Sri Chaitanya College
-
ఫీజు కట్టలేదని విద్యార్థిని గెంటేశారు
కంకిపాడు: ఫీజు కట్టలేదని విజయవాడ సమీపంలోని గోసాల శ్రీచైతన్య కళాశాల నుంచి యాజమాన్యం ఓ విద్యార్థిని అర్థరాత్రి వేళ బయటకు పంపించేసింది. దీంతో ఆ విద్యార్థి, అతని తండ్రి కళాశాల గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. మీడియాకు సమాచారం వెళ్లటంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. బాధితుడి కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆబోతు టార్జాన్ కుమారుడు గౌతమ్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.సంక్రాంతికి ఇంటికి వెళ్లిన గౌతమ్ ఆదివారం రాత్రి తన తండ్రితో కలసి కళాశాలకు వచ్చాడు. ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని కళాశాల సిబ్బంది చెప్పారు. టార్జాన్ తన వద్ద ఉన్న రూ 20 వేలు నగదును చెల్లించాడు. మిగిలిన రూ. 50 వేలు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని బతిమలాడారు. అందుకు యాజమాన్యం ససేమిరా అని విద్యార్థిని కళాశాల నుంచి పంపించేసింది. దీంతో విద్యార్థి గౌతమ్, అతని తండ్రి టార్జాన్ అర్ధరాత్రి కళాశాల గేటు వద్దే నిరసన వ్యక్తం చేశారు.పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏప్రిల్లో పరీక్షలు ఉన్నాయని, ఆ లోపు ఫీజు చెల్లిస్తానని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదని వాపోయారు. నిర్దాక్షిణ్యంగా తమను బయటకు పంపించేశారని తెలిపారు. పోలీసులు కూడా కళాశాలకు చేరుకుని ఆరా తీశారు. దీంతో యాజమాన్యం విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడి విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. -
విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
-
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: తాడిగడప శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి చెందింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామానికి చెందిన రామిశెట్టి గంగా భువనేశ్వరి.. నీట్లో కోచింగ్ తీసుకుంటోంది. కామినేని ఆసుపత్రికి విద్యార్థిని మృతదేహన్ని తరలించారు. కాగా, తమ కుమార్తె మృతిపై విద్యార్థిని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తండ్రికి గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.విద్యార్ధి తల్లి గోవింద లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఎటువంటి ఆనారోగ్య సమస్యలు లేవని.. నిన్న రాత్రి కూడా తనతో ఫోన్లో మాట్లాడిందన్నారు. గత రాత్రి తన కుమార్తెకు తలనొప్పి వస్తే అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు చనిపోయింది అంటున్నారు.తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా?. ఇప్పుడు నిర్లక్ష్యంగా శవాన్ని తీసుకువెళ్లమంటున్నారు’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన విషయం ఎందుకు దాచారు?. చనిపోయిందని ఆలస్యంగా ఎందుకు తెలిపారు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.ఇదీ చదవండి: తప్పు స్పెల్లింగ్తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు -
శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
మియాపూర్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ శ్రీచైతన్య కాలేజీలో ఓ విద్యార్థి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ(17) నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
-
సాత్విక్ను బూతులు తిట్టి, చితకబాదారు: పోలీసులు రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ క్లాస్రూమ్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాత్విక్ మృతిపై ఇంటర్ బోర్డ్ కమిటీ వేసి విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను కూడా వెల్లడించింది. ఇక, సాత్విక్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టు ప్రకారం.. కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ మృతిచెందాడు. సాత్విక్ను బూతులు తిట్టడం వల్లే మనస్తాపం చెందాడు. విద్యార్థుల ముందు కొట్టడం వల్ల హర్ట్ అయ్యాడు. ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ తిట్టడంతో మనస్తాపనికి గురయ్యాడు. చనిపోయిన రోజు స్టడీ అవర్లో ఆచార్య, కృష్ణారెడ్డి.. సాత్విక్కు చితకబాదారు. హాస్టల్లో సాత్విక్ను వార్డెన్ వేధించాడు అని స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇంటర్ బోర్డు అధికారులు సాత్విక్ ఆత్మహ్యతపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. నివేదికలో భాగంగా కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. -
శ్రీచైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్య ఘటనపై స్పందించిన విద్యాశాఖ
-
సాత్విక్: తప్పుల తడకగా అధికారులు రిపోర్ట్.. ఆవేదనలో పేరెంట్స్
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్లో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఇంటర్ బోర్డు రంగంలోకి దిగింది. అధికారులతో కమిటీ వేసింది. తాజాగా బోర్డు కమిటీ విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందించింది. అయితే, విచారణలో భాగంగా ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై తప్పుల తడకగా నివేదికను అందించారు అధికారులు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే.. గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిపోర్టు, అధికారులపై సాత్విక్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిపోర్టులో సాత్విక్కు కాలేజీలో అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాగా, దీనిపై సాత్విక్ తల్లిదండ్రులు స్పందించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సాత్విక్ను శ్రీచైతన్య కాలేజ్ పేరు మద అడ్మిషన్ చేశాం. శ్రీచైతన్య కాలేజ్ నార్సింగి క్యాంపస్లో జాయిన్ చేస్తామని చెప్పారు. శ్రీచైతన్యలోనే అడ్మిషన్ ఇస్తున్నామని చెప్పారు. వేరే కాలేజీలో అడ్మిషన్ ఉన్నట్టు మాకు తెలియదు. కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది. మాకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే.. శ్రీచైతన్యకు షాక్!
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైత్యన కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ క్లాస్ రూమ్లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఎంక్వైరీ కమిటీ రిపోర్టును ఇచ్చింది. తాజా రిపోర్టులో కూడా పాత విషయాలనే అధికారులు ప్రస్తావించారు. అయితే, ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. రిపోర్టులో భాగంగా సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే బాగోతం ఉందని విచారణ కమిటీ పేర్కొంది. క్లాసులేమో శ్రీచైతన్యలో.. చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్లపై అన్ని కాలేజీల్లో చెక్ చేయాలని కమిటీ సూచించింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. -
Khammam: శ్రీచైతన్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
సాక్షి, ఖమ్మం: హైదరాబాద్ నార్సింగి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య ఘటన మరువకముందే ఖమ్మం శ్రీచైతన్య స్కూల్లో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సాయి శరణ్య అనే పదో తరగతి స్టూడెంట్.. పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థిని ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడినట్లు చెబుతున్నారు. చదవండి: సడన్ హార్ట్ ఎటాక్.. కాలేజీలోనే కుప్పకూలిన ఇంజనీరింగ్ విద్యార్థి -
సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్!
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై తాజాగా ఇంటర్ బోర్డ్ అధికారులు.. శ్రీ చైతన్య కాలేజీ మేనేజ్మెంట్కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ చేపట్టింది. ఇక, విద్యార్థి సాత్విక్ మృతి నేపథ్యంలో డీఈవో ఆధ్వర్యంలో బోర్డు అధికారులు కాలేజీని విజిట్ చేశారు. ఈ ఘటనపై అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. కాగా, కాలేజీ మేనేజ్మెంట్ ఇచ్చే వివరణపై ఫైనల్ రిపోర్టు సిద్ధం చేసి అధికారులు.. కమిషనర్కు నివేదిక అందజేయనున్నారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాలేజీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు, అధికారులు.. విద్యార్థులు, పేరెంట్స్, మిగిలిన లెక్చరర్ల నుంచి కూడా సమాచారం తీసుకుని నివేదిక తయారు చేయనున్నారు. ఇదిలా ఉండగా, నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని నవీన్ మిట్టల్ తెలిపారు. -
టార్చర్ తట్టుకోలేను.. వెళ్లిపోతున్నా..
ఒక్కసారి రా.. నాన్నా.. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్.. కాలేజీలో వేధింపులు భరించలేక చనిపోదామనుకున్నాడు.. నాన్న చివరి చూపు.. అమ్మతో ఆఖరి మాటల కోసం తపించాడు. ‘జ్వరం వచ్చింది.. ఒక్కసారి రా నాన్నా..’ అని ఫోన్ చేసి తండ్రిని పిలిపించుకున్నాడు. ఆఖరి సారిగా అమ్మతో ఆప్యాయంగా మాట్లాడాడు. అంతకు ముందే ‘మిస్ యూ అన్నా.. నన్ను క్షమించు.. అమ్మానాన్నను బాగా చూసుకో’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. తరగతి గదిలోనే ఉరివేసుకున్నాడు. కాలేజీలో పెట్టే నరకం భరించలేక... సూసైడ్ నోట్లో సాత్విక్ ఆవేదన బుధవారం సాయంత్రం నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు. మణికొండ (హైదరాబాద్)/ షాద్నగర్: ‘సరిగా చదవడం లేదంటూ తిడుతున్నారు. మార్కులు రాకుంటే గేటు బయట వాచ్మన్గా కూడా పనికిరావని అవమానిస్తున్నారు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్ను, నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను..’’ అంటూ ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ అధ్యాపకులు, హాస్టల్ నిర్వాహకుల వేధింపులతో మనస్తాపం చెంది తరగతి గదిలోనే ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అంతేకాదు హాస్టల్లో సాత్విక్ కనిపించడం లేదని చెప్పినా, ఉరివేసుకున్నట్టు తెలిసినా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని తోటి విద్యార్థులు చెప్పారు. తామే మోసుకుంటూ కాలేజీ బయటికి మోసుకొచ్చి, ఓ వాహనదారుడిని లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ అప్పటికే సాత్విక్ మరణించాడని తెలిపారు. బుధవారం విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగటంతో ఈ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి సాత్విక్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం చేశాక కుటుంబ సభ్యులు సాత్విక్ మృతదేహాన్ని షాద్నగర్లోని ఇంటికి తీసుకెళ్లారు. పరీక్షలు ఉన్నాయని ఆగి.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన నాగుల రాజు షాద్నగర్లో ఉంటూ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సాత్విక్ నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. శివరా>త్రి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన సాత్విక్.. కాలేజీలో వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే 15 రోజుల్లో పరీక్షలు ఉన్నాయని, ముగిసిన వెంటనే మరో కాలేజీలో చేర్పిస్తామని తండ్రి సర్దిచెప్పాడు. దీనితో సాత్విక్ నాలుగు రోజుల క్రితం హాస్టల్కు తిరిగొచ్చాడు. జ్వరం వచ్చిందంటూ సాత్విక్ ఫోన్ చేయడంతో.. తండ్రి రాజు మంగళవారం రాత్రి 8గంటల సమయంలో హాస్టల్కు వచ్చి మాట్లాడి, మందులు ఇచ్చి వెళ్లిపోయారు. హాస్టల్లో రాత్రి 10.30 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించారు. అందరి కంటే ముందుగా స్టడీ హాల్ నుంచి లేచిన సాత్విక్.. నేరుగా తరగతి గదికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నది ఈ గదిలోనే.. చెప్పినా పట్టించుకోని సిబ్బంది.. స్టడీ హాల్ నుంచి హాస్టల్ గదికి వచ్చాక సాత్విక్ రాలేదని గుర్తించి, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా.. ‘అతడే వస్తాడు, మీరు పడుకోండి..’ అంటూ నిర్లక్ష్యం చేశారని తోటి విద్యార్థులు చెప్పారు. గట్టిగా అరవడంతో అర గంట తర్వాత గేట్ తీశారని, కాలేజీ అంతా వెతకగా సాత్విక్ ఓ తరగతి గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడని వివరించారు. వెంటనే అతడిని కిందికి దింపామని.. ప్రాణాలతో ఉన్నట్టు కనిపించడంతో కాలేజీ బయటికి తామే మోసుకుంటూ వచ్చామని తెలిపారు. ఇది చూసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని.. పైగా ఎలాంటి శబ్దం చేయకుండా తీసుకెళ్లా్లని చెప్పారని వాపోయారు. దీంతో తాము సాత్విక్ను మెయిన్ రోడ్డు వరకు మోసుకుంటూ వచ్చి, ఓ వాహనదారుడ్ని లిఫ్ట్ అడిగి సమీపంలోని నర్సింగ్ హోంకు తరలించామని.. కానీ అప్పటికే సాత్విక్ చనిపోయాడని డాక్టర్ చెప్పారన్నారు. ఇంటికి వచ్చిన అరగంటలోపే.. నాగుల రాజు తన కుమారుడికి మందులు ఇచ్చి సుమారు రాత్రి 10 గంటల సమయంలో షాద్నగర్లోని ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అర గంట సేపటికి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచ్చింది. దీనితో కుటుంబమంతా హతాశులయ్యారు. సాత్విక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సాత్విక్ తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి అలివేలు, అన్న మిథున్లు పోలీసుల కాళ్లు పట్టుకుని, నిందితులను శిక్షించాలంటూ వేడుకున్న తీరు కలచి వేసింది. సమగ్ర విచారణకు మంత్రి సబిత ఆదేశం సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవాలని, త్వరగా విచారణ నివేదిక ఇవ్వాలన్నారు. అవమానించడంతోనే.. ఎక్కువ మార్కులు రాకపోతే కాలేజీ గేటు ముందు వాచ్మన్గా కూడా పనికిరారని, ర్యాంకు వచ్చేలా చదవాలని కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్లు వేధించడంతోనే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నా కుమారుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. – అలివేలు, సాత్విక్ తల్లి రోదిస్తున్న సాత్విక్ తల్లి, సోదరుడు చదువు ఒత్తిడి ఇలా చేస్తుందనుకోలేదు సాత్విక్కు కాలేజీలో ఎదురవుతున్న ఇబ్బందులను నాకు చెప్పాడు. దీనిపై కాలేజీ వారితో మాట్లాడుతానని సర్దిచెప్పాను. ఇంతగా తట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఉంటే ఇంటికి తీసుకెళ్లే వాడిని. కాలేజీ నిర్వాహకులు ఫీజులు, ర్యాంకులు తప్ప విద్యార్థుల మనోభావాలతో పనిలేకుండా వ్యవహరిస్తున్నారు. కానీ చదువే ఇలా చావు వరకు తెస్తుందని ఊహించలేకపోయాం. – నాగుల రాజు, సాత్విక్ తండ్రి చదవడం లేదని రక్తం వచ్చేలా కొట్టారు గతంలో సరిగా చదవడం లేదం టూ నన్ను ముక్కుమీద గుద్దితే రక్తం వచ్చింది. కనికరం కూడా లేకుండా నాతోనే రక్తాన్ని కడిగించారు. షాద్నగర్ నుంచి వచ్చి చదువుకుంటున్న మా ఐదుగురు ఫ్రెండ్స్ను గాలి బ్యాచ్ అని హేళన చేసేవారు. కాలేజీ గేటు వద్ద వాచ్మన్లుగా కూడా పనికిరా రంటూ అవమానపర్చేవారు. – ప్రదీప్, తోటి విద్యార్థి వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు కాలేజీలో విద్యార్థులను ఉపాధ్యాయులు వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. దీనికి కారణమైన ముగ్గురు సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తాం. విద్యాసంస్థల్లో వేధింపులు, అసౌకర్యాలపై విచారణ చేస్తాం. – స్వామి, చైతన్య కళాశాల ఏజీఎం నిందితులను అదుపులోకి తీసుకున్నాం విద్యార్థి మృతికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జగన్లను అదుపులోకి తీసుకున్నాం. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – జీవీ రమణగౌడ్, ఏసీపీ, నార్సింగి -
బాధ్యులైన వారిని శిక్షిస్తాం : మంత్రి సబిత
-
శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్య.. మంత్రి సబిత కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ కుమారుడికి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుట ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థిపై విచారణకు ఆదేశించారు సబిత. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ చెపట్టాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్కు కూడా సబిత ఆదేశించారు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ క్రిష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్తో పాటు మేనేజ్మెంట్పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక, అంతుకుముందు.. తమకు న్యాయం చేయాలంటూ శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని పేరెంట్స్ ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. -
నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య
-
శ్రీ చైతన్య కాలేజీలో విషాదం
సాక్షి, హైదరాబాద్: శ్రీ చైతన్య కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో, స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి క్లాస్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీ సిబ్బందిని సాయం కోరగా వాళ్లు పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు. దీంతో, తోటి విద్యార్థులు బయట వాహనం లిఫ్ట్ అడిగి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం, సాత్విక్ పోస్టుమార్టం కోసం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక, కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సాత్విక్ ఘటనపై విద్యార్థి పేరెంట్స్ స్పందించారు. గతంలో లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజులు ఆసుపత్రి పాలయ్యాడు. సాత్విక్ను ఏం అనొద్దని గతంలోనే చెప్పాం. మెంటల్ స్ట్రెస్కి గురిచేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాత్విక్ మృతితో శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. -
విజయవాడ శ్రీ చైతన్య కళాశాలపై ఏపీ ఇంటర్ బోర్డు చర్యలు
-
విజయవాడ శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు
మచిలీపట్నం: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోగల శ్రీచైతన్య (భాస్కర్భవన్ క్యాంపస్) జూనియర్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి రవికు మార్ ధ్రువీకరించారు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ గుర్తింపు రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ప్రత్యామ్నాయంగా ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల అభీష్టం మేరకు వారికి నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకునేలా వెసులుబాటు కల్పించారు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థిపై కాలేజీ అధ్యాపకుడు పరుష పదజా లంతో విరుచుకుపడటమే కాకుండా చేయిచేసుకో వడం తెలిసిందే. ఆ ఘటనపై చిత్రీకరించిన వీడి యో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. కేంద్ర విద్యాశాఖ సైతం దీనిపై జోక్యం చేసుకుని కలెక్టర్ను నివేదిక కోరింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఘటనకు పా ల్పడిన అధ్యాపకుడిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదుచేశారు. తాజాగా, కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించడంతోపాటు కాలేజీ గుర్తింపు రద్దు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు కాలేజీకి మూతవేస్తామని, విద్యార్థులకు ఎక్కడా నష్టం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆర్ఐవో పి.రవికుమార్ తెలిపారు. విద్యార్థులకు ర్యాంకుల బూచి చూపించి హద్దు మీరి ప్రవర్తిస్తే ఎంతటి వారిపై అయినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. -
వీడియో: శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన.. మరీ ఇంత దారుణమా?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తరగతి గదిలో మాట్లాడాడని ఓ విద్యారి్థని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ భవన్ క్యాంపస్లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు, చైల్డ్లైన్ వారు కూడా రంగంలోకి దిగారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి విచారించారు. విద్యార్థి ఇయర్ఫోన్స్లో పాటలు వింటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో క్షణికావేశంలో అలా చేసినట్లు అధ్యాపకుడు చెబుతుండగా.. తమ అబ్బాయి వద్ద ఫోన్లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుడ్ని కళాశాల యాజమాన్యం శుక్రవారం తొలగించినట్లు ఆర్ఐవో తెలిపారు. Sri chaithanya Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/yKyAKzvHdJ — 𝐇𝐚𝐫𝐢𝐤𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐁𝐡𝐞𝐞𝐦𝐚𝐧𝐢 (@hari_bheemani) September 16, 2022 -
శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కంకిపాడు: ఇంటర్మీడియెట్ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణం చెందిన ఘటన కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో బుధవారం చోటుచేసుకుంది. కంకిపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన ఎం.స్నేహిత్ వర్మ (17) కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని శ్రీచైతన్య శ్రీప్రభ క్యాంపస్లో సీనియర్ ఇంటర్ (బైపీసీ) చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్ భవనంలో ఖాళీగా ఉన్న ఓ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. (చదవండి: టమాటా ధర పైపైకి.. కిలో రూ.42) -
హాస్టల్లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం
పెనమలూరు/పెద్దతిప్పసముద్రం: ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పోరంకిలోని శ్రీ చైతన్య క్యాంపస్లో సోమవారం చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన మదన్మోహన్రెడ్డి, మంజుల దంపతుల కుమార్తె బట్టి శిరీష (17) పోరంకిలోని శ్రీచైతన్య సరస్వతీ సౌధంలో ఇంటర్ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నది. ఇటీవల ప్రాక్టికల్స్ పరీక్ష రాసిన ఆమె తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 7వ తేదీన ఇంటికి వెళ్లింది. మరలా సోమవారం తల్లితో కలిసి పోరంకిలోని కాలేజీకి వచ్చింది. తాను హాస్టల్లో ఉండలేనని తల్లికి చెప్పగా.. ఆమె నచ్చజెప్పింది. దీంతో రూమ్లోకి వెళ్లి వస్తానని చెప్పి అరుంధతి బ్లాక్ రూమ్ నంబర్ 247లోకి వెళ్లింది. పది నిమిషాలైనా కుమార్తె తిరిగి రాకపోవడంతో తల్లి, కాలేజీ యాజమాన్యం రూమ్లోకి వెళ్లి చూడగా శిరీష చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న యువతి తండ్రి మదన్మోహన్రెడ్డి హుటాహుటిన సోమవారం కళాశాలకు వెళ్లారు. -
మార్కులు తక్కువచ్చాయని విద్యార్థులపై దారుణం
సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ కాలంలోను తల్లిదండ్రులు ధైర్యం చేసి మరీ విద్యార్థులను కళాశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కులు, ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విక్షణరహితంగా దండించాడు. భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్కు దూరంగా వెళ్లినా వారిమీదికి విరుచకపడి మరీ జుట్ట పట్టుకొని చేయిచేసుకున్నాడు. వచ్చిన మార్కులను విద్యార్థులకు చూపిస్తూ ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ ఆవేశంతో విద్యార్థులను కొట్టాడు. అయితే ఈ వీడియోను అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి సెల్ఫోన్లో రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా బయటపడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాలని కాలేజీ పంపితే లెక్చరర్ అనుషంగా ప్రవర్తించడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళ వ్యక్తం చేసున్నాయి. చదవండి: ప్రిన్సిపల్పై విద్యార్థి దాడి -
రాజోలు శ్రీ చైతన్య జూ. కాలేజీలో అమానుషం
-
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, కంకిపాడు: కృష్ణా జిల్లాపునాదిపాడు శ్రీచైతన్య క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16)ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఎస్ఐ వై. దుర్గారావు సహచర విద్యార్థులను విచారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గారావు తెలిపారు. -
పిల్లలకు తిండి పెట్టలేని మాకు..ఆత్మహత్యే శరణ్యం!
సాక్షి, చైతన్యపురి: బకాయి జీతాలు చెల్లించాలని... తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చైతన్యపురిలోని శ్రీ చైతన్య కళాశాల పాకాల ప్లాజా బ్రాంచ్ లెక్చరర్ల ఆందోళన మూడో రోజుకు చేరుకుంది. సుమారు 45 మంది లెక్చరర్లు చేస్తున్న ధర్నాకు ప్రైవేట్ లెక్చరర్ల సంఘంతో పాటు పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కూడా తమకు లాక్డౌన్లో చెల్లించాల్సిన సగం జీతం చెల్లించకపోవటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సీనియారిటీ ఉండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లుగా చేయటంలో విద్యాబుద్ధులు నేరి్పన లెక్చరర్లను పక్కన పెట్టి ఫ్రెషర్స్ను తీసుకోవటం అన్యాయమని అన్నారు. జీతాలు లేక కుటుంబ సభ్యులను పస్తులుంచాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. లెక్చరర్ ఆత్మహత్యాయత్నం... శ్రీచైతన్య కళాశాల వద్ద నిరాహార దీక్షలో జువాలజీ లెక్చరర్ డాక్టర్ హరినాథ్ బలవన్మరణానికి యత్నించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తోటి అధ్యాపకులు అతడిని అడ్డుకున్నారు. 25 సంవత్సరాలు అధ్యాపకుడిగా సేవలు అందించిన తనకు జీతాలు చెల్లించడం లేదన్నారు. భార్య, పిల్లలకు ఒక్కపూట కడుపునిండా తిండిపెట్టలేని తనకు ఆత్మహత్యే శరణ్యమని హరినాథ్ విలపించాడు. వయసు కారణంగా చూపి కళాశాల డీన్ రవికాంత్ వేధింపులకు గురి చేసి తనను విధుల్లోకి తీసుకోలేదన్నారు. ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హరినాథ్ను స్టేషన్కు తరలించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో ప్రశాంత్, భగవంత్రెడ్డి, చందు, మహేష్, నిర్సింహ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: పేరాల శేఖర్రావు చైతన్యపురి: లెక్చరర్లను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్రావు, వీహెచ్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. హరినాథ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్న వారు గురువారం చైతన్యపురి పీఎస్కు చేరుకుని ఇన్స్పెక్టర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు, లెక్చరర్ల భవిష్యత్ను అంధకారంలోకి నెడుతున్న కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు కనీసం స్పందించకపోవటం సిగ్గు చేటన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకులు మంగళవారం ధర్నా చేపట్టారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్లాస్ రూమ్లోకి వెళ్లి ఇద్దరు అధ్యాపకులు స్వీయ నిర్బంధం అయ్యారు. విధుల్లోకి తీసుకుని జీతాలు చెల్లించాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. చదవండి: నాకు తెలియకుండా షాప్ పెడ్తార్రా..! వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల ఫీజుల బాగోతం -
వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల బాగోతం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖ కమిషన్ చేపట్టిన పాఠశాలల తనిఖీల్లో జూనియర్ కాలేజీలు నారాయణ, శ్రీ చైతన్యల అధిక ఫీజుల వసూళ్ల బాగోతం బట్టబయలైంది. రాష్ట్రంలోని పలు పాఠశాలపై విద్యాశాఖ కమిషన్ నాలుగు బృందాలు బుధవారం తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రొఫెసర్ నారాయణరెడ్డి, డాక్టర్ ఈశ్వరయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పాఠశాలల యాజమాన్యాలపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ సంక్రాంతికి 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయల వరకు ఫీజులు కట్టించుకున్నారంటూ విద్యార్థులు అధికారులతో ఎదుట వాపోయారు. టాయిలెట్లలో కనీస సౌకర్యాలు లేవని, ప్రతి ఏడుగురికి ఒక బాత్రూమ్ కేటాయించారని తెలిపారు. ఇంటర్ మొదటి ఏడాదికి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇక గూడవల్లి శ్రీ చైతన్య కళాశాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కనీస వసతులు కూడా లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. తాగునీరు, బాత్రూమ్ కుళాయిలు లేకపోవటంతో కమిషన్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నారాయణ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని, జీవో 51ని కూడా యాజమాన్యం అమలు చేయడం లేదని వెల్లడించారు. నారాయణ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని కమిషన్ సభ్యులు సీఏవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంతేగాక కాలేజీల్లో సామాజిక దూరం అమలు చేయడం లేదని, కనీసం శానిటైజర్లు కూడా అందుబాటు ఉంచలేదన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారని మండిపడ్డారు. సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మౌలిక వసతులు కూడా సరిగా లేని కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కళాశాలలు ఉల్లంఘించాయన్న ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. -
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఐటీ దాడులు
-
నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్లలో ఐటీ దాడులు
సాక్షి, విజయవాడ : నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద గల నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఐటీ అధికారులు నారయణ, శ్రీచైతన్య కాలేజీలలో తనిఖీలు జరుపుతున్నారు. నారాయణ క్యాంపస్కు వెళ్లిన ఐటీ అధికారులు.. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కాలేజీ సిబ్బందిని బయటకు పంపించి సోదాలు చేస్తున్నారు. తాటి గడప, ఈడ్పుగల్లులోని క్యాంపస్లలో కూడా దాడులు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్లోని మాదాపూర్ సమీపంలో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్టులను స్వాధీనం చేసుకున్నారు. -
పురుగుల అన్నం పెడుతున్నారు..
సాక్షి, కొమ్మాది(భీమిలి): ఆ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినులు మంచాన పడ్డారు. వారం రోజులుగా పురుగుల అన్నం పెడుతుండటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అదే తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జీవీఎంసీ 4వ వార్డు కొమ్మాది మైత్రీభవన్లోని శ్రీచైతన్య మహిళా జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ నాల్గో వార్డు కొమ్మాదిలోని మైత్రీభవన్లో శ్రీ చైతన్య మహిళా జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో గురువారం రాత్రి విద్యార్థినులు తినే ఆహారం విషతుల్యం కావడంతో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి కొంత మందిని, శుక్రవారం మరికొందరిని దగ్గరలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. కళాశాలలో పెడుతున్న భోజనం నాణ్యత లేకపోవడం, పురుగులు పట్టిన అన్నం వండి పెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని పశ్నిస్తే యాజమాన్యం భయబ్రాంతులకు గురి చేస్తోందని, తప్పని పరిస్థితుల్లో ఈ భోజనం తినడంతో అనారోగ్యానికి గురయ్యామని విద్యార్థులు తెలిపారు. ఈ సమాచారాన్ని తోటి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు యాజమాన్యాన్ని జరిగిన సంఘటనపై ప్రశ్నించారు. యాజమాన్యం నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో వారంతా ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్లే తమ పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, పిల్లలకు బాగులేకుంటే కనీసం ఫోన్ చేసి సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పిల్లలు బాగా నీరసించిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారని, వీరికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు యాజమాన్యం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో కళాశాల ఆవరణలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు వెనక్కి తగ్గారు. అన్నంలో పురుగులు.. వినాయకచవితి నుంచి పాఠశాల యాజమాన్యం ఆహార నాణ్యతను పట్టించుకోవడం లేద ని విద్యార్థినులు తెలిపారు. వారం రోజుల నుంచి తినే అన్నంలో పురుగులు వస్తున్నాయ ని, గురువారం రాత్రి పెట్టిన భోజనంలో కూడా పురుగులు ఉన్నాయన్నారు. ఈ ఆహారం తినే ఫుడ్ పాయిజన్ అయిందని, వీటిని తిన్న 70 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. శుక్రవారం ఉదయం అందరినీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించి.. వెంటనే కళాశాలకు తీసుకుని వచ్చేసారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే పరీక్షలకు పంపించమని సిబ్బంది బెదిరించారని వాపోయారు. అడుగడుగునా నిర్లక్ష్యం.. తమ పిల్లల భవిష్యత్ కోసం లక్షలు వెచ్చించి ఈ కళాశాలలో చేర్పించామని, తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే 70 మంది అస్వస్థతకు కారణమైందన్నారు. ఇక్కడ తాగేందుకు మంచినీరు కూడా లేదన్నారు. కనీసం తమతో ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదని వాపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వారి తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఇంత నిర్లక్ష్యమా.. మా పిల్లల బంగారు భవిష్యత్ కోసం లక్షల్లో ఫీజులు వెచ్చించి కళాశాలకు పంపిస్తే.. చదువు దేవుడెరుగు కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టరా. వారం రోజులుగా పురుగులు అన్నం తిని మా అమ్మాయి అస్వస్థతకు గురైంది. సంబంధిత అధికారులు స్పందించి యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. – మధుబాబు, ఓ విద్యార్థిని తండ్రి, శ్రీకాకుళం అన్నం తినలేకపోతున్నాం. ఇక్కడ మాకు పెడుతున్న భోజనం తినలేకపోతున్నాం. ఇదేంటని ప్రశ్నిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదని బెదిరిస్తున్నారు. ఇక్కడ భోజనం తిని ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రి పాలయ్యాం. – హేమ, అస్వస్థతకు గురైన విద్యార్ధిని. పునరావృతం కాకుండా చూసుకుంటాం.. కళాశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు అస్వస్థత గురికావడం వాస్తవమే. మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగింది. భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాం. – బాలసూర్య, ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల అంతా రహస్యంగానే... నాలుగు రోజుల నుంచి విద్యార్థినులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు తెలిసింది. అయితే గురువారం రాత్రి తిన్న ఆహారం విషతుల్యమై 70 మంది మంచాన పడ్డారు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించిన యాజమాన్యం.. అందరినీ ఒకే ఆస్పత్రికి కాకుండా పది మంది చొప్పున పలు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించింది. వెంటనే అందరినీ మళ్లీ కళాశాలకు తీసుకొచ్చేసింది. వసూళ్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
శ్రీచైతన్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయవాడ: కాలేజీ సిబ్బంది ఒత్తిళ్లు భరించలేక ఓ ఇంటర్ విద్యార్థిని నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. నవలూరు స్వప్న అనే విద్యార్థిని గంగూరు మైత్రి క్యాంపస్లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో కాలేజీ సిబ్బంది ఒత్తిళ్లతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన స్వప్నను తక్షణమే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వప్న పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చేర్చామని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం పట్ల కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. తనకు న్యాయం చేయాలని స్వప్న తండ్రి వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మున్సిపల్ కాంప్లెక్స్ భవనం.. దాసోహమా?
తిరుపతి నగర పాలక సంస్థకు చెందిన భవనం శ్రీచైతన్య విద్యాసంస్థల కంబంధ హస్తాల్లో చిక్కుకుంది. సాంకేతిక సమస్యలను అడ్డుపెట్టుకుని ఆ సంస్థ ఏళ్ల తరబడి నామమాత్రపు అద్దె చెల్లిస్తోంది. కార్పొరేషన్ కాంప్లెక్స్ను చట్టపరంగా స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులిచ్చినా సదరు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఖజానాకు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి : తిరుపతి నడిబొడ్డున ఉన్న గాంధీరోడ్డు ప్రధాన వ్యాపార కేంద్రం. 1995కు ముందు 30 సెంట్లు (360 అంకణాలు) పైగా స్థలంలో మున్సిపల్ మార్కెట్ను నిర్వహించేవారు. నగరం విస్తరించడం, గాంధీరోడ్డు రద్దీ కావడంతో మార్కెట్ను తుడా ఆఫీస్ ఎదురుగా మార్చారు. 1999లో గాంధీరోడ్డులోని పాత మార్కెట్ స్థలంలో 5800 చ.అ విస్తీర్ణంలో కాంప్లెక్స్ను నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 9 కమర్షియల్ గదులు, మొదటి, రెండు అంతస్తులను హాళ్లుగా నిర్మించారు. 1999 ఏప్రిల్లో ఈ కాంప్లెక్స్కు టెండర్ నిర్వహించారు. ఇందులో మొదటి, రెండో అంతస్తులను పూర్తిగా శ్రీచైతన్య విద్యాసంస్థ దక్కించుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లోని 3, 7 గదులు మినహా మిగిలిన గదులను ఆ సంస్థ దక్కించుకుంది. 2004 వరకు నెలకు రూ.75వేల అద్దెను చెల్లించేది. ఐదేళ్ల వరకు ఇదే అద్దెను చెల్లిస్తూ వచ్చింది. ఆపై ప్రభుత్వ నిబంధనల మేరకు మూడేళ్లకు ఒకసారి 33.33 శాతం అద్దెను చెల్లించాలి. ఆ విధంగా 2007లో 33.33శాతం పెంచి అద్దెను చెల్లించింది. 2008లో తిరుపతి టాస్క్ఫోర్సు కమిటీ సమావేశమై నిబంధనలకు విరుద్ధంగా రద్దీ ప్రాంతంలో కళాశాలను నడిపేందుకు కేటాయించారని, కళాశాల గాంధీ రోడ్డులో ఉండడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని గుర్తించి లీజ్ను రద్దుచేయాలని నిర్ణయించింది. అధికారులు కళాశాలకు నోటీసులు జారీ చేశారు. దీనిపై కళాశాల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. 33.33శాతం అద్దెను పెంచి చెల్లించాలని 2007లో అప్పటి అధికారులు చైతన్య కళాశాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను ఆధారంగా చూపిస్తూ 2010 వరకు నిబంధనలు వర్తిస్తాయని కళాశాల యాజమాన్యం వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. అప్పటి నుంచి కోర్టులో దీనిపై వాదనలు జరుగుతూ వచ్చాయి. 2016లో అప్పటి కమిషనర్ వినయ్చంద్ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలు జారీ బచేయాలని, కోర్టులో పూర్తిస్థాయిలో చార్జ్ ఫైల్ చేయాలని ఆదేశించారు. ఆ ఫైల్ను వేగంగా నడిపించారు. దీంతో 2017లో కళాశాలకు పర్మినెంట్ ఇంజెక్షన్ ఇస్తూ కార్పొరేషన్ చట్టప్రకారం భవనాన్ని స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పటి నుంచి అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. గత కమిషనర్ విజయ్రామరాజుకు సంబంధిత ఫైల్ను రెండుసార్లు పంపినా ఆయన పెద్దగా స్పందించలేదు. అప్పటి ప్రభుత్వం ఒత్తిడి వల్ల అధికారులు కళాశాలకు అనుకూలంగా వ్యవహరించారు. కార్పొరేషన్కు లక్షల్లో నష్టం గడిచిన 20 ఏళ్లుగా మున్సిపల్ కాంప్లెక్స్కు టెండర్ నిర్వహించకపోవడంతో కార్పొరేషన్కు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. మూడేళ్లకు ఒకసారి 33.33శాతం అద్దెను పెంచి నామమాత్రంగా చెల్లిస్తున్నారు. మూడేళ్లకు ఒకసారి రీటెండర్ నిర్వహించి ఉంటే అద్దె మరింతగా పెరిగి కార్పొరేషన్కు ఆదాయం చేకూరేది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రధానమైన వ్యాపార కేంద్రం కావడంతో గాంధీరోడ్డులో ప్రైవేట్ భవనాల్లో అద్దె ఆకాశాన్ని అంటుతోంది. 2,800 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ భవనానికి రెండంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్లోని ఏడు గదులకు కలిపి 2019 మార్చి నుంచి నెలకు రూ.2లక్షల 58వేలు చెల్లిస్తున్నారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం శ్రీచైతన్య విద్యాసంస్థలు నడుపుతున్న భవనానికి రూ.నాలుగు లక్షలకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా స్పందిస్తారా? గత ప్రభుత్వ ఒత్తిడి కారణంగా శ్రీచైతన్య విద్యాసంస్థలు నడుపుతున్న కార్పొరేషన్ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సాహసించలేదు. గడిచిన ఐదేళ్లుగా కోర్టుకు సరైన పత్రాలు సమర్పించలేకపోయారు. తీరా చట్టం ప్రకారం స్వాధీనం చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నా ఆదిశగా చర్యలు చేపట్టలేకపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్పొరేషన్కు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కేంద్రంలోని రద్దీ ప్రాంతంలో నడుపుతున్న భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో ఆందోళన చేయాల్సి వస్తుందని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. మున్సిపాలిటీ టెండర్ ప్రకారం శ్రీచైతన్య విద్యాసంస్థ గాంధీరోడ్డులోని కాంప్లెక్స్ను దక్కించుకుంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఆకాంప్లెక్స్లో విద్యా సంస్థలను నడపడం చట్టవిరుద్ధం. 20 ఏళ్ల పాటు అదే భవనంలో కళాశాలను నడుపుతున్నారు. తిరుపతి నడిబొడ్డున ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న గాంధీరోడ్డులో ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్యం రద్దీగా ఉంటుంది. కళాశాలకు విద్యార్థులు వచ్చి వెళ్లే సమయాల్లో విపరీతమైన రద్దీ సమస్య నగర వాసుల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. గాంధీరోడ్డు, తీర్థకట్టవీధి, గోవిందరాజ తేరు వీధి, తిలక్రోడ్డు వరకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. విద్యాశాఖ, కార్పొరేషన్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజా అవసరాల దృష్ట్య ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నా అధికారులు ఆదిశగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. -
శ్రీచైతన్యలో పుడ్ పాయిజన్..40మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : శ్రీచైతన్య కళాశాలలో పుడ్ పాయిజన్ జరిగి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. కొండాపూర్లో ఉన్న శ్రీచైతన్య కళాశాలలో వంట చేసి అక్కడ నుంచి మాదాపూర్లో ఉన్న హాస్టల్కు తరలిస్తుంటారు. మంగళవారం రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకొని తమ పిల్లలను ఇళ్లకు తీసుకొని వెళ్తున్నారు. కాగా పుడ్ పాయిజన్ విషయాన్ని కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చుతుంది. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులతో ఇంటికి పంపిస్తున్నారు. పుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న హాస్టల్లోని మిగతా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
-
పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్ : పరీక్ష హాల్లోనే ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి గుండె ఆగింది. వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లాకు చెందిన గోపీరాజు శనివారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరయ్యాడు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీలో పరీక్ష రాస్తున్న అతడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో గోపిరాజును సమీపంలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా గోపీరాజు ఓ ప్రయివేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు చదువుతున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీ విద్యార్ధి ఆత్మహత్య
-
నడిరోడ్డు పై తగలబడిపోయిన బస్సు
-
ఫీజు వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి
హైదరాబాద్: ఫీజు వేధింపులకు ఓ ఇంటర్ విద్యార్థిని బలైంది. హాస్టల్ గదిలో ఉరేసుకుని విగతజీవిగా మారింది. ఈ సంఘటన హైదరాబాద్ సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన ధరణి సాయిలు, మంజుల దంపతులకు ముగ్గురు సంతానం. సాయిలు ఆర్టీసీ కండక్టర్. పెద్ద కూతురు అర్చన(15) చైతన్యపురిలోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. రూ.లక్ష ఫీజుకుగాను సాయిలు రెండు నెలల క్రితం రు.50 వేలు చెల్లించారు. మిగతా ఫీజు చెల్లించాలని అర్చనపై యాజమాన్యం కొన్నిరోజులుగా ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే రాఖీ పండుగ సందర్భంగా శనివారం అర్చన ఇంటికి వెళ్లి తిరిగి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చింది. ఆమె నేరుగా హాస్టల్లోని తన గదికి వెళ్లి చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుంది.భోజన విరామ సమయంలో గదికి వచ్చిన సహ విద్యార్థినులు గమనించి వార్డెన్కు సమాచారమందించారు. వెంటనే వార్డెన్ వచ్చి సమీపంలోని ఓమ్నీ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అర్చన అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాలేజీ నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసి కళాశాలను మూసేసి పారిపోయారు. పోలీసులు అర్చన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య విషయం చెప్పారు. వెంటనే వారు కాలేజీకి వచ్చి బోరున విలపించారు. ‘యాజమాన్యం ఫీజుల వేధింపులతోనే మా కూతురు మృతి చెం దింది, వారంరోజుల్లో ఫీజు మొత్తం చెల్లించాలని అనుకున్నాం, ఫీజు చెల్లించే వరకు మా బిడ్డను కాలే జీకి పంపక పోయినా బాగుండేది’అని రోదించారు. దీంతో కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి అర్చన తల్లిదండ్రులతో కలసి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి: విద్యార్థి సంఘాలు అర్చన ఆత్మహత్యకు కారణమైన కళాశాల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్, టీఆర్ఎస్వీ, టీఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ తదితర సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కళాశాల నిర్వాహకులు లక్షలాది రూపాయల ఫీజును ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తున్నారని అన్నారు. -
శ్రీచైతన్యలో మరో విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తపేట శ్రీ చైతన్య మహిళా జూనియర్ కాలేజీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్చన అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని గమనించిన సిబ్బంది హుటాహుటీనా దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే చనిపోయింది. అర్చన స్వస్థలం నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం. కాలేజీ డీన్ మమతా తిట్టడంతోనే ఆత్మహత్య చేసుకుందని సమాచారం. విద్యార్థి కుటుంబసభ్యులకు న్యాయం చేసి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
రెండో రోజూ కొనసాగిన ‘ఎంసెట్’ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ, శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబుల విచారణ రెండో రోజు కూడా కొనసాగింది. శివనారాయణ ద్వారా మరిన్ని వివరాలు రాబట్టేందుకు శనివారం మధ్యాహ్నం అతన్ని కటక్ తీసుకెళ్లినట్లు సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులతో కటక్లోనే శివనారాయణ క్యాంపు నడిపినందున అక్కడి బ్రోకర్ల జాడ తెలిసే అవకాశముందని, క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉండటంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇక శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబును హైదరాబాద్లో మరో బృందం విచారించింది. ముగ్గురు విద్యార్థులకే కాకుండా మరో నలుగురికి వాసుబాబు ప్రశ్నపత్రం ఇచ్చినట్లు విచారణలో సీఐడీ గుర్తించింది. కానీ, తాను ముగ్గురినే క్యాంపునకు తరలించినట్లు వాసు చెబుతుండటంతో రుజువులతో సహా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేలో పరీక్ష జరగాల్సి ఉండగా ఫిబ్రవరి నుంచే కొంతమంది విద్యార్థులతో వాసు టచ్లో ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. దీంతో వారితో వాసు ఎందుకు టచ్లో ఉన్నాడో చెప్పాలని సీఐడీ ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే రెండు రాష్ట్రాల్లోని శ్రీచైతన్య కళాశాలల విద్యార్థులను హైదరాబాద్ పిలిపించి మాట్లాడారని, ప్రశ్నపత్రం వ్యవహారంపైనే చర్చించారా అని అధికారులు వివరణ కోరినట్లు తెలిసింది. మళ్లీ బ్రోకర్ల విచారణ వాసుబాబు, శివనారాయణ ద్వారా విద్యార్థులను క్యాంపులకు పంపిన తల్లిదండ్రుల వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ నిర్ణయించింది. వారిరువురూ డీల్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను వారి ముందే ప్రశ్నించనుంది. రూ.35 లక్షల చొప్పున డీల్ సెట్ చేసుకున్న వీరు అడ్వాన్స్గా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు, పూచీకత్తుగా పదో తరగతి సర్టిఫికెట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. వీరి నుంచి రికవరీ లేకపోవడంతో ఈ రెండు అంశాలపై తల్లిదండ్రుల నుంచి వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి అంశంపైనా వారు పొంతన లేకుండా వ్యవహరించడంతో సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎక్కడా సరిగా సమాధానాలు చెప్పడం లేదని అధికారులు తెలిపారు. వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయో ఆయా బ్రోకర్లను సైతం మళ్లీ విచారణకు పిలుస్తున్నామని ఉన్నతాధి కారి ఒకరు చెప్పారు. అప్పుడే వారి బాగోతం వెలు గులోకి వస్తుందని, కార్పొరేట్ సంస్థల చీకటి వ్యవహా రం కూడా ఆధారాలతో బయటపడుతుందన్నారు. -
ఎంసేట్ లీకేజీ కేసు: 100కు చేరిన నిందితులు
సాక్షి, హైదరాబాద్ : రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ (మెడికల్) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితులు శ్రీచైతన్య కాలేజీల డీన్ ఓలేటి వాసుబాబు(ఏ–89), ఏజెంట్ శివ నారాయణ రావు(ఏ90)లను మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ శనివారం నాంపల్లి కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. గత గురువారమే సీఐడీ ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వాసుబాబును శ్రీచైతన్య యాజమాన్యం సస్పెండ్ చేసింది. వాసుబాబు రిమాండ్ రిపోర్టు సాక్షికి అందింది. ఈ రిపోర్ట్లో కేసుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కొడుకు మెడిసిన్ సీటు కోసమే వాసుబాబు 2015లో తొలి సారి ఈ లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ సందీప్కుమార్ను కలిసాడని తెలుస్తోంది. 2016లో అతని కొడుకుకు కర్ణాటకలో మెడిసిన్ సీటు లభించిందని, ఈ పరిచయంతోనే సందీప్ హైదరాబాద్కు వచ్చినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. ఈ తరుణంలోనే చైతన్య కాలేజీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులతో సందీప్ ఒక్కో విద్యార్థికి రూ.36 లక్షలు చోప్పున బేరం కుదుర్చుకొని, అడ్వాన్స్గా ఒక్కొక్కరి నుంచి 9 లక్షలు తీసుకున్నాడు. ఈ లీకేజీ వ్యవహారంపై గుంటూరు శివనారయణకు కూడా సమాచారం అందించడంతో.. గుంటూరు నుంచి మరో ముగ్గురు విద్యార్థులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విద్యార్థులను భువనేశ్వర్ క్యాంప్కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 64 మంది అరెస్ట్కాగా 26 మంది పరారీలో ఉన్నారు. తాజాగా మరో పది మంది నిందితులను సీఐడీ గుర్తించింది. దీంతో మొత్తం నిందితుల సంఖ్య 100కు చేరింది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల బెంగళూరు, ముంబై, పుణె, షిర్డీ, కోల్కతా, భువనేశ్వర్ల్లో క్యాంపులు నిర్వహించనట్లు సీఐడీ గుర్తించింది. 85 మందిని సాక్ష్యులుగా చూపిన సీఐడీ.. వీరిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులను కూడా సాక్ష్యులుగా చూపింది. -
డీన్ వాసుబాబు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
-
ఎంసెట్ లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల హస్తం
-
తనపల్లి క్రాస్ శ్రీ చైతన్య కాలేజిలో విషాదం
-
ఎంసెట్ లీకేజీ కేసులో శ్రీచైతన్య డీన్
-
ఎంసెట్ కేటు.. కార్పొ‘రేటు’
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ (మెడికల్) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల డొంక కదులుతోంది! ఇన్నాళ్లు లీకేజీకి పాల్పడ్డ నిందితులతోపాటు సాదాసీదా బ్రోకర్లను కటకటాల్లోకి నెట్టిన సీఐడీ తాజాగా ప్రముఖ కార్పొరేట్ కాలేజీ శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును అరెస్ట్ చేసింది. ఈయనకు సహకరిస్తూ విద్యార్థులను క్యాంపులకు తరలించిన ఏజెంట్ కమ్మ వెంకట శివ నారాయణ రావును కూడా గురువారం అరెస్ట్ చేసింది. దిల్సుఖ్నగర్ శ్రీచైతన్య బ్రాంచ్తోపాటు మరో ఆరు కేంద్రాల్లోని కాలేజీలకు ఓలేటి వాసుబాబు(ఏ–89) డీన్గా వ్యవహరిస్తున్నాడు. గుంటూరుకు చెందిన శివ నారాయణ రావు(ఏ90).. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించే ఏజెంట్. వీరిద్దరూ ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ ధనుంజయ్ థాకీర్, డాక్టర్ సందీప్కుమార్తో డీల్ కుదుర్చుకున్నారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిండ్రులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి ముందుగానే ప్రశ్నపత్రం ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ కేంద్రంగా నడిచిన ప్రిపరేషన్ క్యాంపునకు ఆరుగురు విద్యార్థులను పంపారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మరో ప్రముఖ కాలేజీకి సంబంధం? ప్రముఖ కార్పొరేట్ కాలేజీలకు ఎంసెట్ లీకేజీ స్కాంతో లింకులుండటం సంచలనంగా మారింది. డీన్ వాసుబాబు నిందితులతో పదేపదే మాట్లాడటంతోపాటు మరికొందరు విద్యార్థులను చేర్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఏజెంట్ శివ నారాయణ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని, మరో ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ఆయన టచ్లో ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలిపారు. వీరిద్దరూ ప్రధాన నిందితులతో స్కాం బయటపడిన తర్వాత కూడా టచ్లో ఉండటం, విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లపై మరింత స్పష్టత రావాల్సి ఉందని దర్యాప్తు అధికారులు వివరించారు. అధికారుల పిల్లలకూ ‘ముందస్తు’ శిక్షణ శివ నారాయణ, డీన్ వాసుబాబు తీసుకువెళ్లిన విద్యార్థుల్లో కొందరు ప్రభుత్వాధికారుల పిల్లలుండటం సీఐడీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరు ఐఏఎస్ అధికారుల పిల్లలతోపాటు ఆరుగురు ప్రభుత్వాధికారుల పిల్లలు కూడా లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ కోసం కటక్ క్యాంపునకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సీఐడీ అధికారులు స్పందించడం లేదు. శ్రీచైతన్య కాకుండా మరో ప్రముఖ కాలేజీ విద్యార్థులను సైతం వాసుబాబు కటక్లో శిక్షణకు తరలించినట్టు సీఐడీ గుర్తించింది. మరో 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన ఫోన్ ద్వారా పదే పదే టచ్లో ఉన్నట్టు తేలింది. ఈ మేరకు సీఐడీ ఆధారాలు సేకరించింది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. కాలేజీ కోసమే చేశా.. తమ కాలేజీకి పేరు తీసుకువచ్చేందుకే ఈ స్కాంలో పాలు పంచుకున్నట్టు డీన్ వాసుబాబు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడని సీఐడీ తెలిపింది. తల్లిదండ్రులను ఒప్పించి క్యాంపునకు పంపినట్టు ఆయన తెలిపాడు. తాను పంపిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి మంచి ర్యాంకులు వచ్చాయని, దీంతో వారి నుంచి మరింత డబ్బు వసూలు చేసేందుకు కూడా ఒప్పందం కుదిరినట్టు విచారణలో తేలింది. దర్యాప్తులో ఎందుకింత ఆలస్యం? సరిగ్గా రెండేళ్ల క్రితం ఎంసెట్ లీకేజీపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ చేసినవారితోపాటు ఇతర నిందితులు అరెస్ట్ చేస్తూ వచ్చింది. మొదటి రెండు నెలల్లోనే 22 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ ఆ తర్వాతి రెండు నెలల్లోనే 64 మంది బ్రోకర్లను జైలుకు పంపించింది. కానీ ఆ తర్వాత నుంచి కేసు దర్యాప్తు నెమ్మదించింది. అయితే మొదట్లోనే శ్రీచైతన్య, మరో కార్పొరేట్ కాలేజీకి లింకుందని తెలిసినా ఎందుకు పట్టించుకోలేదన్న దానిపై ఇప్పుడు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో విచారించిన అధికారులు ఎవరి ఒత్తిడి మేరకు వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేశారు? దీని వెనుక ఎంత మొత్తం చేతులు మారిందన్న దానిపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. గతంలో ఇదే కేసులో అక్రమాలకు పాల్పడ్డ ఓ డీఎస్పీతోపాటు మరో ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బందిని సీఐడీ అధికారులు సస్పెండ్ చేశారు. అయినా జంకని అధికారులు శ్రీచైతన్య డీన్తోపాటు ఏజెంట్ను వదిలిపెట్టడంపై ఇప్పుడు అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సీఐడీ కీలక అధికారి ఒకరు చెప్పారు. పిలిచి పంపించారు గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును ఓ సీనియర్ అధికారి విచారణకు పిలిచి పంపించి వేసినట్టు తాజాగా బయటపడింది. ఎందుకు పిలిచారు, ఎందుకు పంపించి వేశారు? కనీసం వాంగ్మూలం కూడా ఎందుకు రికార్డు చేయలేదు? సీఐడీ అదనపు డీజీపీకి కూడా తెలియకుండా నిందితుల జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఆరోపణల జాబితాలో ఉన్న మరో కాలేజీ హైదరాబాద్ కీలక బ్రాంచ్ ప్రిన్సిపల్ను సైతం దర్యాప్తు అధికారి ఓ హోటల్కు పిలిపించి వదిలేయడంపైనా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి సెల్ఫోన్ డేటాను పరిశీలిస్తే సంబంధిత ఉన్నతాధికారితోపాటు ఓ ఇన్స్పెక్టర్, మరో డీఎస్పీ వ్యవహారం బయటపడుతుందని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తు అధికారులు మార్పు వెనుక.. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నాటినుంచి ఎనిమిది మంది దర్యాప్తు అధికారులు మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు దేశవ్యాప్తంగా లింకులుండటంతో ఒక సీనియర్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించి బృందాలను ఏర్పాటు చేసి అరెస్టులు కొనసాగించారు. అయితే ఇదే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు దర్యాప్తు అధికారి మారిపోవడం, సస్పెన్షన్కు గురవడంతో అనుమానాలు తీవ్రమయ్యాయి. పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిళ్ల వల్లే తాను స్వచ్ఛందంగా దర్యాప్తు నుంచి తప్పుకున్నట్టు గతంలో కేసును దర్యాప్తు చేసిన అధికారి ఒకరు తెలిపారు. పదే పదే ఫోన్లు చేసి ఈ రెండు కార్పొరేట్ కాలేజీల జోలికి వెళ్లవద్దని, అటు యూనివర్సిటీ అధికారుల పాత్రపైనా పెద్దగా విచారణ చేయవద్దని, ఏదైనా ఉంటే ఫార్మాలిటీ పూర్తి చేస్తామని, దానికి కాలేజీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని తనతో పదే పదే చెప్పినట్టు సదరు అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే వాటికి తాను ఒప్పుకోలేదని, కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించాలని వేడుకోగా ఉన్నతాధికారులు మరో అధికారికి అప్పగించినట్టు ఆయన వివరించారు. కీలక నిందితుల మృతిపైనా అనుమానాలు ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి కమిలేశ్ కుమార్ సింగ్ సీఐడీ కస్టడీలో మృతి చెందడం, ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన రావత్ అనుమానాస్పదంగా చనిపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిలేశ్ సింగ్ గుండెపోటుతో మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని సీఐడీ అధికారులు చెబుతున్నా.. రావత్ మృతిపై మాత్రం నోరుమెదపడం లేదు. కమిలేశ్కు కస్టడీలో ఉండగా రెండుసార్లు గుండెపోటు వచ్చింది. మొదటిసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ రెండోసారి నటన అనుకొని నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మృతి వెనక కూడా అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాసుబాబును సస్పెండ్ చేసిన శ్రీచైతన్య ఎంసెట్ లీకేజీ కేసులో అరెస్టయిన డీన్ ఓలేటి వాసుబాబును సస్పెండ్ చేస్తున్నట్టు శ్రీచైతన్య యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో తమకేమీ సంబంధం లేదని, 32 ఏళ్ల విద్యాప్రస్థానంలో ఎప్పుడూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆ విద్యాసంస్థల స్టేట్ కో–ఆర్డినేటర్ నరేంద్రబాబు పేర్కొన్నారు. -
ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు
-
ఎంసెట్ పేపర్ లీక్.. నారాయణ, శ్రీచైతన్యలకు లింక్
సాక్షి, హైదరాబాద్: 2016లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు. ఈ స్కాంతో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు సంబంధాలున్నాయని తెలంగాణ సీఐడీ పోలీసులు నిర్ధారించారు. ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...ఎంసెట్ పేపర్ లీకేజీ స్కాం ప్రధాన నిందితులతో సంబంధాలున్న వాసుబాబును హైదరాబాద్లో, శివనారాయణను గుంటూరులో అరెస్టు చేశామని చెప్పారు. చైతన్య కాలేజీలకు డీన్గా వ్యవహరిస్తున్న వాసుబాబును ఎ-89, మరో నిందితుడు శివనారాయణ ఎ-90గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ధనుంజయ ఠాకూర్, సందీప్ కుమార్లతో వీరిద్దరూ టచ్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆరుగురు విద్యార్థులకు ర్యాంకులు రావడానికి వాసుబాబు, శివనారాయణ ప్రధాన నిందితులతో ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి 36 లక్షల రూపాయలు వసూలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురికి టాప్ ర్యాంకులు వచ్చాయని అన్నారు. ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. -
కాలేజీ నుంచి సస్పెండ్.. విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి : కళాశాల నుంచి సస్పెండ్ చేశారని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. ధీరజ్ అనే విద్యార్థి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూర్లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ధీరజ్ స్వస్థలం కర్నాటకలోని రాయచూరు. ఈ నెల 26వ తేదీన ధీరజ్ కళాశాలలో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన యాజమాన్యం అతని మందలించి, కళాశాల నుంచి సస్సెండ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధీరజ్ ఇంటికి వెళ్లిపోయాడు. జూన్ 27వ తేదీన ఇంటిలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అతని చావుకు కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ మిత్రుడి మరణవార్త విన్న తోటి విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్షమించండి నాన్న..
హైదరాబాద్: ‘‘నాన్న.. నా కోసం చాలా చేశావ్... నువ్వు నాకు చాలా ఇచ్చావు. కానీ దానికి ఫలితం లేకుండాపోయింది. సారీ డాడీ. తాత, నానమ్మ, అమ్మ, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో డాడీ. తమ్ముడు ఏం అనుకుంటే అది చేయనివ్వు డాడీ’’అని 16 పేపర్ల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఇంటర్ విద్యార్థి. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీలో హరిశ్రీటవర్స్లో నివాసముంటున్న భీమి రెడ్డి నాగరామిరెడ్డి కుమారుడు అభికుమార్రెడ్డి (17) మాతృశ్రీనగర్లోని చైతన్య కళాశాలలో ఐపీఎల్(1) ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కళాశాల రెండవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగరామిరెడ్డికి సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభికుమార్రెడ్డి మృతిచెందాడు. అంతకుముందు తండ్రికి సూసైడ్ లెటర్ రాశాడు. యాజమాన్యం వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు నాగరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. -
చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
-
చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు చైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంసెట్ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని చంద్రకా నాగమణి శనివారం మధ్యాహ్నం కళాశాల క్లాస్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన నాగమణి చైతన్య కాలేజీలోని వసతి గృహంలో ఉంటూ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. మరోవైపు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రికా నాగమణి రాసిన సూసైడ్ లేఖలో కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు ఆత్మహత్య సమాచారం అందించారు. ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశం విద్యార్థిని చంద్రికా నాగమణి ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. ఆమె మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా...విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. -
ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ మామ్ అండ్ డాడ్..!
సాక్షి, దుండిగల్: ‘అందరి దృష్టిలో చెడ్డపేరు తెచ్చుకున్నాను. వాళ్ల మనసులో ఒక పిరికివాడిలా మిగిలిపోయాను.. అమ్మా.. నాన్నా.. నా వల్ల మీ అందరికీ నష్టం జరుగుతోంది. ఇకపై మీకు ఏ సమస్యా ఉండదు. నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఐ మిస్ యూ.. అండ్ ఐ లవ్ యూ. మామ్ అండ్ డాడ్’ అంటూ ఓ విద్యార్థి సుసైడ్ నోట్ రాసి అదృశ్యమయాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ టౌన్ సాయినగర్కు చెందిన చింతల లక్ష్మణ్ కుమారుడు చింతల సాయిగణేశ్ (17) బౌరంపేటలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన సాయిగణేశ్ తిరిగి రాకపోవడంతో నిర్వాహకులు అతని తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. హాస్టల్కు చేరుకున్న సాయిగణేశ్ తండ్రి చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. అదేరోజు రాత్రి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు అదృశ్యమయ్యాడని, హాస్టల్ నుంచి బయటకు వెళ్లినా పట్టించుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు హాస్టల్లో ఉంటున్న సాయిగణేశ్ గదిని పరిశీలించారు. గదిలో గణేశ్ రాసిని సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విద్యార్థి కోసం గాలింపులు చేస్తున్నారు. -
శ్రీ చైతన్య విద్యార్థి అదృశ్యం
నిజామాబాద్ క్రైం: శ్రీ చైతన్య కళాశాలలో చదివే నిజామాబాద్కు చెందిన విద్యార్థి సూసైడ్ నోట్ రాసి కాలేజీ నుంచి అదృశ్యమయ్యాడు. నిజామాబాద్కు చెందిన చింతల లక్ష్మణ్ కుమారుడు సాయిగణేశ్ హైదరాబాద్లోని శ్రీ చైతన్య గండిమైసమ్మ బ్రాంచ్లో ఎంపీసీ చదువుతున్నాడు. ఈ నెల 13న నిజామాబాద్కు వచ్చిన అతడు తిరిగి కళాశాలకు వెళ్లాడు. ఆదివారం లక్ష్మణ్ హైదరాబాద్కు పని మీద వెళ్లాడు. మధ్యాహ్నం కళాశాల నిర్వాహకులు ఫోన్ చేసి.. మీ కుమారుడు కనిపించటం లేదని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన అతడు హుటాహుటిన కళాశాలకు వెళ్లి ఆరా తీశాడు. కళాశాల సిబ్బంది గండిమైసమ్మ పోలీస్స్టేషన్లో గణేశ్ అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. కళాశాల హాస్టల్లో లక్ష్మణ్కు గణేశ్ గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘ఐ మిస్ యూ డాడీ, ఐ మిస్ యూ మమ్మీ’ అని రాశాడు. లేఖలో తాను చనిపోతున్నట్లు రాసి ఉన్నట్లు తండ్రి చెబుతున్నారు. అందులోని చేతిరాత తన కొడుకుది కాదని, 4 రకాలుగా రైటింగ్ ఉందని, దీనిపై అనుమానం ఉందని లక్ష్మణ్ అంటున్నారు. శనివారం రాత్రి తల్లితో సంతోషంగానే మాట్లాడినట్లు లక్ష్మణ్ తెలిపాడు. -
నారాయణ, శ్రీచైతన్య హాస్టళ్లు నరకానికి నకళ్లు
-
నారాయణ, శ్రీచైతన్య హాస్టళ్లు నరకానికి నకళ్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు చెందిన హాస్టళ్లలో విద్యార్థులకు నరకం కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కంటి నిండా నిద్ర.. కడుపు నిండా తిండి లేదు. కాలేజీలు, హాస్టళ్లలో సమయ పాలన లేదు.. ఆటలు లేవు.. కనీసం సెలవు దినాల్లోనూ విరామం ఇవ్వడం లేదని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక బృందాలు జరిపిన తనిఖీల్లో బయటపడింది. వారం రోజులపాటు నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 146 హాస్టళ్లలో బోర్డు అధికారుల బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయగా.. ఈ లోపాలు బయటపడినట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. అనుబంధ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఆయా కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 15 రోజుల సమయం ఇచ్చామని, సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. బోర్డు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేట్ కాలేజీల వ్యవహారం, విద్యార్థుల పరిస్థితి, తాము చేపడుతున్న చర్యలను వివరించారు. వివరాలు అశోక్ మాటల్లోనే.. బోర్డు చట్టంలోనూ మార్పులు! కాలేజీలు, హాస్టళ్లపై నియంత్రణకు బోర్డు చట్టంలోనూ మార్పులు తీసుకువస్తాం. హాస్టళ్లను బోర్డు పరిధిలోకి తెస్తాం. పీఆర్వోల వ్యవస్థను పెట్టుకొని తల్లిదండ్రులను ఆకర్షించి విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఇందుకు ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తున్నాయి. మంచి ర్యాంకులు వచ్చాయంటూ ప్రకటనలతో కాలేజీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దీన్ని నిషేధించేందుకు చర్యలు చేపడతాం. సమగ్ర పరిశీలన జరిపి సిఫారసులు చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో బోర్డు కార్యదర్శితోపాటు అధికారులు, తల్లిదండ్రులు, న్యాయ నిపుణులు, యాజమాన్యాల ప్రతినిధులు ఉంటారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం కమిటీ సభ్యుల పేర్లను త్వరలో ఖరారు చేస్తాం. రెసిడెన్షియల్ కాలేజీగానే ‘గుర్తింపు’ ఇకపై కాలేజీ పేరుతో అనుబంధ గుర్తింపు ఇవ్వం. హాస్టళ్లు ఉన్న వాటికి రెసిడెన్షియల్ కాలేజీ పేరుతోనే గుర్తింపు ఇస్తాం. నిబంధనల ప్రకారం ఉంటేనే హాస్టళ్లు నడిపేందుకు అనుమతి. హాస్టళ్ల నియంత్రణకు ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటితోపాటు కొత్త నిబంధనలను అందుబాటులోకి తెస్తాం. అలాగే ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో యాజమాన్యాలు చేస్తున్న అడ్డగోలు ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతాం. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేస్తాం. కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. తర్వాత జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు విధానం రూపొందిస్తాం. ఆన్లైన్ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఫిర్యాదులకు త్వరలోనే కాల్సెంటర్ ప్రైవేటు కాలేజీల ఆగడాలు, ఫీజులు, ఇతర సమస్యలకు సంబంధించి వారం రోజుల్లో బోర్డు కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. కార్పొరేట్ కాలేజీల ఆగడాలను నియంత్రించేందుకు, వాటి అవకతవకలపై అనేక చర్యలు చేపట్టాం. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 29 కాలేజీలకు నోటీసులు ఇవ్వడమే కాకుండా రూ.1.66 కోట్లు వసూలు చేశాం. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం చర్యలు చేపట్టాకే అనుబంధ గుర్తింపునకు అవకాశం కల్పించాం. ఫిబ్రవరిలో అనుబంధ గుర్తింపు ప్రక్రియ 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించిన అనుబంధ గుర్తింపు ప్రక్రియను వచ్చే ఫిబ్రవరిలోనే చేపడతాం. మార్చిలో పూర్తి చేసి, మార్చి 31వ తేదీలోగా గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, గుర్తింపు లభించని కాలేజీల జాబితా ప్రకటిస్తాం. గుర్తింపు లేని వాటిలో చేరవద్దు. ఇప్పుడు ఎవరు ప్రవేశాలు చేపట్టినా చెల్లవు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. 146 హాస్టళ్లు ఆ రెండింటివే! ఇంటర్ బోర్డు బృందాలు తనిఖీలు చేసిన 146 కాలేజీల హాస్టళ్లు నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలవే. రంగారెడ్డిలో 35, మేడ్చల్లో 51, హైదరాబాద్లో 60 కాలేజీల హాస్టళ్లలో తనిఖీలు జరిపారు. వాటిలో అకడమిక్ కేలెండర్ అమలు చేయడం లేదు. ఉదయం 10.00 నుంచి సాయంత్రం 4 వరకే బోధన చేపట్టాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ఉదయం 6.00 నుంచి రాత్రి 8.00 వరకు చదువే చదువు. భోజనంలో నాణ్యత లేదు. పోనీ క్యాంటిన్లో తిందామంటే విద్యార్థుల నుంచి 3 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. వాష్రూమ్లు, టాయిలెట్లు సరిగ్గా, సరిపడా లేవు. నలుగురి నుంచి ఆరుగురు ఉండాల్సిన గదుల్లో 8 నుంచి 12 మందిని ఉంచుతున్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సెలర్లను నియమించలేదు. ఆదివారాల్లోనూ విద్యార్థులను తల్లిదండ్రులతో కలవనీయడం లేదు. దీనిపై విద్యార్థులతో మాట్లాడాం. ఆధారాలు సేకరించాం. నోటీసులకు యాజమన్యాల సమాధానాలు వచ్చాక అవి సంతృప్తికరంగా లేకుంటే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడేది లేదు. విద్యార్థుల ఆత్మహత్యలు జరిగిన అన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చాం. ఎక్కువ సంఖ్యలో కాలేజీలు ఉండి, హాస్టల్ సదుపాయాలు ఉన్న యాజమన్యాలు మరో 18 వరకు ఉన్నాయి. వాటిలోనూ త్వరలో తనిఖీలు చేస్తాం. 7న డిప్యూటీ సీఎం భేటీ కాలేజీల్లో లోపాలను సవరిం చుకోవాలని, నిబంధనలను పాటించాలని చెప్పేందుకు, ఇతర సమస్యలపై చర్చించేందుకు యాజమాన్యాలతో ఈనెల 7న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశం కానున్నారు. సచివాలయంలో సాయం త్రం 4 గంటలకు జరిగే సమావేశానికి 20 యాజమాన్యాలు, అనుబంధ హాస్టళ్లు ఉన్న కాలేజీలకు చెం దిన కరస్పాండెంట్లు, యజమానులు హాజరుకానున్నారు. -
నారాయణ విద్యార్థిని కిడ్నాప్ చేసిన శ్రీచైతన్య
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చదువులో మేటిగా ఉన్న ఓ విద్యార్థికోసం రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు కొట్లాటకు దిగాయి. నెల్లూరులోని నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న ఓ విద్యార్థిని శ్రీచైతన్య సిబ్బంది తమ వెంట హైదరాబాద్కు తీçసుకెళ్లారు. దీంతో నారాయణ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి శ్రీచైతన్య సిబ్బందిపై నెల్లూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టించారు. వాస్తవానికి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో కార్పొరేట్ విద్యాసంస్థల మధ్య ఈ తరహా వ్యవహారాలు జరుగుతుంటాయి. కానీ విద్యా సంవత్సరం మధ్యలో ఈ ఘటన జరగడం విశేషం. నెల్లూరు చాకలి వీధికి చెందిన రియాజ్ అహ్మద్, ఆరీఫా దంపతుల కుమారుడు ఎండీ ఫాజిల్ నగరంలోని ధనలక్ష్మీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థలో పదో తరగతి చదువుతున్నాడు. చదువులో మేటి అయిన ఫాజిల్ నారాయణ హాస్టల్లో ఉంటున్నాడు. దీపావళి సెలవుల నేపథ్యంలో ఈనెల 18న ఇంటికొచ్చాడు. ఫాజిల్ మంచి ర్యాంక్ సాధించే విద్యార్థి కావడంతో 19న శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన లింగాల రమేష్, టి.పార్థసారథిలు అతనింటికి వెళ్లి.. ఫాజిల్కు తమ విద్యాసంస్థలో చేర్పిస్తే ఇంటర్ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తామంటూ వలవేశారు. ఫాజిల్ తల్లిదండ్రులకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా 20వ తేదీ రాత్రి ఫాజిల్ను తమ వెంట హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడి అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉంచి చదివిస్తున్నారు. అయితే ఫాజిల్ స్కూల్కు రాకపోవడంతో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నారాయణ సిబ్బంది ఫాజిల్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టాలని కోరారు. విద్యాసంస్థల మధ్య కొట్లాటలో తలదూర్చడమెందుకని భావించిన ఫాజిల్ తండ్రి రియాజ్ అహ్మద్ రెండు రోజులపాటు మౌనం వహించారు. ఒత్తిడి పెరగడంతో రెండు రోజులక్రితం హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ క్యాంపస్కు వెళ్లి తన కుమారుడితో ఒకసారి మాట్లాడాలని అక్కడ సిబ్బంది నాగేంద్ర, పి.రెడ్డిని కోరారు. అయితే కుమారుడితో కలవనివ్వకుండానే ఆయన్ను వారు పంపివేశారు. దీంతో ఫాజిల్ తల్లి ఆరీఫా బుధవారం రాత్రి నెల్లూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీచైతన్య సిబ్బందిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నారాయణ యాజమాన్యం నుంచి ఒత్తిడి ఉండడంతో పోలీసులు వివరాలు వెల్లడించడం లేదు. ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు హైదరాబాద్కు పయనమైనట్టు సమాచారం. -
భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
సాక్షి, విజయవాడ: ఆదివారం కూడా కార్పొరేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తుండటాన్ని నిరసిస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. భారతీనగర్లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఉదయం నుంచి తరగతులు నిర్వహిస్తుండటంతో సమాచారం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకొని.. ధర్నాకు దిగాయి. ఆదివారం క్లాసులు నిర్వహించొద్దని ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రోజులకే రెసిడెన్షియల్ క్యాంపస్లలో తరగతులు ఎలా నిర్వహిస్తారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. కొనసాగుతున్న నిరసనలు.. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మరణాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కడపలో విద్యార్థి సంఘాలు నిరవధిక నిరాహార దీక్షకు దిగాయి. విద్యార్థులను యంత్రాల్లా చదివిస్తూ కేవలం ర్యాంకుల కోసం పరితపిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలను వెంటనే మూసివేయాలని కోరుతూ.. నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. నారాయణ, శ్రీచైతన్య కళాశాలలో చేరిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీ.ఆర్.కళాశాల సెంటర్లో మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంత్రి పదవి నుంచి నారాయణను తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యాలు తమ ధోరణిని మార్చుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటూరులో.. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్బోర్డు నిబంధనలకు అనుగుణంగానే తరగతుల నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఆర్ఐవో కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. బోర్డు మార్గదర్శకాలను కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఏ ఒక్క విద్యాసంస్థపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు పట్టించుకోవడం లేదని, ఇలాగైతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
చదువు పేరుతో చంపేస్తున్నారు..!
‘మాకు బాగా చదవాలని ఉంటుంది. ప్రశాంతంగా చదువుకునే వాతావరణం ఎక్కడుంది? క్యాంపస్లో నిర్బంధించి చదివిస్తున్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు చూపంతా పుస్తకం పైనే. ఆకలి తీర్చుకునేందుకు అర గంట కూడా సమయం ఇవ్వరు. ఇదేంటని గొంతు పెగిలిందా టార్గెట్ చేసి నిత్యం వేధింపులే. తోటి విద్యార్థుల ముందు మానసిక వేధింపులు. ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు’.. ఇదీ విజయవాడ రూరల్ ప్రాంతంలోని నిడమానూరులో ఉన్న శ్రీచైతన్య కళాశాల విద్యార్థి రాకేష్ (పేరు మార్చాం) ఆవేదన.. ఇది ఈ ఒక్క విద్యార్థి బాధే అనుకుంటే పొరపాటే. ఇంటర్ కార్పొరేట్ కళాశాలల్లో కొనసాగుతున్న మరణ మృదంగం వెనుక ఉన్న మానసిక వేదన ఇది. సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని పరిధిలోని శ్రీచైతన్య విద్యా సంస్థలో గురువారం అర్ధరాత్రి జరిగిన విద్యార్థి ఆత్మహత్యపై ఆ కళాశాల విద్యార్థులను కదలిస్తే కన్నీటి బాధలు వెలుగు చూశాయి. తోటి విద్యార్థి మరణం వెనుక ఉన్న వాస్తవాలు చెప్పేందుకు శనివారం ఏకంగా వారు ‘సాక్షి’ కార్యాలయానికి క్యూ కట్టారు. కళాశాల క్యాంపస్లో వారు పడుతున్న మానసిక వేదనను కళ్లకు కట్టినట్లు వివరించారు. విజయవాడ రూరల్ ప్రాంతం నిడమానూరు శ్రీచైతన్య కళాశాల (శాంత భవన్)లో వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి భార్గవ్రెడ్డి ఆత్మహత్య వెనుక తీవ్రమైన మానసిక వేదన కారణమని విద్యార్థులు చెప్పారు. మూడు రోజుల క్రితం భార్గవరెడ్డి మెస్ నుంచి ఆలస్యంగా క్లాస్ రూంకు వచ్చాడు. అదే పెద్ద తప్పుగా భావించిన కళాశాల కోఆర్డినేటర్ గిరిధర్, వైస్ ప్రిన్సిపాల్ నాగభూషణం ఆ విద్యార్థిని మానసికంగా వేధించారు. తెలివైన విద్యార్థి కావడంతో త్రీ స్టార్ సెక్షన్లో భార్గవ్ ఉండేవాడు. అయితే అక్కడ నుంచి ఐసీ వన్ సెక్షన్కు మార్చడంతో ఆ విద్యార్థి మానసికంగా కుంగిపోయాడు. చిన్న తప్పుకే ఇంత పెద్ద శిక్ష విధించారంటూ తాను ఇక ఉండలేనని, చనిపోతానని స్నేహితుల వద్ద వాపోవడంతో వారు సముదాయించారు. గదిలో నిద్రించాల్సిన విద్యార్థి క్లాస్ రూంకు వెళ్లి కుమిలి కుమిలి ఏడ్చి చివరకు గదిలో ఉరి తాడుకు వేలాడాడు. లేఖను మార్చేశారు.. భార్గవ్రెడ్డి ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ ఓ లేఖ రాసినట్లు విద్యార్థులు తెలిపారు. గిరిధర్, నాగభూషణం వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు. విద్యార్థి లేఖను గమనించిన యాజమాన్యం వెంటనే దానిని దాచేసింది. భార్గవ్ చనిపోయిన విషయం శుక్రవారం ఉదయం 6 గంటలకే చదువుకునేందుకు క్లాస్రూంకు వెళ్లిన ఓ విద్యార్థి గమనించి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. విషయం ముందుగా పోలీసులకు తెలపాల్సి ఉన్నా యాజమాన్యం మాత్రం మృతదేహాన్ని దింపి ఆటోలో ఆస్పత్రికి తరలించి తీరిగ్గా పోలీసులకు సమాచారం అందించినట్లు విద్యార్థులు వివరించారు. వేధింపులు ఇలా.. శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడితో పాటు వేధింపులూ ఉన్నాయి. కళాశాలలోని శాంత భవన్లో సుమారు 2500 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాగా చదివే విద్యార్థులకు ఒక విధమైన గౌరవం, మిగిలిన వారికి మరో విధమైన గౌరవం ఉంటుంది. కశాశాలలో నాలుగు ఫ్లోర్లు ఉంటే మొదటి, రెండవ ఫ్లోర్లలో మాత్రం చదివే విద్యార్థులను (సూపర్ 60, సీఐపీఎల్ సెక్షన్స్) మాత్రమే ఉంచుతారు. ఆపై రెండు ఫ్లోర్లలో ఐకాన్ సెక్షన్ పేరుతో మధ్యస్థంగా చదివే విద్యార్థులను ఉంచుతారు. అందరి వద్ద ఒకే రకమైన ఫీజులు తీసుకొనే యాజమాన్యం.. విద్యార్థులను విడదీసి విద్యాభోదన చేస్తోంది. అక్కడ పనిచేసే అధ్యాపకుల నుంచి కో ఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపాల్ వరకు అందరూ విద్యార్థులపై కర్ర పెత్తనం చేసేవారు. ఉదయం 5 గంటల నుంచి మొదలయ్యే వారి దినచర్య రాత్రి 11 వరకు చదువుతోనే కొనసాగుతుంది. భోజనం విషయంలో కూడా విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. రోజూ పప్పు, పచ్చడి, మజ్జిగ, చారు నీళ్లతోనే సరిపెట్టుకోవాలి. వారానికి రెండు రోజులు గుడ్డు, ఒక రోజు వంద గ్రాముల చికెన్ ఇదీ మెనూ. అన్ లిమిటెడ్ భోజనం అని చెప్పే యాజమాన్యం కడుపు నిండా పెట్టే పరిస్థితి లేదు. కళాశాలలో విద్యార్థుల గొంతు పెగిలితే వారిని టార్గెట్ చేస్తారు. వారిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసి నరకం చూపుతారు. ఇటీవల కోఆర్డినేటర్ గిరిధర్.. తను చెప్పిన మాట వినలేదని చేతికి అందిన రాయితో ముగ్గురు విద్యార్థులును మోదాడు. ఒక విద్యార్థికి ముక్కు అదిరి రక్తం వచ్చింది. తల్లిదండ్రులకు చెబితే మరింతగా టార్గెట్ చేస్తానని భయపెట్టి చివరకు మెట్లపై పడి దెబ్బ తగిలినట్టు చెప్పించినట్లు విద్యార్థులు తెలిపారు. -
అవి హత్యలా.. ఆత్మహత్యలా?
ఒంగోలు: శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్థానిక శ్రీచైతన్య కాలేజీ వద్ద కార్పొరేట్ యాజమాన్యాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా భాగ్ కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ కడప జిల్లాలో నారాయణ కాలేజీలో పావని ఆత్మహత్య జరిగి వారంరోజులు కూడా గడవకముందే హైదరాబాదు, ఏపీల్లో మొత్తం అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో నిజంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయా లేక హత్య జరిగిన తరువాత వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో జరిగిన ఆత్మహత్యలపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్పోరేట్ వ్యవస్థల గుర్తింపు రద్దుచేసి డాక్టర్ ప్రొఫెసర్ నీరదారెడ్డి నివేదికను అమలు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని, ఎక్కడైనా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే దానికి ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా సంఘటనా కార్యదర్శి హనుమంతు, వినయ్, బాలు, సాయి, సంతోష్, గోపాల్, నవీన్, ప్రభుకుమార్, రాజశేఖర్, సురేంద్ర, షరీఫ్ పాల్గొన్నారు. -
మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్లో దారుణం
-
శ్రీ చైతన్య కాలేజిలో అమానుషం
సాక్షి, విజయవాడ : నగరంలోని శ్రీ చైతన్య కాలేజిలో మంగళవారం అమానుషం జరిగింది. కాలేజీలో తోటి విద్యార్థులతో జరిగిన గొడవ కారణంగా చింతా కళ్యాణ్ అనే విద్యార్ధిని ఉపాధ్యాయులు తీవ్రంగా దండించారు. కళ్యాణ్.. శ్రీ చైతన్య కళాశాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మనస్థాపానికి గురైన చింతా కళ్యాణ్ ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కళ్యాణ్ను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రాత్రి గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని అంటున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు యత్నించినా యాజమాన్యం మాత్రం స్పందించడం లేదంటూ కళ్యాణ్ తోటి విద్యార్థులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. లెక్చరర్ తీవ్రంగా కొట్టడం వల్లే మనస్తాపానికి గురైన కళ్యాణ్ కాలేజీ బయటకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. -
శ్రీచైతన్య కళాశాల విద్యార్థుల వీరంగం
హోంగార్డుకు గాయాలు.. 20 మందిపై కేసు నమోదు హైదరాబాద్: బాచుపల్లిలోని శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు శనివారం రాత్రి కళాశాలలో వీరంగం సృష్టించారు. రోడ్డుపైకి వచ్చి వాహనాలపై రాళ్లు రువ్వుతూ మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఆదివారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చివరి పరీక్ష ఉండడంతో శనివారం రాత్రి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ చేసుకుని.. అనంతరం కళాశాలలో ఫర్నీచర్, ఫ్యాన్లు, బల్బులు ధ్వంసం చేయడం ప్రారంభించారు. దీంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపాల్ మురళీమోహన్, సెక్యూరిటీ గార్డులపై దాడులు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే మరింత రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులపైనే రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో బాచుపల్లి సీఐ బాలకృష్ణారెడ్డి అదనపు బలగాలను రప్పించి లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడిలో గాయపడిన హోంగార్డు రియాజ్ గాయపడ్డాడు. దాడులకు పాల్పడిన 20 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
చైతన్య కాలేజీ వద్ద భారీగా పోలీసులు
-
చైతన్య కాలేజీ వద్ద భారీగా పోలీసులు
హైదరాబాద్: బాచుపల్లిలో అర్ధరాత్రి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ప్రిన్సిపాల్ తో పాటు సెక్యురిటీ గార్డును చితకబాదారు. అక్కడితో ఆగకుండా రోడ్డుపై వెళుతున్న బస్సుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అడ్డుకున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చైతన్య కాలేజీ వద్ద భారీగా పోలీసులను మొహరించారు. పరిస్థితిని ఏసీపీ సమీక్షిస్తున్నారు. విద్యార్థుల దాడిపై కాలేజీ యాజమాన్యం వింత వివరణయిచ్చింది. పరీక్షలు అయిపోయిన ఆనందంలో విద్యార్థులు ఇలా ప్రవర్తించారని, ఎవరినీ గాయపరచలేదని తెలిపింది. ఎటువంటి దాడి జరగలేదన్నట్టుగా కాలేజీ యాజమాన్యం వివరణ ఇవ్వడం గమనార్హం. -
అక్కలాగే తమ్ముడూనూ...
11 ఏళ్లకే ఇంటర్ ఫైనల్ రాసిన ఆగస్త్య జైస్వాల్ హైదరాబాద్: అతిచిన్న వయసులోనే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి చరిత్ర సృష్టించాడు కాచిగూడ ప్రాంతానికి చెందిన ఆగస్త్య జైస్వాల్. గురువారం నుంచి ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 11 ఏళ్ల ఆగస్త్య హాజరై పరీక్షలు రాశాడు. 2015లో పదవ తరగతి పరీక్షలు రాసి అతిచిన్న వయసులో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర చరిత్రలోనే తొలి విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని శ్రీ చైతన్య కాలేజీ సెంటర్లో ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్నాడు ఆగస్త్య జైస్వాల్. హైదరాబాద్ యూసుఫ్గూడలోని సెయింట్మేరీ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ సీఇసీ గ్రూపు చదువుతున్నాడు. ఆగస్త్య అక్క నైనా జైస్వాల్ 15 ఏళ్లకే పీజీ పరీక్షలు రాసి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులను నైనా సొంతం చేసుకుంది. తండ్రి అశ్విన్కుమార్, తల్లి భాగ్యలక్ష్మి ప్రోత్సాహం ఎంతో ఉండడంతో ఆ ఇంట్లో అక్కాతమ్ములు అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఇతర విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. -
శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్ పరిస్థితి దారుణం
-
మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు: హైదరాబాద్లో నారాయణ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరవకముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులో శనివారం వెలుగుచూసింది. స్థానిక శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తుగ్గలి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన లోకనాథ్ చౌదరి(18) తాండ్రపాడులోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు లోకనాథ్ ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని ఆందోళన చేపడుతున్నారు. -
శ్రీ చైతన్య కాలేజిలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
విజృంభించిన ప్రతీక్, గౌరవ్
సాక్షి, హైదరాబాద్: శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ బ్యాట్స్మెన్ ప్రతీక్ (132 బంతుల్లో 192; 24 ఫోర్లు, 1 సిక్సర్), గౌరవ్ రెడ్డి (109 బంతుల్లో 178 నాటౌట్; 29 ఫోర్లు) విజృంభించారు. బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నీరజ్ పబ్లిక్ స్కూల్తో జరిగిన మ్యాచ్లో 290 పరుగుల తేడాతో ఆజట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీచైతన్య కాలేజ్ జట్టు 45 ఓవర్లలో 3 వికెట్లకు 438 పరుగులు చేసింది. ప్రతీక్ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకోగా... గౌరవ్ రెడ్డి అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం 439 పరుగుల భారీ లక్ష్యఛేదనలో నీరజ్ పబ్లిక్ స్కూల్ తడబడింది. 45 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. శశాంక్ లోకేశ్ (62నాటౌట్), మొహమ్మద్ ఇస్మారుుల్ (32) పోరాడారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు సెయింట్ మేరీస్ (యూసఫ్గూడ): 275 ( గోపీ 157, శ్రీకాంత్ 57; మొహమ్మద్ ఫహాద్ 4/47, దుర్గేశ్ యాదవ్ 5/51), సుప్రీమ్ హైస్కూల్: 149 (తరుణ్ 35; శ్రీకాంత్ 5/32, నిహాంత్ 4/78). గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్: 217 (రుత్విక్ 49 నాటౌట్, జ్ఞాన ప్రకాశ్ 79; ప్రణయ్ అగర్వాల్ 3/31, సహేంద్ర మల్లు 5/47), ఓక్రిడ్జ: 126 (సహేంద్ర 50, జ్ఞాన ప్రకాశ్ 4/38). -
శ్రీ చైతన్య కాలేజి ఎదుట ఉద్రిక్తత
-
'శ్రీచైతన్య'లో ఉద్యోగిని ఆత్మహత్య
విజయవాడ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఉద్యోగిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
రైల్వేకోడూరు రూరల్: కారును మినీలారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే.. బద్వేలుకు చెందిన లక్ష్మీనరసయ్య గుప్త కుమార్తె పావనితోపాటు బంధువుల పిల్లలు సాయి మనీష, సారిక తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్నారు. వారిని దీపావళి పండుగకు స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు బుధవారం ఉదయం బద్వేలుకు చెందిన ఏపీ13 ఏఈ 9501 అనే నెంబరు గల మహీంద్రా వెరిటో కారును బాడుగకు మాట్లాడుకున్నారు. డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లితో కలసి తిరుపతిలో ఉన్న విద్యార్థులను తీసుకుని బద్వేలుకు బయలు దేరారు. మార్గమధ్యలో కోడూరు మండలం శెట్టిగుంట పంచాయితీ జ్యోతి కాలనీ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి డీటీడీసీ కొరియర్ లోడ్తో తిరుపతికి వెళుతున్న ఏపీ 16 టీబీ 0980 నెంబరు గల మినీలారీ ముందుగా వెళుతున్న లారీలను ఓవర్టేక్ చేయబోరుు ఎదురుగా వస్తున్న కారుపైకి ఎక్కింది. ఆ కారులో ముందు సీట్లో కూర్చున్న లక్ష్మీనారాయణ గుప్త(45) అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ మస్తాన్వల్లి తలకు తీవ్రగాయాలయ్యాయి. కారులో వెనుక సీట్లో కూర్చున్న పావని, సాయి మనీష, సారికలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు కారులో ఇరుక్కుపోయిన విద్యార్థులను, డ్రైవర్ను బయటికి తీశారు. ఐచర్ వాహనం ముందు చక్రాలు విరిగి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఐచర్ డ్రైవర్ రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తిరుపతి 108 సిబ్బంది వచ్చి ప్రధమ చికిత్స చేసి అనంతరం 108లో తిరుపతి రుయాకు తరలించారు.