Slapped
-
బీజేపీ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన న్యాయవాది.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ ఎమ్మెల్యేపై జరిగిన దాడి సర్వత్రా చర్చనీయాంశమైంది. లఖింపూర్లో బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ చెంప చెళ్లుమనించాడు ఓ న్యాయవాది చెంపపై న్యాయవాది కొట్టాడు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరగ్గా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 14న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాను తారుమారు చేశారని, కొంత మంది సభ్యులను జాబితా నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్సింగ్, ఎమ్మెల్యే యోగేష్ వర్మ డిమాండ్ చేశారు. బుధవారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం)కు వినతి పత్రం సమర్పించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) సంజయ్ సింగ్ ధృవీకరించారు.అయితే, కలెక్టర్ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది అవధేష్ సింగ్ దాడికి ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఎమ్మెల్యే చెంపపై ఆయన కొట్టాడు. అంతేగాక సింగ్ మద్దతుదారులు, మరికొంతమంది న్యాయవాదులు కూడా ఎమ్మెల్యేపై చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే తిరిగి ప్రతి దాడికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.Uttar Pradesh: In Lakhimpur, tensions flared during the Urban Cooperative Bank election as Sadar MLA Yogesh Verma and Bar Association President Avadhesh Singh clashed pic.twitter.com/qF9mFi5Mps— IANS (@ians_india) October 9, 2024 -
యువతిపై ఓలా డ్రైవర్ దాడి, స్పందించిన ఓలా: వీడియో వైరల్
బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతిపై అనుచితంగా ప్రవర్తించి, దుర్బాషలాడి, దాడిచేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగినఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. బాధిత యువతి ఎక్స్లో షేర్ చేసిన వివరాల ప్రకారం తన స్నేహితురాలితో కలిసి బెంగళూరు సిటీలో ఓలా ఆటో రైడ్ను బుక్ చేసుకున్నారు. తొందరగా వెళ్లాలనే ఉద్దేశంలో ఇద్దరూ ఓలా రైడ్ కోసం ప్రయత్నించగా ఇద్దరివీ బుక్ అయ్యాయి. ఇదే వివాదానికి దారి తీసింది. ముందుగా వచ్చిన ఆటోలో యువతులిద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఇంతలో 15 నిమిషాలు ఆలస్యం చూపించిన రెండో ఆటోను రద్దు చేసింది. కానీ అక్కడికి చేరుకున్న రెండో ఆటోవాలా తన రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ వాదనకు దిగాడు. అంతేకాదు పెట్రోల్ ఊరికే వస్తుందా, అంటూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగాడు ఆటో డ్రైవర్. దీంతో నన్ను చెంపపై ఎందుకు కొట్టావ్ అంటూ ఆమె గట్టిగా నిలదీసింది. అప్పటిదాకా చోద్యం చూస్తూ కూర్చున్న మిగిలిన డ్రైవర్లు, జోక్యం చేసుకుని అతగాడిని పక్కకు తీసుకెళ్లారు.Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7— Niti (@nihihiti) September 4, 2024కాగా బాధిత యువతి నితి తన నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఓలా కస్టమర్ సపోర్ట్ ఫిర్యాదు చేసినా, ఆటోమేటెడ్ ప్రత్యుత్తరాలు మాత్రమే అందాయి తప్ప, అంతకుమించి ఎలాంటి స్పందన లేదని ట్వీట్ చేసింది. తన స్నేహితురాలు క్లాస్ మిస్ కాకుండా చూసుకోవడానికి రెండు ఆటోలను బుక్ చేసుకోవడం మాత్రమే తమ తప్పు అని, రైడ్ రద్దుపై వివాదాలు సర్వసాధారణమైనప్పటికీ, డ్రైవర్ బెదిరింపులు, అమానుష ప్రవర్తన హద్దు మీరిందంటూ ఆగ్రహం చేసింది. అయితే దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.ఓలా స్పందనఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఓలా స్పందించింది. డ్రైవర్ చర్యలను ఖండిస్తోంది. నిందితుడైన డ్రైవర్పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అటువంటి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి తమ ప్రయాణీకుల భద్రతకు భరోసాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. -
ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్పై దాడి
ఢిల్లీ: కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లకు 11 రోజుల పాటు సమ్మె చేసి ఇటీవల విరమించారు. సమ్మె విరమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓ రెసిడెంట్ డాక్టర్, మెడికల్ డ్రెస్సర్పై దాడి జరిగింది. ఈ ఘటన ఢిల్లీలోని కర్కర్దూమాలో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ హాస్పిటల్లో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. బాధిత డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘శనివారం అర్ధరాత్రి 1 గంటలకు తలపై గాయంతో ఓ వ్యక్తి హాస్పిటల్కు వచ్చాడు. గాయానికి కుట్లు వేయటం కోసం డ్రెసింగ్ రూంలోకి పేషెంట్ను తీసుకువెళ్లాను. నేను గాయానికి కుట్లు వేస్తున్న సమయంలో పేషెంట్ ఒక్కసారిగా నాపై దుర్భాషలాడు. రూంకి బయట ఉన్న.. పేషెంట్ కుమారుడు వెంటనే లోపలికి నా ముఖంపై దాడి చేశాడు. తర్వాత ఇద్దరూ నన్ను దుర్భాషలాడారు’’ అని బాధిత రెసిడెంట్ డాక్టర్ తెలిపారు. పేషెంట్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని డాక్టర్ తెలిపారు. ఢిల్లీలోని వందలాది రెసిడెంట్ డాక్టర్లు ఆగస్టు 23న తమ సమస్యలను పరిష్కరించి, రక్షణ కల్పించాలని సమ్మె చేపట్టారు. అయితే సుప్రీంకోర్టు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అనుసరించి విధుల్లో చేరారు. రెసిడెంట్ డాక్టర్లు.. ఆగస్టు 12న ప్రారంభించిన సమ్మె కారణంగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. -
కంగనా రనౌత్కు చెంపదెబ్బ : ఆమె బెంగళూరుకు బదిలీ
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న వివాదంలో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కుల్విందర్ కౌర్కు ఊరట లభించింది. ఆమెపై సస్పెన్షన్ ఉపసంహరించుకున్నఅనంతరం, బెంగళూరులోని CISF రిజర్వ్ బెటాలియన్కు బదిలీ చేశారు.చంఢీగడ్ ఎయిర్పోర్టులో రైతు ఉద్యమాన్ని కించపర్చారంటూ సీఐఎస్ఎఫ్ జవాను కుల్విందర్ కౌర్ కంగనాను చెంప దెబ్బ కొట్టారు. ఈ కేసులో ఆమె సస్పెన్షనకు గురైంది. తాజాగా ఆమెను బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం.కాగా 2024 ఎన్నికల్లో బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పార్లమెంట్కు ఎంపికైన కంగనాను గత నెలలో చంఢీగడ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కౌర్ చెంపదెబ్బ కొట్టడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై అంతర్గత విచారణ తర్వాత కౌర్పై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో దాడి కేసు కూడా నమోదైంది. ఈ ఘటనలో విమర్శలతో పాటు ఆమెకు మద్దతు కూడా లభించింది. ఆమెకు తాను ఉద్యోగం ఇస్తానంటూ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ, తదితరులు ఆఫర్లు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కంగనను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్కు జాబ్ ఆఫర్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను చండీగఢ్ ఎయిర్పోర్టులో ఓ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. తాజాగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్కు గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచాడు. అతను తన ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ.. ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే..కానిస్టేబుల్కి తాను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నేను హింసను ఎప్పుడూ సమర్ధించను. కానీ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. అలాగే ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్ జై కిసాన్ అంటూ తన పోస్ట్ లో తెలిపారు. కాగా గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నాపై.. కంగనా అనుచిత చేసిన వ్యాఖ్యలను గానూ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢీల్లీ వెళ్తుండగా ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో నటి చెంప చెళ్లుమనిపించారు. ఆ ధర్నాలో తన తల్లి కూడా ఉందని, రైతులను అవమానించినందుకే తాను ఈపని చేసినట్లు కానిస్టేబుల్ తెలిపారు. అయితే కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ను అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆమెపై విచారణ జరుగుతోంది. -
ఎయిర్పోర్ట్లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్పై సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. చండీఘర్ ఎయిర్పోర్ట్కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ను కుల్వీందర్ కౌర్గా గుర్తించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024 -
కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది!
న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై గురువారం దాడి జరిగింది. ఛండీగఢ్ ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది ఒకరు ఆమెపై చెయ్యి చేసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల్ని, రైతు ఉద్యమాన్ని అవమానించేలా కంగనా మాట్లాడిందంటూ సదరు సిబ్బంది దాడి చేసినట్లు సమాచారం. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ను కుల్వీందర్ కౌర్గా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారుల్ని కలిసి కంగన ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ నిమిత్తం సీఐఎస్ఎప్ కమాండెంట్ కార్యాలయానికి తరలించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. This is Kulwinder Kaur, the CISF officer posted at Chandigarh airport who slapped actor and BJP MP #KanganaRanaut today. pic.twitter.com/fTiQzwrf3x— هارون خان (@iamharunkhan) June 6, 2024 -
అభిమానిపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
సాక్షి, సత్యసాయి: ఎన్నికల ప్రచారం మొదలుపెట్టక ముందే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన శైలిలో దబ్బిడి దిబ్బిడి షురూ చేసేశారు. సహనం కోల్పోయి ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. శనివారం ఉదయం సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇవాళ్టి నుంచి బాలయ్య బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెలికాఫ్టర్లో కదిరికి ఆయన చేరుకున్నారు. ఆయన ల్యాండ్ కాగానే అభిమానులు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా.. బాలయ్య సహనం కోల్పోయారు. ఆ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అభిమానులపైనా ఆగ్రహం ప్రదర్శించారు. పక్కనే ఉన్న నేతలు సైతం ఆ అభిమానిని దూరంగా నెట్టేశారు. ఇదీ చదవండి: బాలయ్య కోపం ఎవరి మీద?.. అభిమానులు జర జాగ్రత్త! -
మోదీ భజన చేసే యువత చెంప పగలగొట్టాలి: కర్ణాటక మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కర్ణాటక రాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని, ప్రధానిని పొగిడే యువత చెంప పగలగొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి అన్నారు. కారటగిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శివరాజ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మరోసారి ప్రజలను మోసం చేయవచ్చని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. ‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. ఇచ్చారా? మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతిచ్చే యువత సిగ్గుపడాలి. వాళ్ల చెంప పగలగొట్టాలి. పదేళ్లుగా అబద్ధాలతోనే నడిపించారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఒక్కటైనా చెప్పండి’ అని ప్రశ్నించారు. ‘ఆయన (ప్రధాని మోదీ) తెలివైనవాడు. బాగా దుస్తులు ధరిస్తాడు. స్మార్ట్ ప్రసంగాలు చేస్తాడు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి పూజలు చేస్తూ స్టంటులు చేస్తాడు. ఒక ప్రధానమంత్రి చేయవలసిన పని ఇదేనా?’ అన్నారు. -
లిఫ్ట్లోకి కుక్క.. మహిళతో రిటైర్డ్ ఐఏఎస్ డిష్యుం డిష్యుం
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మహిళ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి పెంపుడు కుక్కను తీసుకురావడంతో దాని మాజమాని, మరో నివాసితుడికి వాగ్వాదం జరిగింది. ఇరువురు విచక్షణ మరిచి తగువులాడుకున్నారు. ఏకంగా చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రధేశ్లోని గ్రేటర్ నోయిడాలోవెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. నోయిడాలోని 108 సెక్టర్ పార్క్ లారేట్ సొసైటీలోని ఓ అపార్ట్మెట్లోని ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఆ కుక్కను ఇటీవల అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి తీసుకెళ్లింది. అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అందుకు అంగీకరించలేదు. కుక్క విషయంతో రిటైర్డ్ అధికారి, మహిళ మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్లో కుక్కను తీసుకొచ్చిన ఫోటోను తీస్తుండగా మహిళ అతని ఫోన్ లాక్కుంది. వెంటనే సదరు అధికారి కూడా మహిళ ఫోన్ లాక్కున్నాడు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. చెంపదెబ్బల వర్షం ఈ గొడవలో వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కూడా వ్యక్తిని అడ్డుకొని దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మహిళ తనపై జరిగిన దాడి విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన కూడా గొడవలోకి ప్రవేశించాడు. ఇతర నివాసితులు లిఫ్ట్లోకి రాకుండా మహిళ అడ్డుకోవడంతో ఆమె భర్త వ్యక్తిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు. చివరికి అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని ఇద్దరిని వీడదీయడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇరువర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత Fight Over taking a Dog 🐕 inside Lift (Obviously in Noida). First Retired IAS Officer beat 👊 a Women Then her Husband beat 👊 that IAS Officer Dog 🐕 Enjoyed Both 🤗😅#UttarPradesh #NationalUnityDay #SardarVallabhbhaiPatel #राष्ट्रीय_एकता #SardarPatelJayanti… pic.twitter.com/H1J18BEEVO — Dr Jain (@DrJain21) October 31, 2023 పెరుగుతున్న గొడవలు పెంపుడు కుక్కులను లిఫ్ట్లలోకి తీసుకెళ్లవచ్చా అనే విషయంపై దేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానులు, అపార్ట్మెంట్ నివాసితుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలపై గొడవలు పెరుగుతున్నాయి. నోయిడాలోని అనేక అపార్ట్మెంట్లు పెంపుడు కుక్కలను లిఫ్ట్లోకి తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అయితే వాటి మాజమానులు మాత్రం అలాంటి ఆదేశాలు చట్టబద్దమైనవి కావని వాదిస్తున్నారు.. గతేడాది సైతం అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల చిన్నారిని కరిచినందుకు పెంపుడు కుక్క మాజమానికి గ్రేటర్నోయిడా అడ్మినిస్ట్రేషన్ రూ. 10 వేల జరిమానా విధించింది. -
కానిస్టేబుల్ చెంపపై కొట్టిన హోంమంత్రి మహమూద్ అలీ
-
అమానవీయ ఘటన.. దళితునితో చెప్పులు నాకించి..
లక్నో: మధ్యప్రదేశ్లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ సంఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దళిత యువకునితో చెప్పులు నాకించాడు. అనంతరం బాధితున్ని కుంజీలు తీయించాడు. అతనిపై పరుష పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ ఘటన సోనభద్ర జిల్లాలో వెలుగులోకి రాగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితున్ని అరెస్టు చేశారు. Video: Dalit Man Slapped, Forced To Lick Slipper In Uttar Pradesh https://t.co/AR6lx8dCSH pic.twitter.com/1wMGWNS06C — NDTV News feed (@ndtvfeed) July 8, 2023 దళిత వ్యక్తి తన మామయ్య ఇంట్లో ఎలక్ట్రిసిటీ సమస్య కారణంగా లైన్మెన్ తేజ్బలి సింగ్ని ఇంటికి పిలిచారు. ఈ అంశంలో వివాదం రాగా.. తేజ్బలి సింగ్ రెచ్చిపోయాడు. దళిత వ్యక్తితో చెప్పులు నాకించాడు. కుంజీలు తీయించాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: మధ్యప్రదేశ్లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్ -
చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే గంప గోవర్థన్.. అసలు వివాదం ఏంటి?
సాక్షి, కామారెడ్డి: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ వివాదంలో చిక్కుకున్నారు. రైస్మిల్లు సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నారు. బిక్నూర్ మండలం పెద్దమల్లారెడ్డిలో ఘటన జరిగింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే రైస్మిల్లుకు వెళ్లారు. రైస్ మిల్లు సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గంప గోవర్థన్ చెంప చెల్లుమనిపించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వీడియో వైరల్గా మారింది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మిల్లులో మిల్లర్లు లోడింగ్ నిలిపివేశారు. మిల్లరతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్లకు క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్ చేశారు. చదవండి: తెలంగాణ పాలిటిక్స్లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ? -
ఆ మూడు చెంప దెబ్బల వల్ల బాలీవుడ్ వదిలేద్దామనుకున్నా: శక్తి కపూర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 80, 90లలో ఆయన హింది చిత్రాల్లో విలన్గా, కమెడియన్గా నటించి స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు. ఇక వారసురాలిగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా బి-టౌన్లో గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే తనదైన నటన, కామెడీతో విలక్షణ నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన శక్తి కపూర్ ఒకానోక సమయంలో పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న లెజెండరి కమెడియన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా షోకు శక్తి కపూర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు మరో హాస్యనటులు అస్రానీ, పెంటల్, టీకు తల్సానియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శక్తి కపూర్ మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను మూడు చెంప దెబ్బలు తిన్నానని, దానివల్ల తాను పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నా మొదటి కామెడీ చిత్రం సత్తె పే సత్తా. ఇందులో పెంటల్తో కలిసి పని చేశాను. అది చాలా మంచి చిత్రం. అందులో నటించాలని ఓ కామెడీ పాత్ర కోసం రాజ్ సిప్పీ నన్ను సంప్రదించినప్పుడు నా విలన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నట్లు అనిపించింది. అందుకు తగ్గట్లే ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత మావాలి అనే సినిమా చేశాను. సినిమాలో మొదటి షాట్ తీస్తున్నప్పుడు ఖాదర్ఖాన్ నా చెంప మీద కొట్టాడు. దాంతో నేను నేలపై పడ్డాను. రెండో షాట్లో అరుణా ఇరానీ చెంప మీద కొట్టింది. మళ్లీ నేలపై పడ్డాను. మూడోసారి కూడా అదే జరిగింది. దాంతో నా కెరీర్ ముగిసింది అనుకున్నా’ అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మూడుసార్లు చెంప దెబ్బలకు నెలపై పడ్డ నేను.. నా కెరీర్ ముగిసిపోయిందని ఆందోళన పడ్డాను. ఈ సినిమాకు కె.బాపయ్య దర్శకత్వం వహించారు. అందులో ఖాదర్ ఖాన్ కూడా నటించారు. ఇక షూటింగ్ గ్యాప్లో ఖాదర్ ఖాన్ వద్దకు వెళ్లి.. మీకు దండం పెడతా(కాళ్లు మొక్కుతా అని బతిమాలను). నాకు సాయంత్రం టిక్కెట్ బుక్ చేయండి. నేను వెళ్లిపోతా. ఈ సినిమా నేను చేయలేను. నా కెరీర్ కూడా ముగిసిపోయింది. నాకు ఇంకా పెళ్లి కూడా కాదు’ అని అన్నాను. అయితే అదంతా గమనించిన యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగన్ నా దగ్గరకి వచ్చి.. ‘ఈ చెంప దెబ్బ మీకు మరింత పాపులారిటిని తెచ్చి పెడుతుంది. మీరు ఏమాత్రం ఆలోచించకుండ ఈ సినిమా చేయండి’ అని సలహా ఇచ్చారు. ఆయన అడ్వైస్తో నేను ఇండస్ట్రీలో కొనసాగను’’ అంటూ శక్తి కపూర్ చెప్పుకొచ్చారు. చదవండి: ఆసక్తిగా సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష టైటిల్ గ్లింప్స్, ఎన్టీఆర్ వాయిస్ అదుర్స్ అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ -
ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఘోర అవమానం.. చెంప చెళ్లుమనిపించిన మహిళ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు మరోసారి ఘోర అవమానం ఎదురైంది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించింది. అధిక ధరలు, నిరుద్యోగాన్ని అరికట్టడంలో మెక్రాన్ విఫలమయ్యాడంటూ ఆరోపిస్తూ మహిళ దాడి చేసింది. భద్రతా సిబ్బంది వచ్చేలోపే ఆమె ఈ ఘటనకు పాల్పడింది. వెంటనే సెక్యూరిటీ గార్డులు మహిళను గుంపు నుంచి పక్కకు లాగి అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి పాల్పడిన మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో బారియర్కు అటువైపున్న మాక్రాన్ తన ఎదురుగా ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడ గుంపులో ఉన్న ఓ మహిళ అధ్యక్షుడి చెంప పగలగొట్టింది ఫ్రాన్స్లోని డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్'హెర్మిటేజ్ అనే పట్టణాన్ని మాక్రాన్ సందర్శించిన సమయంలో ఈ దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. చదవండి: 10 రోజుల్లో 12 మందికి శిరచ్ఛేదం.. మరణ దండనలో రాజీపడని సౌదీ.. Emmanuel Macron got slapped up again pic.twitter.com/puqyPnJOyB — Luke Rudkowski (@Lukewearechange) November 20, 2022 ఇదిలా ఉండగా గతేడాది కోవిడ్ సమయం జూన్లో కూడా మెక్రాన్పై ఓ ర్యాలీలో దాడి జరిగింది. ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా ఓ యువకుడు ఆయన చెంపపై కొట్టాడు.అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని నాలుగు నెలలపాటు జైలు శిక్ష వేశారు. అయితే మాక్రాన్పై దాడి ఘటన ఇప్పటిది కాదని.. ఇది పాత వీడియో అని కొందరు ప్రచారం చేస్తున్నారు. గతేడాది జరిగిన సంఘటనకు సంబంధించినది చెబుతున్నారు. అంతేగాక దాడి చేసింది మహిళ కాదని వ్యక్తి అని అంటున్నారు. వీడియో వెనక భాగం నుంచి రికార్డ్ చేయడం ద్వారా మహిళ అధ్యక్షుడిపై దాడి చేసినట్లు కనిపిస్తుందని వాస్తవానికి అది అబ్బాయి అని పేర్కొంటున్నారు. ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. -
వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను చెప్పుతో కొట్టిన భార్య
-
లైవ్లో కుర్రాడి దవడ పగలగొట్టిన రిపోర్టర్
వైరల్: లైవ్లో యాంకర్లు, జర్నలిస్టుల వీడియోలు తరచూ వైరల్ అవుతున్నవే. అలాంటిది ఈ వీడియో. లైవ్లోనే ఓ కుర్రాడి దవడ పగలకొట్టింది రిపోర్టర్. దీంతో ఆమెను సపోర్ట్ చేసేవాళ్లు కొందరైతే.. మరికొందరు తిట్టిపోస్తున్నారు. చుట్టూ జనం మూగి ఉన్న టైంలో.. ఆమె అక్కడ రిపోర్టింగ్ చేస్తూ కనిపించింది. అయితే.. ఉన్నట్లుండి ఒక్కసారిగా అసహనంతో ఆమె పక్కనే ఉన్న కుర్రాడి చెంప పగలకొట్టింది. బహుశా విసిగించినందుకే ఆమె అలా చేసి ఉంటుందని భావిస్తున్నారు చాలామంది. వీడియో ట్విటర్లో పోస్ట్ చేసిన వ్యక్తి కూడా ఆమె ఎందుకలా చేసిందో కారణం చెప్పలేదు. బహుశా ఆ కుర్రాడు అసభ్యంగానో, అభ్యంతరకరంగానో ప్రవర్తించి ఉంటాడని.. అందుకనే అలా శిక్షించి ఉంటుందని మద్దతు ప్రకటిస్తున్నారు కొందరు. పాకిస్థాన్లో ఈద్ అల్ అదా వేడుకల సందర్భంగా రిపోర్టింగ్ చేస్తున్న టైంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ????????? pic.twitter.com/Vlojdq3bYO — مومنہ (@ItxMeKarma) July 11, 2022 మైరా హష్మీ వివరణ ఆ వీడియోలో ఉన్న జర్నలిస్ట్ పేరు మైరా హష్మీ. సోషల్ మీడియాలో ఆమె వీడియో ట్రోల్ అవుతుండడంతో స్పందించింది. ఇంటర్వ్యూ టైంలో ఆ కుర్రాడు పక్కనే ఉన్న కుటుంబాన్ని వేధిస్తున్నాడు. ఇది వాళ్లను ఇబ్బందికి గురి చేసింది. అలా చేయొద్దని మొదట మంచిగా చెప్పాను. కానీ, సౌండ్ చేస్తూ మరింత రెచ్చిపోయాడు. సహించాలా? అతనికి మళ్లీ అవకాశం ఇవ్వాలా? అనిపించింది. అందుకే అలా చేశా అని ఆమె ట్విటర్లో వివరణ ఇచ్చుకుంది. అయితే విషయం ఏదైనా సరే అలా పబ్లిక్పై చెయ్యి చేసుకునే హక్కు ఆమె ఎక్కడిదని? పలువురు నెటిజన్స్ నిలదీస్తున్నారు. یہ لڑکا انٹرویو کے دوران فیملی کو تنگ کر رہا تھا _جسکی وجہ سے فیملی پریشان ہوگئی تھی__میں نے پہلے پیار سے سمجھایا کے ایسا نہیں کرو مگر سمجھانے کے باوجود یہ لڑکا نہیں سمجھا اور زیادہ ہُلّڑ بازی کررہا تھا_ جس کے بعد مجھے زیب نہیں دیا کہ اسے اور موقع دیکر برداشت کیا جائے ؟ pic.twitter.com/4jmuSsInYg — Maira Hashmi (@MairaHashmi7) July 11, 2022 -
పార్టీ కార్యకర్తలను కొట్టిన మాజీ సీఎం భార్య.. వీడియో వైరల్
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సతీమణ రబ్రీ దేవీ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. ఏకంగా కార్యకర్తలపై చేయి చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను లాలూ కుటుంబ సభ్యులు భూములు, ప్రాపర్టీలను ముడుపులుగా తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలతో పాటు మరో 15 మంది ఇళ్లలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు సీబీఐ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. లాలూ ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని, అందులో భాగంగానే ఈ కేసులంటూ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో రబ్రీదేవి పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిరసనల సందర్భంగా లాలూ ఇంటి వద్ద కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj — देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022 ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీలో కలకలం -
బీజేపీ నేత చెంప చెళ్లుమనిపించారు.. వీడియో వైరల్
BJP Leader Vinayak Ambekar Slapped..ఎన్సీపీ అధినేత శరద్ పవార్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెట్టిన పోస్టుల వేడి మహారాష్ట్రలో ఇంకా తగ్గలేదు. శనివారం పవార్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినందుకు గాను మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే మీద థానే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆదివారం ఆమెను కోర్టులో హాజరుపరుచగా.. మే 18వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. తాజాగా పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్పై ఎన్సీపీ(నేషనలిస్ట్ పార్టీ) నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో వారు.. వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించడం హాట్ టాపిక్గా మారింది. ఎన్సీపీ కార్యకర్తల దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటిల్ ట్విటర్ట్ వేదికగా స్పందిస్తూ.. వినాయక్ అంబేకర్పై ఎన్సీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. బీజేపీ పార్టీ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వినాయక్పై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. శరద్ పవార్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ.. భారత రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటన స్వేచ్చను కల్పించందని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. సీనియర్ రాజకీయవేత్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. महाराष्ट्र प्रदेश भारतीय जनता पार्टीचे प्रवक्ते प्रा. विनायक आंबेकर यांच्या वर राष्ट्रवादीच्या गुंडांनी भ्याड हल्ला केला असून, भाजपाच्या वतीने मी या हल्ल्याचा तीव्र शब्दांत निषेध व्यक्त करतो. राष्ट्रवादीच्या या गुंडांवर तात्काळ कारवाई झालीच पाहिजे !@BJP4Maharashtra pic.twitter.com/qR7lNc1IEN — Chandrakant Patil (@ChDadaPatil) May 14, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతలు చూస్తూ కూర్చుంటే సరిపోదు. -
క్షణికావేశంలో తప్పు చేసిన భార్య.. భర్త ఏం చేశాడంటే..?
దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు సహజం. గొడవలున్నా సర్దుకుపోయి జీవించాలని పెద్దలు చెబుతుంటారు. కాగా, క్షణికావేశంలో భార్య చేసిన చిన్న తప్పు వివాహ బంధాన్ని నాశనం చేసింది. ఆమెను జీవితాంతం బాధపడేలా చేసి.. చివరకు విడాకులకు దారి తీసింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు చెందిన దంపతులు పదేళ్లకుపైగా విదేశంలో నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కారణంగా వారు నివసిస్తున్న దేశంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారు తిరిగి స్వదేశానికి రావాల్సి వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, వారు విదేశాల్లోనే చదువుతున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భర్త.. ఓ వ్యాపారం ప్రారంభించగా.. భార్య ఓ కాలేజీలో ఉద్యోగం చేస్తోంది. అయితే, వారు భోపాల్కు రావడం భార్యకు ఎంతమాత్రం ఇష్టం లేకపోవడంతో భర్తతో ఆమె తరచూ గొడవపడేది. ఈ క్రమంలోనే వీరిద్దరూ గొడవ పడుతుండగా ఆవేశంతో రగిలిపోయిన భార్య.. భర్తను చెప్పుతో కొట్టింది. దీంతో ఒక్కసారిగా షాకైన భర్త.. తేరుకొని దీన్ని అవమానంగా ఫీలయ్యాడు. అనంతరం ఆమెతో విడిపోయేందుకు సిద్ధపడి విడాకులకు దరఖాస్తు చేశాడు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించడానికి ప్రయత్నించారు. కౌన్సిలింగ్ సమయంలో భార్య తన తప్పును ఒప్పుకుంది. భర్త మాత్రం జరిగిన ఘటనను అవమానంగా భావించి.. ఆమెతో జీవించలేనని తెగెసిచెప్పాడు. విడాకులు కావాలని పట్టుబట్టాడు. అనంతరం భర్తను భార్య ఎంత బ్రతిమిలాడిన అతను మససు మాత్రం మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక కోర్టు వారికి విడాకులు మంజూరుచేసింది. ఇది కూడా చదవండి: వివాహమైన మూడు నెలలకే దారుణం -
ఒలింపిక్స్: కాలర్ పట్టి ఆటగాడి చెంపలు వాయించిన కోచ్
టోక్యో: విశ్వ క్రీడా పోటీలు జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతుండగా క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రీడా పోటీల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ క్రీడాకారుడిని కోచ్ రెండు చెంపలు వాయించి పోటీలకు పంపించాడు. కోచ్ కొడుతుంటే ప్లేయర్ ఏమనకుండా ఓకే అంటూ బరిలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అసలు కోచ్ ఎందుకు కొట్టారు? అనే సందేహం అందరిలో ఆసక్తి రేపుతోంది. మీరు చదివి తెలుసుకోండి.. ఎందుకో.. ఒలింపిక్స్లో జూడో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో జర్మనీకి చెందిన జూడో స్టార్ మార్టినా ట్రాడోస్ పాల్గొంది. రింగ్లోకి వెళ్లేముందు కోచ్ క్లాడియో పుస రెండు చేతులతో కాలర్ పట్టుకుని చెంపలపై వేగంగా కొట్టాడు. అక్కడున్న వారికి షాకింగ్ అనిపించింది. అయితే మార్టినా మాత్రం ఒకే అనుకుంటూ రింగ్లోకి వెళ్లింది. బరిలో దిగేముందు కోచ్ క్లాడియో ఇలా చేయడం ఆమెకు అలవాటు అని మార్టినా తెలిపింది. ప్రత్యర్థితో తలపడేలా ఉత్సాహంగా ఉండేందుకు ఇలా చేశారని పేర్కొంది. ఇది తనకు తప్పక అవసరమని చెప్పుకొచ్చింది. రెండు చెంపలు కొట్టడంతో నిద్రమబ్బు వదిలి బరిలో పతకం కొట్టేలా గురి ఉండేందుకు ఇలా కోచ్ చేశారు. A czo tu się odpoliczkowało w ogóle?! pic.twitter.com/mX2r9rMMTA — Mischa Von Jadczak (@michaljadczak) July 27, 2021 -
వైరల్ వీడియో: షేక్హ్యాండ్ ఇవ్వబోయిన అధ్యక్షుడి చెంప పగలకొట్టాడు
-
షేక్హ్యాండ్ ఇవ్వబోయిన అధ్యక్షుడి చెంప మీద కొట్టాడు!
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్కు ఘోర పరాభావం ఎదురయ్యింది. దేశవ్యాప్త పర్యటనలో ఉన్న మాక్రాన్ చెంప పగలకొట్టాడు ఓ ఆగంతకుడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం మాక్రాన్ ఆగ్నేయ ఫ్రాన్స్లో పర్యటించారు. బీఎఫ్ఎం న్యూస్ చానెల్ ప్రసారం చేసిన వీడియో ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1:15 గంటలకు (11.15 జీఎంటీ) డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను సందర్శించి తన కారు దగ్గరకు వెళ్లాడు మాక్రాన్. కానీ అక్కడ ఉన్న జనాలు మాక్రాన్ను పిలవడంతో ఆయన తిరిగి వెనక్కి వచ్చాడు. బారికేడ్ల వెనక ఉన్న జనాలను పలకరించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న 43 ఏళ్ల వ్యక్తికి మాక్రాన్ షేక్హ్యాండ్ ఇచ్చాడు. ఇంతలో సదరు ఆగంతకుడు వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని.. మాక్రాన్ చెంప పగలకొట్టాడు. దాంతో అంత దూరాన పడ్డాడు అధ్యక్షుడు. అనుకోని ఈ సంఘటనకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇంతలో మాక్రాన్ బాడీగార్డులు వచ్చి ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. చదవండి: నడి రోడ్డుపై దేశాధ్యక్షుడి పోస్టర్లు -
కార్యకర్తని చెంపదెబ్బ కొట్టిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియా
-
జర్నలిస్టుపై చేయి చేసుకున్న డీసీపీ
-
జర్నలిస్టు మీద చేయి చేసుకున్న డీసీపీ : వీడియో వైరల్
కోల్కతా : వార్తలను కవర్ చేయడానికి వెళ్లిన టీవీ జర్నలిస్టు మీద ఓ పోలీస్ ఆఫీసర్ చేయి చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోమవారం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకెళితే.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య శనివారం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. శనివారం బీజేపీ నేత, బరాక్పూర్ ఎంపీ అర్జున్ సింగ్ తలకు గాయమవడంతో ఆదివారం ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అర్జున్ సింగ్ నివాసమైన ‘మజ్దూర్ భవన్’ లో ప్రవేశించడానికి డీసీపీ అజయ్ ఠాకూర్ ప్రయత్నించాడు. ఈ సంఘటనలను కవర్ చేయడానికి వెళ్లిన స్థానిక టీవీ జర్నలిస్టును డిప్యూటీ కమిషనర్ అజయ్ ఠాకూర్ చెంప మీద కొట్టిన వీడియో బయటపడింది. అయితే ఇంతకు ముందు కూడా అజయ్ ఠాకూర్ ఇలా ప్రవర్తించాడని అక్కడి జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. అంతేకాక, పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ కొట్టడం వల్లనే తన తలకు గాయమైందని ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్కు చెంపదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడి మోతీనగర్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ను ఓ యువకుడు చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆప్ శ్రేణులు ఆయన్ను చితక్కొట్టగా, పోలీసులు కాపాడి స్టేషన్కు తరలించారు. న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి బ్రిజేష్ గోయల్ తరఫున కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆప్ నేతలతో కలిసి ఓపెన్ టాప్ జీపులో మోతీనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు కేజ్రీవాల్ అభివాదం చేస్తుండగా, ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఓ యువకుడు ఒక్క ఉదుటన జీప్ ఎక్కి కేజ్రీవాల్ చెంపపై బలంగా కొట్టాడు. కాగా, కొట్టిన వ్యక్తిని ఢిల్లీలో ఓ చిన్నవ్యాపారం చేసే సురేశ్(33)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, బీజేపీనే ఈ దాడి చేయించిందని ఆప్ నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. 2014లో ఓ రోడ్షోలో కేజ్రీవాల్ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. మరోవైపు గణతంత్ర భారతాన్ని కాపాడుకునేందుకు తాను ఆప్ తరఫున ప్రచారం చేస్తానని సినీనటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. -
హార్దిక్ చెంప చెళ్లుమంది
అహ్మదాబాద్: కాంగ్రెస్ నేత, పటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి ఆయన చెంప చెళ్లుమనిపించాడు. ఆ వ్యక్తిని గుజరాత్కు చెందిన తరుణ్ గజ్జర్గా గుర్తించారు. దాడి తర్వాత కాంగ్రెస్ నేతలు, పటేల్ మద్దతుదారులు అతన్ని చితకబాదగా, తీవ్ర గాయాలపాలైన అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ‘బీజేపీ నాకు హాని తలపెట్టాలని చూస్తోంది. నాపై దాడికి బీజేపీ చాలామందిని నియమించింది. అసలు ఆ వ్యక్తి నాపై ఎందుకు దాడి చేశాడో తెలీదు. అతను కచ్చితంగా బీజేపీకి చెందినవాడే. ఒక వేళ అతను తుపాకీ గానీ వెంట తెచ్చి ఉంటే నేను చనిపోయేవాన్ని’అని హార్దిక్ అన్నారు. బీజేపీ నేతలు ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సానుభూతి పొందాలనే కొత్త నాటకానికి తెరలేపిందని అన్నారు. హార్దిక్పై దాడికి గల కారణాలను గజ్జర్ ఆస్పత్రి బెడ్ మీద నుంచే మీడియాకు వెల్లడించాడు. ‘2015లో పటేల్ ఉద్యమ సందర్భంగా అల్లర్లు జరిగినప్పుడు నా భార్య, నా బిడ్డ అతని వల్ల ఇబ్బంది పడ్డారు. అందుకే అప్పటినుంచి ఆయనంటే నాకు కోపం’ అని గజ్జర్ అన్నాడు. -
ఖాకీలపై చేయిచేసుకున్న నటిపై కేసు
ముంబై : తాగిన మత్తులో ముంబైలోని బాంద్రాలో పోలీసు సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన టీవీ నటి, మోడల్ రుహి సింగ్పై కేసు నమోదు చేశారు. స్నేహితులతో కలిసి రుహి సింగ్ పబ్ నుంచి తిరిగివస్తూ బాంద్రాలోని ఓ మాల్వద్ద ఆగారు. మాల్ సిబ్బందితో గొడవకు దిగడంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. ఖర్ పోలీస్ స్టేసన్ నుంచి అక్కడికి చేరుకున్న పోలీసులతో సైతం రుహి సింగ్ బృందం వాగ్వాదానికి దిగింది. రుహితో పాటు ఆమె స్నేహితులు రాహుల్ సింగ్, స్వప్నిల్ సింగ్ ఇద్దరు పోలీస్ సిబ్బందిపై చేయిచేసుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులపై దాడి చేసిన రుహి స్నేహితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు నటిపై రాష్ డ్రైవింగ్, దురుసు ప్రవర్తనపై కేసు నమోదు చేశారు. కాగా, గత నెల 31 రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. రుహి సింగ్ నుంచి తీసుకున్న మెడికల్ శాంపిల్స్ను పరీక్షించగా ఆమె మద్యం సేవించినట్టు వెల్లడైందని అడిషనల్ కమిషనర్ (ముంబై పశ్చిమ) మనోజ్ కుమార్ శర్మ వెల్లడించారు. కాగా రుహి సింగ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నీకు ప్రధాని తెలీదా?
మాల్దా: ‘నాకు చదువు రాదు.. బయటి విషయాలు నాకు పెద్దగా తెలీదు’ అని చెబుతున్నా వినకుండా ఓ యువకుడిని నిర్దాక్షిణ్యంగా కొందరు చితకబాదారు. పశ్చిమ బెంగాల్లో ఈ చోటు చేసుకోగా, ఆ ఘటన తాలుకూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడి కథనం ప్రకారం... కలియాచక్(మాల్దా జిల్లా)కు చెందిన సదరు యువకుడు, హౌరా పట్టణంలో కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ నెల 14వ తేదీన సదరు యువకుడు రైల్లో తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గం మధ్యలో నలుగురు వ్యక్తులు రైలు ఎక్కి అతని ముందు సీట్లో కూర్చున్నారు. ముందు సరదాగా అతనితో మాటలు కలిపిన ఆ నలుగురు.. తర్వాత విజ్ఞాన ప్రదర్శన మొదలుపెట్టారు. మన ప్రధాని ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జాతీయ గీతం పాడు? అంటూ ఆ యువకుడిని కోరారు. అయితే తడబడుతూనే సమాధానాలు చెప్పేందుకు యత్నించిన ఆ యువకుడి చెంప పగలకొట్టారు. తాను పెద్దగా చదువుకోలేదని.. ఆ విషయాలు అంతగా తెలీదని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విని వాళ్లు మరింతగా రెచ్చిపోయారు. సంభాషణ మధ్యలో అతను ముస్లిం అని గ్రహించిన ఆ నలుగురు.. నమాజ్ ఎలా చదవాలో నీకు తెలుసు కదా? అని ప్రశ్నించారు. దానికి అతను అవుననే సమాధానం ఇచ్చాడు. అలాంటప్పుడు జాతీయ గీతం గురించి తెలీదా? అంటూ దుర్భషలాడుతూ చెయ్యి చేసుకున్నారు. ఆపై బందేల్ స్టేషన్లో ఆ నలుగురు దిగిపోయారు. ఓ ప్రయాణికుడు అదంతా వ్యక్తి దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. చివరకు బంగ్లా సంక్రీతి అనే ఎన్టీవో ఇచ్చిన ఫిర్యాదుతో కలియాచక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఎమ్మెల్యే చెంప వాయించిన మహిళ కానిస్టేబుల్
-
ఎమ్మెల్యే చెంప పగలకొట్టిన లేడీ కానిస్టేబుల్
షిమ్లా : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశాకుమారికి తీవ్ర అవమానం ఎదురైంది. ఓ మహిళ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు. సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాయలం దగ్గరకు ఆశాకుమారి చేరుకున్నారు. అయితే పోలీస్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ కూడా ఆమె చెంప వాయించింది. ఆపై ఆశాకుమారి ఆగ్రహంతో ఊగిపోగా.. కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఎమ్మెల్యే చెంప వాయించిన మహిళ కానిస్టేబుల్ -
హ్యుందాయ్ ఇండియాకి భారీ జరిమానా
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ కంపెనీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వాహన విక్రయాల్లో, వ్యాపార నిర్వహణలో హ్యుందాయ్ ఇండియా తప్పుడు విధానాలను అనుసరించిందని ఆరోపిస్తూ కాంపిటీషన్ కమీషన్ భారీ జరిమానా విధించింది. అక్రమ విధానాలు, కార్లపై అక్రమ డిస్కౌంట్లు అందించినందుకు గాను రూ. 87 కోట్ల జరిమానా విధించింది. 44 పేజీల లిఖితపూర్వక ఆర్డర్లో కొరియా కార్ మేకర్ పోటీ-వ్యతిరేక విధానాలను అవలంబించిందని సీసీఐ పేర్కొంది. ఈ ఉల్లంఘన ద్వారా సంబంధిత టర్నోవర్ని నిర్ణయించే ప్రయోజనాలతోపాటు, ఈ వాహనాల అమ్మకం నుంచి వచ్చే ఆదాయం పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అయితే దీనిపై హ్యుందాయ్ ఇండియా స్పందించింది. ఈ ఆర్డర్తో తాము తీవ్ర ఆశ్చర్యంలో మునిగిపోయామని ప్రకటించింది. దీన్ని నిశితంగా అధ్యయనం చేస్తున్నామని చెప్పింది. తమ వినియోగదారులు, ఇతర ఛానెల్ పార్టనర్ల ప్రయోజనాలను కాపాడడానికి తగిన స్థాయిలో ఆర్డర్ ను సవాలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపింది. -
అందరూ చూస్తుండగా అధికారి చెంపచెళ్లు
న్యూఢిల్లీ: ఓ నావికుడు సర్వే షిప్ అధికారిపై చేయిచేసుకున్నాడు. ఆయన చెప్పిన ఆదేశాలు పాటించలేదని మందలిస్తుండగా నేరుగా చెంపచెల్లుమనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సహాయక నావికులను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన ఒడిశాలోని పారాద్వీప్ పోర్ట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎన్ఎస్ సందాయక్ అనే నౌక సర్వే షిప్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇందులో షిప్ బోర్డుకు అధికారిగా పనిచేస్తున్న ఆయన నౌకలోని మోటారు బోట్లను లాగేందుకు పనిచెప్పారు. ఈ విషయంలో నలుగురు సహాయక నావికులు కాస్త అసంబద్ధంగా ప్రవర్తించారు. పై అధికారి మాటలు లెక్కచేయలేదు. ఎదురు తిరిగేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు మాత్రం నేరుగా అధికారిపై చేయిచేసుకున్నాడు. దాదాపు దీనిని తిరుగుబాటు అని అనుకోవచ్చని సంబంధిత అధికారులు చెప్పారు. భారతీయ నానికా దళం అంటేనే క్రమశిక్షణకు పేరని, వారిని అలాగే క్షమించి వదిలేస్తే మిగితా వారికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లువుతుందనే ఉద్దేశంతో వారు నలుగురుపై వేటు వేసినట్లు తెలిపారు. ఐఎన్ఎస్ సందాయక్ను 2001లో ఈస్ట్రన్ నావల్ కమాండ్ ప్రారంభించింది. ఇది పూర్తిగా స్వదేశీ తయారీ నౌక. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న సముద్ర సంపదను గుర్తించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. -
సీపీఐ లీడర్ చెంప చెళ్లుమనిపించాడు!
మిడ్నాపూర్: నివాసంలో పుర్రెను ఉంచుకుని దొరికిపోయిన సీపీఐ లీడర్ సుశాంత్ ఘోష్ను కోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించాడు. ఆ పుర్రె తన బిడ్డదేనని ఆయన తెలిపారు. కోర్టులో విచారణకు హాజరైన ఘోష్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో లోపలికి వచ్చిన మనోరంజన్ సింగ్ అనే వ్యక్తి ఘోష్ ఎడమ చెంపపై కొట్టారు. ఆ పుర్రె తన బిడ్డ స్వపన్ సింగ్దని, కొన్నేళ్ల కిందట మిస్ అయిందని తెలిపారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు వెంటనే సింగ్ను అరెస్టు చేశారు. ఈ సంఘటనతో షాక్ తిన్న ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. 2011లో ఘోష్ పూర్వీకులకు సంబంధించిన ఇంటి నుంచి మొత్తం 8 పుర్రెలను పోలీసులు సీజ్ చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు వెళ్లిన ఘోష్ బెయిల్ తెచ్చుకున్నారు. -
ఎంపీ చెంప చెళ్లుమనిపించిన యువకుడు
బార్మర్: రాజస్థాన్లోని బార్మర్ ఎంపీ సోనారామ్ చౌదరిపై ఓ యువకుడు చేయి చేసుకున్నాడు. సోమవారం బార్మర్లో జరిపిన పెళ్లికి ఎంపీ హాజరవగా ఆయనతో ఏదో విషయమై ఖర్తారం అనే యువకుడు వాగ్వాదానికి దిగాడు. ఆవేశానికి లోనై ఆయన చెంప చెళ్లుమనిపించి పరారయ్యాడు. జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ దాడి జరగడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు. -
షారూక్ ని చెంప దెబ్బకొట్టిందట!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ ను ముంబైలో ఓ మహిళ లాగి లెంపకాయ కొట్టిందట. ముంబైకి మొదటిసారి వచ్చినపుడు రైల్లో తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని స్వయంగా ఆయనే అభిమానులతో పంచుకున్నారు. అవగాహన లేక రైల్లో తాను చేసిన పనికి ఆ మహిళ తన చెంపపై చాలా గట్టిగానే కొట్టిందని పేర్కొన్నారు. అప్ కమింగ్ మూవీ 'ఫ్యాన్' ట్రయిలర్ రిలీజ్ చేసిన సందర్భంగా అభిమానులతో షారూక్ ముచ్చటించారు. ఈ సందర్భంగా మిమ్మల్ని మహిళ కొట్టిందటగా అని ఓ ఫ్యాన్ అడిగినపుడు అవునని అంగీకరించారు. ఆనాటి సంఘటనను వారితో షేర్ చేసుకున్నారు. రైల్లో ప్రయాణిస్తున్నపుడు తాను రిజర్వ్ చేసుకున్న బెర్త్ పై మగాళ్లను ఎవర్నీ కూర్చోనివ్వలేదట ఈ డింపుల్ హీరో షారూక్. ఇది నా సీటు.. నేను రిజర్వ్ చేసుకున్నానంటూ వారితో వాగ్వాదానికి దిగారట. ఇంతలో బోగీలోకి వచ్చిన ఓ మహిళనుద్దేశించి...మీరు కూర్చోవచ్చుగానీ.. మగాళ్లు కూర్చోవడానికి వీల్లేదంటూ ఆమెకు సీట్ ఆఫర్ చేశారట. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె 'ఇది నీది కాదు.. అందరిదీ'..అంటూ షారూక్ ని లాగి చెంపపై కొట్టిందట. తాను ఎక్కిన రైలు ముంబై నగరంలోకి అడుగుపెట్టిన తరువాత లోకల్ ట్రైన్ గా మారుతుందనే విషయంలో అప్పట్లో తనకు తెలియదంటూ మొదటిసారి ముంబైకి వచ్చినప్పటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా టీవీ నటుడుగా కెరియర్ మొదలు పెట్టిన షారూక్ అంచెలంచెలుగా ఎదిగి బాలీవుడ్ బాద్షాగా అవతరించిన సంగతి తెలిసిందే. -
ఆయన మళ్లీ కొట్టారు!
చెన్నై: డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించారు. మొన్నీమధ్య మెట్రో రైల్లో ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న ఆయన తాజాగా కోయంబత్తూరులో ఓ యువకుడి చెంప చెళ్లుమనిపించారు. ఇంతకీ ఆ యువకుడు చేసిందేమంటే ...స్టాలిన్ తో కలిసి సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నించటమే. గురువారం కోయంబత్తూరు పర్యటనలో ఉన్న స్టాలిన్ తన చుట్టూ మూగిన జనాలతో అసౌకర్యానికి గురయ్యారు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ ఆయనకు చేరువగా వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. అంతే అసహనానికి లోనైన స్టాలిన్ అతనిపై చేయి చేసుకోవటమే కాకుండా అతడిని నెట్టివేశారు. ఆ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వాట్సాప్లోనూ విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ వీడియోపై స్టాలిన్ శుక్రవారం స్పందిస్తూ ...ఆ వీడియోలో గ్రాఫిక్స్ యాడ్ చేశారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అయినా ఆ సంఘటనను తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. జనాలకు అసౌకర్యం కలిగించవద్దని పార్టీ కార్యకర్తకు తాను చెప్పానని, ఈ సందర్భంగా అతడిని నెట్టిన మాట వాస్తవమేనన్నారు. కాగా ఈ సంఘటనపై స్టాలిన్ మేనేజర్ ఇచ్చిన వివరణ పూర్తి విరుద్ధంగా ఉంది. అది యాదృచ్చికంగా జరిగిందని ...స్టాలిన్ను చుట్టుముట్టిన వారిని అదుపు చేసే సమయంలో అలా జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది జూన్లో మెట్రో రైలులో తొలిసారి ప్రయాణం చేసిన స్టాలిన్...అక్కడ ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. -
మాజీ పీఎం గార్డ్ చెంప చెళ్లుమనిపించిన యువతి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సెక్యూరిటీ గార్డ్ చెంప చెళ్లుమంది. ఢిల్లీలోని డబ్లూడబ్లూఎఫ్ ఆడిటోరియంలో జరుగుతున్న ఓ పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యేందుకు వెళుతున్న ఓ యువతిని ఆపినందుకు.. సెక్యూరిటీ గార్డ్ను ఇలా చెంప చెళ్లుమనిపించింది. ఆ కార్యక్రమానికి రావాల్సిన సమయం కన్నా మన్మోహన్ సింగ్ ముందే రావడంతో ఆడిటోరియంలోకి జర్నలిస్టులను, పుస్తకాభిమానులను మన్మోహన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది నియంత్రించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఈనెల పదవ తేదీన జరగ్గా బుధవారం ఆ అమ్మాయిని టర్కీ దేశస్థురాలిగా గుర్తించి కేసు పెట్టారు. ఆమె సిక్యూరిటీ గార్డ్ను చెంప చెళ్లుమనిపిస్తున్న దృశ్యం ఇప్పుడు సామాజిక వెబ్సైట్లలో హల్చల్ చేస్తోంది. -
మరో వివాదంలో సల్మాన్ ఖాన్
-
మమత మేనల్లుడికి చెంపదెబ్బ
తామ్లక్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. పార్టీ కార్యకర్త ఒకరు ఆయన చెంప చెళ్లుమనిపించారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో చందీపూర్ లో ఆదివారం ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తుండగా హఠాత్తుగా వేదికపైకి వచ్చిన కార్యకర్త చెంపదెబ్బ కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పార్టీ కార్యకర్తలు అతడిని పట్టుకుని చితకొట్టారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ పార్టీ కార్యకర్తలకు చేసిందేమీ లేదన్న ఆగ్రహంతో అతడీ చర్యకు పాల్పడ్డాడు. -
ఇదేం దండనీతి గురువా?!
జరిగిందేమిటో తెలుసుకోలేదు. విద్యార్థి చెబుతున్నా వినిపించుకోలేదు. మితిమీరిన ఆగ్రహంతో ఓ కార్పొరేట్ పాఠశాల ప్రిన్సిపాల్గారు నడిరోడ్డుపై విద్యార్థిని చితకబాదారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుచుకున్నారు. అప్పటికైనా నిగ్రహించుకోకుండా తల్లిదండ్రులకు చెబితే స్కూల్ నుంచి రిలీవ్ చేయనని బెదిరించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ టెన్త్ విద్యార్థి ఇంట్లోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చైల్డ్లైన్కు ఫిర్యాదు చేయడంతో వారు పాఠశాలకు వెళ్లి విచారణ జరపడంతో అయ్యగారు దిగొచ్చారు. త ప్పయిందని.. ఇకముందు అలా జరక్కుండా జాగ్రత్త పడతానని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. శ్రీకాకుళం : ఓర్పు, సహనంతో విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్ విచక్షణ కోల్పోయి విద్యార్థిని చితకబాదిన సంఘటన పట్టణంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో సోమవారం చోటు చేసుకుంది. పాఠశాలలో 10వ తరగతి చదువుతోన్న కె.నిఖిల్ను ప్రిన్సిపాల్ రాంప్రసాద్ ఒళ్లంతా కమిలిపోయేలా కొట్టాడు. బాధిత విద్యార్థి తల్లిండ్రుల కథనం ప్రకారం, సాయంత్రం పాఠశాల విడిచిపెట్టిన సమయంలో విద్యార్థులు బయటకు వచ్చి ఆటోల కోసం వేచి ఉన్నారు. అదే సమయంలో నిఖిల్ ముందు వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు ఓ ఆటో ఎక్కారు. అదే ఆటో ఎక్కేందుకు నిఖిల్ కూడా వెళ్లాడు. అయితే అంతలోనే ఓ పాము రోడ్డుపైకి దూసుకురావడంతో ఆ అమ్మాయిలు నిఖిల్ రావద్దంటూ కేకలు పెట్టారు. ఈ తతంగాన్ని దూరం నుంచి పరిశీలించిన ప్రిన్సిపాల్ నిఖిల్ అమ్మాయిలను టీజ్ చేస్తున్నాడేమో అనుకుని ఒక్కసారి కోపం తెచ్చుకున్నాడు. అనుకున్నదే తడవుగా అక్కడి చేరుకుని ఇష్టానుసారంగా బాదడంతో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంతలో అక్కడివారు, అమ్మాయిలు కలుగ చేసుకొని జరిగిన విషయం తెలిపారు. దీంతో ఖంగుతిన్న ప్రిన్సిపాల్ ‘సరే అయిందేదే అయిపోయింది...ఈ విషయం ఇంట్లో చెప్పావో నువ్వు పదో తరగతి పరీక్షలకు వెళ్లలేవు’ అంటూ బెదిరించి ఇంటికి పంపించేశాడు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ రాత్రంతా తన గది తలుపు తీయకుండా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే 1090 చైల్డ్లైన్ నెంబరుకు ఫోన్చేసి ప్రిన్సిపాల్పై ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం చైల్డ్లైన్ సిబ్బంది, నిఖిల్ కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ను గట్టిగా నిలదీయగా తప్పు ఒప్పుకున్నాడు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని లిఖితపూర్వకంగా తెలియజేయడంతో అంతా శాంతించారు. ప్రిన్సిపాల్ వివరణ ఈ సంఘటన గురించి కళాశాల ప్రిన్సిపాల్ను ‘సాక్షి’ ఫోనులో సంప్రదించగా జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. అయితే నిఖిల్ అనే విద్యార్థి అల్లరిచిల్లరిగా ఉంటాడని, గతంలోనూ అతనిపై ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. అందుకే ఈ సంఘటనలో అతనిదే తప్పని భావించి మందలించానని వివరించారు. అయితే నిఖిల్ తల్లిదండ్రులు, చైల్డ్లైన్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన చర్చల్లో రాజీ కుదిరిందన్నారు. -
రాజా నట్వర్ లాల్గా వస్తున్న ఇమ్రాన్
-
'ఆప్' నేత చెంప చెళ్లుమనిపించిన మహిళ
ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ఇజాజ్ ఖాన్కు ఓ టీవీ షోలో చేదు అనుభవం ఎదురైంది. ఆపార్టీ మాజీ మహిళ నేత ఆయనపై చేయి చేసుకున్నారు. 'భారత్లో కుల రాజకీయాలు' అనే అంశంపై ఓ టీవీ ఛానల్ లైవ్ చర్చ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ చర్చ కార్యక్రమంలో ఇజాజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు టీనా శర్మకు ఆగ్రహం కలగించింది. దాంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాత వెంటనే జోక్యం చేసుకుని టీనా శర్మకు క్షమాపణలు చెప్పాలని ఇజాజ్ ఖాన్ను కోరింది. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో టీనా శర్మ కోపం కట్టలు తెంచుకుంది. ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుందన్న సంగతి టీనా మరిచిపోయారు. ఒక్కసారిగా ఇజాజ్ఖాన్ ముందుకు వచ్చి చెంప చెళ్లుమనిపించారు. దాంతో చర్చ కార్యక్రమానికి వచ్చిన సభ్యులతోపాటు ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు, నిర్వహకులు నిర్ఘాంతపోయారు. కాగా టీనా శర్మ గతంలో భారతీయ జనతా పార్టీలో పని చేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చాక అందులో చేరింది. అనంతరం రెబల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీపై అసంతృప్తి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వీడియోను మీరు వీక్షించండి.