Reviews
-
పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?
తెలుగు రాష్ట్రాల్లో దసరా జోష్ కనిపిస్తుంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లని ఎంటర్టైన్ చేయడానికా అన్నట్లు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కాస్త ఎక్కువగానే రిలీజయ్యాయి. వీటిలో రజినీకాంత్ 'వేట్టయన్', గోపీచంద్ 'విశ్వం', సుహాస్ 'జనక అయితే గనక', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేశాయి. ఇంతకీ ఇవి ఎలా ఉన్నాయంటే?వేట్టయన్రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన ఈ సినిమాని.. పోలీసులు- ఫేక్ ఎన్ కౌంటర్ చేయడం అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. తమిళనాడులో హిట్ టాక్ వచ్చింది గానీ తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టుండాల్సిందని అంటున్నారు. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మా నాన్న సూపర్ హీరోసుధీర్ బాబు హీరోగా నటించిన ఈ మూవీని తండ్రి సెంటిమెంట్ స్టోరీతో తీశారు. చిన్నప్పుడే కన్న తండ్రి నుంచి దూరమైన పిల్లాడు.. మరొకరి దగ్గర పెరిగి పెద్దవుతాడు. సవతి తండ్రికి ఇతడంటే అస్సలు ఇష్టముండదు. మరి సొంత తండ్రి-కొడుకు చివరకు ఎలా కలుసుకున్నారనేది తెలియాలంటే సినిమా చూడాలి. మంచి ఎమోషనల్ కంటెంట్తో తీసిన ఈ చిత్రం ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి. పూర్తి రివ్యూ ఇదిగో ('మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)విశ్వంగోపీచంద్ లేటెస్ట్ మూవీ ఇది. దాదాపు ఆరేళ్ల తర్వాత శ్రీనువైట్ల ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ కావడంతో తొలి ఆట నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (‘విశ్వం’ మూవీ రివ్యూ)జనక అయితే గనకసుహాస్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. ఓ వ్యక్తి పిల్లల్ని వద్దనుకుంటాడు. సేఫ్టీ కూడా వాడుతుంటాడు. అయినా సరే భార్య గర్భవతి అవుతుంది. దీంతో కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. ప్రస్తుత కాలంలో పిల్లల్ని కనడం, పెంచడం ఖరీదైన వ్యవహారం. ఇదే పాయింట్ తీసుకుని, ఎంటర్టైనింగ్ చెప్పారు. ప్రీమియర్లు వేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి రివ్యూ కూడా చదివేయండి. (‘జనక అయితే గనక’మూవీ రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్కి బాబు లాంటి సినిమా) -
ఇంగ్లండ్ కెప్టెన్ చెత్త రికార్డు.. పదికి పది వేస్ట్ చేశాడు..!
బెన్ స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఓలీ పోప్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్ను మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పోప్ ఇప్పటివరకు 10 రివ్యూలు తీసుకోగా.. పదికి పది విఫలమయ్యాయి. ఒక్కటంటే ఒక్క రివ్యూలోనూ పోప్ సక్సెస్ కాలేదు. టెస్ట్ల్లో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. రివ్యూల విషయంలో పోప్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లంకతో సిరీస్లో వ్యక్తిగతంగా, కెప్టెన్గా సక్సెస్ అయినప్పటికీ రివ్యూల విషయంలో పోప్ దారుణంగా విఫలమయ్యాడని ఇంగ్లిష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శ్రీలంకతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో శ్రీలంక జట్టు గెలుపు దిశగా సాగుతుంది. ఆ జట్టు మరో 99 పరుగులు చేస్తే మ్యాచ్ను గెలవడంతో పాటు సిరీస్లో క్లీన్స్వీప్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక గెలుపు దిశగా సాగుతుంది. నిస్సంక (67), ఏంజెలో మాథ్యూస్ (6) క్రీజ్లో ఉన్నారు. -
అలా ఇచ్చేందుకు మీకు ఒక్క సినిమా కనిపించలేదా?: సాయి రాజేశ్
బేబీ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. హృదయకాలేయం, కొబ్బరి మట్ట చిత్రాల తర్వాత బేబీ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే బేబీ హిట్తో జోష్లో ఉన్న సాయి రాజేశ్ మరో సినిమాను ఇటీవలే ప్రకటించారు. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్ప్లే అందిస్తుండగా.. సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన సాయి రాజేశ్ సినిమా రివ్యూయర్స్పై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఐదేళ్లుగా ఒక్క తెలుగు సినిమాకైనా 4 లేదా 4.5 రేటింగ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలకు ఎంత రేటింగ్ ఇచ్చారని అడిగారు. మీరు 4 రేటింగ్ ఇచ్చేందుకు ఒక్క సినిమా కూడా మీ వెబ్సైట్లకు కనిపించలేదా? అన్నారు. ఈ విషయంలో మీకు మీరే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? అన్నారు. మన సినిమాల విషయంలో కేవలం 2.75 నుంచి 3.5, 3.75 మధ్య రివ్యూలు ఇస్తూ ఎందుకిలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు? గత పదేళ్లుగా 3.75 పైనా రేటింగ్ ఇచ్చినా ఒక్క సినిమా పేరు చెప్పండి చాలు? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మీరంతా కలిసి రివ్యూల విషయంలో ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసలు మీ మనసుకు ఒక్కసారి కూడా 4 రేటింగ్ ఇవ్వాలని అనిపించలేదా? అని అడిగారు. సాయి రాజేశ్ అడిగిన ప్రశ్నకు ఓ మీడియా ప్రతినిధి సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'మేము ఇచ్చే రివ్యూస్ మాత్రమే సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయలేవు. లక్కీగా చాలా సందర్భాల్లో మేము ఇచ్చే రివ్యూలు కూడా మ్యాచ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇది వ్యక్తిగత అభిప్రాయం. రాజమౌళి సినిమా కూడా ఫెయిల్ కావొచ్చు. అది మనం డిసైడ్ చేయలేం కదా.' అని చెప్పారు. -
నాచుతో కాలుష్యాన్ని మాయం గాడ్జెట్.. ధర ఎంతంటే?
సముద్రపు నాచుతో పనిచేసే మొట్టమొదటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. పనిచేసే చోట టేబుల్పై పెట్టుకుని ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని రూపొందించారు. సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్ల మాదిరిగానే ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మకణాలను తొలగిస్తుంది. ఇందులోని సజీవమైన సముద్రపు నాచు పరిసరాల్లోని ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. గాలిలోని తేమను పీల్చుకుని, గదిని చల్లబరుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘మోస్ ఎయిర్’ దీనిని రూపొందించింది. ఇందులో హెపా ఫిల్టర్లతో పాటు ఒక చదరపు మీటరు నాచు ఫిల్టర్ కూడా ఉంటుంది. ఇందులోని నాచును రెండేళ్లకు ఒకసారి మార్చుకోవచ్చు. ఇందులోని డ్రిప్ నాజిల్స్ నాచును సజీవంగా ఉంచేందుకు సన్నని నీటి తుంపర్లను నిరంతరం విడుదల చేస్తుంటాయి. దీని ధర 198 డాలర్లు (రూ16,481) మాత్రమే! -
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్..!
-
'అరంగేట్రం' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: అరంగేట్రం నటీనటులు: శ్రీనివాస్ ప్రభన్, ముస్తఫా ఆస్కారీ, రోషన్ షేక్, పూజా బోరా, శ్రీలం శ్రీవల్లి, సాయిశ్రీ వల్లపాటి, కీర్తన, ఇందు, అనిరుధ్ తదితరులు నిర్మాణసంస్థ: మహీ మీడియా వర్క్స్ దర్శకత్వం: శ్రీనివాస్ ప్రభన్ నిర్మాత: మహేశ్వరి సంగీతం: గిడియన్ కట్టా సినిమాటోగ్రఫీ: బురాన్ షేక్ ప్రొడక్షన్ డిజైనర్, కో డైరెక్టర్: రమేశ్ బాబు చిన్నం (గోపి) అరంగేట్రం కథేంటంటే.. సిటీలో జనవరి 13న ఓ అమ్మాయిని సైకో హత్య చేస్తాడు. మళ్లీ ఫిబ్రవరి 13న ఇంకో అమ్మాయిని హత్య చేస్తాడు. ఇలా సిటీలో వరుసగా ప్రతీ నెలా పదమూడో తేదీన ఓ అమ్మాయిని సైకో చంపేస్తుంటాడు. సైకోని ఆపేందుకు పోలీసు యంత్రాంగం ఎంతగానో ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆ సైకో జాడ దొరకదు. తర్వాత వైష్ణవి అనే అమ్మాయిని చంపేందుకు అతడు సిద్దపడతాడు. ఈ క్రమంలో హీరో శ్రీనివాస్ ప్రభన్ (శ్రీనివాస్ ప్రభన్) వైష్ణవి ఇంట్లోనే ప్రత్యక్షం అవుతాడు. అసలు వైష్ణవికి శ్రీనివాస్కు ఉన్న లింక్ ఏంటి? ఆ సైకో ఎందుకు ఇలా వరుసగా అమ్మాయిలను చంపుతూ వెళ్తున్నాడు? సైకో జీవితంలోని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? సైకోకి, శ్రీనివాస్కు ఉన్న మధ్య ఉన్న లింక్ ఏంటి? చివరకు సైకో ఏమయ్యాడు? శ్రీనివాస్ ప్రభన్ ఏం చేశాడు? అనేది కథ. ఎలా ఉందంటే.. సస్పెన్స్ థ్రిల్లర్లు, సైకో డ్రామాలు ఓ వర్గానికి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వాటిని నడిపించే ట్రాక్ మాత్రం ఒకేలా ఉంటుంది. సైకో థ్రిల్లర్ జానర్ల కథలు కొత్తగా ఏమీ ఉండవు. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథను రాసుకుంటే మాత్రం అందరినీ ఆకట్టుకోవచ్చు. ఈ అరంగేట్రం సినిమాకు దర్శకుడు కూడా అదే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఇక్కడ హీరోనే దర్శకుడు అయినప్పటికీ రెండుచోట్లా రాణించాడు. (ఇది చదవండి: ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్) ప్రథమార్థంలో వచ్చే ప్రశ్నలకు ద్వితీయార్థంలో సమాధానం ఇచ్చినట్టుగా ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మెరుగ్గా ఉంది. సైకో చేత కూడా కామెడీ చేయించే ప్రయత్నం వినూత్నంగా ఉంటుంది. చివరకు ముగింపు కాస్త భారంగా అనిపిస్తుంది. ఎమోషనల్ క్లైమాక్స్తో ముగించడం కూడా ఓ సాహసమే. ఎవరెలా చేశారంటే.. అరంగేట్రం మూవీలో ప్రధానంగా కనిపించేది హీరో, విలన్ పాత్రలే. హీరోగా శ్రీనివాస్ ప్రభన్ నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్ని రకాల సీన్లలో మెప్పించాడు. కొన్ని సీన్లలో నవ్వించే ప్రయత్నం చేశాడు. విలన్గా సైకో పాత్రలో ముస్తఫా అస్కరి భయపెట్టించాడు. అనిరుధ్, పూజా, లయ, రోషన్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. జబర్దస్త్ సత్తిపండు కామెడీ ఆకట్టుకుంటుంది. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు పెద్ద అసెట్ బ్యాగ్రౌండ్ స్కోర్. గిడియన్ కట్టా నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఓ పాటను రొమాంటిక్గా తెరపై చక్కగా తెరకెక్కించారు. బురాన్ షా కెమెరాపనితనం పర్వాలేదనిపిస్తుంది. మధు తన ఎడిటింగ్తో ఓకే అనిపిస్తాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (ఇది చదవండి: ఈ సినిమాలో ఆ సీన్స్ కూడా ఉంటాయి: బిచ్చగాడు హీరో) -
డీఆర్ఎస్ కాస్త వీఆర్ఎస్ అయ్యింది.. గురువును మించిన శిష్యుడు
-
షాపర్టైన్మెంట్కు స్వాగతం
తాము ఇష్టపడే వస్తువును కొనడానికి వెబ్సైట్లలోకి వెళ్లే యువతరం... అక్కడ కనిపించే సుదీర్ఘమైన సమాచారాన్ని చదవడం బోర్గా ఫీలవుతున్నారు.అలా అని వస్తువుగురించి పూర్తిగా తెలుసుకోకుండా కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో లైవ్ ‘షాపర్టైన్మెంట్’ను ఇష్టపడుతున్నారు.వెబ్సైట్లలో వన్సైడ్ కమ్యూనికేషన్ ఇష్టపడని వారికి లైవ్ కామర్స్ యాప్లు దగ్గరయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన 25 సంవత్సరాల కనిక షిండే యాక్టివ్ ఆన్లైన్ షాపర్. రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు ఆమె నోట పదేపదే వినిపిస్తున్నమాట షాపర్టైన్మెంట్. ‘షాపర్టైన్మెంట్లో షాప్కు వెళ్లి సరదాగా షాపింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది. లిప్స్టిక్ నుంచి ఐ షాడోస్ వరకు మనం ఎంపిక చేసుకునే వస్తువుల విషయంలో స్పష్టత వస్తుంది. ఆ వస్తువులకు సంబంధించి సందేహాలకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి’ అంటుంది కనిక. నాసిక్లోని కనిక షిండే మాత్రమే కాదు మన దేశంలో చిన్న, పెద్ద పట్టణాలు అనే తేడా లేకుండా జెన్–జెడ్, మిలీనియల్స్ రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ‘షాపర్టైన్మెంట్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడది వారికి ఫ్యాషన్గా కూడా మారింది. చైనీస్ డిజిటల్ మార్కెట్లో పుట్టిన ‘షాపర్టైన్మెంట్’ (కాంబినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇ– కామర్స్, వీడియో కంటెంట్) ట్రెండ్ ఇప్పుడు మన దేశంలోనూ హల్చల్ చేస్తోంది.చైనాలో ‘షాపర్టైన్మెంట్’ అనేది పాపులర్ ట్రెండ్గా ఉంది. చైనాకు చెందిన దిగ్గజ షాపింగ్ ప్లాట్ఫామ్ ‘టవ్భావ్’ షాపర్టైన్మెంట్కు ఊపు ఇచ్చింది. అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ‘ఇది కేవలం మరో మార్కెటింగ్ ట్రెండ్ కాదు. రిటైల్ ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చే పరిణామం’ అంటున్నారు విశ్లేషకులు.చైనాలోని షార్ట్ వీడియో ప్లాట్ఫామ్స్ దౌయిన్, క్లైష్ ‘షాపర్టైన్మెంట్’ ట్రెండ్ దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నసంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ‘షాపర్టైన్మెంట్’కు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ ప్లాట్ఫాం ‘మింత్రా’ లైవ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ లాంచ్ చేసింది. 2026 కల్లా ‘షాపర్టైన్మెంట్’ అమ్మకాలు గణనీయంగా పెరగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇ–కామర్స్ ప్రపంచంలో కస్టమర్ రివ్యూలు కొనుగోలు ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు గందరగోళంగా మారి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి నెడతాయి. ఇలాంటి సమయంలోనే షాపర్టైన్మెంట్కు ప్రాధాన్యత పెరుగుతుంది. – హరిత, కోజికోడ్ (కేరళ) వెబ్సైట్లలో కనిపించే సుదీర్ఘమైన సమాచారం చదవాలంటే బోర్గా ఉంటుంది. మనం కావాలనుకున్న వస్తువును కంటితో చూసి కొనుగోలు చేయడంలోనే మానసిక తృప్తి ఉంటుంది. – శాంతిస్వర, చెన్నై -
AP: ఈహెచ్ఎస్పై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష
సాక్షి, అమరావతి: ఉద్యోగులు ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్)పై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా కెఎస్ జవహార్ రెడ్డి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, మెడికల్ రీ ఇంబర్స్మెంట్ అంశాల తోపాటు వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు గురించి కూడా చర్చించారు. ముఖ్యంగా ఈహెచ్ఎస్లో మరిన్నీ అంశాలు చేర్చడం గురించి కూడా మాట్లాడారు. ఈమేరకు ఈహెచ్ఎస్లో ప్రస్తుతం ఉన్న కొన్ని ప్యాకేజీల ధరల పెంపు, ఉద్యోగుల నెలవారీ కంట్రీబ్యూషన్ పెంపు, మెడికల్ రీ ఇంబర్స్మెంట్ పరిమితి పెంచాల్సిన ఆవశ్యకత, కేన్సర్ వంటి రోగాలకు పరిమితి లేకుండా అందించే అంశం, అలాగే 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులుకు వన్టైం మాస్టర్ హెల్త్ చెకప్ తదితర అంశాల గురించి సీఎస్ జవహార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అంతేగాదు ఇందుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి రాష్ట్రస్థాయిలో ఒక నిర్ణయం తీసుకుందామని అధికారులుకు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఆరోగ్య పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎస్ జవహార్ రెడ్డి. కాగా, ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం.టీ.కృష్ణబాబు,ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్ ఆర్)చిరంజీవి చౌదరి, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ప్రత్యేక కార్యదర్శి (సియంఆర్ఎఫ్) డా.హరికృష్ణ, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్ర ప్రసాద్,ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ అధికారి టిఎస్ఆర్ మూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు. (చదవండి: అపోహలొద్దు.. మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ) -
లాభాల్ని తెచ్చిపెట్టే ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు తెలుసా?
వడ్డీ రేట్లు దాదాపు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. కనుక ఇన్వెస్టర్లు పదేళ్లకు మించిన లక్ష్యాల కోసం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. మన దగ్గర దీర్ఘకాలంతో కూడిన పెట్టుబడుల సాధనాలు పరిమితం. పీపీఎఫ్, ఎన్పీఎస్ పథకాలు ఉన్నా, వీటిల్లో లాకిన్ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణకు వీలు కాదు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ ప్లాట్ఫామ్పై ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్లు) నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. వీటిపై రెగ్యులర్ ఆదాయం వస్తుంటుంది. వడ్డీపై వ్యక్తిగత పన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ గడువు కంటే ముందే వైదొలగాలని అనుకుంటే లిక్విడిటీ పెద్దగా ఉండదు. కానీ, లాంగ్ డ్యురేషన్ మ్యూచువల్ ఫండ్స్లో కోరుకున్నప్పుడు ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య ఫండ్ పదేళ్లకు మించిన లక్ష్యాలకు అనుకూలం. కోరుకున్నప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. పెట్టుబడుల విధానం.. నిప్పన్ ఇండియా నివేష్ లక్ష్య అనేది ఓపెన్ ఎండెడ్ డెట్ పథకం. కనుక ఎప్పుడైనా పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు. దీర్ఘకాలంతో కూడిన జీసెక్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. సగటున 20–25 ఏళ్లకు మెచ్యూరిటీ తీరే (గడువు ముగిసే) సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. పైగా వ్యయాలు చాలా తక్కువ. డైరెక్ట్ ప్లాన్లో కేవలం 0.16 శాతమే ఎక్స్పెన్స్ రేషియో వసూలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టిన మొదటి మూడేళ్లలో కేవలం 20 శాతం యూనిట్లనే విక్రయించుకోగలరు. ఈ మొత్తంపై ఎగ్జిట్ లోడ్ పడదు. ఇంతకుమించిన మొత్తం ఉపసంహరించుకుంటే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి వస్తుంది. మూడేళ్లు నిండిన తర్వాత ఎలాంటి పరిమితులు, చార్జీలు లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం దీర్ఘకాల పెట్టుబడులకు ఉద్దేశించినది. కనుక స్వల్పకాలంలో పెట్టుబడుల ఉపసంహరణను నిరుత్సాహపరిచేందుకు ఈ నిబంధన విధించడం జరిగింది. దీర్ఘకాల జిసెక్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తక్కువ. పరిమితి విధించడానికి ఇది కూడా ఒక కారణం. కనుక కనీసం 8–10 ఏళ్లకు మించిన కాలానికే ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. సరైన సమయమే.. గతంలో వడ్డీ రేట్ల సైకిల్ 8–8.5 శాతం వద్ద గరిష్టానికి చేరి, 5–5.5 శాతం వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం ఈల్డ్స్ 7.4 శాతానికి చేరాయి. గరిష్టానికి ఒక శాతం తక్కువ. సాధారణంగా వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడే లాంగ్ డ్యురేషన్ ఫండ్స్/సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు అధిక రాబడులు పొందొచ్చు. ఏ సైకిల్లో అయినా గరిష్ట రేటును అంచనా వేయడం కష్టం. కనుక ఇక్కడి నుంచి ఈల్డ్స్ ఇంకా పెరుగుతాయా? అన్నది చెప్పలేం. కనుక ఇక్కడి నుంచి లాంగ్ డ్యురేషన్ ఫండ్స్లో పెట్టుబడులు ఆరంభించుకోవచ్చు. వడ్డీ రేట్ల క్షీణత ఆరంభమైన తర్వాత తాజా పెట్టుబడులు నిలిపివేసుకోవచ్చు. రాబడులు.. డెట్ పథకాల్లో మూడేళ్లు పూర్తయ్యే వరకు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. నివేష్ లక్ష్య తదితర లాంగ్ డ్యురేషన్ ఫండ్స్లో గడిచిన ఏడాది, మూడేళ్ల కాల రాబడులు అంత ఆకర్షణీయంగా అనిపించవు. ఎందుకంటే ఈ కాలంలో వడ్డీ రేట్లు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. వీటిల్లో రాబడులను సైకిల్ ఆధారంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు ఇంకా పెరిగితే లాంగ్ డ్యురేషన్ పథకాల్లోని పెట్టుబడుల ఎన్ఏవీ సైతం తగ్గుతుంది. గడిచని ఏడాదిలో 5 శాతం, మూడేళ్లలో వార్షికంగా 6 శాతం రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. కానీ, ఎనిమిదేళ్లు అంతకుమించిన కాలానికి ఈ పథకాలు ద్రవ్యోల్బణంతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే!
న్యూఢిల్లీ: ఉత్పత్తులు, సర్వీసులపై వినియోగదారులను తప్పుదోవ పట్టించే నకిలీ ఆన్లైన్ సమీక్షలకు చెక్ చెప్పే దిశగా కేంద్రం కొత్త పాలసీని రూపొందించింది. ఇది నవంబర్ 25 నుండి అమల్లోకి రానుంది. ఆయా ఆన్లైన్ పోర్టల్స్ ముందుగా వీటిని స్వచ్ఛందంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ తప్పుడు రివ్యూల సమస్య కొనసాగిన పక్షంలో నిబంధనలను కేంద్రం తప్పనిసరి చేయనుంది. దీని ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు స్వచ్ఛందంగా అన్ని పెయిడ్ రివ్యూల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇతరుల నుండి కొనుగోలు చేసిన సమీక్షలు, అలాగే సరఫరాదారు లేదా థర్డ్ పార్టీ తమ ఉత్పత్తులు/సర్వీసుల రివ్యూ కోసం నియమించుకున్న ఉద్యోగులు రాసే సమీక్షలను ప్రచురించకూడదు. ఆన్లైన్ వినియోగదారుల రివ్యూలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ‘ఐఎస్ 19000:2022’ పేరిట కొత్త ప్రమాణాన్ని రూపొందించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సోమవారం తెలిపారు. ఉత్పత్తులు .. సర్వీసుల సరఫరాదారులు, తమ సొంత కస్టమర్ల నుండి రివ్యూలను సేకరించే సంస్థలు, సరఫరాదారు నియమించుకున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టరు సహా కన్జూమర్ రివ్యూలను ఆన్లైన్లో ప్రచురించే అన్ని సంస్థలకు ఇవి వర్తిస్తాయని వివరించారు. 15 రోజుల్లో సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఆన్లైన్ పోర్టల్స్ ఈ ప్రమాణాలను పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను వచ్చే 15 రోజుల్లోగా ప్రారంభించనున్నట్లు సింగ్ చెప్పారు. ఈ–కామర్స్ సంస్థలు ఈ సర్టిఫికేషన్ కోసం బీఐఎస్కి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. చాలా దేశాలు తప్పుడు రివ్యూలకు అడ్డుకట్ట వేసేందుకు చాలా తంటాలు పడుతున్న తరుణంలో ఈ తరహా ప్రమాణాలను ప్రవేశపెట్టిన తొలి దేశం బహుశా భారతేనని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా టూర్..ట్రావెల్, రెస్టారెంట్లు .. హోటళ్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో రివ్యూలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సింగ్ తెలిపారు. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థలు కొత్త ప్రమాణాలపై సంప్రదింపుల ప్రక్రియలో పాల్గొన్నట్లు సింగ్ చెప్పారు. అలాగే ప్రమాణాల రూపకల్పనలో సీఐఐ, ఫిక్కీ తదితర పరిశ్రమ సమాఖ్యలను కూడా సంప్రదించినట్లు వివరించారు. నిబంధనల ప్రకారం .. ఏ సంస్థలోనైనా రివ్యూలను హ్యాండిల్ చేసే బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగిని రివ్యూ అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తారు. సమీక్షలు చట్టబద్ధమైనవిగా, కచ్చితమైనవిగా, తప్పుదోవ పట్టించని విధంగా ఉండాలి. రివ్యూ చేసే వ్యక్తుల అనుమతి లేకుండా వారి పేర్లను వెల్లడించకూడదు. సమీక్షలసేకరణ పక్షపాతరహితంగా ఉండాలి. చదవండి: మూన్లైటింగ్: 81 శాతం ఉద్యోగులు స్పందన ఇదే.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!
సినిమా రిలీజైతే సమీక్షకులు స్టార్లు ఇస్తారు. కాని ఒక సీరియల్ కిల్లర్ బయల్దేరి ఆ రివ్యూలు రాసే వారిని హత్య చేసి వారి నుదుటిన స్టార్లు ఇస్తుంటే? మనం నమ్మినా నమ్మకపోయినా ‘రివ్యూల మాఫియా’ ఒకటి ఉంది.మంచి సినిమాలు చెత్త రివ్యూలను పొందితే ఆ దర్శకుడికి ఎంత బాధ? అలాంటి వాడు సీరియల్ కిల్లర్గా మారితే? ఊహ కొంచెం అతిగా ఉన్నా దర్శకుడు బాల్కి ఈ సినిమా తీశాడు.సన్నిడియోల్, పూజా భట్, దుల్కర్ సల్మాన్ నటించారు.వచ్చే వారమే ‘చుప్’ విడుదల.రివ్యూయర్లూ... బహుపరాక్! అన్నట్టు నాడు ‘కాగజ్ కే ఫూల్’ సినిమా మీద చెత్త రివ్యూలు రాయడం వల్ల సినిమాలే మానుకున్న గురుదత్కు ఈ సినిమా నివాళి. బహుశా ఈ సినిమా రివ్యూయర్ల బాధితులందరి ఒక సృజనాత్మక ప్రతీకారం. కష్టపడి నెలల తరబడి సినిమా తీస్తే, రెండు గంటల పాటు హాల్లో చూసి ఆ వెంటనే తీర్పులు చెప్పేసి ‘సినిమా చూద్దామనుకునేవాళ్లను’ ఇన్ఫ్లూయెన్స్ చేసే రివ్యూయర్ల మీద బదులు తీర్చుకుందామని ఎవరైనా అనుకుని ఉంటే, కనీసం ఊహల వరకు వారిని సంతృప్తిపరిచే పని దర్శకుడు బాల్కి నెత్తికెత్తుకున్నాడు. బాల్కి అంటే ‘చీనీ కమ్’, ‘పా’, ‘పాడ్మేన్’ వంటి సినిమాల దర్శకుడు. ఇప్పుడు ‘చుప్’ సినిమా తీశాడు. సెప్టెంబర్ 23 విడుదల. సన్ని డియోల్, పూజా భట్ వంటి సీనియర్లు, దుల్కర్ సల్మాన్ వంటి యువ స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది ‘సైకలాజికల్ థ్రిల్లర్’. ‘రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం. యూట్యూబ్లో ఉన్న ట్రైలర్లో సీరియల్ హంతకుడు రివ్యూయర్లను చంపడం, వారి నుదుటి మీద స్టార్లు ఇవ్వడం కనిపిస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ పాత్రను పోషించిందెవరో ఇప్పటికి సస్పెన్స్. సన్ని డియోల్ మాత్రం పోలీస్ ఆఫీసర్గా చేశాడు. పూజా భట్ నిర్మాతగానో అలాంటి పాత్రగానో కనిపిస్తోంది. దుల్కర్ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. రివ్యూయర్ను చంపుతున్న సీరియల్ కిల్లర్ ‘స్టార్లు ఇవ్వడం కాదు. సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో సాయం చేయ్. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాయడం కాదు’ అంటుంటాడు. అంటే ఇదంతా అరాకొరా జ్ఞానంతో రివ్యూలు రాసేవారి భరతం పట్టడం అన్నమాట. ఊరికే ఉండాలా? సినిమా ఎలా ఉన్నా ఊరికే (చుప్) ఉండాలా? అలా ఉండాల్సిన పని లేదు. కాని ఒక సినిమాను సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నామా? సినిమాకు మేలు చేసేలా వ్యాఖ్యానం ఉందా... కళాకారుల కళను ఎద్దేవా చేసేలా ఉందా? అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే అవి సినిమాను దెబ్బ తీస్తే బాధ్యులు ఎవరు? విమర్శ కూడా సినిమా తీసిన వారిని ఆలోచింప చేసేలా ఉండాలి కాని బాధ పెట్టేలా ఉండొచ్చా? మాటలు పెట్టే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరైనా అంచనా కట్టగలరా? మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే ‘తెలిస్తే మాట్లాడండి. లేకుంటే నోర్మూసుకొని ఉండండి’ అనే అర్థంలో బాల్కి ఈ సినిమా తీశాడు. ట్రైలర్కి ఒక రివ్యూయర్ (లంచం తీసుకుని) చెత్త సినిమాకు నాలుగు స్టార్లు ఇస్తే అలాంటి వాణ్ణి కూడా సీరియల్ కిల్లర్ చంపుతూ కనపడతాడు. అంటే బాగున్న సినిమాను చెత్త అన్నా, చెత్త సినిమాను బాగుంది అన్నా ఈ సీరియల్ కిల్లర్ బయలుదేరుతాడన్నమాట. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ రివ్యూయర్ అవతారం ఎత్తుతున్నారు. సినిమా వాళ్లు చికాకు పడుతున్నారు. ‘చుప్’ చూశాక వీరంతా ఏమంటారో... ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి. గురుదత్ బాధకు జవాబు దర్శకుడు బాల్కి నాటి గొప్ప దర్శకుడు గురుదత్కు అభిమాని కావచ్చు. గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అది మన దేశంలో తొలి సినిమాస్కోప్ చిత్రం. అంతే కాదు గురుదత్ తన మేధను, డబ్బును, గొప్ప సంగీతాన్ని, కళాత్మక విలువలను పెట్టి తీసిన చిత్రం. కాని రిలీజైనప్పుడు విమర్శకులు ఘోరంగా చీల్చి చెండాడారు ఆ సినిమాను. దాంతో ప్రేక్షకులు కూడా సినిమాను అర్థం చేసుకోలేక రిజెక్ట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గురుదత్ను ఈ ఫలితం చావుదెబ్బ తీసింది. ఆ తర్వాత అతను జడిసి మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. కుంగిపోయాడు కూడా. కాని ఆశ్చర్యం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ ‘కాగజ్ కే ఫూల్’ క్లాసిక్గా నిలిచింది. దేశంలో తయారైన గొప్ప సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కాలం కంటే ముందు తీసిన సినిమాగా సినిమా పండితులు వ్యాఖ్యానిస్తారు. ప్రపంచ దేశాల్లో సినిమా విద్య అభ్యసించేవారికి అది సిలబస్గా ఉంది. బాల్కీ అభ్యంతరం అంతా ఇక్కడే ఉంది. ‘కాగజ్ కే ఫూల్ రిలీజైనప్పుడు విమర్శకులు కొంచెం ఓర్పు, సహనం వహించి అర్థం చేసుకుని ఉంటే గురుదత్కు ఆ బాధ, సినిమాకు ఆ ఫలితం తప్పేవి’ అంటాడు. ఆ సినిమాను చంపిన రివ్యూయర్లపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికన్నట్టుగా ‘చుప్’ తీశాడు. గురుదత్ సినిమాల్లోని పాటలే ఈ సినిమాలో వాడాడు. -
రీల్స్తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. 'ఎస్కేప్ లైవ్' రివ్యూ
టైటిల్: ఎస్కేప్ లైవ్ (హిందీ వెబ్ సిరీస్) నటీనటులు: సిద్ధార్థ్, ఆకాంక్ష సింగ్, సుమేధ్ ముద్గాల్కర్, రిత్విక్ సాహోర్, ఆద్య శర్మ, ప్లబితా, రోహిత్ చందేల్, జావేద్ జాఫెరి తదితరులు దర్శకత్వం: సిద్ధార్థ్ కుమార్ తవారీ విడుదల తేది: మే 20 (7 ఎపిసోడ్స్) & మే 27 (2 ఎపిసోడ్స్) ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్స్టార్ టాలీవుడ్లో లవర్ బాయ్గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. 'బొమ్మరిల్లు'తో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత 'మహాసముద్రం' సినిమాతో అలరించాడు. ఈ యంగ్ హీరో తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఓటీటీ డెబ్యుగా వచ్చిన వెబ్ సిరీస్ ఎస్కేప్ లైవ్. సిద్ధార్థ్ కుమార్ తివారి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్పెషల్స్ నిర్మించింది. మే 20న విడుదలైంది. రీల్స్, సోషల్ మీడియాతో వచ్చే డబ్బు కోసం యువత ఏం చేస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ 'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కృష్ణ స్వామి తల్లి, చెల్లితో కలిసి నివసిస్తాడు. తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను తీసుకుంటాడు. తన అర్హతకు తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో 'ఎస్కేప్ లైవ్' అనే వీడియో షేరింగ్ యాప్లో మోడరేటర్గా జాయిన్ అవుతాడు. ఎస్కేప్ లైవ్ యాప్ తన పాపులారిటీ పెంచుకునేందుకు ఒక కాంటెస్ట్ నిర్వహిస్తుంది. యాప్ యూజర్స్ వివిధ రకాల వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే వారికి డైమండ్స్ వస్తాయి. అవి క్యాష్ రూపంలో వారి అకౌంట్కు చేరతాయి. ఈ క్రమంలోనే ఒక డేట్ వరకు ఎక్కువ డైమండ్స్ గెలుచుకున్న వారికి రూ. 3 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటిస్తారు ఎస్కేప్ లైవ్ నిర్వాహకులు. ఈ కాంటెస్ట్లో పాల్గొన్న యాజర్స్ ఆ డబ్బు కోసం ఎంతకు తెగించారు ? యాప్ కాన్సెప్ట్ నచ్చని కృష్ణ ఏం చేశాడు ? ఆ సమయంలో కృష్ణ ఎదుర్కున్న పరిస్థితులు ఎంటీ ? అందులో పాల్గొన్న ఐదుగురు కంటెస్టెంట్లు చివరికి ఏమయ్యారు ? ఆ రూ. 3 కోట్లను ఎవరు గెలుచుకున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ప్రస్తుతం యూత్ ఫాలో అవుతున్న రీల్స్, టకా టక్, జోష్, మోజో, చింగారీ వంటితదితర యాప్స్ యూత్ను, పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ సిద్ధార్థ్ కుమార్ తివారీ. నిత్యం సమాజంలో చూసే అనేక విషయాలను సిరీస్ ద్వారా చూపించారు. సోషల్ మీడియాతో మనీ, ఫేమ్ సంపాదించుకోవాలనుకున్న యువత ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది ? చివరికీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు డైరెక్టర్. ఆయన అనుకున్నది ప్రేక్షకులకు చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా ఇందులో ఒక పాత్రలో కూడా నటించారు సిద్ధార్థ్ కుమార్ తివారీ. సిరీస్లోని 5 ప్రధాన పాత్రలు, వారి నేపథ్యాన్ని చూపిస్తూ ప్రారంభించారు. అది కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. కానీ కథ పరంగా అలా చూపించడం తప్పదు. ఇక ఎస్కేప్ లైవ్ యాప్ కాంటెస్ట్ కోసం ఐదుగురు చేసే ప్రయత్నాలు, వారి జీవిత కథలు ఆకట్టుకుంటాయి. యాప్ ఎదుగుదల కోసం కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయనే విషయాలు బాగా చూపించారు. సిరీస్లో అక్కడక్కడా వచ్చే అశ్లీల సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అవి రియల్ లైఫ్లో జరిగే సంఘటనలని ఒప్పుకోక తప్పదు. నైతికత విలువలతోపాటు జెండర్ వివక్షతను చూపించారు. మంచి థ్రిల్లింగ్గా సాగుతున్న స్టోరీలో అక్కడక్కడా కుటుంబంతో ఉన్న ప్రధాన పాత్రల సన్నివేశాలు (ఎపిసోడ్ 5) కొద్దిగా బోర్ కొట్టిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోపాటు అప్పుడప్పుడు వచ్చే పాటలు ఆకట్టుకున్నాయి. ఎవరెలా చేశారంటే? సిద్ధార్థ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన యువకుడిగా, యాప్ నిర్వాహకులు చేస్తున్న పని నచ్చని, దాన్ని ఆపాలనే సిటిజన్గా బాగా నటించాడు. అయితే మిగతా ఐదు ప్రధాన పాత్రలతో పోల్చుకుంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ డెప్త్ తక్కువగా అనిపిస్తుంది. తన సిస్టర్ బాయ్ఫ్రెండ్ విషయంలో సిద్ధార్థ్ చేసే పని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక మిగతా క్యారెక్టర్లైనా డ్యాన్స్ రాణి (బేబీ ఆద్య శర్మ), ఫెటీష్ గర్ల్ (ప్లబితా), ఆమ్చా స్పైడర్ (రిత్విక్ సాహోర్), రాజ్ కుమార్ రోహిత్ చందేల్ నటన సూపర్బ్గా ఉంది. ముఖ్యంగా ఆద్య శర్మ డ్యాన్స్లు బాగా ఆకట్టుకుంటాయి. ఇక సైకో వ్యక్తిగా డార్క్ ఏంజిల్ పాత్రలో సుమేధ్ ముద్గాల్కర్ అదరగొట్టాడు. సిరీస్కు అతడి యాక్టింగ్ హైలెట్ అని చెప్పవచ్చు. రాధా క్రిష్ణ సీరియల్లో కృష్ణుడిగా సుమేధ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇందులో రాధగా నటించిన మల్లికా సింగ్ కూడా సిద్ధార్థ్ చెల్లెలుగా శ్రీని పాత్రలో అలరించింది. పోలీస్ ఆఫిసర్గా ఆకాంక్ష సింగ్ పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఫైనల్గా సిరీస్ గురించి చెప్పాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోనైన సరే కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చివరి ఎపిసోడ్లో కొన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా రెండో సీజన్ కూడా వస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. -సంజు (సాక్షి వెబ్డెస్క్) -
ఈ-కామర్స్ సంస్థలకు షాక్: ఫేక్ రివ్యూస్కు చెక్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను... ఈ-కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ-కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ-కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
నకిలీ రివ్యూల కట్టడిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను.. ఈ–కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ–కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ–కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
చైనాకు అమెజాన్ భారీ షాక్
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్.. చైనాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తన ప్లాట్ఫామ్ నుంచి చైనాకు చెందిన 3,000 ఆన్లైన్ స్టోర్లను మూసేస్తున్నట్లు(తొలగిస్తున్నట్లు) ప్రకటించింది. అంతేకాదు ఇవి ప్రమోట్ చేసిన 600 చైనా బ్రాండ్లను సైతం ప్రొడక్ట్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటోందా?.. అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఫేక్ రివ్యూలతో ప్రొడక్టులను ప్రమోట్ చేస్తున్న ఆన్లైన్ స్టోర్లను మూసేస్తున్నట్లు(యాప్ నుంచి తొలగిస్తున్నట్లు), 600 బ్రాండ్లను తీసేస్తున్నట్లు ప్రకటించి చైనాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ హఠాత్ నిర్ణయంతో సుమారు 130 మిలియన్ల రెన్మింబి (చైనీస్ యువాన్) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఫేక్ రివ్యూలతో పాటు ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించినందుకు తొలగించినట్లు తెలిపింది. ‘మేడ్ ఇన్ చైనా.. సోల్డ్ ఇన్ అమెజాన్’ పేరుతో ఏర్పాటైన మర్చంట్ కమ్యూనిటీ ఈ తతంగాన్ని ఇంతకాలం నడిపిస్తూ వస్తోంది. ఇదంతా వినియోగదారుల సమీక్ష ఉల్లంఘన కిందకు వస్తుందని అమెజాన్ పేర్కొంది. నిజానికి చైనా యాప్ల విషయంలో అమెజాన్ ఇలా కఠినంగా వ్యవహరించడం ఇదేం కొత్త కాదు. న్యాయపరమైన చర్యలు కూడా.. ప్రోత్సాహక రివ్యూలను 2016 నుంచి అమెజాన్ సంస్థ బ్యాన్ చేసింది. అంతేకాదు అలాంటి ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షిస్తోంది కూడా. అయినప్పటికీ చైనా మార్కెట్లో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణం అయ్యాయి. అయితే అమెజాన్ మాత్రం ఇలాంటి చర్యల్ని ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. ఈ ఏడాది మే నుంచి రంగంలోకి దిగి.. చర్యలను మొదలుపెట్టింది. దీనివల్ల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడిందని ట్రేడ్ గ్రూప్ షెంజెన్ క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ అసోషియేషన్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తీసుకున్న చర్యలు.. మునుపటి కంటే తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సస్పెండ్, బ్యాన్తో పాటు న్యాయపరమైన చర్యలకు సిద్ధపడుతోంది అమెజాన్. అమెజాన్ కాకుంటే ఇంకొకటి.. అయితే అమెజాన్ చర్యలు.. చైనా ఈ-కామర్స్ మార్కెట్పై ప్రభావం చూపెట్టకపోవచ్చని చైనా మీడియా హౌజ్ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. చైనా తొలగించిన ఆన్లైన్ స్టోర్లు, బ్రాండ్లు.. ఈబే, అలీఎక్స్ప్రెస్ వైపు మళ్లుతున్నట్లు చెబుతోంది. ఇక అమెజాన్ సైతం ఈ వివాదంపై స్పందించింది. అమెజాన్ కేవలం చైనాను మాత్రమే టార్గెట్ చేయలేదని.. మిగతా దేశాల్లోనూ ఈ తరహా చర్యలు చేపట్టినట్లు అమెజాన్ ఆసియా గ్లోబల్ సెల్లింగ్ వైస్ ప్రెసిడెంట్ సిండీ థాయ్ వెల్లడించారు. తమ నిర్ణయం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ చెప్తున్నారామె. ఈ పోటాపోటీ స్టేట్మెంట్ల నడుమ మిలియన్ల విలువ చేసే చైనీస్ ఆన్లైన్ స్టోర్ల ఫండ్స్ను అమెజాన్ నిలిపివేయడం ఆసక్తికర పరిణామం అనే చెప్పొచ్చు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయింది చైనావోడే! -
గాడ్జెట్ మహిమ, వంటకం ఏదైనా చిటికెలో చేయెచ్చు...!
చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్స్కి చాలా చక్కగా, అనువుగా ఉండే ఈ ఫ్యామిలీ సైజ్ ఓవెన్.. ఎయిర్ ఫ్రైయర్లా కూడా పనిచేస్తుంది. డిజిటల్ టచ్స్క్రీన్ తో ఆయిల్లెస్ రుచులని అందిస్తుంది. చికెన్, ఫిష్, పిజ్జా, కేక్, స్టిక్స్, వింగ్స్, కుకీస్, ఫ్రెంచ్ఫ్రైస్ ఇలా చాలానే చేసుకోవచ్చు. 1700గి సామర్థ్యం కలిగిన ఈ మేకర్కి ముందు భాగంలో దానికి ఆనుకునే గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని పైనుంచి కిందకు ఓపెన్ చేసుకోవచ్చు. లోపల ట్రాన్స్పరెంట్ బౌల్ పెట్టుకుని.. మూడు సొరుగులుగా గ్రిల్ ప్లేట్స్ అమర్చి, వాటిపై ఆహారాన్ని బేక్ చేసుకోవచ్చు. ఇందులో 3600ఊ వద్ద పిజ్జా 10 నిమిషాలు, కూరగాయలు 12 నిమిషాలు, ఫిష్ 15 నిమిషాలు, కేక్ 30 నిమిషాలు సమయం పడుతుంది. 4300ఊ వద్ద.. పాప్కార్న్ 8 నిమిషాలు, చికెన్ వింగ్స్ 10 నిమిషాలు, ఫ్రెంచ్ఫ్రైస్ 20 నిమిషాలు, హోల్ చికెన్ 30 నిమిషాలు సమయం తీసుకుంటాయి. అధిక–నాణ్యత గల మెటీరియల్తో రూపొందిన చికెన్ ఫోర్క్, డిప్ ట్రే, రొటేటింగ్ బాస్కెట్, ఎయిర్ ఫ్లో రాక్స్, మెస్ బాస్కెట్ వంటివన్నీ మేకర్తో పాటు లభిస్తాయి. ఈ గాడ్జెట్ 80 శాతం నూనె వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆప్షన్స్ అన్నీ మేకర్ ముందువైపు డిస్ప్లేలో బొమ్మలతో సహా వివరంగా కనిపిస్తుంటాయి. దాంతో దీన్ని ఆపరేట్ చెయ్యడం ఎవరికైనా సులభమే. -
కష్టం వృథా కాలేదు – తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నా నలభైఏళ్ల కెరీర్లో నాకు గుర్తుండిపోయే చిత్రం ‘పలాస’. ఈ సినిమాలో నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కష్టం వృథా కాలేదని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదలైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో రక్షిత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు మంచి రివ్యూస్ రావడం హ్యాపీ. సినిమాలోని ప్రతి సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘దర్శకుడి ఆలోచన, నిర్మాత ప్రయత్నం సినిమాను నిలబెట్టాయి. నటీనటుల పాత్రలతో పాటు నా పాత్రకూ మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు రఘుకుంచె. ‘‘పలాస’లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరోయిన్ నక్షత్ర. -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. పరీక్షలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మెరుగైన పద్ధతులను అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, దానికి నోడల్ ఆఫీసర్ను నియమిస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా 040–24601010, 040–24732369, 040–24655027 నెంబర్లలో సంప్రదించాలని, నోడల్ అధికారి పరిష్కరిస్తారన్నారు. పరీక్షల నిర్వహణ సజావుగా సాగేందుకు జిల్లా కలెక్టర్లు తగిన శ్రద్ధ వహించాలని ఆదేశించారు. çపరీక్షా కేంద్రాలన్నింటిలోనూ కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. 20లోగా నివేదిక ఇవ్వండి జిల్లాల్లో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై చెక్ లిస్టు ప్రకారం ఈనెల 20లోగా నివేదికలు అందజేయాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ కోరారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలకు సరైన భద్రత కల్పించే విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్పీలు పర్యవేక్షించాలన్నారు. 9,65,840 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ ప రీక్షలకు 1,339 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో 50 ప్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్లు, 24,750 మం ది ఇన్విజిలేటర్లు పాల్గొంటారన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఇంటర్మీడియెట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. -
‘మత్తు వదలరా’ మూవీ రివ్యూ
చిత్రం: మత్తు వదలరా జానర్: సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ నటీనటులు: శ్రీసింహా, వెన్నెల కిశోర్, సత్య, అగస్త్య, బ్రహ్మాజీ సంగీతం: కాలభైరవ దర్శకత్వం: రితేష్ రానా బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత డైరెక్టర్, సంగీత దర్శకుడు, సింగర్, రచయిత, నిర్మాత, లైన్ ప్రొడ్యూసర్, కాస్టూమ్ డిజైనర్ ఇలా ఆ కుటుంబంలో ఓ సినిమాకు ప్రధానమైన టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. కానీ ఒక్క హీరో తప్ప. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీరబోతుంది. హీరో లేడనే లోటును భర్తీ చేయడానికి ఆకాశమంత ఆ కుటుంబం నుంచి కూడా ఓ వారసుడు వచ్చేశాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా బుధవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో చిత్రంపై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఇక దాదాపు అందరు కొత్తవాళ్లతో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఆడియన్స్ను ఏ మేరకు ఆకట్టుకుంది? అందరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన నయా హీరో, మ్యూజిక్ డైరెక్టర్ను ప్రేక్షకులు ఆదరించారా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: బాబు మోహన్ (శ్రీసింహా), ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య)లు రూమ్మేట్స్. బాబు, ఏసుదాస్లు డెలీవరీ బాయ్స్గా పనిచేస్తూ చాలిచాలని జీతంతో కాలం వెల్లదీస్తుంటారు. అయితే జీతం, జీవితంపై అసహనం చెందిన బాబుకు ఏసుదాస్ ఓ ఉచిత సలహా ఇస్తాడు. ఆ సలహా పాటించిన బాబు అనుకోని చిక్కుల్లో పడతాడు. ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి బయటపడటానికి, హత్యచేసింది ఎవరో తెలుసుకోవడానికి బాబు చేసిన ప్రయత్నమే సినిమా కథ. అయితే ఈ కథలో రాజు (వెన్నెల కిశోర్), కానిస్టేబుల్ బెనర్జీ (బ్రహ్మాజీ), మైరా, తేజస్వి (అజయ్)లు ఎందుకు ఎంటర్ అవుతారు? అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఏసుదాస్ ఇచ్చిన ఆ ఉచిత సలహా ఏంటి? మూవీ టైటిల్తో కథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు శ్రీసింహా తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. భయం, కోపం, ప్రస్టేషన్స్, ఆనందం ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరో పలికించాల్సిన అన్ని భావాలను అవలీలగా పలకించాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్కు నటనపరంగా మరో హీరో దొరికినట్లే. ఇక సత్య కామెడీ టైమింగ్ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఏ సమయంలో కూడా సత్య కామెడీ చికాకు తెప్పించదు. సినిమాకు సత్య కామెడీ మరింత బూస్టప్గా నిలిచింది. వెన్నెల కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఎవరూ ఊహించని వినూత్న పాత్ర పోషించిన వెన్నెల కిశోర్ తన అనుభవంతో అవలీలగా నటించాడు. అగస్త్య, తదితర నటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కలుగదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! ప్రస్తుతం ఈ పద్య భావాన్ని మ్యూజిక్డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకే చిత్రంతో తన ఇద్దరు కుమారులు టాలీవుడ్ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నారు. మెప్పించారు. ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో కీరవాణి కుటుంబం డబుల్ హ్యాపీ అని చెప్పవచ్చు. నటుడిగా శ్రీసింహా, మ్యూజిక్ డైరెక్టర్గా కాల భైరవలు తమ తొలి సినిమాతో రాజమౌళి కుటుంబానికి ఎలాంటి మచ్చ తీసుకరాలేదు. వీరిద్దరితో ఆ కుటంబం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కథనం. ఈ రెండు విషయాల్లో చిత్ర యూనిట్ ముఖ్యంగా దర్శకుడు ఎక్కడా తడబడలేదు. తెర మీద ఆట ప్రారంభమైన 15 నిమిషాల్లోనే సినిమా నేరుగా అసలు కథలోకి ప్రవేశిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని కథ ఎక్కడా డీవియేట్ కాకుండా డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నాడు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఉత్సాహం, ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన కామెడీ అందించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. కమర్షియల్ హంగుల జోలికి పోకుండా కథానుగుణంగా సినిమాను ముందుకు నడింపించాడుదర్శకుడు రితేష్ రానా. క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్ను రివీల్ కాదు. అంతేకాకుండా ఎవరి ఊహకందని కామెడీ క్లైమాక్స్తో సినిమా ముగుస్తుంది. సంగీతదర్శకుడిగా మరో అవతారం ఎత్తిన సింగర్ కాల భైరవ తన తొలి సినిమాలోనే తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. ఈ మూవీకి మరో మేజర్ ప్లస్ పాయింట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. సినిమాలో వచ్చే ప్రతీ సిచ్యూవేషన్కు తగ్గట్టు వినూత్న రీతిలో కొత్త బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు ఈ యువ సంగీత దర్శకుడు. ముఖ్యంగా కామెడీగా వచ్చే కొన్ని సౌండ్స్ కేక అని చెప్పాలి. ఇక దర్శకుడు ఆలోచనలను తెరమీద దృశ్యరూపంలో ఎలాంటి గందరగోళం లేకుండా చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు సినిమాటోగ్రఫర్. విజువలైషన్స్ కూడా చాలా కొత్తగా వండర్గా అనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా సూపర్బ్గా నచ్చుతుంది. వినూత్న కథలను, కొత్త కాన్సెప్ట్లను ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఫైనల్గా కొత్త వాళ్లు.. కొత్త ప్రయత్నం.. కొత్తగా, గ‘మ్మత్తు’గా ఉంది. ప్లస్ పాయింట్స్: శ్రీసింహా నటన సత్య కామెడీ కాల భైరవ మ్యూజిక్ కథనం సినిమాలో కొత్తదనం మైనస్ పాయింట్స్: కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్డెస్క్ -
ఏపీ బడ్జెట్పై అర్థిక మంత్రి బుగ్గన రాజేండ్రనాథ్ సమీక్షలు
-
రేపటి నుంచి వైఎస్ జగన్ సమీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని.. స్కూల్స్లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడద్దు, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలన్నారు. ఇది ప్రాథమిక సమావేశమని, మళ్లీ సమావేశం లోపు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రేపటి నుంచి శాఖల వారీగా ముఖ్యమంత్రి జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరపనున్నారు. జూన్ 3న విద్యా, జలవనరుల శాఖలపై సమీక్ష జరుపుతారు. 4న వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై సమీక్ష ఉంటుంది. 6న సీఆర్డీఏపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 8న సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8.39 గంటలకు ముఖ్యమంత్రి చాంబర్లోకి ప్రవేశించనున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. 42 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కార్యాలయ అధికారులనూ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. -
పిడకలపై రివ్యూలు.. నవ్వులే నవ్వులు
ఈ-కామర్స్ వెబ్సైట్ల రాకతో మనకు కావాల్సిన వస్తువులను కాలు కదపకుండా ఇంటికి తెప్పించుకునే సౌలభ్యం దొరికింది. ఆన్లైన్ ఆర్డరిస్తే చాలు కోరుకున్న వస్తువు చెంతకు వచ్చి చేరుతోంది. అయితే మనం కొనాల్సిన వస్తువు పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు రివ్యూల మీద ఆధారపడుతుంటాం. ఇలాంటి రివ్యూలే ఇప్పుడు మనకు హాస్యం పండిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లలో పిడకల మీద పెట్టిన రివ్యూలు చూస్తే కడుపు చెక్కలవాల్సిందే. హిందువులు వివిధ క్రతువుల్లో ఆవు పేడ పిడకలను వినియోగిస్తుంటారు. స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన పిడకలను ‘కౌ డంగ్ కేక్’ పేరుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లు అమ్మకానికి ఉంచాయి. వీటి గురించి తెలియని కొంత మంది రాసిన రివ్యూలు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘ఇవి చాలా బాగున్నాయి. వీటి వాసన గులాబి పూల మాదిగా ఉందని’ పేర్కొంటూ ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చారు. ‘వీటి సైజు చాలా పెద్దగా ఉంది. నోటితో కొరకడానికి వీలు కాదంటూ’ మరొకరు పేర్కొన్నారు. దీని రుచి అమోఘం అంటూ మరొకరు పొడిగారు. ‘దీన్ని కొనకండి. క్వాలిటీ, క్వాంటిటీ రెండూ బాలేదంటూ’ ఇంకొరు ఒక స్టార్ మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఈ రివ్యూలు చూసిన తర్వాత మనోళ్లంతా పగలబడి నవ్వుతున్నారు. ఇంట్లో డెకరేషన్ కోసం పిడకలు వాడతారని సదరు వెబ్సైట్లు పేర్కొనడం కొసమెరుపు. -
రివ్యూలు తారుమారు : దిగ్గజ హోటల్కు భారీ ఫైన్
ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, ప్రాంతం గురించి కానీ, సినిమాల గురించి కానీ తెలుసుకోవాలంటే... ముందస్తుగా రివ్యూల బాట పడతాం. వాటి గురించి రివ్యూల్లో ఏం చెప్పారా? అని వెతుకులాట మీద వెతుకులాట చేపడతాం. అసలకే ఖర్చు పెట్టి వెళ్తాం. అది బాగోపోతే ఆ ఖర్చంతా వృథా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికే వాటి అనుభవాలను పొందిన వారు, సందర్శకులు వాటి గురించి ప్రముఖ వెబ్సైట్లలో తమ తమ రివ్యూలు ఇస్తూ ఉంటారు. వీటిని చదివే చాలా మంది నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ రివ్యూల్లో తమ గురించి ఎలాంటి తప్పుడు రివ్యూలు రాకుండా.. మంచిగా మాత్రమే స్పందించేలా కొన్ని యజమాన సంస్థలు జాగ్రత్త పడుతూ ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజం హోటల్ ఇదే పని చేసి, భారీ జరిమానాను ఎదుర్కొంది. ఎక్కువ మంది సందర్శించే పాపులర్ ట్రిప్అడ్వయిజర్ వెబ్సైట్లో తమ గురించి తప్పుడు రివ్యూలు రాకుండా.. ఆస్ట్రేలియా అతిపెద్ద హోటల్ మెరిటన్ ప్రాపర్టీ సర్వీసులు అక్రమాలకు పాల్పడింది. దీంతో వినియోగదారులు ఇచ్చే ఫిర్యాదులేమీ రివ్యూల్లో నమోదు కాలేదు. ఇలా మోసపూరితంగా.. ట్రిప్అడ్వయిజరీలో మెరిటన్ రివ్యూలను తారుమారు చేస్తుందని తేల్చిన ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు.. 2.2 మిలియన్ డాలర్లు అంటే 15 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2014 నవంబర్ నుంచి 2015 అక్టోబర్ మధ్యకాలంలో మెరిటన్ ఈ తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిందని కోర్టు తెలిపింది. ఈ కంపెనీ ఆస్ట్రేలియా వినియోగదారుల చట్టంలో మొత్తం 13 ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. సౌత్ వేల్స్, క్వీన్ల్యాండ్లో మొత్తం 13 ప్రాపర్టీలను ఈ హోటల్ కలిగి ఉంది. ఇలా ఉల్లంఘనలకు పాల్పడి, కేవలం మంచి రివ్యూలే సంపాదించి.. ట్రిప్అడ్వయిజర్ వెబ్సైట్లో ప్రాపర్టీ ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఈ విషయం గురించి తమకు 2015 అక్టోబర్లో తెలిసిందని, ఈ విషయం తెలియడంతోనే వెంటనే దీనిపై విచారణకు, స్వతంత్ర నియంత్రణకు ఆదేశించినట్టు ట్రిప్అడ్వయిజర్ తెలిపింది. ఈ జరిమానాతో పాటు ట్రిప్అడ్వయిజర్కు ఇచ్చే గెస్ట్ ఈ-మెయిల్ అడ్రస్లను మెరిటన్ ఫిల్టర్ చేయడం, ఎంపిక చేయడంపై కోర్టు నిషేధం విధించింది. -
ఎమోషన్స్ చూడకుండా రొమాన్స్పై విమర్శలా?
ఆర్ఎక్స్ 100 సినిమా విజయోత్సవం నగరంలోని వుడా చిల్డ్రన్ ఎరినాలో ఆదివారం రాత్రి ఉత్సాహంగా సాగింది. హీరో హీరోయిన్లు కార్తీకేయరెడ్డి, పాయల్ రాజ్పుత్ డ్యాన్స్లు చేస్తూ, ఫొటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేశారు. బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): సినిమా సమీక్ష రాసే వారికి తమ సినిమాలోని 140 నిమిషాల ఎమోషన్స్ కనిపించటం లేదు.. కేవలం 6 నిమిషలా రొమాన్స్ మాత్రమే కనిపిస్తోందంటే వాళ్ల్ల ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్థం అవుతోందని ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మైండ్లో అలాంటివి లేవు కాబట్టి 140 నిమిషాల ఎమోషన్స్కు కనెక్ట్ అయ్యారని ఆయన అన్నారు. ఆదివారం వుడా చిల్డ్రన్ ఏరినాలో గౌరీ బాయి అసోసియేట్స్, మూన్ పవర్ ఈవెంట్స్ సంయుక్తంగా ఆర్ఎక్స్ 100 చిత్రం విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో పాటలకు యూ ట్యూబ్లో కోట్ల వ్యూస్ వస్తున్నాయన్నారు. సినిమాలో రొమాన్స్ ఎందుకు అనేది సినిమా పూర్తిగా చూస్తే అర్థం అవుతుందని అలా కాకుండా నచ్చినట్లు రివ్యూలు రాసి సినిమా పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారన్నారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలను బ్యాన్ చేయాలని మంత్రి గంటాను కోరారు. మెగాస్టార్ చిరంజీవికి మా సినిమా క్యూబ్ను పంపించామని ఈ రోజు మా చిత్రాన్ని ఆయన చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ రివ్యూలను బ్యాన్ చేయాలనే ఆలోచన మంచిదని ముఖ్యమంత్రి తో చర్చించి దాన్ని అమలు చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వంద శాతం సినిమా షూటింగ్ చేసే చిత్రాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రం నిర్మాత అశోక్ రెడ్డి, కో–ప్రొడ్యూసర్లు సురేష్ రెడ్డి, రవి కుమార్రెడ్డి, వెంకటరెడ్డి మ్యూజిక్ డెరెక్టర్ చైతన్య భరధ్వజ్, కెమెరామెన్ రామిరెడ్డి, గౌరీబాయి అసోసియేట్స్ అధినేత శివకుమార్, మూన్ పవర్ ఈవెంట్స్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామ్చరణ్ నుంచి సునీల్ వరకు అందరూ మెచ్చుకున్నారు ఆర్ఎక్స్ 100 చిత్రం చూసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి హీరో సునీల్ వరకు అందరూ సినిమా బాగుందని మెచ్చుకున్నారని హీరో కార్తీకేయ రెడ్డి అన్నారు. సినిమా పరిశ్రమలో ఎవరిని ఎదగనివ్వరనే ఒక అపోహ ఉంది. కానీ అది నిజం కాదు మాకు ఎవరు అండ లేరు.. మా కథలో దమ్ము ఉంది. మేము కష్టపడి చేశాం మా చిత్రాన్ని చూసి పంపిణీదారులు ముందుకు వచ్చి విడుదల చేశారు. ఇప్పుడు ప్రేక్షకులను అదరిస్తున్నారు. ఇకనైనా రివ్యూలు రాసేవారు కచ్చితంగా రాయాలని లేకుంటే మనివేయటమే మంచిందన్నారు. వైజాగ్తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇక్కడ తన సినిమా విజయోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆర్ఎక్స్ 100 విజయోత్సవ వేదికపై మాట్లాడుతున్న మంత్రి గంటా తెలుగు సినిమాలే చేయాలని ఉంది ఇప్పటికే పంజాబీ, హిందీ సినిమాలు చేస్తున్నా అక్కడ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తున్నారని అందుకే తెలుగు సినిమాలే చేయాలని తనకు ఉందని హీరోయిన్ పాయల్ రాజ్పుత్ అన్నారు. మొదటిసారి కథ విన్నప్పుడు ఈ రోల్ నేను చేయగలనా అనిపించింది. ఈ చిత్రంలో తన రోల్ ఛాలెజింగ్ ఉందన్నారు. జిగేలు రాణి పాటకుహీరో హీరోయిన్ల స్టెప్పులు విజయోత్సవంలో మునిగి తేలుతున్న ఆర్ఎక్స్ 100 హీరో కార్తీక్, హీరోయిన్ రాజ్పుత్ రంగస్థలంలోని జిగేలు రాణి పాటకు స్టేజ్పై డ్యాన్స్ చేసి వేదికను హోరెత్తించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బ్యాడ్ రివ్యూలే మంచి నటుడ్ని చేశాయి
లాస్ ఎంజెల్స్ : తాను నటించిన చిత్రాలపై చెడ్డ సమీక్షలు వచ్చినా తాను పెద్దగా బాధపడనని, వాటిని తనను తాను మలుచుకునే అవకాశాలుగా ఉపయోగించుకుంటానని ప్రముఖ నటుడు మిలో వెంటిమిగ్లియా అన్నారు. బ్యాడ్ రివ్యూలు రాసిన వారిపై కోపం పెంచుకోకపోగా వారిని మెచ్చుకుంటానని, గౌరవిస్తానని తెలిపారు. చెడ్డ రివ్యూలు తనను మరింత పురికొల్పుతాయని, మరింత కష్టపడి పనిచేసే తత్వాన్ని నేర్పుతాయని చెప్పారు. 'ఓ జర్నలిస్టు ఉన్నాడు. ఆయన నా 22 ఏళ్ల కెరీర్లో నిత్యం బ్యాడ్ రివ్యూలే రాశారు. అయినా పర్వాలేదు. నేను వాటిని మెచ్చుకుంటాను. గౌరవిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపేందుకు అవకాశాలు, కారణాలు ఇంకా చాలా ఉంటాయి' అని ఆయన తెలిపారు. ప్రస్తుతం వెంటిమిగ్లియా జాక్ పియర్సన్ అనే పాత్రలో నటించిన 'దిస్ ఈస్ అస్' షో పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. 22 ఏళ్లపాటు తనకు బ్యాడ్ రివ్యూలు ఇచ్చిన వారు ఈ ఒక్క షోకు మాత్రం మంచి విశ్లేషణ రాశారని చెప్పారు. అందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని, వారి వల్లే తనను తాను ఒక మంచి నటుడిగా మలుచుకున్నట్లు తెలిపారు. ఈ షో ఇండియాలో స్టార్ వరల్డ్, వరల్డ్ హెచ్డీ ద్వారా కూడా ప్రసారం కానుంది. -
‘రా..రా..’ మూవీ రివ్యూ
జానర్ : కామెడీ హారర్ నటులు : శ్రీకాంత్, నజియా, సీతా నారాయణ, జీవా, గెటప్ శ్రీను, వేణు, పోసానీ కృష్ణమురళీ, రఘు బాబు తదిదరులు సంగీతం : రాప్ రాక్ షకీల్ నిర్మాత : ఎం. విజయ్ ఒకప్పుడు హీరోగా దూసుకెళ్లి, మధ్యలో సపోర్టింగ్ రోల్స్ లోనూ మెప్పించిన హీరో శ్రీకాంత్. విలన్గా కూడా ట్రైచేసిన శ్రీకాంత్ ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాడు. తొలిసారిగా హారర్ సినిమా చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. టాలీవుడ్లో హారర్ ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో మరి శ్రీకాంత్ చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా?.. చాలా కాలంగా సరైన బ్రేక్కోసం చూస్తున్న ఆయనకు ఈ సినిమా ఏ మేరకు బూస్ట్ ఇచ్చిందో తెలుసుకుందాం. కథ : రాజ్కిరణ్ ( శ్రీకాంత్) తండ్రి ( గిరిబాబు) ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్. గిరిబాబు తీసిన వంద సినిమాల్లో ఒక్కటి తప్పా మిగిలినవన్నీ హిట్ సినిమాలు తీసిన గొప్ప దర్శకుడిగా గిన్నిస్ బుక్లో రికార్డు కెక్కుతాడు. అతని కొడుకు (శ్రీకాంత్) డైరెక్టర్ కావాలనుకుంటే నిర్మాతలు క్యూ కడతారు. అయితే తీసిన ప్రతి సినిమా బెడిసికొడుతుంది. చివరకు ఒక సినిమాను గిరిబాబు ప్రొడ్యూస్ చేస్తాడు. సినిమా రిజల్ట్ రివర్స్ కావడంతో గుండె ఆగి చనిపోతాడు. అది చూసి శ్రీకాంత్ తల్లికి గుండెపోటు వస్తుంది. ఆమెను బతికించుకోవాలంటే తనకు సంతోషంగా ఉండే పని చేయమని డాక్టర్స్ రాజ్కిరణ్కు సలహా ఇస్తారు. తల్లి సంతోషంగా ఉండాలంటే కనీసం ఒక్క హిట్ సినిమా తీస్తే చాలనుకుంటాడు. అయితే హిట్ సినిమా తీయడానికి రాజ్కిరణ్ పడ్డ కష్టాలేంటీ? సినిమా తీసే ప్రయత్నంలో దెయ్యాలతో వచ్చిన ఇబ్బందులేమిటీ? అసలు దెయ్యాలుండే ఇంటికి రాజ్కిరణ్ ఎందుకు వెళ్లాడు? సినిమా ఎవరితో తీశాడు? అది హిట్టా లేక ఫట్టా ? వీటికి సమాధానాలే రా..రా.. సినిమా. నటీనటులు : తనను తాను నిరూపించుకోవడానికి గత చిత్రాల మాదిరిగానే ఈసినిమాలో కూడా శ్రీకాంత్ అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాలో శ్రీకాంత్ తన నటనతో మెప్పించాడు. అయితే, ఆయనకు మాత్రం టైమ్ కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇక నజియా, సీతా నారాయణలు కూడా తమ పరిధి మేరకు ప్రేక్షకులను అలరించారు. కమెడియన్స్గా నటించిన వేణు, పోసాని, రఘుబాబు, రఘు కార్మంచి, షకలక శంకర్, వేణు, పృథ్వీ, గెటప్ శ్రీను బాగానే నవ్వించారు. విశ్లేషణ : హారర్ మూవీకి ఎప్పుడూ సక్సెస్ స్కోప్ ఉంటుంది. దానికి తోడు కామెడీ జోడిస్తే సినిమాకు మినిమమ్ గ్యారెంటీ అని టాలీవుడ్ నమ్మకం. కాబట్టే వరుస పెట్టి అదే ధోరణిలో సినిమాలు వస్తున్నాయి. అయితే అన్ని సినిమాల కాన్సెప్ట్ ఒకటే. కాసింత భయపెట్టడం. కాసింత నవ్వించడం. ఇదే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. వాటితో పాటే కథ, కథనం, పాత్రలను మలిచే విధానం, సందర్భానుసారంగా వచ్చే కామెడీ, ట్విస్ట్లు ఇవన్నీ ముఖ్యమే. ఇవేవీ లేకుండా ఊరికే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో భయపెట్టేసి, కమెడియన్స్ భయపడుతూ ప్రేక్షకులను నవ్విద్దామనుకుంటేనే వస్తుంది అసలు చిక్కు. ఒక్కటంటే ఒక్కటి కొత్త సీన్ ఉండదు. మనుషులను చూసి దెయ్యాలు భయపడటమేంటో? దెయ్యాల్లో కూడా కామెడీ దెయ్యాలుంటాయని చూపించడం ఈ సినిమాకే సాధ్యమైంది. దెయ్యాన్ని లవ్ చేయడం ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూపించినా ఇందులో మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఎడిటింగ్ ఫర్వాలేదనిపించింది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అంతగా మెప్పించలేకపోయాయి. ప్లస్ పాయింట్స్ శ్రీకాంత్ నటన కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ కథలో సీరియస్నెస్ లేకపోవడం అతికించినట్టు అనిపించే సీన్స్ ముగింపు : సినిమా రా..రా..అంది. తీ..రా..వెళ్లి చూస్తే ఏమీ లేదు. బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
ట్యూబ్లైట్ రిజల్ట్పై సల్మాన్ స్పందన
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. వరుస సక్సెస్లతో ఫుల్ ఫాంలో ఉన్న సల్మాన్ జోరుకు ట్యూబ్ లైట్ బ్రేక్ వేసింది. బలమైన కథ లేకపోవుటంతో సల్మాన్ స్టార్ ఇమేజ్, భారీ గ్రాఫిక్స్ కూడా సినిమాను కాపాడలేకపోయాయి. సోషల్ మీడియాలో ట్యూబ్లైట్పై పెద్ద ఎత్తున సెటైర్లు పడుతుంటే.. రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. అయితే ఈ రివ్యూల పై స్పందించిన సల్మాన్' నేను ఇంకా దారుణమైన రేటింగ్స్ వస్తాయనుకున్నా.. విశ్లేషకులు -3, -4 రేటింగ్స్ ఇస్తారని భావించా.. కానీ 1, 1.5 రేటింగ్స్ వచ్చాయి' అంటూ కామెంట్ చేశాడు. బియింగ్ హ్యూమన్ ఆర్గనైజేషన్తో పీవీఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్, ఈ కామెంట్స్ చేశాడు. సినిమా రిలీజ్కు ముందుకు కూడా రివ్యూలు రాసే వాళ్లపై సల్మాన్ ఖాన్ ఫైర్ అయ్యాడు. -
కశ్మీర్ పరిస్థితిపై రాజ్ నాథ్ సమీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కశ్మీర్ లో గత కొంత కాలంగా నెలకొన్న పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ గంటకు పైగా చర్చించారు. మంత్రులకు అధికారలు కశ్మీర్ పరిస్థితులపై నివేదికను సమర్పించారు. గతేడాది నవంబర్ నెలలో కశ్మీరుకు కేటాయించిన రూ.80 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అమలుపై సమావేశంలో చర్చించారు. ముజాహిదీన్ కమాండర్, యువ వేర్పాటువాద నేత బుర్హాన్ వాని జులై 8న భద్రతాదళాల ఎన్కౌంటర్లో చనిపోయిననాటి నుంచి ప్రారంభమైన ఉద్రిక్తత 40 రోజులు దాటింది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 64 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. -
కొత్త జిల్లాలపై అధ్యయన కమిటీలు
ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ * మూడు నమూనాలు సిద్ధం చేసిన సీసీఎల్ఏ * ‘ట్రాక్’ సహాయంతో కొత్త హద్దులతో మ్యాపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వరుసగా సమీక్షలు నిర్వహించడంతో... రెవెన్యూ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సీఎస్ రాజీవ్శర్మ అధ్యక్షతన నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు శాటిలైట్ మ్యాపులు, గూగుల్ మ్యాపులను ఆధారంగా చేసుకుని కొత్త జిల్లాల హద్దులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. జిల్లాల ఏర్పాటుపై ముందు నుంచి కసరత్తు చేస్తున్న భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) 3 నమూనాల్ని సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. వాటిలో ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి.. కొత్త జిల్లాల తుది స్వరూపాన్ని ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఇచ్చిన మూడు నమూనాలకు సీసీఎల్ఏ వేర్వేరు ప్రాతిపదికలను అనుసరించింది. పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా ఉండేలా ఒక నమూనా, జనాభా ప్రాతిపదికన మరో నమూనా, అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రాతిపదికగా మరో నమూనాను రూపొందించినట్లు సమాచారం. అదనంగా 14 జిల్లాల వరకు పెంచేందుకు వీలుగా ఈ నమూనాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) సహాయంతో సీసీఎల్ఏ ఈ మ్యాప్లను తయారు చేయించారు. ఇదే తీరుగా సరిహద్దు నమూనాలతో మరిన్ని మ్యాప్లు తయారు చేయాలని సంబంధిత నిపుణులకు ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల పరిధిలో జిల్లా కేంద్రం నుంచి అన్ని ప్రాంతాలకు దూరం 60 కిలోమీటర్లకు మించకుండా ఉండేలా చూడాలన్న సీఎం సూచనకు అనుగుణంగా శాస్త్రీయంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అభిప్రాయ సేకరణకు కమిటీలు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ తాజాగా బాధ్యతలు అప్ప గించారు. ఒక్కో జిల్లాకు ఇద్దరు నేతలతో కూడిన 9 కమిటీలను నియమించారు. గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో పునర్విభజన స్వరూపం ఎలా ఉండా లి, ప్రాంతాల వారీగా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఏయే ప్రాంతాల్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలి, అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ 9 కమిటీల సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. హైదరాబాద్లో పరిస్థితులను అధ్యయనం చేసే బాధ్యతా ఆయనకే అప్పగించారు. మెదక్ జిల్లాలో హరీశ్ సూచనల మేరకు కమిటీ పని చేయాలని సీఎం చెప్పినట్లు సమాచారం. పునర్విభజన కమిటీల సభ్యులు ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు రంగారెడ్డి: మహేందర్రెడ్డి, కృష్ణమూర్తి నల్లగొండ: జగదీశ్రెడ్డి, గ్యాదరి కిషోర్ మహబూబ్నగర్: నిరంజన్రెడ్డి, గువ్వల బాలరాజు నిజామాబాద్: ప్రశాంత్రెడ్డి, గంప గోవర్ధన్ కరీంనగర్: వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ ఆదిలాబాద్: లోకా భూమారెడ్డి, వేణుగోపాలాచారి మెదక్: శేరి సుభాష్రెడ్డి, మానిక్రెడ్డి వరంగల్: పెద్ది సుదర్శన్రెడ్డి, మధుసూదనాచారి -
ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో!
► అన్ని శాఖల అధికారులకు జారీ కానున్న ఆదేశాలు ► ఆ రెండు రోజులు సీఎం సమీక్షలకు అందుబాటు కోసమే హైదరాబాద్: ఇకపై అన్ని శాఖల ఉన్నతాధికారులు ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ ఆదేశాలు జారీ చేయడానికి నిర్ణయించారు. ప్రస్తుతం తరచూ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలు ఎప్పుడు ఏ శాఖపై నిర్వహిస్తారో తెలియక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న ఫళంగా ‘సీఎం సమీక్ష నిర్వహిస్తారట, విజయవాడ రావాలంటూ’ సీఎం కార్యాలయం నుంచి హడావిడిగా ఫోన్లు రావడం, ఆదేశాలు అందుతుండడంతో సకాలంలో చేరుకోలేక అవస్థలకు గురవుతున్నారు. ఒకవేళ సమయానికి చేరుకున్నా ఒక్కోసారి సమీక్షలు గంటల తరబడి ప్రారంభం కావడం లేదు. దీంతో అధికారులకు నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే వారంలో రెండు రోజులు సీఎం సమీక్షల కోసం అధికారులు విజయవాడలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ నిర్ణయించారు. -
2015 టాలివుడ్ రివ్యూ
-
గ్రేటర్ ఎన్నికలపై టీ. వైఎస్సార్సీపీ సమీక్షలు
హైదరాబాద్: త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో సమీక్షల్లో రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు కె. శివకుమార్లు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 3వ తేదీ గురువారం కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి...శుక్రవారం కూకట్ పల్లి, మల్కాజ్గిరి నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించనున్నారు. ఆ తరువాత రెండు రోజులు పాటు ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ సమీక్షలు జరపనుంది. ఈ సమీక్షల్లో గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ అభ్యర్థి ఎంపికతో పాటు, స్థానికంగా పార్టీ బలోపేతానికి చర్చిస్తామని గ్రేటర్ నాయకులు తెలిపారు. ఈ సమావేశాల్లో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. -
ప్రజల సొమ్ము సమీక్షల పాలు
గంటా కుమారుని వివాహ రిసెప్షన్కు తరలివచ్చిన ప్రముఖులు సర్కారు సొమ్ముతో మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటన విభాగాల వారీగా సమీక్షలు, సమావేశాలు ఉక్కిరిబిక్కిరైన ఉద్యోగులు, పోలీసులు ఇన్నాళ్లూ తమ శాఖలను కనీసం కన్నెత్తి చూడనివారు నగరంపై వరదలా విరుచుకుపడ్డారు. సమీక్షలు నిర్వహించారు. స్థానిక అధికారులపై చిందులేశారు. ‘పెళ్లి కొచ్చాడు.. భోజనం చేసి వెళ్లిపోతాడులే అనుకున్నారా’ అని భుజాలు తడుముకుంటూ మరోపక్క మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇంతమంది మంత్రులు, ఉన్నతాధికారుల తాకిడి ఒకేరోజు నగరాన్ని చుట్టుముట్టడంతో స్థానిక అధికారులు, పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గంటా వారి ఇంట పెళ్లి సందడికి హాజరైన పెద్దల హడావుడి ఇది. ఒక్క రోజు సమీక్షలకే స్టార్ హోటళ్లు, గెస్ట్ హౌస్లకు రూ.లక్షలు ఖర్చయ్యాయి. విశాఖపట్నం: రాష్ర్ట మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి వైభవంగా జరి గింది. ప్రముఖులంతా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేకపోయినా.. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించేందుకు పోటీ పడటమే ప్రహసనంగా మారింది. దీంతో జిల్లా అధికారులకు ఊపిరాడలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వెంట పరుగులు దీశారు. ఒక్క రోజే సమీక్షల పేరుతో స్టార్ హోటళ్లకు రూ.లక్షలు ఖర్చు చేశారు. ఇప్పటి వరకూ చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులే ప్రభుత్వం క్లియర్ చేయలేదు, తాజా ఖర్చుతో ఆయా శాఖలకు దిగులుపట్టుకుంది. మామూ లు రోజుల్లో అయితే ప్రభుత్వ అతిధి గృహాల్లోనో, కార్యలయాల్లోనో సమావేశాలు నిర్వహించి ఖర్చు తగ్గించుకునేవారు. మరోవైపు ఇంతమంది వీవీఐపీ లు ఒకేసారి నగరానికి రావడం, వారు నగరమంతా కలియతిరగడంతో పోలీ సులకు ముచ్చెమటలు పట్టాయి. ప్ర ముఖులకు రక్షణగా వందలాదిమంది పోలీసు అధికారులు, సిబ్బంది క్షణం తీరిక లేకుండా కాపలా కాశారు. ఎలాగూ వస్తున్నాం కదా అని తమ శాఖకు చెందిన అధికారులతో సమీక్షలు జరిపారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్, సిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీ త, పీతల సుజాత, కొల్లు రవీంద్రలు తమ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సునీత నగరంలోని రేషన్ డిపోలు, వాణిజ్య దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. శాసనసభ ఎస్యూరెన్స్ కమిటీ చైర్మన్ చెంగళరాయుడు ‘వుడా’లో సమీక్ష జరిపారు. ప్రజా ప్రతినిధులే కాదు ఉన్నతాధికారులు సైతం సమీక్షలతో బిజీబిజీగా గడిపారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూపై చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు చర్చించారు. ప్రధానమంత్రి మోదీతో కూడా విశాఖ నుంచే వీడియో కాన్ఫరెన్స్లో కృష్ణారావు పాల్గొన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, ఆ శాఖ కమిషనర్ సంధ్యారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ బి.శ్యామలరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, వివిధ విశ్వ విద్యాలయాల ఉపకులపతులు తమ తమ శాఖల పనితీరును సమీక్షించారు. -
సమీక్షలతో సరి
గుంటూరు సిటీ : రాష్ట్ర ఖజానా నిండుకున్న ప్రస్తుత తరుణంలో చేసేందుకు పనేమీ లేని పలు ప్రభుత్వ శాఖల్లో గృహనిర్మాణ శాఖ ఒకటి. గతేడాది కట్టిన ఇళ్లకే ఇంకా డబ్బులు చెల్లించని దారిద్య్రంలో ఉన్న ఈ శాఖ ఇప్పట్లో కొత్త ఇళ్ల ఊసెత్తే అవకాశమే కనిపించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు నుంచే గృహనిర్మాణశాఖలో ఎక్కడి పనులక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులు కూడా ఉన్న ఫళంగా ఫైళ్లను అటకెక్కించి, గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు. వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్గృహకల్ప తదితరాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన సిబ్బంది టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల కాలంలో కేవలం సమీక్షలకే పరిమితమయ్యారు. కొత్త బడ్జెట్ విడుదలైతేనే మళ్లీ ఇళ్లు.. సరిగ్గా 2014 మార్చి 24వ తేదీతో గృహ నిర్మాణశాఖకు సంబంధించిన అన్ని రకాల పేమెంట్స్ నిలిచిపోయాయి. ఆ తర్వాత ఇక తాము చేసేదేమీ లేక కంప్యూటర్లు షట్డౌన్ చేశామని స్వయంగా ఆ శాఖాధికారులే చెబుతున్నారు. అప్పటి నుంచి నయాపైసా నిధులు మంజూరు కాలేదనీ, మార్చిలో కొత్త బడ్జెట్ రిలీజ్ అయితేనే మళ్లీ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తుందనీ అంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటికి పలు నిర్మాణ దశల్లో ఉన్న గృహాలకు ఈ శాఖ రూ.15కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. కొత్త బడ్జెట్లో దీనికి నిధులు కేటాయిచినా ముందు పాత బకాయిలు చెల్లిస్తే కానీ, కొత్తవి మంజూరు చేయలేని పరిస్థితి. ఈ లెక్కన 2015-16 సంవత్సరంలో పేదవాడి సొంతింటి కల తీరే సూచనలు దాదాపు లేనట్లేనని స్వయంగా అధికారిలే అంగీకరిస్తుండటం విశేషం. ముందు నుంచి వెనక్కు సర్వే.. 2014 మార్చి 24వ తేదీ నుంచి కూడా ఈ శాఖ ఉద్యోగులు ఖాళీగా ఉంటూ జీతాలు తీసుకుంటున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఎన్నికలయ్యాక సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గృహ నిర్మాణాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. అది కూడా జిల్లాలో ఇంకా ఎంత మంది ఇళ్లు లేని నిరుపేదలున్నారా.. అని కాదు. గడచిన పదేళ్లలో.. అంటే టీడీపీ అధికారానికి దూరంగా ఉన్న కాలంలో ఎన్ని గృహాలు మంజూరయ్యాయి? వాటిలో అర్హులైన లబ్ధిదారులున్నారా? అక్రమాలకు తావుందా? అనే అంశాలపై 2014 నుంచి 2004 వరకు లెక్క తీసే పనిలో నిమగ్నమయ్యారు. నో బడ్జెట్ - నో వర్క్ బడ్జెట్ లేదు. పనులు లేవు. 2014 ఎన్నికలప్పుడు ఎక్కడైతే తమ శాఖ పనులు ఆగిపోయాయో ఇప్పుడూ అక్కడే ఆగి ఉన్నాయి. సీఎం ఆదేశాల మేరకు 2014 నుంచి 2004 వరకు జిల్లాలో జరిగిన గృహ నిర్మాణాలపై సమగ్రంగా సర్వే నిర్వహిస్తున్నాం. తద్వారా అన్ని నిర్మాణాల వివరాలను కంప్యూటరీకరించాలన్నదే ఉద్ధేశం. జిల్లాలో ఇలా 2,49,122 గృహాలను సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటికి లక్షా 43వేల వరకు పూర్తి చేశాం. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేసి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తాం. జిల్లాలో కొత్త ఇళ్ల మంజూరుల వ్యవహారం మార్చిలో బడ్జెట్ కేటాయింపులను బట్టి ఉంటుంది. - గృహనిర్మాణశాఖ పీడీ సురేష్బాబు సమీక్షలు, గృహనిర్మాణశాఖ, ఉద్యోగులు, Reviews, department of house costructions, employees -
ఎవరికి వారే..!
వెనుకబడిన, వలసల జిల్లాగా పేరొందిన పాలమూరులో సమస్యలు సవాలక్ష.. వాటిని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు.. కలెక్టర్, ఇతర విభాగాల మధ్య సమన్వయం లోపించింది. తక్షణ వాటిపైనే ఉరుకులు పరుగులు తీస్తూ.. పెండింగ్ సమస్యలు పట్టించుకోవడం లేదు. జిల్లా సమగ్రాభివృద్ధిపై సమీక్షలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయి పర్యటనలు ముందుకు సాగడం లేదు.. వెరసి జిల్లా పాలనాయంత్రాంగం పనితీరు ఎవరికివారే.. యమునా తీరే..! అనే చందంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలనా యంత్రాంగం పనితీరు దిశా నిర్దేశం లేకుండా సాగుతుండటంతో జిల్లాలో చిన్నాచితక సమస్యలు దీర్ఘకాలంగా అలాగే ఉండిపోతున్నాయి. సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఇతర సమస్యలపై దృష్టి సారించకపోవడంతో సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వశాఖల వారీగా సమీక్షలు కొరవడడంతో కొన్ని ప్రభుత్వ విభాగాల ఉనికి నామమాత్రంగా తయారైంది. కొన్ని విభాగాల సమీక్షలు అధికారులు సమర్పించే మొక్కుబడి నివేదికలతో ముగుస్తున్నాయి. పర్యవేక్షణ, సమీక్షల ద్వారా పనితీరుపై మదింపు జరగకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పాలనా యంత్రాంగానికి సారథ్యం వహించే కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బందికి నడుమ సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మధ్య పొంతన కుదరక పాలనపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న జాయింట్ కలెక్టర్ను కలెక్టర్ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని కలెక్టరేట్ సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పరిధిలోని ఇసుక అనుమతులు అంశాన్ని తప్పించి డీఆర్వో నేతృత్వంలోని ‘సాండ్ సెల్’కు అప్పగించడం ఇద్దరి మధ్య నెలకొన్న అగాథాన్ని సూచిస్తోంది. రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల లబ్ధిదారుల గుర్తింపు వంటి విషయాల్లో రెవెన్యూ యంత్రాంగం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఆగిన క్షేత్రపర్యటనలు బాధ్యతలు స్వీకరించిన కొత్తలో క్షేత్రస్థాయి పర్యటనలతో తీరిక లేకుండా గడిపిన కలె క్టర్ ప్రస్తుతం కార్యాలయానికి ఎక్కువగా పరిమితమవుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే, రుణమాఫీ, సామాజిక పింఛన్ల లబ్ధిదారుల గుర్తింపు వంటి పనుల్లో కలెక్టర్ ఒత్తిడి చేయడంపై ఓ దశలో ఉద్యోగులు ‘వర్క్ టు రూల్’ పేరిట నిరసనకు దిగారు. జాబితాల పరిశీలన, కంప్యూటరీకరణ, వీడియో కాన్ఫరెన్స్లతో కుటుంబంతో గడిపే పరిస్థితి లేకుండా పోయిందని ఉద్యోగులు ఆక్షేపించారు. నవంబర్ 8న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్యోగులతో కలెక్టర్ రాజీకుదుర్చుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ‘తమకూ యూనియన్లు ఉన్నాయని’ ఆవేదన వ్యక్తంచేసిన కలెక్టర్ ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలను పూర్తిగా తగ్గించారు. ‘అనేక అంశాలపై దిశా నిర్దేశం కోరేందుకు కలెక్టర్ వద్దకు వెళ్తున్నాం. కానీ పూర్తిస్థాయిలో చర్చించే పరిస్థితి లేక వెనుదిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి అందే తక్షణ ఆదేశాలపైనే అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఇతర శాఖల అంశాలపై పూర్తి స్థాయి సమీక్ష జరగడం లేదు’ అంటూ కొందరు అధికారులు లోలోన వ్యాఖ్యలు చేస్తున్నారు. -
రేపటి నుంచి సమీక్షలు
కర్నూలు(జిల్లా పరిషత్) : ఈ నెల 9, 10 తేదీల్లో కర్నూలులో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. కర్నూలులోని నంద్యాల చెక్పోస్టు సమీపంలో ఉన్న మెగాసిరి ఫంక్షన్ హాలులో ఈ సమావేశాలు కొనసాగుతాయన్నారు. రెండు రోజులపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల బాధ్యులు, ముఖ్యులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్చిస్తారని ఆయన తెలిపారు. బుధవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని సమావేశహాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, గౌరు చరితారెడ్డి, మణిగాంధి, ఐజయ్య, గుమ్మనూరు జయరామ్, పార్టీ నాయకులు కొత్తకోట ప్రకాష్రెడ్డి, పత్తికొండ రామచంద్రారెడ్డి, ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు హఫీజ్ఖాన్, గ్రీవెన్స్సెల్ కన్వీనర్ తెర్నేకల్ సురేందర్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. 9వ తేదీన నంద్యాల పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, 10వ తేదీన కర్నూలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తారన్నారు. సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఆయా మండలాలు, జిల్లా పార్టీ ముఖ్యులతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. గత పార్లమెంటు, అసెంబ్లీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన తీరు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తదితర అంశాలు చర్చిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆయా నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై సమీక్షిస్తామన్నారు. ఈ మేరకు గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలపై కూడా చర్చ ఉంటుందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తల విషయంపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశాలకు ముఖ్యులకే అనుమతి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటున్నందున అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. అయితే ఈ నియోజకవర్గాల సమీక్షా సమావేశానికి ఆయా మండలాలు, జిల్లా, రాష్ట్ర నాయకులకు మాత్రమే అనుమతి ఉందని ఆయన చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు ఈ విషయాన్ని అన్యదా భావించకుండా అర్థం చేసుకుని సహకరించాలన్నారు. బుట్టదాఖలైన చంద్రబాబు హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరు నెలల కాలానికే జనాన్ని విసుగెత్తించారని విమర్శించారు. ఎన్నికల ముందు ఆయనిచ్చిన హామీల్లో ఏవీ సక్రమంగా అమలు చేయడం లేదని బుడ్డా రాజశేఖరరెడ్డి ద్వజమెత్తారు. రైతు రుణమాఫీపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో అనేక కొర్రీలు పెట్టి హామీనే మాఫీ చేస్తున్నారని అన్నారు. రూ.50 వేల రుణం కాదు కదా రూ.5 వేల రుణం కూడా మాఫీ కాలేదన్నారు. రుణమాఫీ పత్రాలు అందుకున్న రైతులు బ్యాంకుకు వెళితే తమకే డబ్బులు రాలేదని బ్యాంకు అధికారులు వెనక్కి పంపిస్తున్నారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. రుణాలు మాఫీ గాక, అప్పులు పుట్టక వారు దివాళా తీసే పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక పింఛన్దారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆధార్ నెంబర్, ఫింగర్ ప్రింట్స్ పేరుతో వృద్ధులను, వికలాంగులను పోస్టాఫీసుల చుట్టూ రోజుల తరబడి తిప్పుకుంటూ వారి ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల నుంచి పింఛన్ రాని వారు వేల మంది ఉన్నారని తెలిపారు. వితంతువులకు భర్త డెత్ సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెబుతున్నారని, ఎప్పుడో చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రాలను ఇప్పుడు ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగి ఎలా తెచ్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. అమలుకాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ఇప్పుడు హామీలను మాఫీ చేయడానికి పడరాని పాట్లు పడుతున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సమీక్షా సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమీక్షలు, నంద్యాల చెక్పోస్టు, సమావేశాలు, Reviews, Nandyal check post, meetings -
సమీక్షలతో సరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:హడావుడి సమీక్షలు, అవి చేస్తాం.. ఇవి చేస్తామన్న ప్రకటనల పటాటోపమే తప్ప జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పెద్దగా కనిపించడంలేదు. మరో రెండు రోజుల్లో ఈ ఏడాది ముగుస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటిపోయింది. జిల్లాకు చెందిన మంత్రి, ప్రభుత్వ విప్ సమీక్షల పేరిట హడావుడి చే స్తున్నారు తప్ప రాష్ట్రస్థాయిలో జిల్లా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న దాఖలాలు కనిపించలేదు. సమీక్షల పేరిట జిల్లాలో జరుగుతున్న తంతు ఉత్తి హడావుడిగానే మిగిలిపోతోంది. వాటిలో తీసుకున్న నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదు. విపక్షాలు గొంతెత్తితే తప్పును గత పాలకులపైకి నెట్టేయడమో, కొన్నాళ్లుగా సమీక్షలు నిర్వహించకపోవడం వల్లే ఇలా జరిగిందంటూనో కాలం గడిపేస్తున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ, ఐటీడీఏ సమావేశాల్లో ఈ విషయం స్పష్టమైంది. ఎజెండాలు పక్కకుపోతున్నాయి. పదుల సంఖ్యలో శాఖలు ఉండగా నాలుగైదు అంశాలకే చర్చలు పరిమితమైపోతున్నాయి. మంత్రుల పర్యటనలు, సమీక్షల్లో తీసుకున్ని కొన్ని నిర్ణయాల అమలు తీరు పరిశీలిస్తే.. తుపానుకు ముందు ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని సందర్శించినప్పుడు ఆస్పత్రి డొల్లతనం బయటపడింది. అనంతరం జెడ్పీలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సాక్షిగానే జిల్లా అధికారులు తగాదాపడ్డారు. ఆ తర్వాత కూడా ఫలితాల్లో మార్పు లేదు. మున్సిపల్ మంత్రి నారాయణ జిల్లా పర్యటనకు వచ్చి మున్సిపాలిటీల్లో 100 రోజుల ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. కనీసం 50 శాతం లక్ష్యాలు సాధించకపోవడంపై అధికారులపై మండిపడ్డారు. అంతే.. అప్పటి నుంచీ అదే పరిస్థితి. వ్యవసాయ మంత్రి పుల్లారావు నైరా కళాశాల ఉత్సవాలకు హాజరైనప్పుడు పలు హామీలిచ్చారు. సమీక్ష నిర్వహించి వ్యవసాయ అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. ఫలితం సున్నా. తరువాత అధికారులే మారిపోయారు. తుపాను సమయంలో పది రోజుల పాటు జిల్లా అంధకారంలో మగ్గిపోయినప్పుడు మంత్రులు, నాయకులు పొంతన లేని హామీలిచ్చారు. జిల్లాకు వరుసకట్టిన మంత్రులు, వారితో వచ్చిన నాయకులు, ఉన్నతాధికారులు, సిబ్బందికి మర్యాదలు చేయలేక జిల్లా యంత్రాంగం ఆపసోపాలు పడింది. తుపాను వచ్చిన రెండు నెలల తర్వాత నష్టాల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం ఒకరోజుకే పర్యటనను పరిమితం చేసి తరువాత చూద్దాం అంటూ వెళ్లిపోవడం అభాసుపాలైంది. పాతపట్నం, రేగిడి మండలాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని, 11 కేంద్రాల్లో రూ.2కే 20 లీటర్ల మంచినీరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేదు. అధికార పార్టీలో ఎవరికి వారే.. అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. మొన్నటివరకూ పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్టు ఉన్న ఎమ్మెల్యే కళావెంకట్రావుకు పార్టీ అధిష్ఠానం సభ్యత్వ నమోదు పర్యవేక్షణ బాధ్యత అప్పగించడంతో ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోందని అంటున్నారు. మరో ఎమ్మెల్యే శివాజీ ఇప్పటికీ అలకపాన్పు దిగలేదని తెలుస్తోంది. ఇటీవల జెడ్పీలో జరిగిన సమీక్షలో ఇది స్పష్టమైంది. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆ మధ్య పాదయాత్రలు చేసినా ఇప్పుడు అవేవీ కనిపించడంలేదు. అన్నింటికీ మించి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వీరు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో అధికారులకు సొంత లక్ష్యాలు నిర్దేశిస్తుండటంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగుల బదిలీలు, రుణమాఫీ, పింఛన్ల మంజూరు, తుపాను నష్టపరిహారం విషయాల్లో వీరిద్దరి ఎజెండాలు వేర్వేరన్న విషయం బయటపడింది. కాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే మూడుసార్లు జిల్లాకు వచ్చినా నిర్ధిష్టమైన హామీలేవీ లభించలేదు. మొక్కుబడిగా ముఖం చూపించి వెళ్లిపోయారు. సోంపేట, కాకరాపల్లి థర్మల్ ప్లాంట్లతోపాటు కొవ్వాడ అణుపార్కు, కొత్తగా ప్రతిసాదించిన పొందూరు విద్యుత్ ప్లాంట్ల విషయంలో అధికార పార్టీ నేతలు ఇప్పటికీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నారు. -
రాజమండ్రి నుంచే సీఎం సమీక్షలు, ఆదేశాలు
సాక్షి, రాజమండ్రి : హైదరాబాద్ నుంచి ఆదివారమే విశాఖ చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10 గంటల వరకూ రాజమండ్రిలోనే ఉండి పోవలసి వచ్చింది. విశాఖలో కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తమవడంతో ఆదివారం అర్ధరాత్రి వరకూ రాజమండ్రి ఆర్అండ్బీ అతిథిగృహం నుంచే అధికారులతో టెలీ సమీక్షలు చేసిన బాబు తిరిగి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి 9.30 వరకూ వివిధ శాఖల అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన చంద్రబాబు అక్కడి నుంచి కారులో రాజమండ్రి చేరుకున్నారు. రాత్రికి రాత్రే విశాఖ వెళ్లాలనుకున్నా వీలు కాలేదు. విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించడం కష్టమని అధికారులు చెప్పడంతో రాత్రికి రాజమండ్రిలోనే ఉండిపోయారు. సోమవారం ఉదయం 9.00 గంటలకే హెలికాప్టర్ సిద్ధమైనా విశాఖ వెళ్లాక కమ్యూనికేషన్ సమస్య తలెత్తుతుందన్న సందేహంతో రాజమండ్రి నుంచే కీలకమైన అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేసి తుపాను పీడిత ప్రాంతాల్లో పర్యటనకు రావాలని కోరారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి మధురపూడి విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖ బయల్దేరారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెళ్లగా ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత కార్లలో విశాఖ వెళ్లారు. ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, ముఖ్య కార్యదర్శి జవహర్రెడ్డి, కలెక్టర్ నీతూ ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు సురేంద్రబాబు, రాధ, వెంకటేశ్వరరావు రాజమండ్రిలో సీఎంను కలిశారు. -
31నుంచి వైఎస్సార్సీపీ సమీక్షలు
-
31నుంచి వైఎస్సార్సీపీ సమీక్షలు
జిల్లాకు రానున్న వైఎస్సార్సీపీ అదినేత జగన్ ►పార్టీ పరిస్థితులపై కార్యకర్తలతో చర్చ ►నియోజకవర్గాల వారీగా మూడు రోజులపాటు సమీక్షలు ► పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడి సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 31వ తేదీనుంచి మూడు రోజులపాటు మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. నియోజకవర్గాలవారీగా అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్లో జరిగే సమీక్షలకు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పోటీ చేసిన ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. వీరితోపాటు జిల్లా, నియోజకవర్గాల పరిధిలోని అన్ని విభాగాల నాయకులు హాజరు కావాల్సి ఉంటుదన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సైతం హాజరుకావాలన్నారు. అధినేత జగన్మోహన్రెడ్డి 31వ తేదీ ఉదయం 9గంటలకు నగరానికి చేరుకుంటారన్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమీక్షల షెడ్యూల్ తేదీ సమయం నియోజకవర్గాలు 31-07-14 10గం.లకు గుంటూరు తూర్పు, పశ్చిమ 12గం.లకు ప్రత్తిపాడు, తాడికొండ 2.30గం.లకు పొన్నూరు, తెనాలి 5గం.లకు వేమూరు, రేపల్లె 01-08-14 9 గం.లకు నరసరావుపేట,చిలకలూరిపేట, 1.00గం.లకు గురజాల, మాచర్ల, 4.00గం.లకు వినుకొండ, సత్తెనపల్లి 6.00గం.లకు పెదకూరపాడు, బాపట్ల 02-08-14 9గం.లకు చీరాల, పరుచూరు 11గం.లకు సంతనూతలపాడు, అద్దంకి -
రాజీవ్ రహదారిలో ఇన్ని లోపాలా?
ఆర్అండ్బీ అధికారులతో సమీక్షలో కేసీఆర్ ఆగ్రహం ఆదిలాబాద్ హైవే తరహాలో తీర్చిదిద్దాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయత లేకుండా నాలుగులేన్లుగా విస్తరణ, పెరిగిన వాహన ప్రమాదాలు, తీవ్రఅవినీతి.. తదితర ఆరోపణలు మూటగట్టుకున్న రాజీవ్హ్రదారిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్షించి లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. దీనిపై నివేదికను అందజేయాలన్నారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు విస్తరించిన ఈ హైవే ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కానీ విస్తరణ శాస్త్రీయంగా లేకపోవడమేగాక లోపభూయిష్టంగా ఉండడంతో వాహనదారుల పాలిట ఇది ప్రమాదకారిగా మారింది. విస్తరణ సమయంలోనే వివాదం తలెత్తడంతో అప్పటి సర్కార్ శాసనమండలి సభ్యులతో ఓ సభాసంఘాన్ని నియమించింది. నిర్మాణంలో లోపాలు నిజమేనంటూ ఆ కమిటీ నివేదిక సమర్పించినా చర్యలు తీసుకోలేదు. ఆ ఫైలునే అధికారులు మాయం చేశారు. వీటిన్నింటిని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్ ఆ లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు. బై-పాస్లు.. క్రాసింగ్లు : సాధారణంగా నాలుగులేన్ల రహదారికి సర్వీసు రోడ్లు ఉండాలి. కానీ రాజీవ్ రహదారిపై అవి లేవు. దీనిపై కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రూ.1400 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డుపై గ్రామాల వద్ద బై-పాస్లు నిర్మించకపోవడాన్ని ఆయన అధికారులను ప్రశ్నిం చారు. వేగంగావచ్చే వాహనాలకు ప్రమాదాలు జరుగుతాయనే ఆలోచన కూడా ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వెంటనే హైదరాబాద్- ఆదిలాబాద్ హైవే తరహాలో తీర్చిదిద్దాల్సిందేనన్నారు. ప్రతి గ్రామం వద్ద బై-పాస్లు, పెద్ద గ్రామాలున్నచోట వంతెనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూసేకరణ చేయకపోవడం వల్ల బై-పాస్లను ఏర్పాటు చేయలేకపోయామని అధికారులు పేర్కొనగా, ఈసారి అది పూర్తిచేసి వాటి ని నిర్మించాలని సూచించారు. ఆరు ప్రాంతాలు ప్రమాదకరమైనవిగా గుర్తింపు ప్రజ్ఞాపూర్, కుకునూర్పల్లి, దుద్దెడ, సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండంలను ప్రమాదకరంగా ఉన్న ఆరు ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు అక్కడ బై-పాస్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అయితే, అవి చాలవని, మరోసారి రోడ్డుమొత్తాన్ని తనిఖీ చేసి కచ్చితమైన లోపాలు గుర్తించి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. అలాగే నగరంలోని ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే నిర్మించాలని ఆదేశించారు. -
కొత్త ఊపిరి కోసం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సమీక్షలు జరపనున్నారని తెలిసింది. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. పార్టీ పునర్నిర్మాణంపై చర్చించడమే కాక, భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవడం ఈ సమీక్షల ముఖ్యోద్దేశమని పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికంటే ముందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో టీపీసీసీ భేటీ కానుంది. ఉదయం పది గంటలకు మొదలయ్యే ఈ సమావేశాలకు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ మేరకు వారికి ఆ దివారమే ఆహ్వానాలు అందాయి. శ్రేణులలో ఉత్సాహం నింపేందుకు ఈ తరహా సమీక్షల ద్వారా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ముఖ్యనేతల సమావేశం అనంతరం, జులై ఒకటి నుంచి గ్రామ, మండల, బ్లాక్, నియోకజవర్గ స్థాయిలో సమీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిసిన అనంతరం అన్ని స్థాయిలలో సదస్సులు నిర్వహించి, పార్టీ కమిటీలను పునరుద్ధరించాలని అధిష్టానం సూచించింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు పురపాలక, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలలోనూ కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్ప లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పార్టీకి ఆశించిన మేరకు ప్రజల నుంచి ఆదరణ లభించలేదు. దిగ్గజాలూ ఓటమిని చవిచూశారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, టీపీపీసీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ షబ్బీర్అలీ, మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్ పరాజయం పొందారు. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ స్థానాలుసహా జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను మట్టి కరిపించిన ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారు. నిజామాబా ద్ నగరపాలక సంస్థ, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగిరింది. జిల్లా పరిషత్ చైర్మన్, మెజార్టీ మండల పరిషత్లను టీఆర్ఎస్ దక్కించుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. డీఎస్ పట్టు ఇదిలా వుంటే, ప్రతికూల పరిస్థితులలోనూ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసి శాసనమండలి పక్షనేతగా ఎన్నికైన డి.శ్రీనివాస్, ఇప్పుడు టీపీసీసీపై పట్టు బిగిస్తుండటం జిల్లా కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం కేడర్ను నిరాశా, నిస్పృహలకు గురి చేస్తుండగా, సమీప భవిష్యత్తులో ఎన్నికలేమీ లేకపోవడంతో కూడా కేడర్లో నిస్తేజం ఆవరించింది. ముఖ్యనేతలు కూడా వ్యక్తిగత పనులలో బిజీ అయిపోయారు. ఈ పరిస్థితులలో జిల్లాలో పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 22న గాంధీభవన్లో నిజామాబాద్ సమీక్ష ఇలా... ఉదయం 10.00 నుంచి 10.45 వరకు ఆర్మూరు 10.45ల నుంచి 11.30ల వరకు బోధన్ 11.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జుక్కల్ మధ్యాహ్నం 12.15 నుంచి 1.00 బాన్సువాడ 1.00ల నుంచి 1.45లకు ఎల్లారెడ్డి 1.45ల నుంచి 2.30ల వరకు మధ్యాహ్నభోజన విరామం 2.30ల నుంచి 3.15లకు కామారెడ్డి 3.15ల నుంచి 4.00 వరకు నిజామాబాద్ అర్బన్ సాయంత్రం 4.00 నుంచి 4.45 వరకు నిజామాబాద్ రూరల్ 4.45 నుంచి 5.00 వరకు బాల్కొండ అందరూ హాజరుకండి సుభాష్నగర్ : హైదరాబాద్లోని గాంధీభవన్లో మంగళవారం నిర్వహించే సమీక్షలకు జిల్లా నేతలు తప్పక హాజరు కావాలని డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ కోరారు. ఆదివారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గాలవారీగా సయావేశాలు జరుగుతాయన్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మండల, బ్లాక్ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి చిన రాజేశ్వర్, నాయకులు తాటికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వైఎస్సాఆర్ జిల్లాలో జగన్ పర్యటన
-
24న జిల్లా కలెక్టర్ల సదస్సు
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నది మొదలు సమీక్షలతో అధికారులను పరుగుపెట్టిస్తున్న కేసీఆర్... కొత్త రాష్ట్ర అభివృద్ధిలో తన లక్ష్యాలేంటో వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పలువిభాగాల సమీక్షల్లో కీలక నిర్ణయాలు వెల్లడించిన ఆయన కొన్నింటి విషయంలో ప్రక్షాళనదిశగా ఆదేశాలు జారీచేశారు. ఈ తరుణంలో ఈనెల 24న అత్యంత కీలకమైన కలెక్టర్ల సద స్సు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాలనలో తానుకోరుకున్న మార్పు ప్రస్ఫుటమయ్యేలా కలెక్టర్లను సిద్ధం చేసేందుకు ఆయన యత్నిస్తున్నారు. ముఖ్య విభాగాల వారీ సమీక్షలు ఒక ఎత్తయితే నేరుగా ప్రజల బాగోగులను సమీక్షించే కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేయడం మరో ఎత్తు. దీంతో ప్రభుత్వం కలెక్టర్ల సదస్సును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్లు పూర్తిస్థాయి నివేదికలతో ఈ సదస్సుకు హాజరవుతున్నారు. -
నవశకం
- శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన ‘పశ్చిమ’ ఎమ్మెల్యేలు - ఇక జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి - స్థానిక సంస్థల విజేతల పదవీ స్వీకారానికి మార్గం సుమగం - గాడిన పడనున్న పాలన సాక్షి, ఏలూరు : నవశకం మొదలైంది. కొత్త రా ష్ట్రంలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. జిల్లాకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ హాల్లో గురువారం ప్రమా ణ స్వీకారం చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(బీజేపీ), చింతలపూడి ఎమ్మెల్యే, స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, పోలవ రం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై వెంటనే దృష్టి సారించనున్నట్టు వీరంతా ముక్తకంఠంతో చెప్పారు. ఇక వీళ్ల వంతు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ చైర్మన్లు, నగర మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుమగమైంది. వీరంతా బాధ్యతలు చేపడితే ఎన్నో ఏళ్లుగా కుంటుపడిన జిల్లా అభివృద్ధి గాడిన పడుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. 2010 సెప్టెంబర్తో పాలకవర్గం గడువు ముగిసిన ఏలూరు నగరపాలక, నిడదవోలు, కొవ్వూ రు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మార్చి 30న ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని 865 ఎంపీటీసీ, 46 జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఏప్రిల్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. మే 12న పురపాలక, 13న పరిషత్ ఫలితాలు వెలువడ్డాయి. నెలలు గడుస్తున్నా పాలకవర్గాలు పగ్గాలు చేపట్టలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గెలిచిన అభ్యర్థులు పదవులు చేపట్టకుండా నెలల తరబడి ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానిక సంస్థలు దాదాపు మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉండిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. ఈ పరిస్థితుల్లో పాలన గాడినపడే రోజు కోసం ప్రజలు, పదవి చేపట్టే సమయం కోసం గెలిచిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మునిసిపల్, నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న చేపట్టి ఫలితాలను ప్రకటించారు. 7న మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టాలని మందుగా నిర్ణయించారు. మునిసిపల్ కౌన్సిల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓటు అత్యంత కీలకం అవుతుంది. గత శాసనసభ రద్దు కావడంతో కొత్త సభ్యులు వస్తే తప్ప మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పాలకవర్గాలు కొలువుదీరే అవకాశం లేకుండా పోరుుంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడంతో స్థానిక సంస్థలకు పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేందుకు మార్గం ఏర్పడింది. గాడిన పడనున్న పాలన పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాలకు సైతం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. మూడేళ్లుగా మండలాలకు నిధులు విడుదలకాకపోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. పాలకవర్గం ఏర్పడితే జనాభా ప్రాతిపదికన ప్రతి మండలానికి సాధారణ నిధులు రూ.40 లక్షల వరకూ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో 75శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్లో 25 శాతం వాటా నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చు. ఇదిలావుండగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఏర్పడింది. శాసనసభ సమావేశాలు ముగియగానే జిల్లాకు రానున్న ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షలు జరపనున్నారు. ముందుగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించనున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాకు రావాల్సిన నిధులు త్వరితగతిన తీసుకురావాలని భావిస్తున్నారు. -
ప్రజలతో మమేకం... సమస్యలపై పోరాటం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘అయ్యిందేదో అయ్యింది. భవిష్యత్ మనదే. సమష్టిగా పని చేద్దాం... ప్రజల మధ్యే ఉంటూ....వారి సమస్యలపై పోరాడుతూ మరో వైపు పార్టీని పటిష్టం చేద్దాం. వచ్చే నాలుగేళ్లూ కార్యకర్తలకు అండగా ఉందాం. అన్ని వేళలా పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వద్దాం’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్. కోట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఆ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై విశాఖపట్నంలోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వచ్చిన ఓట్లపై ఆరా తీశారు. ఎక్కడ నష్టం వాటిల్లిందో తెలుసుకున్నారు. పార్టీ నాయకులతో ఫలితాలపై క్షుణ్ణంగా చర్చించారు. ప్రత్యర్థుల గెలుపునకు దోహదపడిన అంశాలపైనా, పార్టీ పరమైన లోటుపాట్లపై లోతుగా విశ్లేషించారు. లోపాలను సరి చేసుకుని ముందుకెళ్దామని సూచించారు. భవిష్యత్లో పార్టీని పటిష్ట పరుచుకుని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఉద్యమించి, కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో పార్టీని సమర్థంగా నడుపుకొందామన్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఉంటే మనమే అధికారంలోకి వచ్చేవారమని, అలా చేసి ఉంటే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అప్రతిష్టను మూట గట్టుకునే వాళ్లమన్నారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేద్దామని, ప్రజలకు అండగా నిలిచి, వారి అభిమానంతోనే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వద్దామని శ్రేణుల్లో జోష్ నింపారు. ఇదే సందర్భంలో పార్టీని పటిష్ట పరిచేందుకు కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అత్యధిక మందితో వ్యక్తిగతంగా మాట్లాడి సూచన, సలహాలు తీసుకున్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకులు రొంగలి జగన్నాథం, నెక్కల నాయుడుబాబు, వేచలపు చిన రామునాయుడు, తూర్పాటి కృష్ణస్వామినాయుడు, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్. కోట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నెక్కల నాయుడుబాబు.. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకు ఎస్.కోట నియోజకవర్గ ఇన్చార్జి ్జగా నెక్కల నాయుడుబాబును నియమిస్తున్నట్టు సమీక్ష సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నాయుడుబాబును ప్రత్యేకంగా అభినందించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయుడుబాబు పార్టీని సమర్థంగా నడపగలరన్న అభిప్రాయం మేరకు ఆయన్ని నియమించినట్టు తెలిసింది. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
కాకినాడ: సార్వత్రిక ఎన్నికల ఓటమితో అధైర్యపడకుండా సమస్యలపై పోరాడుతూ ప్రజలతో మమేకం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో పార్టీ ఓటమిపై బుధవారం విశాఖపట్నంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓటమికి దారితీసిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఓటమికి గల కారణాలపై నివేదికను చంద్రశేఖరరెడ్డి జగన్మోహన్రెడ్డికి అందజేశారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, త్వరలోనే ఆయన బండారం బయటపడుతుందన్నారు. సమర్థవంతమైన ప్రతిపక్షంలా వ్యవహరించి ప్రజలకు తోడుగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా, వేధింపులు ఎదురైనా పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాకినాడలో పార్టీ ఎంతో బలీయంగా ఉందని చెప్పారు. త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్, జిల్లా వక్ఫ్కమిటీ అధ్యక్షుడు అబ్దుల్బషీరుద్దీన్, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అనుబంధ విభాగాల కన్వీనర్లు పసుపులేటి వెంకటలక్ష్మి, కిషోర్, రోకళ్ల సత్యనారాయణ, అక్బర్ అజామ్, దుగ్గన బాబ్జీ, మాజీ కార్పొరేటర్లు ఐ.శ్రీను, కొప్పుల విజయకుమారి, కొలగాని దుర్గాప్రసాద్, సిరియాల రాము, సిరియాల చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
భవిత మనదే..
భవిష్యత్ కార్యాచరణ దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. కార్యకర్తలకు భరోసా కల్పించడం.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయటం.. రాష్ట్రాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడం.. ప్రజల పక్షాన నిలిచి పోరాట పంథాలో సాగడం.. అనే ప్రణాళికతో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఈ మేరకు రాజమండ్రి వేదికగా పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెండో రోజు సమీక్షలో భాగంగా గురువారం పాలకొండ, ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :‘ప్రజల నుంచి పుట్టిన పార్టీ మనది. ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. భవిష్యత్తు మనదేనని చెబుతున్నాయి. కాబట్టి ఇకముందు కూడా ప్రజ ల్లోనే ఉందాం. వారి పక్షాన నిలుద్దాం. తప్పకుండా ప్రజలు భవిష్యత్తులో మనకే పూర్తి మద్దతు ప్రకటించి ఆశీర్వదిస్తారు..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులతో చెప్పారు. రాజమండ్రిలో రెండో రోజు గురువారం ఆయన పాలకొండ, ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల ఫలితాలపై సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలన్న తలంపు తనకు లేదన్నారు. ‘మొదట్లో ఇబ్బందులు వచ్చినా ఫర్వాలేదు.. ఎదుర్కొందాం.. అంతేగానీ ప్రజలను తప్పుదోవ పట్టించి మోసపుచ్చే విధానాలను మాత్రం అవలంబించే దుష్ట రాజకీయం మనకు వద్దు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే వైఎస్సార్ కాంగ్రెస్కు ఆయువు పట్టు. ఆ విధానానికి కట్టుబడితే అంతిమ విజయం మనదే..’ అని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలకు పెద్దపీట పార్టీని పోరాట పథంలో ముందుకు నడిపించడానికి పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? రాష్ట్ర స్థాయి పరిణామాలకు కారణమేమిటి? ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో చురుగొనేలా పార్టీని నడిపించేందుకు ఎలాం టి విధానాలను అనుసరించాలి? అనే విషయాలపై కార్యకర్తలను ప్రశ్నించారు. వారుచెప్పిన సమాధానాలపై కొద్దిసేపు చర్చించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల సమీక్షలు పూర్తయిన తరువాత నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. టీడీపీ హామీల అమలుపై దృష్టి పెట్టాలి టీడీపీ ఇచ్చిన హామీల అమలు తీరును నిశితంగా గమనించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్మోహన్రెడ్డి చెప్పారు. కాగా, తామంతా పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వెంట సాగుతామని సమావేశాల్లో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటామన్నారు. ఈ సమావేశాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యేలు వి.కళావతి, కంబాల జోగులు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం, విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీ నాయన, ఎచ్చెర్ల అభ్యర్థి గొర్లె కిరణ్లతోపాటు పార్టీ నేతలు మీసాల నీలకంఠంనాయుడు, పాలవలస విక్రాంత్, చందక జగదీష్, పాలవలస శ్రీను, దుప్పలపూడి శ్రీనివాసరావు, కరణం సుదర్శనరావు, సిరిపురపు జగన్మోహన్రావు, టంకాల అచ్చెన్నాయుడు, గొర్లె రాజగోపాల్, పిన్నింటి సాయి, జీరు రామారావు, బల్లాడ జనార్దన్రెడ్డి, గొర్లె అప్పలనాయుడు, దన్నాన రాజినాయుడు, టొంపల సీతారామ్, మురళీధర్ బాబా, కె.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ మనదే
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల గెలుపోటములు, గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ జిల్లా నేతలతో రాజమండ్రిలో గురువారం సమీక్షించారు. అరకు పార్లమెంట్ పరిధిలోని కురుపాం, సాలూరు, పార్వతీపు రం నియోజకవర్గాలతో పాటు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని నెల్లిమర్ల, విజయనగరం, చీపురుపల్లి బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గ నేతలతో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి గంట సేపు చర్చించారు. తొలుత అరకు పార్లమెంట్ పరిధిలోని కురుపాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గ నేతలతో వేర్వేరుగా సమీక్ష చేశారు. ఎన్నికల్లో ఎక్కడెక్కడ పార్టీకి నష్టం వాటిల్లింది, ఏయే ప్రాంతాల్లో వెనకబడ్డాం, జరిగిన లోపాలు, నాయకుల పనితీరు, ప్రచార తీరు తదితర అంశాలపై లోతుగా సమీక్షించారు. కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి తోనూ వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గెలిచిన చోట ఏయే అంశాలు ప్రభావితం చేశాయన్న దానిపై కూడా ఆరాతీశారు. ఎన్నికలపై నేతల మనోగతం తెలుసుకోవడమే కాకుండా పార్టీ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయనగరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష ప్రారంభమైంది. తొలుత నెల్లిమర్ల నియోజకవర్గంపై సమీక్షించారు. మండలాల వారీగా పార్టీకొచ్చిన ఓట్లు, ప్రభావితం చేసిన అంశాలపై చర్చించారు. ఆశించిన విధంగా ఓట్లు రాకపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రత్యర్థి గెలుపునకు దోహద పడ్డ అంశాలపైనా ఆరాతీశారు. బలం, బలహీనతలపై లోతుగా చర్చించారు. భవిష్యత్లో అనుసరించాల్సిన విధానాలను సూచించారు. తదుపరి విజయనగరం నియోజకవర్గ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు లోపాలను వివరించారు. భవిష్యత్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చీపురుపల్లి, బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గాల సమీక్ష చేశారు. అసెంబ్లీ సమీక్ష చేస్తూనే పార్లమెంట్ అభ్యర్థికొచ్చిన ఓట్లు, ఇతరత్రా అంశాలపై చర్చించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకుల గురించి ఆరాతీశారు. ఎక్కువగా నేతలు అభిప్రాయాలను, వాదనలను, మనోభావాలను తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చెప్పినదాన్ని సావధానంగా విన్నారు. పార్టీ నిర్మాణం కోసం నాయకుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంపై గంట సేపు సమీక్ష చేయడంతో రాత్రి 10గంటల వరకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల సమీక్షే జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి బేబీనాయన, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, నెల్లిమర్ల అభ్యర్థి డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, విజయనగరం నియోజకవర్గం అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, చీపురుపల్లి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు, పార్వతీపురం అభ్యర్థి జమ్మాన ప్రసన్నకుమార్తో పాటు నియోజకవర్గాల ద్వితీయశ్రేణి నేతలతో వైఎస్ జగన్ సమీక్ష చేశారు. సమీక్ష అనంతరం నాయకులకు ధైర్యం చెబుతూ, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చి ప్రసంగించారు. ఏ ఒక్కరికి ఆపదొచ్చినా అందరూ కలిసి నిలబడాలని సూచించారు. నాయకులంతా సమన్వయంతో పనిచేసి, పార్టీని గ్రామస్థాయిలో నిర్మాణం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రజల పక్షాన నిలబడి, సమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. -
అదే గురి...అదే స్ఫూర్తి
సాక్షి, రాజమండ్రి :‘విలువలు, విశ్వసనీయత, నిబద్ధత, సమర్థత కలబోసిన విలక్షణనేత మాకున్నారని చెప్పుకొనేందుకు ఎంతో ఆనందంగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలమనిచెప్పుకోవడానికి గర్వంగా ఉంది. గత నాలుగున్నరేళ్లుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మీతో పాటు మేము కూడా ఎన్నో కష్టాలను ఎదు ర్కొన్నాం. అధికారంలోకి రాలేనందుకు బాధగా ఉన్నా మరో ఐదేళ్లు కూడా మీకు అండగా నిలిచేందుకు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాం’ చెక్కు చెదరని ఆత్మవిశ్వా సంతో కార్యకర్తలు అన్న ఈ మాటలు.. వైఎస్సార్ సీపీ శ్రేణుల మనోనిబ్బరానికి, సమరోత్సాహానికి అద్దం పట్టాయి. ‘ఓటమి చెందిన కొద్దిరోజుల్లోనే పార్టీ అధినేత ఇలా మా వద్దకు వచ్చి మాతో మాట్లాడుతున్నారంటే నమ్మలేకపోతున్నాం. భవిష్యత్లో కూడా ఇలాగే నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతూ అండగా ఉంటే పార్టీని విజయతీరాలకు చేరుస్తాం’ అని వారంటున్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకూ నేను అండగా ఉంటాను. పార్టీ యంత్రాంగమంతా మీవెంటే ఉంటుంది. అధైర్యపడొద్దు’ అని వారి నిబ్బరాన్ని ఇబ్బడిముబ్బడి చేశారు. ఉత్తరాం ధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ వేదికగా చేపట్టిన సమీక్షలు రెండో రోజైన గురువారం కొనసాగాయి. ఉదయం 10గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ సమీక్షలు కొనసాగాయి. ఉద యం అరకు, మధ్యాహ్నం విజయనగరం, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. గ్రామ, బూత్స్థాయి వరకు పార్టీ బలోపేతానికి తీసుకోవల్సిన చర్యల పై వారి సూచనలు, సలహాలు తెలుసుకున్నారు. తమ సమస్యలను, క్షేత్రస్థాయిలో లోటుపాట్లను చెప్పేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు. గురువారం సమీక్షలు ఎక్కువగా పార్టీ గెలుపొందిన అసెంబ్లీ నియోజకవర్గాలపైనే జరి గాయి. ఒకవైపు మోడీ ప్రభావం, మరోవైపు చంద్రబాబు రుణమాఫీ హామీని తట్టుకొని విజ యం సాధించిన ఎంపీ, ఎమ్మెల్యేలను అభినందిస్తూ, వారిని గెలిపించిన ప్రజలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అరకు, విజయనగరం పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గపరిధిలోని కొత్తపేట, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములపై నాయకులు, కార్యకర్తలతో జగన్ సమీక్షించారు. పార్టీని బూత్స్థాయి వరకు బలోపేతం చేస్తామని, గ్రామ కమిటీలను వేయడమే కాక అవి నిరంతరం పని చేసేలా అవసరమైన శిక్షణ ఇస్తామని జగన్ చెప్పారు. వెల్లువెత్తుతున్న పార్టీ శ్రేణులు ఎన్నికల అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన జగన్ను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తుండడంతో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ప్రాంతం కిక్కిరిసిపోతోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.15 వరకు, భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన సమీక్షలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. ప్రతి కార్యకర్తనూ పేరుపేరునా పలకరిస్తున్న జగన్.. వారి ప్రతి సలహా, సూచనలను నోట్ చేసుకుంటూ వారితో మమేకమవుతున్న తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు. గ్రామ కమిటీలను బలోపేతం చేయడంతోపాటు రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో లీగల్ సెల్స్ ఏర్పాటు చేసి అధికార పార్టీ వేధింపులు, అక్రమ కేసులను ఎదుర్కొనాలని సూచించారు. ఎక్కడ, ఏ కార్యకర్తకు ఏ చిన్న కష్టమొచ్చినా స్థానిక నేతలతో పాటు జిల్లా మొత్తం ఆ కార్యకర్త ఉండే గ్రామానికే వెళ్లి అతనికి అండగా ఉండాలంటూ ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ నాయకులకు జగన్ మార్గనిర్దేశం చేయడం కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపుతోంది. అవసరమైతే తాను కూడా అండగా నిలిచేందుకు వస్తాననడం వారికి వెయ్యేనుగుల బలాన్నిస్తోంది. ఇక బాబు పని పడతాం.. సమీక్ష సందర్భంగా జగన్ చేస్తున్న ప్రసంగాలు పార్టీలో కొత్త జోష్ను నింపుతున్నాయి. ‘అబద్ధపు హామీలతో అధికారం చేపడుతున్న చంద్రబాబు చేయనున్న మోసాలు మరో 15 రోజుల్లోనే బట్టబయలవుతాయని, ఆయన్ని కంటికి రెప్పలా కాచేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 వంటి మీడియా సంస్థలు పనిచేస్తాయని, అందువలన ప్రతి కార్యకర్తా ఓ సైన్యంలా బాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని జగన్’ అన్నప్పుడు కార్యకర్తలు ‘ఇక బాబు పనిపడతాం’ అంటూ నినదిస్తున్నారు. రాష్ర్టంలో బలీయమైన శక్తిగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిందని, త్వరలోనే అధికారంలోకి కూడా వస్తుందని అంటూ జగన్ వారిలో ఉత్తేజాన్ని నింపారు.సమీక్షా సమావేశాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలుగా గెలుపొం దిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, పినిపే విశ్వరూప్, మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, సీఈసీ సభ్యుడు రెడ్డి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అల్లూరి కృష్ణం రాజు, రౌతు సూర్యప్రకాశరావు, కో ఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామినాయుడు, ఆకుల వీర్రా జు, చెల్లుబోయిన వేణు, గుత్తుల సాయి, బొంతు రాజేశ్వరరావు, రాష్ర్ట సేవాదళ్, యూత్ కమిటీ సభ్యులు సుంకర చిన్ని, తాడి విజయ భాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీలు, అనుబంధ కమిటీల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, మంతెన రవిరాజు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, మార్గన గం గాధర్, రెడ్డి రాధాకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, గొల్లపల్లి డేవిడ్రాజు, పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, జ్యోతుల నవీన్కుమార్, కొవ్వూరి త్రినాథ్రెడ్డి, బసవా చినబాబు, జున్నూ రి బాబి, ముత్యాల వీరభద్రరావు, సిరిపురపు శ్రీనివాసరావు, వట్టికూటి రాజశేఖర్, నక్కా రాజ బాబు, మిండగుదిటి మోహన్, ఆర్వీవీ సత్య నారాయణచౌదరి, యనమదల గీత, చెల్లుబోయిన శ్రీను, యేడిద చక్రం, పాలెపు ధర్మారావు, గుత్తుల మురళీధరరావు, గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ సమీక్షలో నేటి షెడ్యూల్
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి పాలకొండ 9.00- 9.30 సాలూరు 9.30-10.00 పార్వతీపురం 10.00- 10.30 కురుపాం 10.30- 11.00 అరకు 11.00-11.30 పాడేరు 11.30-12.00 అమలాపురం పార్లమెంట్ పరిధి మండపేట 12.30-1.00 రామచంద్రపురం 1.00-1.30 కొత్తపేట 1.30-2.00 భోజన విరామం 2.00-2.30 విజయనగరం పార్లమెంట్ పరిధి ఎచ్చెర్ల 2.30-3.00 రాజాం 3.00-3.30 విజయనగరం 3.30-4.00 చీపురుపల్లి 4.00-4.30 గజపతినగరం 4.30-5.00 నెల్లిమర్ల 5.00-5.30 బొబ్బిలి 5.30 -6.00 ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం కైకలూరు 6.00- 6.30 నూజివీడు 6.30-7.00 దెందులూరు 7.00-7.30 చింతలపూడి 7.30-8.00 ఏలూరు 8.00-8.30 పోలవరం 8.30-9.00 ఉంగుటూరు 9.00-9.30 -
ఐదేళ్లకు సరిపడా ఉత్తేజం
సాక్షి, రాజమండ్రి :రానున్న ఐదేళ్లకు సరిపడా ‘జోష్’ను తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణుల్లో నింపారని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు, జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో సమీక్ష సమావేశాలకు జగన్ బుధవారం రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో శ్రీకారం చుట్టారు. మూడురోజులు జరిగే సమీక్షల్లో తొలిరోజు కాకినాడ, శ్రీకాకుళం, అరకు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో సమీక్షించారు. అనంతరం జ్యోతుల విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలయ్యాక అనతి కాలంలోనే పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు తమ సమక్షానికే వచ్చి సమీక్షించడం తమలో మరింత ఉత్సాహపరిచి, ప్రజా సమస్యలపై పోరాడేందుకు కార్యోన్ముఖులను చేసిందన్నారు. పార్టీ శ్రేణుల చెంతకు వచ్చి సమీక్షించడంతో జగన్ కొత్త ఒరవడికి నాంది పలికినట్టయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను దీటుగా ఎదుర్కొంటూ, పార్టీకి దిశానిర్దేశం చేసే గురుతర బాధ్యతను జగన్ వహించాలని అన్ని ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో తమది ఓటమిగా భావించడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే తమకు కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని, ప్రజలు వారి పక్షాన నిలబడేందుకు ప్రధాన ప్రతిపక్షంగా తమను నిలిపారన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే ఓ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందే కాక తర్వాత కూడా కొన్ని పచ్చ పత్రికలు తమపై దుమ్మెత్తిపోయడం మానడం లేదని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యలపై పోరాడే ప్రధాన ప్రతిపక్షమైన తమకు మీడియా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతారంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. సమీక్ష సందర్భంగా అధినేత జగన్, కార్యకర్తలు పరస్పరం మనసు విప్పి మాట్లాడుకున్నారన్నారు. -
రేపు జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములపై సమీక్షించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ సోమవారం ‘సాక్షి’కి ఈ విషయం తెలిపారు. జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్లో బయలుదేరి బుధవారం రాజమండ్రి చేరుకుం టారు. బుధ, గురు, శుక్రవారాల్లో శ్రీకా కుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ప ది లోక్సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు, ఓటములపై ఆయన సమీక్షిస్తారు. తాజా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులు, జిల్లాల్లోని ముఖ్యనేతలను ఈ సమీక్షలకు ఆహ్వానిస్తున్నట్టు జ్యోతుల తెలిపా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఓటములపై కూడా జగన్మోహన్రెడ్డి సమీక్షిస్తారని చెప్పారు. -
బాంబే టాకీస్
-
భవిష్యత్ మనదే
విజయనగరం టౌన్, న్యూస్లైన్ : ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్సీపీ సమీక్షలు నిర్వహించింది. పార్టీ అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు తీసుకోవలసినచర్యలపై ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలను తెలుసుకున్నారు. గాజువాక నియోజకవర్గ నేత తిప్పలనాగిరెడ్డి, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు లు సమీక్షలు నిర్వహించారు. తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన ఎమ్మె ల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యుల అభ్యర్థులు, కార్యకర్తలతో సమీక్ష చేశారు. వారి వద్ద నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ సభ్యుడు తిప్పలనాగిరెడ్డి మాట్లాడుతూ గెలుపోటములు రాజకీయాల్లో సాధారణమని, ఓటమికి బాధ పడేకంటే భవిష్యత్లో మరింత ఎత్తుకు ఎదిగేందుకు కృషిచేయాలన్నారు. ఎటువంటి పొత్తులు లేకుండా వైఎస్ఆర్సీపీ అత్యధిక సీట్లను కైవసం చేసుకుందన్నారు. స్వల్ప ఓట్ల తేడాతోనే ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందన్నారు. 2019లో తప్పకుండా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా సమస్యలను ఎదుర్కోవాలో వివరించారు. ప్రలోభాలకు లొంగొద్దు వైఎస్ఆర్ సీపీ తరఫున గెలిచి, ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు యత్నిస్తే వారిపై విప్ జారీచేసే అధికారం పార్టీకి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అటువంటి వారిపై అనర్హత వేటు వేయడంతో పాటూ పార్టీ సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా, భయపెట్టినా లొంగ రాదని సూచించారు. కార్యకర్తల వెనుక పార్టీ ఉందన్న విషయా న్ని తెలియజేస్తూ వారికి అండగా నిలవాలన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. సంఘటితంగా పోరాడాలి అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేయకుండా కాపాడుకోవాలన్నారు. నాయకులు, కార్యకర్తలంతా సంఘటితంగా కలిసి పోరాటం చేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గాల్లో ప్రతి నాయకుడూ... కార్యకర్తలను కలుస్తూ, వారి మంచిచెడ్డలను ఎప్పటికప్పుడు పట్టించుకోవాలని సూచించారు. ఇప్పటికే రెండుమార్లు ఓడిపోయిన చంద్రబాబు... మళ్లీ ఓడిపోతే మూడోసారి మూలన కూర్చోవాల్సి ఉంటుందన్న ఆందోళనతో ఏదోలా అధికారం పీఠం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కానీ హామీలను గుప్పించారని ఆరోపించారు. సంస్థాగతంగా పార్టీనీ పటిష్ట పరచాలన్నారు. పార్టీ నుంచి బయటకు వెళితే అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. విప్ జారీచేసే అధికారం వైఎస్ఆర్సీపీకీ ఉందన్నారు. నెల్లిమర్ల, ఎస్.కోట, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, విజయనగరానికి సంబంధించిన నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వారందరి వద్ద నుంచి సలహాలు, సూచనలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. వీటన్నింటిని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. నెల్లిమర్ల నుంచి డాక్టర్ సురే ష్బాబు, సింగుబాబు, కోటగిరి కృష్ణమూర్తి, అంబళ్ల శ్రీరాముల నాయుడు, శ్రీనివాసరావు, పతివాడ అప్పలనాయుడు, పిన్నింటి రామకృష్ణతో పాటూ అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. గజపతినగరం నియోజకవర్గం నుంచి గెద్ద రమేష్ నాయుడు, ఎంఎస్ఎన్ మాస్టారు, సూరిబాబు రాజు, కృష్ణబాబురాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్.కోట నియోజకవర్గం నుంచి రొంగలి జగన్నాథం, వేచలపు చినరామునాయుడు, షేక్ రెహ్మాన్, దమయంతి, సింగంపల్లి సత్యం, నెక్కల నాయుడు బాబు, కేత వీరన్న, మల్లునాయుడు తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కె.శ్రీనివాసనాయుడు, మీసాల వెంకటరమణ, గొర్లె వెంకటరమణ, నారాయణరావులు హాజరయ్యారు. కురుపాం నుంచి ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, నాయకులు పరీక్షిత్ రాజు, పార్వతీపురం నుంచి జమ్మాన ప్రసన్న కుమార్, సాలూరు నుంచి ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, బొబ్బిలి నుంచి కేత రామారావు, అప్పారావు, నరసింహంనాయుడు, విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులు కాళ్ల గౌరీశంకర్, గురాన అయ్యలు, అవనాపు విక్రమ్, మామిడి అప్పలనాయుడు, వాజిద్, చెల్లూరు ఉగ్రనరసింగరావు, భీమరశెట్టి ఉపేంద్ర, గండికోట శాంతి, మజ్జి త్రినాథ్, కొసర నారాయణరావు, నామాల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్తు జగన్దే
శ్రీకాకుళం సిటీ, న్యూస్లైన్: రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయించే సూర్యుడైతే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అస్తమించే సూర్యుడని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. శనివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులైన బెల్లాన చంద్రశేఖర్, గుడివాడ అమర్నాధ్లతో కలిసి ఆయన మాట్లాడారు. మరో 30 నుంచి 40 ఏళ్లు రాజకీయాలను శాసించే సత్తా జగన్కుందని.. చంద్రబాబుకు ఆ పరిస్థితులు లేవని అందుకే ప్రజలు ఆఖరి అవకాశం ఇస్తూ తాజా ఎన్నికల్లో ఆయన్ను గెలిపించారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపామని, వాస్తవాలతో కూడిన నివేదికను పార్టీ అధినేత జగన్కు అందజేస్తామన్నారు. దీనిపై జూన్ 4, 5, 6 తే దీల్లో రాజమండ్రిలో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల అభ్యర్థులతో సమీక్షిస్తారన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి, ప్రజలను ప్రలోభాలకు గురిచేసి విజయం సాధించిన టీడీపీకి ఆ ఆనందం ఎంతో కాలం ఉండదని జోస్యం చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న చంద్రబాబు వెంటనే ఆ హామీలను నెరవేర్చాలని డిమాం డ్ చేశారు. ఏమాత్రం నెరవేర్చకపోయినా, కొర్రీలు పెట్టినా ప్రజల తరపున తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రను ప్రతిష్టాత్మకంగా భావించి పనిచేస్తామని, భవిష్యత్తులో అధికారం తమదేనని మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు. త్రిసభ్య కమిటీ సభ్యుడు, విజయనగరం జెడ్పీ మాజీ చైర్మన బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబులా సాధ్యం కాని, చేయలేని హామీలను ఇవ్వనని తమ పార్టీ అధినేత జగన్ ముందే చెప్పారన్నారు. మరో సభ్యుడు గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని, అధికార పార్టీ నుంచి ప్రజలకు ఏమాత్రం కష్టమొచ్చినా వారి పక్షాన పోరాడుతామని వివరించారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ నేత రెడ్డి శాంతి పాల్గొన్నారు. -
నిర్మాణాత్మక దిశగా...
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో ప్రజల పక్షాన నిల బడి.. వారి సమస్యలపై విస్తృత పోరాటాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింత నిర్మాణాత్మకమైన సేవలందించేందుకు సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పూర్తిస్థాయిలో విశ్లేషించుకుని.. భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు నియోజకవర్గాల వారీ సమీక్షలను నిర్వహించనుంది. ఇందుకోసం పార్టీ నియమించిన త్రిస భ్య కమిటీ ఆదివారం ఏలూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసింది. అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి నేతృత్వంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ కార్యక్రమానికి హాజరు కానుంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని 15 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు, మునిసిపల్, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన వారు హాజరుకానున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, ఏయే అంశాలు ప్రభావితం చేశాయన్న దానిపై చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా క్రోడీ కరించిన అంశాలపై ఈనెల 4, 5 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహించే ప్రాంతీయ సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి త్రిసభ్య కమిటీ నివేదికలను సమర్పించనుంది. నివేదికల ఆధారంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్ధేశం చేస్తారు. ఏలూరులో నిర్వహించే సమావేశానికి పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ముఖ్య నేతలు హాజరవుతారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గ్రామస్థారుు నుంచి మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానం దృష్టి సారించింది. రానున్న కాలం లో ప్రజలపక్షాన నిలబడి పోరాటాలు చేసే దిశగా కార్యకర్తలు, నాయకులను కార్యోన్ముఖులను చేసేలా, వారిమధ్య సమన్వయం పెంచేలా చర్యలు చేపడుతోంది. -
రేపు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ రాక
- జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్ష - పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు వెల్లడి బుట్టాయగూడెం, న్యూస్లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ ఆదివారం జిల్లాకు రానుంది. మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డిలతో కూడిన ఈ కమిటీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పార్టీ ఓటమిపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుందని పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు చెప్పారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులతో కమిటీ సభ్యులు లోతైన విశ్లేషణ చేస్తారన్నారు. పార్టీకి దశదిశ నిర్దేశం చేస్తారని, జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలపై చర్చిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని బాలరాజు చెప్పారు. మోడి గాలిలో చంద్రబాబు విజయం సాధించారని, అది అతని గొప్పదనం కాదన్నారు. చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వ చ్చాడని విమర్శించారు. చంద్రబాబు తన మొదటి సంతకాన్ని రైతుల రుణాలు మాఫీ ఫైలుపై సంతకం పెట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేస్తే రైతులు కొత్త రుణాలు తీసుకుని వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతులు రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. -
29 నుంచి ఎన్నికలపై వైఎస్సార్సీపీ సమీక్షలు
13 జిల్లాలకు త్రిసభ్య కమిటీల ఏర్పాటు హైదరాబాద్: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 29 నుంచి నాలుగు రోజులపాటు సమీక్షలు చేపట్టనుంది. సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ సమీక్షలు విడివిడిగా జరుగుతాయి. సమీక్షా సమావేశాల నిర్వహణకు ఒక్కొక్క జిల్లాకు విడివిడిగా అనుభవజ్ఞులైన నేతలతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములకు దారితీసిన పరిస్థితులపై ఈ సందర్భంగా లోతైన అధ్యయనం, విశ్లేషణ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప , 30న కృష్ణా, అనంతపురం, 31న కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, జూన్ 1వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో సమీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు వర్తమానం పంపారు.