Satya
-
ఆర్జీవీతో విభేదాలు.. స్పందించిన హీరోయిన్
చిత్ర పరిశ్రమలో రామ్గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై రూమర్స్ రావడం చాలా తక్కువ. ఏదైనా ఉంటే ఓపెన్గానే మాట్లాడతాడు. అంతేకాని తన ప్రవర్తనతో నటీనటులకు ఇబ్బంది మాత్రం కలగనీయడని సినీ ఇండస్ట్రీ మొత్తం చెబుతుంది. ముఖ్యంగా హీరోయిన్లతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ.. హద్దులు దాటి ప్రవర్తించరు. అందుకే అతనితో సినిమా చేసేందుకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి ఆర్జీవీపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తోంది. అలనాటి అందాల తార ఊర్మిళా మాతోండ్కర్(Urmila Matondkar)తో ఆర్జీవీకీ గొడవైందని, వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని బాలీవుడ్లో వార్తలు వినిపించాయి.తాజాగా ఈ రూమర్స్పై ఊర్మిళ స్పందించింది. ఆర్జీవీతో తనకు ఎలాంటి అభిప్రాయభేదాల్లేవని స్పష్టం చేసింది.ఆర్జీవీ దర్శకత్వంలో నటించినందుకు గర్విస్తున్నాఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’, ‘సత్య’ సినిమాల్లో ఊర్మిళ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. అయితే ‘ఆగ్’(2007) తర్వాత ఊర్మిళ మళ్లీ ఆర్జీవీ చిత్రాల్లో నటించలేదు. దీంతో బాలీవుడ్లో పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ‘సత్య’(satya) రీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్జీవీతో విభేదాలు వచ్చాయట కదా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఊర్మిళ సమాధానం చెబుతూ..‘మా మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. ఆయనతో నాకు మంచి స్నేహమే ఉంది. ఆయన తెరకెక్కించిన ‘కంపెనీ’ (2002), ‘రామ్గోపాల్ వర్మ కీ ఆగ్’ (2007) చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించాను. ఆ తర్వాత మేం మళ్లీ కలిసి పని చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. ఆయన దర్శకత్వంలో నటించినందుకు గర్వపడుతున్నా. అవకాశం వస్తే రామ్గోపాల్ వర్మ, మనోజ్ బాజ్పాయ్తో కలిసి మళ్లీ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను’ అని ఊర్మిళ చెప్పుకొచ్చింది.‘రంగీలా’తో ఫేమస్ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది. 2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తోంది.ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది. -
వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో సత్య ఒకటి. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్పేయి, ఊర్మిళ మటోండ్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. 1998లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి థియేటర్లలో విడుదలైంది.ఎవర్నీ పట్టించుకోకుండా ఏడ్చేశా..రీరిలీజ్ సందర్భంగా సత్య సినిమాను వీక్షించిన దర్శకుడు ఆర్జీవీ (Ram Gopal Varma) భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. రెండు రోజుల క్రితం సత్య సినిమా చూశాను. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా చూస్తుంటే కన్నీళ్లాగలేవు. నా కన్నీళ్లు ఎవరైనా చూస్తారేమో అని కూడా పట్టించుకోకుండా ఏడ్చేశాను. సినిమా చూసి ఎమోషనలవలేదు. సత్య తర్వాత నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాను.సినిమా అంటే బిడ్డకు జన్మనివ్వడం లాంటిదేఒక సినిమా తీయడమంటే బిడ్డకు జన్మనివ్వడంలాంటిదే! సినిమాను ముక్కలు ముక్కలుగా చిత్రీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందనేది తెలియదు. షూటింగ్ అయ్యాక దాన్ని చూసినవాళ్లు ఇది హిట్టనో, ఫట్టనో చెప్తూ ఉంటారు. నేను మాత్రం నేను సృష్టించిన సినిమా అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఈ సినిమాను లక్ష్యం లేని నా ప్రయాణంలో ఓ అడుగుగా మాత్రమే భావించాను. రెండు రోజుల క్రితం వరకూ అదే అభిప్రాయంతో ఉన్నాను. నా కన్నీళ్లకు కారణం..అపారమైన తెలివితేటలు ఉన్న నేను సత్య సినిమా (Satya Movie)ను బెంచ్మార్క్గా తీసుకుని భవిష్యత్తును ఎందుకు నిర్మించుకోలేదో అర్థం కావడం లేదు. నేను సినిమాలోని విషాదం చూసి చలించిపోలేదు. నన్ను నేను చూసుకుని ఏడ్చేశాను. సత్య సినిమాతో నన్ను నమ్మినవారందరికీ చేసిన ద్రోహాన్ని తలుచుకుని అపరాధ భావనతో కుమిలిపోయాను. సక్సెస్, అహంకారం తలకెక్కించుకుని తాగుబోతునయ్యాను. రంగీలా, సత్య సినిమా సక్సెస్ వల్ల నా కళ్లు నెత్తికెక్కాయి. అప్పుడే నా విజన్ను కోల్పోయాను. కళ్లకు గంతలు కట్టుకున్నా..తర్వాత నా సినిమాల్లో ఏవో జిమ్మిక్కులు, అసభ్యకరమైన ప్రదర్శనలు.. ఇలా అర్థంపర్థం లేని ప్రయోగాలు చేశాను. అయినప్పటికీ కొన్ని సినిమాలు సక్సెసయ్యాయి. కానీ సత్య మూవీలో ఉన్నంత దమ్ము, నిజాయితీ వాటిలో లేవు. చిత్రపరిశ్రమలో కొత్త తరహా చిత్రాలు చేయాలన్న ఆలోచనతో నా కళ్లకు నేనే గంతలు కట్టుకున్నాను. నా విలువ అర్థం చేసుకోలేక దేనికోసమో పరుగులు పెట్టాను. ఈ క్రమంలో నేను సృష్టించిన అందమైన గార్డెన్ను కాళ్ల కిందే తొక్కిపెట్టాను. తప్పుల్ని సరిదిద్దుకోలేనుఅప్పుడే నా పతనం మొదలైంది. నేను చేసిన తప్పులను ఎలాగో సరిదిద్దుకోలేను. కానీ ఇకపై దర్శకుడిగా నన్ను మొదటి స్థానంలో నిలబెట్టే సినిమాలే తీస్తాను. రెండు రోజుల క్రితం నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న మాట ఇది! సత్యలాంటి సినిమాను నేను మళ్లీ తీయలేకపోవచ్చు. కానీ అలాంటి సినిమాల్ని మీ ముందుకు తీసుకురావాలని ఆలోచించకపోవడం క్షమించరాని నేరమవుతుంది. దీనర్థం నేను సత్యలాంటి సినిమాలు మాత్రమే తీస్తానని కాదు. ఇకపై ఆ రూల్ పాటిస్తాజానర్ ఏదైనా సరే, తీసుకునే అంశం ఏదైనా సరే సత్యపై చూపించినంత నిజాయితీ ఇకమీదట ప్రతి సినిమాపై చూపిస్తాను. సత్య తర్వాత నేను చేయబోయే సినిమా ఎలా ఉంటుందని నన్నెవరూ అడగలేదు. కానీ ఆ ప్రశ్న నాకు నేను వేసుకోకపోవడం దారుణం. అందుకే మళ్లీ నేను వెనక్కు వెళ్లాలనుకుంటున్నాను. ఇకపై ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ చూడాలనుకుంటున్నాను. ఇదేదో ముందు నుంచీ పాటించుంటే చాలావరకు నా సినిమాలు వచ్చేవే కాదు.ఒట్టేసి చెప్తున్నా..ప్రతి దర్శకుడికి ఇదొక మేల్కొలుపుగా చెప్తున్నాను. చివరగా నా జీవితంలో మిగిలిన భాగం.. సత్యలాంటి విలువైన సినిమాలు తీయడానికే వెచ్చిస్తానని సత్య మూవీపై ఒట్టేసి చెప్తున్నాను అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. ఆర్జీవీ కొత్త వర్షన్ కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. A SATYA CONFESSION TO MYSELF —— Ram Gopal Varma By the time SATYA was rolling to an end , while watching it 2 days back for 1st time after 27 yrs, I started choking with tears rolling down my cheeks and I dint care if anyone would see The tears were not…— Ram Gopal Varma (@RGVzoomin) January 20, 2025 చదవండి: Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు.. -
హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
మత్తువదలరా 2 : ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న.. రియా ఎక్కడ? (ఫొటోలు)
-
ఓటీటీలో 'మత్తువదలరా 2' స్ట్రీమింగ్
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద మంచి ఫన్ చిత్రంగా గుర్తింపు పొందింది. కలెక్షన్ల పరంగా కూడా లాభాలను తెచ్చిపెట్టిన ఈ మూవీని రీతేష్ రానా దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్టైనర్గా విజయం సాధించిన ఈ చిత్రంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా జంటతో పాటు సత్య, వెన్నెల కిషోర్ నటించారు.సెప్టెంబర్ 13న విడుదలైన ‘మత్తువదలరా 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 11 అంటే శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు పేర్కొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే.. ‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని.వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. -
‘మెగా’ రివ్యూ : రాత, తీత, కోత, మోత.. ప్రాసతో ప్రశంసలు!
శ్రీసింహా హీరోగా నటించిన తాజా చిత్రం మత్తు వదలరా 2. ఆయన కెరీర్లో హిట్గా నిలిచిన హిట్ ఫిల్మ్ ‘మత్తు వదలరా’కి సీక్వెల్ ఇది. సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. సత్య కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అలాగే ఈ మధ్యకాలంలో ఫుల్ కామెడీ ఎంటర్టైన్ చిత్రాలేవి రాకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. తొలి రోజు తక్కువ వసూళ్లే వచ్చినా.. పాజిటివ్ టాక్తో రెండో రోజు నుంచి కలెక్షన్స్ పెరిగాయి. ఇదిలా ఉంటే..తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో ఓ సినిమా చూసి ఇంతలా నవ్వుకోలేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా మత్తు వదలరా 2 చిత్రంపై ప్రశంసలు కురిపించారు.(చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)‘నిన్ననే ‘మత్తు వదలరా 2’ సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనబడలేదు. ఎండ్ టైటిల్ని కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ రితేష్ రానాకే ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోదపర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేం. హాట్సాఫ్ రితేజ్ రానా. నటీనటులు శ్రీసింహాకి, ప్రత్యేకించి సత్యకి నా అభినందనలు. అలాగే ఫరియా అబ్దుల్లా, కాల భైరవతో పాటు మంచి విజయాన్ని అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, టీం అందరికి నా అభినందనలు. మత్తు వదలరా 2 మిస్ కాకండి. వందశాతం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ’ అని చిరంజీవి ఎక్స్లో రాసుకొచ్చాడు. నిన్ననే 'మత్తు వదలరా - 2' చూసాను.ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి. అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 15, 2024 -
కమెడియన్ సత్య మరో సునీల్ అవుతాడా..?
-
‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ
టైటిల్: మత్తు వదలరా- 2నటీనటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులునిర్మాణ సంస్థలు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలతరచన, దర్శకత్వం: రితేష్ రానాసంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: సురేష్ సారంగంవిడుదల తేది : సెప్టెంబర్ 13, 2024‘మత్తు వదలరా’ సినిమా తర్వాత హీరో శ్రీసింహాకు ఆ స్థాయి హిట్ ఒక్కటి కూడా లేదు. వరుస సినిమాలు చేస్తున్నా.. ఏవీ వర్కౌట్ కాలేదు. దీంతో తనకు హిట్ ఇచ్చిన సినిమాకు సీక్వెల్గా ‘మత్తు వదలరా 2’తొ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మత్తు వదలరా 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని. వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ఒక హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే.. కచ్చితంగా ఆ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకుంటారు. మొదటి భాగం కంటే రెండో పార్ట్ ఇంకా బెటర్గా ఉంటుందనే ఆశతో థియేటర్స్కి వస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే ఒకే.. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతి. అందుకే సీక్వెల్ తీయడం ఓ రకంగా కత్తి మీద సాము లాంటిదే. డైరెక్టర్ రితేష్ రానా ఆ సాహసం చేశాడు. కానీ పార్ట్ 1ని మించేలా కథనాన్ని నడిపించలేకపోయాడు. కథలో బలమైన పాయింట్ లేకపోవడం.. కథనం మొత్తం ఒక పాయింట్ చుట్టే తిరగడం సినిమాకు పెద్ద మైనస్. స్క్రీన్ప్లే కూడా రొటీన్గా ఉంటుంది. అయితే ఈ లోపాలన్నింటిని సత్య కామెడీ కొంతవరకు కవర్ చేస్తే.. టెక్నికల్ టీమ్ మరికొంత కవర్ చేసింది. పార్ట్ 1 చూసిన వాళ్లకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో మొదటి నుంచే కనెక్ట్ అవుతారు. కానీ చూడని వాళ్లకు మాత్రం కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతారు. హీ టీమ్లో బాబు, యేసులో జాయిన్ అయ్యే సీన్ నుంచి.. రియా కిడ్నాప్ డ్రామా వరకు ప్రతి సీన్ గత సినిమాలని గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. (చదవండి: రావు రమేశ్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్)ఇక సెకండాఫ్లో కథ మొత్తం మిస్టరీ మర్డర్, హత్య చుట్టే తిరుగుతుంది. ఫరియా, సత్య, శ్రీసింహా కలిసి చేసే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే, కథకు ఏ మాత్రం సంబంధం లేని ‘ఓరి నా కొడక’ సీరియల్ డ్రామా అయితే నవ్వించకపోవడమే కాకుండా.. ఒకానొక దశలో చిరాకు తెప్పిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇమేజ్ని చక్కగా వాడుకున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు సాగే కథనం.. ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు సినిమాపై కొంతవరకు పాజిటివ్ ఒపీనియన్ని తెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం సత్య కామెడీయే. శ్రీసింహా హీరో అయినప్పటికీ.. సత్యనే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయించాడు. బాబు మోహన్ పాత్రకు శ్రీసింహా న్యాయం చేశాడు. తెరపై శ్రీసింహా, సత్యల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్రను పోషించింది. హీ టీమ్లో పని చేసే 'నిధి' పాత్రలో ఒదిగిపోయింది. యాక్షన్ సీన్లో కూడా చక్కగా నటించింది. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడి ఆకట్టుకుంది. హీ టీమ్ హెడ్గా రోహిణి, మైఖెల్గా సునీల్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కాల భైరవ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ని చాలా రిచ్గా తెరపై చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Mathu Vadalara 2 Trailer: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్
రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా నటించిన తాజా చిత్రం'మత్తువదలారా2'. బ్లాక్ బస్టర్ మూవీ మత్తు వదలరాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్య కీలక పాత్రలో నటించాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. మత్తు వదలరా చిత్రం మాదిరే ఈ సినిమా కూడా క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగనుంది. శ్రీసింహా, సత్య మరోసారి తమదైన కామెడీతో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
ఓటీటీలోకి టీనేజీ ప్రేమకథ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ కాబోతున్న రొమాంటిక్ టీనేజ్ లవ్ స్టోరీ మూవీ ఒకటుంది. అదే 'సత్య'. ఇదో తమిళ సినిమా. డబ్బింగ్ చేసి తెలుగులో మే 10న థియేటర్లలో రిలీజ్ చేయగా.. ఓ మాదిరి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్నే దాదాపు నెలల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.(ఇదీ చదవండి: వివాదంలో 'ఐసీ 814: కాందహార్ హైజాక్' వెబ్ సిరీస్.. నెట్ఫ్లిక్స్కి కేంద్రం సమన్లు!)వినాయక చవితి నుంచి ఆహా ఓటీటీలో 'సత్య' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది. వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హమరేశ్, ప్రార్థన సందీప్, మురగదాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులోనే 'సత్య' పేరుతోనే రిలీజ్ చేశారు.'సత్య' విషయానికొస్తే.. ఇష్టం లేకపోయినా సరే తండ్రి చెప్పడంతో సత్య.. ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ జాయిన్ అవుతాడు. అక్కడే పార్వతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు మనోడు అంటే ఇష్టముంటుంది కానీ బయటపడదు. ఓ రోజు ఊహించని విధంగా సత్యని చెంపదెబ్బ కొడుతుంది. దీంతో అతడు ఆ కాలేజీ వదిలేసి, తన కుటుంబం కోసం ఓ నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? చివరకు ప్రేమకథ కంచికి చేరిందా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?) -
నవ్వించేలా 'మత్తు వదలరా 2' టీజర్
సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం 'మత్తు వదలరా'. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ‘మత్తు వదలరా 2’ పేరుతో సీక్వెల్గా వస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో కనిపించనుంది. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. పార్ట్ 1 మాదిరే ఇందులో కూడా శ్రీ సింహా, సత్యలు కామెడీ అదుర్స్ అనేలా ఉంది. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. -
'మత్తు వదలరా' సీక్వెల్ విడుదలపై ప్రకటన
సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం 'మత్తు వదలరా'. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్గా రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు శ్రీసింహా తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ లాంటి సినిమాలు శ్రీసింహ చేసినా పెద్దగా మెప్పించలేకపోయాడు. దీంతో తన హిట్ సినిమా మత్తు వదలరా సీక్వెల్ను స్పీడ్గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు.డైరెక్టర్ రితేష్- శ్రీసింహా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 13న 'మత్తు వదలరా-2' చిత్రాన్ని విడుదల చేస్తామని ఒక పోస్టర్తో మేకర్స్ ప్రకటించారు. పార్ట్-1లో శ్రీ సింహతోపాటు అతని సహచరుడిగా నటించిన సత్య కూడా ఈ సీక్వెల్లో ఉండనున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్లోకి కొత్తగా ఫరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
Bigg Boss 8 Teaser: ఒక్కసారి కమిట్ అయితే నో లిమిట్.. 'బిగ్ బాస్- 8' టీజర్ అదుర్స్
బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా ముగియడంతో తాజాగా కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందా అని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. మొదటగా ఈ సీజన్ లోగోను లాంచ్ చేయడంతో బిగ్ బాస్ బజ్ మొదలైంది. తాజాగా టీజర్ను విడుదల చేసి మరింత హైప్ను క్రియేట్ చేశారు. ఆగష్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావచ్చిన సమాచారం.బిగ్ బాస్ టీజర్ ఆసక్తిని కలిగించేలా ఉంది. టీజర్ మొత్తం నాగార్జున- కమెడియన్ సత్య మధ్య కొనసాగుతుంది. దొంగతనం చేసేందుకు ఒక షాపులోకి సత్య ఎంట్రీ ఇస్తే నాగార్జున ప్రత్యక్షమవుతాడు. నాగార్జున కింగ్లా వచ్చి ఏం కావాలో కోరుకోవాలంటూ వరం ఇస్తాడు. కానీ, అడిగేముందు ఒక్కసారి ఆలోచించుకోమని నాగ్ చెప్తాడు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ చెప్పడంతో టీజర్ ముగుస్తుంది. -
‘సత్య’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యనటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయరచన-దర్శకత్వం: వాలీ మోహన్దాస్నిర్మాత: శివ మల్లాల(తెలుగులో)సంగీతం: సుందరమూర్తి కె.యస్సినిమాటోగ్రఫీ: ఐ.మరుదనాయగంఎడిటర్: ఆర్. సత్యనారాయణవిడుదల తేది: మే 10, 2024(తెలుగులో)ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలను సైతం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్ చేస్తే.. మరికొన్నింటిని అక్కడ రిలీజ్ చేసి హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ్ సినిమానే సత్య. తమిళ్లో ‘రంగోలి’పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ని సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేశాడు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. అనువాదం సినిమానే అయినా.. స్టైయిట్ సినిమా మాదిరి ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘సత్య’పై బజ్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘సత్య’ కథేంటంటే..సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్) గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అతని తండ్రి గాంధీ(ఆడుగలం మురుగదాస్) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదివించాలనేది అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. సత్యకు మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చదు.తండ్రి కోసమే ప్రైవేట్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్నచూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగ్తో ప్రతి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్న పార్వతి అలియాస్ పారు(ప్రార్ధన సందీప్)తో సత్య ప్రేమలో పడతాడు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ.. బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏంటి? పార్వతితో ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్కూల్, కాలేజీ లవ్స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకి తండ్రి కొడుకుల ఎమోషన్ని యాడ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్ని తీసుకొచ్చాడు దర్శకుడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కొడుకు కోసం పేరెంట్స్.. పెరెంట్స్ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కథంతా ఎంటర్టైనింగ్గా సాగిస్తూనే...అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు.ప్రభుత్వ కాలేజీల్లో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించడం.. ఫీజులు కట్టేందుకు వాళ్లు పడే బాధలు, కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలా మంది కనెక్ట్ అవుతారు. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మనసును తాకుతాయి. అయితే దర్శకుడు ప్రతీది డైలాగ్స్ రూపంలో చెప్పకుండా..విజువల్స్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడే దాన్ని అర్థం చేసుకొని ఫీల్ అయ్యేలా చేశాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్ అయింది. దర్శకుడికి తొలి సినిమా అయితే.. కొన్ని సన్నీవేశాలను తెరకెక్కించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్ట్లా అనిపిస్తాడు. స్క్రీన్ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రభుత్వ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కథను ప్రాంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్.. కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు వారు పడే కష్టాలు.. ఇలా ఎమోషనల్గా కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్ కాలేజీలో చేరిన తర్వాత లవ్స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగిపోతుంది. కాలేజీలో జరిగే చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..సత్యగా హమరేష్ చాలా బాగా నటించారు. పేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. భవిష్యత్తులో మంచి నటుడుగా రాణించే అవకాశం ఉంది.పారుగా నటించిన ప్రార్థన తెరపై క్యూట్ గా కనిపించింది. హీరో తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శివ మల్లాల. అచ్చమైన తెలుగు సినిమా చూసినట్లే ఉంటుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
‘ఓ సారి చెన్నై వెళ్లినప్పుడు నా స్నేహితుడి ద్వారా నిర్మాత సతీష్ పరిచయం అయ్యాడు. ఆయన తన కుమారుడు హమరేష్ని హీరోగా పెట్టి నిర్మించిన రంగోలి సినిమాను నాకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. సినిమా మొత్తం చూశాక క్లైమాక్స్ బాలేదని చెప్పేశాను. నేను చూసింది రఫ్ వెర్షన్ మాత్రమే. రెండు నెలల తర్వాత మళ్లీ తమిళ్ సినీ పెద్దలతో పాటు నాకు సినిమా చూపించాడు. ఆ తర్వాత స్టేజ్పై మాట్లాడుతూ.. తెలుగులో శివ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడని ఆయనే చెప్పాడు. అప్పటి వరకు నేను ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ సతీష్ నమ్మకంగా చెప్పడంతో.. నేను కూడా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నానని ప్రకటించాను. అలా నేను అనుకోకుండా సత్య సినిమాకు నిర్మాతను అయ్యాను’ అన్నారు జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘రంగోలి’. ఈ చిత్రాన్ని సత్య పేరుతో శివ మల్లాల మే 10న తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగోలి టైటిల్ ఇక్కడ వేరే వాళ్లు బుక్ చేసుకోవడంతో ఈ చిత్రాన్ని తెలుగులో ‘సత్య’పేరుతో రిలీజ్ చేస్తున్నాను. ఆర్జీవీ తెరకెక్కించిన సత్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అలాగే సినిమా ప్రమోషన్స్కి కూడా కలిసొస్తుందనే ఉద్దేశంతో ఈ చిత్రానికి సత్య అనే టైటిల్ని పెట్టాం. డబ్బింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అచ్చమైన తెలుగు సినిమాలాగే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. క్లైమాక్స్లో మార్పులు చేశాం. తెలుగు ఆడియన్స్కి నచ్చేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమాలో ఫాదర్స్ అండ్ సన్ రిలేషన్షిప్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు కథను విన్నాను. అన్ని కుదిరితే త్వరలోనే మరో సినిమాను నిర్మిస్తాను’ అని శివ మల్లాల అన్నారు. -
Satya Movie: ఆకట్టుకుంటున్న ‘నిజమా ప్రాణమా ..’ సాంగ్
హమరేశ్, ప్రార్థనా సందీప్ జంటగా ఆడుగలం మురుగదాస్, సాయి శ్రీ, అక్షయ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ చిత్రం ‘రంగోలి’. వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ‘సత్య’పేరుతో శివమ్ మీడియాపై శివ మల్లాల తెలుగులో ఈ నెల 10న రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలోని ‘నిజమా ప్రాణమా’ లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసి.. సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. తను నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి సినిమా పాటను కాజల్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు శివ మల్లాల.ఇక పాట విషయానికొస్తే.. ‘నిజమా ప్రాణమా’అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్కి రాంబాబు గోసాల అద్భుతమైన లిరిక్స్ అందించారు. సుందరమూర్తి కేఎస్ సంగీతం మనసుకు హత్తుకునేలా ఉంది. . వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన విధానం ఆ ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం తన ప్రతిభని కనపరిచింది. -
'మత్తు' చుట్టూ చుట్టాలే
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఒంగోలు/గాంధీ నగర్ (విజయవాడ సెంట్రల్)/ పిఠాపురం/ చీరాల/ విశాఖ సిటీ/ సాక్షి ప్రతినిధి,గుంటూరు: విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ దందాలో వేళ్లన్నీ టీడీపీవైపే చూపుతున్నాయి. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్ను దిగుమతి చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, అధిపతి కూనం కోటయ్య చౌదరి టీడీపీలో ప్రముఖులైన నారా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామచర్ల, లావు కుటుంబాలకు అత్యంత సన్నిహితులన్నది బహిర్గతమైంది. డ్రగ్స్ మాఫియా బండారం బట్టబయలు కావడంతో బెంబేలెత్తిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి దిగి విషయాన్ని పక్కదారి పట్టించాలని కుట్ర పన్నారు. ఈ అంకంలో భాగంగా ఒకపక్క సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతుండగానే గురువారం రాత్రే చంద్రబాబు, లోకేశ్ వరుస ట్వీట్లు చేస్తూ టీడీపీ శ్రేణులతోపాటు టీడీపీ అనుకూల మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలు, అభూత కల్పనలు జోడిస్తూ దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా డ్రగ్స్ దందా వెనుక తాము ఉన్నామనే విషయాన్ని కప్పిపుచ్చవచ్చని చంద్రబాబు భావించారు. అయితే కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతల వ్యాపార బంధం వెలుగు చూడటంతో బాబు కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబంతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. రాయపాటి, దామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు ఉన్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదురుతుందనే సంకేతాలు అందిన వెంటనే బ్రెజిల్ నుంచి భారీగా డ్రగ్స్ దిగుమతికి తెర తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం గమనార్హం. కింగ్ పిన్ కోటయ్య చౌదరి.. డ్రగ్స్ దందాలో కీలక పాత్రధారులైన సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితులని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆయన సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల జాబితాను చూస్తే ఆ విషయం తేలిపోతోంది. దామచర్ల సత్యం (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారంతా ఓ కోటరీగా పెద్ద ఎత్తున వ్యవహారాలు సాగించారన్నది వెల్లడైంది. వారు విదేశాల్లో అత్యంత సన్నిహితంగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దామచర్ల సత్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం ఉంది. సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరితోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆలపాటి రాజాకు వ్యాపార బంధం ఉంది. వారిద్దరూ సంతకాలు చేసిన పలు పత్రాలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విశాఖ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న సంధ్యా ఆక్వా కంపెనీకి నందమూరి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్కు కూనం కోటయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు. ఆయన కుటుంబం సహకారంతోనే విశాఖ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సంధ్యా ఆక్వా కంపెనీతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్నది ఇప్పటికే బయటపడింది. పురందేశ్వరి కుమారుడు చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగా కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి ఆక్వా వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో డ్రగ్స్ దందాలో తీగ లాగితే చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి కోటరీ అక్రమాల డొంకంతా కదులుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ.. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో మద్యం కుంభకోణానికి పాల్పడిన సిండికేట్లో ఆ కంపెనీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఆ కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు విశాఖ డ్రగ్స్ దందాను కూడా కలిపి మొత్తంగా మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో నిమగ్నమైంది. పొత్తుతోనే బరితెగింపు.. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎప్పుడో సిద్ధపడ్డారు. అందుకోసం కాళ్ల బేరానికి కూడా దిగజారతానని గతేడాదే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తును అవకాశంగా చేసుకుని భారీగా డ్రగ్స్ దందాకు పచ్చ మాఫియా బరితెగించింది. ఎన్నికల ముందు భారీగా డ్రగ్స్ను రాష్ట్రంలోకి తరలించేందుకు పథకం వేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సంధ్యా ఆక్వా కంపెనీ ద్వారా బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల ఈస్ట్ దిగుమతి ముసుగులో భారీగా డ్రగ్స్ను చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రెండు నెలల్లో డ్రగ్స్ విశాఖ చేరుకునేలా అంతా సిద్ధమైంది. అటు దగ్గుబాటి ఇటు చంద్రబాబు కుటుంబాలు సహకారం ఉండటంతో తమ దందాకు అడ్డు ఉండదని భావించారు. డ్రగ్స్ మాఫియాపై అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్కు ఉప్పందడంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం విశాఖ పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ బాగోతం బట్టబయలైంది. పచ్చ కుట్ర బెడిసికొట్టింది. ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ తక్షణమే ప్రతి స్పందించింది. డ్రగ్స్ దందాతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు ఉన్న బంధాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. నియమావళిని ఉల్లంఘిస్తూ చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో నివేదించింది. దీనిపై జాతీయ ప్రెస్ కౌన్సిల్కు కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. డ్రగ్స్ దందాపై సత్వరం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి పాత్రధారులతోపాటు సూత్రధారులను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసింది. కూనం కుటుంబం కథ... విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులైన సంధ్యా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అధినేతలు కూనం వీరభద్ర చౌదరి, కుమారుడు కూనం కోటయ్య చౌదరి స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి. ఆక్వా రంగంలో ఉత్థాన పతనాలను చూసిన వీరభద్ర చౌదరి డ్రగ్స్ వ్యాపారంలో కాలు మోపాడు. కాకినాడ ప్రధాన కేంద్రంగా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్ల ముసుగులో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అటు టీడీపీ ఇటు రాష్ట్ర బీజేపీ అగ్రనేతల అండదండలతో తన కార్యకలాపాలను విస్తరించాడు. కూనం కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంధ్యా ఆక్వా ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్లతో పాటు ఆక్వా కల్చర్ చెరువులు కూడా ఉన్నాయి. వీరి వ్యాపార లావాదేవీలు కొండపి, ఒంగోలు, కందుకూరు, పర్చూరు నియోజకవర్గాల్లోనూ సాగుతున్నాయి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్యనారాయణ(సత్య)తో కూనం కుటుంబానికి వ్యాపార లావాదేవీలున్నాయి. టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో దామచర్ల సత్యకు చెందిన పొగాకు గోడౌన్లో సంధ్యా ఆక్వా పేరుతో ప్రీ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటైంది. కూనం కుటుంబానికి విజయవాడకు చెందిన సౌమ్యుడిగా పేరున్న ఓ టీడీపీ నేతతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. కోటయ్య చౌదరి, టీడీపీ నేత తనయుడు తనయుడు విదేశాల్లో మంచి సన్నిహితులని తెలిసింది. కాకినాడ తీరంలో కలకలం డ్రగ్స్ తీగ లాగితే కాకినాడ జిల్లా కొత్తపల్లి తీరంలోని మూలపేటలో డొంక కదిలింది. మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 10 మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు జరిపారు. సీబీఐ ఇన్స్పెక్టర్ బల్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం ఈ తనిఖీలు చేసింది. జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి సమీపాన ఉన్న సంధ్య ఆక్వా సీడ్ తయారీ కంపెనీ, కృష్ణా జిల్లా పామర్రు తదితర ప్రాంతాల్లో ఉన్న సంధ్య ఆక్వా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెబుతున్నారు. కత్తిపూడి సమీపంలోని సంధ్య ఆక్వా సీడ్ కంపెనీని ఇటీవలే ప్రారంభించారు. దీనిలో ఆక్వా సీడ్ తయారీకి అవసరమైన ముడి సరుకును బ్రెజిల్ నుంచి దిగుమతి చేయడంతో ఆ సరకు నౌక ద్వారా విశాఖకు కంటైనర్లలో చేరింది. వాటిలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు సంధ్య కంపెనీలన్నింటిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించి మందులు, ఇతర శాంపిల్స్ సేకరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అధికారులు తిరిగి సోదాలు చేస్తామని తెలిపారు. చీరాలకు లింకు? డ్రగ్స్ దందాకు చీరాలతో కూడా లింకులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సంధ్యా ఆక్వా పేరుతో వాడరేవులో గత రెండేళ్లుగా కంపెనీ నడుస్తోంది. దీన్ని పురందేశ్వరి అల్లుడు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. గత పది రోజులుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయని సమాచారం. మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్ పరీక్ష డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం మరికొన్ని శాంపిల్స్ను పరీక్షించగా ఫలితాలు పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో న్యాయమూర్తి సమక్షంలో 25 వేల కేజీల సరుకుతో కూడిన కంటైనర్ను సీజ్ చేశారు. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి రవాణా నౌక ద్వారా విశాఖకు వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19, 20వ తేదీల్లో 49 బ్యాగుల్లో శాంపిల్స్ను పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో ఈ నెల 21వ తేదీన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం మరోసారి వీసీటీపీఎల్కు వెళ్లి మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్ను పరీక్షించారు. వాటి ఫలితాలు కూడా పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం. న్యాయమూర్తి సమక్షంలో రికార్డులతో పాటు శాంపిల్స్ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి సమక్షంలోనే బ్యాగులను సీజ్ చేశారు. మరికొన్ని సీబీఐ బృందాలు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోమరిన్ని ఆధారాలతో సీబీఐ అధికారులు త్వరలోనే అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘ఆలపాటి’ ఆర్థిక బంధం విశాఖ డ్రగ్స్ కేసులో కీలక పాత్రధారి కూనం వీరభద్ర చౌదరి(వీరభద్రరావు)తో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఉన్న ఆర్థిక సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఆలపాటి రుణాలకు కూనం సెక్యూరిటీ ఇవ్వడంతోపాటు ఎన్ఆర్ఐ అకాడమీతో భాగం పంపిణీ చేసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. 2015 అక్టోబరు 31న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు అరండల్పేట విజయా బ్యాంకు బ్రాంచ్లో రూ.2 కోట్లు రుణం (దస్తావేజు నంబరు 11158/2015) తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 9న మరో రూ.12 కోట్లు అదే బ్యాంకు నుంచి రుణాన్ని పొందారు. దీనికి ఆలపాటి రాజా భార్య ఆలపాటి మాధవితోపాటు కూనం వీరభద్రరావు, ఎన్ఆర్ఐ అకాడమీ ఆస్తులను (దస్తావేజు నంబరు 12521/2015) తనఖా పెట్టారు. 2021లో కూనం వీరభద్రరావుకు ఎన్నారై అకాడమీకి సంబంధించి పార్టీషన్ దస్తావేజు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. కూనం వీరభద్రరావు తమ ఆస్తులను తనఖా పెట్టి 2017లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్కు రుణాన్ని ఇప్పించారు (దస్తావేజు నంబరు 4581/2017). ఇదే దస్తావేజును 2021లో (నంబరు 12205/2021) రద్దు చేసుకున్నారు. దీంతోపాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా వీరిద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. -
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
మహిళకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి: సత్య కృష్ణణ్
-
సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!
మెగాహీరో సాయిధరమ్ తేజ్ జోష్లో కనిపిస్తున్నాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత రెండు సినిమాలు చేశాడు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఓ వైపు ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు తన ఫ్రెండ్స్తో కలిసి మరో ప్రాజెక్ట్ కోసం రెడీ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ రెండు పిక్స్ వైరల్గా మారిపోయాయి. అయితే ఈ ఫొటోల్లో సాయితేజ్తో ఉన్న ఓ వ్యక్తి కాస్త తెలిసిన ముఖంలా అనిపించాడు. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టారా? 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించన సాయితేజ్.. తర్వాత చిత్రం సంపత్ నంది డైరెక్షన్లో చేయబోతున్నాడు. దీనికి 'గాంజా శంకర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి ముందే ఓ షార్ట్ ఫిల్మ్తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అవును మీరు విన్నది నిజమే. మెగాహీరో సాయిధరమ్ తేజ్.. 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్లో చాలా రోజుల క్రితమే నటించాడు. (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) ఆర్మీ జవాన్, అతడి ప్రేయసి మధ్య జరిగే కథతో ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కి సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. పైన ఫొటోలో సాయితేజ్ పక్కన బ్లాక్ టీషర్ట్లో ఉన్నది అతడే. గతంలో హీరోగా నందిని 'నర్సింగ్ హోమ్', 'ఊరంతా అనుకుంటున్నారు' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. 'ఐనా ఇష్టం నువ్వు' అనే మూవీ కూడా చేశాడు. అయితే ఇవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనపెట్టేశాడు. అయితే ఇప్పుడు లావుగా మారిపోవడంతో నరేశ్ కొడుకు నవీన్ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. మరోవైపు సాయితేజ్-మంచు మనోజ్-నవీన్ బెస్ట్ ఫ్రెండ్స్. సమయం చిక్కినప్పుడల్లా వీళ్ల ముగ్గురు కలుస్తుంటారు. హీరోగా మెప్పించలేకపోయిన నవీన్.. దర్శకుడిగా మారిపోయాడు. సాయితేజ్తో ఓ షార్ట్ ఫిల్మ్ తీసి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయాడు. త్వరలో ఇది రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: సెట్లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!) -
Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ
టైటిల్: రంగబలి నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు నిర్మాణ సంస్థ: SLV సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: పవన్ బాసంశెట్టి సంగీతం: పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేదీ: 07-07-2023 హీరో నాగశౌర్య పేరు చెప్పగానే మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. అలానే చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఛలో' తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కట్లేదు. ఇప్పుడు 'రంగబలి' అనే కమర్షియల్ ఎంటర్టైనర్తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ నాగశౌర్య చెప్పినట్లు ఉందా? సినిమా టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? శౌర్య(నాగశౌర్య)ది రాజవరం. ఊరిలో బేవార్స్ గా తిరుగుతూ ఎక్కువగా షో చేస్తుంటాడు అందుకే అందరూ ఇతడిని 'షో' అని పిలుస్తుంటారు. ఊరంటే పిచ్చి ఇష్టం. చచ్చినా బతికినా సొంతూరిలోనే అనేది శౌర్య మనస్తత్వం. అలాంటిది ఓ పనిమీద వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ(యుక్తి తరేజా)ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమిస్తుంది. దీంతో పెళ్లి గురించి మాట్లాడేందుకు శౌర్య.. సహజ తండ్రి కలవడానికి వెళ్తాడు. తనది రాజవరం అని చెబుతాడు. తన ఊరిలోని 'రంగబలి' సెంటర్ ప్రస్తావన వస్తుంది. దీంతో ఆయన పెళ్లికి నో చెబుతాడు. ఇంతకీ ఆ సెంటర్తో శౌర్య పెళ్లికి వచ్చిన చిక్కేంటి? చివరకు శౌర్య ఏం చేశాడు? అనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అనగానే.. ఎలా ఉంటుందా అనేది మనకు ఓ ఐడియా ఉంది. దానికి ఏ మాత్రం అటు ఇటు కాకుండా 'రంగబలి' తీశారు. ట్రైలర్ లో చెప్పినట్లు.. బయట ఊరిలో బానిసలా బతకడం కంటే సొంతూరిలో సింహంలా బతకాలనేది హీరో క్యారెక్టరైజేషన్. ఫస్టాప్ మొదలవడమే మెల్లగా స్టోరీలోకి వెళ్లిపోయారు. మంచి ఎలివేషన్తో హీరో ఎంట్రీ. ఆ వెంటనే ఫైట్. ఆ తర్వాత హీరో చుట్టూ ఉండే వాతావరణాన్ని సీన్ బై సీన్ చూపించారు. తండ్రి విశ్వం(గోపరాజు రమణ)కి ఊరిలో మెడికల్ షాప్. కొడుకు శౌర్యకి దాన్ని అప్పగించాలని ఆయన ఆశ. మనోడేమో ఊరిలో కుర్రాళ్లతో బేవార్స్ గా తిరుగుతుంటాడు. ఓ పనిమీద శౌర్య వైజాగ్ వెళ్లడం, అక్కడ హీరోయిన్ తో హీరో లవ్ లో పడటం, పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం ఇలా సీన్లన్నీ వెళ్తుంటాయి. అయితే ఇలాంటి సన్నివేశాల్ని ఎక్కడో చూశామే అనిపించినప్పటికీ ఫస్టాప్ మొత్తం హీరో అతడి ఫ్రెండ్ అగాధం క్యారెక్టర్ చేసే కామెడీతో అలా వెళ్లిపోతుంది. పెళ్లి కోసం హీరోయిన్ తండ్రి దగ్గరకు వెళ్లిన హీరోకు తన ఊరిలో 'రంగబలి' సెంటర్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇంతకీ ఆ సెంటర్ తో హీరోయిన్ తండ్రికి ఉన్న సమస్యేంటి? చివరకు అది పరిష్కారమైందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు ఓ పాయింట్ చెప్పాలనుకున్నాడు. దాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా తీశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫస్టాప్ మొత్తాన్ని స్టోరీ సెట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. సెకండాఫ్ లో అసలు విషయాన్ని బయటపెట్టాడు. కానీ అది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన కథలా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఏం కొత్తగా ఉండదు. క్లైమాక్స్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. అప్పటివరకు మారని జనం.. హీరో 5 నిమిషాల స్పీచ్ ఇవ్వగానే మారిపోతారు. కొన్నేళ్ల ముందు వరకు ఈ తరహా స్టోరీలంటే ఓకే గానీ.. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయిన ఈ జమానాలో కూడా ఇలాంటి స్టోరీలా బాసూ! ఎవరెలా చేశారు? హీరో నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తనదైన ఈజ్తో యాక్టింగ్, కామెడీ, డ్యాన్సులు అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. యాక్షన్ హీరో కావాలనే ఆరాటం ఈ సినిమాలో బాగానే కనిపించింది. అవసరం లేకున్నా సరే కొన్నిచోట్ల బాడీని చూపించాడు. ఫైట్లు కూడా చేశాడు. స్టోరీకి తగ్గట్లు అవి కాస్త లాజిక్గా ఉండుంటే బాగుండేది. హీరోయిన్ యుక్తి తరేజాకు పెద్దగా స్కోప్ దక్కలేదు. హీరోతో లవ్ సీన్లు, రెండు మూడు పాటల్లో కనిపించింది. ఓ పాటలో అయితే కిస్, స్కిన్ షోతో రెచ్చిపోయింది! మిగిలిన వాళ్లలో సత్య గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఫస్టాప్ ని తన కామెడీతో లాక్కొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్టాప్ కి సత్యనే హీరో. లేకపోయింటే సినిమా బలైపోయేది! గోపరాజు రమణ హీరో తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. సత్య, గోపరాజు రమణ పాత్రలకు ఫస్టాప్ లో దొరికిన స్పేస్.. సెకండాఫ్ లోనూ ఉండుంటే బాగుండేది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. ఇందులో విలన్గా చేశాడు. అతడి పాత్ర పరిచయం ఓకే కానీ ఎండింగ్ పేలవంగా ఉంది. నటుడిగా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అసలు అతడి పాత్రకు సరైన సీన్లు ఒక్కటంటే ఒక్కటీ పడలేదు. సెకండాఫ్ లో శరత్ కుమార్, శుభలేఖ సుధాకర్ పర్వాలేదనిపించారు. మిగిలినవాళ్లు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. పవన్ సీహెచ్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. అవి కూడా సందర్భం లేకుండా వస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. రైటర్ అండ్ డైరెక్టర్ పవన్ బాసంశెట్టికి ఇది తొలి సినిమా. కొన్ని సీన్లనీ బాగానే హ్యాండిల్ చేశాడు గానీ సినిమా కథ, సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. ఓవరాల్గా చెప్పుకుంటే 'రంగబలి'.. కాస్త ఫన్ కాస్త ఎమోషన్ ఉండే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్. -చందు, సాక్షి వెబ్డెస్క్ -
నాగశౌర్యతో కమెడియన్ సత్య స్పెషల్ ఇంటర్వ్యూ
-
‘గెటౌట్ ఆఫ్ మై స్టూడియో’.. నవ్వులు పూయిస్తున్న ‘రంగబలి’ కామెడీ ఇంటర్వ్యూ
నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన తాజా చిత్రం ‘రంగబలి’.పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ని వైవిధ్యంగా ప్లాన్ చేసింది చిత్రబృందం. కమెడియన్ సత్యతో కలిసి ఓ ఫన్ని ఇంటర్వ్యూని షూట్ చేసింది. టాలీవుడ్లో ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ కమెడియన్ సత్య అలరించాడు. రిపోర్టర్ ‘గ్రాఫర్’గా, అలాగే లేడీ యాంకర్ ‘వల్లీ’గా సత్య చేసే సందడి నవ్వులు పూయిస్తోంది. ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. -
టాప్ రేంజ్ లో ఉన్న కమెడియన్ సత్య
-
నేహాపై ఫైర్ అయిన మెరీనా.. బుద్ధి ఉండదా అంటూ ఆగ్రహం
బిగ్బాస్ సీజన్-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు కూడా పోలీసులకు, దొంగలకు మధ్య వాగ్వివాదం నడుస్తుంది. పట్టుబడిని మెరీనాను దొంగలు బెడ్రూమ్లో వేసి లాక్ చేస్తారు. దీంతో ఆమె అక్కడున్న కబోర్డ్స్లలో బొమ్మలు వెతుకుతుంటుంది. దీంతో ఆమెకు ఆ యాక్సిస్ లేదని, అలా చేయడానికి వీళ్లేదని నేహా ఫైర్ అవ్వగా.. మాటిమాటికి గుర్రు అంటే ఎట్లా? బుద్ది ఉండదా? అంటూ మెరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వంద రూపాయలకి ఒక బొమ్మ కొంటానంటూ గీతూ దొంగలతో డీల్ మాట్లాడుతుంది. అంతేకాకుండా చివర్లో వాళ్లకు ఓ బహుమతి కూడా ఇస్తానని ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా సత్యతో పరిహోర కలపేందుకు అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడు. అయినా సరే పట్టించుకోని సత్య.. హౌస్లో అందరినీ అన్నయ్య అనే పిలుస్తానని చెప్పడంతో అర్జున్ కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సత్యను తప్పా మిగతా అందిరినీ సిస్టర్ అని పిలుస్తానని చెప్పిన అర్జున్ సత్యతో లవ్ ట్రాక్ నడిపిందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నాడు. దీనికి సత్య రియాక్షన్ ఏమైనా మారుతుందా లేక నో ఫీలింగ్స్ అంటూ అలానే ఉండిపోతుందా చూద్దాం. -
రియల్ స్టోరీగా ‘నేను c/o నువ్వు'.. రిలీజ్ ఎప్పుడంటే..
రతన్ కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నేను c/o నువ్వు'. ఆగాపే అకాడమీ పతాకంపై అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్లు సంయుక్తంగా నిర్మించారు..ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 16 న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత సాగారెడ్డి తుమ్మ చిత్ర విశేషాల గురించి మీడియాతో మాట్లాడుతూ.. 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రేమ మనిషిని జయిస్తుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. మా సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎన్.ఆర్.రఘునందన్ గారు అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది’ అన్నారు. -
రామ్చరణ్ సొంత విమానంలో కమెడియన్ సత్య!
సినిమాలను రఫ్ఫాడించే రామ్చరణ్ ఎన్నో మంచి పనులు చేస్తూ రియల్ హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే, ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికిగానూ ఆసుపత్రికి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే రామ్చరణ్ ముందుకొచ్చి సాయం చేశాడు. నటుడు కాదంబరి కిరణ్, దర్శకుడు సుకుమార్ చొరవతో చెర్రీ దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకుని "మనం సైతం" ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశారు. అవికాక సుకుమార్ తదితరుల వద్ద రూ.1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. కొన్ని రోజులు తర్వాత నటుడు కాదంబరి కిరణ్.. రామ్ చరణ్కు ఎదురుపడితే "ఆ పాప ఎలా ఉంది కాదంబరి గారూ?'' అని ఆమె గురించి ఆరా తీశారు. అదీ రామ్ చరణ్ వ్యక్తిత్వానికి నిదర్శనం. తాజాగా చెర్రీ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అమృత్సర్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చరణ్కు సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యి హైదరాబాద్కు తిరిగి రావాల్సి ఉంది. ఇదే సినిమాలో కమెడియన్ సత్య కూడా నటిస్తున్నాడు. అతడు కూడా తిరిగి హైదరాబాద్కు రావాల్సి ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న రామ్చరణ్, సత్యను తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్కు తీసుకు వచ్చారు. కాగా కమెడియన్ సత్య.. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న చరణ్ గతంలోనే రంగస్థలం సినిమాలో సత్యకి ఒక అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఏకంగా తనతో ప్రయాణం చేసే అవకాశం కల్పించడాన్ని అభిమానులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. చదవండి: అప్పుడే ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్ అప్పారావు -
గ్రేటర్లో బీజేపీతో పొత్తు ఉంటుంది
-
గమ్మత్తుగా..
-
ప్రశ్నించేందుకు రెడీ
పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు నటుడు పి.సత్యారెడ్డి. ఇప్పుడు తన కుమారుడు మనీష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ప్రశ్నిస్తా’. అక్షిత కథానాయికగా నటించారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ వారంలో సెన్సార్ పూర్తి చేసుకుని, వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ విధానాలపై ఓ విద్యార్థి నాయకుడు ఏ విధంగా పోరాడాడు.. ఎలా ప్రశ్నించాడు? అన్నది ఈ చిత్రకథ. వినోదంతో పాటు సమాజానికి మంచి సందేశం ఉంటుంది. మనీష్కి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్నవాడిలా నటించాడు’’ అన్నారు. రావు రమేశ్, ఆమని, హసీన్, షిప్రా కౌర్, వేణుగోపాల్, ప్రభాస్ శ్రీను, అనంత్, శివపార్వతి, ముంతాజ్, ‘ఆర్ఎక్స్ 100’ లక్ష్మణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వెంగి, కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి. -
540 సినిమాల్లో నటించా
విశాఖపట్నం, సింహాచలం (పెందుర్తి): బ్యాంక్ ఉద్యోగి నుంచి ఎక్కడెక్కడో ప్రయాణించి చివరికి సినిమా యాక్టర్ అయ్యానని చెప్పారు ప్రముఖ సినీ నటుడు సత్యప్రకాష్. వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఆయన మాట ల్లో... బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసి ఆ తర్వాత డిఫెన్స్లో చేరా. ఆ తర్వాత కొన్నాళ్లు ఎక్కడెక్క డో ప్రయాణాలు సాగించా. చివరికి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలెట్టాను. అలా ప్రయత్నిస్తున్న నాకు కర్ణాటకలో పోలీస్ స్టోరీ సినిమా అవకాశం వచ్చింది. అది అతిపెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా నా అదృష్టం. నా జీవితం మలుపు తిరిగింది అక్కడే. ఆ నాటి నుంచి సినిమా అవకాశాలు రావడం మొదయ్యా యి. ఆ తర్వాత తెలుగులో నటించే చాన్స్ దొరి కింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్కల్యాణ్, మహేష్బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితర హీరోలతో తెలుగులో సినిమాలు చేశాను. అన్ని సినిమాలు చాలా బాగా ఆడాయి. నా 25 ఏళ్ల సినీ జీవీతంలో నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా ఎదిగా. ఇప్పటికి పది భాషల్లో 540 సినిమాల్లో నటించా. ప్రస్తుతం నటిస్తూనే మా అబ్బాయి నటరాజ్ హీరోగా సినిమా తీస్తున్నా. ఇన్ని అవకాశాలు రావడం ఆ భగవంతుడు, ప్రేక్షకుల ఆశీస్సులే. దృష్టి, అధ్భుతం అనే తెలుగు సినిమాల్లో, గిరిగిట్లే అనే కన్నడ సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నాను. అలాగే నా కొడుకు నటరాజ్ హీరోగా హుల్లాలా హుల్లాలా అనే హర్రర్ కామెడీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నా. చిరంజీవి నా అభిమాన నటుడు. ఆయనంటే ఎనలేని అభిమానం. హిందూ మతాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలని కోరుకుంటున్నా. అందుకోసం కృషి చేస్తున్నా. ప్రతి ఒక్కరూ బీదలు, వయో వృద్ధులు, పాఠశాల విద్యార్థులు, అంధులకు సహకారం అందించాలి. దర్శనార్థం వచ్చిన సత్యప్రకాష్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. -
ప్రతిదీ న్యూసే!
మనిషి చావు, జ్ఞాపకం, ప్రేమ, స్నేహం... ఇలా చేయాలనుకుంటే ప్రతిదీ న్యూసే. కానీ ఆ న్యూస్ను క్యాష్ చేసుకోవాలనుకుంటాడు ఓ యువకుడు. అవసరమైతే న్యూస్ను క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ఇదం జగత్’. అనిల్ శ్రీ కంఠ దర్శకత్వంలో సుమంత్ కథానాయకుడిగా నటించారు. అంజు కురియన్ కథానాయిక. శివాజీ రాజా, సత్య, ఆదిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటించారు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్లు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్కు మంచి స్పందన లభిస్తోంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుమంత్ కనిపిస్తారు. ఆయన పాత్ర సినిమాకు హైలైట్గా ఉంటుంది. కథకు ‘ఇదం జగత్’ టైటిల్ బాగా యాప్ట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
డ్రీమ్ వారియర్ సంస్థలో సిబిరాజ్
తమిళ సినిమా : ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా రాణిస్తున్న డ్రీమ్వారియర్ పిక్చర్స్ సంస్థలో యువ నటుడు సిబిరాజ్ నటించడానికి రెడీ అవుతున్నారు. కార్తీ హీరోగా కాష్మోరా, ధీరన్ అధికారం ఒండ్రు వంటి భారీ చిత్రాలతో పాటు జోకర్, అరివి వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాలను నిర్మించిన సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్. ఈ సంస్థ ప్రస్తుతం సూర్య హీరోగా ఎన్జీకే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సత్య వంటి సక్సెస్ఫుల్ చిత్రంలో నటించిన నటుడు సిబిరాజ్ ప్రస్తుతం రంగా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సిబిరాజ్కు జంటగా నిఖిలా విమల్ నటిస్తోంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇలా ఉండగా సిబిరాజ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు మధుభాన కడై చిత్రాన్ని తెరకెక్కించిన కమల్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించిన మధుపాన కడై చిత్రం ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఈ చిత్రం 2012లో విడుదలైంది. దాదాపు ఆరేళ్ల తరువాత కమల్కన్నన్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. సిబిరాజ్ హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని డ్రీమ్వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఆర్ఎస్.ప్రకాశ్, ఆర్ఎస్.ప్రభు నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
అఖిల్ కొత్త సినిమా అప్డేట్
తొలి సినిమాతో ఘోరంగా విఫలమైన అక్కినేని యంగ్ హీరో అఖిల్, రెండో సినిమాతో ఆకట్టుకున్నాడు. హలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ రెండో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్, డ్యాన్స్ లలో అఖిల్ చూపిస్తున్న ఈజ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టిన ఈ యంగ్ హీరో ఈ నెల 10న కొత్త సినిమాను ప్రకటించనున్నాడు. ఇటీవల రెండు కథలు వింటున్నట్టుగా వెల్లడించాడు అఖిల్. వీటిలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి సోదరుడు సత్య పినిశెట్టి చెప్పిన కథ కూడా ఉందట. అఖిల్ కూడా ఈ యువ దర్శకుడితోనే కలిసి పనిచేసేందుకు ఆసక్తికనబరుస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే హలో విషయంలో కూడా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించిన తరువాత విక్రమ్ ను ఫైనల్ చేశారు. మరి మూడో సినిమా విషయంలో అఖిల్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి. -
సత్యం.. అసత్యం మధ్య యుద్ధం
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలు.. సత్యం, అసత్యానికి మధ్య జరిగే యుద్ధమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. గుజరాత్ రాష్ట్రాన్ని పాలించే ప్రస్తుత బీజేపీకి నిజం చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. గుజరాతీయులు ఎప్పుడూ సత్యాన్నే నమ్ముతారు. సత్యానికే విలువ ఇస్తారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలు సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా రాహుల్గాంధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం గుజరాత్లో రైతులు దీనావస్థలో ఉన్నారు.. అలాగే విద్య, వైద్యం ఖరీదైనవిగా మారాయి.. ఇది సత్యం. వీటిపై బీజేపీ ప్రభుత్వం అన్ని సందర్భాల్లోనూ అసత్యాలు ప్రచారం చేస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే.. యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. అది సాధ్యం కాలేదు.. ప్రతినిత్యం చైనాతో పోటీకి ఆయన వెళతారు. చైనాలో ప్రతి 24 గంటల వ్యవధిలో 50 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తోంది.. కానీ మోదీ హయాంలో కేవలం 450 మందికి మాత్రమే ఇవి కల్పించబడుతున్నాయని రాహుల్గాంధీ తెలిపారు. గుజరాత్లో నిరుద్యోగ సమస్య ఉంది.. ఇదిసత్యం.. దీనిని ప్రభుత్వం అసత్యంగా ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి మోదీ చేతిలో సైన్యం, పోలీసులు, ఉత్తర్ ప్రదేశ్, గోవా, చత్తీస్గఢ్లు ఉన్నాయి.. నా దగ్గర సత్యం మాత్రమే ఉందని రాహుల్ గాంధీ అన్నారు. -
బెంట్లీ కారుకు... రూ.10 కోట్లయినా వెనుకాడరు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంట్లీ.. సూపర్ లగ్జరీ కార్ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రాండ్. సామాన్యుడి ఊహలక్కూడా అందని ధర వీటి ప్రత్యేకత. కొనుగోలు చేసే కస్టమర్ తనకు నచ్చినట్టుగా రంగులు, ఇంటీరియర్, యాక్సెసరీస్, ఎక్స్టీరియర్ను ఎంచుకోవచ్చు. కారు లోపలి భాగాలన్నీ చాలామటుకు చేతితో తీర్చిదిద్దినవే. కారు తయారీకి ఎంత కాదన్నా ఆరు నెలల సమయం పడుతోందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా కస్టమైజేషన్ కారణంగా భారత్లో కారు ధర రూ.10 కోట్ల వరకూ వెళ్తోంది. దేశంలో ఇప్పటి వరకు 500 కార్లు అమ్ముడయ్యాయి. 100కు పైగా రంగులను కస్టమర్లు ఎంచుకున్నారు. తొలి స్థానం తెలుపు రంగు కైవసం చేసుకుంది. బెంట్లీకి చెందిన నాలుగు మోడళ్లు దేశీయ మార్కెట్లోనూ లభిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఏటా 10,000 పైగా బెంట్లీ కార్లు రోడ్లపై దూసుకెళ్తున్నాయి. భాగ్యనగరిలో 40 కార్లు.. హైదరాబాద్ రోడ్లపై 40 దాకా బెంట్లీ కార్లు హుందా ఒలకబోస్తున్నాయి. నిజాం కాలం నుంచే భాగ్యనగరి వాసులు లగ్జరీ కార్ల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని ప్రీమియం లగ్జరీ కార్ల విక్రయంలో ఉన్న ఎక్స్క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బగ్ల శుక్రవారం తెలిపారు. భారత్లో మూడో షోరూంను హైదరాబాద్లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇక్కడి అవకాశాలను దృష్టిలో పెట్టుకునే షోరూమ్ను తెరిచామన్నారు. కస్టమైజేషన్కు అయ్యే ఖర్చు గురించి ఇక్కడివారు వెనక్కి తగ్గరని చెప్పారు. భారత్లో లగ్జరీ కార్లకు దిగుమతి సుంకం 202 శాతం ఉండటం, మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వంటి అడ్డంకులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దేశంలో రూ.3 కోట్లపైగా ధర కలిగిన వివిధ కంపెనీల కార్లు ఏటా 150 దాకా అమ్ముడవుతున్నాయని వెల్లడించారు. -
జల్లికట్టు నేపథ్యంగా వీరతిరువిళా
తమిళసినిమా: తమిళుల వీరత్వానికి చిహ్నం జల్లికట్టు క్రీడ. ఈ నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం వీర తిరువిళా అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు విజయ్ మురళీధరన్. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఇరైవన్ సినీక్రియేషన్స్ పతాకంపై సి.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. ఈయన నిర్మించిన ఒరు కణవుపోల చిత్రం త్వరలో విడుదల కానుంది. వీర తిరువిళా చిత్రంలో సత్య,సెల్వం, సెల్వ కథానాయకులుగా నటించగా నాయకిగా తేనిక నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో పొన్వన్నన్, సింధియా, నజీర్, కాదల్సుకుమార్ నటించారు. ఈఎస్.రామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, ఇది జల్లికట్టు ప్రజలు నివశించే ప్రాంతం నేపథ్యంగా తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. పూర్వం జల్లికట్టు అనేది క్రీడ కాదన్నారు. అది వీర పోరాటం అని తెలిపారు. ఐదుగురు యువకులు జల్లికట్టు పోరాటంలో గెలిచి వారి ఊరికి మంచి పేరు తెచ్చిపెట్టిన కథే వీర తిరువిళా అని చెప్పారు. ఇది జల్లికట్టు క్రీడ నేపథ్యంలో తెరకెక్కించిన తొలి చిత్రం అని, ఆ తరువాత జల్లికట్టు క్రీడను నిషేధించడంతో ఈ చిత్ర విడుదలకు జాప్యం జరిగిందని తెలిపారు. చిత్ర షూటింగ్ను కారైక్కుడి, అమరావతి, పుదూర్, సీరావయల్, ఆకావయల్, నేమం, మేట్టూర్ పెరియతండా ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
'ఆ హిట్ సినిమాల స్క్రిప్ట్ లేదు'
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మార్క్ స్టేట్ మెంట్ తో ఆకట్టుకున్నాడు. ప్రముఖ్య బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమా చోప్రా కు షాకింగ్ సమాధానం ఇచ్చాడు. నిర్మాత విధూ వినోద్ చోప్రా భార్య అయిన అనుపమా.. ' అనుపమా ఫిల్మ్ కంపానియన్' పేరుతో ఓ వెబ్ సైట్ ను నడుపుతోంది. ఇటీవల ఈమె వర్మను సాయం కోరింది. వర్మ తెరకెక్కించిన క్లాసిక్స్ సత్య, కంపెనీ సినిమాల స్క్రిప్ట్ లు ఇస్తే తన వెబ్ సైట్ లో పెడతానని అవి సినీ రంగంలోకి రావాలనుకుంటున్నవారికి ఉపయోగకరంగా ఉంటాయని అడిగింది. అయితే అనుపమ అభ్యర్థన పై వర్మ తనదైన స్టైల్ లో స్పందించాడు. ఆ రెండు సినిమాలు తాను స్క్రిప్ట్ లేకుండానే తెరకెక్కించానన్న వర్మ, ఎప్పటి నుంచైతే తాను బౌండెడ్ స్క్రిప్ట్ తో సినిమాలు చేయటం మొదలు పెట్టానో అప్పుడే తనకు ఫ్లాప్ లు మొదలయ్యాయని తెలిపాడు. అంతేకాదు విషయాన్ని వర్మ తన తల్లి మీద తనకు నచ్చిన దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ మీద ఒట్టేసి చెబుతానన్నాడు. వర్మ ఆన్సర్ తో షాకైన అనుపమా ఇది వర్మ మార్కు క్లాసిక్ అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. An instant #RamGopalVarma classic! pic.twitter.com/EFAWurBAYT — Anupama Chopra (@anupamachopra) 21 August 2017 -
ఆ హీరోలకు నో చాన్స్ !
ఆ హీరోలకు నో కాల్షీట్స్ అంటోంది నటి రకుల్ప్రీత్సింగ్. ప్రారంభ దశలో ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ఫొటో ఆల్బమ్లు పట్టుకుని దర్శక నిర్మాతల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన నటీమణులు లేకపోలేదు. అలాగే వర్థ్ధమాన హీరోలతో నటించి ఎదిగిన వారిని చూశాం. అలా ఒకటి రెండు విజయాలు వరించగానే ఆది కాలాన్ని మరచిపోవడం, స్టార్ హీరోలతో నటించే అవకాశం రాగానే చిన్న హీరోల సరసన నటించడానికి సుముఖత చూపని హీరోయిన్లను చూస్తున్నాం. నటి రకుల్ప్రీత్సింగ్ ఇందుకు అతీతం కాదని నిరూపించుకుంటోంది. ఈ జాణ తొలిరోజుల్లో కోలీవుడ్లో ఆర్య తమ్ముడు సత్య, గౌతమ్కార్తీక్ లాంటి నవ హీరోలతో రొమాన్స్ చేసింది. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడం, అమ్మడిని కోలీవుడ్ పట్టించుకోకపోవడంతో టాలీవుడ్కు జంప్ చేసింది. అక్కడ ఆదిలో వర్థమాన హీరోలతోనే జత కట్టింది. లక్కీగా ఆ చిత్రాలు సక్సెస్ అవడంతో స్టార్ హీరోలు రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్బాబు లాంటివారితో నటించే అవకాశాలు వరించాయి. దీంతో ఆటోమేటిక్గా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను అందుకున్న రకుల్ప్రీత్సింగ్కు ఇప్పుడు కోలీవుడ్లోనూ ఎర్ర తివాజీ పరుస్తున్నారు. ఆ మధ్య విశాల్ సరసన నటించే అవకాశం వచ్చినా జార విడుచుకున్న ఈ భామకు తాజాగా కార్తీతో రొమాన్స్ చే సే అవకాశం వరించింది. అంతే కాదు తదుపరి కార్తీ సోదరుడు, స్టార్ హీరో సూర్యతో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇలా వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావడంతో ఇకపై ఇలాంటి ప్రముఖ కథానాయకుల చిత్రాలనే ఎంపిక చేసుకుని నటించాలని నిర్ణయం కూడా తీసేసుకుందట. ఇందుకు ప్రధాన కారణం పెద్ద హీరోల సరసన నటిస్తే పారితోషికం ఆ స్థాయిలోనే ముడుతుండడమే. ఇంకేముంది ఇక చిన్న హీరోలకు నో కాల్షీట్స్ అంటూ కోలీవుడ్, టాలీవుడ్లోనూ అలాంటి చిత్రాలను నిరాకరిస్తోందంటున్నారు సినీ వర్గాలు. -
‘జల్లికట్టు’ యువత కొత్త పార్టీ
సాక్షి, చెన్నై: జల్లికట్టు ఉద్యమానికి నేతృత్వంవహించిన యువతలోని పలువరి ఆధ్వర్యంలో‘ నాదేశం...నాహక్కు’ పేరుతో తమిళనాడులో శనివారం కొత్త పార్టీ ఆవిర్భవించింది. రుంబాక్కంలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ పార్టీని ప్రకటించారు. ఇందులో కన్వీనర్లుగా ఎబినేజర్, సత్య, ప్రవీణ, సుకన్య, కార్తీ, స్వతంత్ర దేవి, ప్రకాష్, ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఈ పార్టీ జెండాను జాతీయ పతాకం తరహాలో రూపొందించారు. మధ్యలో సంకెళ్లు తెంచుకున్న యువకుడి చిత్రాన్ని పొందుపరిచారు. -
క్రైం థ్రిల్లర్ కథా చిత్రంగా తప్పుదండ
ఎన్నికలు, నలుగురు దొంగలు, కథానాయకి తన బాయ్ఫ్రెండ్తో ప్రేమ కలాపాలు అంటూ మూడు వేర్వేరు కోణాల్లో సాగే విభిన్న కాథా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం తప్పుదండ అని చిత్ర దర్శకుడు శ్రీకాంత్ తెలిపారు.దివంగత ప్రఖ్యాత చాయగ్రహకుడు, దర్శకుడు బాలుమహేంద్ర శిష్యుడైన ఈయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. క్లాప్బోర్ట్ ప్రొడక్షన్స పతాకంపై సత్యమూర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్య, శ్వేతాగై హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇతర ముఖ్య పాత్రలో ్లజాన్విజయ్, మైన్గోపి, అజయ్ఘోష్, ఈ.రామదాస్, మెడ్రాస్వ్రి, మహేంద్రన్, నాగ, సంజీవి, అశ్విత ప్రియ, జీవారవి, ఆత్మ నటిస్తున్నారు.వినోద్భారతి చాయాగ్రహణం, నరేన్ బాలకుమారన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో నటుడు జాన్విజయ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. తనది దొంగలకు శిక్షణ ఇచ్చే విశ్వవిద్యాలయానికి అధినేత పాత్ర అని తెలిపారు. ఇక చిత్ర కథానాయకుడు కూత్తుపట్టరైలో శిక్షణ పొంది తన పాత్రకు చక్కగా న్యాయం చేశారన్నారు. చిత్రం ప్రథమార్థం హాస్యభరితంగానూ ద్వితీయార్థం క్రైమ్థ్రిల్లర్గానూ సాగుతుందని తెలిపారు. విభిన్న కథాకథనాలతో తెరకెక్కిస్తున్న తమ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం యూనిట్లోని అందరికీ ఉందని దర్శకుడు అన్నారు. -
మరోసారి భారత్ కు సత్య నాదెళ్ళ!
న్యూఢిల్లీః అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ మే 30న మరోసారి భారత్ లో పర్యటించనున్నారు. ఈసారి పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన యువ వ్యాపారవేత్తలు, విద్యార్థులు, విద్యావేత్తలను కలుసుకొంటారు. అలాగే సీఐఐ నిర్వహించనున్నమరోకార్యక్రమంలో పాల్గొని భారత్ లోని 150 మంది అత్యుత్తమ కార్పొరేట్ దిగ్గజాలతో కూడ సమావేశమౌతారు. భారత్ ను సందర్శించనున్న నాదెళ్ళ ఈసారి పర్యటనలో భాగంగా సాంకేతిక సంస్కృతి అభివృద్ధి, భారత్ లో పరివర్తన, ప్రపంచంలో వాస్త సమస్యల పరిష్కారం వంటి అనేక సాంకేతిక విషయాలపై నిపుణులతో చర్చిస్తారు. ఏడు నెలల వ్యవధిలో నాదెళ్ళ భారత్ కు రావడం ఇది మూడోసారి కాగా గత డిసెంబర్ లో ఇండియా సందర్శించిన సందర్భంలో ఆయన...ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలసి, అనంతరం హైదరాబాద్ లోని స్టార్ట్ అప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ ను, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించారు. నవంబర్ పర్యటనలో భాగంగా ముంబైలోని మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్లీషెడ్ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన నాదెళ్ళ.. అనంతరం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ వంటి వ్యాపారవేత్తలను, పరిశ్రమల అధినేతలను కలుసుకున్నారు. భారత్ లో ఇటీవల పెరుగుతున్న ప్రపంచ నేతల సందర్శనలు, ఒప్పందాలను చూస్తే దేశం ఒక్క ఔట్ సోర్సింగ్ కేంద్రగానే కాక, సాంకేతికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్న విషయం అర్థమౌతుంది. -
కాబోయే భర్త హత్యపై డెమో చూపించింది!
చెన్నై: ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసిన తీరును యువతి డెమో చూపించడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. తిరువళ్లూరు జిల్లా చిత్తుకాడు గ్రామంలోని ఇటుక బట్టీ వద్ద అనుమానాస్పద స్థితిలో ప్లాస్టిక్ డబ్బాలో తలవేరు చేసిన మృతదేహన్నీ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఛేదించడానికి ఎస్పీ శ్యామ్సన్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన వ్యక్తి చెన్నై పెరుంగుడి ప్రాంతానికి చెందిన హరికృష్ణన్ కుమారుడు రాజా(34)గా గుర్తించారు. ఇతను చెన్నైలోని యూటీఐ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి కొరట్టూరు ప్రాంతానికి చెందిన సత్యతో ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 15న వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజా నాలుగో తేదీన ప్లాస్టిక్ డబ్బాలో శవమై కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. రాజా కాల్ డేటా ఆధారంగా ఆవడికి చెందిన సగాయం, సత్య తదితరులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో సత్య, సగాయంకు మధ్య పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. సత్య, సగాయం సంబంధానికి అడ్డువస్తాడనే కారణంతోనే రాజాను హత్య చేసిసినట్టు సగాయం వాగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు వివరించారు. ఈ విషయాన్ని సత్య పోలీసులకు డెమో ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాజాపై దాడి చేసిన వ్యక్తుల్లో ఆవడికి చెందిన మదన్(29)ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
ఆమె శరీరంలోకి బుల్లెట్ ఎలా వెళ్లిందో?
-
ఆమె శరీరంలోకి బుల్లెట్ ఎలా వెళ్లిందో?
* రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన... *ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళ నరసన్నపేట: రైలుకోసం స్టేషన్లో ఎదురుచూస్తున్న ఓ మహిళ శరీరంలోకి ఆమెకు తెలియకుండానే బుల్లెట్ దిగబడింది. వైద్యులు కనుగొని దానిని తొలగించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ లచ్చన్నపేటకు చెందిన శ్రీకాకుళం సత్య(28) అనకాపల్లిలో కుటుంబంతో ఉంటున్నారు. ఇటీవల జన్మించిన తన కుమారుడిని స్వగ్రామం తీసుకు వచ్చేందుకు బుధవారం విశాఖలోని మర్రిపాలెం రైల్వే స్టేషన్కు వచ్చారు. తిలారుకు టిక్కెట్ తీసుకొని రైలు కోసం ఎదురు చూస్తుండగా సత్యకు వెనక వైపు నుంచి వీపునకు ఏదో వస్తువు బలంగా తగిలింది. అయితే ఏదో రాయి తగిలి ఉంటుందని సత్య కుటుంబ సభ్యులు భావించారు. గాయపడిన ఆమెకు స్థానికంగా స్వల్ప చికిత్సను అందించి, ప్రైవేటు వాహనంలో నరసన్నపేటకు సాయంత్రం 3 గంటల సమయంలో తీసుకువచ్చారు. అక్కడకు వచ్చే సరికి గాయం తీవ్రత పెరగడంతో స్థానిక వాత్సల్య ఆసుపత్రిలో చూపించారు. పరిశీలించిన వైద్యులు ఎక్స్రే తీయగా అది బుల్లెట్గా గమనించి వెంటనే ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దూరం నుంచి బుల్లెట్ తగలడం వల్ల ప్రమాదం తప్పిందని అన్నారు. బుల్లెట్ వెనక వైపు నుంచి శరీరీంలోనికి దూసుకు వెళ్లిన ఊపిరితిత్తులను తాకి ఉండి పోయిందని, అది మరింత బలంగా తగిలి ఉంటే ప్రాణాలకు ప్రమాదం అయ్యేదని డాక్టర్ తెలిపారు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ చిన్నంనాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ, వారి బందువులతో మాట్లాడారు. నరసన్నపేట పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, సీఐ చంద్రశేఖర్ తదితరులు వచ్చి పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగింది, బుల్లెట్ ఎటువైపు నుంచి వచ్చింది అనేది తెలియడంలేదు. సత్య భర్త ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నారు. -
ఆ ఏడుపు ఎందుకో..?
వెండితెరపై జరుగుతున్నది నిజం కాదు.. కథ అని తెలిసినా బాగా లీనమైపోయి చూస్తుంటాం. తెరపై తారలు ఏడిస్తే.. ఒక్కొసారి మనం కూడా ఏడ్చేస్తాం. ఇటీవల నయనతార కూడా అలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయంలోకి వస్తే... నయనతారకు మంచి మిత్రుడైన ఆర్య తమ్ముడు సత్య హీరోగా రూపొందిన ‘అమరకావ్యం’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అత్యంత సన్నిహితులకు చూపించారు ఆర్య. ఈ చిత్రం చూసిన తర్వాత నయనతార అరగంటసేపు ఆపకుండా కన్నీళ్లు పెట్టుకున్నారని చెన్నయ్ టాక్. ఈ ప్రేమకథా చిత్రం ఆమెను అంతగా కదిలించింది. ఈ చిత్రం తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసిందని, అందుకే నయనతార అంతగా కదిలిపోయిందన్నది పలువురి అభిప్రాయం. ఈ సినిమా చూసిన ఐదు రోజుల తర్వాత చిత్రదర్శకుడు జీవా శంకర్కి ఫోన్ చేసి, చాలా బాగుందని నయనతార అభినందించారట. -
40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కిన బుడ్డోడు!!
-
40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కిన బుడ్డోడు!!
తిరుమల: కేవలం 40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కడం అంటే ఎవరికైనా సాధ్యమేనా? సాధారణంగా శారీరక దారుఢ్యం బాగున్నవాళ్లు కూడా కనీసం రెండు గంటల సమయమైనా ఇందుకు తీసుకుంటారు. కానీ, నాలుగేళ్ల బాలుడు కేవలం 40 నిమిషాల్లోనే మొత్తం నడకదారి మార్గాన్ని అధిగమించి కొండపైకి చేరుకున్నాడు. దీంతో అక్కడున్న అధికారులు, భక్తులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరుకు చెందిన ఎస్. తోనేశ్వర్ సత్య అనే నాలుగేళ్ల బాలుడు తన పుట్టిన రోజైన ఆగస్టు 13వ తేదీ బుధవారం ఈ ఫీట్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మూడున్నరేళ్ల వయసు నుంచి సత్య తిరుమల మెట్ల మార్గం ఎక్కడం మొదలుపెట్టాడు. తొలిసారి తన తండ్రి సాయిబాబుతో వచ్చినప్పుడు ఎత్తుకుంటామన్నా వినకుండా దిగి మెట్లు ఎక్కడంతో తల్ల్లిదండ్రులు ఇది దైవకృపగా భావించి అప్పటినుంచి ప్రతి నెలా తీసుకురావడం మొదలుపెట్టారు. తొలిసారి రెండు గంటల 20 నిమిషాల్లో కొండ ఎక్కిన సత్య, అప్పటినుంచి వరుసగా సమయం తగ్గించుకుంటూ వచ్చి, ఈసారి కేవలం 40 నిమిషాల 20 సెకన్లలోనే మెట్లమార్గం ఎక్కేశాడు. మంచి వయసులో ఉన్నవాళ్లయితే రెండు నుంచి రెండున్నర గంటలు, కాస్త వయసు మీద పడినవాళ్లయితే నాలుగు గంటల్లో తిరుమల కొండ ఎక్కడం సర్వ సాధారణం. అలాంటిది ఒక్క గంట కూడా సమయం తీసుకోకుండానే ఈ బుడతడు కొండ ఎక్కేయడంతో ఇదంతా స్వామివారి మహత్యమేనని అక్కడి భక్తులు అనుకుంటున్నారు. -
విశ్లేషణం: ‘మన’ సత్య
సత్య నాదెళ్ల.. మనవాడు... మన తెలుగువాడు... మన దేశంవాడు... భారతదేశ మేధాశక్తిని ప్రపంచానికి చాటినవాడు... ప్రపంచ పత్రికల పతాక శీర్షికలలో నిలిచినవాడు... ఈ బుక్కాపురం బుల్లోడు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎలా కాగలిగాడు? హైదరాబాద్ చదివి అమెరికాలో ఎలా పాగా వేయగలిగాడు? ఓపెన్ అండ్ క్లారిటీ సత్య మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... అతని చేతులు ఓపెన్గా ఉంటాయి. తాను చెప్తున్న విషయాలకు అనుగుణంగా చేతుల కదలికలు ఉంటాయి. బొటనవేలును చూపుడువేలును కలిసే చిన్ముద్రను ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఇవి అతను ఓపెన్గా ఉంటాడని, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని చెప్తాయి. చిన్ముద్ర అతను చెప్తున్నది నిజమేనన్న భావనను కలిగిస్తుంది. నిల్చున్నప్పుడు నిలకడగా ఉంటాడు, కదలికలు తక్కువగా ఉంటాయి. కూర్చున్నప్పుడు కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటాడు. సత్య నిలకడగా ఉంటాడని, తొందరపాటు లేదని, ఆత్మవిశ్వాసంతో ఉంటాడని ఇవి చెప్తాయి. సత్య మాటల్లో మొదటగా ఆకట్టుకునేది స్పష్టత. అతని మాటల్లో, పదాలను ఉచ్ఛరించడంలో, ఆలోచనను వ్యక్తీకరించడంలో స్పష్టత కనిపిస్తుంది... ఎక్కడా ఎలాంటి తొట్రుబాటు, గందరగోళం కనిపించదు. పదాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాడని తెలుస్తుంది. అలాగే తాను ప్రధానంగా చెప్పదలచుకున్న విషయాలను చెప్తున్నప్పుడు, కీలక పదాలను పలుకుతున్నప్పుడు నొక్కి చెప్పడం గమనించవచ్చు. స్వరం హైపిచ్లో ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలకన్నా కంపెనీ విజన్ గురించే ఎక్కువగా మాట్లాడతాడు. ఇవన్నీ అతనో విజువల్ పర్సన్ అని చెప్తాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు పనిని ఆనందిస్తారు. వేగంగా పనిచేస్తారు. చేసే పని పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటారు. అసంపూర్తి పనులంటే వీరికి అసౌకర్యంగా ఉంటుంది. సత్య మాట్లాడటం చూసినప్పుడు, సత్య గురించి చదివినప్పుడు ఈ లక్షణాలన్నీ మనం గమనించవచ్చు. జ్ఞాన పిపాసి... ఒక వ్యక్తి తన ప్రవర్తను ఎంతగా నియంత్రించుకోవాలని ప్రయత్నించినా సాధ్యంకాదు. అతను ఎంచుకునే పదాలు, మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికైన తర్వాత సత్య ఇచ్చిన ఇంటర్వ్యూలు, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు అతను రాసిన తొలి ఉత్తరం మూలాలపట్ల అతనికున్న అనురక్తిని, అతను ఈ స్థాయికి రావడానికి కారణాలను మనకు చూపిస్తాయి. అలాగే ఇన్నోవేషన్, కోర్, డూ మోర్... అని పలికేటప్పుడు ఆ పదాలపై ఒత్తిడి పెడతాడు. ఇవన్నీ అతని జ్ఞాన జిజ్ఞాసను ప్రతిఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూకూడా వందలాది కిలోమీటర్లు ప్రయాణంచేసి కోర్సు చేయడం ఇందులో భాగమే. స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్ట్, ఎంఐటీల్లో చదవకపోయినా తన జ్ఞాన జిజ్ఞాసతో అంతకంటే ఎక్కువే నేర్చుకున్నాడు. విలువలు, విశ్వాసాలే బలం... సత్య బలం అతని విలువల్లో, విశ్వాసాల్లో ఉంది. ఉద్యోగం కేవలం జీతంకోసమే కాదు... పలువురి జీవితాల్లో మార్పు తీసుకురావడానికని బలంగా విశ్వసిస్తాడు. ఆ శక్తి అందరిలోనూ ఉందని నమ్ముతాడు. అందరినీ అందులో భాగస్వాములను చేస్తాడు. సత్య మాటల్లో ‘నేను’కన్నా ‘మనం’ అనే పదం ఎక్కువగా వినిపించేది ఇందుకే. నా కుటుంబం, నా జీవితానుభవాలే నన్నీ స్థాయికి తెచ్చాయంటాడు సత్య. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఉత్సుకతే తన వ్యక్తిత్వమంటాడు. కొత్తవిషయాలు నేర్చుకోకపోతే కొత్తవి కనిపెట్టలేమని చెప్తాడు. లక్ష్యంకన్నా విజన్ ఇంకా గొప్పది. వ్యక్తిగత విజన్ను సంస్థ విజన్తో మమేకం చేయడం మరింత గొప్పపని. అది సత్యలో గమనించవచ్చు. ఏడాదికి, రెండేళ్లకు ఉద్యోగాలు మారే సాఫ్ట్వేర్ రంగంలో 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్లోనే పనిచేయడం సంస్థపట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. అంతగా అతను సంస్థను ప్రేమించాడు, సంస్థతో మమేకమయ్యాడు, సంస్థ విజన్ను తనతో ఐక్యం చేసుకున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా సత్యకే ఓటేశారు. - విశేష్, సైకాలజిస్ట్ -
'నా రాకుమారుడు' సినిమా స్టిల్స్
-
వర్మకు నా మీద కోపమెందుకంటే...
బాలీవుడ్ దర్శకులు రాం గోపాల్ వర్మ, కరణ్ జోహార్ ల మధ్య సోషల్ మీడియాతోపాటు, మీడియాలో కూడా మాటల యుద్దం గత కొద్దికాలంగా కొనసాగుతునే ఉంది. ఒకరి చిత్రాలపై మరొకరు వ్యంగ్యాస్త్రాలను విసురుకుంటూ అభిమానులకు ఆనందాన్ని పంచుతుంటారు. అయితే రాం గోపాల్ వర్మ, కరణ్ జోహర్ ల మధ్య వివాదానికి కారణమేంటో ఎవరికి తెలియదు. అయితే తాజాగా వర్మకు తనకు మధ్య రిలేషన్ ఎందుకు చెడిందనే విషయంపై కరణ్ వివరణ ఇచ్చారు. వర్మ చిత్రం 'సత్య'కు అవార్డులు రాకపోవడంతో తనపై ఓ రకమైన ద్వేషం పెంచుకున్నారు.. ఆ సంఘటనే మా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ను పెంచింది అని కరణ్ తెలిపారు. వివిధ విభాగాల్లో సత్య' చిత్రం అవార్డులు గెలుచుకోవాల్సిన అర్హత ఉంది. అయితే సత్య కంటే నా చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై' మరింత మెరుగ్గా కనిపించిదేమో అని కరణ్ అన్నారు. ఆ కారణంతోనే తన చిత్రాలపై వ్యంగ్యాస్త్రాలను విసురుతుంటారని.. అదే విధంగా తాను కౌంటర్ ఇస్తుంటానని కరణ్ వెల్లడించారు. బహుశా ఆకారణమే తనపై ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను అని కరణ్ తెలిపారు. -
పంబలకడి జంబ సినిమా స్టిల్స్