్తవారికి కేటాయించడం దారుణమన్నారు. అధికారులు, పోలీసులు ఇల్లు ఖాళీచేయించే విధానం కూడా లబ్ధిదారులను భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. తలుపులు పగలుగొట్టి, బయటకు ఈడ్చడం వంటి చర్యలు దారుణమన్నారు. కొత్తగా ఇచ్చిన 181మంది లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులు ఉంటే తొలగించినా ఇబ్బంది లేదని అర్హులకు మాత్రం అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతామని, బాధితులకు న్యాయం జరగని పక్షంలో కార్యాచరణ ఉద్యమాన్ని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశపడడం దారుణం : రౌతు అధికారపార్టీ నాయకులు లక్షల్లో సొమ్ములు వసూలు చేసి అర్హులైన పేదవాడి ఎంగిలి మెతుకులు కోసం ఆశపడడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నగర కో ఆర్డినేటర్ రౌతుసూర్యప్రకాశరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపేదవాడికి గూడు ఉండాలన్న ఉద్ధేశ్యంతో దేవదాయశాఖ భూమిలో గృహాలను నిర్మించారన్నారు. లబ్ధిదారులను అధికారులు సర్వే చేసిన తరువాతే వారి వద్ద సొమ్ములు కట్టించుకుని ఇళ్లు కేటాయించారన్నారు. అప్పుడు అర్హులు ఇప్పుడు అనర్హులు ఎలా అవుతారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నిర్మించిన వాంబే గృహాలలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనర్హులు ఉన్నారని తన దృష్టికి వచ్చినా పేదవాడికి అన్యాయం జరగకూడదని భావించి ఎవరినీ తొలగించలేదని స్పష్టంచేశారు. లబ్ధిదారుల కోసం పోరాడుతున్న మజ్జి అప్పారావును పోలీసులు అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించారు. క్రిమినల్ కేసులు పెట్టాలి : సీపీఎం నేత అరుణ్ లబ్ధిదారులను అర్హులుగా ప్రకటించిన అప్పటి కలెక్టర్ నుంచి కింద తహసీల్దార్, హౌసింగ్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆ తరువాత వీరిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత టి.అరుణ్ డిమాండ్ చేశారు. అప్పటి అధికారులు సర్వేలు నిర్వహించి అర్హులుగా ప్రకటించిన తరువాతే సొమ్ములు కడితేనే ఇళ్లు కేటాయించారన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనమా? కందుల ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కాదని రాజ్యాంగ విరుద్ధమైన జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో పచ్చ చొక్కాలకు ఇళ్లను కేటాయించడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులుగా ప్రకటించిన 181మంది ఎందుకు అర్హులు కారో వివరంగా శ్వేతపత్రంను విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అప్పటి ఎమ్మెల్యే రౌతు ఎంతో కృషి చేసి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మించి ఇచ్చారన్నారు. సీపీఐ నగర అధ్యక్షుడు నల్లా రామారావు మాట్లాడుతూ 181 మంది లబ్ధిదారుల తొలగింపుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి కలిస్తే అందరితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పినా అది అమలుకు నోచుకోలేదన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు పోలీసులు, అధికారులతో బలవంతంగా ఖాళీచేయించడం దారుణమన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు వైరాల అప్పారావు మాట్లాడుతూ లబ్ధిదారులలో దళితులు అని చూడకుండా దారుణంగా తలుపులు పగలగొట్టి ఖాళీ చేయించడంపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని హెచ్చరించారు. తండ్రి ముఖ్యమంత్రి, కుమారుడు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రీ కొడుకులుకు ఇళ్లు ఉండకూడదా అని ఎద్దేవా చేశారు. నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్లీడర్ పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన లబ్ధిదారుణి పెద్దిరెడ్డి రాజేశ్వరిదేవిని అనర్హురాలుగా ప్రకటించి ఖాళీ చేయించడం దారుణమన్నారు. ఉద్యమ నేత మజ్జి అప్పారావు మాట్లాడుతూ అధికారులు, పోలీసులు తీరు దారుణమని, 54 మందికి హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిందని, పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును సీడీల రూపంలో త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అఖిలపక్ష నాయకులు మార్తి నాగేశ్వరరావు, పోలిన వెంకటేశ్వరరావు, గోలి రవి, మార్గాని రామకృష్ణగౌడ్, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
శిలాఫలకం తొలగింపులో వివాదం
మంగితుర్తిలో తీవ్ర ఉద్రిక్తత పురుగు మందు తాగి ముగ్గురు ఆత్మహత్యాయత్నం ఎమ్మెల్యే వర్మ తీరుపై మండిపడ్డ భక్తులు పిఠాపురం రూరల్ : పిఠాపురం మండలం మంగితుర్తిలో ఓ రామాలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం తొలగింపు ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, అతడి అనుచరులు తీరుకు నిరసనగా గ్రామంలోని ఓ వర్గం భక్తులు సోమవారం ఆందోళనకు చేపట్టారు. శిలాఫలానికి తొలగిస్తే ఊరుకునేది లేదంటూ ఆలయం వద్ద నిరసన దిగారు. ఆందోళన కారులతో చర్చలు జరిపినా పోలీసులు వారిని అక్కడ నుంచి పంపించే ప్రయత్నాలు చేపట్టారు. దీంతో ఒక్క సారిగా మహిళా భక్తులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇంతలో ఆందోళనతో ఉన్న పేకేటి బేబి, యాళ్ల సత్యవతి, యాళ్ల దొరబాబులు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ నేత అనుచరులపై ఆందోళన కారులు దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక టీడీపీ నేతలను అక్కడ నుంచి పంపి వేశారు. పురుగుల మందు తాగిన ముగ్గురుతో పాటు ఆందోళనల్లో సొమ్మసిల్లిన పేకేటి కాంతంను మొదట విరవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి తదుపరి పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పేకేటి బేబి పరిస్థితి ఆందోళన కరంగా ఉండగా మిగిలిన ముగ్గురు కోలుకుంటున్నట్లు బాధితులు బంధువులు తెలిపారు. వివాదానికి కారణం శిలాఫలకమే మంగితుర్తి పల్లపు వీధిలోని రామాలయం శిథిలావస్థకు చేరడంతో స్థానిక నేత బొంతల గంగాధర్ అలియాస్ పేకేటి బాబు ఆలయ పుననిర్మాణానికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా అప్పటి కేంద్ర టూరిజం శాఖ మంత్రి, సినీనటుడు చిరంజీవి ఆశ్రయించడంతో ఆలయ అభివృద్ధికి పర్యాటకు అభివృద్ధి సంస్థ ద్వారా రూ. 10.49 లక్షలు నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో 2014లో పనులు ప్రారంభించగా ఇటీవలే ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేశారు. కాగా నిధులు ఆలయ సరిపడకపోవడంతో రామాలయంలోని విగ్రహాలు, ప్లోర్ టైల్స్కు బాబు కొంత మొత్తాన్ని హెచ్చించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ముఖద్వారం వద్ద బాబు తన తల్లిదండ్రుల పేరిట శిలాఫలకాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం గుడి నిర్వాహణను సైతం అనధికారికంగా స్థానిక ఆలయ కమిటీకి అప్పగించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆలయానికి బాబు తన తల్లిదండ్రుల పేరిట శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం, ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను పిలవకపోవడం అవమానంగా బావించి కక్ష్య సాధింపుకు దిగారు. టూరిజం శాఖ ఏఈ కృష్ణతో బాబుపై పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించి నాన్బెయిల్బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేయించారు. వివాదానికి కారణమైన శిలాఫలకాన్ని పోలీసు బందోబస్తు నడుమ తొలగించారు. కొత్త శిలాఫలకాన్ని వెంట తెచ్చుకున్న అధికారులు గ్రామంలో ఉత్రిక్తత పరిస్థితులు ఉండడంతో దానిని తిరిగి తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యేతో చేయించాల్సిన రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సైతం వాయిదా వేసినట్లు ప్రకటించారు. పోలీసు పికెట్ ఏర్పాటు గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశాలు ఉండడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్టు రూరల్ ఎస్సై వి.కోటేశ్వరరావు తెలిపారు. అలాగే ఆత్మాహత్యాయత్నం పాల్పడిన ముగ్గురితో పాటు అధికారుల విధులకు ఆటంకపర్చిన మరో ఐదుగురుపైనా వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిఠాపురం సిఐ పి.అప్పారావు, ఎస్సైలు శోతభన్బాబు, మూర్తి, రాందాసు, సత్యనారాయణ, శివకృష్ణ, టూరిజం శాఖ ఈఈ శ్రీనివాసరావు, డీఈ సత్యనారాయణ, ఏఈ కృష్ణ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శిలాఫలక తొలగింపు పనులను పర్యవేక్షించారు. బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ శిలాఫలకం తొలగింపు వివాదంలో పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత పెండెం దొరబాబు పిఠాపురం ఆస్పత్రిలో పరామర్శించారు. వివాదానికి కారణమైన శిలాఫలక స్థలాన్ని ఆయన సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎమ్మెల్యే వర్మ నియంతపోకడలవల్లే ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. టూరిజం శాఖ అధికారులు తమ శాఖ ద్వారా శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆలయానికి సుమారు రూ. 4 లక్షలు సొంత నిధులు హెచ్చించిన దాత పేకేటి బాబు తల్లిదండ్రుల పేరిట శిలాఫలకాన్ని తొలగించిన వారే తిరిగి ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దాత తరపున శిలాఫలకం ఏర్పాటు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా వైఎస్సార్ సీపీ కార్యదర్శి గండేపల్లి బాబి, వైఎస్సార్ సీపీ నేతలు కర్రి ప్రసాద్, బొజ్జా పెదకాపు, ఉలవల భూషణం, బత్తిన ప్రకాష్, కసిరెడ్డి అక్కయ్య తదితరులు ఉన్నారు. -
చెదిరిన వ్యాపారాలు.. ప్రతీకారమా..?
-
ప్రాంకియాస్లోని 4 కేజీల కేన్సర్ గడ్డ తొలగింపు
• దేశంలోనే తొలిసారిగా ఉస్మానియాలో చికిత్స • 60 ఏళ్ల నిరుపేదకు పునర్జన్మ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో అరుదైన రికార్డు సృష్టించారు. శరీరంలోని అత్యంత క్లిష్టమైన ప్రాంకియాస్కు ఆనుకుని ఉన్న నాలుగు కేజీల బరువైన కేన్సర్ గడ్డను విజయవంతంగా తొలగించారు. దేశంలోనే ఈ తరహా చికిత్స తొలిసారని వైద్యులు వెల్లడించారు. శనివారం డాక్టర్ మధుసూదన్ చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. జహీరాబాద్ నిరుపేద కుటుంబానికి చెందిన విఠల్ (60) ఎనిమిది నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అనేక మంది వైద్యులకు చూపించినా నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఆయన నెల కిందట ఉస్మానియాలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ప్రముఖ కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ చింతకింది గణేష్ను సంప్రదించారు. బాధితుడిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్రాంకీయాస్ నుంచి ఇతర భాగాలకు ఇన్స్లిన్ను సరఫరా చేసే కీలకమైన రక్తనాళాలకు ఆనుకుని పెద్ద కేన్సర్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. 20 రోజుల క్రితం 8 మందితో కూడిన వైద్యుల బృందం తొమ్మిది గంటల పాటు శ్రమించి గడ్డను విజయవంతంగా బయటికి తీశారు. కడుపు, గర్భసంచిలో పది కేజీల గడ్డలు ఉండటం సహజం. కానీ చాలా చిన్న పరిమాణంలో ఉండే ప్రాంకీయాస్లో నాలుగు కేజీల బరువుతో కూడిన కేన్సర్ గడ్డ ఉండటం చాలా అరుదు. దీని చుట్టూ అనేక రక్తనాళాలు ముడిపడి ఉంటాయి. ఇలాంటిచోట చికిత్స చేయడం క్లిష్టమైన ప్రక్రియ. కానీ, తాము దీన్ని సవాలుగా తీసుకుని చికిత్స చేశామని మధుసూదన్ తెలిపారు. ఇలాంటి చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.10–రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ ఉస్మానియాలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నాడన్నారు. -
అంతా నా ఇష్టం!
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ 24 మంది ఎంపీహెచ్ఏల తొలగింపు కనీసం నోటీసులూ ఇవ్వని వైనం ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు డీఎంహెచ్ఓ తీరుపై విమర్శలు అనంతపురం మెడికల్ : వైద్య, ఆరోగ్యశాఖలో ఆయనో కీలక అధికారి. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిందిపోయి సొంత నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 24 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్–మేల్ పోస్టుల భర్తీకి 2003లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 156 పోస్టులుండగా నలుగురు అభ్యర్థులు లేకపోవడంతో 152 భర్తీ చేశారు. అప్పట్లోనే పదో తరగతి విద్యార్హత ఉన్న వారిని తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. 44 మందిని తొలగించి వారి స్థానంలో మెరిట్ ఆధారంగా ఇంటర్ విద్యార్హత ఉన్న వారిని తీసుకున్నారు. తొలగించిన వారు కోర్టుకు వెళ్లడంతో మూడేళ్ల తర్వాత వారందరికీ పోస్టింగులిచ్చారు. అయితే.. అప్పట్లో రూపొందించిన మెరిట్ జాబితాలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల 24 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 14 ఏళ్ల క్రితం విధుల్లోకి తీసుకున్న 44 మందిలో 24 మందిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ ఎంపీహెచ్ఏ–మేల్ పోస్టుల భర్తీ క్రమంలో గతంలో పని చేస్తున్న వారిని తొలగించరాదని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య గత నెల 27న మెమో (నంబర్ 7342/జీ2/2015–09) జారీ చేశారు. అనంతరం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు ప్రాముఖ్యతనిస్తూ ఎంపీహెచ్ఏ–మేల్ అందరినీ ఉద్యోగాల్లో కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎంహెచ్ఓలకు డిసెంబర్ 1వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ అరుణకుమారి కూడా ఉత్తర్వులు (ఆర్సీ నంబర్ : 19247/ఈ4–ఎ) జారీ చేశారు. అయినా వీటిని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ బేఖాతరు చేశారు. ఆందోళనబాటలో ఉద్యోగులు ఏళ్ల తరబడి పని చేస్తున్న తమను తొలగించడంపై ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఇప్పటికే కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్షలకు దిగారు. ఇంత ఏకపక్షమా? 2013లో ఎంపీహెచ్ఏగా జాయిన్ అయ్యాను. కుందుర్పి పీహెచ్సీలో పని చేసేవాడిని. ఇప్పుడు నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తే ఎలా? డీఎంహెచ్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయాలి. - శ్రీనివాస్ స్పష్టత కోసం అధికారులను పంపుతున్నా 42 మందిని తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఒకసారి ఉద్యోగులను తీసెయ్యాలని వచ్చింది. మరోసారి 'ఎక్సర్సైజ్' చేయాలని వచ్చింది. రకరకాలుగా ఆదేశాలు వస్తున్నాయి. ఉన్న వారిని తొలగించకపోతే ఆదేశాలు అమలు చేయలేం. గతంలో ఈ పోస్టుల భర్తీ సరిగా లేదు. తొలగించిన వారి జాబితా ప్రభుత్వానికి పంపాం. వీలైనంత వరకు ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తాం. స్పష్టత కోసం సోమవారం కార్యాలయంలోని అధికారులను విజయవాడకు పంపుతున్నాం. - వెంకటరమణ, డీఎంహెచ్ఓ -
కేజీబీవీల్లో ‘పది’ ఫలితాల ఎఫెక్ట్
ముగ్గురు సీఆర్టీల తొలగింపు అనంతపురం ఎడ్యుకేషన్ : ఎస్ఎస్ఏ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న సీఆర్టీ (కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్)లపై పదో తరగతి ఫలితాల ప్రభావం పడింది. ఈ క్రమంలో ముగ్గురిని విధుల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. 2015 –16 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో కళ్యాణదుర్గం కేజీబీవీలో 15 మంది బాలికలు గణితంలో, కంబదూరులో 8 మంది విద్యార్థినులు సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ఇందుకు బాధ్యులను చేస్తూ కళ్యాణదుర్గం కేజీబీవీలో గణితం సీఆర్టీగా పని చేస్తున్న మునెమ్మ, కంబదూరు కేజీబీవీలో ఫిజికల్ సైన్స్ (పీఎస్) సీఆర్టీగా పని చేస్తున్న వరలక్ష్మీ, న్యాచురల్ సైన్స్ (ఎన్ఎస్) సీఆర్టీగా పని చేస్తున్న మంజులను తొలిగించారు. కొందరు పిల్లలు కొన్ని సబ్జెక్టుల్లో పూర్తిగా వెనుకబడి ఉంటారని అందుకు తమను బాధ్యులు చేయడం ఎంతవరకు సబబని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉం డగా బాధితులు జిల్లాలోని ముఖ్య ప్రజాప్రతినిధులను ఆశ్రయించి వారి ద్వారా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకు వెళ్లినట్లు సమాచారం. -
5,500 ఉద్యోగాలకు సిస్కో కోత
♦ భారత్పైనా ప్రభావం! ♦ దేశంలో సంస్థకు 11వేల మంది ఉద్యోగులు న్యూయార్క్: అమెరికాకు చెందిన నెట్వర్కింగ్ కంపెనీ సిస్కో భారీగా ఉద్యోగులను తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 5,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ సంఖ్య సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 7 శాతానికి సమానం. ఈ ప్రభావం భారత్లోని సంస్థ ఉద్యోగులపైనా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే సిస్కోకు భారత్కు రెండో అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఇక్కడ సంస్థకు 11,000 మంది ఉద్యోగులున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 73వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎంత మందిని తొలగించనున్నదీ సిస్కో వెల్లడించలేదు. కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కారణంగా 5,500 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని, 2017 మొదటి త్రైమాసికం నుంచి తొలగింపు ప్రక్రియ చేపడతామని సిస్కో ఎగ్జిక్యూటివ్వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్వో కెల్లీక్రామర్ తెలిపారు. నెట్వర్క్ స్విచెస్, రూటర్ల విక్రయాలు నిదానించడంతో సిస్కో డేటా అనలిటిక్స్ సాఫ్ట్వేర్, డేటా సెంటర్లకు క్లౌడ్ ఆధారిత టూల్స్ అందించే నూతన వ్యాపార విభాగాలపై దృష్టి కేంద్రీకరించింది. సిస్కోకు భారత్ కీలకం... 2016 జూన్ త్రైమాసికంలో సిస్కో ఆదాయాలు 2 శాతం తగ్గి 12.6 బిలియన్ డాలర్లకు పడిపోగా... లాభం మాత్రం 21 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖ్యంగా ఇతర వర్ధమాన దేశాల నుంచి ఆదాయాలు 6 శాతం తగ్గిన పరిస్థితుల్లోనూ భారత్ నుంచి కంపెనీ ఆదాయాలు 20 శాతం వృద్ధి చెందడం విశేషం. -
మూడు కిలోల కణితి తొలగింపు
నల్లగొండ టౌన్ః జిల్లా కేంద్రంలోని గ్రీన్ల్యాండ్ ఆస్పత్రిలో మంగళవారం మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి కడులోంచి మూడు కిలోల కణితిని తొలగించారు. వేములపల్లి మండలం పుచ్చకాయలగూడేనికి చెందిన ప్రమీల కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. పరీక్షలను నిర్వహించిన వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించి మంగళవారం డాక్టర్ సునిత, డాక్టర్ వేణు, డాక్టర్ నర్సింహ్మ, డాక్టర్ అన్సారీల బృందం ఆమెకు శస్త్ర చికిత్సను నిర్వహించి కణితిని తొలగించారు. -
మహానేత విగ్రహం తొలగింపుపై నిరసనలు
-
మహానేత విగ్రహం తొలగింపుపై నిరసనలు
విజయవాడ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై విజయవాడలో నిరసనలు వెల్లువెత్తాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బందర్ రోడ్డు వరకు ఆదివారం వైఎస్ఆర్ సీపీ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ బరితెగింపు చర్యలపై నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్ సీపీ నేతలు మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, ఉప్పులేటి కల్పన, పార్థసారథి, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, జోగి రమేష్, నాగేశ్వర్ రావు, భవకుమార్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
379 మంది కేజీబీవీ ఉద్యోగుల కడుపు కొట్టారు!
ప్రత్యేకాధికారులు సహా ఉపాధ్యాయులు, కార్మికులను తొలగించాలని ఉత్తర్వులు రేపటి నుంచి అమలు బి.కొత్తకోట: ఇటీవలే ఆరోగ్య మిత్రల కడుపుకొట్టిన ప్రభుత్వం తాజాగా కేజీబీవీ ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. జిల్లాలోని 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ)లో పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు సహా ఉపాధ్యాయులు, సిబ్బందిని ఈనెల 23నుంచి తొలగించాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ రమణమూర్తి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఏటా మే నెలలో ఉపాధ్యాయ, సిబ్బందిని విధులనుంచి తొలగించడం సాధారణమే. అయితే ప్రస్తుతం కొత్తగా ప్రత్యేకాధికారులను తొలగింపు జాబితాలో చేర్చింది. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారా, లేదా అన్న విషయాన్ని ఆదేశాల్లో పేర్కొనలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం నుంచి జిల్లాలోని 20 కేజీబీవీల్లో పనిచేస్తున్న 379మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో కేజీబీవీలో ఒక ఎస్ఓ, సబ్జెక్ట్ టీచర్లు ఏడుగురు, పీఈటీ ఒకరు, ఏఎన్ఎం ఒకరు, అకౌంటెంట్ ఒకరు, అటెండర్ ఒకరు, పగలు, రాత్రి వాచ్మెన్లు ఇద్దరు, స్కావెంజర్ ఒక రు, స్వీపర్ ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు, స్కిల్ ఇన్స్ట్రక్టర్ ఒకరు, కుక్ ఒకరు పనిచేస్తున్నారు. ఇలా బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, కురబలకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కుప్పం, గుడిపల్లె, రామకుప్పం, శాంతిపురం, బెరైడ్డిపల్లె, గంగవరం, పుంగనూరు, రామసముద్రం, నిమ్మనపల్లె, కలకడ, కేవీ.పల్లె, రొంపిచర్ల, యర్రావారిపాళ్యం, కేవీబీపురం విద్యాలయాల్లో 439 మంది పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాల్లో చేరారు. వీరిలో అకౌంటెంట్, పగలు, రాత్రి వాచ్మెన్లు మినహా మిగిలిన 19మందిని విధులనుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా 379మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. వేసవి సెలవుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఏప్రిల్ వరకు కొనసాగించి మేనెలలో వేతనాలు నిలిపివేస్తారు. జూన్ నుంచి మళ్లీ కొత్త విద్యాసంవత్సరంలో తిరిగి విధుల్లోకి కొత్తగా కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లోకి తీసుకొంటారు. అయితే ప్రస్తుతం జారీచేసిన ఆదేశాల్లో ఎస్వోలను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అకౌంటెంట్, వాచ్మెన్లను మాత్రం కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 23 నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో మళ్లీ వీరిని కొనసాగించే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. గతానికి భిన్నంగా ఎస్వోలను తొలగించడం, వారిని మళ్లీ చేర్చుకోవడంపై స్పష్టత లేని కారణంగా ప్రభుత్వం వీరికి అన్యాయం చేసేలా ప్రయత్నాలు చేస్తోందన్న వాదన వినవస్తోంది. -
లేజర్ హెయిర్ రిమూవల్ తో సమస్యే..
చర్మ సౌందర్యం కోసం... ఫ్యాషన్ గా అందంగా కనిపించడం కోసం ఇటీవల అమ్మాయిలు లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేసుకోవడం మామూలైపోయింది. అయితే దాంతో ప్రమాదాలే ఎక్కువ అంటున్నారు ప్రముఖ నవలా రచయిత్రి మరియన్ కెఎస్. తాను అనుభవ పూర్వకంగా చెప్తున్నానని, లేజర్ హెయిర్ రిమూవల్ తో వచ్చే నొప్పి చావుకు అంచులుదాకా తీసుకెడుతుందని, ఒక్కోసారి ఆ నొప్పికి ఉపశమనంకోసం వాడే క్రీములవల్ల కూడ చనిపోయే ప్రమాదం ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నవలా రచయిత్రి అయిన మరియన్ కెఎస్... ఆక్స్ ఫర్డ్ లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా మాట్లాడుతూ... లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు గుడ్లు బయట పడేలా ఏడ్వాల్సి వస్తుందని, నొప్పితో చచ్చిపోవాల్సి వస్తుందని... ఇది నా కథ అని, దయచేసి మీరు దీని జోలికి వెళ్ళకండి అంటూ హెచ్చరించారు. అయితే తాను ఫెమినిస్టునే అయినా కాళ్ళపై తీవ్రంగా ఉండే జుట్టును తీయకుండా ఉండలేకపోయేదాన్నని, అందుకే నెలకోసారి వాక్సింగ్ తో కాళ్ళమీద జుట్టును తొలగించుకునే ప్రయత్నం చేసేదాన్నని చెప్పారు. ఆ నొప్పి తగ్గించుకునేందుకు ఎనస్థెటిక్ క్రీములు వాడానని, ఆ క్రీములవల్ల కూడ క్రమంగా ప్రాణ భయం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారని , అనుభవజ్ఞులైన డాక్టర్ల అనుమతితో తప్పించి వాడకూడదని సౌందర్య ప్రేమికులకు ఆమె సలహా ఇస్తున్నారు. తాను చేసుకున్న మొదటి లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్ మెంట్ తర్వాత... 51 ఏళ్ళ ఐరిష్ నవలా రచయిత్రి తన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. తన అనుభవం సౌందర్య ప్రేమికులకు హెచ్చరికేనంటున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ వల్ల వచ్చే నొప్పి అంతా ఇంతా కాదని, మొదటి ట్రీట్ మెంట్ తోనే తనకు జీవితానికి సరిపడే అనుభవం వచ్చిందన్నారు. ఆ నొప్పిని తగ్గించుకునేందుకు లోకల్ ఎనస్థెటిక్ క్రీమ్ ను ఆశ్రయించాల్సి వచ్చిందని, అయతే అటువంటి క్రీమ్ లు కూడ ప్రాణాలకు నష్టాన్ని కలిగిస్తాయని వైద్యులు చెప్తున్నారని అన్నారు. అయితే క్రీమ్ రాసిన తర్వాత గాని తనకు ఉపశమనం లభించడం లేదని, లోకల్ ఎనస్థెటిక్ క్రీమ్ లు కూడ అధికంగా వాడటం వల్ల 'ఎనస్థెటిక్ టాక్సిసిటీ' సంభవిస్తుందని, అది ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారన్నారు. -
29న బ్యాంకు అధికారుల సమ్మె
న్యూఢిల్లీ: ధన్లక్ష్మి బ్యాంక్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ పీవీ మోహనన్ తొలగింపునకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారుల సంఘంలోని ఒక వర్గం ఈ నెల 29న సమ్మెకు పిలుపునిచ్చింది. అదే రోజున కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీవోసీ) కేరళ రాష్ట్ర విభాగానికి మోహనన్ ప్రెసిడెంటుగా కూడా ఉన్నారు. అమానుషమైన చట్టాన్ని ప్రయోగించి మోహనన్ను ధన్లక్ష్మీ బ్యాంకు విధుల నుంచి తొలగించిందని ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ హర్విందర్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో 29న ఒక రోజు సమ్మె జరపాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. తమ అసోసియేషన్లో 2.75 లక్షల మంది పైచిలుకు ఆఫీసర్లు సభ్యులుగా ఉన్నారని సింగ్ చెప్పారు. ఆంధ్రా బ్యాంక్, బీఓబీ తదితర బ్యాంకులు ఇప్పటికే సమ్మె పిలుపు గురించి ఖాతాదారులకు తెలియజేశాయి. సమ్మె జరిగితే ఖాతాదారులకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. -
టీఎల్ఎఫ్ నుంచి వెంకటస్వామి తొలగింపు
హైదరాబాద్: తెలంగాణ లెక్చరర్స్ ఫోరం(టీఎల్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామిని ఫోరం నుంచి తొలగించారు. ఆదివారం ఇక్కడ జరిగిన టీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఈ మేరకు తీర్మానం చేసింది. ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లో ఉంటున్న కారణంగా వెంకటస్వామి ఫోరం సభ్యత్వానికి అర్హుడు కాదంటూ పేర్కొంది. వెంకటస్వామి స్థానంలో నూతన అధ్యక్షుడిగా మురళీమనోహర్ ఎన్నికయ్యారు. మిగతా పాత కమిటీ యథాతథంగా కొనసాగుతుందని మురళీమనోహర్ చెప్పారు. ప్రైవేటు కళాశాలల లెక్చరర్ల ఉద్యోగ భద్రతకై ప్రత్యేక కార్యాచరణను తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లెక్చరర్లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ, 10 ప్లస్ 2 విద్యా విధానంపై ప్రత్యేక సబ్ కమిటీ వేస్తామని, కమిటీ నివేదిక అనంతరం ఈ సమస్యలపై స్పందిస్తామని చెప్పారు. -
భారీగా తగ్గిన ఓటర్లు
జిల్లాలో మొత్తం ఓటర్లు 33,38,938 గతేడాది కంటే 71,679తక్కువ 4 నియోజకవర్గాల్లో పెరుగుదల.. 11 నియోజకవర్గాల్లో తగ్గుదల అత్యధికంగా విశాఖ పశ్చిమలో 17,987 ఓటర్ల తొలగింపు కొత్త ఓటు హక్కు పొందిన యువత 26,693 మందే 2016 ఓటర్ల తుది జాబితా వెల్లడి విశాఖపట్నం: గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ఓటర్లలో భారీగా కోతపడింది. ఓటర్ల తుది జాబితా-2016ను మంగళవారం జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. తుది జాబితా ప్రకారం జిల్లాలో 33,43,190 మంది ఓటర్లున్నట్టుగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన ఓటర్ల జాబితాతో పోలిస్తే ఏకంగా 20 శాతం మేర కోతపడింది. వీటిపై డిసెంబర్ -15వ తేదీ వరకు విచారణ చేసి, జనవరి 11న తుది జాబితా సిద్ధంచేశారు. తగ్గడం ఇదే తొలిసారి ఓటర్ల సవరణ కోసం గతేడాది అక్టోబర్-5 భారత ఎన్నికల సంఘం నోటిఫి కేషన్ జారీ చేసింది. నవంబర్ 16 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 11న, నవంబర్ 1న పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు నిర్వ హించారు. కొత్తగా ఓటుహక్కు కోసం 26,693 మంది, ఓటు హక్కు తొలగింపు కోసం 623 మంది, చేర్పులు మార్పుల కోసం 5145 మంది, నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ బూత్ నుంచి మరో పోలింగ్ బూత్కు ఓటు బదిలీ కోసం 1412 మంది దరఖాస్తు చేసు కున్నారు. వీటిపై డిసెంబర్ -15 వరకు విచారణ చేపట్టారు. తుది జాబితాను జనవరి 11న ప్రచురించారు. ఈ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో గతంతో పోలిస్తే ఓట్ల సంఖ్య పెరగాల్సింది పోయి గణనీయంగా తగ్గింది. 2015 ఓటర్ల జాబితా కింద జిల్లాలో 34,10,617 మంది కాగా, తాజాగా సవరించిన ఓటర్ల జాబితా-2016 ప్రకారం జిల్లాలో 33,38,938 మంది ఓటర్లున్నారు. అంటే ఏకంగా 71,679 మంది ఓటుహక్కును కోల్పోయారు. ఇంత భారీ స్థాయిలో ఓటర్లలో కోత పడడం ఇదే తొలిసారి. 2015లో పురుష ఓటర్లు 17,00195 మంది ఉంటే.. ప్రస్తుతం 16,63,444 మంది ఉన్నారు. అలాగే 2015లో స్త్రీలు 17,10,161 మంది ఉంటే ప్రస్తుతం 16,75,236 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుష ఓట్లు 36,751 మహిళా ఓట్లు 34,925 తగ్గాయి. 2015లో ఇతరులు 261 మంది ఉంటే ప్రస్తుతం 258 మంది ఉన్నారు. ఏడుగురు ప్రవాస భారతీయులకు ఓటు హక్కు 2016లో కొత్తగా విశాఖ ఈస్ట్ పరిధిలో ఏడుగురు ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించారు. 4252 మంది సర్వీస్ ఓటర్లుండగా, వారిలో 3459 మంది పురుషులు, 793 మంది స్త్రీలు ఉన్నారు. సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం హెచ్చుతగ్గులు నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే భీమిలిలో 2353, విశాఖ ఈస్ట్లో 2906, మాడుగులలో 744, పాడేరులో 750 చొప్పున ఓట్ల సంఖ్య పెరగగా, విశాఖ సౌత్లో 7035, నార్త్లో 15,852, పశ్చిమలో అత్యధికంగా 17,987, గాజువాకలో 12,049, చోడవరంలో 1953, అరకువాలీ (ఎస్టీ)లో 2698, అనకాపల్లిలో 3620, యలమంచలిలో 8290, పాయకరావుపేటలో 6777, నర్సీపట్నంలో 1849 చొప్పున ఓట్లు తగ్గాయి. 18-19 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఓటు హక్కుకు అర్హతకలిగిన యువత 1.75,298 మంది ఉన్నారు. వారిలో 62,250 మంది మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండగా, కొత్తగా 26,693 మంది మాత్రమే ఓటు హక్కు పొందారు.1,13,048 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. మరో పక్క చనిపోయిన వారితో పాటు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు, అనర్హులను తొలగించడంతో సవరించిన జాబితాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
500 మంది అంగన్వాడీల తొలగింపు?
-
'అంగన్ వాడీల తొలగింపు అమానుషం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అంగన్ వాడీల తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారనే అక్కసుతో ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. వీడియో సీడీలు, ఫొటోల ఆధారంగా ఉద్యోగులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించడం అత్యంత అమానుషమైన చర్య అని ఆమె అభివర్ణించారు. అంగన్ వాడీలపై ప్రతీకారం తీర్చుకోవడం బాధాకరమని.. అత్తెసరు జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న నిరుపేద అంగన్ వాడీలను ఉద్యోగుల నుంచి తొలగించడం దుర్మార్గమని రోజా చెప్పారు. తహశీల్దార్ వనజాక్షి విషయంలో చంద్రబాబు కుటిలనీతిని ప్రదర్మించారని, రిషితేశ్వరి మరణానికి బాధ్యుడైన ప్రిన్సిపల్ను చంద్రబాబు కాపాడరని రోజా ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాజాగా జీతాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించడంతో మహిళలంటే చంద్రబాబుకు ఎంత లోకువో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు. ఉద్యోగాల తొలగింపు ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంగన్ వాడీల తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని రోజా హెచ్చరించారు. -
డిల్లీలో ముదురుతున్న ఆక్రమణల తొలగింపు వ్యవహరం
-
ఉద్యోగాలు ఊడబెరికారు
అర్ధంతరంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ల తొలగింపు రమ్మని పిలిచి... ఊస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు రోడ్డునపడిన 20 మంది.. నోటీసు లేదు... కారణం చెప్పలేదు... తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదు...కానీ అర్ధంతరంగా 20 మంది ఐసీడీఎస్ సూపర్వైజర్ల ఉద్యోగాలు పీకేశారు. బాబు వస్తే జాబు వస్తాయని ఊదరగొట్టిన టీడీపీ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది. ఉత్తరాంధ్రలో 20 మంది సూపర్వైజర్లను అర్ధంతరంగా తొలగించడమే ఇందుకు తాజా తార్కాణం. విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఐసీడీఎస్లో 20 మంది సూపర్వైజర్లను ప్రభుత్వం అర్ధంతరంగా, అన్యాయంగా తొలగించింది. ఆఫీసుకు పిలిపించి ఏమీ చెప్పకుండానే చేతిలో ఓ ‘కవర్’ పెట్టారు. ఇంటికి వెళ్లి ఆ కవర్ తెరచి చూడమని పంపించివేశారు. అందులో ఏముందో తెలియక ఇంటికి వెళ్లి సూపర్వైజర్లు ఆ కవర్ తెరచి చూసి ఒ హతాశులయ్యారు. ‘మిమ్మల్ని సూపర్వైజర్లుగా తొలగించాం. కా వాలంటే మీ రు అంగన్వాడీ కార్యకర్తలుగా చేరొచ్చు. కానీ ఎక్కడ పోస్టింగో కూడా చెప్పలేం’అని అం దులో ఉంది. ఇలా ఎలాంటి కారణం చూపించకుండా త మను తొలగిచడంతో ఆ సూపర్వైజర్లు నిర్ఘాంతపోయారు. 2013లో ఉత్తరాంధ్రలో 237 ఐసీడీఎస్ సూపర్వైజర్ పోస్టు ల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఎంపిక పరీక్షలో ర్యాం కుల ఆధారంగా అర్హులైన 159 మందికి పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన పోస్టులు ఖాళీ గానే ఉన్నాయి. అలా ఎంపికైనవారు ప్రస్తుతం ప్రొబేషన్లో ఉన్నారు. మరో రెండు నెలల్లో వారి ఉద్యోగాలు పర్మినెంట్ అవుతయని వా రు ఆశిస్తున్నారు. ఉన్నఫళంగా 20 మంది సూపర్వైజర్లను ఉద్యోగాల నుంచి తొలగిం చారు. ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని చెబుతూ వారిని తొలగిం చినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఎంపిక చేసిన ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం సూపర్వైజర్లను తొలగించడమేమిటో ప్రభుత్వానికే తెలియాలి. సక్రమంగా ఎంపికైనా: సూపర్వైజర్లను అడ్డగోలుగా తొలగించినట్లు ప్రభుత్వ ఉత్తర్వులే వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు బి.నిర్మల అనే ఆమె విజయనగరం జిల్లా బాడంగి ఐసీడీఎస్ ప్రాజెక్టుపరిధిలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఎంపిక జాబితాలో 130వ ర్యాంకు వచ్చిన నిర్మల కంటే మెరుగైన ర్యాంకు వచ్చినవారు ఉన్నందున ఆమెను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ 2013లో ఎంపిక జాబితాలో ఆమెకు 124వ ర్యాంకు వచ్చింది. ఇష్టానుసారంగా ర్యాంకులను మార్చేసి ప్రభుత్వం వారిని తొలగించేసింది. బాధిత సూపర్వైజర్లు ఆర్జేడీని సంప్రదించగా కలెక్టర్ ఆదేశాల మేరకే వారిని ఉద్యోగాల నుంచి తొలగించామని చెప్పారు. కానీ ఆ ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా కలెక్టర్ ఆదేశాల ప్రస్తావనే లేదు. -
మగతనం తొలగించాలన్న న్యాయస్థానం
-
700 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
కొత్తగా తీసుకొనేందుకు టెండర్లు పక్షం రోజుల్లో భర్తీకి కసరత్తు సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్పై పని చేస్తున్న 700 మంది సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడానికి టెండర్ల ప్రక్రియ ద్వారా ఏజెన్సీలను ఆహ్వానిస్తున్న అధికార యంత్రాంగం పక్షం రోజుల్లో ఈ కసరత్తు పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటోంది. హెచ్ఎండీఏలో పని చేస్తున్న 200 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఇటీవల తొలగించిన అధికారులు.. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవటానికి టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అదే తరహాలో జిల్లా పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సిబ్బందిని తొలగించిన అధికారులు కొత్త వారిని తీసుకోవటానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండర్ల ప్రక్రియలో 50 ఏజెన్సీలు పాల్గొన్నప్పటికీ 32 ఏజెన్సీల వైపే అధికారులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఔట్సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. తొలగించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో కలెక్టరేట్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న వారు 21 మంది ఉండగా, సాంఘిక సంక్షేమ శాఖలో 38 మంది, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో 95, రాజీవ్ విద్యా మిషన్ (సర్వశిక్ష అభియాన్)లో 35 మంది ఉన్నారు. వీరితో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖ, విద్యుత్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు, మైనారిటీ, వికలాంగుల, ఎస్టీ సంక్షేమ శాఖలలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల్లో అత్యధికంగా ఔట్ సోర్సింగ్పై పని చేస్తున్నారు. -
అంబేద్కర్ చిత్రపటాన్నిపునరుద్ధరించాలని ధర్నా
కడప : రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి ఆయనను అవమానపరిచారని దళిత విద్యార్థి సంఘాలు మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ధర్నా నిర్వహించాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యలయంలోని కమిషనర్ చాంబర్లో ఉన్న అంబేద్కర్ చిత్రపటాన్ని రెండురోజుల కిందట తొలగించారు. దాన్ని తిరిగి పునరుద్ధరించేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు. (ప్రొద్దుటూరు) -
కొనసాగిన ఆక్రమణల తొలగింపు
విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు పనులు మూడో రోజైన శనివారం కూడా కొనసాగాయి. రైల్వే స్టేషన్ రోడ్డు, జిల్లా పరిషత్ కార్యాలయం పక్కనున్న బడ్డీలు, సున్నంబట్టి, సీఎంఆర్ ఎదురుగా ఉన్న తాటాకులు ఇళ్లు, నాయుడు ఫంక్షన్ హాల్ నుంచి ఎన్సీఎస్ థియేటర్ మీదుగా రూరల్ పోలీసు స్టేషన్కు వరకున్న ఆక్రమణలను ప్రొక్లయినర్లతో తొలగించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను ఆక్రమించిన షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు రాజేశ్వరరావు, ఎ.లక్ష్మణరావు ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రూరల్ సీఐ ఎ.రవికుమార్ ఆధ్వర్యంలో వన్టౌన్ ఎస్సై టి.కామేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్సై ఎస్.అమ్మినాయుడు, ఏఎస్సై ఎ.ఎం.రాజు, టూటూన్ ఏఎస్సై ఎల్.ఈశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి లీలామహల్ వరకు రోడ్డుపై ఉన్న షాపులను యజమానులే స్వచ్ఛందంగా తొలగించారు. ప్రజల సౌకర్యార్థమే.. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థమే ఆక్రమణలను తొలగిస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారి రాజేశ్వరరావు తెలిపారు. చాలామంది కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల మురుగు నీరు నిల్వ ఉండిపోతోందన్నారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవన్నారు. ప్రత్యామ్నాయం చూపించాలి తొలగింపు పనులు చేపడుతున్న అధికారులు తమకు ప్రత్యామ్నాయం చూపించాలని దళిత సంక్షేమ సంఘ అధ్యక్షుడు జి. సత్యనారాయణ, పళ్ల దుకాణాలు నిర్వహించే పలువురు మహిళలు కోరుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆర్. సోమనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా తోటపాలానికి వెళ్లే రోడ్డుపై ఆక్రమణలు తొలగించారు. దీంతో వారందరూ కమిషనర్ వద్దకు చేరుకుని తమకు ప్రత్యామ్నాయం చూపించకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ నిబంధనల మేరకే ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు. -
పింఛన్ల తొలగింపుపై ఉద్యమిస్తాం
పొదలకూరు: పింఛన్ల తొలగింపుపై తమ పార్టీ ఉద్యమిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వెల్లడించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం సర్వేపల్లి, నెల్లూరు నగర ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, పి.అనిల్కుమార్ యాదవ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పింఛన్ల ఏరివేత పెరిగిందన్నారు. తమకు చాలా మంది ఫోన్లు చేసి పింఛన్ తొలగించినట్టు వాపోతున్నారన్నారు. పింఛన్ల తొలగింపుపై వైఎస్సార్సీపీ అవిశ్రాంతంగా పోరాడుతుందని హెచ్చరించారు. పింఛన్ల పంపిణీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రసన్నకుమార్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పింఛన్ల ఎంపిక ప్రక్రియ నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని విమర్శించారు. కమిటీల్లో సర్పంచులు, ఎంపీపీలు వైఎస్సార్సీపీకి చెందినవారు ఉన్నా వారిని నామమాత్రులను చేశారని విరుచుకుపడ్డారు. సామాజిక కార్యకర్తలు, పొదుపు సభ్యుల పేరుతో టీడీపీ కార్యకర్తలను కమిటీల్లో నియమించుకుని ఇష్టానుసారం పింఛన్ల లబ్ధిదారులను గుర్తించారన్నారు. అధికారులు సైతం చోద్యం చేస్తున్నారే తప్ప పేదలకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోలేకపోతున్నారన్నారు. ఏ కారణాలతో పింఛన్ తొలగిస్తున్నారో అధికారులు పరిశీలించాలన్నారు. కమిటీలో టీడీపీ సభ్యులు తొలగించమంటే తొలగిస్తున్నట్టు ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ పింఛన్లను అందజేసినట్టు గుర్తుచేశారు. ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్లో కొందరు కార్పొరేటర్లు ఇళ్లవద్దే పింఛన్ల ఎంపిక ప్రక్రియ చేపట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలకు పింఛన్లు ఇప్పించుకునేందుకే కమిటీలను నియమించిందని విమర్శించారు. పేదలకు అన్యాయం జరిగితే నిలదీస్తామన్నారు. తొలిసారిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి జిల్లాపార్టీ అధ్యక్షుని హోదాలో పొదలకూరుకు రావడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. విలేకర్ల సమావేశంలో పొదలకూరు ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచులు తెనాలి నిర్మలమ్మ, బచ్చల సురేష్కుమార్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, వైఎస్సార్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి, చిల్లకూరు బాలకృష్ణారెడ్డి, నెల్లూరు నగర కార్పొరేటర్ రూప్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
ఐకేపీ ఏపీఎం తొలగింపు
సీతంపేట, న్యూస్లైన్: నిధుల దుర్వినియోగం ఆరోపణలు రుజువు కావడంతో ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) ఏపీఎంను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐటీడీ ఏ పరిధిలో మందస మండల ఏపీఎంగా పని చేస్తున్న తురక పార్వతిని విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో బి.రాజశేఖర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కొత్తూరు మండలం దిమిలిలో పనిచేసిన పార్వతి అక్కడ సుమారు రూ.2 లక్షల మేరకు ఆరోగ్య పోషకాహర నిధులు దుర్వినియోగం చేసినట్టు విచారణలో తేలడంతో ఆమెపై వేటు వేశారు. ఈ విషయాన్ని సీతంపేట టీపీఎంయూ విభాగం ఇన్చార్జి ఏరియా కోఆర్డినేటర్ జమాన శ్రీనివాసరావు ధ్రువీకరించారు. దిమిలిలో పని చేస్తున్నప్పుడు పార్వతి అక్కడి మండల మహిళా సమాఖ్యకు చెందిన రూ.2.50 లక్షల వర కు ఆరోగ్య పోషకాహార నిధులు స్వాహాకు పా ల్పడినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై అప్పటి ఐటీడీఏ పీవో సునీల్రాజ్కుమార్ విచారణకు ఆదేశిస్తూ, ఆమెను సస్పెండ్ చేశా రు. విచారణ అనంతరం సస్పెన్షన్ను ఎత్తివేశా రు. అప్పట్లోనే ఆమెను కొత్తూరు నుంచి మందసకు, మందసలో పనిచేస్తున్న జగదీష్ను కొత్తూరుకు బదిలీ చేశారు. అనంతరం స్వాహా చేసిన నిధుల్లో సు మారు రూ.50 వేల వరకు ఎం ఎంఎస్కు జమచేసిన పార్వతి, మిగతా రూ.2 లక్షల నిధులు మాత్రం కట్టలేదు. కాగా నిబంధనల ప్రకారం ఏపీఎంలపై చర్యలు తీసుకునే అధికారం సెర్ప్ సీఈవోకు మాత్రమే ఉంది. అయితే ఐటీడీఏ పీవో నేరుగా జోక్యం చేసుకోవడంతో ఏమీ చే యలేక సెర్ప్ అధికారులు మిన్నకుండిపోయా రు. కొద్ది రోజుల తర్వాత సెర్ప్ అధికారులే రం గంలోకి దిగి విచారణ చేయించి, నిధు లు స్వా హా నిజమేనని తేలడంతో పార్వతిని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు పంపించినట్టు ఇన్చార్జి ఏసీ తెలిపారు. -
కాలేయంలో కణతుల తొలగింపు
అరుదైన శస్త్రచికిత్స చేసిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు కర్నూలు(హాస్పిటల్), న్యూస్లైన్ : కాలేయంలో అరుదుగా ఏర్పడే కణతులను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు తొలగించి మహిళకు తిరిగి ప్రాణాలు పోశారు. అనంతపురం జిల్లా చర్లపల్లి గ్రామానికి చెందిన ఇ.సిద్దమ్మ(35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు గత నెల 29న చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చారు. జనరల్ సర్జరీ విభాగం ఐదో యూనిట్ వైద్యులు ఆమెను పరీక్షించి కాలేయంలో కణతులు ఏర్పడినట్లు గుర్తించారు. గర్భాశయంపై కూడా ఇదే విధమైన కణతులు కనుగొన్నారు. ఆమెకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి సోమవారం ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఈ విషయమై ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ జిలానీ మాట్లాడుతూ లివర్, గర్భసంచిపైన హైడాటిడ్ సిస్ట్లు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయన్నారు. కలుషితమైన కూరగాయలు సరిగ్గా శుభ్రం చేయకుండా, సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. కాలే యం వద్ద రెండు, గర్భాశయం వద్ద ఒక కణతిని తొలగించినట్లు చెప్పారు. ఆపరేషన్ చేసిన వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణనాయక్, పీజీ డాక్టర్ మూర్తి ఉన్నట్లు ఆయన తెలిపారు.