Tablet
-
ప్రాణం తీసిన గర్భస్రావ మాత్ర
ఖలీల్వాడి (నిజామాబాద్ జిల్లా): గర్భస్రావం మాత్రలు రిఫర్ చేసి ఓ యువతి మరణానికి కారణమైన పీఎంపీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏసీపీ బుధవారం వెల్లడించారు. మాక్లూర్ మండలానికి చెందిన యువతి, మెండోరా మండలం సావెల్కు చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా యువతి గర్భం (2 నుంచి 3 నెలలు) దాల్చడంతో యువకుడు తన గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్న ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన పీఎంపీ హరికృష్ణచారిని ఈనెల 4న సంప్రదించాడు. పీఎంపీ సూచించిన మాత్రలను యువకుడు అదే రోజు యువతికి ఇవ్వగా మూడు రోజుల తరువాత ఆమెకు కడుపు నొప్పితోపాటు బ్లీడింగ్ అయ్యింది. దీంతో యువతిని ఆమె తల్లి నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. యువతికి గర్భస్రావమైందని, కిడ్నీ, లివర్కు ఇన్ఫెక్షన్ వచ్చిందని హైదరాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 10న హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో యువతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఎంపీని అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. -
భారత్లో ట్యాబ్లెట్ పీసీల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు భారత్లో జోరుగా సాగుతున్నాయి. 2024 ఏప్రిల్–జూన్లో దేశవ్యాప్తంగా 18.4 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. గతేడాది 2023 ఏప్రిల్–జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమ్మకాలు రెండింతలకుపైగా పెరిగి 129 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం.. క్యూ2లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ట్యాబ్లెట్ పీసీలను కొనుగోలు చేయడం, అలాగే గతేడాది ఏప్రిల్–జూన్లో అమ్మకాలు తక్కువగా ఉండడం 2024 జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటుకు కారణం అయింది. 2023 ఏప్రిల్–జూన్లో 8 లక్షల ట్యాబ్లెట్ పీసీలు అమ్ముడయ్యాయి. ముందంజలో సామ్సంగ్..ట్యాబ్లెట్ పీసీల విపణిలో జూన్ క్వార్టర్లో 48.7 శాతం వాటాతో సామ్సంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ సెగ్మెంట్లో 54.1, కంజ్యూమర్ విభాగంలో 38 శాతం వాటాను సామ్సంగ్ సాధించింది. ఈ కంపెనీ విక్రయాలు ఏకంగా మూడింతలై 9,01,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఏసర్ 23.6 శాతం, యాపిల్ 9.5, లెనోవో 6.9, షావొమీ 4.7 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఏసర్ అమ్మకాలు 27,000 నుంచి 4,37,000 యూనిట్లకు ఎగశాయి. యాపిల్ 12.3 శాతం వృద్ధితో 1,76,000 యూనిట్ల సేల్స్ సాధించింది. లెనోవో విక్రయాలు 2.8 శాతం క్షీణించగా, షావొమీ 85.8 శాతం దూసుకెళ్లింది. స్లేట్ ట్యాబ్లెట్ విభాగం గతేడాదితో పోలిస్తే 178.1 శాతం పెరిగింది. డిటాచేబుల్ ట్యాబ్లెట్స్ సెగ్మెంట్ 23.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: దేశీ స్టార్టప్ పిక్సెల్కు నాసా కాంట్రాక్టు ఈ ఏడాది 20 శాతం వృద్ధి..భారత ట్యాబ్లెట్స్ మార్కెట్ 2023తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం 20 శాతం వృద్ధితో 50,76,000 యూనిట్లు నమోదు చేస్తుందని గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ కంపెనీ కెనాలిస్ అంచనా వేస్తోంది. 2025లో వృద్ధి 8 శాతానికి పరిమితం అవుతుందని జోస్యం చెబుతోంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ట్యాబ్లెట్స్ విక్రయాలు 54,79,000 యూనిట్లను తాకుతుందని ధీమాగా ఉంది. 2024 జనవరి–మార్చిలో 13,47,000 యూనిట్ల ట్యాబ్లెట్స్ అమ్ముడయ్యాయని కెనాలిస్ వెల్లడించింది. 2023 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదైంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ ఈ ఏడాది భారత్లో 11 శాతం, 2025లో 15 శాతం దూసుకెళుతుందని కెనాలిస్ అంచనా వేస్తోంది. డెస్క్టాప్స్, నోట్బుక్స్, ట్యాబ్లెట్ పీసీలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–మార్చిలో 43 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. -
స్లిమ్గా కనిపించాలని ఆ మాత్రలు వేసుకుంది!..అంతే ఆమె..
స్లిమ్గా, నాజుగ్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందులో తప్పులేదు. కానీ అందుకోసం అనుసరించే పద్ధతులు ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే పర్లేదు. షార్ట్కట్లో త్వరితగితన తగ్గాలని రకరకాల ట్రీట్మెంట్లు, మందులు జోలికి వెళ్తే మాత్రం లేనిపోని సమస్యలు తలెత్తడమే గాక ఒక్కోసారి అదే మీ ప్రాణాలు కోల్పోయే స్థితికి తీసుకోస్తాయి కూడా. అందుకు ఈ ఉదంతమే ఉదహరణ. కూతురు పెళ్లిలో చక్కగా స్లిమ్గా కనిపించాలనుకోవడమే శాపమై ప్రాణాలను కోల్పోయేలా చేసింది. ఈ విషాధ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియాకు చెందిన 56 ఏళ్ల ట్రిష్ వెబ్స్టర్ మహిళ తన కూతురు పెళ్లిలో స్లిమ్గా కనిపించాలనుకుంది. అందుకోసం వైద్యులను సంప్రదించి మరీ ఓజెంపిక్ మాత్రలను వాడటం ప్రారంభించింది. ఆ మ్రాతలను వాడిన ఐదు నెలల్లోనే ఏకంగా 15 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బరవు తగ్గుతుందనుకునే లోపు ఉన్నటుండి హఠాత్తుగా ఓ రోజు కుప్పకూలి చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెకు సీఆర్పీ చేసి.. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. దీన్ని ప్రధానంగా టైప్-2 మధుమేహానికి ఉపయోగిస్తారు. చర్మం కింద ఇంజెక్షన్గా ఉపయోగిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానకి సమర్థవంతంగా ఉంటుందని పేషెంట్లకు ఈ మాత్రను సూచిస్తుంటారు. అదే ఆమెకు శాపమై జీర్ణశయాంతర వ్యాధికి దారితీసి చనిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు ఉపయోగిస్తారా? ఈ ఓజెంపిక్ మాత్రను బరువు తగ్గించడానికి ప్రసిద్ధ ఔషధంగా ఉపయోగిస్తారు. సహజ హర్మోన్ జీఎల్పీ-1ను ప్రేరిపించి బరువు కోల్పోయేలా చేస్తుంది. ఇది కడుపు, ప్రేగుల్లోకి ఆహారం వెళ్లడాన్ని నెమ్మదిస్తుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నవాళ్లకు ఎక్కువసేపు పొట్ట ఫిల్ అయ్యి ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో ఆటోమేటిక్గా ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దీని వల్ల కొందరిలో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినట్లు పలు కేసుల్లో వెలడైంది కూడా. చాలామంది వైద్యులు దీన్ని సిఫార్సు చేసేందుకు మొగ్గు చూపడం లేదని సమాచారం. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గాలనే ఉద్దేశంతో అదే పనిగా ఈ మాత్రలను కొన్ని నెలలుగా వేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు దారితీసి మరణానికి కారణమైంది. ఆమె చనిపోయే టైంలో ఆమె నోటి నుంచి ఒక విధమైన గోధుమ రంగులో నురుగ వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మాత్ర అధికంగా వాడితే ఇలియస్ అనే పరిస్థితికి దారితీసి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు ఓజెంపిక్ దుష్ప్రభావాలు ఇతర మందులు మాదిరిగానే ఇది కూడా కొన్ని రకాల దుష్ప్రభావాలను చూపిస్తుంది. అవేంటంటే.. మలబద్ధకం అతిసారం వికారం పొత్తి కడుపు నొప్పి వాంతులు,వికారం ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాస్లో మంట థైరాయిడ్ క్యాన్సర్ డయాబెటిక్ రెటినోపతి, కళ్లకు హాని కలిగిస్తుంది హైపోగ్లైసీమిక్ లేదా తక్కువ రక్త చక్కెర పిత్తాశయ వ్యాధి పిత్తాశయ రాళ్లు, మీ పిత్తాశయం వాపు అలర్జీలు తదితర సమస్యలు ఉత్ఫన్నమైతే తక్షణమే ఆరోగ్య నిపుణుడిని సంప్రదించమని వైద్యులు సూచిస్తున్నారు (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
110 సంస్థలకు అనుమతులు..
-
అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు
పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ డిస్కషన్ మీట్ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి. (ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్) (చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్) విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా వదిలారు పవన్ కళ్యాణ్. Points to note : 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి… — Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023 సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ.. పవన్ ట్వీట్కు సొంత అభిమాని రమేష్ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్ బోయపాటి. పవన్ కళ్యాణ్ గారు బైజూస్ తో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీరు లేవనెత్తిన సందేహాలు విలువైనవి. ఇక్కడ మీ ట్వీట్ ఉద్దేశం బైజూస్ తో ఒప్పందం గురించి కన్నా, ఆ ఒప్పందంలో ఉన్న అనేక సందేహాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం అనిపించింది. నేను కూడా ఈ విషయం గురించి అవగాహన ఏర్పరుచుకునే… pic.twitter.com/thDcCgldYM — Ramesh Boyapati (@rameshboyapati) July 24, 2023 -
షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
చైనా స్మార్ట్మేకర్ షావోమీ కొత్త ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. హైఎండ్ ఫీచర్స్తో షావోమీ ప్యాడ్ 6 మోడల్ను తీసుకొచ్చింది. షావోమీ ప్యాడ్ 5 అప్గ్రేడ్ వేరియంట్గా ఆల్ మెటల్ డిజైన్తో దీన్ని ఆవిష్కరించింది. ధర, ఆఫర్ షావోమీ ప్యాడ్ 6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ ధర రూ.26,999గా నిర్ణయించింది.అలాగే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. జూన్ 21న సేల్ ప్రారంభం. షావోమీ ఆన్లైన్ స్టోర్లతోపాటు,అమెజాన్లో లభిస్తుంది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్వర్త్ ఎంతంటే?) ఇక ఆఫర్ విషయానికి వస్తే..ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.ఫలితంగా షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్ 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.23,999కు, 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.26,999 ధరకు కొనుగోలుచేయవచ్చు. షావోమీ ప్యాడ్ 6 స్పెసిఫికేషన్స్ 11 అంగుళాల 2.8K ఎల్సీడీ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ HDR10+, డాల్బీ విజన్ ఫీచర్స్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కె కెమెరా 8,840mAh బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్ ఎం9: ధర రూ.15 వేల లోపే
సాక్షి,ముంబై: లెనోవో కొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ ఎం9 పేరుతో భారీ మార్కెట్లో కొత్త టాబ్లెట్ను లాంచ్ చేసింది. దీని ధరను రూ. 12,999తోగా నిర్ణయించింది. మార్కెట్లో ఉన్న అత్యంత తేలికైన టి టాబ్లెట్లలో ఎమ్9 ఒకటని కంపెనీ ప్రకటించింది. LTE, Wi-Fi ఓన్లీ ఇలా రెండు వేరియంట్లలో, అలాగే ఫ్రాస్ట్ బ్లూ , స్టార్మ్ గ్రే రంగులలో లెనోవో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ లభించనుంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) 9 అంగుళాల IPS LCD డిస్ప్లే , 1,340 x 800 పిక్సెల్ల స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12, డాల్బీ అట్మాస్ సపోర్ట్ , MediaTek Helio G80 ఆక్టా-కోర్ ప్రాసెసర్,గరిష్టంగా 64జీబీ స్టోరేజ్,8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100mAh బ్యాటరీ(10W ఛార్జింగ్ సపోర్ట్) గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ ,ఫేస్-అన్లాక్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డ్యూయల్-టోన్ మెటల్ ఛాసిస్ 344 గ్రాముల బరువుతో తీసుకొచ్చిన పట్టుకోవడానికి ఎం9 సౌకర్యంగా ఉంటుంది. జూన్ 1 నుండి రూ. 12,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు సంస్థ అధికారిక వెబ్సైట్తోపాటు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తోపాటు, రిలయన్స్ డిజిటల్, క్రోమా ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్కు గ్రీన్ సిగ్నల్) ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
కేంద్రం కొత్త రూల్స్..ట్యాబ్లెట్, సిరప్ కొనుగోలుదారులకు ముఖ్యగమనిక
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న డ్రగ్ రూల్స్ (ఫార్మాస్యూటికల్)ను సవరించింది. ఈ రూల్స్ వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 18న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..డ్రగ్ రూల్స్ (ఎనిమిదవ సవరణ)- 2022లో భాగంగా కాల్పోల్,అల్లేగ్రా,బెటాడిన్, గెలుసిల్, డోలో 650తో సహా టాప్ 300 డ్రగ్ ఫార్ములేషన్ ప్యాకేజింగ్ లేబుల్పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ను తప్పని సరి చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా నకిలీ మెడిసిన్ను గుర్తించవచ్చని తెలిపింది. ఆగస్ట్ 1, 2023 నుంచి కొత్త డ్రగ్ రూల్స్ ఆగస్ట్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. షెడ్యూల్ హెచ్2లో పేర్కొన్న డ్రగ్ ఫార్ములేషన్ ఉత్పత్తుల తయారీదారులు దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్ (ప్రైమరీ ప్యాకేజీ లేబుల్) పై బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్ను ప్రింట్ చేయాలి లేదా అతికించాలి. ప్రాథమిక ప్యాకేజీ లేబుల్లో తగినంత స్థలం లేకపోతే, నిల్వ చేసే సెకండరీ ప్యాకేజీ లేబుల్పై ప్రామాణీకరణను సులభతరం చేయడానికి సాఫ్ట్వేర్ అప్లికేషన్తో చదవగలిగే డేటా ఉంచాలని’ స్పష్టం చేసింది క్యూఆర్ కోడ్తో క్యూఆర్ కోడ్ సాయంతో మెడిసిన్ తయారీ చేసిన ప్రొడక్షన్ కోడ్, డగ్స్ సరైన..సాధారణ పేరు, బ్రాండ్ పేరు, తయారీదారు పేరు,చిరునామా, బ్యాచ్ నంబర్, మ్యానిఫ్యాక్చరింగ్ తేదీ, ఎక్స్పైయిరీ డేట్ (గడువు తేదీ). లైసెన్స్ నంబర్ డేటా వివరాలు తెలుసుకునే సౌకర్యం కలగనుంది. కాగా, నకిలీ మెడిసిన్ లేదా సిరప్ల అమ్మకాల్ని అరికట్టేందుకు రష్యా, బ్రిటన్,జర్మనీ,అమెరికా తోపాటు ఇతర దేశాల్లో ఈ క్యూఆర్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉండగా తాజాగా భారత ప్రభుత్వం ఈ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపింది. -
వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!
ఇటీవలకాలంలో యువత తమ సృజనాత్మకతను జోడించి చాలా వినూతనంగా వివాహాలు చేసుకుంటున్నారు. అందర్నీ ఆకట్టుకునేలా ఔరా! అనిపించేలా వివాహాలు జరుపుకుంటున్నారు. కొంతమంది హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటే మరికొంతమంది చాలా సింపుల్గా వివాహాలు చేసుకుని అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడోక జంట భావించింది కాబోలు. ఆ నవ దంపతుల వివాహా ఆహ్వాన పత్రికను చూసే ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు విషయమేమిటంటే...ఆ దంపతులు తమ వెడ్డింగ్ కార్డు వెరైటీగా ఉండాలనుకున్నారు కాబోలు. అందుకోసం వారి వివాహా ఆహ్వాన పత్రికనే ఒక ట్యాబ్లెట్ స్టిప్స్ ఆకారంలో రూపొందించారు. ట్యాబ్లెట్ వెనుకవైపు ఉండే విభాగంలో ఆయా ట్యాబ్లెట్కి సంబంధించిన వివరాలు మాదిరిగా.. హెచ్చరిక, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి తదితర అంశాలో వారి సమాచారం ఉంది. నిశితంగా చూస్తేనే అది ఆహ్వాన పత్రిక అని తెలుస్తుంది. పైగా చాలా ఫన్నీగా అనిపిస్తోంది కూడా. పెళ్లి పత్రికలో ఎలా అయితే వధువు, వరుడు వివరాలు ఉంటాయో అలానే అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఇలాంటి ఆలోచన రావడం కూడా గ్రేట్. అంతేకాదండోయ్ వరుడు పేరు ఎళిలరసన్ ఫార్మసీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా, వధువు వసంతకుమారి నర్సింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రోఫెసర్. తరుచు సోష్ల్ మీడియాలో యాక్టివిగ్ ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ చైర్మన్ హర్ష గోయెంకాను ఎంతగానో ఇంప్రెస్ చేసింది ఈ వివాహ పత్రిక. ప్రజలు చాలా కొత్తదనం కోరుకోవడమే కాదు వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని కొనియాడారు. ఇది ఫార్మసిస్ట్ వివాహా ఆహ్వాన పత్రిక అంటూ...ఆ జంట ఆలోచనని ప్రశంసించారు. A pharmacist’s wedding invitation! People have become so innovative these days…. pic.twitter.com/VrrlMCZut9 — Harsh Goenka (@hvgoenka) August 20, 2022 (చదవండి: మెట్రో స్టేషన్పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!) -
Dolo-650ని సిఫార్సు చేసేందుకు డాక్టర్లకు రూ.వెయ్యి కోట్లు.. సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్తో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజలకు సంజీవని ఔషధం ఇదేనంటూ తమ మాత్రను సూచించాలంటూ డోలో–650 ఎం.జీ. ట్యాబ్లెట్ల తయారీసంస్థ దేశవ్యాప్తంగా వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చిందంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్ఆర్ఏఐ) అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. ఇటీవల డోలో–650 ఎం.జీ ఉత్పత్తిదారుల ప్రాంగణాల్లో సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) సోదాలు చేసి ఈ అంశాన్ని బహిర్గతంచేసిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ సంస్థ ఔషధాలు రోగులకు సూచించాలంటూ వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఫార్మాస్యూటికల్ సంస్థలను బాధ్యులను చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎఫ్ఎంఆర్ఏఐ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. ఈ మేరకు సంస్థ తరఫు లాయర్లు సంజయ్ పారిఖ్, అపర్ణా భట్లు గురువారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘ట్యాబ్లెట్ల 500 ఎం.జీ. పరిమాణం వరకు మార్కెట్ ధర నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అంతకుమించిన ఎం.జీ అయితే ఆ ట్యాబ్లెట్ల తయారీదారుల ఇష్టానుసారం ధర నిర్ణయించుకుంటారు. దీంతో అధిక లాభాలను మూటకట్టుకునేందుకు 650 ఎం.జీ డోస్ ఉన్న తమ సంస్థ ట్యాబ్లెట్లనే రోగులకు సూచించాలని డోలో–650 తయారీదారులు వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చారు’ అని లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ డోస్ కాంబినేషన్ నిర్హేతుకమైనదని వాదించారు. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ వ్యవస్థకు ఏకీకృత విధానం తెచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరింది. తద్వారా పర్యవేక్షణ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తూ పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంది. కోడ్ ఉన్నప్పటికీ దానికి స్వచ్ఛంద హోదా లేదా చట్టబద్ధంగా ఉండేలా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. చట్టాలు రూపొందించాలని పార్లమెంటును ఆదేశించలేమని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. కోడ్కు చట్టబద్ధత వచ్చే వరకు ఔషధ సంస్థల అనైతిక మార్కెటింగ్ పద్ధతులను నియంత్రించడానికి కోర్టు మార్గనిర్దేశనం చేయాలని పారిఖ్ కోరారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక మార్కెటింగ్ పద్ధతులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, అధిక/అహేతుక ఔషధాల ప్రిస్కిప్షన్, అధిక ధర ఉన్న ఔషధాలనే రోగులకు వైద్యులు సూచించే పద్ధతులు పెరిగాయన్నారు. ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించిన ప్రజల జీవించే హక్కును ఉల్లంఘించినట్లేనని ధర్మాసనానికి తెలిపారు. ఫార్మా స్యూటికల్ రంగంలోని అవినీతి.. రోగుల ఆరోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తుందో చూపే ఘటనలు కోకొల్లలు ఉన్నాయని ఉదహరించారు. చదవండి: అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన ఇది తీవ్రమైన సమస్యే ఎఫ్ఎంఆర్ఏఐ లేవనెత్తిన అంశంపై జస్టిస్ చంద్రచూడ్ ఏకీభవించారు. ‘తనకు కోవిడ్ సోకినప్పుడు ఇదే సందర్భం ఎదురైంది. దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పది రోజుల్లో స్పందన తెలపాలని కేంద్రం తరఫు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ను కోర్టు ఆదేశించింది. తదనంతరం వారం రోజుల్లో రిజాయిండర్ దాఖలు చేయాలన్న లాయర్ పారిఖ్కు సూచించింది. ధర్మాసనం తదుపరి విచారణ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. మైక్రోల్యాబ్స్పై దాడులు కోవిడ్ కాలంలో అత్యధికంగా అమ్ముడుపోయిన డోలో–650 ఎం.జీ ట్యాబ్లెట్ల తయారీదారు అయిన మైక్రో ల్యాబ్స్ సంబంధ కార్యాలయాల్లో ఇటీవల సీబీడీటీ అధికారులు సోదాలు చేశారు. ఐటీ రిటర్న్స్లో అవకతవకలు జరిగాయని గుర్తించారు. వైద్యులకు ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇచ్చినట్లు గుర్తించారు. -
రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ, ఇంకా బోలెడు ఫీచర్లు!
హైదరాబాద్: రియల్మీ సంస్థ ఒకేసారి పలు నూతన ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విడుదల చేసింది. ప్యాడ్ ఎక్స్ పేరుతో ట్యాబ్లెట్ను ప్రవేశపెట్టింది. 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ట్యాబ్లెట్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో, 11 అంగుళాల ఫుల్వ్యూ డిస్ప్లే, 8,340 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ డార్ట్ చార్జింగ్తో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో వైఫై వెర్షన్ ధర రూ.19,999. ఇదే సామర్థ్యాలతో వైఫై, 5జీ సిమ్ సపోర్టెడ్ ట్యాబ్లెట్ ధర రూ.25,999. ఇందులో 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఆగస్ట్ 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి. అలాగే, రియల్మీ వాచ్3, ఒక ఫ్లాట్ మానిటర్, రియల్మీ బడ్స్ ఎయిర్3 నియో, రియల్మీ బడ్స్ వైర్లెస్ 2ఎస్ ఉత్పత్తులను కూడా సంస్థ విడుదల చేసింది. చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్! -
ట్విటర్ ట్రెండ్: డోలో 650 మేనియా
Dolo 650 Twitter Trending: ‘సొంత వైద్యం’.. కరోనా టైంలో ఎక్కువ చర్చకు వచ్చిన అంశం. అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వైద్య నిపుణుల సలహాలను పాటించిన వాళ్లు కొందరైతే.. తమకు తోచింది చేసుకుంటూ పోయినవాళ్లు మరికొందరు!. వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమో, మరేయితర కారణాల వల్లనో ఇంటి వైద్యానికే ఎక్కువ ప్రాధాన్యం లభించింది ఫస్ట్ వేవ్ టైంలో. అదే సమయంలో అల్లోపతి మందులకు ఫుల్ డిమాండ్ నడిచిన విషయమూ చూశాం. మూడో వేవ్ ముప్పు తరుణంలో మళ్లీ ఇప్పుడా పరిస్థితి నెలకొంది. అసలే ఫ్లూ సీజన్. ఆపై కరోనా ఉధృతి. తాజాగా లక్షాయాభై వేలకు కొత్త కేసులు చేరువైన వైనం. కేసులు ఒక్కసారిగా పెరిపోతుండడంతో జనాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జ్వరం, ఇతర ట్యాబెట్లు, సిరప్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డోలో మాత్రపై ట్విటర్లో సరదా-సీరియస్ కోణంలో కొనసాగుతున్న ట్రెండ్ ఇందుకు నిదర్శనం. డోలో 650 మేనియా.. అవును ఇప్పుడిది ట్విటర్ను షేక్ చేస్తోంది. ప్రమోషనో లేదంటే ట్విటర్ యూజర్ల అత్యుత్సాహామో తెలియదుగానీ నిన్నటి నుంచి ట్విటర్లో పోస్టులు పడుతూనే ఉన్నాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.. ఎలాంటి లక్షణం కనిపించినా డోలో మాత్ర వేసుకుంటే సరిపోతుందని భ్రమలో మునిగిపోయారు చాలామంది. కొవిడ్ టెస్టులకువెళ్లకుండానే ఈ మాత్రతో తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఏదో చాక్లెట్ చప్పరించినట్లు డోలో మాత్రల్ని వేసుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. విచ్చిల విడిగా వాడడం మంచిదికాదని.. వాడితే తగ్గిపోతుందని ఎవరికి తోచిన ట్వీట్లు వాళ్లు చేసుకున్నారు. ఈ దెబ్బతో ట్విటర్ టాప్ ట్రెండింగ్లో #Dolo650 నడుస్తోంది. అందులో కొన్ని పోస్టులు.. Every Indian during Covid 3rd wave👇😂 Taking Dolo 650#Dolo650 pic.twitter.com/ygNploDihV — சிட்டுகுருவி (@save_sparrow2) January 7, 2022 Dolo 650 has become a joke in this country. I see random people behaving like medical experts & popping pills of Dolo 650 like vitamin tablets. Understand. Medicines have a composition & dosage for a reason. Consult a doctor, before becoming a pseudo doctor yourself.🤦🏻♀️#COVID19 — Santwona Patnaik (@SantwonaPatnaik) January 8, 2022 Indian patient when the doctor doesn't prescribe Dolo 650 😂🤣😂#dolo650 pic.twitter.com/QCFMdA9q0V — JITESH JAIN (@Jitesh_Jain) January 8, 2022 I don't no about theories, but it has zero side effects and cure 100%. Biggest medical Mafia is going on be careful my friend. It's time help people. Homeopathy will cure from roots. And You should have a good doctor. Do you know how paracitamol or dolo 650 damage liver ? — Dr.Venkat (@KiteTrades) January 8, 2022 When chemist gives only one Dolo 650.... Indian nibba : pic.twitter.com/zeRC53hDei — Arush Chaudhary (@ArushGzp) January 7, 2022 ప్రొడక్షన్ పెరిగింది ఫ్లూ సీజన్లో సాధారణంగా ట్యాబెట్లు వాడే జనం, కరోనా ఫియర్తో ఈసారి అడ్డగోలుగా మందుల్ని వేసుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ మాత్రలకు ఫుల్ గిరాకీ నడిచిన విషయం తెలిసిందే. అయితే రెండో వేవ్ సమయానికి వ్యాక్సిన్ రావడంతో ఆ వ్యవహారం కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ పూర్తైనా కరోనా బారిన పడుతున్నారనే అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పాత చిట్కాలను పాటించడంతో పాటు మెడిసిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ఈ డిమాండ్ను పసిగట్టి మరోవైపు మందుల కంపెనీలు సైతం ప్రొడక్షన్ను పెంచుతున్నాయి. "Dolo 650" i.e. acetaminophen/ paracetamol. Liver injury induced by paracetamol. .. pic.twitter.com/IqXfUiwBYI — Amit 🗨️ (@newindia_in) January 8, 2022 వైద్యుల కీలక ప్రకటన అయితే ‘అన్నింటికి ఒకే మందు’ అంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వ్యవహారాన్ని వైద్యులు సీరియస్గా తీసుకుంటున్నారు. ఏ మందు అయినా అవసరం ఉన్నప్పుడు.. అవసరం మేరకే వాడాలి. అంతేకానీ ముందు జాగ్రత్త, సొంత ట్రీట్మెంట్ పేరుతో వాడితే సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా అవసరం లేకున్నా వాడడం వల్ల బాడీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్’ పెరిగి.. అవసరమైనప్పుడు మందులు పనిచేయకుండా పోతాయని చెప్తున్నారు. ►ఒమిక్రాన్కానీ, ఇంకేదైనా వేరియెంట్గానీ కరోనా వైరస్ను తేలికగా తీసుకోవద్దు. ►కరోనా అవునో కాదో తెలియకుండా ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిదికాదు. ►ఎవరో ఒకరిద్దరికి తగ్గిందనే భ్రమతో వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులు వాడడం ప్రాణాల మీదకు తెస్తుంది. ►సోషల్ మీడియా ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు.. వైద్యులను నమ్మండి ►లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా కావాలి. జాగ్రత్తలు పాటించాలి. ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవడం, ఆసుపత్రికి వెళ్లడం లేదంటే డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది. ►కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదు. చికిత్సకు మనోధైర్యం తోడైతే కొవిడ్-19 వ్యాధిని అధిగమించొచ్చు. ►అవసరమైతే టెలికాన్సల్టేషన్ ద్వారా కూడా డాక్టర్ను సంప్రదించొచ్చు. ►టీకాలతో ఏం ఒరగట్లేదనే ఆలోచన మంచిది కాదు. అవి వ్యాధులనుంచి రక్షణ కలిగిస్తాయి. రోగ నిరోధకశక్తిపై దీర్ఘకాలం పనిచేస్తాయి. కాబట్టి, వ్యాక్సినేషన్కు దూరంగా ఉండకూడదు. ►అనుమానంతో పదేపదే కరోనా టెస్టులు చేయించుకుంటూ ఇబ్బంది పడొద్దు. కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేయొద్దు. ►అన్నింటికి మించి మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రత తదితర జాగ్రత్తలతో కరోనాను జయించొచ్చు. -
నయా ట్యాబ్లెట్: బ్యాక్టీరియా ఖతం.. నీరు ఫిల్టర్
బయటికి వెళ్లినప్పుడు మంచి నీళ్లు కావాలంటే.. వెంటనే ఓ బాటిల్ కొంటారు. మరి బాటిల్స్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్తే? కంటి ముందు నీటి ప్రవాహాలున్నా... తాగడానికి అనువుగా లేకపోతే? మనిషికి ఎంత కష్టం కదా! ఇక ఆ బాధ అక్కర్లేదు. మీరు అడవుల్లో ఉన్నా, గుట్టలపై ట్రెక్కింగ్ చేస్తున్నా... ముందు నీటి కాలువ ఉంటే చాలు. ఆ నీటిని ఫిల్టర్చేసే ట్యాబ్లెట్ వచ్చేసింది. అదే హైడ్రోజెల్. కలుషితమైన నీటిని గంటలోపే స్వచ్ఛమైన తాగునీరుగా మార్చేస్తుంది. టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన కెమికల్ ఇంజనీర్లు దీనిని కనిపెట్టారు. అక్కడి విద్యార్థి యోహాంగ్ గుయో సూర్యకాంతితో నీటిని శుద్ధి చేసే ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా హైడ్రోజెల్ ఆలోచన వచ్చింది. నీటి కొరత తీరొచ్చు... ప్రపంచ జనాభాలో మూడోవంతు ప్రజానీకానికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. నీటిని తాగాలంటే మరగబెట్టడమో, శుద్ధీకరణో చేయాల్సిందే. ఆ రెండు పద్ధతులకు విద్యుత్ అవసరం. అంతేకాదు... అధిక సమయం, శ్రమ కూడా. కానీ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుకు తగిన వనరులు లేవు. కానీ హైడ్రోజెల్ ఒక్క ట్యాబ్లెట్ ఉంటే... ఇవేవీ అక్కర్లేవు. హైడ్రోజెల్లో ఉన్న హైడ్రోజెన్ పెరాక్సై డ్... నీటిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఇందుకు విద్యుత్ అవసరం లేదు. ఇందులో ఎలాంటి హానికారకాలు లేవు. సూర్యకాంతితో నీరు ఆవిరయి అందులోని కాలుష్యాన్ని వేరు చేసినట్టుగానే... హైడ్రోజెల్ తనంతట తానే నీటిని శుద్ధి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాగునీటి కొరతను తీర్చడంలో హైడ్రోజెల్ గొప్పగా సహాయపడుతుందని టెక్సాస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుహియాయు తెలిపారు. -
ఈ మందుతో అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్..!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్కు చెక్ పెట్టే మందును ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బ్లాక్ ఫంగస్ మాత్రమే కాకుండా దాదాపు అన్ని రకాల ఫంగల్ (శిలీంధ్రం) ఇన్ఫెక్షన్ల చికిత్సలోనూ దీన్ని వాడొచ్చని, ఏదైనా ఫార్మా కంపెనీ ముందుకొస్తే ఈ మందు తయారీ సాంకేతికతను అందించేందుకు తాము సిద్ధమని ఐఐటీ హైదరాబాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బ్లాక్ ఫంగస్కు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్–బి అనే ఇంజెక్షన్తో చికిత్స కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మందు ఖరీదైనది మాత్రమే కాకుండా.. పలు దుష్ప్రభావాలూ ఉన్నాయి. గతంలో ఇదే మందును కాలా అజార్ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్న ఆంఫోటెరిసిన్–బిపై రెండేళ్ల నుంచే ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్, డాక్టర్ చంద్రశేఖర్ శర్మ, పీహెచ్డీ స్కాలర్లు మృణాళిని గాయ్ధనే, అనిందిత లాహాలు పరిశోధనలు చేస్తున్నారు. నానో టెక్నాలజీ సాయంతో... ఈ మందును నానోస్థాయి పోగులతో కలిపి ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేయొచ్చని వీరంతా గుర్తించారు. ట్యాబ్లెట్ల రూపంలో ఆంఫోటెరిసిన్–బి తయారు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అతితక్కువ మోతాదుల్లో ప్రభావవంతంగా మందు అందించవచ్చని, ఇంజెక్షన్ ద్వారా అందించేటప్పుడు మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుండగా ట్యాబ్లెట్ల ద్వారా ఈ దుష్ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్ తెలిపారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు ఆంఫోటెరిసిన్– బి శరీరంలో చిన్నచిన్న గడ్డలు కట్టే అవకాశాలు ఉంటాయని, వీటిని శరీరం నుంచి తొలగించేందుకు మూత్రపిండాలు ఎక్కువ భారం మోయాల్సి వచ్చేదని ఆయన వివరించారు. జిలాటిన్ పదార్థంతో కలిపి తాము ఈ మందును తయారు చేశామని చెప్పారు. పెద్ద ఎత్తున ఉత్పత్తి అవసరం.. బ్లాక్ఫంగస్తో పాటు ఇతర శిలీంధ్ర సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ మాత్రలను పెద్ద ఎత్తున తయారు చేయడం అవసరమని అన్నారు. ఇంజెక్షన్ల మాదిరిగా ఈ ట్యాబ్లెట్లూ ఖరీదుగా మారకుండా ఉండేందుకు తాము ఈ టెక్నాలజీపై పేటెంట్ హక్కులేవీ పొందలేదని, కేవలం 60 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్తో ఆంఫోటెరిసిన్–బి మందు నెమ్మదిగా.. స్థిరంగా 8 గంటల పాటు శరీరానికి అందించవచ్చన్నారు. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.200 వరకూ ఉండొచ్చని చెప్పారు. ఏదైనా ఫార్మా కంపెనీ ట్యాబ్లెట్ల తయారీకి పూనుకుంటే వాటి క్లినికల్ ట్రయల్స్కు మార్గం సుగమం అవుతుందని అన్నారు. -
హువావే కిడ్స్ ఫ్రెండ్లీ టాబ్లెట్ : తక్కువ ధరలో
సాక్షి, ముంబై : చైనా టెక్ కంపెనీ హువావే కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. మ్యాట్ ప్యాడ్ టీ8 పేరుతో దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా కరోనా కాలంలో ఆన్ లైన్ క్లాసుల కోసం కంప్యూటింగ్ పరికరాన్ని తీసుకొచ్చింది. కొనుగోలుదారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులే లక్ష్యంగా ఈ ట్యాబ్ను ఆవిష్కరించింది. రికార్డర్, కెమెరా, మల్టీమీడియా కిడ్స్ పెయింటింగ్ , పేస్ అన్ లాక్ లాంటి ఫీచర్లతో ఇది కిడ్స్ ఫ్రెండ్లీ టాబ్లెట్గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఎక్కువ కాలం పాటు టాబ్లెట్ను ఉపయోగిస్తున్నట్లయితే పిల్లల భంగిమను సరిదిద్దేలా హువావే హెచ్చరిక కూడా ఇస్తుందని తెలిపింది. దీంతోపాటు టైమర్ మరియు మల్టీ లేయర్డ్ కంటి రక్షణ ఫీచర్ కూడా ఉందని కంపెనీ పేర్కొంది.12 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని వెల్లడించింది. అన్ని వైపులా పెద్ద బెజెల్స్తో వైఫై, ఎల్టీఈ రెండు వెర్షన్లలో లభ్యం. హువావే మ్యాట్ ప్యాడ్ టీ8 స్పెసిఫికేషన్లు 8 ఇంచుల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే 1280 x 800 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 512 జీబీ విస్తరించుకునే అవకాశం. 5 ఎంపీ రియర్ కెమెరా 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ హువావే మ్యాట్ప్యాడ్ టీ8 ధర, లభ్యత వైఫై వేరియెంట్ ధర రూ.9,999 ఎల్టీఈ వేరియెంట్ ధర రూ.10,999 సెప్టెంబర్ 14 వరకు ఫ్లిప్కార్ట్లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ప్రీ-ఆర్డర్ వ్యవధిలో ఎల్టీఈ వేరియంట్పై వెయ్యి రూపాయల తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి కొనుగోలుకు లభ్యం. -
హువావే ‘మీడియాపాడ్ ఎం5 లైట్’ ట్యాబ్లెట్ విడుదల
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ డివైజెస్ తయారీ సంస్థ హువావే.. తాజాగా ‘మీడియాపాడ్ ఎం5 లైట్’ పేరుతో ట్యాబ్లెట్ను ఇక్కడి మార్కెట్లో విడుదలచేసింది. కాలేజీకి వెళ్ళేవారు, పని నిపుణులు, కళాకారులు, పిల్లలకు సరిపోయే విధంగా దీనిని డిజైన్ చేసినట్లు ప్రకటించింది. భారత్లో ఈ డివైజ్ ధర రూ. 21,990 వద్ద నిర్ణయించింది. శక్తివంతమైన 8–కోర్ ప్రాసెసర్, 10.1 అంగుళాల డిస్ప్లే, 7,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో స్పెసిఫికేషన్లుగా వెల్లడించింది. నూతన ట్యాబ్ సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ వెబ్ సైట్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ‘5జీ’ ట్రయల్స్కు అనుమతి దక్కేనా..! భారత్లో 5జీ ట్రయల్స్కు హువావే ఆసక్తిని వెల్లడించగా.. జాతి ప్రయోజనాల ఆధారంగా ఈ అంశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నామని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ అన్నారు. ఇందుకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. 4 నెలల్లో స్పెక్ట్రమ్ వేలం ఉండనుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
ఒక్క టాబ్లెట్తో గుండె జబ్బులు మాయం!
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు నాలుగు మందుల మిశ్రమం కలిగిన ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవడం ద్వారా దేశంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని ఓ తాజా వైద్య అధ్యయనం వెల్లడించింది. తద్వారా ‘జాతీయ ఆరోగ్య స్కీమ్’ కింద ప్రభుత్వానికి ఖర్చవుతున్న కోట్లాది రూపాయలను ఆదా చేయవచ్చని కూడా ఆ అధ్యయనం సూచించింది. ఆస్ప్రిన్, స్టాటిన్ మందులతోపాటు రక్తపోటును నియంత్రించే ఏవైనా రెండు మందులతో కూడిన ‘పోలి పిల్’ వేసుకుంటే గుండెపోటు రాకుండా చేయవచ్చని అధ్యయనం జరిపిన వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్నవారే కాకుండా ఎలాంటి గుండె జబ్బులు లేని వారు కూడా ఈ ‘పోలి పిల్’ వేసుకుంటే వారిలో 40 శాతం వరకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వారు చెప్పారు. పలు మందుల మిశ్రమ‘ పోలి పిల్స్’ గురించి గత కొన్నేళ్లుగా బ్రిటన్లో అధ్యయనాలు కొనసాగుతున్నా తాజా అధ్యయనమే సత్ఫలితాలిచ్చాయని వైద్యులు తెలిపారు. పైగా ఒక్క ట్యాబ్లెట్కు భారతీయ కరెన్సీలో కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని వారు చెప్పారు. 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఏడువేల మందిపై ఐదేళ్లపాటు అధ్యయనం జరపడం వల్ల ఈ ‘ పోలి పిల్’ ప్రభావాన్ని అధ్యయనం చేయగలిగామని వైద్యులు ‘ది లాన్సెట్’ పత్రికలో వివరించారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే ‘స్టాటిన్ ట్యాబ్లెట్ల’తోపాటు బీపీ మందులు వాడుతున్నారని, వారు అనేక మందులు తీసుకునే బదులు రోజుకో ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుందని అధ్యయనంలో పాల్గొన్న బర్మింగమ్ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్ టామ్ మార్శల్ తెలిపారు. ఎలాంటి గుండె జబ్బులు లేకుండా 50 ఏళ్ల వయస్సు దాటిని వారంతా ఈ ‘పోలి పిల్’ వాడడం వల్ల గుండె జబ్బులను అరికట్టవచ్చని ఆయన చెప్పారు. -
పంచమి 3
ఏ వార్త వింటానో ఏమిటో? ఇంతకీ చవితి వెళ్లిందో లేదో?! చలిగా ఉంది. షాల్ నిండుగా కప్పినా చలిగానే ఉంది. కలతగా ఉంది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. ఒక పడుచు అమ్మాయి కూర్చుని కళ్ళు తుడుచుకుంటంది. కొందరు గురక పెట్టి నిద్ర పోతున్నారు. కొందరు చడీ చప్పుడు లేకుండా శుప్తావస్థలో ఉన్నారు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. నిద్ర పోతున్నానో మేలుకుని వున్నానో తెలీడం లేదు. ఏదో కలవరం. ఎవరో తట్టినట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. ఎవరూ కనబడలేదు. ఇందాక ఏడ్చిన అమ్మాయి కూడా మగతలోకి జారినట్లు ఉంది. పెద్దావిడ ఎలా ఉందో. ఆలోచనలన్నీ ఆమె చుట్టూతా తిరుగుతున్నాయి. మొదటగా ఆ ఇంటికి వెళ్ళిన సాయంత్రం గుర్తుకొచ్చింది.‘ఇవాళే చేరమన్నా చేరతాను’ ప్రాధేయ పూర్వకంగా అన్నాను. నా అవసరాలు నావి. బంగారం కొట్ల వెనక మూడో సందులో ఐదో ఇల్లు. మనిషి కావాలంట అన్నారు. విన్నది తడవుగా వెళ్ళాను. ఖాళీగా కూర్చుంటే జరుగుబాటు ఎలా? వానాకాలం చివరి రోజులు. మబ్బులు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఏదో ఒక వూరిలోనో, వాగుపైనో అడుగు బొడుగు మిగిలిన చివరి చినుకులు దులపరించుకుంటున్నాయి. చిత్తడి నేలలో బురద చీర మీదికి చిమ్మకుండా నిదానంగా నేను నడుచుకుంటూ వెళ్ళేప్పటికి ఇంటి వరండాలో కోడలు ఉంది. పనికోసం వొచ్చానని అడిగితే అత్తగారి గది చూబించింది. తనుగా ఏ ఆరాలూ తియ్యలేదు. పెద్దావిడ మా కుటుంబం, కులం ఇంతకు ముందు ఎక్కడెక్కడ పని చేసిందిలాంటి కొన్ని వివరాలు అడిగింది. మాట్లాడుతూనే గోడ గడియారం చూసుకుని నీరసంగా బల్ల మీద మందులు తీసింది. టాబ్లెట్ పైని కవర్ చించి లోపలి మందు బిళ్ళ తీసే ఓపిక లేక కాసేపు అలానే నిస్సత్తువగా మొహం వేలాడేసింది. సాయం చెయ్యబోయాను. ‘ఆగు ఆగు’గట్టిగా వారించింది. ఏవైందో అని తెల్లబోయాను. పక్కన ఉన్న కేలండర్ దగ్గరికి తీసుకుని కాసేపు పరీక్షించింది. ఎల్లుండి సాయంకాలం వర్జం, దుర్ముహూర్తం వెళ్ళిపోతాయి. తిధి, నక్షత్రం బావున్నాయి. అప్పుడు ఒచ్చి చేరు అన్నది. పెద్ద జ్యోతిష్యం తెలిసిన మనిషిలాగా ధీమాగా. నాకేమో ఇప్పటికిప్పుడే చేర్చుకోవచ్చుకదా అని ఆశ. మంచి నీళ్లు చేతికిస్తే గ్లాసు కింద పడకుండా తాగగలదో లేదో? అయినా సరే సాయానికి మనిషిని పెట్టుకునేదానికి ముహూర్తం చూసుకుంది! కనీసం మాత్ర మీద కవరు చింపడానికి కూడా ఒప్పుకోలేదు. కవర్ చింపితే కూడా పన్లో చేరిపోయినట్టేనా? మరీ విడ్డూరం.ఎల్లుండి చేరాలి. అంటే, నేను రెండ్రోజులు జీతం లేకుండా ఖాళీగా ఉండాలి. సర్లే. ఎల్లుండి నుంచి నిఖార్సుగా పని దొరికింది. అంతవరకూ నయం.నా పేరు మణి. పెద్దావిడ పేరు ఏదో ఉంది. నేను మాత్రం‘అమ్మా’అంటాను. రోజంతా ఆవిడని కనిపెట్టుకుని ఉండటం. ఎప్పటికీ కలగని ఉపశమనాన్ని కాసేపు కలిగినట్టుగా భ్రమ పడటానికి ఏది చెబితే అది చెయ్యడం. ఏదీ చెయ్యడానికి లేనప్పుడు ఊరికే కూచుని చూడటం. అదే నా ఉద్యోగం. జీవన్మరణ సంధి కాలంలో మనిషికి తోడు ఉండటం. ఎప్పటి నించో ఇదే పని. ‘మనిషి పుటక్కి తొమ్మిదే రంధ్రాలు. నాకు మాత్రం ఎన్నో లెక్కే తెలీదు. ఎప్పుడు ఏ పాపం చేశానో, ఏ పూజలో దోషం చేశానో, ఈ మందులూ, సూదులూ. మందులు లోపలంతా రంధ్రాలు చేస్తే సూదులు పైన పైన పొడిచి చంపుతున్నాయి’ నర్స్ ఇంజక్షన్ చేయడానికి వొచ్చినప్పుడల్లా ఇలాంటి మాటలు అనేది. ‘చెయ్యి కదపకుండా ఉండాలి. మంచి మందులు ఇవ్వన్నీ. టైముకి మందులు వాడితే రెండు రోజుల్లో లేచి ఇల్లంతా తిరిగేయ్యోచ్చు’ కుర్ర నర్సమ్మ అనేది. ఈ మాట వినీ వినీ ఎన్ని ‘రెండు రోజులు’ గడిచాయో లెక్కే లేదు. అయినా ఒక క్షణం కళ్ళు తళుకుమనేవి. వినబుద్ధి పుట్టించే, నమ్మ బుద్ధి పుట్టించే నర్స్ కబుర్లు విని నిట్టూరుస్తుంది. పని పూర్తి అయి తను వెళ్ళిపోయినాక ఆ పిల్లని గురించి కాసేపు కోపంగానో, ప్రేమగానో, చాడీ కోరుతనంగానో నాలుగు మాటలు చెబుతుంది. ఇంజక్షన్ తరవాత దూదిని స్పిరిట్లో ముంచి సూది గుచ్చిన దగ్గర పడిన సన్నటి రక్తం చుక్కని గంట సేపు తుడువమంటుంది.లేక పోతే ఐసు ముక్కలు తీసి రుద్దమంటుంది. కొద్దిగా ఓపిక చిక్కితే లేచి అటూ ఇటూ తిరుగుతుంది. ఆవిడ తిరిగినంత సేపూ నేనూ చెయ్యి పట్టుకుని నడవాలి. ఇవన్నీ కాలక్షేపాల్లో భాగాలు.‘ఇది అసలు రోగం కాదు. గాలేదో సోకింది నాకు. చీటాకు తెమ్మని చెప్పాలి వాడికి’‘ఎప్పుడు ఎక్కడ ఏ ఎర్ర నీళ్లు తొక్కానో. ఇలాగ రోజు రోజుకీ తగ్గిపోతున్నా’‘గుమ్మానికి కట్టిన గుమ్మడి కాయ మార్పించాలి. పటిక గడ్డ ఒకటి తెచ్చి కట్టాలి. నాకు దిష్టి తగిలింది’ రోజులో ఎక్కువ భాగం ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉండేది.పెద్దామె భర్త రెండేళ్ళ క్రితం కాలం చేశాడు. ఒక్కడే కొడుకు. ఎందరో దేవుళ్ళకి ముడుపులు కట్టగా కట్టగా లేక లేక పుట్టాడంట. కొడుక్కి మొగ పిల్లలు ఇద్దరు. ఎనిమిది పదేళ్ళ లోపు వాళ్ళు. పెద్ద పిల్లాడు ఉషారుగా ఉంటాడు. చిన్న వాడు ఎక్కడున్నాడో తెలీనంత నింపాదిగా ఉంటాడు. కానీ వాడి ఉనికి మనకి తెలిసేలా వాళ్ళమ్మ చీటికీ మాటికీ వాడిని కలవరిస్తూ వుంటుంది. ‘స్నానానికి వేడి నీళ్లు రెడీ గా ఉన్నాయి’‘టిఫిన్ తిందువు రా నాన్నా’ ‘అన్నం వండేశాను. నువ్వింక రావాలి’ ఏది అడిగినా గట్టి సమాధానం చెవినిపడదు పది సార్లు పిలిస్తూనే ఉంటుంది! పిల్లలు, అమ్మల పిలుపుకి చప్పున స్పందించపోవడం మామూలే. కానీ, వీడు మరీ విడ్డూరం. వినపడినా పలకడు. ఎప్పుడు పది నిమిషాలు తీరిక దొరికినా, ఏదో ఒక మూల మందపాటి దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటాడు. పది సార్లు కేకలేస్తే నింపాదిగా వొచ్చి మంపుగా వాళ్ళమ్మ భుజాలు పట్టుకుని వేలాడుతూ నీలుగుతూ ఉంటాడు.‘మంచి రోజు అని రెండ్రోజులు ముందే బొజ్జలోంచి బైటికి తీయించింది వీడి నాయనమ్మ.కడుపులో వెచ్చగా, హాయిగా ఇంకా కొన్నాళ్ళు వుండనివ్వాల్సింది. అలా చప్పున లోకం లోకి లాగేటప్పటికి వాడికి ఏం అర్ధం కాలేదు. పుట్టిన రోజు మొదలు, నిద్ర పోతూనే ఉన్నాడు. ఆ నాలుగు రోజుల లోటు ఏళ్ల తరబడి తీర్చుకుంటూనే ఉన్నాడు’ గారాబంగా వాడి జుట్టు నిమురుతూ, అత్తగారి వంక నిరసనగా చూసింది కోడలు.‘ఇదివరకంటే అవకాశం లేదు. ఇప్పుడు అన్నింటికీ మంచి చెడ్డ చూసుకుని నడిచే అవకాశం ఉంది కదా. నిద్ర ఎక్కువ పోతాడని మాటే గానీ, తొందరగా అక్షరాలు పట్టేశాడు, బుద్ధిమంతుడు అని వాడకట్టలో మంచి పేరు. ఇంక అంతకన్నా ఏం కావాలి?’ ఆవిడ తన వాదన వినిపించింది.ఎవరు మాట్లాడితే వాళ్ళ వంక తిరిగి తల ఊపుతూ వింటాను. నేను చేసే ఆయా పనిలో అత్తా కోడళ్ళ మధ్యలో తలదూర్చి చేసే తీర్మానాలు ఏం ఉంటాయి గనక. చివరి వానలు కూడా కురిసి చలి రోజులు మొదలు అయ్యేప్పటికి ఆవిడలో ఉషారు తగ్గిపోసాగింది. మంచం మీద పడుకునే ఉంటే కదుములు కడతాయని లేచి కూర్చుని ఉంటోంది. కానీ ఇదివరకటిలా అటూ ఇటూ తిరగడం లేదు. ‘ఆస్పత్రిలో చేరాలి. బలమైన టానిక్కులు రాయించుకుని తాగితే సత్తవ వొస్తుంది. లేచి తిరగాలి. ఎన్నాళ్లైందో చింతకాయ తొక్కు, నెయ్యి కలుపుకుని అన్నం తిని. కోడలు రోలు వాడనే వాడదు. ఆ మిక్సీలో వేసి తిప్పితే ఏం బాగుంటాయి పచ్చళ్ళు? పోనీ నాకు అది కూడా పెట్టరు. ఉత్త చప్పిడి కూడు. ఏదైనా అంటే, తేడా చేస్తుంది. ఒద్దు. ఒంటికి మంచిది కాదు అని చెబ్తారు. ఓపిక రానీ. ఈ సారి వేరు పొయ్యి పెట్టుకుని నేనే వొండుకుంటాను’ నిన్నటి నుంచి ఇలా ఏదో ఒకటి మాట్లాడ్డం మొదలు పెట్టింది. చాలా రోజులు అయ్యింది ఇన్ని మాటలు విని. నాకు అనుమానం వొచ్చింది. కానీ బైటికి చెప్పలేదు. రాత్రి పది గంటలు అయ్యిందేమో. బాత్రూమ్కి తీసుకెళ్లమంది. పగటి పూట ఐతే కోడలు సాయానికి వొస్తుంది, మంచం దగ్గర నుంచి బాత్రూమ్ తలుపు దాకా. రాత్రిళ్ళు నేనే తిప్పలు పడతాను. ‘ముందు జన్మలో నువ్వు నా బిడ్డవి మణీ’ అంది. ‘మరేనమ్మా’ నేను చిన్నగా నవ్వాను.‘ఈ నైటీలు నాకు అసలు నచ్చవు. ఏంటో నాకు ఇవి వేస్తున్నారు. నాలుగు రోజులాగి కాస్త ఓపిక వస్తే చీరలు కట్టుకోవాలి’. ‘అలాగే కట్టుకుందురు గానీ’. ‘అయినా ఇప్పుడు అందరూ నైటీలే వేస్తున్నారు. నాకే ఎందుకో నచ్చవు’నేను ఏం మాట్టాడలేదు. ఆమె కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉంది. పొడి బట్టలు తొడిగి మంచం మీద పడుకోబెట్టాను. ‘ఈ రోజు తిధి ఏమిటో చూడు మణీ’ కళ్ళు మూసుకునే చెప్పింది. నేను గమ్మునున్నాను.కాసేపు గడిచాక చిన్నగా మూలగడం మొదలు పెట్టింది. మధ్యలో ఏదో గొణుగుడు. సరిగా అర్ధం కావడం లేదు. స్పష్టంగా మాట్లాడటానికి లోపల్నించి సహకారం లేదు. కొడుకుని పిలవనా అనుకున్నాను. గది లోంచి బైటికి వొచ్చి తలుపు తట్టబోయాను. కొడుకూ కోడలూ మేలుకునే ఉన్నట్లున్నారు. లోపల్నించి సన్నటి ధ్వని! రూపమాత్రంగా రెండుగదుల్లో శబ్దం ఒకటే. కానీ భావనలు జీవితపు భిన్న పార్శా్వలకు ప్రతీకలు. తలుపు కొట్టడానికి మొహమాటపడి వెనక్కి వొచ్చేశాను. కానీ పరిస్థితి క్షణ క్షణానికీ మారుతోంది. చెప్పక తప్పదు, ఏకాంతానికి భంగం అయినా సరే. ఫోన్ తీశాను. ఆరేడు రింగులు మోగగానే అటునుంచి కట్ అయ్యింది. నిమిషంలో కొడుకూ కోడలూ వొచ్చారు. వాళ్ళు వొచ్చేప్పటికి ఆమె కళ్ళు మూసుకుని ఉంది. నావంక ప్రశ్నార్ధకంగా చూశారు. నేను ఆవిడ వొంక చూబించాను. అబ్బాయి, దగ్గరికెళ్ళి ఊపిరి ఉందో లేదో అని అనుమానంగా గమనించాడు. ఊపిరి ఆడుతోంది.‘ఏమైంది?’అన్నాడు‘బాగాలేనట్లు ఉంది’ ‘హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలా?’ అంటూనే అంబులెన్సుకి ఫోన్ చేశాడు. అంబులన్స్ వచ్చేలోగా అవసరమైన టవలు, చీరలు కొన్ని వస్తువులూ నేను సంచిలో సర్దాను. అన్నీ సర్దటం అయ్యాక అబ్బాయి, గోడకి తగిలించిన కేలండర్ ఓ సారి చూసి, తరవాత దానిని తీసి సంచిలో వస్తువుల పైన పెట్టాడు! కాసేపటికి అంబులన్స్ వొచ్చింది. నన్ను కూడా ఎక్కమన్నారు. ఆసుపత్రి ఇంద్ర భవనంలా ఉంది. నరకానికి అందమైన డెకరేషన్ చేస్తే అదే ఆసుపత్రి. పెద్ద పెద్ద మెట్లు, ఎక్కువ మంది నిలబడగల లిఫ్టు, అందమైన పూల పూల ప్లాస్టిక్ కర్టెన్లు, మరక పడని గ్లాస్ తలుపులు, తళ తళా మెరిసే రాళ్ళు పరిచిన నేల, శుభ్రమైన డాక్టర్లు, నర్సులు. పేషంట్లు ఏరీ? రోగాలు ఏవీ? ఎక్కడా కనబడవే? వాళ్లని మాత్రం అందరికీ కనబడేలా పెట్టరు! ఖరీదైన ఆసుపత్రికదా. నొప్పీ, రోదనా, రోగాలు జాగ్రత్తగా లోపలెక్కడో దాచి పెట్టబడతాయి. అబ్బాయిని పెద్ద డాక్టర్ లోపలికి పిలిచారు. కోడలు, పిల్లల్ని బైట కూచోబెట్టుకుని సముదాయిస్తోంది. లోనికి రావాలంటే భయమంది. అందుకని నన్ను తోడు పిలిచాడు. పెద్దామె చేతికీ మోహానికీ, మూతికీ, గొంతులోకీ ఏవేవో గొట్టాలు బిగించి ఉంచారు. సృష్టికర్తకి మనిషి విసురుతున్న సవాల్. పై వాడు ఊపిరి ఆపెయ్యాలని చూస్తాడు. మనిషి ఒప్పుకోడు. ఆడిస్తాడు. ప్రేమో, భయమో, రాజకీయమో. అవసరం పేరు ఏదైనా గానీ. ఆడిస్తాడు. మరి, ఎంతకీ దేవుడికేనా చావు పుట్టుకల వినోదం?‘కండిషన్ సీరియస్. ఎంత సేపో కూడా చెప్పలేము’ డాక్టర్ మాటకి అబ్బాయి మొహం వాడిపోయింది.‘ఎలా ఇప్పుడు?’ ఆదుర్దాగా అడిగాడు.‘వెయిట్ చెయ్యడమే’ డాక్టర్ ప్రశాంతంగా చెప్పాడు.‘అది కాదు డాక్టర్ గారూ. నక్షత్రం, తిధి రెండూ బాగాలేవు. చవితి వెళ్ళేదాకా ఎలాగోలా ఊపిరి ఉండేలా చూడండి. ప్లీజ్’ డాక్టర్ని బ్రతిమిలాడినట్లు అడిగాడు. నేను ఆశ్చర్య పోయాను. డాక్టర్ మాత్రం నాలాగా ఆశ్చర్య పోలేదు.‘చూద్దాం. హామీ ఐతే ఏమీ ఇవ్వలేం. ఒక బాటిల్ రక్తం ఎక్కించి, డయాలిసిస్ చేద్దాం!’‘అలాగే డాక్టర్. ఎలాగైనా చవితి వెళ్ళేదాకా ఆపి ఉంచండి’ మళ్ళీ ప్రాధేయపడ్డాడు. మిషన్లు, మొరాయిస్తున్న ఊపిరి తిత్తులని ప్రయత్నపూర్వకంగా గాలితో నింపుతున్నాయి. గుండె చప్పుడుని పర్యవేక్షిస్తున్నాయి. మెదడు మేలుకొని ఉన్నదో లేదో గమనిస్తున్నాయి. ఒద్దు మొర్రో, నన్ను హాయిగా చావనియ్యండి అని బిగ్గరగా మొత్తుకోలేని అశక్త దేహం. దుర్మార్గమైన ఆట. ట్రీట్మెంట్ జరుగుతోంది!‘మణీ, అమ్మతో పాటు నువ్వు వుండు. పేషంట్తో ఒచ్చిన ఒక్కరికే బెడ్ ఇస్తారు. ఇంటి దగ్గర పిల్లలు కదా. నాకు ఇక్కడ ఉండటం కుదరదు. ఎటువంటి అవసరం వొచ్చినా వెంటనే ఫోన్ చెయ్యి’ ఏమంటానో అన్నట్లు నా మొహంలోకి చూశాడు. ఒక్క ఘడియ ఆలోచించి సరే చెప్పాను. పాత రోజుల్లో మనిషికి బాలేదంటే గుంపులుగా బంధువులు ఆస్పత్రి బైట నిలబడి అయినా ఉండేవారు. ఇప్పుడు అందరికీ అలా సాగడం లేదు. ఎవరి పనులు వారివి. ఎవరి జీవితం వారిది. చావు వేడుకలో పాలు పంచుకోవడం కోసం, బ్రతికిన వాళ్ళ దగ్గర ఎక్కువ సమయం వుండటం లేదు.ఘడియలు ఒకదాని వెంట ఒకటి మెల్లగా కదులుతున్నాయి. రాత్రి ముప్పావు భాగం పైగా గడిచింది. చల్లటి గది. తెల్లటి నున్నటి నేల. సౌకర్యంగా పడుకోడానికి ఏర్పాట్లు. శుభ్రమైన బాత్ రూమ్. అన్నీ బావున్నాయి. ఆ మూల ఉన్న ఫోన్ బాలేదు. అది మోగిందంటే, ఎవరో ఒక పేషంట్ పేరు వినబడుతుంది. ఆ రోగి తాలూకా వాళ్ళకి పిలుపు వస్తుంది. భయం భయంగా వాళ్ళు గదిలోంచి బైటికి వెళతారు. మిగిలిన వాళ్ళు, మనకి సంబంధించిన పేరు కాదు అని తాత్కాలికంగా స్వాంతన చెందుతారు. నిన్న మొన్న చేరినట్లు ఉంది. అప్పుడే రెండు నెలలు పైనే. ఎప్పటి ఋణానుబంధమో. దీర్ఘ శ్వాస వొదిలి కళ్ళు మూశాను. మళ్ళీ ఎవరో తట్టారు. చప్పున కళ్ళు తెరిచాను.పెద్దావిడ!! ఇంటి దగ్గర రెండు అడుగుల దూరం జరగడాకి మంచాలు పట్టుకుని ఒంగి నడుస్తుంది. ఇప్పుడు మాత్రం నిటారుగా నిలబడి ఉంది. మోహం మాత్రం పాలిపోయి ఉంది. మచ్చుకైనా కళ లేదు. ఇక్కడికి ఎలా వొచ్చింది? ఇన్ని రూములు దాటి నా దాకా ఎలా వొచ్చింది? ‘మణీ, ఆ గొట్టాలు, వైర్లు అన్నీ అడ్డంగా ఉన్నాయి. చిరాగ్గా ఉంది. అవన్నీ పెట్టొద్దు తీసెయ్యమను. ఇక్కడ ఉండలేను. వాడితో చెబితే వినడం లేదు. నువ్వొచ్చి చెప్పు మణీ. ఏం బాలేదు మణీ. వెళ్ళిపోవాలని ఉంది. ఉండలేను మణీ’ బ్రతిమలాడుతుంది.‘అమ్మా, అసలు మీరు ఇక్కడికెలా వొచ్చారు?’ హైరానాగా కేక పెట్టి నేను దిగ్గున లేచి కూర్చున్నాను. పక్కనే మంచాల మీద నిద్ర పోతున్న వొకరిద్దరు నా చప్పుడికి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. చుట్టూతా చూశాను. ఎటువెళ్ళింది? ఒణుకు పుట్టింది. ఉలికిపాటుకు గురి చేస్తూ ఇంతలోకి గణగణా ఫోన్ మోగింది. ఇందాక కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చిన పిల్ల లేచి గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళింది.‘ఆవిడ తాలూకా ఎవరు?’ నా యజమానురాలి పేరు చెప్పి అడిగింది. ‘నేనే’ శాలువా తీస్తూ హడావిడిగా లేచాను. నా సెల్ ఫోన్ మోగింది. పెద్దావిడ కొడుకు. గుండెలు దడ దడ మంటున్నాయి. చేతులు కంపిస్తున్నాయి. ఫోన్ ఎత్తాను.‘మణీ, ఐదు నిమిషాల్లో వొచ్చేస్తున్నా’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. టైం చూశాను.ఈ సమయంలో ఆవిడ ఎలా వొచ్చింది? ఎలా వెళ్లింది? అబ్బాయి అర్జెంట్గా వస్తున్నట్లు ఫోన్ ఎందుకు చేశాడు. అక్కడికి వెళ్లి ఏ వార్త వింటాను? శాలువా లుంగ చుట్టి సంచిలో పెడుతుంటే పైనున్న కేలండర్ కింద పడింది. చేతిలోకి తీసుకుని చూశాను. వారం, నక్షత్రం మారాయి. కొద్దిసేపటిక్రితమే చవితి కూడా వెళ్ళిపోయింది. - ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి -
చుట్టేసే ట్యాబ్లెట్ ఇది...
ఫొటో చూస్తే విషయం అర్థమైపోతుంది. కెనెడాలోని క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ట్యాబ్లెట్ ఇది. స్క్రీన్ను ఉండలా చుట్టేయగలగడం దీని ప్రత్యేకత. డాక్టర్ రోల్ వెర్టిగాల్ నేతృత్వంలోని బృందం ఈ నమూనా యంత్రాన్ని తయారు చేసింది. వివరాలు చూస్తే.. ఏడున్నర అంగుళాల వెడల్పు ఉండే ఈ ట్యాబ్లెట్ స్క్రీన్పై చిత్రాలు 2కే రెజల్యూషన్లో కనిపిస్తాయి. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో తయారుచేసిన గొట్టం లాంటి ఆకారంపై ఈ తెరను చుట్టేయవచ్చు. గొట్టానికి రెండు చివరల చక్రాల్లాంటివి ఉంటాయి. వాటిని అటు ఇటు తిప్పితే స్క్రీన్పై ఉండే ఫొటోలు, వీడియోలు, సమాచారం కనిపిస్తుందన్నమాట. ఈ చక్రాలకు ఒకవైపు ఉండే కెమెరాలను వాడుకుంటే సంజ్ఞల ద్వారా కూడా ట్యాబ్లెట్ను పనిచేయించవచ్చు. మొబైల్ఫోన్, వాయిస్ రికార్డర్గానూ దీన్ని ఉపయోగించుకోవచ్చునని, అవసరం లేనప్పుడు ఎంచక్కా జేబులో పెట్టేసుకోవచ్చునని వెర్టిగాల్ తెలిపారు. ఈ వినూత్నమైన ట్యాబ్లెట్ వివరాలను ఈ వారం స్పెయిన్లో జరగబోయే మొబైల్ హెచ్సీఐలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. -
ఒక్క మాత్రతో మధుమేహానికి చెక్!
ఒక్క మాత్ర వేసుకుంటే చాలు.. మధుమేహం నయమైతే ఎలా ఉంటుందంటారూ? అబ్బో అద్భుతం ఆవిష్కారమైనట్లే కదూ. ఇంకొన్నాళ్లు ఆగితే ఇదే జరగబోతోంది. ఎందుకంటే బరువు తగ్గేందుకు చేసుకునే బేరియాట్రిక్ సర్జరీని తలపించేలా పనిచేసే ఓ కొత్త మాత్రను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. బేరియాట్రిక్ సర్జరీతో బరువు తగ్గడమే కాకుండా కొంతమందిలో మధుమేహం కూడా నయమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలంగా గుర్తిస్తూ వస్తున్నారు. ఎందుకిలా జరుగుతోందన్న విషయం మాత్రం స్పష్టం కాలేదు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న 20 వేల మందిలో 84 శాతం మందికి మధుమేహం అన్నది లేకుండా పోయినట్లు తెలిసింది. ఈ అంశం ఆధారంగా బ్రైగమ్, విమన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఒక మాత్రను అభివృద్ధి చేశారు. ఇది పేగుల్లోపల కొద్దిసమయంపాటు ఒక పూతను పూస్తుంది. ఫలితంగా ఆహారం తీసుకున్న తరువాత హఠాత్తుగా రక్తంలో చక్కెర శాతం పెరగడం దాదాపుగా ఉండదు. ఎలుకలపై ఇప్పటికే ఈ మాత్ర ప్రభావం బాగా ఉన్నట్లు స్పష్టమైందని, పూత పూయడం ద్వారా ఈ మాత్ర తాత్కాలికంగా బేరియాట్రిక్ సర్జరీ ప్రభావాన్ని సృష్టించిందని యూహాన్ లీ అనే శాస్త్రవేత్త చెప్పారు. -
జరం గోలీకీ దిక్కులేదు
► తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులపై కాగ్ అసంతృప్తి ► ఆరోగ్య కేంద్రాల్లో కనీసం అత్యవసర మందులు లేవు సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య రంగం పనితీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో కనీసం అత్యవసర మందులూ అందుబాటులో లేవని, సాధా రణ మందుల విషయం గురించి చెప్పాల్సిన అవస రం లేదని పేర్కొంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, వసతులు న్నచోట సిబ్బంది లేరని వివరించింది. వివిధ విభాగాల పనితీరుపై కాగ్ ఇచ్చిన నివేది కలను పార్లమెంటుకు కేంద్రం సమర్పించింది . 2011–12 నుంచి 2016 వరకు ఐదేళ్ల కాలంలో వైద్య రంగానికి రూ. లక్ష కోట్లను కేంద్రం కేటాయించ గా..మౌలిక వసతులు, సిబ్బంది కొరత, నిధు ల వ్యయం, మళ్లింపు, మందుల సర ఫరా, ఆస్పత్రుల దురవస్థ అంశాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిశీలించి కాగ్ నివేదిక ఇచ్చింది. 2011 –12లో ఖర్చు చేయని నిధులు రూ. 7,375 కోట్లుండగా.. 2015–16 లో ఆ మొత్తం రూ. 9,509 కోట్లకు చేరిందని పేర్కొంది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో వేరే పథకాలకు నిధులు మళ్లించారని తెలి పింది. ఎక్స్పైరీ తేదీలూ చూడరా?.. తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్స్పైరీ తేదీలనూ చూడకుండా రోగుల కు మందులు ఇచ్చారని కాగ్ పేర్కొం ది. ఆశా వర్కర్ల వద్ద నవజాత శిశువుల బరువు కొలిచే, గర్భిణులకు బీపీ చూసే పరికరాలు, డెలివరీ, ప్రెగ్నెన్సీ కిట్లు, పారాసెటమల్, ఐరన్ మాత్ర లు వంటివేవీ లేవంది. ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో పలు పీహెచ్సీలు వైద్యులు లేకుం డానే పనిచేస్తున్నాయంది. 28 రాష్ట్రాల్లో కనీ సం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లూ లేవని తెలి పింది. దేశవ్యాప్తంగా అంబులెన్స్ల కోసం రూ. 175. 26 కోట్లు విడుదల చేస్తే రూ. 155. 93 కోట్లను వినియోగించనేలేదని పేర్కొంది. పరికరాలున్నా.. సిబ్బంది లేరు.. తెలంగాణ జనాభాకు అనుగుణంగా 768 పీహెచ్సీలకు గాను 668 మాత్రమే ఉన్నాయని.. మరో 78 సీహెచ్సీలు అవసరమని కాగ్ తెలిపింది. ఏపీలో మరో 25 పీహెచ్సీలు, 104 సీహెచ్సీలు అవసర మని పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మౌలిక వసతులు లేవని తెలిపింది. అనేక హెల్త్ సెంటర్లకు ప్రజా రవాణా, విద్యుత్, తాగునీరు వసతి లేదని, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినా వినియోగంలోకి రాలేదని వాపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరికరాలున్నా.. సిబ్బంది లేక నిరుపయోగంగా ఉన్నాయంది. ఈ రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కనీసం అత్యవసర మందులూ లేవని.. పారాసిటమల్, విటమిన్–ఏ, బీ–కాంప్లెక్స్, అల్బెండజోల్, గర్భ నిరోధక మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గైనకా లజీకి సంబంధించిన కిట్లు వంటివేవీ లేవని తెలిపింది. -
తరచూ జలుబు... తగ్గేదెలా?
ఇఎన్టి కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దాంతో చాలా బలహీనంగా మారుతున్నాను. రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నాను. జలుబు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – చిన్నారావు, ఏలూరు మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది అన్నారు కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు భాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్ని సార్లు కింద కూడా పడిపోయాను. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతూ ఉన్నట్లు, పడిపోబోతున్నట్లు అనిపించే ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా, పరిష్కారం సూచించండి. – పద్మనాభప్రసాద్, విజయవాడ మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్కు సంబంధించిన ఎక్సర్సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
పేదల పాలిట దేవుడు!
సాధారణంగా ఎనభై ఏళ్ల వయసులో ఎవరైనా కాటికి కాళ్లు చాపుకొంటూ కూర్చుంటారు. సాయం పడితే తప్ప తమ పనులు చేసుకోలేని స్థితిలోకి జారుకుంటారు. అలాంటి వయసులో ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన గొప్ప సమాజసేవకు నడుం కట్టాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈయన కథేంటో మనమూ తెలుసుకుందాం..! ఈ రోజుల్లో పేదోడికి జబ్బు చేస్తే అంతే సంగతులు. ఆసుపత్రులు శ్రీమంతులకే సేవలు చేస్తారుు. ఈ వివక్ష ఓంకార్నాథ్ శర్మను తీవ్రంగా బాధించింది. కనీసం ఒక మాత్ర కూడా కొనలేని నిస్సహాయులను చూసి కదిలిపోయాడు. వారికోసం ఇంటింటికీ తిరిగి, వాడకుండా కాలపరిమితి దాటని టాబ్లెట్లను, టానిక్కులను సేకరించే పనిలో పడ్డాడు. ఇలా.. గత ఏడేళ్లుగా పేదవాళ్లకు మందుగోలీలు ఉచితంగా ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ నోరుుడాలోని కై లాష్ హాస్పిటల్ లో బ్లడ్బ్యాంక్ టెక్నీషియన్గా పనిచేసి రిటైరైన ఓంకార్నాథ్ను 2008లో జరిగిన ఒక ఘటన పూర్తిగా మార్చేసింది. ఒకసారి తూర్పు ఢిల్లీలో మెట్రో పనులు జరుగుతుంటే.. ఉన్నట్టుండి బ్రిడ్జి కూలిపోరుుంది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యారుు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా.. సరైన వైద్యం లేకపోవడంతో నరకం చూశారు వాళ్లు! ఆరోజే పేదలకోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణరుుంచుకున్నాడు. అలా మెడిసిన్ బాబాగా అవతారమెత్తాడు. మెడిసిన్ బాబా అడిగితే టాబ్లెట్లు లేవు అని ఎవరూ అనరు. అవసరం ఉన్నా సరే, వేరే తెచ్చుకుంటాంలే అని ఉన్నవన్నీ అతని చేతిలో పెడతారు. ఒకవిధంగా చెప్పాలంటే ఓంకార్ తమ వీధిలో కనిపించడమే మహాభాగ్యం అనుకుంటారంతా. అతనికి సాయపడుతున్నందుకు గర్వంగా కూడా ఉందని ప్రతీ ఒక్కరూ చెప్తుంటారు. ధనికులు ఉండే ఏరియాల కంటే.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, గవర్నమెంటు కాలనీవాసులే తన ఆశయానికి మద్దతు పలుకుతుంటారని చెబుతాడాయన. ఓంకార్ నాథ్ చేసే పని అంత సులభం కాదు. ఎన్నో అవాంతరాలు. అంతెందుకు అతను ఉంటున్న ఇల్లు కూడా సొంతం కాదు. భార్య, కొడుకు ఉన్నారు. విషాదం ఏంటంటే 45 ఏళ్ల తన కుమారుడు మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. నెలకు ఎంత లేదన్నా 4 నుంచి 6 లక్షల విలువైన మెడిసిన్స పంచుతాడు ఈ బాబా. ఆనోటా ఈనోటా విని మీడియా ఓంకార్నాథ్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అలా మెడిసిన్ బాబాగా పాపులర్ అయ్యాడు. జనం కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకుని కాలేజీలు, గుళ్ల దగ్గర మెడిసిన్ కలెక్షన్ బాక్సులు పెట్టి మందులు సేకరిస్తున్నారు. ఈ మెడిసిన్ బాబాను పేదలపాలిట దేవుడు అంటే తప్పేం ఉండదేమో! -
జియో సపోర్ట్తో ఐ-బాల్ కొత్త ట్యాబ్లెట్
ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఐ-బాల్ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. రిలయన్స్ జియో సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్ ను 'స్లైడ్ క్యూ 27' పేరుతో విడుదల చేసింది. దీని ధరను రూ.12,799 గా కంపెనీ నిర్ణయించింది. ఈ టాబ్లెట్ లు ఇప్పటికే మార్కెట్ లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. స్లైడ్ క్యూ 27' ఫీచర్స్ 10.10 అంగుళాల డిస్ ప్లే 1.3గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 800x1280పిక్సెల్స్ రిజల్యూషన్ 2ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5ఎంపి రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 32జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 5500ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆస్తమాకు సరికొత్త ఔషధం
లండన్: ఆస్తమా బాధితులకు ఒక తీపి కబురు.. 20 ఏళ్ల తరువాత తొలిసారిగా ఉబ్బసం తీవ్రతను గణనీయంగా తగ్గించే సరికొత్త ట్యాబ్లెట్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఈ ట్యాబ్లెట్ ఉబ్బసం లక్షణాలను తగ్గించి ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుందని, ఊపిరితిత్తుల్లో మంటను తగ్గించి, వాయు నాళాలను శుభ్రం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉబ్బసం చికిత్సలో ఈ ఔషధం కొత్త ఒరవడిని సృష్టించనుందని యూకే లోని యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ కు చెందిన పరిశోధకుడు క్రిస్టోఫర్ బ్రైట్లింగ్ అన్నారు. ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉంది. -
బటన్ నొక్కితే విచ్చుకునే స్క్రీన్!
లండన్: ల్యాప్టాప్, ట్యాబ్లెట్లు ఎన్ని ఉన్నా... ఓ డెస్క్టాప్ కంప్యూటర్తో వచ్చే సౌలభ్యమే వేరు. విశాలమైన స్క్రీన్తో డెస్క్టాప్పై ఎలాంటి పవర్పాయింట్ ప్రెజెంటేషనైనా, ఎక్సెల్షీట్నైనా సులువుగా రన్ చేయవచ్చు. మార్పులు చేర్పులు చేయవచ్చు. కానీ పెద్ద సైజు వల్ల డెస్క్టాప్ కంప్యూటర్ను మనకు కావాల్సిన చోటుకు తీసుకెళ్లలేము. దీన్ని అధిగమించేందుకు వినూత్నమైన ఆలోచన చేశారు అలెగ్జాండర్ వీస్లీ. మీటనొక్కగానే విచ్చుకునే గొడుగు మాదిరిగా అరచేతిలో ఇమిడిపోయే హెచ్డీ డిస్ప్లేను సిద్ధం చేశాడు. ‘స్పడ్’ అని పిలుస్తున్న ఈ సరికొత్త కంప్యూటర్ డిస్ప్లే కొంచెం అటుఇటుగా సెట్టాప్ బాక్స్ సైజు ఉంటుంది. బటన్ నొక్కగానే ఒక్క సెకన్లో 24 అంగుళాల స్క్రీన్గా మారుతుంది. వైర్లెస్గా కానీ హెచ్డీఎంఐ కేబుల్ ద్వారాగానీ ఇన్పుట్లు అందుకోవచ్చు. ప్రత్యేకమైన వినైల్తో తయారైన స్క్రీన్ 1280 ్ఠ 720 రెజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ నమూనాలు రెడీ అయిపోగా... వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు వీస్లీ కిక్స్టార్టర్ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్నీ సవ్యంగా సాగితే ఒక్కో స్పడ్ ఖరీదు దాదాపు రూ. 21 వేల వరకూ ఉండవచ్చు. -
విటమిన్ స్నానం
బ్యూటిప్స్ జుట్టు పొడవుగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందుకోసం చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటి వారు తలకు రాసుకునే కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి అందులో ఒక విటమిన్-ఇ టాబ్లెట్ను వేయాలి. ఆ నూనెను రాత్రి నిద్రపోయే ముందు మాడుకు, జుట్టుకు బాగా రాసుకొని ఉదయాన్నే కుంకుడు రసంతో తల స్నానం చేస్తే సరి. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. {Mీములు, రకరకాల సబ్బులు వాడినా మొటిమలు తగ్గట్టేదని బాధ పడేవారు ఈ చిట్కా వాడి మంచి ఫలితాన్ని పొందండి. అందుకు వేరుశనగ(పల్లి) నూనె, నిమ్మరసం సమపాళ్లలో కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో వారానికి మూడుసార్లు అంటే రోజు విడిచి రోజు ముఖాన్ని మర్దన చేసుకోవాలి. దాంతో మొటిమలు, నల్లమచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. చాలామందికి ముఖంపై చర్మం సాగిపోయి లూజ్గా ఉంటుంది. అలాంటి వారు ఆపిల్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది. దానికి ఆపిల్ పండును పేస్ట్ చేసి అందులో తేనె, వెనిగర్, ముల్తాని మట్టి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంతో వారానికోసారి ఫేస్ప్యాక్ వేసుకుంటే చర్మం టైట్గా అవుతుంది. దాంతోపాటు ముఖంపై ముడతలు తగ్గుతాయి. అందం అనే సరికి అందరికీ గుర్తొచ్చేది ముఖం మాత్రమే. కానీ కాళ్లు, చేతులు కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. ఎందుకంటే ముఖంపై చూపినంత శ్రద్ధను కాళ్లపై చూపక, వాటిని అలాగే వదిలేస్తూ ఉంటారు. దాంతో వాటి రంగు, ముఖం రంగు వేరుగా ఉంటాయి. కాబట్టి కాళ్ల అందానికి ఒక కప్పు నిమ్మరసంలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, పావుకప్పు పాలు, కొద్దిగా రోజ్ వాటర్ కలిపిన మిశ్రమాన్ని సగం నీళ్లున్న చిన్న టబ్బులో వేసి కలపాలి. రెండు కాళ్లను ఓ 20 నిమిషాల పాటు అందులో పెట్టాలి. తర్వాత కాళ్లను శనగపిండితో రుద్ది కడుక్కుంటే అందంగా తయారవుతాయి. -
విద్యార్థులకు ఈ-లెర్నింగ్ టాబ్స్
- వచ్చే ఏడాది నుంచి అందజేస్తామన్న యువసేన అధ్యక్షుడు ఆదిత్య - పల్లె ప్రాంతాల్లో సోలార్ ట్యాబ్లెట్ల పంపిణీ - ఎన్నికల హామీ నెరవేర్చేందుకేనని వెల్లడి ముంబై: వచ్చే ఏడాది నుంచి విద్యార్థుకు ట్యాబ్లెట్లు అందజేస్తామని శివసేన అనుబంధ యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే బుధవారం తెలిపారు. విద్యార్థులు బ్యాగ్లు భారం తగ్గిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ‘ఈ-లర్నింగ్’ ట్యాబ్లను ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఈ-లర్నింగ్ ట్యాబ్లు అందజేసే ప్రక్రియలో భాగంగా మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ఇప్పటికే టెండర్లు ఆహ్వానిస్తోందని ఆయన చెప్పారు. బుధవారం విధానసభకు వచ్చిన ఆదిత్య, విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి వినోద్ తావడేకు ఒక ట్యాబ్ అందజేశారు. ‘ఇటీవల దాదర్లోని బాల్మోహన్ విద్యామందిర్ పాఠశాల విద్యార్థులకు ఈ-లర్నింగ్ ట్యాబ్లు అందజేశారు. దీంతో వారికి పుస్తకాలు మోసే బాధ తప్పింది. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ట్యాబ్ లు అందజేస్తాం. అందులో మొత్తం తరగతి సిలబస్, మ్యాపులు, గ్రాఫిక్తో కూడిన సమాచారం, పరీక్షలు వంటి మరిన్ని అందుబాటులో ఉంటాయి. బీఎంసీ పాఠశాలల్లో బోధించే అన్ని భాషలు అందులో నిక్షిప్తం అయ్యి ఉంటాయి’ అని ఆదిత్య తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే.. ప్రస్తుతం సర్వే చేస్తున్న కమిటీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన వెంటనే రాష్ట్రంలోని జిల్లా పరిషత్, స్థానిక సంస్థల పాఠశాలల్లోనూ ట్యాబ్లెట్ల పంపిణీ చేపడతామని చెప్పారు. సోలార్పవర్తో చార్జింగ్ అయ్యే ట్యాబ్లు పల్లె ప్రాంతాల్లో పంపిణీ చేస్తామన్నారు. బీఎంసీ పాఠశాలల్లో సేన మార్పులు చేసినప్పటినుంచి అక్కడ 90 శాతం ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆదిత్య నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, విద్యార్థులకు శ్రమ తగ్గించేందుకు ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని విద్యా శాఖ మంత్రి వినోద్ తావడే తెలిపారు. -
ఈఎన్టీ కౌన్సెలింగ్
నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దాంతో చాలా బలహీనంగా మారుతున్నాను. రోజువారీ పనులు కుదరడం లేదు. జలుబు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - రాకేశ్, గుంతకల్లు మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఇబ్బంది ఉందన్నారు. కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దాంతో ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు చోట్లా సమస్యలకు దారితీయవచ్చు. యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువ. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోండి. మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. నాకు ఇటీవలే ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ అయ్యింది. అప్పట్నుంచి మాట సరిగా రావడం లేదు. తినేప్పుడు, తాగేప్పుడు, మింగడంలోనూ ఇబ్బందిగా ఉంది. ఎప్పుడూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఉంది. దగ్గు కూడా వస్తోంది. దీనికి తగిన పరిష్కారం చూపండి. - పరంధాములు, నకిరేకల్లు మీకు స్వరపేటికలోని ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లలో కొన్నిసార్లు ‘వోకల్ ఫోల్డ్’పై ఒత్తిడి పడటానికీ ఆస్కారం ఉంటుంది. దాంతో మింగడం, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. ముందుగా మీరు ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ‘ల్యారింగోస్కోపీ లేదా ఎండోస్కోపీ’ వంటి పరీక్షలు చేయించుకోండి. స్పీచ్థెరపిస్ట్ను సంప్రదించి గొంతురావడానికి అవసరమైన ఎక్సర్సైజ్లను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ ఈసీ వినయకుమార్ హెచ్ఓడి అండ్ ఇఎన్టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్ -
వస్తోంది.. మరో ‘టచ్’ విప్లవం!
ప్రయోజనాలు చాలానే... స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లే కాదు.. అన్ని డిజిటల్ తెర(డిస్ప్లే)లూ 3డీ టచ్స్క్రీన్ల వల్ల మారిపోనున్నాయి. వినోదం, ఆర్కిటెక్చర్, ఫొటోగ్రఫి, గేమింగ్ వంటి రంగాల్లో కొత్త మార్పులు, పద్ధతులు వస్తాయి. మొన్న.. టిక్టిక్మంటూ టైప్ రైటర్ నిన్న.. టక్టక్మంటూ కీబోర్డు నేడు.. చడీచప్పుడూ లేని టచ్స్క్రీన్ మరి రేపు..? టచ్స్క్రీన్లపై బటన్లు మొలవబోతున్నాయి! 3డీ టచ్స్క్రీన్లు మరో టచ్ విప్లవం సృష్టించబోతున్నాయి!! కంప్యూటర్ అంటే.. మౌస్, క్లిక్కులు ఉండాల్సిందేనా? అవసరం లేదు.. స్క్రీన్పై టచ్ చేస్తే చాలు అంటూ యాపిల్ ఐపాడ్ ఐదేళ్ల క్రితం టచ్ విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కించింది. తొలుత బటన్లు పోయి టచ్స్క్రీన్లు వచ్చాయి. మౌస్ క్లిక్కుల స్థానంలో టచ్లు చేరాయి. ఈ కోవలోనే మరో ట్యాబ్లెట్ విప్లవం రాబోతోంది. టచ్స్క్రీన్పై బటన్లు మొలుస్తాయి. బటన్లు నొక్కుతూ అక్షరాలు టైప్ చేసుకోవచ్చు. అవసరం తీరగానే బటన్లు మాయమవుతాయి. ట్యాబ్లెట్లకు 3డీ టచ్స్క్రీన్లను జోడిస్తే జరిగే అద్భుతాలు ఇవి. సమీప భవిష్యత్తులో ఈ 3డీ టచ్స్క్రీన్ టెక్నాలజీతో డిజిటల్ తెర(డిస్ప్లే)ల రూపురేఖలూ మారిపోనున్నాయి. పిక్సెల్స్ నుంచి బటన్లు... మొబైల్ఫోన్ టీవీ రిమోట్ అవుతుంది. వీడియోగేమ్ కంట్రోలర్గానూ మారుతుంది. తిరిగి మొబైల్ఫోన్ అవతారమెత్తుతుంది. ఇంటర్ఫేస్ల మార్పుతో ఇలా 3డీ తాకే తెరలు రూపుమారుస్తాయి. టాక్టస్ టెక్నాలజీ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ‘మార్ఫింగ్ టచ్స్క్రీన్’ను తీసుకు వస్తోంది. ‘ఫోరమ్’ పేరుతో ఐపాడ్ మినీకి ఉపయోగపడే ఓ 3డీ టచ్ స్క్రీన్ను ఈ కంపెనీ తయారు చేసింది. ఐపాడ్ మినీకి సరిపోయే ఫోరమ్ 3డీ టచ్స్క్రీన్ కేస్ ధర సుమారు రూ.9 వేలు. టచ్ చేసినప్పుడు కలిగే ఒత్తిడి ఆధారంగానే ఈ టచ్స్క్రీన్ పనిచేస్తుంది. దీనికి ఎలాంటి అదనపు విద్యుత్ అవసరం లేదు. 3డీ తెర.. ఎలా సాధ్యం? 3డీ టచ్స్క్రీన్పై సమాచారాన్ని ప్రదర్శించడం, ప్రసారం చేయడం, ఫిల్టర్ చేయడం, లైన్లు, కాలమ్స్గా విభజించడం, వ్యాఖ్యలు రాయడం వంటివి ‘డైనమిక్ బార్స్’ వల్ల సాధ్యం అవుతాయి. పొడవాటి ట్యూబ్లా ఉండే వీటిలో ప్రత్యేక ద్రవం ఉంటుంది. ఇవి కాంతి, ఒత్తిడి ఆధారంగా వాటంతట అవే యాక్టివేట్ అవుతాయి. ద్రవం కదలికలకు అనుగుణంగా బటన్లు పనిచేస్తాయి. వీటితో కీబోర్డు మాదిరిగా టచ్స్క్రీన్పై ఓ ‘డైనమిక్ బార్ చార్టు’ ఆవిష్కృతం అవుతుంది. ఒక్కో బటన్ను నొక్కొచ్చు. పైకి లాగొచ్చు. రకరకాలుగా టచ్ చేయడం ద్వారా రకరకాల కమాండ్లు ఇవ్వొచ్చు. అవసరం లేనప్పుడు ఇవి ఆటోమేటిక్గా లోపలికి వెళ్లిపోతాయి. ఈ టెక్నాలజీతో టచ్స్క్రీన్ల బరువు, సైజేమీ పెరగకపోవడం అసలు విశేషం. అలాగే ఏ కంప్యూటర్ తెరనైనా 3డీతెరగా మార్చాలంటే.. అది ‘షేప్క్లిప్’ అనే టూల్స్ వల్ల సాధ్యం అవుతుంది. తెర నుంచి వెలువడే కాంతిని బట్టి.. దానిపైన ఉండే స్థలంలో ఈ క్లిప్లు నియంత్రణతో పనిచేస్తాయి. -
టాబ్లెట్ భాగ్య
దేశంలోనే తొలిసారిగా రైతుల ముంగిట్లోకి టెక్నాలజీ ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే దిశగా వారికి టాబ్లెట్లను అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. శనివారమిక్కడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ-ట్యాబ్లను సిద్ధరామయ్య ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రైతుల ముంగిట్లోకి టెక్నాలజీని తీసుకెళ్లేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రయోగాత్మకంగా బాగల్కోట, విజయపుర జిల్లాలోని 1,500గ్రామాల్లోని రైతులకు టాబ్లెట్లను అందజేయనున్నారు. టాబ్లెట్లలో ఏయే సౌకర్యాలు.... రైతులకు అందజేయనున్న ఈ టాబ్లెట్లో 8జీబీ మెమొరీ, 1జీబీ ర్యామ్, వైఫై, అత్యాధునిక కెమెరా సౌకర్యాలను పొందుపరిచారు. టాబ్లెట్లకు నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్టెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా మూడు నెలల పాటు టాబ్లెట్కు ఎయిర్టెల్ సంస్థ ఉచిత డాటా సౌకర్యాన్ని అందించనుంది. మూడు నెలల అనంతరం రైతులు ఇంటర్నెట్ సౌకర్యం కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ టాబ్లెట్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని వివరాలను రైతులు తెలుసుకోవచ్చు. ఏయే పంటలకు ఎలాంటి రసాయనాలు వాడాలి, వాతావరణ పరిస్థితులు, వర్ష సూచనలు, ఏయే పంటలకు ఎలాంటి చీడలు పట్టే అవకాశం ఉంది? వాటి నివారణ మార్గాలేంటి తదితర అన్ని వివరాలను ఈ టాబ్లెట్లో పొందుపరిచారు. టాబ్లెట్ నుంచే సహాయవాణి కేంద్రానికి సమాచారం.... ఈటాబ్లెట్లో ఏర్పాటు చేసిన ఓ బటన్ను ప్రెస్ చేస్తే చాలు రైతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయవాణి కేంద్రానికి సందేశం వెళుతుంది. ఈ టాబ్లెట్లోని కెమెరా సహాయంతో పంట పరిస్థితిని ఫొటోలు తీసి సహాయవాణి కేంద్రానికి పంపవచ్చు. అనంతరం సహాయవాణి కేంద్రంలోని వ్యవసాయ రంగ నిపుణులు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను అందజేస్తారు. అంతేకాదు అవసరమైతే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని స్వయంగా సందర్శించి పంటకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేస్తారు. అత్యాధునిక టెక్నాలజీని చేరువ చేసేలా : ఎస్.ఆర్.పాటిల్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ మాట్లాడుతూ....అత్యాధునిక టెక్నాలజీని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సైతం చేరువ చేసేలా దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ పధకాన్ని రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని రెండుజిల్లాలోని 1,500 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించామని, ఈ పథకం సత్ఫలితాలను ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. -
లెనవూ బడ్జెట్ ట్యాబ్లెట్...
చైనీస్ కంప్యూటర్ తయారీ దిగ్గజం లెనవూ తాజాగా సరికొత్త ట్యాబ్లెట్ ఒకదాన్ని విడుదల చేసింది. శక్తిమంతమైన ఫీచర్లున్నప్పటికీ ధర అందుబాటులోనే ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మైక్రోప్రాసెసర్ విషయాన్నే తీసుకుంటే దీంట్లో 1.3 గిగాహెర్ట్జ్ క్లాక్స్పీడ్తో పనిచేసే క్వాడ్కోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. దీనికితోడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్క్యాట్ 4.4, అత్యాధునిక డాల్బీ ఆడియోలు ఉండటం విశేషం. ఫైళ్లను సులువుగా ట్రాన్స్ఫర్ చేసేందుకు, ట్యాబ్లెట్ వేగాన్ని పెంచేందుకు, కాంటాక్ట్ల సింకింగ్ కోసం లెనవూ డూయిట్ ఆప్స్ను అందుబాటులో ఉంచారు. స్క్రీన్ సైజు ఏడు అంగుళాలు కాగా, రెజల్యూషన్ 1024 బై 600గా ఉంది. ఫైవ్ పాయింట్ టచ్ స్క్రీన్, ఒక గిగాబైట్ ర్యామ్, 8జీబీ ప్రధాన మెమరీ దీంట్లోని అదనపు ఫీచర్లు. బ్యాటరీ 3450 ఏంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంది. అయితే... రూ.4999లకే లభించే ఈ ట్యాబ్లెట్లో సెల్ఫీ కెమెరా ఒక్కటే ఉండటం అది కూడా 0.3 ఎంపీ రెజల్యూషన్ మాత్రమే కలిగి ఉండటం కొంత నిరాశ కలిగించే అంశం. -
అత్యంత పలుచటి ట్యాబ్లెట్...
కేవలం ఆరు మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే అత్యంత పలుచటి ట్యాబ్లెట్ను డెల్ కంపెనీ వెన్యూ 87840 పేరుతో విడుదల చేసింది. అమెరికాలో దాదాపు రూ.24,500లకు లభ్యమవుతున్న ఈ ట్యాబ్లెట్ ఇతర దేశాల్లో లభ్యమవుతున్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కావల్సి ఉంది. ఇంటెల్ సహకారంతో నిర్మించిన ఈ లేటెస్ట్ గాడ్జెట్లో ఏకంగా 2.3 గిగాహెర్ట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ను ఉపయోగించడం విశేషం. డెస్క్టాప్ పీసీ సామర్థ్యానకి ఇది అతిదగ్గరగా ఉంటుంది. దీంతోపాటు పవర్ వీఆర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, రెండు గిగాబైట్ల ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ సులువు అవుతుంది. గ్రాఫిక్స్ మోతాదు ఎక్కువగా ఉండే గేమ్స్ను కూడా అడుకోవచ్చు. దీంట్లో ఎనిమిది మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరాను ఉపయోగించారు. ఇంటెల్ రియల్సెన్స్ ’త్రీడీ స్నాప్షాట్’ ఫొటోగ్రఫీ సొల్యూషన్తో ఫొటోలో మరింత స్పష్టంగా, డెప్త్ కలిగి ఉంటాయి. మెమరీ విషయానికొస్తే డెల్ వెన్యూ 8లో 16 జీబీల బిల్ట్ ఇన్ స్టోరేజీ ఉంటుంది. మైక్రోఎస్డీకార్డు ద్వారా దీన్ని మరింత పెంచుకోవచ్చు కూడా. స్క్రీన్సైజు 8.4 అంగుళాలు కాగా, రెజల్యూషన్ 2560 బై 1480 వరకూ ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్క్యాట్ను ఉపయోగించారు దీంట్లో. -
మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త త్రీజీ కాలింగ్ ట్యాబ్
దేశీ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ తాజాగా మరో ట్యాబ్లెట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఏడు అంగుళాల స్క్రీన్సైజుతో వస్తున్న ఈ ట్యాబ్ పీ470లో తెలుగుతోపాటు 21 భారతీయ భాషలకు సపోర్ట్ ఉండటం విశేషం. అంటే మనకు నచ్చిన ప్రాంతీయ భాషలో మెయిళ్లు, సోషల్ నెట్వర్కింగ్ పోస్టింగ్స్ సులువుగా చేసుకోవచ్చునన్నమాట. శక్తిమంతమైన 1.3 గిగాహెర్ట్జ్ డ్యుయెల్కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. రెండు సిమ్ల ద్వారా ఫోన్, డేటా అందుకునే సౌకర్యముంది దీంట్లో. ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తూనే 3200 ఎంఏహెచ్ బ్యాటరీని వాడటం ద్వారా అత్యధిక టాక్టైమ్, లేదా స్టాండ్బై టైమ్ లభించే అవకాశమేర్పడింది,. కంపెనీ అంచనాల ప్రకారం బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 11 గంటల టాక్టైమ్, 158 గంటల స్టాండ్బై టైమ్ లభిస్తుంది. మెమరీ విషయానికి వస్తే దీంట్లో ర్యామ్ 1 జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజీ 8 జీబీల దాకా ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. చివరగా ఈ ట్యాబ్లెట్లో ప్రధాన కెమెరా ఐదు, సెల్ఫీ కెమెరా 0.3 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్ కలిగి ఉన్నాయి. ధర రూ.6999 మాత్రమే. -
లెనవూ వాయిస్ టాబ్లెట్ ఏ8-50...
ఎనిమిది అంగుళాల స్క్రీన్ సైజుతో చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లెనవూ తాజాగా ఓ టాబ్లెట్ను విడుదల చేసింది. ఓ మోస్తరు ఫీచర్లతో మాత్రమే వస్తున్న ఈ సరికొత్త టాబ్లెట్ ధర మాత్రం రూ.17,999గా నిర్ణయించారు. సాధారణంగా టాబ్లెట్ స్క్రీన్ సైజు ఏడు, 9 అంగుళాలు ఉంటే ఇది ఈ రెండింటికీ మధ్యస్థంగా 8 అంగుళాలు ఉంది. ప్రాసెసర్ వేగం కూడా 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్కోర్. ర్యామ్ ఒక జీబీ ఉండగా ప్రధాన మెమరీ 16 జీబీ వరకూ ఉంది. మైక్రోఎస్డీకార్డు ద్వారా మరో 32 జీబీల మెమరీని యాడ్ చేసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ కాబట్టి... రీఛార్జిల మధ్య ఎక్కువ సమయం ఉంటుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నప్పటికీ త్వరలోనే ఉచితంగా కిట్క్యాట్ ఓఎస్కు అప్గ్రేడ్ చేస్తామని కంపెనీ చెబుతోంది. లెనవూ ఏ8-50లో 5 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. -
యో అంటే 6 కోట్లు
కో అంటే కోటి తెలుసు గానీ యో అంటే ఆరు కోట్లేంటా అనుకుంటున్నారా? మరేమీ లేదు.. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల రాకతో కొత్త కొత్త యాప్లు (అప్లికేషన్) వెల్లువలా వస్తున్నాయి. అలాంటిదే యో అనే యాప్ కూడా. దీనితో ప్రయోజనం ఏమిటని గట్టిగా అడిగితే..ఏమీ లేదు. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మన మిత్రులకు యో అన్న ఒకే ఒక్క పదాన్ని ... టెక్ట్స్, ఆడియో రూపంలో పంపించవచ్చు. దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటని మళ్లీ అడిగితే..ఏమీ లేదు. రకరకాల సందర్భాలకు తగినట్లుగా ఈ యో అన్న పదం రకరకాల అర్థాల్లో ధ్వనిస్తుందన్నది దీన్ని తయారు చేసిన ఆర్ ఆర్బెల్ మాట. ఒక పెద్ద సంస్థలో భారీ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఆర్బెల్ దీన్ని తయారు చేశాడు. సరే, ఇంతకీ మరి ఆరు కోట్ల సంగతేంటంటే.. ఈ యాప్ తెగ నచ్చేసి, దీనికి బోలెడంత భవిష్యత్తు ఉందంటూ అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు దీన్ని తయారు చేసిన ఆర్బెల్ సంస్థలో ఇంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారు. నిజంగానే దీనికి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటోంది. అదీ విషయం. ఇలాంటి వాటిల్లోనూ ఇన్వెస్ట్ చేసే వారున్నారు కాబట్టి .. మీ దగ్గర వెరైటీ యాప్ ఐడియాలు ఉంటే కోట్లు పట్టేసేందుకు మీరూ ప్రయత్నించవచ్చు. -
త్వరలో గూగుల్ ట్యాబ్ ‘ట్యాంగో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ శక్తివంతమైన ట్యాబ్లెట్ పీసీ ‘ట్యాంగో’ ఈ ఏడాది చివరికల్లా వస్తోంది. ఎన్విడియా టెగ్రా కె1 ప్రాసెసర్తో రూపుదిద్దుకుంటోంది. 7 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, వైఫై, 4జీ ఇతర విశేషాలు. నిర్మాణాలు, రోడ్లు, కదిలే వస్తువులు, వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నారు, పరిమాణం.. ఇలా పరిసరాలను పూర్తిగా అర్థం చేసుకునేలా ట్యాబ్లెట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఫర్నీచర్ దుకాణానికి వెళ్లే ముందు ఇంటి లోపలి పరిసరాలను కెమెరాలో బంధిస్తే చాలు. దుకాణానికి వెళ్లిన తర్వాత అక్కడి ఫర్నీచర్ మీ ఇంట్లో ఎంతమేర స్థలాన్ని ఆక్రమిస్తుందో ఇట్టే చెప్పేస్తుంది. పరిసరాలను 3డీలో స్కాన్ చేసేందుకు వీలుగా మోషన్ ట్రాకింగ్ కెమెరాలు మూడింటిని వెనుకవైపు అమరుస్తున్నారు. సెకనుకు 2.5 లక్షలకుపైగా 3డీ కొలతలను ఇవ్వగలదు. మొబైల్ 3డీ సెన్సింగ్ రంగంలో పనిచేసేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. తొమ్మిది దేశాలకు చెందిన యూనివర్సిటీలు, పరిశోధన శాలలు, పరిశ్రమ నిపుణులతో కూడిన బృందం దీని అభివృద్ధిలో నిమగ్నమయ్యారు. ధర రూ.60 వేలు ఉండే అవకాశం ఉంది. -
ఫోన్.. ల్యాప్టాప్.. ట్యాబ్లెట్
అసూస్ హైబ్రిడ్ ల్యాప్టాప్ తైవాన్కి చెందిన టెక్నాలజీ దిగ్గజం అసూస్ కొత్తగా ‘ట్రాన్స్ఫార్మర్ బుక్ ఫైవ్’ పేరిట హైబ్రిడ్ ల్యాప్టాప్ను ఆవిష్కరించింది. ల్యాప్టాప్, ట్యాబ్లెట్ పీసీ, ఫోన్లను కలగలిపి మొత్తం అయిదు విధాలుగా ఉపయోగించుకునేలా దీన్ని కంపెనీ తీర్చిదిద్దింది. ట్యాబ్లెట్ తరహా ఉపయోగించేటప్పుడు ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లతో ఇది పనిచేస్తుంది. ఇందులోనే అయిదు అంగుళాల స్మార్ట్ఫోన్ను అసూస్ పొందుపర్చింది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. 3జీ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ వేగంగా బ్రౌజింగ్ స్పీడ్ అందిస్తుంది. పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు, మీడియా సమక్షంలో అసూస్ చీఫ్ జానీ షిహ్ దీన్ని ఆవిష్కరించారు. -
విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ మరో ట్యాబ్లెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓమ్ని 10 ట్యాబ్లెట్ను రూపొందించింది. ఇందుకోసం హెచ్పీ, పియర్సన్ కంపెనీలతో చేతులు కలిపింది. ధర రూ.29,999 ఉంది. నెలకు రూ.2,990 చొప్పున 12 నెలల వాయిదాల్లో కొనుగోలు చేయవచ్చు. టెక్నికల్, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ల కోసం ఉద్దేశించిన ఈ ఆఫర్ జూన్ 15 వరకు ఉంటుంది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్తో ట్యాబ్లెట్ పనిచేస్తుంది. 10.1 అంగుళాల స్క్రీన్, ఇంటెల్ ఆటమ్ జెడ్3000 ప్రాసెసర్, 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, గొరిల్లా గ్లాస్ 3, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ, 8.5 గంటల బ్యాటరీ బ్యాకప్ దీని ప్రత్యేకతలు. మార్కె ట్లో ఈ ట్యాబ్లెట్ సంచలనం సృష్టిస్తుందని మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ (పబ్లిక్ సెక్టార్, ఎడ్యుకేషన్) అరుణ్ రాజమణి ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులకు అవసరమయ్యే ప్రీలోడెడ్ కంటెంట్, అప్లికేషన్లను ఇందులో పొందుపరిచినట్టు చెప్పారు. 6-12వ తరగతి విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏసర్ ఐకానియా డబ్ల్యూ4-820 అనే మోడల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ధర రూ.24,999. -
కొత్త సరుకు
క్యూప్యాడ్ ఈ704 దేశీయ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా తాజాగా క్యూప్యాడ్ ఈ704 పేరుతో ఓ టాబ్లెట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దాదాపు రూ.9999 ఖరీదు చేసే ఈ టాబ్లెట్ను ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్, కంపెనీలను దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేశారు. వీడియో, వాయిస్ కాల్స్ రెండింటినీ సపోర్ట్ చేసే ఈ డ్యుయెల్ సిమ్ టాబ్లెట్ 1.2 క్వాడ్కోర్ బ్రాడ్కామ్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఏడు అంగుళాల ఐపీఎస్ ఫుల్ డిస్ప్లే స్క్రీన్, 1024 బై 600 రెజల్యూషన్ దీని సొంతం. ఒక గిగాబైట్ ర్యామ్, నాలుగు గిగాబైట్ల ఇంటర్నల్ స్టోరేజీ (మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు)లతో వచ్చే క్యూప్యాడ్లో ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించారు. గేమ్స్ కోసం వీడియోకోర్ మల్టీమీడియా టెక్నాలజీని వాడారు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్ కాగా, ఫ్రంట్ కెమెరాది 0.2 ఎంపీ. బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 4.4 కిట్క్యాట్తో...గెలాక్సీ ఏస్ స్టైల్ ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ 4.4 కిట్క్యాట్తో పనిచేసే సరికొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఏస్ స్టైల్ను సాంసంగ్ అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటగా జర్మనీలో విడుదలయ్యే ఈ ఫోన్ భారత్లో ఎప్పుడు విడుదలవుతుందన్నది స్పష్టం కావాల్సి ఉంది. నాలుగు అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే స్క్రీన్తో వచ్చే ఏస్ స్టైల్ 1.2 గిగాహెర్ట్జ్ డ్యుయెల్కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ర్యామ్ కేవలం 512 మెగాబైట్స్ మాత్రమే ఉండటం గమనార్హం. మైక్రోఎస్డీ కార్డు ద్వారా 64 గిగాబైట్ల సమాచారాన్ని స్టోర్ చేసుకునే అవకాశముంటుంది. ఇంటర్నల్ స్టోరేజీ 4 గిగాబైట్లు మాత్రమే. బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్లతోపాటు త్రీజీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఛాట్ఆన్ ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీసు అప్లికేషన్తో కలిపి వచ్చే ఏస్ స్టైల్ క్రీమ్వైట్, గ్రే రంగుల్లో లభ్యం కానుంది. ధర ఎంతన్నది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ రూ.16,500 నుంచి రూ.25,000 మధ్యలో ఉండవచ్చునని అంచనా. -
కొత్త సరుకు...
మతిమరపు రాయుళ్ల కోసం... స్మార్ట్ఫోన్, కళ్లజోడు, పర్స్... ఇలా ముఖ్యమైన వస్తువులను ఎక్కడపడితే అక్కడ మరచిపోయే వాళ్లు మనలో చాలామంది ఉంటారు. ఇలాంటివారి కోసమే తయారైన ఎలక్ట్రానిక్ పరికరం బ్రింగర్! మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వస్తువులకు చిన్న ట్యాగ్ను తగిలిస్తే చాలు.. అన్ని వస్తువులు ఉన్నాయా? లేదా? అన్నది చెక్ చేసి దేన్ని మరచిపోయారో మీకు గుర్తు చేస్తుంది. బ్లూ టూత్ ఆధారంగా పనిచేసే ఈ గాడ్జెట్ కారులో లైటర్ స్టాండ్లో ఇమిడిపోతుంది. కారెక్కగానే... ట్యాగ్స్ ఉన్న పరికరాలన్నీ మీతోనే ఉన్నాయా? లేదా? అన్నది చూస్తుందన్నమాట. ప్రస్తుతానికి దీన్ని కారు ఉన్నవారు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. భవిష్యత్తులో ఇతరులకూ పనికొచ్చేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిల్లల కోసం ఎడ్డీ... స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టాబ్లెట్ను మెటిస్ లెర్నింగ్ కంపెనీ ఇటీవలే భారత్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ టాబ్లెట్ ఏకంగా 1.6 గిగాహెర్ట్జ్ డ్యుయల్కోర్ ప్రాసెసర్పై నడుస్తూండటం విశేషం. అంతేకాదు... ఏడు అంగుళాల స్క్రీన్సైజ్తో లభించే ఎడ్డీలో ఒక గిగాబైట్ ర్యామ్, ఎనిమిది గిగాబైట్ల మెమరీ ఏర్పాటు చేశారు. రెండు మెగాపిక్సెళ్ల బ్యాక్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా దీని సొంతం. స్కూల్ కరిక్యులమ్కు అనుగుణమైన ప్రీలోడెడ్ ఆప్స్, ఆటల ద్వారా కొత్త విషయాలను నేర్పే టెక్నిక్స్ కూడా దీంట్లో ఉన్నాయని, తద్వారా పిల్లలు వేగంగా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారని కంపెనీ తెలిపింది. పిల్లల చేతిలోంచి జారిపడ్డా ఇబ్బంది లేకుండా టాబ్లెట్ చుట్టూ రబ్బర్ ఫ్రేమ్ ఒకటి ఏర్పాటు చేశారు. రెండు నుంచి 10 ఏళ్ల వయసు మధ్యవారి కోసం ఉద్దేశించిన ఎడ్డీలోని కంటెంట్ను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నియంత్రించే వీలుంది. రెండేళ్ల పసివాళ్లు కూడా రోజుకు రెండు గంటల వరకూ టాబ్లెట్ను వాడినా కంటికి ఇబ్బంది లేని స్క్రీన్, రెజల్యూషన్ను ఉపయోగించామని కంపెనీ తెలిపింది. ధర దాదాపు రూ.10వేలు. మరిన్ని వివరాల కోసం www.eddytablet.com/ వెబ్సైట్ను సందర్శించవచ్చు. జియోనీ జీ4 ఫాబ్లెట్... చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోనీ తాజాగా జీప్యాడ్4 పేరుతో ఓ శక్తిమంతమైన స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 5.7 అంగుళాల స్క్రీన్సైజ్తో లభించే ఈ స్మార్ట్ఫోన్ 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం 7.95 మిల్లీమీటర్ల మందంతో ఉండే అల్యూమినియం యునీబాడీ జీప్యాడ్ మరో ప్రత్యేకత. 1280 బై 720 ఫుల్హెచ్డీ డిస్ప్లేతో చిత్రం స్పష్టతపై ఢోకా ఉండదు. అప్లికేషన్లు లాంచ్ చేసేందుకు, ఇతర కర్యాకలాపాల కోసం సంజ్ఞలు చేస్తే సరిపోయేలా దీంట్లో గెస్చర్ కంట్రోల్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేశారు. ఆటోఫోకస్, ఎల్ఈడీ ఫ్లాష్లతో కూడిన 13 మెగాపిక్సెళ్ల బ్యాక్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 3200 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కు కొన్ని మార్పులు చేర్పులు చేసిన ఆమిగో ఓఎస్ను దీంట్లో ఉపయోగించారు. ఫలితంగా ఫేస్బ్యూటీ ఎఫెక్ట్స్, హ్యాండ్స్ఫ్రీ ఫొటో, గెస్చర్ రికగ్నిషన్, మోషన్ సెన్సింగ్, పనోరమా మోడ్ (హారిజాంటల్, వెర్టికల్ కూడా) ఫేస్ డిటెక్షన్, టచ్ ఫోకస్ వంటి అదనపు హంగులు చేరాయి. డిజిటల్ థియేటర్ సిస్టమ్ను కూడా కలిపి ఉంచిన ఈ స్మార్ట్ఫోన్ ఖరీదు రూ.18999. -
స్మార్ట్ఫోన్నుపరుగెత్తించండి!
మీ స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్ నత్తనడకన నడుస్తోందా? అప్లికేషన్లు మార్చేందుకు, హోమ్స్క్రీన్ వేగంగా వచ్చేందుకు మొరాయిస్తోందా? తాజా ఓ.ఎస్ ఉన్నా, ప్రాసెసర్ వేగం బాగున్నా అదే తీరా? అయితే మీ గాడ్జెట్ను గాడిలో పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఐదు చిట్కాలతో వాటిని స్పీడప్చేసేయండి! బరువు దించుకోండి... అప్లికేషన్ల సంఖ్య పెరిగిన కొద్దీ స్మార్ట్ఫోన్/టాబ్లెట్ల వేగంలో తేడాలొచ్చేస్తాయి. మ్యూజిక్, ఫొటో, వీడియోలతో మెమరీ నింపేసే వారికైతే ఈ ఇబ్బంది ఇంకా ఎక్కువ. అందుకే అసలు వాడని.. అవసరం లేవనుకున్న అప్లికేషన్లను తొలగించండి... లేదంటే డిజేబుల్ అయినా చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్లి ఆప్స్మెనూను తెరిచి తొలగించాల్సిన అప్లికేషన్ను ఎంచుకుంటే సరి! కష్టపడి డౌన్లోడ్ చేసుకున్న వాటిని తొలగించడం ఇష్టం లేకపోతే గూగుల్డ్రైవ్, డ్రాప్బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజీ సర్వీసుల్లోనైనా భద్రపరచుకోండి. మీ స్మార్ట్ఫోన్/టాబ్లెట్లో ఎస్డీకార్డు సౌకర్యముంటే... అప్లికేషన్లను దాంట్లోకి మార్చుకున్నా సరిపోతుంది. ఇంకో విషయం... ఫోన్తోపాటు వచ్చే అప్లికేషన్లు కొన్ని అన్ఇన్స్టాల్ కావు. వాటిని డిజేబుల్ చేయడం ఉత్తమం. లైవ్ వాల్పేపర్లను నియంత్రించండి లైవ్ వాల్పేపర్లు, విడ్జెట్లతోనూ బ్యాటరీ మందగిస్తుంది. సామర్థ్యం దెబ్బతింటుంది. డేటా ఎక్కువగా వాడుకునే ఫేస్బుక్ వంటివాటితో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. తొలగించాలనుకునే విడ్జెట్ను కొద్దిసేపు నొక్కి ఉంచి స్క్రీన్పైభాగంలోకి నెట్టేస్తే అది తొలగిపోతుందన్న విషయం తెలిసిందే. లైవ్ వాల్పేపర్లను కూడా ఇదేలా నియంత్రించుకోవచ్చు. కాషేతోనూ ఇబ్బందే... కంప్యూటర్ల మాదిరిగానే స్మార్ట్ఫోన్/టాబ్లెట్లలోనూ సమయంతోపాటు క్యాషే మెమరీ పేరుకుపోతూంటుంది. దీని ప్రభావం గాడ్జెట్ పనితీరుపై పడుతుంది. ఆప్స్మెనూకి వెళ్లి క్యాషే ఒక్కోదాన్ని తొలగించుకోవచ్చు. లేదంటే ఆప్ క్యాషే క్లీనర్, క్లీన్మాస్టర్ వంటి ఫ్రీ అప్లికేషన్లతోనూ ఈ పనిచేయవచ్చు. సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోండి... ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్లను అప్డేట్ చేసుకోవడం ద్వారా స్మార్ట్ఫోన్ మరింత స్మార్ట్గా పనిచేసేలా చేయవచ్చు. ఈ అప్డేట్ల ద్వారా సెక్యూరిటీలోపాలను అధిగమించవచ్చు. ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవచ్చు. సెట్టింగ్స్లోని అబౌట్ ఫోన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని సిస్టమ్ అప్డేట్స్ బటన్ను నొక్కితే తాజా అప్డేట్లు డౌన్లోడ్ అవుతాయి. -
ఎక్స్పీసీ...ఆల్ ఇన్ వన్!
ఆఫీసుకెళితే కంప్యూటర్... ఆఫీసు పనులే ఇంట్లో చేసుకోవాలనుకుంటే... ల్యాప్టాప్. లేదంటే టాబ్లెట్. బంధు మిత్రులతో మాట్లాడుకోవాలంటే... స్మార్ట్ ఫోన్. ఆధునిక యుగంలో ఇదీ టెక్నాలజీ ట్రెండ్. ఇవేవీ లేకుండా... మీ చేతిలో ఇమిడిపోయే ఓ చిన్న గాడ్జెట్ అవసరాన్నిబట్టి తన రూపాన్ని, పనితీరును మార్చుకుంటే...? ఐసీఈ ఎక్స్పీసీ చేసేది కూడా అచ్చంగా ఇదే! సామర్థ్యం విషయంలో స్మార్ట్ఫోన్లకు, కంప్యూటర్లకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిపోతోంది. ఏకంగా 2.3 గిగాహెర్ట్జ్ క్లాక్స్పీడ్తో పనిచేసే ప్రాసెసర్లతో కూడిన స్మార్ట్ఫోన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. గిగాబైట్ల మెమరీ కూడా సిమ్కార్డు సైజుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ఆల్ ఇన్ వన్ మాడ్యులర్ పీసీ ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ ఐస్ ఎక్స్పీసీ. చూసేందుకు ఇది స్మార్ట్ఫోన్ సైజులోనే ఉంటుందిగానీ... కంప్యూటింగ్ సామర్థ్యం విషయంలో ల్యాప్టాప్, డెస్క్టాప్లకు ఏమాత్రం తీసిపోదు. ఏముంటాయి? ఎక్స్పీసీలో అత్యాధునిక ఎక్స్86 సీపీయూ ఉంటుంది. దీంతోపాటు రెండు నుంచి నాలుగు గిగాబైట్ల ర్యామ్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, కెమెరా, ఆక్సిలరోమీటర్, గైరో సెన్సర్ ఉంటాయి. అవసరాన్ని బట్టి 32 గిగాబైట్ల నుంచి 128 గిగాబైట్ల వరకూ మెమరీని పెంచుకోవచ్చు. వంద గ్రాముల బరువు కూడా చేయని ఈ మాడ్యులర్ పీసీని చిన్నచిన్న పరికరాల సాయంతో ఎక్కడైనా వాడుకోవచ్చు. డెస్క్టాప్ పీసీగా... ఎక్స్ప్యాడ్ అనే పరికరంలోకి దీన్ని జొప్పించాల్సి ఉంటుంది. ఎక్స్ప్యాడ్కు టీవీ మానిటర్ను, కీబోర్డును కలుపుకుని పీసీలా, లేదంటే ఆధునిక గేమింగ్ కన్సోల్గా మార్చుకోవచ్చు. టాబ్లెట్గా... చాలా సింపుల్. ఎక్స్ప్యాడ్ పేరుతో ఐసీఈ కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఎక్స్ప్యాడ్ను వాడాలి. 10.1 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ టాబ్లెట్ మానిటర్ వెనుకభాగంలో ఎక్స్పీసిని జొప్పించేందుకు ఒక ఏర్పాటు ఉంటుంది. ఎక్స్పీసిని ఈ స్లాట్లోకి జొప్పిస్తే చాలు. టచ్స్క్రీన్ టెక్నాలజీతో పనిచేసే టాబ్లెట్ రెడీ! ఎక్స్పీసీ కీబోర్డు, స్టాండ్ ఐసీఈ కంపెనీ అభివృద్ధి చేసిన మరో పరికరం కీబోర్డు. పీసీకైనా, టాబ్లెట్కైనా ఈ కీబోర్డు పనికొస్తుంది. కీబోర్డునే టాబ్లెట్ కోసం స్టాండ్గానూ వాడుకోవచ్చు. -
కార్మికుల పిల్లలకు ల్యాప్టాప్!
సాక్షి, ముంబై: కార్మికుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కార్మికుల పిల్లల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవారి పిల్లలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ‘మహారాష్ట్ర డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్’లో రిజిస్టర్ చేసుకున్న వారికి వీటిని అందజేయనున్నట్లు అధికారి వెల్లడించారు. కాగా, ట్యాబ్లెట్లను 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి అందజేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ (ఎస్ఎస్సీ)లో పాస్ అయిన విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేయనున్నారు. వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.7.86 కోట్లను వెచ్చించనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకం ద్వారా దాదాపు 5,700 మంది పిల్లలు లబ్ధిపొందనున్నారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులు మాట్లాడుతూ..‘సెకండరీ సెక్షన్లో 4,077 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,672 మంది ఎస్ఎస్సీ పరీక్షలో పాస్ అయ్యారు. ఈ ఏడాది నుంచే ఎలక్ట్రానిక్ సామగ్రిని పంపిణి చేయాలని నిశ్చయించాం. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లను కొనుగోలు చేయడానికి త్వరలో ఈ-టెండర్లను ఆహ్వానిస్తున్నాం..’ అని తెలిపారు. ట్యాబ్లెట్ల ధర రూ.7,000 ఉండగా ల్యాప్టాప్ల వెల రూ.30 వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కలిపి రూ.7.86 కోట్లు అవనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పిల్లలకు ల్యాప్టాప్, ట్యాబ్లెట్లను అందజేయడం ప్రశంసించాల్సిన విషయం అయినప్పటికీ వారికి శిక్షణ ఎవరిస్తారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు ఏక్నాథ్ మానే ప్రశ్నించారు. అంతేకాకుండా ఇంటర్నెట్కు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారని తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా టాబ్లెట్లు, ల్యాప్టాప్లు అంతగా ఉపయోగానికి రావన్నారు. కాగా ‘డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్’ కార్యదర్శి మధుకర్ గైక్వాడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.38 లక్షల మంది డొమెస్టిక్ వర్కర్లు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. నగరంలో వీరి సంఖ్య 20 వేలకు ఉందన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం పొందాలనుకునే విద్యార్థులకు తాము కూడా సహకరిస్తున్నామన్నారు. ఈ ఏడాదిలోనే వీటిని పంపిణీ చేస్తారని, అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇదిలా వుండగా డొమస్టిక్ వర్కర్లు స్కూల్ ద్వారా పొందిన బోనాఫైడ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఒక్కరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబానికి ట్యాబ్లెట్ లేదా ల్యాప్టాప్ ఇందులో ఏదో ఒక్కదానినిమాత్రమే అందజేయనున్నట్లు గైక్వాడ్ స్పష్టం చేశారు. -
పీసీ పోయి ట్యాబ్లెట్ వచ్చే !
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పీసీల అమ్మకాలు తగ్గుతున్నాయి.పెరుగుతున్న ట్యాబ్లెట్ల అమ్మకాలు పీసీలకు గ్రహణం పట్టిచ్చాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ -డిసెంబర్ కాలానికి 8.26 కోట్ల పీసీలు అమ్ముడయ్యాయని పేర్కొంది. 2012లో ఇదే కాలానికి అమ్ముడైన సంఖ్య(8.87 కోట్ల)తో పోల్చితే ఇది 7% తక్కువని పేర్కొంది. గతేడాది మొత్తం మీద 31.59 కోట్ల పీసీలు అమ్ముడయ్యాయి. 2012 అమ్మకాలతో పోల్చితే ఇది 10 శాతం తక్కువ. పీసీ మార్కెట్లో ఇవే అత్యంత అధ్వానమైన అమ్మకాలు. 2009లో కూడా ఇదే స్థాయి అమ్మకాలు జరిగాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలలో పీసీల విక్రయానికి ట్యాబ్లెట్లు గ్రహణం పట్టిచ్చాయి. వృద్ధి చెందుతున్న మార్కెట్లలో వినియోగదారులు కొనుగోలు చేసే తొలి కమ్యూనికేషన్ పరికరం స్మార్ట్ఫోన్. ఆ తర్వాత కొనుగోలు చేసే కంప్యూటింగ్ పరికరంగా ట్యాబ్లెట్లు నిలిచాయి. -
ట్యాబ్లెట్ క్రేజ్
ముంబై: ట్యాబ్లెట్ల క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ ఏడాది ట్యాబ్లెట్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా 42.7శాతం వృద్ధి చెంది 18.4 కోట్లకు పెరుగుతాయని గార్ట్నర్ తాజా నివేదిక వెల్లడించింది. అదే డెస్క్టాప్, నోట్బుక్ పీసీల విక్రయాలు 11 శాతం క్షీణించి 30.3 కోట్లకు చేరతాయని ఈ నివేదిక పేర్కొంది. ఇక మొబైల్ ఫోన్ల విక్రయాలు 4 శాతం వృద్ధితో 180 కోట్లకు పెరుగుతాయని వివరించింది. వృద్ధి పరంగా చూస్తే మొబైల్ ఫోన్ల విక్రయాలు 4 శాతం పెరుగుతుండగా, డెస్క్టాప్ పీసీల విక్రయాలు 11 శాతం పడిపోతున్నాయి. ట్యాబ్లెట్ల విక్రయాలు మాత్రం 42.7 శాతం పెరగడం విశేషమని గార్ట్నర్ నివేదిక అంటోంది. ఈ నివేదిక వెల్లడించిన మరికొన్ని అంశాలు.., ఈ ఏడాది పీసీలు, ట్యాబ్లెట్లు, మొబైల్స్ విక్రయాలు గతేడాది విక్రయాలతో పోల్చితే 4.5% వృద్ధితో 232 కోట్లకు పెరుగుతాయి. అన్ని కేటగిరీల్లో తక్కువ ధర ఉత్పత్తులకే డిమాండ్ బాగా ఉంటుంది. తక్కువ ధర ఉత్పత్తులకే డిమాండ్ బాగా ఉందనే విషయం ట్యాబ్లెట్ల విషయంలో రుజువైంది. 7 అంగుళాల ప్రీమియం ట్యాబ్లెట్ల ధరలు తగ్గడం కొనసాగుతోంది. కంటెంట్ వీక్షించడానికి చిన్న సైజ్ ట్యాబ్లెట్లకే వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న సైజ్ ట్యాబ్లెట్లకే వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మధ్య రకం స్మార్ట్ఫోన్లు, చౌక ధర ఆండ్రాయిడ్ ఫోన్ల విక్రయాలతో మొబైల్ మార్కెట్లో వృద్ధి పెరగనుంది. -
స్పాట్లైట్
ఎల్జీ జీ2 ప్రోస్: కొత్త డిజైన్, ఐ ఫోన్ 5, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 4, హెచ్టీసీల స్థాయి కాన్స్: పవర్, పెర్ఫార్మెన్స్ అన్నింటిలోనూ బెటర్ మాత్రమే. బెస్ట్ కాలేదు. బోటమ్ లైన్: గుడ్ ఫోన్, కొన్ని బలాలున్నాయి, బలహీనతలు కూడా. కిండ్లే ఫైర్ హెచ్డీఎక్స్ టాబ్లెట్ ప్రోస్: ఆండ్రాయిడ్ ఎస్, లైట్ వెయిట్, షార్ప్ డిస్ప్లే కాన్స్: ఇతర టాబ్లెట్లతో పోల్చినప్పుడు కొంత వెనుకబడి ఉంది. బోటమ్ లైన్: ఐప్యాడ్ మినీ, నెక్సస్7 లతో పోలిక ఉంది. పోరాడుతుంది. గూగుల్సెర్చ్ గజినీలను చేస్తోంది! సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నెటిజన్లను మతిమరపు రాయుళ్లుగా చేస్తోంది... అంటున్నారు అధ్యయనకర్తలు. ఇంటర్నెట్ను బాగా వినియోగించే రెండువేల మంది యువతీ యువకులపై చేసిన పరిశోధన ఫలితంగా ఈ విషయం తేలిందట. వీరు ఏ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికైనా గూగుల్ ఆశ్రయించడం వల్ల క్రమంగా గజినీలు అవుతున్నారని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు. గూగుల్ అందుబాటులో ఉండటంతో ఏదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అనే భావనకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ట్విన్ టవర్స్పై తీవ్రవాద దాడులు ఎప్పుడు జరిగాయి, బెర్లిన్ వాల్ ఎప్పుడు కూలింది.. వంటి చారిత్రక ఘటనలను కూడా చాలామంది యువతీ యువకులు మరచిపోయారని, అవసరమైనప్పుడు గూగుల్ను సంప్రదిస్తున్నారని, ఫలితంగా వారిని మతిమరపు ఆవహిస్తోందని అధ్యయనకర్తలు విశ్లేషించారు. డెల్ నుంచి కొత్త టాబ్లెట్లు వెన్యూ 7 వెన్యూ 8 : వెన్యూ - 7 (ఏడు అంగుళాలు) వెన్యూ - 8 (ఎనిమిది అంగుళాలు) టాబ్లెట్లు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై పనిచేస్తాయి. హై డెఫినిషన్ క్వాలిటీతో ఎల్సీడీ స్క్రీన్తో ఉంటుంది. వెన్యూ - 7 ధర రూ.9500. వెన్యూ - 8 ధర రూ.11,500. వెన్యూ - 8 ప్రో, వెన్యూ - 11 ప్రో: విండోస్ - 8.1 ఆపరేటింగ్ సిస్టమ్స్తో పనిచేస్తాయి. డే-లాంగ్ బ్యాటరీ లైఫ్ ఈ టాబ్లెట్ల ప్రత్యేకత. వీటి ధరలు వరసగా రూ.19,000, రూ.32,000 -
అన్నాదురై ఆటో ఎక్కితే.. వైఫై ఫ్రీ!
ప్రయాణంలో చదవడానికి న్యూస్పేపర్లు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడానికి వైఫై కనెక్షన్, సెల్ఫోన్చార్జింగ్ సదుపాయం, ఏ నెట్వర్క్ మొబైల్ కైనా రీచార్జ్ కార్డులు, వెబ్ సర్ఫింగ్ కోసం ఒక ట్యాట్లెట్... ఇన్ని సదుపాయాలున్నాయంటే అది ఏ విమానమో, ఏసీ టూ టైర్ రైలు బోగీనో అయ్యుంటుందనుకొంటున్నారా... అదేమీ కాదు అన్నాదురై ఆటోలో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయి. విమానాలను, వోల్వో బస్సులను తలదన్నే ఏర్పాట్లతో ప్రయాణికులను ఆకట్టుకొంటున్నాడు ఈ ఆటోడ్రైవర్. అధునాతన సదుపాయాలను ఉచితంగా అందిస్తున్న ఇతడి వివరాలు ఇవి.. చెన్నైలోని ఒక ఐటీ సెజ్ చుట్టుపక్కల ఆటో నడుపుతుంటాడు అన్నాదురై. ఇతడి ఆటో ఎక్కేవారిలో ఎక్కువమంది ఐటీ ప్రొఫెషనల్స్. వారిని దృష్టిలో ఉంచుకొని తన ఆటోలో ఈ సదుపాయాలను అందుబాటులో ఉంచాడు అన్నాదురై. ఇతడి ఆటో ఎక్కగానే స్మార్ట్ఫోన్ లేదా లాప్టాప్ చేతిలో ఉంటే వైఫై కనెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ లేనివారి కోసం ప్రత్యేకంగా ఒక టాబ్లెట్ను ఏర్పాటు చేశాడు అన్నాదురై. బ్రౌజింగ్ మీద ఆసక్తి లేకపోతే రీడింగ్ చేయొచ్చు. ప్రముఖ ఆంగ్ల వార్తపత్రికలన్నీ అన్నాదురై ఆటోలో అందుబాటులో ఉంటాయి. మ్యాగ్జిన్లు, న్యూస్ పేపర్లు కలిసి 35 రకాల పత్రికలు ఉంటాయి అందులో! ఇంతేకాదు.. అర్జెంట్గా ఫోన్ రీచార్జ్ అవసరమైతే అన్నాదురైని సంప్రదిస్తే వివిధ ప్యాకేజ్ల రూపంలోని మొబైల్రీచార్జ్ సేవలు అందిస్తాడు. ఇంకా డీటీహెచ్ రీచార్జ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ సౌకర్యాల విషయంలో ఎటువంటి అదనపు చార్జీలు వేయడు అన్నాదురై. కేవలం తన, ప్రయాణికుల సంతృప్తి కోసమే ఈ సదుపాయాలన్నింటినీ సమకూరుస్తున్నట్లు అన్నాదురై చెబుతాడు. వీటి విషయంలో ఇతడు బాగానే ఖర్చు చేస్తున్నాడు. మ్యాగ్జైన్లకు, న్యూస్ పేపర్ల కోసమే మూడు వేల రూపాయలు ఖర్చవుతోందట. వైఫై కోసం వెయ్యి రూపాయలు! ఆటోలో ఇన్ని సదుపాయాలుండటమంటే ఇది పెద్ద విశేషమే కదా.. దీంతో మీడియా అన్నాదురై వెంటపడుతోంది. ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తోంది. దీని గురించి అన్నాదురై మాట్లాడుతూ.. చాలా రోజుల కిందట తాను చెన్నై రైల్వే స్టేషన్ బయట ఆటోను పెట్టుకొనుంటే.. ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చి మాట్లాడుకోవడానికి మొబైల్ అడిగాడని.. అతడు తన ఆటోలో ఎక్కాలనే కండీషన్ మీద ఫోన్ ఇచ్చానని.. ఆ తర్వాత అలాంటి సదుపాయాలు పెడితే ఆటో ఎక్కడం పట్ల ఎవరైనా ఉత్సాహం చూపిస్తారనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. ఐటీ కంపెనీల దగ్గర్లో ఉన్న ఆటోస్టాండ్కు మారి.. ఈ విధమైన ఏర్పాట్లతో టెక్కీలను ఆకట్టుకొంటున్నానని అన్నాదురై వివరించాడు. ఆటోను అన్ని సదుపాయాలున్న డీలక్స్ గా మార్చడానికే నెలకు నాలుగైదు వేలు ఖర్చు చేస్తున్నాడు కదా.. అతడికి ఇంకేం మిగులుతుంది? అంటే.. తన సంపాదన రోజుకు వెయ్యిరూపాయలని చెబుతూ.. మిగతా లెక్కలు మీరే వేసుకోండి అని అంటాడు ఈ ఆటోడ్రైవర్! -
తొలి కొనుగోలు... ట్యాబ్లెట్టే
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు వచ్చి ల్యాప్టాప్లకు,డెస్క్టాప్లకు గ్రహణం పట్టిచ్చాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, గార్ట్నర్ పేర్కొంది. ఇలా ట్యాబ్లెట్ల జోరు జోరుగా పెరుగుతోందని వివరించింది. 2017 కల్లా తొలిసారిగా కంప్యూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో సగం మంది ట్యాబ్లెట్లనే కొనుగోలు చేస్తారని పేర్కొంది. స్మార్ట్ఫోన్ల రాకతో డెస్క్టాప్లు, ల్యాప్టాప్ల జోరు తగ్గిందంటున్న ఈ సంస్థ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు.., కంప్యూటర్లు కొనుగోలు చేయాలనుకునేవాళ్లలో 80 శాతానికి పైగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆల్ట్రా మొబైల్ పీసీలను కొనుగోలు చేస్తారు. 2014లో అంతర్జాతీయంగా ఐటీ వ్యయం 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. 2013లోని అంచనా వ్యయం కంటే ఇది 3.6% అధికం. క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ మీడియా, మొబైల్, ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ వంటి అంశాలు పునాదులుగా డిజిటల్ ఇండస్ట్రి ఎకానమీ నిర్మితమవుతుంది. 2009లో 250 కోట్ల డివైస్లు ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్నాయి. -
వచ్చే ఏడాది ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీలతో నోట్బుక్ పీసీల అమ్మకాలు పడిపోలేదని ఏసూస్ ఇండి యా తెలిపింది. మార్కెట్ పుంజు కోవడానికి ట్యాబ్లెట్లు దోహదం చేస్తున్నాయ ని ఏసూస్ ఇండియా సిస్టమ్ బిజినెస్ గ్రూప్ సేల్స్ డెరైక్టర్ యునేజ్ ఖురేషి అన్నారు. దేశవ్యాప్తంగా 50-60 లక్షల నోట్బుక్, నెట్బుక్ పీసీలు అమ్ముడవుతున్నాయి. ఇక ట్యాబ్లెట్ పీసీల సంఖ్య 50 లక్షల దాకా ఉంది. వచ్చే ఏడాది ట్యాబ్లెట్ల మార్కెట్ అనూహ్యంగా ఉండబోతోందని చెప్పారు. నాలుగు రకాల ట్యాబ్లెట్ల విక్రయిస్తున్నామని, త్వరలో మరిన్ని మోడళ్లను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడి ఖైరతాబాద్లోని ఐటీ మాల్లో ఏర్పాటు చేసిన ఏసూ స్ ఎక్స్క్లూజివ్ ఔట్లెట్ను ప్రారంభించి న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒకేచోట 10 బ్రాండ్లు ఐటీ మాల్లో సోని, ఇంటెల్, ఏఎండీ, డెల్, తోషిబా, లెనోవో, ఏసూస్, ఏసర్, హెచ్పీ, శాంసంగ్ ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు ఏర్పాటయ్యాయి. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నెలకొల్పామని ఐటీ మాల్ డెరైక్టర్ మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. -
స్మార్ట్ఫోన్కు పాస్వర్డ్!
లండన్: రోజుకో కొత్త సాఫ్ట్వేర్ అభివృద్ధిచేస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ఇక స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటివాటికి పాస్వర్డ్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా పోనుంది. అవును.. ఇలినాయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చెంగ్ బో నేతృత్వంలోని బృందం ఈ మేరకు సరికొత్త ‘సెలైంట్సెన్స్’ అనే సాఫ్ట్వేర్ను తయారుచేసింది మరి. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇక స్మార్ట్ఫోన్లకుు పాస్వర్డే అవసరం లేదట. టచ్స్క్రీన్పై జస్ట్ అలా తట్టడంగానీ లేదా స్వైప్ (గీకడం) గానీ చేస్తే చాలు.. ఫోన్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నది మీరేనా? కాదా? అన్నది ఇది ఇట్టే గుర్తుపట్టేస్తుంది. తడుతున్న లేదా గీకుతున్న చేతివే లి సైజు, ఒత్తిడి, వేగం, గీకే విధానం వంటి అనేక వివరాలను ఇది ఫోన్లో అమర్చే సెన్సర్ల ద్వారా అతివేగంగా అంచనావేస్తుంది. ఫోన్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నది వేరే వ్యక్తులని అనిపిస్తే వెంటనే లాక్ పడిపోతుంది. సాధారణంగా 3 నుంచి 5 సార్లు తట్టినా లేదా ఒకసారి గీకినా చాలు.. యజమానిని ఇది గుర్తిస్తుంది. అంతేకాదు.. ఫోన్ వినియోగిస్తున్నవారు యజమానేనా? కాదా? అన్నదీ ఇది ఓ కంట కనిపెడుతుందట. ఆటలు ఆడుకునేటప్పుడు తప్ప ఈ-మెయిళ్లు, ఎసెమ్మెస్లు చెక్ చేయడం వంటి సందర్భాల్లో ఆటోమేటిక్గా అప్రమత్తం అయిపోతుందట. -
మీ గుండెచప్పుడే... పాస్వర్డ్!
మొబైల్ ఫోన్లు, పీసీలు, ట్యాబ్లెట్లు... కారు, ఇంటి తలుపులను సైతం ఇకపై మీ గుండె చప్పుడుతోనే ఓపెన్ చేసేయొచ్చు. ఇందుకు కావలసిందల్లా జస్ట్ మీ చేతికి ఓ రిస్ట్బ్యాండ్ను కట్టుకోవడమే. అవును.. గుండెచప్పుడును బట్టి మనుషుల్ని గుర్తించే సరికొత్త రిస్ట్బ్యాండ్ను టొరంటోలోని ‘బయోనిమ్స్’ కంపెనీ పరిశోధకులు తయారుచేశారు. ‘నైమీ’ అనే ఈ రిస్ట్బ్యాండ్పై ఉండే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) సెన్సర్లపై కొన్ని సెకన్లపాటు చేతితో తాకితే చాలు. ముందుగానే రికార్డు అయిన మీ గుండెచప్పుడుతో పోల్చి చూసుకుని ఇది బ్లూటూత్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేస్తుంది. వేలిముద్రలు, కనుపాపలే కాదు... గుండె కొట్టుకునే విధానంలో కూడా మనిషికి మనిషికీ మధ్య తేడాలుంటాయట. దీన్నిబట్టే ఈ రిస్ట్బ్యాండ్ అసలు మనిషిని గుర్తిస్తుందట. ఇప్పుడున్న బయోమెట్రిక్ పద్ధతుల కన్నా ఇది మరింత భద్రమైనదని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
‘కార్పొరేట్’ సహకారం మంచి పరిణామం
సాక్షి,బెంగళూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కార్పోరేట్ కంపెనీలు ముందుకు వస్తుండటం మంచి పరిణామమని సమాచార శాఖ మంత్రి సంతోష్లాడ్ అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ సోషియల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) చర్యల్లో భాగంగా డ్రీమ్జీకే, టీజీఎస్-ఈ కామ్ కంపెనీలు గురువారం ‘ప్రభుత్వ పాఠశాల-డిజిటల్ పాఠాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ధార్వాడలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సంతోష్లాడ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులందరికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం వల్లే మాత్రమే సాధ్యం కాదన్నారు. కార్పోరేట్ సంస్థలు కూడా ముందుకు రావాల్సి ఉందన్నారు. అయితే రాష్ట్రంలో చాలా కంపెనీలు తమ వంతు సాయంగా నాణ్యమైన విద్య అభివృద్ధి కోసం సహకారం అందిస్తుండటం ఆహ్వానించదగిన పరిమాణమన్నారు. గత రెండుమూడేళ్ల నుంచి ఈ సంప్రదాయం పెరగడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయలు పెంచడమే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విద్యార్థులు బోధనా తరగతులు నిర్వహించడానికి వీలవుతుందన్నారు. అన ంతరం సంస్థ ప్రతినిధులు మన్దీప్ కౌర్, సచిన్నాయక్ మాట్లాడుతూ... ఈఏడాది ధార్వాడలోని 50 పాఠశాలలకు 50 ప్రొజెక్టర్లు, స్క్రీన్లతో పాటు ఎంపిక చేసిన విద్యార్థులకు 500 ల్యాప్టాప్లు, 500 టాబ్లెట్లను అందజేయనున్నామన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా కార్పోరేట్ పాఠశాల స్థాయి విద్యాబోధనను అందుకోవడానికి వీలవుతుందని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విన్కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.