Shyam
-
కనువిందు.. ఇందూరు చిందు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జానపద కళారూపాల్లో చిందు బాగోతానికి ప్రత్యేక స్థానముంది. చిందు బాగోతాన్ని బతికించేందుకు ఇందూరు జిల్లా కళాకారులు ఎనలేని కృషి చేస్తున్నారు. ‘చిందు కళాసింధు’గా పేరొందిన బోధన్ ప్రాంతానికి చెందిన చిందుల ఎల్లమ్మ వారసత్వాన్ని.. జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన పులింటి శ్యామ్ (చిందుల c) కుటుంబం కొనసాగిస్తోంది. చిందుల శ్యామ్కు పద్మశ్రీ అవార్డు కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. శ్యామ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. 2021లో శ్యామ్ మరణించగా.. ఆయన కుటుంబం ఈ కళను బతికించేందుకు కృషి చేస్తోంది. శ్యామ్ కుమారులు పులింటి కృష్ణయ్య, గంగాధర్, కృష్ణయ్యతో పాటు డిగ్రీ చదువుతున్న కుమార్తె పులింటి శరణ్య సైతం చిందు బాగోతం ప్రదర్శనలిస్తోంది. అయిదో ఏట నుంచే శరణ్య చిందు కళను ప్రదర్శిస్తోంది. ఈ కళను బతికించడమే తన లక్ష్యమని శరణ్య చెబుతోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 40 బృందాలు, నిర్మల్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో మరో 70 బృందాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క బృందంలో 10 నుంచి 20 మంది కళాకారులు ఉన్నారు.» 1981లో పేరిణి శివతాండవం కళాకారుడు నటరాజ రామకృష్ణ ఆధ్వర్యంలో చిందు బాగోతంపై నిజామా బాద్ జిల్లాలో సర్వే చేశారు. అప్పటి నుంచి గుర్తింపు వచ్చింది. 1983లో చిందు బాగోతం మేళాను నిర్వహించగా ఇందూరు జిల్లా కళా కారులు నాయకత్వం వహించారు. 1986లో ఢిల్లీలో అప్నా ఉత్సవ్లో ఆర్మూర్ ప్రాంత చిందు కళాకారుల ప్రదర్శ నను అప్పటి ప్రధాని రాజీ వ్గాంధీ, రష్యా నేత మిఖాయిల్ గోర్బ చేవ్లు తిలకించి అభినందించారు.» చిందు బాగోతానికి నేపథ్యగానం ఉండ దు. పురాణాలను ఆకళింపు చేసుకుని.. సన్నివేశాలకు అనుగుణంగా భావోద్వేగా లను ప్రదర్శిస్తుంటారు. ఈ కళాకారులు తమ ఆభరణాలను ‘పాణికి’ (పునికి) కర్రతో తయారు చేసుకుంటారు. వీటి తయారీకి ఆరునెలల సమయం పడుతుంది. చిందు బాగోతానికి సంబంధించి నిజా మాబాద్, నిర్మల్ కళాకారులు తమకే ప్రత్యే కమైన సూర్యకిరీటం వినియోగిస్తున్నారు. వీటితో పాటు భుజకీర్తులు(శంఖు చక్రా లు), కంఠసరి, పెద్దపేరు, చిన్నపేరు. జడ ల చిలుకలు, మల్లెదండలు, చేదస్తాలు, దు స్తులు ఉపయోగిస్తున్నారు. రామాయణం, మహాభారతం, భాగవతం కథలతో కళా ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రస్తుతం సాంస్కృతిక, దేవాదాయ శాఖలు సూచించిన చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక చిందు బాగోతానికి చిరునామాగా ఉన్న చిందుల ఎల్లమ్మకు.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రతి ష్టాత్మక ‘హంస’ అవార్డుతో సత్కరించింది. చిందు బాగోతంలో స్త్రీ పాత్రలను సై తం పురుషులే ధరిస్తారు. అయితే చిందుల ఎల్లమ్మ మాత్రం.. స్త్రీ పాత్రలతో పాటు అన్నిరకాల పురుష పాత్రలు ధరించి ఈ కళకు చిరునామాగా నిలవడం విశేషం.రాత్రిపూట రారాజులం.. తెల్లారితే బిచ్చగాళ్లం..ప్రాచీన కళను బతికిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి. ప్రదర్శనలకు వెళ్తే.. రాత్రి పూట రారాజులం.. తెల్లవారితే బిచ్చగాళ్లం అనేలా మా పరిస్థితి తయారైంది. గురుశిష్య పరంపరలో నేర్చుకుని కళను బతికించేవారు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. వారసులే చిందు కళను బతికిస్తూ వస్తున్నారు. కళను బతికించేందుకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – పులింటి కృష్ణయ్య, మునిపల్లి, జక్రాన్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా -
ఓ దొంగతనం.. ఆపై పంచాయితీ..
వట్పల్లి (అందోల్): దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అందోలు మండలం చింతకుంట గ్రామంలో జరిగిన విందుకు ఆదివారం టాటా ఏస్ వాహనంలో వచ్చాడు. సోమవారం తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకొని వాహనాన్ని గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో నిలిపాడు. అదే గ్రామానికి చెందిన తాగుడుకు బానిసైన వడ్ల శ్యామ్ (21) ఆ వాహనాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామ శివారుకు వెళ్లగానే వాహనం కాల్వలో ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీసే ప్రయత్నంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు లేచి దొంగ దొంగ అని అరిచారు. దీంతో శ్యామ్ వెంటనే సమీపంలోని ఓ బైక్ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. బుజరంపేట గ్రామస్తులు దుంపలకుంటలోని సీసీ ఫుటేజీని పరిశీలించి వడ్ల శ్యామ్ను గుర్తించారు. గ్రామ పెద్దలతో సమావేశమై శ్యామ్ను తమకు అప్పగించాలని, లేకపోతే వాహనాన్ని ఇచ్చేది లేదని హెచ్చరించారు. అనంతరం శ్యామ్ తండ్రి యాదయ్యను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం శ్యామ్ అతడి తల్లిదండ్రులు యాదయ్య, బాలమణి (46), చిన్నమ్మ మమత బుజరంపేటకు పంచాయితీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తండ్రి, చిన్నమ్మ బస్లో బయలుదేరగా, శ్యామ్ తల్లి బాలమణితో బైక్పై బయలుదేరాడు. చింతకుంట బ్రిడ్జిపైకి రాగానే బైక్ను ఆపి మొదట శ్యామ్ మంజీరా నీళ్లలోకి దూకగా, అనంతరం తల్లి దూకింది. విషయం తెలుసుకున్న జోగిపేట, చిలప్చెడ్ పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్లోని హనుమాన్గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత ఇలా.. సంతోషంగా ఉంది!
India's 85th chess Grandmaster- దుబాయ్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అనుకున్నది సాధించాడు తమిళనాడు చెస్ ప్లేయర్ శ్యామ్ నిఖిల్. 31 ఏళ్ల శ్యామ్ నిఖిల్భారత చెస్లో 85వ గ్రాండ్మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. జీఎం హోదా దక్కాలంటే చెస్ ప్లేయర్ 2500 ఎలో రేటింగ్ను దాటడంతోపాటు మూడు జీఎం నార్మ్లు సాధించాలి. ఈ రెండూ సాధ్యమైతేనే జీఎం హోదా లభిస్తుంది. 2012లోనే శ్యామ్ 2500 ఎలో రేటింగ్ను అందుకోవడంతోపాటు రెండు జీఎం నార్మ్లు సాధించాడు. అయితే చివరిదైన మూడో జీఎం నార్మ్ కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది.12 ఏళ్లపాటు వేచి చూశాక ఎట్టకేలకు శ్యామ్ నిఖిల్ దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నీలో జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్ను అందుకున్నాడు. ఈ టోర్నీలో శ్యామ్ నిఖిల్ ఐదు పాయింట్లతో 39వ ర్యాంక్లో నిలిచాడు. చాలా సంతోషంగా ఉందిఈ క్రమంలో ఏడుగురు గ్రాండ్మాస్టర్లతో తలపడిన శ్యామ్ ఒకరిపై గెలిచి, ఆరుగురితో ‘డ్రా’ చేసుకొని మూడో జీఎం నార్మ్ను సాధించాడు. ‘ఎనిమిదేళ్ల వయస్సులో చెస్ ఆడటం ప్రారంభించాను. అయితే మూడేళ్లపాటు ఏ టోర్నీలోనూ ఆడలేదు. ఆ తర్వాత అండర్–13 రాష్ట్ర చాంపియన్షిప్లో విజేతగా నిలిచాను. 2012లోనే రెండు జీఎం నార్మ్లు అందుకున్నా మూడో జీఎం నార్మ్ సులభంగా రాలేదు. పలుమార్లు చేరువై దూరమయ్యాను. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మూడో జీఎం నార్మ్ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉంది’ అని 2022లో కామన్వెల్త్ చాంపియన్గా నిలిచిన శ్యామ్ నిఖిల్ వ్యాఖ్యానించాడు. -
Lok Sabha Election 2024: మోదీకి ఆయన స్టైల్లోనే బదులిస్తా
శ్యామ్ రంగీలా. మిమిక్రీ సంచలనం. ప్రధాని మోదీ, రాహుల్గాంధీ వంటి నేతలను అనుకరిస్తూ 2017లో ఆయన చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. సరిగ్గా ఏడేళ్ల తరవాత ఆయన స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అది కూడా వారణాసిలో మోదీపైనే పోటీ చేస్తున్నారు! రాజస్తాన్లోని శ్రీగంగానగర్కు చెందిన శ్యామ్ యూట్యూబ్ చానల్కు దాదాపు కోటిమంది సబ్స్రై్కబర్లున్నారు. మోదీని అనుకరిస్తూ ‘ధంగ్ కీ బాత్’ షో కూడా నడుపుతున్నారాయన. ఒకప్పుడు మోదీకి మద్దతు పలికిన శ్యామ్ ఆయనపైనే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇలాంటి పలు ప్రశ్నలకు ఆయన ఇచి్చన సమాధానాలు... ప్రధానిపై ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇటీవల సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. అది సరికాదనిపించింది. ఎన్నికల ప్రక్రియే ప్రజాస్వామ్యానికి ప్రాణం. పోటీ ఉండాలి. అలాకాకుండా బీజేపీ తన ప్రత్యర్థుల నామినేషన్లను విత్డ్రా చేయిస్తోంది. అందుకే నేను పోటీ చేస్తున్నా. ఒక సామాన్యుడు ప్రధానిపైనే పోటీలో నిలబడ్డాడనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. మీది రాజకీయ ప్రధాన హాస్యం. ప్రస్తుతం దేశ రాజకీయాల తీరుపై ఏమంటారు? ఇప్పుడు రాజకీయాలే అతి పెద్ద కామెడీ. రాజకీయాల్లో హాస్యానికి కొదవే లేదు. కమెడియన్లను నిషేధించి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ ఖర్చుతో కూడింది. మరి మీకు డబ్బులెలా...? నా దగ్గర ఏమీ లేవు. నేనేం చేసినా ప్రజల సాయంతోనే. ‘అభీ తో జోలా హై బస్. ఉఠాకే చల్ దేంగే, ఔర్ క్యా?’ (నా దగ్గరున్నది జోలె మాత్రమే. అది తీసుకుని రోడ్డున పడతానంతే) ‘జోలా ఉఠాకే’ అన్నది ప్రధాని మోదీ డైలాగ్ కదా! ఒకప్పుడు ప్రధాని మద్దతుదారుగా ఉన్న మిమ్మల్ని మార్చిందేమిటి? 2016 దాకా ప్రధానికి అభిమానినే. బీజేపీ అధికారంలోకి రాగానే ఇక అవినీతి పోతుందని, పెద్ద మార్పు వస్తుందని చాలామందిమి భావించాం. అందుకే ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టేవాన్ని. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్కు ఎంపికైనప్పుడు ఎగిరి గంతేశా. మోదీని అనుకరిస్తూ నేను చేసిన వీడియోకు ప్రశంసలొచ్చాయి. కానీ అది ప్రసారమే కాలేదు. ప్రభుత్వం వద్దందని చానల్ వాళ్లు చెప్పారు. నేను మోదీని అనుకరించానంతే. ఎందుకు వద్దన్నారో అర్థం కాలేదు. రాజకీయాలపై హాస్యానికి చాలా దేశాల్లో ఆదరణ ఉంది. భారత్లో పరిస్థితి ఏమిటనుకుంటున్నారు? ఇక్కడ వ్యంగ్యాన్ని, హాస్యాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. రాజకీయాలపై హాస్యం ఇక్కడ పని చేయదు. అందుకే చానళ్లలో పొలిటికల్ కామెడీ షోలే ఉండవు. రాహుల్ గాంధీపై జోకేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆహా్వనించవు, మోదీ మీద కామెడీ చేస్తే బీజేపీ ఊరుకోదు. అందుకే నా యూట్యూబ్లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నా. వారణాసిలో ప్రచారమెలా ఉంది? బాగా సాగుతోంది. నలుగురైదుగురు స్నేహితులు నా వెంట వచ్చారు. ఇక్కడ మరింతమంది కలిసొస్తున్నారు. మీకు వారణాసి ప్రజల మద్దతు ఉందనుకుంటున్నారా? కచ్చితంగా. పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచే నాకు మద్దతుగా సందేశాలు వస్తున్నాయి. వరుస కాల్స్ వస్తున్నాయి. ప్రచారంలోనూ మోదీని మీ స్టయిల్లో అనుకరిస్తారా? తప్పకుండా. మోదీకి ఆయన శైలిలోనే బదులిస్తానని ఇప్పటికే చెప్పా కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యామిలీతో తిరుమలలో సందడి చేసిన రేసుగుర్రం నటుడు (ఫొటోలు)
-
శ్యామ్ మెటాలిక్స్ షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది. కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది. క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
ఫ్లైఓవర్పై డివైడర్ను ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా..
సాక్షి, విశాఖపట్నం: ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు తెలుగుతల్లి ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లైఓవర్పై మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. వేగంగా వస్తూ వాహనాలను అదుపు చేయలేక ప్రమాదానికి గురవుతున్నారు. అల్లిపురం నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రెండో పట్టణ ఇన్చార్జి సీఐ రమణమూర్తి తెలిపిన వివరాలివీ.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన కాపరపు శ్యామ్(21), కాపరపు రాజు అలియాస్ బాబీ(20), అనకాపల్లి జిల్లా కొత్తూరుకు చెందిన తోట హర్ష అలియాస్ నాని ఇళ్లకు సున్నాలు వేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గాజువాకలో సున్నాలు వేసేందుకు వచ్చిన వారు బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో ఒకే బైక్పై ఆర్.కె.బీచ్కు వెళ్లారు. తిరిగి సుమారు మూడు గంటల ప్రాంతంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా గాజువాక వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పడంతో వంతెన చివర్లో గల మలుపు వద్ద డివైడర్ను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో శ్యామ్ తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే మరణించాడు. హర్ష తలకు తీవ్ర గాయాలవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రాజు కాళ్లు విరిగిపోవడంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే హర్ష ప్రాణాలు కోల్పోయాడు. రాజు ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. శ్యామ్, రాజులిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ.. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఏడీసీపీ, ఏసీపీలను ఆదేశించారు. నిబంధనలు పాటించాలి.. తెలుగుతల్లి ఫ్లైఓవర్పై ఎత్తు పల్లంతో కూడిన ప్రమాదకర మలుపు వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఫ్లైఓవర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది మరణించారని, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఇంజినీరింగ్ వైఫల్యమే ఇందుకు కారణమని, ఈ సమస్యపై గత ఫిబ్రవరిలో జీవీఎంసీ అధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. జీవీఎంసీ అధికారులు సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వాహన చోదకులు కూడా నిబంధనలు పాటించాలన్నారు. త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర, శిక్షార్హమైన డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. వాహన చోదకలు నిబంధనలు పాటించకపోవడం వల్ల వారితో పాటు పాదచారులకు భద్రత లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
బ్యాటరీ అల్యుమినియం ఫాయిల్స్ తయారీలోకి శ్యామ్ మెటాలిక్స్
కోల్కతా: ఎస్–ఈ–ల్ టై గర్ టీఎంటీ రీ–బార్లను ఉత్పత్తి చేసే శ్యామ్ మెటా లిక్స్ అండ్ ఎనర్జీ కొత్తగా బ్యాటరీ–గ్రేడ్ అల్యుమినియం ఫాయిల్స్ తయారీలోకి ప్రవేశించింది. ఈ ఫాయిల్స్ను లిథియం అయాన్ సెల్స్ తయారీలో ఉపయోగిస్తారు. దీనితో అంతర్జాతీయంగా లిథియం అయాన్ సెల్ మార్కె ట్లో ముడివస్తువులకు సంబంధించి భారత్ గణనీయమైన వాటాను దక్కించుకోవడంలో శ్యామ్ మెటాలిక్స్ తోడ్పాటు అందించగలదని సంస్థ పేర్కొంది. 1 గిగావాట్అవర్ ఎల్ఎఫ్పీ (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) సెల్స్ తయారీ కోసం 350 టన్నుల అత్యంత శుద్ధి చేసిన అల్యూమినియం ఫాయిల్ అవసరమవుతుందని తెలిపింది. -
రేఖా నాయక్ తిరుగుబాటు..కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్లకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో ఒకరైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ ఈ పరిణామాల్లో భాగంగానే.. ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనకు ఆసిఫాబాద్ టికెట్టు ఖరారైనట్లు సమాచారం. రేఖా నాయక్ను కూడా కాంగ్రెస్లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్కు కూడా ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. -
సమర్థవంతంగా జువెనైల్ జస్టిస్
సాక్షి, హైదరాబాద్: పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం జువెనైల్ జస్టిస్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, యూనిసెఫ్ పలు చర్యలు తీసుకుంటున్నాయని తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి అభివృద్ధే సమాజ ప్రగతి అన్నారు. లీగల్ సర్విసెస్ అథారిటీ, జ్యుడీషియల్ అకాడమీ సంయుక్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. జువెనైల్ జస్టిస్పై రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలీ, జ్యువెనైల్ జస్టిస్ బోర్డు చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్యామ్ కోషి మాట్లాడారు. పాఠశాలల్లో, నివాస ప్రాంతాల్లో ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని, పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలని జస్టిస్ అభినంద్కుమార్ షావిలీ ఉద్ఘాటించారు. బాల నేరస్తులను సంస్కరించడం, పునరావాసం కల్పించడం లాంటి అంశాలను చట్టంలో పొందుపరిచారని జస్టిస్ వినోద్కుమార్ పేర్కొన్నారు. జువెనైల్కు న్యాయ సేవలను అందించడంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ స్టేట్ లీగల్ సర్విసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్రెడ్డి వివరించారు. జువెనైల్ జస్టిస్ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు. -
‘అన్లాగ్’లో ఇంటర్న్షిప్కు ట్రిపుల్ఐటీ విద్యార్థులు
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ఈసీఈ ఆఖరి సంవత్సరం విద్యార్థులు తొమ్మిది మంది అమెరికన్ బహుళజాతి సెమీ కండక్టర్ కంపెనీ అయిన అన్లాగ్ డివైజెస్కి ఎంపికయ్యారు. ఆ సంస్థ ప్రతినిధులు ట్రిపుల్ఐటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించి ఆప్టిట్యూడ్, టెక్నికల్ పరీక్షల అనంతరం తొమ్మిది మంది విద్యార్థులను ఏడాదిపాటు లాంగ్టర్మ్ ఇంటర్న్షిప్కు ఎంపిక చేశారు. ఇంటర్న్షిప్ సమయంలో ఈ విద్యార్థులకు నెలకు రూ.40వేలు చొప్పున స్టయిఫండ్ ఇస్తారు. ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత వారి పనితీరు ఆధారంగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఇదే సంస్థ గతేడాది నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి రూ.27లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలను ఇచ్చింది. ఈ సందర్భంగా ట్రిపుల్ఐటీ ఈసీఈ హెచ్వోడీ పి.శ్యామ్ మాట్లాడుతూ భారతదేశ సెమీ కండక్టర్ పాలసీ ఫ్రేమ్ వర్క్కు అనుగుణంగా అగ్రశ్రేణి విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణుల సలహాలు, సూచనల మేరకు ట్రిపుల్ఐటీలో పాఠ్యాంశాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది రకాల అత్యాధునిక ల్యాబ్లతో నిరంతరం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
భారత – చైనా బంధం బలపడేనా?
సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే! అయితే గల్వాన్ ఘర్షణలు చైనా ప్రణాళికాబద్ధంగా జరిపినవన్న భారత్ అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్కు కచ్చితమైన ఆలోచన ఉంది. ఎల్ఏసీ గురించి సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. వార్షిక వరల్డ్ పీస్ ఫోరమ్లో పాల్గొనడానికి నేను ఈ నెల ప్రారంభంలో బీజింగ్లో ఉన్నాను. ఆ సమావేశంలోనే అదనంగా భారత్–చైనా సరిహద్దు సమస్యపై ఒక ఆంతరంగిక చర్చ జరిగింది. దీనికి పలువురు చైనా విద్వాంసులు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ చైనా అధికారులు కొందరితో సంభాషణకు కూడా వీలు కలిగింది. ఇవి భారత్–చైనా సంబంధాలకు సంబంధించిన అవకాశాల గురించి చైనా అవగాహన విష యంలో ఒక కొత్త గవాక్షాన్ని అందించాయి. సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే. చైనీయుల ప్రకారం, సరిహద్దు పరిస్థితి ‘స్థిరీకరించబడింది’. ఘర్షణకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించడంలో పురోగతి సాధించామనీ, అయితే మరికొన్ని మిగిలి ఉన్నా యనీ భారతదేశం గుర్తిస్తోంది. 2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు ముందు ఉన్న యథాతథ స్థితికి తిరిగి రావడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు ఎవరూ భావించడం లేదు. భారత–చైనా సరిహద్దు ప్రశ్న (2005) పరిష్కారానికిగానూ రాజకీయ పారామితులు, మార్గదర్శక సూత్రంతో సహా – వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) స్పష్టం చేయడం కోసం ఉమ్మడి కసరత్తును చేపట్టేందుకు – అనేక శాంతి భద్రతల ఒప్పందాలను ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, చైనీయులు అలా చేయడానికి నిరాకరించారు. భూభా గాన్ని ‘కొద్దికొద్దిగా కొరుక్కు తింటూ’ చైనాను భారతదేశం దూరంగా నెడుతోందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు, భారత్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఎల్ఏసీ స్పష్టీకరణ ద్వారా అటువంటి కబళింపును కచ్చి తంగా నిరోధించవచ్చని ఎత్తి చూపడం ద్వారా ఒకరు దీనిని ప్రతిఘటించారు. దీనికి సమాధానం ఏమిటంటే, 2004లో జరిగిన సమా వేశంలో ఈ కసరత్తు ప్రారంభమైనప్పుడు, చైనా ప్రాదేశిక క్లెయిమ్లను బలహీనపర్చగల ‘అతిశయోక్తి’ క్లెయిమ్లను భారతదేశం పశ్చిమ సెక్టార్లో ముందుకు తెచ్చింది. ఎల్ఏసీని సరిగా స్పష్టం చేయకపోవడం వల్ల భారత్ అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సందిగ్ధతలను ప్రదర్శించగల వీలు చైనాకు కలుగుతుంది. అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్కు కచ్చితమైన ఆలోచన ఉంది. కొన్ని అంశాల్లో ఎల్ఏసీకి సంబంధించి ‘భిన్నమైన అవగాహనలు’ ఉన్నాయని మనం చెప్పు కోకూడదు. భారత్ పేర్కొన్నట్లుగా ఎల్ఏసీపై పోటీ పడటంలో చైనా పక్షానికి కొంత సమర్థన ఉందని ఇది పరోక్షంగా అంగీకరిస్తుంది. ఎల్ఏసీ అమరికలో మనం పరిగణించే వాటిపై చైనీస్ పక్షాన్ని పోటీ పడనివ్వండి. ఎల్ఏసీ ఎక్కడ ఉందనే దాని గురించి మనకు సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. మొత్తంమీద, సరిహద్దు వద్ద ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే రెండు వైపులా భారీ సైన్యాన్ని మోహరించే అవకాశం లేదు. ఎల్ఏసీ వైపు చైనా నిర్మించిన తాజా శాశ్వత, పాక్షిక–శాశ్వత నిర్మాణాలను కూల్చి వేయడం, తొలగించడం కూడా అసంభవం. భారత్ అలవర్చుకోవా ల్సిన మెరుగైన సామర్థ్యానికి ఇవి సూచికలా పనిచేస్తాయి. భవిష్యత్లో ఏం జరగవచ్చో సూచించే రెండు ఘటనలు కూడా ఉన్నాయి. సరిహద్దు సమస్యపై తరచూ వ్యాఖ్యానించే చైనా మాజీ పీఎల్ఏ అధికారి ఒకరు, గల్వాన్ ఘర్షణలు చైనా బలగాలు ముంద స్తుగా, ప్రణాళికాబద్ధంగా జరిపిన ఆపరేషన్ అని భారత్ భావిస్తున్న అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ నాతో అన్నారు. నేను ఇంతకు ముందు ఇది వినలేదు. పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కమిషన్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ ఆఫీస్ డైరెక్టర్గా ఉన్న వాంగ్ యీ(జూలై 25నే తిరిగి విదేశాంగ మంత్రి అయ్యారు) ఇటీవల జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో జరిపిన భేటీలో, ‘నిర్దిష్ట సమస్యలు మొత్తం సంబంధాన్ని నిర్వచించనివ్వకుండా, సరిహద్దు సమస్యకు ఇరు పక్షాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’ అన్నారు. ఇది చైనా వైఖరికి పునఃప్రకటన. అయితే, ‘భారత పక్షం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునేలా, సరిహద్దు సమస్యకు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు’ ఆయన కొనసాగించారు. ఆ ప్రాంతం చైనా సార్వభౌమ భూభాగమనీ, దానిని కాపాడు కుంటామనీ చైనా ప్రకటనలు పేర్కొంటున్నాయి కాబట్టి గల్వాన్ సంఘటన నేపథ్యంలో, ఇది సాపేక్షంగా సామరస్యపూర్వకమైన భాషగా కనిపిస్తోంది. దీంతో సంబంధాలు ‘మెరుగుపర్చుకునే’ అవ కాశం లేకుండా పోయింది. మారిన భాషను మనం అతిగా వ్యాఖ్యా నిస్తున్నామేమో! కాలమే దీన్ని తేల్చి చెబుతుంది. ప్రధాని మోదీ వాషింగ్టన్ లో ఉన్నత స్థాయి అధికారిక పర్యటన విజయవంతంగా ముగించిన తర్వాత వెంటనే బీజింగ్లో నా సంభాషణలు జరిగాయి. భారత్–అమెరికా సంబంధాల్లో పురోగతిపై చైనా ఆందోళన స్పష్టంగా కనిపించింది. చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భారత్ భాగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ‘నాటో’ పాత్రకు భారతదేశం మద్దతు ఇస్తుందా అనేది నాకు వారు సంధించిన ఒక ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం, నాటో అనేది యూరోపియన్ భద్రతకు సంబంధించినదనీ, ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఆసియా అనేక యంత్రాంగాలను కలిగి ఉందనీ నేను చెప్పాను. గ్లోబల్ సౌత్ నుండి చైనాను మినహాయించాలని భారతదేశం ప్రయత్నిస్తున్నదా అనే ఆందోళన కూడా వారిలో ఉంది. తాము గ్లోబల్ సౌత్లో భాగమా, కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది చైనాయేనని నేను చెప్పాను. త్వరలో జరగనున్న జీ20 సదస్సు సన్నాహాల్లో భాగంగా, గ్లోబల్ సౌత్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ చొరవ తీసుకోవడం చైనాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థికపరమైన చిక్కులను కలిగించవచ్చు కాబట్టి, చైనాకు ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను నిరాకరించే అమెరికా ప్రయత్నాల గురించి వారు ప్రస్తావించారు. చైనా చేసిన మరొక ఫిర్యాదు ఏమిటంటే, ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీఓ) సమావేశాన్ని భారత్ వ్యక్తిగత స్థాయిలో కాకుండా, క్లుప్తంగా ఆన్ లైన్ సదస్సును నిర్వహించడం ద్వారా దాని ‘స్థాయిని తగ్గించింది’ అని. ఇది అమెరికా ప్రభావంతో జరిగిందనే అనుమానం చైనాకు ఉంది. మొత్తంమీద, చైనా తన గురించి తాను అస్పష్టంగానే ఉందనే భావన కలుగుతుంది. అదే సమయంలో భారత్ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యతనూ, చురుకుదనాన్నీ ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది. పెట్టుబడి, సాంకేతికత ప్రవాహానికి భారతదేశం కొత్త గమ్యస్థానంగా మారినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది చైనా ఆర్థిక అవకాశాల గురించి గుర్తించిన ఒక నిర్దిష్ట నిరాశా వాదానికి సంబంధించినది కావచ్చు. ఇది భారతదేశం పట్ల చైనా వైఖరిలో మార్పును సూచిస్తుందా? ఇకపై సంఘటనలు ఎలా వెల్లడవుతాయో చూద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి,ఆనరరీ ఫెలో, సీపీఆర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విషాదం.. యంగ్ టైగర్ వీరాభిమాని మృతి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ను ప్రాణానికి ప్రాణంగా భావించే అభిమాని శ్యామ్ (23) కన్నుమూశాడు. చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. కానీ శ్యామ్ చనిపోయింది మాత్రం చింతలూరు గ్రామం. అక్కడ తను ఉంటున్న రూమ్లో ఉరి వేసుకుని చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి ) కాగా.. గతంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీ ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఆ సమయంలో వేదికపై వచ్చిన శ్యామ్ ఎన్టీఆర్ను హత్తుకున్నారు. ఆ సమయంలో ఆ వీడియో తెగ వైరలైంది. ప్రస్తుతం శ్యామ్ మృతి చెందడంతో ఆ వీడియోను షేర్ చేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ ఇంట విషాదం) RIP raa Thammudu...😭😭💔 Epudu natho events lo evaru Racha chestharu...😭😭😭😭 Final ga ni dream fullfill chesukuni elipoyav😭😪 (@tarak9999 Kalesav) NTR fans lo Unna oka Thammudu kuda vadhilesi poyadu..😪 @shyambadboy6 Om Shanti 🙏🥀💔😭 pic.twitter.com/lBMCCBKqaI — Sandhya NTR🖤 (@Kuttima_kutty) June 25, 2023 Today We Lost One Of Our Co Fan @shyambadboy6 💔 Rest In peace Brother 🙏 pic.twitter.com/Zbf1NViqNI — Jr NTR Fan Club (@JrNTRFC) June 25, 2023 -
విజయ్ దేవరకొండ ఖాతాలో మరో కంపెనీ
హైదరాబాద్: టీఎంటీ బార్ల తయారీలోని శ్యామ్ స్టీల్ నటుడు విజయ్దేవరకొండతో కలసి నూతన డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. టెలివిజన్ ప్రచార చిత్రాన్ని ఇగ్నిషన్ ఫిల్మ్స్కు చెందిన రెన్సిల్ డిసిల్వ, పార్థో సర్కార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ టెలివిజన్ ప్రచారం ద్వారా ఏపీ, తెలంగాణలో కస్టమర్లకు తన ఉత్పత్తులను మరింత చేరువ చేయాలన్నది శ్యామ్ స్టీల్ ప్రణాళికగా ఉంది. -
రూ. 2,500 కోట్లతో శ్యామ్ స్టీల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీఎంటీ ఉక్కు కడ్డీల తయారీ సంస్థ శ్యామ్ స్టీల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తమ రిటైల్ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే అయిదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు డీలర్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ లలిత్ బెరివాలా తెలిపారు. అలాగే నటుడు విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు రూ. 2,500 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లోని ప్లాంటుపై రూ. 1,000 కోట్లు, మరో కొత్త ప్లాంటుపై రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు బెరివాలా చెప్పారు. ప్రస్తుత సామర్థ్యం వార్షికంగా 0.7 మిలియన్ టన్నులుగా ఉండగా, దీన్ని 1 మిలియన్ టన్నులకు పెంచుకుంటున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,500 కోట్ల టర్నోవరు నమోదు కాగా వచ్చే మూడేళ్ల వ్యవధిలో దీన్ని రూ. 9,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. -
రజనీకాంత్తో విజయ్ని పోల్చడం సరికాదు!: నటుడు శ్యామ్
తమిళ సినిమా: నటుడు విజయ్తో కలిసి వారీసు చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు శ్యామ్ పేర్కొన్నారు. 12బి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. అలాగే పలు చిత్రాలకు కూడా ఆయన నిర్మాత వ్యవహిరించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారసుడు(తమిళంలో వారీసు) చిత్రంలో ఆయనకు సోదరుడిగా ముఖ్య పాత్రలో శ్యామ్ నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా నేడు(బుధవారం) 11వ తేదీన భారీ అంచనాల మధ్య వారిసు చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా నటుడు శ్యామ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన మంచి ఎంటర్టైనర్ కథాచిత్రంగా వారీసు ఉంటుందన్నారు. తాను ఆరంభ దశలో విజయ్తో ఖుషి చిత్రంలో చిన్న పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 12బి చిత్రంలో కథానాయకుడిగా నటించినప్పుడు విజయ్ తనను అభినందించారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ వారీసు చిత్రంలో ఆయనతో కలిసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. విజయ్ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా మాట్లాడతారని,ఎక్కువగా కసరత్తులు చేస్తారన్నారు. ప్రస్తుతం సూపర్స్టార్ ఎవరన్న ఆంశంపై పెద్ద చర్చే జరుగుతోందని, అయితే ఈ విషయంలో రజనీకాంత్తో విజయ్ని పోల్చడం సరికాదని పేర్కొన్నారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి నటుల స్థాయి వేరని, అయితే విజయ్కు అజిత్కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందన్నారు. ఇద్దరికీ అత్యధిక సంఖ్యలోనే అభిమానులు ఉన్నారన్నారు. పొంగల్కు విడుదల అవుతున్న వారిసు, తుణివు చిత్రాలు రెండు విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాను నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని, గోలీ సోడా 3 చిత్రంలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు, మరికొన్ని చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తెలుగు, కన్నడంలోనూ నటిస్తున్నానని, అదే విధంగా త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు శ్యామ్ చెప్పుకొచ్చారు. -
స్వతంత్ర భారత్ తొలి ఓటర్ కన్నుమూత..
-
‘క్రైమ్ థ్రిల్లర్గా 'అం అః’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించడం చాలా కష్టంగా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్పా.. ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. . ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అం అః'. ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్లైన్. సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా ఈ చిత్రానికి శ్యామ్ మండల దర్శకత్వం వహిస్తున్నారు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . చిత్ర ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా విడుదలైన 'నీ మనసే నాదని' వీడియో సాంగ్ , టీజర్కి మంచి స్పందన లభించింది.సస్పెన్స్కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. -
హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం
Hero Nikhil Father Passed Away: యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం(ఏప్రిల్ 28) ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి అకాల మరణంతో నిఖిల్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. చదవండి: ‘ఆచార్య’లో సత్యదేవ్ అతిథి పాత్ర, గర్వంగా ఉందన్న చిరు నిఖిల్ తండ్రి మరణవార్త తెలిసి టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. నిఖిల్ను పరామర్శిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే 'స్పై' టైటిట్తో ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్స్తో ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళుతున్న నిఖిల్కు పితృవియోగం కలగడం అందరిని కలిచివేస్తోంది. -
Shyam Karri: అందుకే నా పెయింటింగ్స్కు అంతర్జాతీయ గుర్తింపు
తాను కెరీర్ ఎంపిక చేసుకునే సమయంలో ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి. కానీ ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియడం లేదు. ఆ సమయంలో జిడ్డు కృష్ణమూర్తి ‘థింక్ ఆన్ దిస్ థింగ్స్’ పుస్తకం దారి చూపింది. తనను ప్రతిభావంతుడైన వాటర్ కలర్ ఆర్టిస్ట్గా మార్చింది... పుడుతూనే పోలియో బారిన పడ్డాడు శ్యాం. విశాఖలో జన్మించిన శ్యాం దాదాపు ఐదేళ్ల వరకు నడవగలడో లేదో అనే ఆందోళన అందరిలో. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడిని నేలపై తొలి అడుగులు వేయించింది. కొద్దికాలానికి అతని అడుగులు స్కూల్ వైపు సాగాయి. స్కూల్లో డ్రాయింగ్ నేర్పించే ఉమా టీచర్ ప్రభావంతో శ్యాంకు పెయింటింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇంజినీరింగ్ చదివేందుకు శ్యాంకు ఎన్ఐటీ తిరుచ్చిలో సీటు రావడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఇంజినీరింగ్, ఫిలిం మేకింగ్, పెయింటింగ్... ఇలా ఏ రంగంలో రాణించాలా? అనే ఆలోచనలు మొదలయ్యాయి. అయితే చివరిగా ప్రకృతికి హాని కలిగించని అంశాన్నే కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో జిడ్డు కృష్ణమూర్తి రాసిన ‘థింక్ ఆన్ దిస్ థింగ్స్’ పుస్తకం శ్యామ్కు మార్గం చూపింది. అంతర్జాతీయ వాటర్ కలర్ చిత్రకారులు మిలింద్ ముల్లిక్, రాజ్కుమార్ స్తబథేలు తాను అభిమానించే గురువులుగా చెప్పుకునే శ్యాం సహజత్వం, భావోద్వేగమైన ఆవిష్కరణతో పలు వేదికలపై వారి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. ‘‘నా పెయింటింగ్స్లో నిత్యం ప్రయోగాలకే ప్రాధాన్యమిస్తాను. ప్రతి పెయింటింగ్ను నా తొలి పెయింటింగ్గా ఫీలవుతాను. పెయింటింగ్ వేసే ముందు ప్రకృతితో మమేకమయ్యేందుకు తాపత్రయపడతాను. అందుకే పెయింటింగ్స్ వేసేందుకు మా ప్రాంతంలో ఆకర్షణీయ స్థలాలతోపాటు హంపి, కొడైకెనాల్, హిమాచల్ప్రదేశ్లకు ఎక్కువగా వెళతాను. కొన్ని ప్రాంతాల్లో వాటర్లోని సాల్ట్, ఫ్లోరిన్ శాతాలను బట్టి పెయింటింగ్స్లో అద్భుత ఆవిష్కరణ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. నా పెయింటింగ్స్లో ఎక్కువగా యానిమల్స్ ఎమోషన్స్ కనిపిస్తాయని అభిమానులు చెబుతారు. అందుకే వాటికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా నా పెయింటింగ్స్ కోసం ఆర్డర్లు వస్తున్నాయి’’ అంటున్నాడు శ్యాం. – పలివెల రవీంద్ర, ఎంవీపీ కాలనీ, సాక్షి, విశాఖపట్టణం చదవండి: Nishitha Rajput: అనుమానాలు.. అవమానాలు.. అయినా 3 కోట్ల రూపాయలు సేకరించి.. చదువులమ్మా.. నువ్వు చల్లంగుండాల! ఇది కూడా చదవండి: Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! పిస్తాతో పాటు వీటిని తింటే.. -
రాజధాని రైతులను ప్రత్యేకవర్గంగా చూడాలంటే ఎలా?
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక హక్కులున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ తెలిపారు. రాజధాని రైతులను ప్రత్యేకవర్గంగా చూడాలని, వారిని ఇతరులతో పోల్చడానికి వీల్లేదని చెప్పారు. ఈ వాదనపై హైకోర్టు స్పందిస్తూ.. రాజధాని అన్నది ఏ వర్గానిదో కాదని, అది అందరిదీ అవుతుందని వ్యాఖ్యానించింది. అమరావతిని ప్రజల రాజధాని అని చెబుతున్నప్పుడు అది రాష్ట్ర ప్రజలందరిదీ అవుతుందే తప్ప కొద్దిమందిది ఎంత మాత్రం కాజాలదంది. కర్నూలు, విశాఖపట్నం కూడా అందరివీ అవుతాయని తెలిపింది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు తాము పోరాడాం కాబట్టి ఈ దేశం తమది అవుతుందని ఎలా చెప్పజాలరో, అలా రాజధానిని కూడా తమదని కొద్దిమంది చెప్పడానికి వీల్లేదని పేర్కొంది. రాజధానిని మనది అని ఎందుకు భావించరని ప్రశ్నించింది. దివాన్ తదుపరి వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. పిటిషనర్లలో ఒకరైన రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ రెండోరోజు మంగళవారం తన వాదనలను కొనసాగించారు. రాజధాని విషయంలో ఎన్నికల తరువాత ప్రభుత్వ తీరు మాత్రం మారిపోయిందన్నారు. రైతుల త్యాగాలకు ప్రభుత్వం విలువ లేకుండా చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తికావడానికి చట్టంలో నిర్దిష్ట కాలవ్యవధి ఉందన్నారు. అయితే ప్రభుత్వ చర్యల వల్ల ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితిలేదన్నారు. చట్ట ప్రకారం చేయాల్సిందేదీ ప్రభుత్వం చేయలేదన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం చట్టాన్ని అపహాస్యం చేసిందన్నారు. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్న మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తామని అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ) చట్టంలో ప్రస్తావించారని, అయితే ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్కు తిలోదకాలిచ్చేందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. అందులో భాగంగానే పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తెచ్చారని దివాన్ పేర్కొన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
రాజకీయాలకు బ్యూరోక్రసీ బలి..!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన విభేదాలు, రిటైర్మెంట్కు దగ్గరైన పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిని ఇరకాటంలో పడేయటం మన దేశ పాలనా తీరును పట్టి చూపిస్తోంది. ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రాజకీయ పెనుగులాటలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ పావులాగా మారారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల డెప్యుటేషన్లో పాటించాల్సిన విధానాలు ఆయన విషయంలో అమలు కాలేదు. మోదీ హయాంలో ఉన్నతోద్యోగుల స్థాయి దిగజారిపోయిందన్న భావన పెరుగుతోంది. బ్యూరోక్రసీ నియామకం ప్రక్రియలో చేపట్టే స్పల్ప మార్పులు సైతం దేశానికి ఉత్తమంగా సేవలందించడానికి సివిల్ సర్వీసును పూర్తిగా మార్చివేయడంలో దోహదపడతాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన ఆలాపన్ బందోపాధ్యాయ్ని అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేయడం ద్వారా తలెత్తిన వివాదం కారణంగా దేశ ఉన్నతాధికార వర్గం రాజకీయాల ముందు మరోసారి తలవంచినట్లయింది. అలాపన్ మే 31న రాజీనామా చేయాల్సి ఉంది. కానీ ఆయన పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. గత వారం బెంగాల్లో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై సర్వేలో భాగంగా ప్రధాని బెంగాల్ని సందర్శించడానికి కొద్ది రోజుల ముందు ఈ నిర్ణయం జరిగింది. కానీ మే 31న ఆలాపన్ బందోపాధ్యాయను వెంటనే ఢిల్లీకి వచ్చి రిపోర్ట్ చేయాలంటూ సివిల్ సర్వీసుల వ్యవహారాలను చూసే సిబ్బంది, శిక్షణా విభాగం ఉన్నట్లుండి తాఖీదు పంపింది కానీ ఈ ముందస్తు, ఆకస్మిక ఆదేశానికి కారణం కూడా చెప్పలేకపోయింది. ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని కేంద్రానికి బదిలీ చేసే ప్రక్రియను పర్సనల్, ట్రెయినింగ్ విభాగం పాటించలేదు. ఏ అధికారినైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి డెప్యుటేషన్పై తీసుకోవాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లాంఛనప్రాయంగా అభ్యర్థన పంపాలి. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రం తోసిపుచ్చవచ్చు కూడా. ఆ తర్వాత మాత్రమే తన అభ్యర్థనను అమలు చేసి తీరాలని కేంద్రం తన అధికారాన్ని ప్రయోగించే వీలుంది. అయితే ఎంతో సీనియర్ అయి ఉండి కూడా ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రాజకీయ పెనుగులాటలో ఆలాపన్ బందోపాధ్యాయ్ పావులాగా మారిపోవడం గమనార్హం. ప్రధాని మోదీ హయాంలో ప్రభుత్వ ఉన్నతోద్యోగి పాత్ర, ప్రతి పత్తి పూర్తిగా దిగజారిపోయాయన్న భావన పెరుగుతోంది. గత కొన్నే ళ్లుగా రాష్ట్ర కేడర్లోని ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో పదోన్నతిని కోరుకోకుండా తమ తమ రాష్ట్ర స్థాయిలో సర్వీసును పూర్తి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లో కేంద్రంలో పనిచేయడం గొప్ప అవకాశంగా సివిల్ సర్వీసు అధికారులు భావించేవారు. కానీ, ప్రస్తుతం కేంద్రంలో పనిచేయాలంటేనే ఉన్నతాధికారులు జడుసుకుంటున్నారు. భారత గణతంత్ర ప్రజాస్వామ్యం ప్రారంభ దినాలనుంచే దేశంలో సివిల్ సర్వీసు పాత్ర వివాదాస్పదంగా ఉంటూ వచ్చింది. 1969లో ఇందిరాగాంధీ నిబద్ధత కలిగిన సివిల్ సర్వీసు కావాలంటూ పిలుపిచ్చారు. కానీ భారత రాజ్యాంగం, సర్వీసు నిబంధనలు మాత్రం ప్రతిభ ప్రాతిపదికన పనిచేసే సివిల్ సర్వీసు కావాలని పేర్కొన్నాయి. దీనికోసం జాతీయ స్థాయి పోటీ పరీక్షల ద్వారా ఉన్నతోద్యోగులను నియమించాలని, సంబంధిత విభాగంలో వృత్తిపరమైన శిక్షణను అందిస్తూ వారి పనితీరును అంచనా వేసే ప్రక్రియను కచ్చితంగా పాటించాల్సి ఉందని నిబంధనలు సూచించాయి. ఉద్యోగి పనితీరు మదింపు ప్రక్రియలో రాజకీయ ప్రభువులకు ఏ పాత్రా ఉండేది కాదు. 2016లో అఖిల భారత సర్వీసుల్లో తీసుకొచ్చిన కొత్త మదింపు ప్రక్రియలోనూ రాజకీయ పాత్రకు చోటివ్వలేదు. అంటే ఒక ఉన్నతాధికారి నాణ్యతను మదింపు చేసే అధికారం మంత్రికి కూడా ఉండదన్నమాట. రాజ్యాంగ విలువలను ఎత్తిపెట్టడమే తమ లక్ష్యమైనందున అఖిల భారత సర్వీసు, ఇతర కేంద్ర సర్వీసుల్లో పనిచేసేవారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉండేది. అయితే ఈ రాజ్యాంగ రక్షణ సైతం ఉన్నతాధికారుల పనితీరులో రాజకీయ జోక్యాన్ని నివారించేది కాదు. రాజకీయ నాయకులతో అధికారవర్గం కుమ్మక్కు కావడం ఉండేది కానీ దీనికి చాలా మినహాయింపులు మాత్రమే ఉండేవి. కానీ క్రమేణా రాజకీయ ప్రభువులు ఉన్నతాధికారుల నియామకం, బదిలీపై అధికారాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికార వర్గం రాజకీయ పార్టీల ఇచ్ఛకు, అధికారంలో ఉన్న నాయకుల సంకల్పానికి లోబడుతూ వచ్చేవారు. ఉన్నతాధికారుల్లో వృత్తిగత నైపుణ్యాలు, అనుభవం కంటే వారి విశ్వాçÜం, భావజాల పరమైన సారూప్యతలే విలువైనవిగా రాజకీయ నేతలు భావించడం కొనసాగేకొద్దీ బ్యూరోక్రసీలో రాజకీయాలు చోటుచేసుకోవడం పెరుగుతూ వచ్చింది. విజ్ఞానం, అనుభవం ప్రాతిపదికన ఉత్తమమైన సలహాలను అందించే ధోరణి తగ్గిపోయి రాజకీయ ప్రాధాన్యతలకు విలువ ఇచ్చేదిగా ప్రభుత్వంలోని ఉన్నతోద్యోగుల పాత్ర కుదించుకుపోయిందని నేను గతంలోనే సూచించాను. ఈ దురదృష్టకరమైన పక్షపాతం, ముందస్తు ఇష్టాల కారణంగానే కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్తో సరిగా వ్యవహరించడంలో మన పాలనాయంత్రాంగంలో లొసుగులు చోటుచేసుకున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. మన ఉన్నతాధికారవర్గ పనితీరుపై రాజకీయ నాయకుల్లో కానీ సాధారణ ప్రజానీకంలోకానీ అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ ఆధునిక రాజ్యంలో పరిపాలనా యంత్రాంగం పాత్ర అనివార్యమైందని అందరూ ఆమోదించాలి. ఈ నేపథ్యంలో ప్రతిభ, బాధ్యత, సమర్థత ప్రాతిపదికన సివిల్ సర్వీసును మెరుగుపర్చడానికి మనముందున్న మార్గాలేవీ అని ప్రశ్నించుకోవాలి. ఒకటి. ఉన్నతాధికారుల నియామకం వయోపరిమితిని 21–24 సంవత్సరాల వయస్సుకే కుదించాలి. ఈ వయసులో ఉన్న వారు పరీ క్షలు రాసి ఉత్తీర్ణులయ్యేందుకు పలు ప్రయత్నాలు కల్పించాలి. ఇప్పుడు జనరల్ కేటగిరీలో 32 సంవత్సరాలు, రిజర్వుడ్ కేటగిరీలో 35 సంవత్సరాల వరకు గరిష్టంగా వయో పరిమితిని పెంచారు. ప్రభుత్వోద్యోగికి తగిన శిక్షణ ఇచ్చి, ప్రస్తుత కాలానికి తగిన పాలన అవసరాలకు అనుగుణంగా వారి నైపుణ్యాలను, వైఖరులను తీర్చిదిద్దాలంటే యుక్తవయసులోనే నియమించుకోవడానికి చాలా ప్రాధాన్యత ఉంది. రెండు. ప్రభుత్వోద్యోగులు పదవీ విరమణ చేశాక, ప్రభుత్వ విచక్షణతో కూడిన నిర్ణయాలు, రాజకీయ జోక్యం ద్వారా వారికి కొత్త బాధ్యతలు ఇచ్చే పరిస్థితిని తొలగించాలి. ఉదాహరణకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో రిటైరైన వారిని చట్టబద్ధమైన కమిషన్లు, రెగ్యులేటరీ అధికారులు లేక తత్సమానమైన విభాగాలు మాత్రమే నియమించే స్థితి రావాలి. అర్హులైన వారి అప్లికేషన్లను స్వాగతించడం, బహిరంగ నియామకం ప్రక్రియ వంటి దశలను ప్రభుత్వేతర విభాగాల్లోని నిపుణుల విభాగం మాత్రమే చేపట్టాలి. అత్యంత సమర్థత, నిపుణతతో ఇతరులతో పోటీ పడగలిగే స్థాయి ఉన్న రిటైరైన ప్రభుత్వోద్యోగులను ఈ నియామకాల నుంచి మినహాయించాల్సిన పనిలేదు. ఇది జరిగినప్పుడు ప్రభుత్వ రాజకీయ ప్రాధాన్యతలకు లొంగకుండా ఉన్నతాధికార వర్గం ప్రజాప్రయోజనమే ప్రాతిపదికగా తన సేవలను అందించగలదు. మూడు. పని తీరుకు సంబంధించిన రివార్డులు, దండనల వ్యవస్థను మార్చాల్సి ఉంది. ఎంత చిన్న స్థాయిలోనైనా సరే కమీషన్లకు అలవాటు పడిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేలా ప్రస్తుత వ్యవస్థ ఉంది. కానీ ఉద్యోగుల కర్తవ్య ఉపేక్ష అనేది ప్రభుత్వ ఖజానాకు గణనీయంగా నష్టం కలిగిస్తుంది. ప్రజా సంక్షేమాన్ని దెబ్బతీస్తుంది. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడేవారు ఇప్పుడు దండనల నుంచి దాదాపుగా తప్పించుకుంటున్నారు. ఎంతో నమ్మకంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం వల్ల తప్పిదాలు జరిగిన సందర్భంలో అలాంటి వారిపై ప్రస్తుత నిబంధనలు చర్యలు తీసుకోవడం లేదు. ఎవరూ తప్పులనుంచి బయటపడకూడదు. శిక్షణా ప్రక్రియ కాలంలోనే ఉద్యోగులు దీన్ని గుర్తించి, అంగీకరించాల్సి ఉంది. తేలికపాటి సంస్కరణల ద్వారానే పాలనలో మార్పులు చేసుకోవచ్చు. కానీ దేశానికి ఉత్తమంగా సేవలందించడానికి సివిల్ సర్వీసును పూర్తిగా మార్చివేయడంలో ఇవి తప్పకుండా దోహదపడతాయి. మన వద్ద ఉన్న అపరిమిత ప్రతిభా సంపన్నులు, అనుభవజ్ఞులను ఉత్తమంగా ఉపయోగించుకోవడం ఎంతో అవసరం. వ్యాసకర్త: శ్యామ్ శరణ్ మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
వైఎస్సార్సీపీ నేత శ్యామ్ కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, బెంగళూరు/సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ నేత, పార్టీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి కలకడ శ్యామ్సుందర్రెడ్డి (42) కరోనా కారణంగా కన్నుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయన 15 రోజుల పాటు అక్కడి అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. వారు కూడా కరోనా బారిన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారు. పార్టీలో శ్యామ్గా చిరపరిచితుడైన ఆయన బెంగళూరులో పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీలో జరిగిన పలు ఎన్నికల్లో తన ఐటీ బృందంతో కలసి పార్టీ విజయానికి ఎంతో కృషిచేశారు. అహర్నిశలు పార్టీ కోసం శ్యామ్ కష్టపడ్డారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం శ్యామ్ స్వగ్రామం చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం కొత్తపల్లిలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం శ్యామ్ కలకడ మృతిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ సతీమణి సుప్రియకు ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. శ్యామ్ మృతి పట్ల పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి అంకితభావంతో పనిచేశారంటూ శ్యామ్ సేవలను కొనియాడారు. చదవండి : శ్యాం కలకడకు వైఎస్సార్సీపీ నివాళి -
శ్యాం కలకడకు వైఎస్సార్సీపీ నివాళి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి శ్యాం కలకడ కన్నుమూశారు. మహమ్మారి కరోనా బారిన పడి ఆయన మరణించారు. కాగా శ్యాం కలకడ మరణం పట్ల వైఎస్సార్సీపీ విచారం వ్యక్తం చేసింది. ట్విటర్ వేదికగా నివాళి అర్పించింది. "వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం అనుక్షణం పనిచేసిన క్రియాశీలక కార్యకర్త శ్యామ్ కలకడ. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటూ వైయస్ఆర్ సీపీ ఘన నివాళి అర్పిస్తోంది" అని ట్వీట్ చేసింది. అదే విధంగా శ్యాం కలకడ ఆకస్మిక మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్రకటించారు. "వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన శ్యామ్ కలకడ మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన కలిగించింది. శ్యామ్ మరణం పార్టీకి తీరని లోటు" అని శ్యాం కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం అనుక్షణం పనిచేసిన క్రియాశీలక కార్యకర్త శ్యామ్ కలకడ. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటూ వైయస్ఆర్ సీపీ ఘన నివాళి అర్పిస్తోంది. pic.twitter.com/3mY7rhzyXN — YSR Congress Party (@YSRCParty) May 12, 2021 చదవండి: మహమ్మారిని జయించి: తల్లి మరణ వార్త విని బాలింత మృతి -
మహిళా సమస్యలతో టార్చర్
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టార్చర్’. గగన్, మణికంఠ, శ్యామ్, దుర్గాప్రసాద్, శ్రీరామ్ సంతోషి, ప్రమీళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రఘు తోట్ల నిర్మిస్తున్నారు. రఘు తోట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. హరి చెప్పిన కథ బాగుండటంతో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాను. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ కథ కోసం చాలా రోజులుగా అందరం కష్టపడ్డాం. ఓ మహిళ స్టోరీని తీసుకుని మంచి స్క్రిప్టును రెడీ చేశాం’’ అన్నారు ఎం.ఎం. నాయుడు. ‘‘ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ శారీరకంగానో, మానసికంగానో సమస్యలు ఎదుర్కొంటోంది. చాలా తక్కువ మంది మాత్రమే వారు పడ్డ వేదనను బయటకి చెప్పుకుంటున్నారు. అలాంటి కథాంశంతో మా సినిమా ఉంటుంది’’ అన్నారు గగన్. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్. -
అమెరికా కాల్పులతో...
‘కిక్’ శ్యామ్, ఆత్మీయ జంటగా సారథి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘వాడొస్తాడు’. కె.వి. శబరీశ్ నిర్మాత. ఈ చిత్రం అమెరికాలోని లాస్ వేగాస్లో షూటింగ్ జరుపుకుంది. కేవీ శబరీశ్ మాట్లాడుతూ – ‘‘ప్రపంచ దేశాలలో అత్యధికంగా తుపాకులు కలిగి వున్న దేశం అమెరికా. ఆ దేశంలో జరిగే తుపాకీ కాల్పులలో అధికంగా బలవుతున్నది భారతీయులేనని ఇటీవల గణాంకాలు చెబుతున్నాయి. ఆ అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించాం. పలువురు హాలీవుడ్ నిపుణులు, తమిళ సాంకేతిక నిపుణులతో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. -
‘రాంప్రసాద్ను చంపింది నేనే’
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులొకొచ్చింది. రాంప్రసాద్ని తానే హత్య చేశానంటూ శ్యామ్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు. తనతోపాటు చోటూ, నరేష్తో కలిసి ఈ హత్య చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. అయితే హత్య చేయించింది కోగంటి సత్యం అని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా... వాటిని ఖండిస్తూ తానే హత్య చేశానని శ్యామ్ నేరం ఒప్పుకోవడం గమనార్హం. ఈ కేసులో శ్యామ్తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి శ్యామ్ భార్య మాట్లాడుతూ.. ‘మూడు రోజుల క్రితం నా భర్త పని ఉందని బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి వాటర్ ప్లాంట్ను నేను చూసుకుంటున్నాను. అయితే రాంప్రసాద్ని నా భర్త హత్య చేశాడనే విషయం నాకు తెలీదు. కానీ రాంప్రసాద్ మా మీద పెట్టిన కేసులు వల్ల ఆర్థికంగా నష్టపోయి.. మానసిక ఇబ్బందులు పడ్డాం. రాం ప్రసాద్ పెట్టిన కేసుల వల్ల పోలీసులు అర్థరాత్రి మా ఇంటికి వచ్చి సోదాలు జరిపి ఇంట్లో ఉన్న విలువైన కాగితాలు, డబ్బు, నగలు పట్టుకుపోయారు. రాంప్రసాద్ మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడ’ని తెలిపారు. -
మరో రెండు రోజుల్లో వివాహం.. అంతలోనే
మరో రెండు రోజుల్లో ఆ యువకుడి వివాహం జరగనుంది. ఇప్పటికే బంధు,మిత్రులందరికి పెళ్లి పత్రికలు అందజేసి వివాహానికి ఆహ్వానించారు. మిగిలిన వారిని పెళ్లికి పిలిచేందుకు ఇంటి నుంచి బయలుదేరిన యువకుడు రైలు కిందపడి మృత్యువాత పడ్డాడు. పెళ్లి జరగాల్సిన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ఆర్ జిల్లా, నందలూరు : నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లె తోటపాళెంకు చెందిన కాశి యాసిరాజు అలియాస్ కాశి బాబు కుమారుడు కాశి శ్యాం (25)కు ఈనెల 12వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు వివాహ పత్రికలు పంచేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో నందలూరు ఆల్విన్ కర్మాగార సమీపంలో ముంబై నుంచి చెన్నై వెళ్లే సూపర్ఫాస్ట్ రైలుకింద పడటంతో రెండు కాళ్లు తెగిపోయాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి రాజంపేట ›ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మరో రెండు రోజుల్లో ఆ యువకుడి వివాహం జరగాల్సిన పరిస్థితిలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, బం«ధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసుల దర్యాప్తులో సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంజలి చాలా నేర్పించింది!
సినిమా: నటి అంజలి సీనియర్ కావడంతో నాకు చాలా నేర్పించింది అని చెప్పాడు వర్థమాన నటుడు శ్యామ్ జోన్స్. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం లిసా. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తెలుగులోనూ అనువాదమై విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న చిత్ర హీరో శ్యామ్ జోన్స్ తన అనుభవాలను పంచుకుంటూ చెన్నైలోని లయోలా కళాశాలలో బీకాం చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి కలిగిందని చెప్పాడు. అలా సినిమా ఆలోచనలతోనే డిగ్రీని పూర్తి చేశానని తెలిపాడు. ఆ తరువాత ఏమాలి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పాడు. అందులో సముద్రకనితో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నాడు. తొలి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు వచ్చిందన్నాడు. ఆ తరువాత లిసా చిత్రంలో బ్రహ్మానందంకు కొడుకుగా యువ కథానాయకుడిగా నటించానని చెప్పాడు. ఇందులో తాను, నటి అంజలి జంటగా నటించామని తెలిపారు. బెంగళూర్ నుంచి కోడైక్కానల్కు వెళ్లే కళాశాల జంటగా నటించామని తెలిపాడు. నటిగా తనకు సీనియర్ అయిన నటి అంజలి చాలా విషయాలను తనకు చెప్పిందని, అలా నటనలో శిక్షణ ఇచ్చిందని చెప్పాడు.ఈ చిత్ర తెలుగులోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు. కాగా ధర్మప్రభు అనే చిత్రంలోనూ హీరోగా నటించానని, అందులో యమలోకంలో యోగిబాబు, భూలోకంలో తానూ హీరోలుగా నటించినట్లు చెప్పాడు. ఈ చిత్రం జూన్లో తెరపైకి రావడానికి రెడీ అవుతోందని తెలిపాడు. ఇది విభిన్నమైన వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పాడు. తాను కుర్రాడిని కావడంతో యువ కథానాయకుడిగా నటించే అవకాశాలు వస్తున్నాయని, తదుపరి ఇద్దరు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. నటుడు విజయ్సేతుపతి తర హాలో అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నానని శ్యామ్జోన్స్ అంటున్నాడు -
గోల్డ్ ది గ్రేట్
నా పేరు శ్యామ్ సుందరం అండీ. నా భార్య నన్ను అందంగా శ్యామ్ అని పిలుచుకుంటుందండీ. అయితే ఇప్పుడు నేను నా గురించో, నా భార్య గురించో చెప్పబోవడం లేదు. నా కుక్క గురించే చెప్పాలనుకుంటున్నానండీ. కుక్కే గాని కుక్క అనడం నాకిష్టం లేదనుకోండి. మీకందరికీ అలా ముందు ముందుగా ఆ ముక్కేదో చెప్పేస్తే తర్వాత్తర్వాత అలా అనకపోయినా పర్లేదని అనేశానన్నమాట. వాడికో పేరుందండి. దటీజ్ గోల్డీ అండి. వాడని ఎందుకన్నానంటేనండి, వాడు వాడు కాబట్టి. అది కాదు కాబట్టి అని మీకు మనవి చేసుకోవాలనే ఈ కాస్త వివరణ. సుత్తి లేకుండా సూటిగా విషయానికొచ్చేస్తానండి. మా గోల్డీ గాడు నన్ను వదిలి పారిపోయాడండి. నన్ను ఒంటరోణ్ణి చేసి అకస్మాత్తుగా ఎటో మాయమైపోయాడండి. కారణం చిన్నదేనండి. కానీ దానికి ముందు మేటర్ మాత్రం చాలా పెద్దదే వుందండి. మీతో నా బాధ పంచుకోవాలని నా ఆరాటం. సాక్షాత్తు కన్న కొడుకు ఇంటి నుంచి పారిపోయినట్టనిపిస్తోందండి. గోల్డీ కేవలం ఒక కుక్క కాదు సార్. నా ప్రాణం. నా కుటుంబ సభ్యులతో కంటే, వాడితో నేను, నాతో వాడు గడిపిన క్షణాలే ఎక్కువ. వాడు నాకు దొరకడమే ఓ విచిత్రం. మార్నింగ్ వాకింగ్లో రోజూ కూడా నడిచేవాడు. మేం గవర్నమెంట్ క్వార్టర్స్లో వుంటాం. రాత్రిపూట మా క్వార్టర్ ముందే పడుకునే వాడు. పొద్దునే వాకింగ్ కోసం నేను తలుపులు తీయగానే పటపటా వొళ్ళు దులుపుకుని రెడీ అయిపోయేవాడు.పొద్దున్నే కుక్క మొహం చూడ్డం ఏంట్రా బాబూ అనుకుని ఛీ అని విదిలించేవాణ్ణి. కొన్ని బంధాలు అంత తేలిగ్గా వదిలించుకోలేం. వాడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా నా వెంటే నడిచేవాడు. కొన్నాళ్ళకి మేం వేరే క్వార్టర్కి మారినప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ తినేవాడో ఏమో! అప్పుడిక అనుకున్నాను, వీడికీ నాకూ ఎక్కడో లింకుందని. మా ఆవిడతో చెప్తే అన్నం పెట్టడం మొదలుపెట్టింది. వాడు ఇక మా ఇంట్లోకి రావడం మొదలుపెట్టాడు. అయినా ఆ హిస్టరీ అంతా ఇప్పుడెందుకులెండి. ‘వాడిని ఈ మధ్య గొలుసు వేసి తిప్పుతున్నారే. ఎలా పోయాడు?’ అంటున్నారంతా. విషయం గొలుసు కాదు. నిజమే! ఇంతకుముందు గొలుసు లేకుండా వదిలేసేవాళ్ళం. ఈ మధ్యనే గొలుసు వేసి బంధించడం మొదలుపెట్టాం. అలవాటు లేని కట్టడి. నచ్చి వుండక పోవచ్చు. కానీ కారణం అది కాదనుకోండి. ఏదో చిన్న తప్పు చేశాను. దానికింత పెద్ద శిక్ష వేశాడు వాడు. బంధమే తెంచుకుని పోయాడు. నాతో ఉన్న బంధాన్ని తెంచుకుని పోయాడు. ఆగండి కొంచెం. కన్నీళ్ళొస్తున్నాయి.ఏమిటో నేనేదో నా కడుపులో దు:ఖం మీతో చెప్పుకుంటున్నా కదా! కాసేపు ఆగొచ్చుగా వెదవ కన్నీరు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పొంగాలో తెలీదు. అదిగో ఆ సిమెంటు దిమ్మ మీద కాసేపు కూచుంటాను. హమ్మయ్య కూచున్నాన్లెండి. ఇక్కడ నేను కూర్చున్నప్పుడల్లా ఎగిరి గంతేసి పక్కనే కూర్చునేవాడు మా గోల్డీ. ఇంకెవరి కుక్కయినా నా దగ్గరకొచ్చి ముద్దు చేయించుకుంటే నా సామిరంగా ఇక ఎటాకే అన్నమాట. కుళ్ళుమోతోడు. నేనెవరినీ ముద్దు చేయకూడదు వాణ్ణి తప్ప. నేను లేకపోతే హాయిగా కాలనీలో కుక్కలతో బాగానే ఆడుకుంటాడు. సర్లెండి. ఆ సోదంతా ఎందుకు గాని. బంధాలు మక్కువే కాని బంధనాలు ఎవరికిష్టం వుంటాయి చెప్పండి? కానీ మా గోల్డీ గాడు మాత్రం నా బంధం తెంచుకుపోయింది గొలుసు గురించి కాదు. వాడికీ నాకు చాలా ఇష్యూస్ వున్నాయి.మీరలా నవ్వక్కర్లేదండోయ్. ఏదో పెళ్లాంతో, పిల్లలతో వున్నట్టు ఒక కుక్కతో ఇష్యూసేంటండీ అని పగలబడుతున్నారు కదా! నేనూహించగలను. నవ్వుకుంటే నవ్వుకోండి. ఇంతకీ గొలుసు ఎందుకేసేనో ముందు చెప్తాను. వీధిలో వదిలితే బయటి కుక్కలన్నీ వాడి మీదే ఎగబడతాయి. అయితే మీరనుకున్నట్టు కుక్కలన్నీ మీదపడి కరుస్తాయని కాదు గొలుసు వేసింది. మేటర్ వేరే వుంది. కుక్కలన్నీ మా వాడంటే ఇష్టపడుతున్నాయి. ఆడ కుక్కలు ఇష్టపడితే సరే. మగ కుక్కలు కూడా వెనకపడతాయి. మా వాడి రంగు బంగారంలా మెరిసిపోతుంది. వాడి పేరు గోల్డీ అని పెట్టడానికి కారణం అదే. వాడంటే కుక్కలకు అట్రాక్షన్ వెనక కారణం కూడా అదే. అందుకే గొలుసు వేయాల్సి వచ్చింది.‘ఏమిటీ.. గొలుసు వేయడం దేనికి? హాయిగా ఎంజాయ్ చేయనివ్వొచ్చు కదా!’ అంటారా? నా పాయింట్ అది కాదండి బాబూ.అందులో నాకిష్టం లేని కుక్క ఒకటి వుంది. దాని మీదే మా వాడు మనసు పారేసుకున్నాడు. ఏమిటీ పిచ్చి మాటలని కొట్టి పారేయకండి. నిజంగా ఆ కర్రి కుక్క మీద మా వాడికి పిచ్చే పట్టింది. అది బక్కగా ఎండు కట్టెలా వుంటుంది. పైగా మచ్చలు మచ్చలు. ఛీ ఒకటే రోతగా వుంటుంది. ఎంత కొట్టినా అది మా ఇంటి చుట్టే తిరుగుతుంది. ‘నిను వీడని నీడను నేనే’ అని పాట పాడుతుందేమో. అంతే అది మా గోల్డీ గాడికి తెలిసిపోతుంది. ఇక ఒక్కసారిగా పైకి లేస్తాడు. నన్ను అదోలా చూస్తాడు. వాడెప్పుడు ఎలా చూస్తాడో నాకు తెలుసు. నా ప్రేయసితో నన్నెన్నాళ్ళు దూరంగా వుంచుతావో నేనూ చూస్తా అన్నట్టు వుంటాయి వాడి చూపులు. ఏమాత్రం వీలు దొరికిందా ఇంక దానితోనే షికార్లు. మా గోల్డీ తక్కువోడు కాదు సార్. మహా ముదురు నా కొడుకు. అదంటే నాకు ఇష్టముండదని వీడికి తెలుసు కదా, నేను పక్కనున్నప్పుడు మాత్రం అది పక్కకొస్తే దాన్ని దూరంగా అరిచి తరిమేస్తాడు. అబ్బే మా మధ్య ఏమీ లేదు అని చెప్పడానికన్నమాట. వాళ్ళిద్దరూ కలుసుకునే రహస్య స్థావరాలు వేరే వున్నాయి లెండి.‘ఏమైందండీ తిరిగితే?’ అంటారు మీరు. ఎదుటివాళ్ళకయితే ఎన్నయినా చెప్తాం లెండి. మా పక్క క్వార్టర్లో సుధాకర్ గారు పెంచుకుంటున్నారే, ఆ తెల్లబొచ్చు తింగరి బుచ్చితో తిరగొచ్చు కదా. అబ్బే అదంటేనే గిట్టదు. అది దగ్గరికొస్తే చాలు భయంకరంగా అరుస్తుంది. పాపం దానికేమో వీడి మీద మోజు. ఏంట్రా చిన్నా ఆ కర్రి దాంతో ఎందుకురా? ఈ తెల్లదానితో జతకట్టరా అన్నాను. దానికి మావోడేమన్నాడో తెలుసా? చెప్తాను జస్ట్ వెయిట్. ప్లీజ్ లెట్ మీ టేక్ సమ్ బ్రేక్. మీరు కూడా కాస్త రిలాక్సవ్వండి. ఆ.. ఎక్కడున్నాను? ఓకే. నేనూ మా గోల్డీ ఏ భాషలో మాట్లాడుకున్నామో సెలవివ్వండని మీరు ఏమైనా వ్యంగ్యం పోవాలనుకుంటున్నారా? మీకేం తెలుసండి బాబూ. అందరికీ అన్ని భాషలుంటాయి. మా ఇద్దరికీ అర్థమయ్యే భాష ఒకటుంది. అది చెవులు కదిపితే ఏమంటుందో, తోక అదే పనిగా ఊపితే ఏమంటుందో, కళ్ళు కుడివైపు తిప్పితే అర్థమేంటో, ఎడమ వైపు తిప్పితే అర్థమేంటో, తన చుట్టూ తాను తిరుగుతున్నట్టే తిరుగుతూ నా వైపు చూస్తే అర్థమేంటో, ఎప్పుడు మొరుగుతుందో, ఎప్పుడు మూలుగుతుందో అన్నీ నాకు తెలుసు. రాత్రి నేను చాలాసేపు చదువుకుంటూ వుంటాను. వాడు నన్ను చదువుతూ వుంటాడు. నా ప్రతి కదలికా వాడికి క్షుణ్ణంగా తెలుసు. పడుకున్నట్టే వుంటాడు కానీ కళ్ళు మూసినా తెరిచినా వాడి పరిశోధనాంశం నేనే. చెప్పాల్సిందేమంటే నా భాషని మా గోల్డీ బాగా నేర్చుకున్నాడు. సరే విషయానికొస్తాను. మా గోల్డీ ఏమన్నాడంటే...‘మీలా అన్ని రంగులు మాకు తెలీదు. కాబట్టి రంగు భేదం పాటించడం మా జాతికి తెలియని విషయం.’ అని తేల్చి చెప్పాడు. అబ్బా చెంప మీద కొట్టినట్టనిపించిందండి. వాడు ఏ అంగ విన్యాసంతో ఈ మాట చెప్పాడని మీరు వంకర్లు పోతూ అడగక్కర్లేదులెండి. ప్రతీదీ అవయవాలతోనే చెప్పాలా? వాడి చూపులు చాలు. చూడబోతే మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ తెలివి తేటలున్నాయని నేను చెప్పబోతున్నట్టుగా మీరు నిర్ధారించుకుంటే మీరు జ్ఞానవంతులే. పదివేల నుంచి లక్ష రెట్లు ఎక్కువ మనుషుల కంటే వాసన చూసే శక్తి కుక్కలకు వుంటుందని తెలుసుకుని మా గోల్డీగాణ్ణి ఒక గ్రహాంతర వాసిలా చూడ్డం మొదలుపెట్టాను. వాడి పుణ్యమా అని కుక్కల గురించి చాలా చాలా చదివేశాను. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సెన్సరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ జేమ్స్ వాకర్ వారి బృందం చేసిన పరిశోధనలు చూస్తే మతిపోయింది. అంతెందుకు చెప్పండి. అలెగ్జాండ్రా హోరోవిట్జ్ అనే ఆవిడ రాసిన ‘ఇన్ సైడ్ ఆఫ్ ఏ డాగ్’ అనే పుస్తకం ఒకటి చాలు. ఆ లెక్కకొస్తే మా గోల్డీ ప్రపంచంలోనే అత్యున్నత మేలు జాతి శునకాల కంటే మేలైన మేధస్సు ఉన్నవాడని నేను ఢంకా భజాయించి చెప్పగలను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను చాలు.మా ఇంటికి ఒకసారి ఎవరైనా కొత్తగా వస్తే గోల్డీ మొరుగుతాడు. మళ్లీ వస్తే మొరగడు. ఓహో కొత్త వాళ్ళొస్తే మొరుగుతాడు కదా అనుకున్నాం. ఒకసారి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. మొరగలేదు.ఆశ్చర్యపోయాం. తీరా ఆరా తీస్తే ఆ వచ్చిన వ్యక్తి ఇంతకు ముందు వచ్చిన వ్యక్తికి పరిచయమున్న వాడు. అంటే ఒక మనిషి నుంచి ఆ మనిషికి సంబంధించిన మనుషుల వాసన కూడా పసిగట్టాడన్న మాట. కుక్కల్ని కొట్టేవాళ్ళు ఎవరైనా రోజూ వచ్చినా రోజూ మొరుగుతాడు. అదేమిటబ్బా అని ఆరా తీస్తే వాళ్ళకి కుక్కలంటే పడదని తెలిసింది. అందుకే మా గోల్డీకి వాళ్ళంటే పడదు. ఇంతకీ ఆ నల్ల కుక్క దగ్గరకి మా గోల్డీని పోనివ్వటం లేదని మా మీద అలిగి వాడు ఆ కర్రిదాన్ని లేపుకు పోయాడని మీరు డౌటుపడితే, మహాప్రభో అదేం కాదు. వాడి ఇష్టానికి అనుగుణంగా అప్పుడప్పుడూ వదిలేస్తాను కదా, అందుకు వాడికి నేనంటే కాస్త కృతజ్ఞతాభావం వుందండోయ్. మరేమైంది? అని మీరు విసుక్కోవద్దు. కొంచెం శాంతం కావాలి మరి.మనం మనుషులం. మన పద్ధతుల్లోనే వాటిని పెంచుతాం.మన పద్ధతులు వాటికి నచ్చవు. వేరే కుక్కలు చెప్తాయో లేదో కాని, మా వాడు మాత్రం అన్ని సందర్భాల్లో తన నిరసన వ్యక్తం చేసేవాడు. మా గోల్డీ మనిషై వుంటే, వాడిని మించిన విప్లవకారుడు మరొకడు వుండే వాడు కాదనిపించేది చాలాసార్లు. మనం రా ఫుడ్ తినం. జంతువులకు రా ఫుడ్ ఇష్టం. మాంసం తెచ్చి నూనె వేసి ఉప్పూ కారం మసాలాలు దట్టించి వండుకుంటాం. వాడికి కూడా అలాగే పెడతాం.మొదట్లో చాలా ప్రొటెస్ట్ చేశాడు. కానీ తప్పక అదే తినడం అలవాటు చేసుకున్నాడు.‘ప్రకృతిలోంచి వచ్చి ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నార్రా! మీరు చెడితే చెడిపోయారు. ప్రకృతిలో భాగంగా బతికే మాలాంటి ప్రాణుల్ని కూడా ఎందుకు చెడగొడతార్రా బాబూ’ అని కొంచెం మందలించేవాడు. అబ్బే! మనమెందుకు వింటాం. మా అలవాట్లే వాడి మీద రుద్దాం. మా ఆహారం మీద మీ ఆంక్షలేంటి అని మనం ఇంకెవర్నో తిట్టుకుంటున్నామే. జంతువులు కూడా మనుషుల్ని అలాగే తిట్టుకుంటాయని మా గోల్డీ చాలాసార్లు చెప్పాడు. నిజమే అనుకున్నా గాని వాడి మాట మాత్రం ఎప్పుడూ వినలేదు. వాడికి మాలాగే రుచిగా పెట్టాలని మా కోరిక. రుచికి మించిన శత్రువు లేడని వాడి హెచ్చరిక. అందుకే వాడిని అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరకి తీసుకుపోవడం, అరుగుదలకి, వగైరా వగైరా జబ్బులకు మందులు వాడటం చేస్తుంటాం.వాడు నవ్వుకుంటాడు. ఎందుకురా నవ్వుతావంటే, ‘నాయాళ్ళారా మీ అజ్ఞానంతో పాటు మీ అభిరుచులతో నన్ను కూడా రోగిష్టి వాడిని చేసేశారు కదా’ అని వాడి కంటెన్షన్.ఆగండాగండి. మా వాడు మా అభిమానం, ప్రేమ తట్టుకోలేక, దానిమూలంగా ఆసుపత్రుల చుట్టూ తిరగలేక పారిపోయాడని మీరనబోతున్నారు అంతేగా. అయితే మీరు దాల్ మే లెగ్గేసినట్టే. మా వాడు అంత డెలికేట్ డెసిషన్స్ తీసుకునే సెన్సిబుల్ కాదు. చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ ఫ్రెండ్ మా గోల్డీ. ఏంటి.. సస్పెన్స్లో పెట్టి చంపేస్తున్నానంటారా? అలాంటి ఉద్దేశాలేమీ లేవు. మా గోల్డీకి సంబంధించిన పూర్తి సమాచారం మీకందితే, మీరెక్కడ ఉన్నా ఓ చేయి నా భుజం మీద వేసి ఓదారుస్తారనే. అసలేం జరిగిందంటే.. నా ప్రేమని వాడు భరించలేని స్థితికి వచ్చే పని ఒకటి చేశాను. అదే.. అదే వాడు నానుంచి దూరమయ్యేలా చేసింది. ఎంత మంచి వాడు, నా అత్యుత్సాహంతో నేనే వాడిని దూరం చేసుకున్నాను. నేను ఏం చెప్పినా చేస్తాడు. మా అలవాట్లు తెలుసుకుంటాడు. వాటిని నచ్చకపోయినా భరిస్తాడు. నేనే రెండుమూడు సార్లు వాణ్ణి కొట్టాను. అసహ్యించుకున్నాను. అయినా వాడు మాత్రం నా కోపం పోయిందని తెలుసుకున్నాక వచ్చి మెల్లిగా వొళ్లో వాలిపోయేవాడు. వాడికి వారానికి రెండుసార్లు స్నానం చేయిస్తాం. వాడి షాంపూ, సబ్బు, డియోడరెంట్ అన్నీ సెపరేట్. స్నానం చేయించిన తర్వాత మా గోల్డీ గాడి బొచ్చు చూడాలండీ. బంగారానిక్కూడా కుళ్ళేసుకొస్తుందంటే నమ్మండి. దాని వొంటి మీద ఒకసారి చేయి వేసి నిమిరితే జన్మజన్మాంతరాల స్పర్శానుభవం పొందినట్టే అనిపించేది. కానీ చాలాసార్లు స్నానం చేయించిన రోజే వాడు ఏదో బురదలోనో, మట్టిలోనో కసిదీరా దొర్లిదొర్లి వచ్చేవాడు. పోనీలే ఆడుకుంటాడు కదా అని వదిలేస్తే వాడు చేసే ఘనకార్యం ఇది. నాకు కోపం ముంచుకొచ్చి కర్ర తీసుకుని కొట్టేవాణ్ణి. దగ్గరకు రానిచ్చేవాణ్ణి కాదు. బయటే పెట్టి తలుపు పెట్టేసేవాణ్ణి. పాపం వాడు మాత్రం తలుపుకు ఆనుకుని అక్కడే పడుకునే వాడు. ఎప్పుడో జాలి పుట్టి ఏ బట్టో తీసుకుని వాడి వొళ్లంతా దులిపి అప్పుడు ఇంట్లోకి రానిచ్చేవాణ్ణి. దగ్గరకొచ్చి నా కళ్ళలోకి కళ్లు పెట్టి అలాగే చూసేవాడు. మనం ఏది శుచీ శుభ్రం అనుకుంటున్నామో అది వాడికి నచ్చడం లేదేమో. కడుక్కోవలసిందంతా లోపలే దాచుకుని పైపైన చేసే ఈ ప్రక్షాళన కార్యక్రమం అంతా నాటకంలా వాడికనిపిస్తుందేమో. మనం చేసే ప్రతి పనీ వాడి సహజత్వం నుండి దూరం చేసే అసహజమైన దానిగానే అనుకుంటున్నాడేమో. అప్పుడు వాడి కళ్ళలోకి చూస్తే ఎందుకో నా కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అదంతా తల్చుకుంటుంటే ఇప్పుడూ తిరుగుతున్నాయనుకోండి. ఓహో! ఇదన్నమాట కారణం అనుకొని అప్పుడే ఓ కంక్లూజన్కి వచ్చేయకండి. స్నానం చేయించినందుకు చిరాకు పుట్టి పారిపోయాడని అనేసుకోవద్దు. అలా అనేసుకుని ఎంతైనా కుక్క కుక్కే. అందుకే కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధెక్కడ పోనిచ్చుకుంటుందని మాటలు జారేస్తారేమో అంత పనిచేయకండి. అసలు జంతువుల్ని మనుషులు ఎందుకు పెంచుకుంటారో తెలుసా? అది జంతు ప్రేమ కాదు. మనలోపలున్న జంతువులకీ, బయట స్వేచ్ఛగా తిరిగే జంతువులకీ మధ్య జరిగే యుద్ధానికి మనం పెట్టుకున్న అందమైన పేరు. అంత ఆశ్చర్యంగా చూడక్కర్లేదు. వాస్తవానికి మన లోపలున్న జంతువులు బయట హాయిగా వున్న జంతువుల మీద కుళ్ళుతో వాటిమీద కసి తీర్చుకోడానికి వాటికి ఇష్టం లేని పనులు చేయడానికి మనల్ని ఉసికొల్పుతాయి. ఇక మనం పెంచుకున్నవి మనకు నచ్చని పనులు చేసి వాటి నిరసన తెలియజేస్తాయి. ఇదంతా నేను మా గోల్డీ సాహచర్యంలో తెలుసుకున్న విశేషాలే సుమా. సరే! విషయానికే వద్దాం. స్నానం చేయించినంత మాత్రానికే పారిపోయే కురచబుద్ధి వాడు కాదు మా గోల్డి. నా వల్లే నా సరదా సంతోషాలే వాణ్ణి నా నుండి దూరం చేశాయి. వాడిది సహజంగానే బంగారంలా మెరిసిపోయే జుట్టు అని చెప్పాను కదా. అలాంటి వాడికి నా సరదా కోసం ఒక పూల చొక్కా కుట్టించాను. ఒక రంగు టోపీ కొన్నాను. వాటిని బలవంతంగా ఒకరోజు అలంకరించాను. అంతే, ఆ రోజు నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. ఏంటో గొంతులో ఏదో ఇరుక్కున్నట్టుంది ఉండండి. పొలమారితే ఎవరో తల్చుకున్నట్టే. వెదవ! నన్ను తలుచుకుంటున్నాడేమో.వాడికేదో పోయేకాలమొచ్చి పోయాడని అనొద్దండి.మీకు దండం పెడతాను. మేముండే చోటుకి నెమళ్ళు బాగా వస్తాయి. బావుంటుంది కదా అని ఓ నెమలి కన్నుల చొక్కా కుట్టించేను గోల్డీకి. అంతే! వాడికి ఎక్కడ లేని తిక్క రేగింది. వాడన్న మాటల్ని మీకోసం ఇక్కడ మీకు తెలిసిన భాషలో చెప్తున్నా చూడండి.‘మీ మనుషులు మారర్రా అన్నాడు. ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల జీవులున్నాయి. ఒక్కటంటే ఒక్కటైనా బట్టలు వేసుకుంటాయా? అది ప్రకృతికి విరుద్ధంరా! మీ మనుషులు చేసేదంతా ప్రకృతి విరుద్ధమే. ఆ నెమలిని చూడు. ఏదో రోజు ఆ నెమలిని కూడా మచ్చిక చేసుకుని నువ్వు దానికి కూడా పనికిమాలిన చీర ఏదో చుట్టినా చుడతావు. బాబూ నీకూ నీ చాదస్తంతో కూడిన అజ్ఞానంతో నిండిన అసహజత్వానికీ పరాకాష్టలాంటి నీ అలవాట్లకో నమస్కారం. నీకూ నాకూ రాం రాం.’ అని అన్నాడండి. దాని తర్వాత ఒకటి రెండురోజులు నెమలి మా దొడ్డి వైపు వస్తే దాన్ని తరిమేసే వాడు. అలా చివరికి ఒకరోజు తనను తానే నానుండి దూరంగా తరిమేసుకున్నాడు. మీరిప్పుడు ఏమంటారో నాకు తెలుసు. ‘మీ కుక్కప్రేమ నక్కలెత్తుకెళ్ళా. ఆ కుక్క నాయాలకు చొక్కా ఎందుకు కుట్టించారండి’ అంటారా? అనండి. అంటే అన్నాడు గాని భలే అన్నాడని నవ్వుకుంటున్నారు కదా. ‘నెమలికి కూడా మీరు చీర కట్టగలిగే నేర్పరులే’ అని నన్ను వెక్కిరించండి. ‘ చీర కట్టిన నెమలి. ఆహా! పోతేపోయాడు కాని మాంచి జ్ఞానోదయం చేశాడండి మీ గోల్డి!’ అంటారా? అనండి అనండి. మీరనాలి.నేను పడాలి. అంత దిక్కుమాలిన పని చేశాను మరి.నిజంగానే మనిషి తక్కువోడు కాదు. తనలోపల పాతిపెట్టాల్సిన వాటినెన్నింటినో నిత్యం బయటపెడుతూనే ఉన్నాడు. స్వార్థం, కుళ్ళు, ద్వేషం, అసహనం, మోహం, అత్యాశ, క్రోధం ఇలా ఎన్నని చెప్పాలి! వేటిని ఇనప కచ్చడాలు వేసి బిగించాలో వాటిని నిర్లజ్జగా వదిలేసి, ఏవేవో కపట వస్త్రాలతో తనను తాను కప్పుకుంటున్నాడు. మనిషి చేసే ప్రతి పనీ ప్రకృతి విరుద్ధమే అని నిరూపించగల అద్భుత మేధావి మా గోల్డీ గాడు. కాని వాడి భాష నాకు మాత్రమే తెలుసుగా ఏం చేస్తాం. నేనేమీ ఏడ్వటం లేదండి. నిజంగా. ఇన్ని విషయాలు నాకు బోధించి పోయాడు మా గోల్డీ గాడు. అదే తల్చుకుని పొంగిపోతున్నా. నిజంగానండి. పైకి చూపుతున్న గాంభీర్యం కాదు.ఏంటి? ఒకసారి సారీ చెప్పేసి, ఆ చొక్కా చింపి పారేయాల్సిందంటారా? వెధవ చొక్కా. కనీసం కుక్కయినా దక్కేదంటారా? మీ వ్యంగ్యానికేంగాని నా పశ్చాత్తాపాన్ని ప్రకటించుకునే అవకాశాన్ని కూడా నాకివ్వలేదు మా గోల్డి. దానికి కూడా అర్హుడనని వాడనుకోలేదు కాబోలు. వాడు కచ్చితంగా నెమళ్ళను నా నుండి కాపాడే మహోద్యమం ఏదో మొదలుపెట్టడానికే ఏ అడవుల్లోకో పారిపోయి ఉంటాడని నా నమ్మకం. నన్ను చూసి మీరేమీ జాలి పడక్కర్లేదు. తెలివిమాలిన వారు సానుభూతికి అనర్హులు. హచికో సినిమాలో కుక్క, చనిపోయిన యజమాని కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసి చూసి పాపం చివరికి గడ్డకట్టుకుపోయిందే! నేను కూడా అలాగే అయిపోయేలా వున్నానని మాత్రం భయం కలుగుతోంది. అందులో యజమాని కోసం ఎదురుతెన్నులు చూసి కుక్క అలాగైంది. కుక్క కోసం ఎదురుతెన్నులు చూసి నేనిలా అవుతున్నాను. అంతే. వాడిని మర్చిపోలేను. దయచేసి వేరే కుక్కను పెంచుకోమని మీరు సలహాలు ఇవ్వొద్దు. మా గోల్డీ స్పెషల్. వాడి కోసం చుట్టుపక్కల ఎక్కడెక్కడ అడవులున్నాయో అన్నీ వెదుకుతున్నాను. ఒకవేళ వాడు కనబడితే ఏం చేస్తానో చెప్పమంటారా?బతిమాలుకుంటాను. వాడు రానంటే వాడితోనే వుండిపోతాను. వాడికి బట్టలిష్టం లేదుగా. నేను కూడా వాడి ఇష్టాన్నే ఫాలో అయిపోతా. సూఫీ గురువు సర్మద్లాగా నగ్నంగా తిరుగుతాను. ఔరంగజేబు రాజధాని నగరం నడిరోడ్డు మీద తల తీయించేశాడే ఆ సూఫీ గురువు గురించి మాట్లాడుతున్నానని మీరు కనిపెట్టే వుంటారు.ఔను! ఒక కవి తత్వాన్ని తలబిరుసు అనుకున్నాడు రాజు. అందుకే తల నరికించాడు. కాని ప్రజలు ఆ ఫకీరు అంతరాత్మలోని సత్యమనే వెలుగును దర్శించారు. అందుకే అతని సమాధిని ఒక తీర్థ స్థలంగా మార్చేశారు.ఉండండి ఉండండి. దూరంగా ఏవో నెమళ్ళు ఆడుకుంటున్నాయి. పక్కనే ఏదో కుక్క కూడా ఉన్నట్టుంది. తర్వాత చెప్తాను. పరుగు పెడుతూ మాట్లాడలేను. అవును! మా గోల్డీలానే వున్నాడు. ఉండండి ఒక్క నిమిషం. తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెయిట్ చేసినందుకు సంతోషం. కానీ నేనే మీతో మాటల్లో పడి మళ్ళీ బుద్ధి తక్కువ పని చేశాను. నా హడావుడి పరుగు చూసి నెమళ్ళన్నీ ఒక్కసారిగా రెక్కల్ని ఎడాపెడా చాచేసి కూడబలుక్కున్నట్టు రివ్వున ఎగిరిపోయాయండి. దగ్గరకు పోయి చూస్తే అక్కడ కుక్క ఏదీ కనిపించలేదు. పైకి చూస్తే నెమళ్ళతోపాటు కుక్క ఆకారంలో ఎర్రని వర్ణం ధగధగా మెరిసిపోతూ కనిపించిందండోయ్. మీరు నమ్ముతారో లేదో. వాడు కచ్చితంగా మా గోల్డీనే. కచ్చితంగా చెప్తున్నా కదా, మా గోల్డీనే. ఇంక నేను మీతో మాట్లాడలేను. ఎందుకంటే నా వొంటికి పట్టింది చెమటో కన్నీళ్ళో నాకు తెలీదు. కాసేపు ఇక్కడే నేల మీద సేద తీరి పైకి చూస్తూ ఉంటాను. మా గోల్డీ నాకోసం తప్పకుండా వస్తాడు. మీకు ఒక విషయం తెలుసా తనను పెంచుకుంటున్న యజమానిని వదిలి కుక్కలు ఎక్కడికీ వెళ్ళవు. వస్తాడు. మా గోల్డీ తప్పకుండా వస్తాడు. కనీసం తనతో నన్ను తీసుకుపోడానికైనా వస్తాడు. - ప్రసాదమూర్తి -
ఫైనల్లో శ్యామ్
జకార్తా: ఆసియా క్రీడల టెస్ట్ ఈవెంట్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ ఫైనల్కు చేరాడు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో బుధవారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం సెమీఫైనల్లో మొహమ్మద్ ఫౌద్ రెడ్జూన్ (మలేసియా) నుంచి వాకోవర్ లభించడంతో శ్యామ్ కుమార్ ఫైనల్ చేరాడు. తుది పోరులో అతను ఇండోనేసియాకు చెందిన మారియో బ్లాసౌస్తో తలపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్ నుంచి శ్యామ్తో పాటు శశి చోప్రా, పవిత్ర, కౌశిక్, షేక్ సల్మాన్ అన్వర్, ఆశిష్ ఫైనల్కు అర్హత సాధించారు. రీతు, మొహమ్మద్ ఇతాశ్ ఖాన్, పవన్ కుమార్, ఆశిష్ కుమార్లు సెమీస్లో ఓడి కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. -
శ్యామ్కు పతకం ఖాయం
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వైజాగ్కు చెందిన శ్యామ్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇలాహి ఇంగాతన్ (ఇండోనేసియా)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు), సరితా దేవి (60 కేజీలు) కూడా సెమీస్ చేరారు. -
సమస్యలు సృష్టిస్తున్న శ్యామ్
తమిళసినిమా: నటుడు శ్యామ్ పార్టీలో సమస్యలు సృష్టిస్తున్నారట. నటుడు శ్యామ్ మంచి నటుడే కాదు బహుభాషా నటుడు కూడా. అదే విధంగా కథానాయకుడు, ప్రతినాయకుడు అన్న భేదం లేకండా నచ్చిన పాత్రలైతే చేయడానికి రెడీ అనే నటుడు శ్యామ్. తమిళంలో 8 మెళగవత్తిగళ్ చిత్రంతో నిర్మాతగా కూడా మారారు. ఆ చిత్రంలో శ్యామ్ విభిన్న గెటప్, వైవిధ్య భరిత నటన అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ పాత్ర కోసం ఆయన పడిన శ్రమ, చేసిన కృషి ఎక్కువే. అయితే చిత్రం ఆయన్ని నిరాశపరిచింది. ఈ విషయం గురించి శ్యామ్ బాధ పడింది లేదట. చిత్ర జయాపజయాలు నటుడి ప్రతిభను అంచనా వేయకూడదంటాడీయన. 8 మెళగవత్తిగళ్ చిత్రం ప్రేక్షకుల మధ్యకు వెళ్లకపోవడానికి థియేటర్ల మాజమాన్యం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. ఈయన తాజాగా పార్టీ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాను స్టైలిష్ పాత్రను పోషిస్తున్నట్లు శ్యామ్ తెలిపారు. ఇక ఒకరోజు దర్శకుడు వెంకట్ప్రభు ఫోన్ చేసి బ్రదర్ వెంటనే బయలుదేరి చెన్నైకి బయలుదేరి రండి అని అని చెప్పారన్నారు. అంతే ఎందుకు?, ఏమిటీ? అన్న ప్రశ్నలు వేయకుండా వెంటనే చెన్నై వచ్చేశానని చెప్పారు. ఒక జాలీ టీమ్తో పార్టీ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇందులో సమస్యలు సృష్టించే పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రం తనకు సెకెండ్ ఇన్నింగ్స్ అవుతుందని భావించవచ్చునని పేర్కొన్నారు. తన అభిమానులు ఆశించే పాత్రను పార్టీ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. -
శ్యామ్ చిత్రానికి రాఘవ లారెన్స్ ప్రశంస
తమిళసినిమా: నటుడు శ్యామ్ చిత్రాన్ని నృత్యదర్శకుడు లాఘవలారెన్స్ ప్రశంసించారు. నటుడు శ్యామ్కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బహుభాషా నటుడైన ఆయన తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం కావియం. తెలుగులో వాడొస్తాడు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్యామ్కు జంటగా నటి అద్వియ నటిస్తున్నారు. శ్రీదేవికుమార్, శ్రీనాథ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో జస్టిన్ వికాశ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. 2ఎం.సినిమాస్ పతాకంపై కేవీ.శబరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సారథి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం గురించి ఈ సందర్భంగా ఈయన తెలుపుతూ కావియం చిత్రం థ్రిల్లర్గా సాగే విభిన్న కధా చిత్రం అని చెప్పారు. ఎస్ఎన్.రాజేశ్కుమార్ ఛాయాగ్రహణం, శ్యామ్మోహన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ను నటుడు, నృత్యదర్శకుడు లారెన్స్ శుక్రవారం ఆవిష్కరించినట్లు తెలిపారు. చిత్ర మోషన్ పోస్టర్తో పాటు, ట్రైలర్ను చూసిన లారెన్స్ చాలా బాగున్నాయంటూ ప్రశంసించారని దర్శకుడు తెలిపారు. -
దెయ్యాల ఆట ఆరంభం...!
రెండు ప్రేమ జంటలు హాలీడేస్ను ఎంజాయ్ చేసేందుకు రిసార్ట్స్లోని ఓ గెస్ట్ హౌస్లో బస చేస్తాయి. అక్కడ వారికి ప్రేతాత్మల వల్ల ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. ప్రేతాత్మల నుంచి ప్రేమికులు ఎలా బయటపడ్డారు? అనే కథతో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ది లాస్ట్ హర్రర్’. ఈ చిత్రాన్ని ఎఎన్వీïపీ సమర్పణలో మేఘాంశ్ మూవీస్పై సేమ్ టైటిల్తో తెలుగులోకి బి.ఎస్. ప్రసాద్ అనువదించారు. ‘దెయ్యాల ఆట మొదలైంది’ ఉపశీర్షిక. శ్యామ్, షరీఫ్, అమృత, నీతా ముఖ్య తారలు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. ‘‘సస్పెన్స్తో సాగే రొమాంటిక్ హరర్ చిత్రమిది’’ అన్నారు బి.ఎస్. ప్రసాద్. -
కల్వర్టు గుంతలో పడి యువకుడు మృతి
నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం సాంబాపూర్ గ్రామం వద్ద గుంతలో పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కోటగిరి గ్రామానికి చెందిన శ్యాం(28) సోమవారం మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్తూ సాంబాపూర్ వద్ద కల్వర్టు కోసం తవ్విన గుంతలో పడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. -
అర్జున్, శ్యామ్లతో ద్విభాషా చిత్రం
యాక్షన్కింగ్ అర్జున్, యువ నటుడు శ్యామ్లు కలిసి తమిళం, కన్నడం భాషల్లో రూపొందనున్న ఓ భారీ చిత్రంలో నటించనున్నారు. ఇంతకుముందు కుప్పి, కావలన్కుడి యిరుప్పు, వనయుద్ధం వంటి వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించిన ఏఎంఆర్ రమేష్ దర్శకత్వం వహించనున్న చిత్రం ఇది. ఆ చిత్ర వివరాలను ఆయన వివరించారు. తానెప్పుడూ యదార్థ సంఘటనల కథా చిత్రాలనే రూపొందిస్తానన్నారు. గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం సమాజంలో జరిగిన సంఘటనలతోనే ఉంటుందన్నారు. ది ఒక వ్యక్తి గురించిన కథ కాదని అన్నారు. చిత్ర కథనం ఊహాతీతంగా ఉంటుందని తెలిపారు. అర్జున్, శ్యామ్, తమిళంతో పాటు కన్నడంలోనూ ప్రాచుర్యం పొందినవారు కావడంతో ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం భాషల్లో రూపొందించనున్నట్లు వివరించారు. కథానాయకి ఎంపిక జరుగుతుందన్నారు. ఈ చిత్రానికి కన్నడంలో గేమ్ అనే టైటిల్ను నిర్ణయించినట్టు తమిళంలో ఇంకా పేరు నిర్ణయం కాలేదని దర్శకుడు ఏఎంఆర్ రమేష్ తెలిపారు. -
బైక్ మెకానిక్ కుమారుడు... బాక్సింగ్లో ఘనుడు
విశాఖపట్నం, న్యూస్లైన్: సాధారణ బైక్ మెకానిక్ కుమారుడు, వేసవి సెలవుల్లో స్థానికంగా నిర్వహించిన శిబిరాల్లో శిక్షణ పొందిన బాలుడు.. నేడు అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్లో పతకం సాధించే స్థాయికి ఎదిగాడు. తన పదునైన పంచ్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించి, తొలిరౌండ్లోనే బౌట్ను నిలిపివేసేలా సంచలన ప్రదర్శన కనబరిచిన ఆ యువకుడే విశాఖపట్నానికి చెందిన కాకర శ్యామ్ కుమార్. ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో అద్భుతంగా రాణిస్తూ సెమీఫైనల్కు చేరిన శ్యామ్కుమార్ది విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతం. స్థానికంగా బైక్ మెకానిక్గా పనిచేసే కాకర అర్జున్ నలుగురు సంతానంలో మూడోవాడు శ్యామ్. తాను పదో తరగతి చదువుతున్నప్పుడు తన అన్నయ్య బాక్సింగ్ పంచ్లు విసురుతుంటే చూసి తానూ బాక్సర్ను కావాలనుకున్నాడు. అతని ఆసక్తిని గమనించిన తండ్రి.. శ్యామ్ను స్థానిక సాయ్ శిక్షణ కేంద్రంలో చేర్పించాడు. అక్కడ కోచ్ వెంకటేశ్వరరావు శిక్షణలో మెళకువలు నేర్చిన శ్యామ్.. శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్లో ఫ్లయ్ వెయిట్లో స్వర్ణం సాధించాడు. అనంతరం మహారాష్ట్రలో జూనియర్ నేషనల్స్లో రజతం, ఆలిండియా సాయ్ హాస్టల్స్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలుపొందాడు. అదే ఏడాది కజకిస్తాన్లో జూనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో 46 కేజీల విభాగంలో, అజర్బైజాన్లో జూనియర్స్ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. 2012లో అకోలాలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్లో స్వర్ణం నెగ్గాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అంతర్జాతీయ యూత్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. గత మూడు నెలలు ఔరంగాబాద్లోని జాతీయ శిబిరంలో శిక్షణ పొందిన శ్యామ్... నేరుగా ఏఐబీఏ యూత్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న శ్యామ్ యూత్ ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. -
అవి నాకు కిక్ ఇవ్వలేదు...
తమిళంలో లవర్ బోయ్... తెలుగులో పోలీస్మేన్... యువతుల మనసు దోచే పాత్రలు ఒకచోట... యువ హీరోలకు దీటైన పాత్రలు మరోచోట... శామ్ కెరీర్ ఇవాళ మూడు క్లాప్లు, ఆరు షాట్లతో ఓ ‘రేసుగుర్రం’... తమిళ, తెలుగు సినీ రంగాల్లో అభిమానులనూ, అభిమానించే అగ్ర దర్శకులనూ సంపాదించుకోవడం, బాక్సాఫీస్ విజయాలు అందుకోవడం ఏ నటుడికైనా ‘కిక్’ కాక మరేమిటి? శామ్కు... కాదు... కాదు... ‘కిక్’ శామ్కు తరగని ఆస్తి అదే. ఇంట్లో ఒప్పించి మరీ సినీ హీరో అయిన ఈ ఫుట్బాల్ ఆటగాడి మనసులోని మాటల కచ్చేరీలోని కిక్కే వేరప్పా! హాయ్.. నేను ‘కిక్’ శామ్ని. మీకు కిక్ ఇచ్చే విషయాలు చాలా చెప్పాలని ఉంది. ముందు నా గురించి చెబుతా. నా అసలు పేరు ‘షంషుద్దీన్ ఇబ్రహీం’. సినిమాల కోసం ‘శామ్’ అని మార్చేసుకున్నాను. తెలుగులో మాత్రం నేను చేసిన ‘కిక్’ నా ఇంటి పేరైపోయింది. తమిళ పరిశ్రమలో అందరూ నన్ను సున్నితమైన పాత్రల్లో చూడాలని కోరుకుంటారు. అందుకని ‘చాక్లెట్ బాయ్’ అంటారు. ఇక్కడేమో జోష్గా ‘కిక్ శామ్’ అని అంటారు. నేనిప్పటివరకు తెలుగులో ఆరేడు సినిమాల్లో నటించా. వాటిలో ఎక్కువగా సీరియస్గా ఉండే పోలీసు పాత్రలే. తమిళంలోనేమో సరదా సరదాగా ఉండే పాత్రలు చేస్తుంటా. ఏమైనా పోలీసు పాత్రలకు విరామం తీసుకోవాలనుకుంటున్నా. చేసిన పాత్రలే చేస్తే కిక్కేముంటుంది! అమ్మకు ఇష్టం లేదు! మీకో విషయం చెప్పనా? అసలు నేను సినిమా నటుణ్ణి కావాలనుకుంటున్నానని మా ఇంట్లో చెప్పినప్పుడు పెద్ద రాద్ధాంతమే చేశారు. మా అమ్మగారికి నేను సినిమాల్లోకి రావడం అస్సలిష్టం లేదు. నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ని. యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరుకీ, స్పోర్ట్స్ క్లబ్స్కీ మా కాలేజ్ తరఫున ఆడేవాణ్ణి. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ‘మా ఇంట్లో మంచి క్రీడాకారుడున్నాడు’ అని మా అమ్మ గర్వంగా చెప్పుకునేది. నా ధ్యాస మాత్రం సినిమాల మీదే. అమ్మని ఒప్పించారు నాన్నగారు. కానీ, నేను నటుణ్ణి కాకముందే ఆయన పోయారు. అది నా దురదృష్టం. నాలుగేళ్లు తెగ తిరిగా! సినిమాల్లో అవకాశాల కోసం కొన్నాళ్లు మోడల్గా చేసి, ఆ తర్వాత సినిమాలకు ప్రయత్నం చేయ సాగా. పరిశ్రమలో నాకంటూ ఎవరూ లేకపోవడంతో అంత సులువుగా అవకాశాలు రాలేదు. నాలుగైదేళ్లు తెగ తిరిగా. చివరకు తమిళ దర్శ కుడు జీవా గారి దృష్టిలో పడ్డాను. ‘12 బి’ ద్వారా ఆయన నన్ను హీరోను చేశారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత కూడా ఆయన దర్శకత్వంలోనే ‘ఉళ్లమ్ కేక్కుదే’ సినిమా చేశాను. అదీ నా కెరీర్కు ఉపయోగపడింది. సినీ పరిశ్రమలో జీవా గారు నా గాడ్ఫాదర్. 2008లో ఆయన రష్యాలో గుండెపోటుతో చనిపోయారు. నాకైతే వెన్నెముక కోల్పోయినట్లనిపించింది. లవర్బోయ్గానే చేయమంటున్నారు కెరీర్పరంగా నాకెలాంటి అసంతృప్తీ లేదు. నాకు మహిళా అభిమానులెక్కువ. నేను గడ్డం, మీసాలతో కనిపిస్తే వాళ్లకు నచ్చడం లేదు. వాళ్ల ఇష్టాన్ని కాదనలేను. పరిశ్రమకు వచ్చి పదేళ్లయినా ఇంకా లవర్బోయ్గా చేయాలంటే నాకు బోర్ కొట్టేస్తోంది. అందుకే అప్పుడప్పుడూ యాక్షన్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ క్రమంలోనే నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించుకోవాలనుకున్నాను. నేనిష్టపడే పాత్రలు చేయడం కోసం స్వీయ చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టాను. ‘6’ సినిమా నిర్మించి, నటించాను. నాలుగైదు కోట్ల బడ్జెట్తో ఆ సినిమా తీశాను. లాభం రాలేదు.. నష్టం కూడా తేలేదు. అయితే, ఆ సినిమాతో డబ్బు కన్నా పేరు బాగా వచ్చింది. ఆనందంగా ఉన్నా! తమిళంలో హీరోగా, తెలుగులో కీలక పాత్రలు చేస్తూ ఆనందంగా ఉన్నా. వాస్తవానికి ‘కిక్’ తర్వాత తెలుగులోసోలో హీరోగా చేసి ఉండ వచ్చు. కానీ, వచ్చిన అవకాశాలు అంత కిక్ ఇవ్వలేదు. అందుకే, కీలక పాత్రలకే పరిమితమయ్యా. ప్రేమ వివాహం నాది ప్రేమ వివాహం. నేను ముస్లిమ్. నా భార్య పంజాబీ హిందువు. పేరు - కామ్నా. ‘పంజాబీ అమ్మాయి కోడలుగా వస్తే, ఆమెతో ఏ భాషలో మాట్లాడాలిరా.. మన కుటుంబంతో తను సర్దుకు పోగలుగుతుందా? మన సంప్రదాయాలు వేరు, తనవి వేరు’ అని అమ్మ ససేమిరా అంది. కానీ, చివరకు ఒప్పించాను. ఇప్పుడు మా అమ్మ, నా భార్యతల్లీకూతుళ్లలా ఉంటున్నారు. నాకో వెసులుబాటు ఏమిటంటే.. ఉత్తరాది వంటకాలు తినాలంటే మా ఆవిడ, దక్షిణాది వంటకాలంటే మా అమ్మ చేస్తారు. పెళ్లికి ముందే మేము ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకోవడంతో పెళ్లి తర్వాత మా జీవితం సాఫీగా సాగుతోంది. ‘సినిమాలు తప్ప వేరే దేని మీదా ఆసక్తి కనబరచడు’ అనే నమ్మకం కామ్నాకి ఉంది. ఎలాంటి పరిస్థితిలోనూ చేయి వదలననే నమ్మకం ఆమెకు ఉంది. వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే భార్యాభర్తల మధ్య ‘నమ్మకం’ అవసరం. మేమిద్దరం... మాకిద్దరు పిల్లలున్నారు. పెద్దమ్మాయి పేరు సమైరా. రెండో పాప పేరు కియారా. సమైరా ఒకటో తరగతి చదువుతోంది. కియారాకి రెండేళ్లు. అందరూ మారతారో లేదో నాకు తెలియదు కానీ, తండ్రయిన తర్వాత నాలో చాలా మార్పొచ్చేసింది. నా భార్యకూ, కూతుళ్లకూ నేనే హీరోని. అందుకే సినిమాలు, కుటుంబం తప్ప నాకు వేరే ధ్యాస లేదు. - గోల్డీ -
అంతా ఉత్తుత్తిదే!
అవన్నీ నిజం ఫైట్స్ కాదు డబ్ల్యూడబ్ల్యూఈ ఓ టీవీ సీరియల్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత్లో కొత్తగా కేబుల్ ప్రసారాలు ప్రారంభమైన రోజులవి... స్పోర్ట్స్ చానల్లో వచ్చే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పిల్లల్ని కట్టిపడేసింది. బయట ఆటలకు కూడా పోకుండా టీవీలకు అతుక్కునేలా చేసింది. ఇద్దరు బలమైన వ్యక్తులు ఒకరినొకరు భయంకరంగా రక్తం వచ్చేలా కొట్టుకునేవాళ్లు. దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పేరు మార్చుకుని డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది. అప్పట్లో టీవీలకు అతుక్కుని దీనిని చూసిన వాళ్లు... ఇప్పుడు తమ పిల్లలు దీనిని చూస్తుంటే రిమోట్ ఇచ్చేస్తున్నారు. చూసే తరాలు మారినా వినోదం అలాగే ఉంది. అయితే ఇది నిజమైన యుద్ధం కాదని, కేవలం స్క్రిప్ట్ ప్రకారం సాగే ఓ సీరియల్ మాత్రమే అని తెలిసిన వాళ్లు తక్కువే. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ‘కుస్తీ’... భారతీయులకు పెద్దగా పరిచయం అక్కర్లేని క్రీడ. కండలు తిరిగిన వస్తాదులు పోటీపడుతుంటే ఆసక్తిగా చూసే వాళ్లకు కొదువే ఉండదు. అంతర్జాతీయంగా దీన్ని రెజ్లింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒలింపిక్స్లో కూడా క్రీడాంశమే. ఈ రెజ్లింగ్కు కాస్త గ్లామర్ జోడిస్తే అదే డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల రెజ్లర్లు డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొంటారు. ఈ రెజ్లింగ్ను అభిమానించే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది ఉన్నారు. అయితే ఇది అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఆ ఆటలోని ప్రత్యేకత. కండలు తిరిగిన రెజ్లర్లు ప్రత్యర్థిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టడమే ఈ రెజ్లింగ్. రకరకాల ఫీట్లు ఈ రెజ్లింగ్కు మరింత వన్నె తెచ్చిపెట్టాయి. రెజ్లింగ్ను టీవీల్లో చూసిన వాళ్లకు ఇలా కొట్టుకుంటే ఎవరైనా బతుకుతారా అనే సందేహం రాక మానదు.. అలా ఉంటాయి ఫీట్లు. స్టోరీ-స్క్రీన్ప్లే-డెరైక్షన్... ఒళ్లు గగుర్పొడిచే ఈ ఫీట్లు చేస్తే ఎవరైనా కచ్చితంగా ఆస్పత్రి పాలు కావాల్సిందే . కానీ ఈ రెజ్లర్లకు మాత్రం సాధారణంగా ఏమీ కాదు. ఇందుకు కారణం ఇదంతా డ్రామానే. ఒకడు కొడుతుంటాడు.. ఇంకొకడు చేష్టలుడిగిపోయి దెబ్బతింటుంటాడు... మనకు కనిపించేది అంతవరకే. కానీ అదంతా తూచ్. డబ్ల్యూడబ్ల్యూఈ అంతా నటన. రెజ్లింగ్ను వినోదాత్మకంగా చూపించడమే దీని పని. స్క్రిప్ట్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతాయి. ఎలా ఆడాలి.. ఎలా రక్తికట్టించాలి.. అన్నదే ఇందులో ప్రధానం. అయితే ఇదంతా నిజం అని భ్రమ కల్పించేలా ఫీట్లు ఉంటాయి. అవి అంతవరకే నిజం. నిజానికి ఈ రెజ్లింగ్ మ్యాచ్లు అచ్చం సినిమాల్లో కథలా, టీవీల్లో సీరియల్లా సాగుతాయి. కథనంతో మ్యాచ్లను రక్తికట్టిస్తారు.. ఎప్పుడూ ఒకేలా పోటీలు జరిగితే ఎవరికీ ఆసక్తి ఉండదు. అందుకే శృంగార సంబంధాలు, ఒకడి లవర్ను మరొకడు ఎత్తుకెళ్లడం, ముక్కోణపు ప్రేమ కథలు, పెళ్లిళ్లు, ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకోవడం, జాతి వివక్ష, కిడ్నాప్లు... ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కసారి డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ చూస్తే ఇందులో ఎంత డ్రామా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.‘డబ్ల్యూడబ్ల్యూఈలో ట్రిపుల్ హెచ్ స్టార్ రెజ్లర్.. అతనికో గర్ల్ఫ్రెండ్ ఉంది. పేరు స్టెపనీ మెక్మహోన్. తోటి రెజ్లర్ (డానియల్ బ్రయాన్) ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఈవిషయాన్ని స్టెపనీ, ట్రిపుల్ హెచ్ దగ్గర మొర పెట్టుకుంటుంది. ఎందుకిలా చేశావంటూ అతను బ్రయాన్ను నిలదీస్తాడు. అయితే అనుచితంగా ప్రవర్తించిన బ్రయాన్ను చితక్కొడతాడని ఆమె అనుకుంటుంది. కానీ ట్రిపుల్ హెచ్ ఏమీ చేయకపోవడంతో స్టెపనీ, సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తుంది. వాళ్లొచ్చి అతని చేతికి బేడీలు వేస్తారు. నీవేమీ చేయలేకపోయావంటూ ట్రిపుల్హెచ్పై మండిపడుతుంది. దీంతో అతనికి ఎక్కడా లేని కోపం వస్తుంది. బేడీలతో ఉన్న బ్రయాన్ను ట్రిపుల్ హెచ్ చితక్కొట్టేస్తాడు. అంతేకాదు ఆమెతో కూడా కొట్టిస్తాడు. మొత్తానికి తగినశాస్తి జరిగిందంటూ స్టెపనీ తెగ సంబరపడిపోతుంది. చివరికి బ్రయాన్ను మ్యాచ్లో ఓడించడంతో ఆ ఆనందంలో ట్రిపుల్ హెచ్ను ముద్దాడుతుంది. ఇలా ప్రతీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకులు ఆసక్తికరంగా చూసేలా ఎపిసోడ్ను చిత్రీకరిస్తారు. సాధారణంగా ప్రొఫెషనల్ రెజ్లింగ్ మ్యాచ్లు ఇలా జరగవు. ఉత్తుత్తి మ్యాచ్లు కాబట్టే ఇలా సీరియల్లా రక్తికట్టిస్తారు. సూపర్ టెక్నిక్స్... సాధారణంగా రెజ్లింగ్ క్రీడ యుక్తితో కూడుకున్నది. ప్రత్యర్థిని మట్టికరిపించాలంటే బలమొక్కటే సరిపోదు. యుక్తి కూడా ప్రధానం. దీంతో పాటు వేగం, చురుకుదనం రెజ్లింగ్లో విజేతను నిర్ణయిస్తాయి. బలంతో కొట్టలేని రెజ్లర్లు ప్రత్యర్థిని టెక్నిక్తో చిత్తు చేస్తారు. స్క్రిప్ట్ ప్రకారం పోటీలు జరిగినా...ప్రేక్షకులను ఆకట్టుకునేవి రెజ్లింగ్ టెక్నిక్లే. ఈ రెజ్లింగ్లో లెక్కలేనన్ని టెక్నిక్లు ఉన్నాయి. ఇవే అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. డైవింగ్ బుల్డాగ్, డైవింగ్ హెడ్బట్, డైవింగ్ షోల్డర్ బ్లాక్, ఫ్లయింగ్ నెక్ బ్రేకర్, ఫ్లయింగ్ స్పైనంగ్ హీల్ కిక్, సూసైడ్ డైవ్, ప్లాంచా, రోప్ వాక్, సోమర్సాల్ట్, సూపర్ ప్లెక్స్, పవర్ బాంబ్స్, ఫ్రాగ్ స్ప్లాష్, సెన్టెన్ బాంబ్, సీటెడ్ సెన్టెన్ బై సైకిల్ కిక్, సూపర్ కిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆటలో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు చాలా టెక్నిక్లే ఉన్నాయి. అయితే వీటిలో చాలా టెక్నిక్లు ప్రమాదకరమైనవి. అందుకే వీటిని ప్రదర్శించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అప్పుడప్పుడు అనుకోని ప్రమా దాలు జరుగుతాయి. రిస్క్తో కూడిన టెక్నిక్లను ప్రదర్శించడం ద్వారా రెజ్లర్లు ప్రమాదాల బారిన పడిన సందర్భాలున్నాయి. మనోడూ ఉన్నాడు రాక్, అండర్టేకర్, ట్రిపుల్ హెచ్, కేన్, రికిషి, క్రిస్ బెనాయిట్, స్టోన్ కోల్డ్, రాండీ ఆర్టన్, జాన్ సెనా, క్రిస్ జెరికో...ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఈ స్టార్స్ జాబితాలో భారతదేశానికి చెందిన ఓ రెజ్లర్కూడా ఉన్నాడు. పేరు... దలిప్ సింగ్ రాణా అలియాస్ ది గ్రేట్ ఖలీ. పంజాబ్లో పుట్టి పెరిగిన ఖలీ ఎనిమిదేళ్లుగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆకట్టుకుంటున్నాడు. ఏడు అడుగుల 1 అంగుళం పొడుగు ఉండే ఈ భారీకాయుడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నట్లు ఖలీ రెజ్లింగ్ పాపులారిటీతో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టే కంటే ముందే ద లాంగెస్ట్ యార్డ్ (2005లో)అనే హాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. గెట్ స్మార్ట్ (2008), మెక్ గ్రూబెర్ (2010)తో పాటు 2012లో ఓ ఫ్రెంచ్ సినిమాలో కూడా నటించాడు. 2010లో కుస్తీ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది రామా ది సేవిలియర్లో వాలిగా నటించి మెప్పించాడు. ఖలీ బాలీవుడ్, హాలీవుడ్లోనే కాదు.. బుల్లితెరపైనా మెరిశాడు. కలర్స్ చానెల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రన్నరప్గా నిలిచాడు. డబ్బే డబ్బు... ప్రస్తుతం ఇది వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూ ఈ)గా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే గతంలో దీన్ని క్యాపిటల్ రెజ్లింగ్ కార్పొరేషన్, వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఫెడరేషన్, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్గా పిలిచేవారు. అమెరికాలోని స్టాంఫోర్డ్ కేంద్రంగా డబ్ల్యూడబ్ల్యూఈ కార్యకలాపాలు సాగుతున్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో డబ్ల్యూడబ్ల్యూఈగా ట్రేడవుతోంది. 1952లో ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్గా మొదలైన దీనికి జెస్ మెక్మహోన్, టూట్స్ మోండ్ సృష్టికర్తలు. అతికొద్ది మందితో మొదలైన ఈ రెజ్లింగ్.. ఇంతింతై అన్నట్లు 62 ఏళ్లుగా అభిమానులకు వినోదాన్ని అందిస్తోంది. ఏడాదికి 320 హౌస్ షోలతో 150 దేశాల్లో రెజ్లింగ్ పోటీలు ప్రసారమవుతున్నాయి. 2013లో డబ్ల్యూడబ్ల్యూఈ రాబడి : రూ. 3955.98 కోట్లు మొత్తం మిగులు ఆదాయం : రూ. 828 కోట్లు లాభం : రూ. 594 కోట్లు ఆస్తుల విలువ : రూ. 20,232 కోట్లు ఈక్విటీ : రూ. 13,248 కోట్లు -
సినిమా రివ్యూ: రేసుగుర్రం
ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్, 'కిక్' శ్యామ్, రవి కిషన్, బ్రహ్మానందం యాక్టింగ్ శృతి హాసన్ గ్లామర్ సాంగ్స్, కామెడీ మైనస్ పాయింట్స్: రొటీన్ కథ ఫైట్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'రేసుగుర్రం' ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. దానికి తోడుగా ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న విడుదలైన రేసుగుర్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకోవాల్సిందే. లక్ష్మణ్ ఉరప్ లక్కీ, రామ్ ఇద్దరూ అన్నదమ్ములు. నీతి, నిజాయితీ ఉన్న బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ రామ్, ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీలకు క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంగా లక్కీ, స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్లాన్ వేస్తాడు. శృతిని తనకు దక్కకుండా చేసిన రామ్కు తగిన గుణపాఠం చెప్పాలని అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. లక్కీ దొంగిలించిన కారులో ఉన్నది రామ్ అనుకుని రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి వర్గం ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడుతాడు. ఆ దాడి నుంచి బయటపడిన శివారెడ్డి ఏం చేశాడు? శివారెడ్డికి రామ్ మధ్య శతృత్వానికి కారణమేంటి? లక్కీ, స్పందనల ప్రేమ వ్యవహారాన్ని రామ్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటాడు? రామ్, లక్కీల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి అనే సమస్యలకు ముంగిపే 'రేసుగుర్రం' చిత్ర కథ. పెర్ఫార్మెన్స్: అల్లు అర్జున్లో ఎనర్జీ లక్కీ పాత్రకు సూట్ అయింది. యాక్షన్, ఎంటర్టైన్ మెంట్, లవ్ సీన్స్లో నటించడం అర్జున్కు కొత్తేమీ కాదు. తనదైన శైలిలో లక్కీ పాత్రలో ఉండే వివిధ కోణాలకు అల్లు అర్జున్ న్యాయం చేకూర్చారు. స్పందనగా శృతి హాసన్ గత చిత్రాల్లో ఎన్నడూ లేనంతగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. స్పందన పాత్రలో ఓ ఢిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. దాన్ని శృతి హాసన్ బాగా పండించింది. కిక్ శ్యామ్ ప్రేయసిగా సలోని గెస్ట్ గా కనిపించింది. ఈ చిత్రంలో తనకు లభించిన సీన్లలో తెలంగాణ యాసలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అంతగా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు. కిక్ శ్యామ్ పోలీస్ ఆఫీసర్గా, అల్లు అర్జున్ అన్నగా పర్వాలేదనిపించాడు. కిక్ తర్వాత అలాంటి తరహా పాత్రనే రిపీట్ చేశాడా అనిపించింది. మెయిన్ విలన్గా మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్పూరి నటుడు రవికిషన్ నటించాడు. రౌడీగా మారిన రాజకీయవేత్తగా రవికిషన్ వీలైనంత మేరకు మంచి నటనే అందించాడు. మరోసారి బ్రహ్మనందం కామెడీతో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ కిల్ బిల్ పాండే గా క్లైమాక్స్లో హంగామా చేశాడు. ప్రీ క్లైమాక్స్ ఎంటరై.. క్లైమాక్స్ వరకు చిత్ర భారాన్ని తన భుజాలపై బ్రహ్మానందం ఎత్తుకున్నాడు. చిత్రమంతా రొటీన్గా ఉందే అనుకునే సమయంలో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితర కమెడియన్లు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. స్పందన తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కొన్ని సీన్లకు తనదైన స్టైల్లో ప్రకాశ్ రాజ్ న్యాయం చేశాడు. మిగతా పాత్రల్లో తనికెళ్ల భరణి, ముఖేశ్ రుషి నటించారు. టెక్నికల్: తమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు కీలక సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇచ్చింది. పాటల్లో అర్జున్ పై చిత్రీకరించిన సోలో సాంగ్... బూచోడే, 'సినిమా చూపిస్త మామా' పాటలు ఆడియో పరంగానే కాకుండా తెరపై కూడా ఆకట్టుకున్నాయి. టెక్నికల్ అంశాలు చూస్తే మనోజ్ పరమహంస కెమెరా చాలా రిచ్గా ఉంది. శృతి హాసన్, అల్లు అర్జున్ క్యాస్టూమ్ అదిరిపోయేలా ఉన్నాయి. కొత్త లుక్ తో డిజైన్ చేసిన క్యాస్టూమ్ శృతి, అల్లు అర్జున్ కు మరింత గ్లామర్ ను పెంచాయి. డైరెక్షన్: టేకింగ్లో దర్శకుడు సురేందర్ రెడ్డి టాలీవుడ్లో విలక్షణమైన శైలి అని గత చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే కథ కన్నా అల్లు అర్జున్లోని స్టైలిష్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. కిక్ సినిమాలో ఆలీ క్యారెక్టర్ను కొనసాగింపుగా ఈ చిత్రంలో ఇంట్రడ్యూస్ చేసినా సరైన స్పేస్ లేని కారణంగానో, ఇతర పరిమితుల కారణంగానో బెడిసి కొట్టింది. ముఖేశ్ రుషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ క్యారెక్టర్లను సరైన దృష్టి పెట్టకుండా వదిలేశాడనే ఓ చిన్న ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ కథ, కొత్తదనం లేని విలనిజంతో చేసిన సాహసం అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా.. క్లైమాక్స్లో బ్రహ్మానందాన్ని తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు. బ్రహ్మనందం ఎపిసోడ్ నడిపించిన తీరు గ్రిప్పింగ్ గా ఉంది. ఈ చిత్రంలోని 'రేసుగుర్రం' అర్జున్ ఎనర్జీని బ్రహ్మానందానికి ఇచ్చేసి రొటీన్కు భిన్నంగా కొత్త ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకంఢాఫ్ లో కథపై కొంత ఎక్సర్ సైజ్ చేసి ఉంటే మంచి ఫలితాలన్ని రాబట్టే అవకాశం ఉండేది. మార్కెట్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పై దృష్టి సారిస్తున్నారనే ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మాస్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను జోడించి రేసుగుర్రాన్ని పరిగెత్తించిన సురేందర్ రెడ్డి... వినోదాన్ని ఆశించిన ప్రేక్షకుల్లో సంతృప్తి నింపి.. కొత్తదనం ఆశించిన వారిని కొంచెం నిరాశకు గురి చేశాడు. ట్యాగ్: బ్రహ్మీ బలంతో పరుగెత్తిన రేసుగుర్రం