Telangana Culture
-
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు
సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ దిగిపోగా రేపు డాకు మహారాజ్ ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు గేమ్ ఛేంజర్, ఇటు సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు సినిమాలకు దిల్ రాజే నిర్మాత. అందుకే క్షణం తీరిక లేకుండా ప్రమోషన్ల కోసం అటూ ఇటు పరుగులు తీస్తున్నారు.నిజమాబాద్లో ఈవెంట్ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను తన సొంత జిల్లా నిజామాబాద్లో నిర్వహించారు. ఈసారి స్పీచ్ మామూలుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలని యాంకర్ శ్రీముఖి కోరడం.. ఇప్పుడు చూడు, నా తడాఖా చూపిస్తా అన్న రేంజ్లో దిల్ రాజు రెచ్చిపోవడం జరిగాయి. ఈ క్రమంలోనే స్టేజీపై హుషారుగా మాట్లాడాడు.దిల్ రాజు హుషారైన స్పీచ్స్టేజీపై ఉన్న హీరో వెంకటేశ్ను చూస్తూ.. సర్, మా నిజామాబాద్ల తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవల్ ఉంటుంది. మా వోళ్లకు (తెలంగాణ ప్రజలకు) సినిమా అంటే అంత ఆసక్తి ఉండదు. అదే ఆంధ్రకు వెళ్తే సినిమాకు స్పెషల్ వైబ్ ఇస్తారు. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు అని స్పీచ్ దంచుకుపోయాడు. ఆయన స్పీచ్కు అక్కడున్నవారు చప్పట్లు కొట్టినా సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. తెలంగాణవాసి అయ్యుండి మన ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడతాడా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై దిల్ రాజు (Dil Raju) స్పందించాడు.(చదవండి: అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో ఊరట)దావత్ గురించి మాట్లాడా..మొన్నీ మధ్య నిజామాబాద్లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. నిజామాబాద్ పట్టణంలో పెద్దగా సినిమా ఈవెంట్లు జరగవు. అప్పట్లో ఫిదా సక్సెస్ మీట్ చేశాం.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేది చేశాం. నిజామాబాద్వాసిగా ఆ జిల్లాతో నాకున్న అనుబంధం అలాంటిది! అందుకే అక్కడ ఈ మూవీ ఈవెంట్ చేశాం. అప్పుడు నేను మన కల్చర్లో ఉండే దావత్ గురించి మాట్లాడాను. తెల్ల కల్లు, మటన్ గురించి మాట్లాడాను. నా మాటలతో తెలంగాణవాళ్లను అవమానించానని, తెలంగాణను హేళన చేశానని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.క్షమించండినా ఉద్దేశమేంటో అదే స్పీచ్లో చెప్పాను. మన కల్చర్, దావత్ నేను మిస్ అవుతున్నాను.. సంక్రాంతికి నా రెండు సినిమాలు రిలీజయ్యాక తెలంగాణ దావత్ చేసుకోవాలనుందని చెప్పాను. మన విధానాలను నేను అభిమానిస్తాను. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే క్షమించండి అని చెప్పుకొచ్చాడు.ఎలా అనుకున్నారు?నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో ఫిదా సినిమా షూటింగ్ చేశాం. మనం కుటుంబానికి ఎంత విలువిస్తాం, మన కల్చర్ ఏంటనేది ఆ మూవీలో చూపించాం. ఫిదా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టయిందో తెలుసు. అలాగే బలగం చిత్రాన్ని కూడా అందరూ గుండెకు హత్తుకున్నారు. తెలంగాణవాసిగా మన రాష్ట్రాన్ని అభిమానించే నేను హేళన చేస్తానని ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. మీ మనో భావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. రాజకీయాల్లోకి లాగకండిఎఫ్డీసీ చైర్మన్గా సినిమాకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ హైదరాబాద్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచుతాను. తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. నన్ను రాజకీయాల్లోకి లాగకండి. ఎఫ్డీసీ సినిమాకు సంబంధించిందే కానీ రాజకీయాలకు సంబంధించినది కాదు. ఎఫ్డీసీ, నేను సినిమాలకే ఉపయోగపడతాం. అవసరంలేని విషయాల్లో నన్ను లాగొద్దని కోరుతున్నాను అన్నాడు. #DilRaju garu has spoken out about the Nizamabad incident, offering his sincere apologies to anyone who may have been hurt. He has requested not to associate him with politics in any way. pic.twitter.com/X9W3grU8O0— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025 చదవండి: ప్రభాస్ పెళ్లి ఎవరితో.. రివీల్ చేసిన రామ్ చరణ్ -
పిల్లలు చెప్పిన బుర్రకథ..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ‘ఇతిహాసమ్: తెలంగాణ వారసత్వ సంపద ప్రతిధ్వని’ థీమ్తో సుచిత్ర అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. సుచిత్ర అకాడమీ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ‘సుచిత్ర ఇన్నోవేషన్ సెంటర్’ను మంగళవారం ప్రారంభించారు.ఇందులో భాగంగా బ్రహ్మం గారి బుర్ర కథ ప్రదర్శన, తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేక ప్రజా తిరుగుబాట్లను ప్రతిబింబించే ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రష్యాలో భారత దేశ మాజీ అంబాసిడర్ అయిన బలా వెంకటేశ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. అకాడమీ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు తెలంగాణలోని సుసంపన్న సంపదను ప్రదర్శనల ద్వారా ప్రాణం పోశారని అన్నారు. (చదవండి: తల్లీ.. నీకు సెల్యూట్!) -
బతుకమ్మ చీరలు రెడీ.. నేటి నుంచి గ్రామాల్లో పంపిణీ
కరీంనగర్రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది. 2017 నుంచి ఆహార భద్రత కార్డు కలిగి ఉండి, 18 ఏళ్లు దాటిన మహిళలకు అందిస్తున్న చీరలను ఈనెల 4 నుంచి 14వ తేదీ వరకు పంపిణి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈఏడాది జిల్లావ్యాప్తంగా 3,53,707 చీరలు అవసరం కాగా ఇప్పటివరకు 2.79 లక్షల చీరలు వచ్చాయి. ఇంకా 74,707 చీరలు రావాల్సి ఉన్నాయి. మంగళవారం జిల్లాలోని గోదాముల నుంచి చీరల స్టాక్ను పంచాయతీ అధికారులకు అప్పగించారు. బుధవారం నుంచి జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్లో చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, రేషన్డీలరు, స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు పంపిణీ చేయనున్నారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్తో విదేశీ పారిశ్రామికవేత్తల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపదపై అధ్యయనానికి వచ్చిన విదేశీ యువ పారిశ్రామికవేత్తలు.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ను మంగళవారం కలిశారు. యూత్ అంబాసిడర్స్ ప్రోగ్రాం(వైఏపీ)లో భాగంగా ఆ్రస్టియా, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్, బెల్జియం దేశాలకు చెందిన 13 మంది యువ పారిశ్రామికవేత్తలు 15 రోజుల పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ని సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రాముఖ్యత, చారిత్రక, వారసత్వ సంపద, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఇండ్రస్టియల్ పాలసీ, ఐటీ, ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి విషయాలను వారికి మంత్రి వివరించారు. కార్యక్రమంలో యూత్ అంబాసిడర్స్ కో–ఆర్డినేటర్ నవీన్ మల్వేతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
Bathukamma: పూలకి పండగ
బతుకమ్మ పండుగ పకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. బాలారిష్టాలు, కలరా, మలేరియా, ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను, కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మా అని ప్రజలు ప్రకృతి గౌరీని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ. తెలంగాణ పల్లెల్లోని ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఊరంతా ఒకటయ్యి తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది. అయితే నేటి కాలంలో బతుకమ్మ పండుగ గొప్పతనం ఎల్లలు దాటి దేశ విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మంచి వర్షాలతో వరుణ దేవుడు అనుగ్రహించి అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతు జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూనే యువతులు ముత్తైదువులు రంగు రంగు పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది అందులో గౌరమ్మను పెట్టి పూజించి ఊరంతా ఒక్క చోట గుమిగూడి పల్లె ప్రజల జీవితాలను కష్ట సుఖాలను పాటల రూపంలో ప్రకృతి గౌరికి విన్నవించుకుంటారు. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. -
నేటి నుంచి 'తెలంగాణ వైభవం'
సాక్షి, సిరిసిల్ల: ఏ జాతి మనుగడైనా దాని చారిత్రక, సాంస్కృతిక పునాదులపైనే ఆధారపడి ఉంటుందనేనది కాదనలేని వాస్తవం. చరిత్ర విస్మరించిన జాతి ఉనికి కోల్పోతుందనేది అంతే తిరుగులేని నిజం. విభిన్న సంస్కృతులకు, ఆచార వ్యవహారాలు తెలంగాణ ప్రాంతానికి విశేష ఆభరణాలు. కళలు, ప్రజాజీవన శైలి, సాంస్కృతిక రూపాలు వైవిధ్యమైన ఆచార, సంప్రదాయాలు ఈ ప్రాంతానికి పెట్టని సుగుణాలు. తెలంగాణ వైభవం.. కనుమరుగైన చరిత్రను శాస్త్రీయంగా పరిశోధించి, సిసలైన ఇతిహాసాన్ని భావి తరాలకు అందించేందుకు ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలంగాణ వైభవం’ పేరిట మూడు రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఉమ్మడి కరీంనగర్లోని మానేరు బ్రిడ్జి సమీపంలోని కొండా సత్యలక్ష్మి గార్డెన్ ఈ వైభవానికి వేదికగా మారింది. విశ్లేషకులు, విశిష్ట వ్యక్తులు, ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్టులైన వారి విస్తృత ప్రసంగాల ద్వారా నిజమైన చరిత్రను రేపటి తరానికి అందించనున్నట్లు నిర్వాహకులు ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎల్. రాజభాస్కర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డి.నిరంజనాచారి తెలిపారు. ఇవీ చర్చనీయాంశాలు తెలంగాణ చారిత్రక వైభవం, కావ్యం, పురాణ ఇతిహాసాలు, శాస్త్ర, సాహిత్య గ్రంథాలు, పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు, జాతరలు, వాస్తు శిల్పం, నగర నిర్మాణ ప్రణాళికలు, జల వినియోగం, ప్రదర్శన కళా ప్రక్రియలు, ప్రయోజనాలు, చేనేత నైపుణ్యాలు, రత్నాలు, పగడాలు, నిల్వ ఉంచే ఆహార పదార్థాలు, ప్రాచీన కాలంలో వెల్లి విరిసిన నౌకానిర్మాణం, నౌకాయానం, తెలంగాణ స్వాతంత్రోద్యమం తదితర అంశాలపై సాధికార ప్రసంగాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల్లో ప్రతి రోజు చర్చల తరువాత తెలంగాణ కళలు, సాంస్కృతిక, జానపద కళారూపాలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. ఇదీ కార్యక్రమ అనుసారిణి.. తొలిరోజు శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో సదస్సు ప్రారంభమవుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ విశిష్ట అతిథిగా హాజరవుతారు. అతిథులు ప్రసంగాల అనంతరం కాకతీయుల కాలంలో యుద్ధ సన్నాహక ప్రేరేపిత నృత్య రూపకం పేరిణీ శివతాండవం ప్రదర్శిస్తారు. రెండో రోజు శనివారం ప్రాచీన తెలంగాణ వైభవంపై సదస్సు నిర్వహిస్తారు. చరిత్ర, సాహిత్య, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలుంటాయి. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. డాక్టర్ సాగి కమలాకరశర్మ, డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, డాక్టర్ భాస్కర్యోగి, డాక్టర్ మనోహరి, ప్రొఫెసర్లు ఎల్లప్రెగడ సుదర్శన్రావు, కేపీ రావు డాక్టర్ గిరిజామనోహర్ బాబు, తదితరుల ప్రసంగాలుంటాయి. అనంతరం కవి గండ్ర లక్ష్మణ్రావు సారథ్యంలో కవి సమ్మేళనం, ప్రతాప రుద్రీయం నాటక ప్రదర్శన ఉంటుంది. మూడో రోజు ఆదివారం జానపద, సాహిత్య, సంస్కృతులపై ప్రసంగాలు ఏర్పాటు చేశారు. హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతారు. డాక్టర్ బండారు ఉమామహేశ్వర్రావు, ప్రొఫెసర్ పాండురంగారావు, సూర్యధనుంజయ్, డాక్టర్ శంకర్రావు, డాక్టర్ వడ్లూరి ఆంజనేయరావు ప్రొఫెసర్లు కె.యాదగిరి, డాక్టర్ కసిరెడ్డి వెంకట్రెడ్డి ప్రసంగాలుంటాయి. సాయంత్రం ముగింపు సమావేశంలో ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులు హాజరవుతారు. సత్యమైన చరిత్ర కోసం.. నిజమైన చరిత్ర ఈ తరానికి తెలియాలి. పాలకుల ప్రభావంతో రాయబడిందే చరిత్రగా భావిస్తున్నాం. పరిశోధకులు, శాస్త్రీయ ఆధారాలతో నిరూపించగలిగిన తెలంగాణ చరిత్రను కళ్లముందుకు తెస్తున్నాం. ఇతిహాసాల ఆధారంగా లభించిన ఆనవాళ్లు, సాక్ష్యాలతో నేటి తరానికి ఆనాటి తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక సంపదను పరిచయం చేయబోతున్నాం. – డాక్టర్ ఎల్. విజయభాస్కర్రెడ్డి, ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ప్రజల పండుగ తెలంగాణ సంస్కృతి మిగిలిన ప్రాంతాలతో పోల్చితే పూర్తి భిన్నమైనది. సుమారు రెండున్నర వేల ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానిది. ఇప్పటి వరకు మన దృష్టికి రాని చరిత్రను వెలికితీసి ఈ సదస్సుల రూపంలో అందిస్తున్నాం. ఎనిమిది సదస్సులు, మనదైన సంస్కృతి రూపాల ప్రదర్శన ఏర్పాటు చేశాం. తెలంగాణ ప్రజల పండుగలా నిర్వహిస్తున్న కార్యక్రమానికి అందరూ రండి. అసలైన చరిత్రను ఆస్వాదించండి. – గిరిధర్ మామిడి, సీఏ, నిర్వాహక కార్యదర్శి, ప్రజ్ఞాభారతి రాష్ట్రశాఖ -
తెలంగాణ అంటేనే బతుకమ్మ :ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు సుఖ శాంతులతో, సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అని, మహిళలకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుగల్లో బతుకమ్మ ప్రధానమైనదన్నారు. ఈ ఏడాది పల్లెలన్నీ ఆడపడుచులతో కళకళలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో తెలంగాణ ఆడ బిడ్డలను కేసీఆర్ ఘెరంగా అవమానించారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది బతుకమ్మ పండుగ కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ’
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.కిషన్రావు అన్నారు. బుధవారం సింగరేణి భవన్లో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ పండుగను సింగరేణి కాలరీస్ ప్రాంతాల్లో ఈ ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి పండుగల ద్వారా ఉద్యోగుల్లో మరింత అంకిత భావం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజా కవి జయరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ప్రేమ్కుమార్, జనరల్ సెక్రటరీ రాజశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బి.భాస్కర్ , సింగరేణి భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
రామ రామ రామ ఉయ్యాలో..
సాక్షి, హైదరాబాద్: రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం హోరెత్తింది. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా భావించే ఈ పండుగను విదేశీయులు సైతం అమితంగా ఇష్టపడుతున్నారు. శనివారం రవీంద్రభారతి వేదికగా విదేశీయులు బతుకమ్మ ఆడా రు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాహిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాల యం గచ్చిబౌలి వారు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఆకర్షణీయమైన దుస్తులు దరించిన విదేశీయులు కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. ఇండోనేసియా, మలేసియా, రష్యా, అమెరికా, దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, రష్యా తదితర 21 దేశాలకు చెందిన 75 మంది బ్రహ్మకుమారీ మహిళలు, పురుషులు ఇందులో పాల్గొన్నారు. వీరంతా దాదాపు రెండు నెలలపాటు బతుకమ్మ ఆటపాటలపై శిక్షణ తీసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అకాడమీ ఫర్ ఏ బెటర్ వరల్డ్ డైరెక్టర్ బ్రహ్మకుమారీ కులదీప్ సిస్టర్, రష్యాలో బ్రహ్మకుమారీస్ డైరెక్టర్ సంతోష్ సిస్టర్, రజనీ సిస్టర్, జస్టిస్ ఈశ్వర య్య, జస్టిస్ అమర్నాథ్, జస్టిస్ రమేశ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీఎం రెడ్డి పాల్గొన్నారు. ఒక్క పండుగతో వంద లాభాలు.. ప్రపంచంలో ఇలాంటి పండుగ ఎక్కడా చూడలేదు. ప్రకృతి, వైద్యం, వ్యాయామం, సమైక్య త, సమగ్రత వంటి ఎన్నో అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ఆచార, వ్యవహారాలు తెలియచేసేది బతుకమ్మ పండుగ. –బ్రహ్మకుమారీ కులదీప్ సిస్టర్ బతుకమ్మ విశ్వవ్యాప్తం అవుతుంది.. మేం ఎక్కడా ఇలాంటి సంబరాలు చూడలేదు. ప్రకృతిలో వికసించే పూలతో అందంగా బతుకమ్మను పేర్చి ఆడటం వల్ల మనస్సు వికసిస్తోం ది. భవిష్యత్లో ఈ పండుగ విశ్వవ్యాప్తం అవుతుంది. బతుకమ్మ ఆటపాటను తమ దేశంలో కూడా ఆడతామని ముందుకు వస్తున్నారు. – సంతోష్ సిస్టర్ ఏకాగ్రత పెరుగుతుంది.. పెద్దలు, పిల్లలతో కలిసి బతుకమ్మ ఆడటం వల్ల అందరి మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. తిరుగుతూ ఆడటంతో ఏకాగ్రత పెరు గుతుంది. ప్రకృతితో మమేకమవుతూ మహిళలు పేర్చే బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ పండుగను ఇక ముందు రష్యాలో కూడా కొనసాగిస్తాం. – నాగమన్జ్, థాయ్లాండ్ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశాం.. బ్రహ్మకుమారీస్ 130 దేశాల్లో ఉన్నారు. మూడేళ్లుగా వారితో బతుకమ్మ సంబరాలు చేయిస్తున్నాం. ఈసారి 21 దేశాల కళాకారులు వచ్చారు. 25 దేశాలతో ఎంవోయూకు సిద్ధంగా ఉన్నాం. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయటమే లక్ష్యం. ప్రపంచ పర్యాటకులు అంతా తెలంగాణ వైపు రావాలి. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు తిలకించి వెళ్లాలి. – బుర్రా వెంకటేశం -
బోనం.. తెలంగాణ ప్రాణం
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక బోనం ప్రపంచ రికార్డుకెక్కింది. పోతు రాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య దాదాపు 2,650 మంది మహిళలు బోనాలు ఎత్తుకున్నారు. ఈ అపూర్వ సన్నివేశం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం చోటు చేసుకుంది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, తనిష్ నీలిమ డ్యాన్స్ అకాడమి, వాసవి మహిళా సమాఖ్య, తెలంగాణ కలల వేదిక, కైరా ఫౌండేషన్, మయూరి రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ‘బోనం.. తెలంగాణ ప్రాణం’ పేరిట ప్రపంచ రికార్డ్ స్థాయిలో బోనాల ప్రదర్శన నిర్వహించారు. బోనాల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని దత్తాత్రేయ సూచించారు. కార్యక్రమంలో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి జయంత్రెడ్డి, సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్జీ, లక్ష్మీదేవి, ఉప్పల రాజ్య లక్ష్మి, స్వరూపరాణి, ఉమా మహేశ్వరి, వన్పల్లి శ్రీనివాస్రెడ్డి, ప్రతాప్, బండి దీక్షిత్, నర్సింహారెడ్డి, సతీశ్గౌడ్ పాల్గొన్నారు. -
గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే
-
గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే
ట్యాంక్బండ్పై మిన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురం సాక్షి, హైదరాబాద్: హుస్సేన్సాగర్ తీరాన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్ని అంటింది. ట్యాంక్బండ్పై తెలంగాణ సంస్కృతీ వైభవం ఘనంగా ఆవిష్కృతమైంది. తీరొక్క పూల పండుగ చివరి రోజైన ఆదివా రం ఆడపడుచులు బతుకమ్మ ఆడి పులకించి పోయారు. వర్షంలోనూ ఉత్సాహంగా గౌరీదేవిని అర్చించారు. ఇరవై ఐదు వేల మందికి పైగా మహిళలు దారి పొడవునా బతుకమ్మలు చేతబట్టి ట్యాంక్బండ్పైకి వరుసకట్టగా... రహదారులు పూదారులై... సంప్రదాయ సిరి విరిసి భాగ్యనగరి పరవశించింది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గౌరీదేవిని.. సద్దులతో సాగర ఒడికి చేర్చారు. ‘మాయమ్మ.. శ్రీదేవి పోయిరావమ్మా’ అంటూ సాగనంపారు. జీహెచ్ఎంసీ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చే శారు. హుస్సేన్సాగర్లో బోట్లపై నుంచి పేలిన బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు అలరించాయి. అచ్చతెలుగు సంప్రదాయ దుస్తుల్లో విదేశీ మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. నంబర్ వన్ పండుగ...: బతుకమ్మ సంబరాలకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తదితరులు హాజరయ్యారు. ప్రపంచ నంబర్ వన్ పండుగగా తెలంగాణ బతుకమ్మ ఎదుగుతోందని నాయిని అన్నారు. అమెరికా, దుబాయ్, మలేసియా, ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐలు సైతం సంబరాలను వైభవంగా నిర్వహిస్తూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారన్నారు. ప్రతిష్ట పెరిగింది: హరీశ్ మరోవైపు కూకట్పల్లిలో బతుకమ్మ వేడుక వైభవంగా జరిగింది. ఆటపాటల అనంతరం ఐడీఎల్ వద్ద నియోజకవర్గ స్థారుు బతుకమ్మ పోటీలను స్థానిక శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గుజరాతీలు, మళయాళీలు, తెలంగాణ మహిళలు దాండియా, ఓనం, బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. భారీ బతుకమ్మల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి టి.హరీశ్రావు మాట్లాడుతూ... బతుకమ్మతో తెలంగాణ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి వల్ల పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలు, పెట్టుబడిదారులు అందరూ నగరం ైవె పే మొగ్గు చూపుతున్నారన్నారు. ఇక్కడ కృత్రిమ బతుకమ్మలుంటాయనుకున్నానని.. కానీ పూర్తిగా పూలతో పేర్చిన బతుకమ్మలు ఇంతపెద్ద స్థారుులో కనిపిస్తుంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఆడిండ్లు ఉయ్యాలో...
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రజలు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోవడం లేదు. వరంగల్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, హైదరాబాద్ నగరాలకు చెందిన కొంతమంది వృత్తి, చదువురీత్యా అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం పియోరీయోటౌన్లో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. అయితే సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆయా జిల్లాలకు చెందిన తెలంగాణ మహిళలు శనివారం సంబురాలు జరుపుకున్నారు. విదేశాల్లోబతుకమ్మను ఆడి తెలంగాణ సంస్కృతిని అక్కడి ప్రజలకు తెలియజేశారు. – దేవరుప్పుల.. -
అందరి బతుకమ్మ
తెలంగాణ జనసామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతుకమ్మ. అంటే ‘జీవించు - బ్రతికించు’ అని అర్థం. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపిణిగా ఆరాధించి అటు శక్తితత్వాన్ని, ఇటు మాతృదేవతారాధనను వారు స్థిరీకరించారు. భట్టు నరసింహకవి రచించిన ఈ పాటే ఈ కథకు, బతుకమ్మ పేరుకు ఆధారంగా నిలిచింది. ‘ధరచోళదేశమున ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యరో ఉయ్యాలో అతివ సత్యవతి ఉయ్యాలో’ ధర్మాంగదుడనే చోళరాజు, సత్యవతి దంపతులు ఎన్నో నోములు నోచి కుమారులను కన్నారు. కాని యుద్ధంలో ఏదో కారణంతో వారంతా చనిపోయారు. సత్యవతి పూజలకు సంతోషించిన లక్ష్మీదేవి తానే ఆమెకు కూతురుగా పుట్టిందట. ఆ బిడ్డను ఆశీర్వదించడానికి దేవాదిదేవతలు, మహర్షులు వచ్చి ... ‘బతుకగనె ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో శ్రీలక్ష్మీదేవియు ఉయ్యాలో సృష్టి బ్రతుకమ్మాయె ఉయ్యాలో...’ అని ఆమెకు ‘బతుకమ్మ’ అనే నామకరణం చేశారని ఈ జానపద గాథ తెలుపుతుంది. ‘శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశురాణివై పరగలక్ష్మీవయ్యా గౌరమ్మ భార్యవైతివి హరికినీ గౌరమ్మ’ అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియజేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు సాగే బతుకమ్మ ఆరాధన ఎంతో విశిష్టమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చే పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడినుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి అన్న ఆధ్యాత్మ, తాత్విక సందేశం ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకదానిపై ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అయినట్లే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసిమెలిసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం కన్పిస్తుంది. దుసరిచెట్టు తీగలతో అల్లిన శిబ్బి - శిబ్బెం లేదా తాంబాళంలో అడుగున గుమ్మడి, ఆనపు, మోదుగ వంటి పెద్ద ఆకులను ఉపయోగించి కింది పీఠంలా తయారుచేస్తారు. ఆ పీఠంపై వర్తులాకారంగా ఈ కాలంలో దొరికే గుమ్మడి, తంగెడి, గునుగు, గోరింట, గడ్డిపూలు, కలువ, కట్ల, బంతి, బీర, పొట్ల, రుద్రాక్ష, చేమంతి, నీలంకట్ల, పారిజాత, పొన్న, మందార, మల్లె, మొల్ల, గుల్మాల పూలతో మెట్లుమెట్లుగా పేర్చి అందంగా తీర్చిదిద్దుతారు. మొత్తం బతుకమ్మపైన పసుపుముద్దను గౌరీదేవిగా పై స్థానంలో నిల్పుతారు. ఈ మొత్తం దృశ్యం మేరుప్రస్థ శ్రీచక్రంలాగా ఉంటుంది. మహాలయ అమావాస్య బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’, చిన్న బతుకమ్మ అని పిలుస్తారు. చివరిరోజైన సద్దుల బతుకమ్మకు ఐదు రకాల సద్దులు పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడితో నైవేద్యం చేసి సమర్పిస్తారు. రకరకాల బతుకమ్మ పాటలతో నృత్యగీతాలాపన కొనసాగుతుంది. ఆటలు పూర్తయ్యాక కొత్త సిబ్బి పాత సిబ్బి అంటూ సద్దులను పంచుకొని తింటారు. బతుకమ్మ ఉత్సవంలో ఆటపాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. ‘బతుకమ్మ ఆట’ అని ఈ నృత్యానికి పేరు. గ్రామాల్లో ఏ ఉత్సవమైనా, ఏ ఊరేగింపు అయినా ‘బతుకమ్మ ఆట’ (నృత్యం) చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా పాడుతారు. అంతగా చొచ్చుకుపోయింది ఈ ఆట - పాట. ఈ రోజున ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని ముగిస్తారు. శ్రీ మూర్తి అయిన అమ్మవారిని సాటి స్త్రీ మూర్తులే ఆరాధించే ఈ పండుగలో స్త్రీల కళా నైపుణ్యం, సహ జీవన తత్వం, ప్రకృతి తాదాత్మ్యం కన్పిస్తాయి. అందరినీ బతుకమనీ, అందరికీ బతుకునివ్వమనీ కోరుకొనే ఈ మహోత్సవాన్ని అందరూ జరుపుకోవాలి. అప్పుడే అందరి బతుకమ్మ అవుతుంది. - డా॥పి. భాస్కరయోగి విదేశీయులనూ అలరిస్తున్న బతుకమ్మ సాంస్కృతిక వైభవం -
‘బతుకమ్మ’కు అంతర్జాతీయ గుర్తింపు
• 10వేల మందితో 8న ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ • మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పండుగకు గిన్నిస్ రికార్డుల్లో చోటు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 8న ఎల్బీ స్టేడియంలో 10వేల మంది మహిళలతో బతుకమ్మ పండుగ జరుపనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8న ప్రభుత్వం తరఫున ఉత్సవాలు జరుగుతాయని, 9న ప్రజలు పెద్ద బతుకమ్మను నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో 8న జిల్లాల్లో కూడా వెయ్యి మంది మహిళలతో ఉత్సవాలు జరుపుతారన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద 9న పెద్ద బతుకమ్మను వినాయక నిమజ్జనం తరహాలో నిర్వహిస్తామన్నారు. పండుగ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు. బతుకమ్మ ఉత్సవాల కోసం పాత జిల్లాలకు రూ. 10 లక్షలు, కొత్త జిల్లాలకు రూ.5 లక్షలు విడుదల చేస్తుందన్నారు. తెలంగాణ వాసులు నివసించే ముంబై, సూరత్, భీవండి, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో, అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు పలు గల్ఫ్ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు స్థానిక సంఘాలకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తుందన్నారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నగరంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు అంజలి, షీలా తెలిపారు. సచివాలయంలో వారు మీడియా తో మాట్లాడుతూ.. అక్టోబర్ 7న రవీంద్రభారతిలో, 8న గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో, 9న ట్యాంక్బండ్, 10న రవీంద్రభారతి, 11న గచ్చిబౌలిలో 7 దేశాల కళాకారులతో ఉత్సవాలు జరుపుతామన్నారు. -
ఆషాఢ బోనాలకు అంకురార్పణ
* ఘనంగా గోల్కొండ బోనాలు * అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంరంభం ఆషాఢ బోనాలకు అంకురార్పణ జరిగింది. అశేష భక్తజనం మధ్య... మంగళ వాయిద్యాలతో గోల్కొండ కోటపై జగదాంబిక అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గురువారం వైభవంగా సాగింది. ఉదయం 8 గంటలకు చార్మినార్ సమీపంలోని మురిగీచౌక్ నుంచి బయలుదేరిన తొట్టెల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పోతురాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన గ్రామ దేవతల ప్రదర్శన లంగర్హౌస్ వరకు సాగింది. ఉదయం 11 గంటలకు కోటపై అమ్మవారికి నజర్ బోనం సమర్పించారు. రంజాన్ పండుగ కూడా కావడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. ఊరేగింపులో ఐక్యతను చాటేలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫతేదర్వాజా వద్ద మైత్రీసంఘం సభ్యులు, ముస్లింలు అమ్మవారికి పూజలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎక్సైజ్శాఖ మంత్రి పద్మారావుగౌడ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనాలతో పాటు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. వచ్చే నెల 4 వరకు ప్రతి గురు, ఆదివారాల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. గతేడాది కంటే ఈసారి మరింత ఘనంగా, ఉత్సాహంగా బోనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తలసాని చెప్పారు. రంజాన్, బోనాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ... దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాలకు సైతం నిధులను కేటాయిస్తున్నామని, గోల్కొండలో ప్రారంభమైన ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. -
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మలేషియా: కోలాలంపూర్ లోని బ్రిక్ ఫీల్డ్స్ లో మలేషియా తెలంగాణా అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ధూంధాంగా జరిగాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ సంబరాల్లో మహిళలు, చిన్నారుల తోపాటు భారీ సంఖ్యలో తెలంగాణా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సంబరాల్లో భాగంగా మైట సభ్యులు కేక్ కట్చేసి నోరు తీపి చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని లోటస్ ఈ రేమిట్ స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదమ్ తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ సోప్పరిస్ సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు స్టాలిన్, హజారి శ్రీధర్, కృష్ణవర్మ, బురెడ్డి మోహన్ రెడ్డి, అమర్నాధ్, చిట్టి, రవీందర్ రెడ్డి, రఘు, శాంతి, రవి చంద్ర , అజయ్, కార్తీక్, రవివర్మ, ఏబినిజేర్, లక్ష్మికాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైట ఈ సంవత్సరానికీగాను క్రింది నూతన కార్యవర్గ సభ్యులను అధికారికంగా ప్రకటించింది. ప్రెసిడెంట్ : సైదమ్ తిరుపతి వైస్ ప్రెసిడెంట్: సోపరిస్ సత్య సెక్రటరీ: రవి వర్మ జాయింట్ సెక్రటరీ: చిట్టి కోశాధికారి: రఘుపాల్ ముఖ్య కార్యవర్గ సభ్యులు: రవీందర్ రెడ్డి, బురెడ్డి మోహన్ రెడ్డి, రవిచంద్ర, కృష్ణ వర్మ యూత్ ప్రెసిడెంట్ : స్టాలిన్ యూత్ వైస్ ప్రెసిడెంట్: చందు ఈవెంట్: ప్రభాకర్, శ్రీకాంత్, రమణ ,శివ, కృష్ణ వర్మ, రవి, అజయ్ రావు, శ్రీనివాస్, రంజిత్, వేణు గోపాల్, శశిధర్, కిరణ్ గౌడ్, అజయ్ కుమార్ ఉమెన్స్ ప్రెసిడెంట్ : కిరణ్మ్యి అడ్వైజరీ కమిటీ చైర్మెన్: ఎబ్బినిజేర్ అడ్వైజరీ కమిటీ : అమరనాథ్, అశోక్, సురేష్, శాంతి ప్రియ, శ్రీధర్ హజారి -
మన సంస్కృతిని చాటేలా ఆవిర్భావ వేడుకలు
మందమర్రి ఏరియా జీఎం రాఘవులు రామకృష్ణాపూర్ : తెలంగాణ సంస్కృతిని చాటేలా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు మందమర్రి ఏరియా జీఎం రాఘవులు తెలిపారు. బుధవారం రామకృష్ణాపూర్లోని ఓపెన్కాస్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అలుపెరుగని ఉద్యమాలు, ఎంతో మంది త్యాగాల ఫలితంగా రాష్ర్టం ఏర్పడిందని, సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కే సీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. వేడుకలలో భాగంగా గురువారం ఉదయం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ప్రధాన వీధుల గుండా తెలంగాణ రన్ నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన తర్వాత మందమర్రిలోని అన్ని సింగరేణి కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణలు, సాయంత్రం ఉత్తమ కార్మికులకు సత్కారాలు, బహుమతులు, స్టాల్స్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కార్మికులు, కార్మిక కుటుంబాలు పెద్దసంఖ్యలో హాజరై ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ గోవిందరాజు, ఆర్కే ఓసీ, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు సురేష్, రాంమూర్తి, మేనేజర్ రాధాకృష్ణ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, ఫిట్ కార్యదర్శి రాజ్కుమార్, నాయకులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్య సాధనకు అందరు కృషి చేయాలి మందమర్రి : మందమర్రి ఏరియాలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, కార్మికులు కృషి చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ ఎం.రాఘవులు కోరారు. తన చాంబర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మే నెలలో సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. శాంతిఖని గనిలో 35,300 టన్నులు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా 2,822 టన్నుల ఉత్పత్తితో కేవలం 8 శాతం సాధించిందని తెలిపారు. కేకే-1 గనిలో 20,300 టన్నులు బొగ్గు ఉత్పత్తికి గాను 14,087 టన్నుల ఉత్పత్తితో 69 శాతం సాధించిందని తెలియజేశారు. కేకే-5 గనిలో 20,300 టన్నులు ఉత్పత్తి నిర్దేశించగా 18,040 టన్నుల ఉత్పత్తితో 89 శాతం సాధించిందని పేర్కొన్నారు. కాసిపేట గనిలో 25,400 టన్నులు నిర్దేశించగా 22,975 టన్నులు ఉత్పత్తితో 90 శాతం సాధించినట్లు తెలిపారు. ఆర్కే-1ఎ గనిలో 14,400 టన్నుల ఉత్పత్తి నిర్దేశించగా 8,466 టన్నుల ఉత్పత్తితో 59 శాతం సాధించిందని వివరించారు. వివిధ గనుల ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. సమావేశంలో క ల్యాణిఖని ఓపెన్కాస్టు ప్రాజెక్ట్ అధికారి , ఎస్వోటు జీఎం, ఏజీఎం , ఐఈడీ,డీజీఎం పర్సనల్, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ నేపథ్యంపైనే అధిక ప్రశ్నలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్సప్లై అండ్ సేవరేజ్ బోర్డులో మేనేజర్(ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రాత పరీక్షను ఆదివారం నిర్వహించింది. గతంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను ఆన్లైన్లోనే టీఎస్పీఎస్సీ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొలిసారి ఆఫ్లైన్లో పరీక్షను నిర్వహించింది. అభ్యర్థుల్లోని సాధారణ నైపుణ్యాలు, సామర్థ్యాలు పరీక్షించేలా ప్రశ్న పత్రాన్ని రూపొందించింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ అన్ని అంశాల నుంచి ప్రామాణిక ప్రశ్నలను అడిగారు. చరిత్ర నుంచి సుమారు 35 ప్రశ్నలు! ప్రశ్న పత్రంలో తెలంగాణ నేపథ్యం ఉన్న భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ, భారతదేశ చరిత్రకు సంబంధించి సుమారు 35 వరకు ప్రశ్నలు అడిగారు. తెలంగాణ సంస్కృతికి సంబంధించి పలుకుబడిలో ఉన్న ప్రశ్నలనే ఇచ్చారు. ఉదాహరణకు ‘దసరా పండగ రోజు ఒకరికొకకు ఇచ్చుకునే జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు?’, ‘బతుకమ్మ పండగ తొలిరోజును ఏమంటారు?’తోపాటు కాకతీయులు తవ్వించిన చెరువులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలపై ప్రశ్నలు ఇచ్చారు. సాలార్ జంగ్ సంస్కరణలపై రెండు మూడు ప్రశ్నలు ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిలో ప్రధానంగా పండగలు, జాతరల గురించి అడిగారు. ‘ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే ప్రముఖ జాతర?’, ‘కొండగట్టు దేనికి ప్రసిద్ధి?’, ‘మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత యాత్రా స్థలం ఏది?’ మొదలైన ప్రశ్నలతోపాటు 1969 ఉద్యమంపై, భౌగోళిక సూచికగా నమోదైన హైదరాబాద్ హలీమ్పై, కుతుబ్షాహీ సాహిత్యంపై ప్రశ్నలు ఇచ్చారు. భారత దేశ చరిత్రలో సంస్కరణ ఉద్యమాలు, ఆర్యసమాజంపై ప్రశ్నలు ఇచ్చారు. జాగ్రఫీలో తెలంగాణ నేలలు, వర్షపాతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఖనిజాలు, విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, చెరువులు, ప్రాజెక్టులు తదితర అంశాలతోపాటు ఇండియన్ జాగ్రఫీపై ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ఆర్థిక అంశాలు, ప్రభుత్వ పథకాలు, విధానాలపై ప్రశ్నలు ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు! జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంశంలో జాతీయ అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. నోబెల్ బహుమతిపై, బ్రహ్మోస్ క్షిప ణి, జలాంతర్గా మి నుంచి ప్రయోగించే బాలెస్టిక్ క్షిపణిపై, అంతర్జాతీయ దినోత్సవాల గురించి ప్రశ్నలు ఇచ్చారు. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. సుమారు 15 ప్రశ్నలు ఈ అంశాలకు సంబంధించినవే. పాలిటీ విభాగంలో అన్ని అంశాల్లోంచి ప్రశ్నలు ఇచ్చారు. గతంలో టీఎస్పీఎస్సీ పరీక్షల కంటే కొద్దిగా క్లిష్టంగానే ప్రశ్నలు రూపొందించారు. ఇంగ్లిష్ విభాగంలో సులువైన ప్రశ్నలు ఇచ్చారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఎంటర్ప్రిటేషన్లో ప్రశ్నలు అభ్యర్థులు తార్కిక నైపుణ్యాలు పరీక్షించే విధంగా ఉన్నాయి. క్లిష్టం, సందిగ్ధం! క్రీడలకు సంబంధించి లోతుగా ప్రశ్నలు ఇచ్చారు. ‘కల్టివేటెడ్ స్టైలిస్ట్గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ క్రికెటర్ ఎవరు?’, ‘వరంగల్కు చెందిన ఏ ఆటగాడు బాల్బ్యాడ్మింటన్ ఆటను విప్లవీకరించాడు?’ అనే ప్రశ్నలు ఈ తరం విద్యార్థులకు పెద్దగా తెలిసే అవకాశం లేదని సబ్జెక్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే ‘ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు వల్ల ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ?’ అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లు, మరో ప్రశ్నలో తెలంగాణ ప్రభుత్వ పథకం పేరును ఇంగ్లిష్లో వాటర్ గ్రిడ్కు బదులు జలహారంగా ఇవ్వడం ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను సందిగ్ధానికి గురిచేసిందని నిపుణులు పేర్కొన్నారు. -
పుడమి పూసింది
బతుకమ్మకుంట (జనగామ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుక మ్మ పండుగను నిర్వహించుకోవడానికి తెలంగాణ ప్రజలు గర్వపడాలని సినీగేయ రచ యిత, స్వచ్ఛ భారత్ ప్రచార కర్త సుద్దాల అశోక్ తేజ అన్నారు. పట్టణంలోని బతుకమ్మకుంటలో మంగళవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్తేజ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ పేదల పండుగని, తంగే డు, గునుగు, ముత్యాల పూలు తెలుగింటి ఆడపడుచులకు పసుపు కుం కుమలతో సమానమని ఆయన అభివర్ణించారు. జనగామలో సద్దుల బతుకమ్మలో పాల్గొనడం తనకు పుట్టింటికి వచ్చినంత సంతోషాన్ని కలిగించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్లో కవి హృదయం ముఖ్యమంత్రి కేసీఆర్లో కళాకారుడితో పాటు కవి హృదయం దాగి ఉం దని సుద్దాల అశోక్తేజ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీ స్థాపిం చక ముందే పాటలు రాయడం మొదలు పట్టామని, కేసీఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేశారు. గుంటూరు జిల్లాలో గుంట జాగ అడిగినమా.. అనే పాటకు కేసీఆరే స్ఫూర్తి కలిగించాడన్నారు. రచయితగా తన 22ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో తెలంగాణ ఉద్య పాటలతో పాటు అమరవీరుల త్యాగాలను స్మరించుకునే పాటలు మరువలేనివన్నారు. ‘పొద్దు తిరుగుడు పువ్వు.. పొద్దును ముద్దాడే... తొలి పొద్దును ముద్దా డే... అడవిలో వెన్నెలమ్మ ఆకును ముద్దాడే.. చిగురాకును ముద్దాడే.. అంటూ ఆలపించిన పాట మహిళా లోకాన్ని ఆలోచింపజేసింది. -
చిలుకూరులో బతుకమ్మ సంబురాలు
సోమవారం నుంచి 20వ తేదీ వరకు.. * జిల్లాస్థాయిలో కార్యక్రమాలన్నీ ఇక్కడే * చిలుకూరు మహిళా ప్రాంగణంలో పండుగ వాతావరణం సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న బతుకమ్మ పండుగకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాలకు మొయినాబాద్ మండలం చిలుకూరు వేదికగా నిర్ణయించింది. సోమవారం నుంచి పది రోజులపాటు జరిగే బతుకమ్మ సంబరాల్లో రోజుకోవిధంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టనున్నారు. 14వ తేదీన జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చిలుకూరులోని మహిళా ప్రాంగణం (టీటీడీసీ)లో 16న వికారాబాద్లో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో, 17న కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మండల కేంద్రాల్లోనూ గతేడాది మాదిరిగా సంబరాలు నిర్వహించాల్సిందిగా కలెక్టర్ రఘునందన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబరాలు ఇలా.. 12న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మలు, పాఠశాల, కళాశాల విద్యార్థినులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న బాలికా సంరక్షణ అంశంపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, 14న విద్యార్థినులకు వివిధ అంశాల్లో పోటీలు, 15న మహిళా ప్రజాప్రతినిధులతో మహిళా సాధికారత ప్రదర్శన, 16న బాలికలకు రంగోలీ పోటీలు, 17న మాతాశిశు సంరక్షణ పథకాలపై ప్రదర్శనలు, 18న మహిళల ఆర్థిక స్వాలంబనపై ప్రదర్శనలు, 19న మహిళా ఉద్యోగిణులతో ఆటాపాట, 20న సాంస్కృతిక ప్రదర్శనలు, సంబరాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు కూడా అందిస్తారు. అనంతరం 21న హైదరాబాద్లో జరిగి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో జిల్లా తరఫున 100 మంది బృందం పాల్గొననుంది. -
గ్లోరియస్ ఆర్ట్
-
ఉత్సవ శోభ
మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం నేటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర నేడు బోనాల సమర్పణ...రేపు ‘రంగం’ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. ఆదివారం బోనాలు సమర్పిస్తారు, సోమవారం ‘రంగం’ కార్యక్రమం ఉంటుంది. 48 గంటల పాటు అమ్మవారిని నిరంతరాయంగా దర్శించుకునే అవకాశంకల్పించారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా. రాంగోపాల్పేట్: తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో జరిగే ఈ ఉత్సవాలకు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు, సోమవారం ‘రంగం’ కార్యక్రమం ఉంటుంది. జంటనగరాల్లోనే ఎంతో వైభవంగా నిర్వహించే మహంకాళి బోనాల ఉత్సవాల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. జంటనగరాల నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడి అమ్మవారికి సాక పెట్టి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం 4 గంటలకు స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి మొదటి పూజ చేస్తారు. అనంతరం భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతినిస్తారు. 48 గంటల పాటు అమ్మవారిని నిరంతరాయం దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆలయం ముస్తాబు... ఈ సంవత్సరం మహంకాళి బోనాల జాతరలో సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాలయాన్ని మొత్తం రంగులతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల నిర్మాణాలు, ప్యాచ్ వర్కులు పూర్తి చేశారు. మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు జనరేటర్లు, 2 మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉంచుతున్నారు. క్యూలైన్లో ఉండే భక్తుల కోసం రెండు బారీ తెరలు ఏర్పాటు చేసి దేవాలయం లోపల, బయట జాతర దృశ్యాలను ప్రదర్శిస్తారు. బోనంతో వచ్చే భక్తులకు ప్రత్యేక లైను భక్తుల కోసం 5 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళలు 20 నిమిషాల్లో అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు వచ్చిన సమయంలోనూ ఈ క్యూలైన్ ఆపకుండా భక్తులను లోపలికి పంపిస్తారు. బాటావైపు నుంచి బోనాలతో వచ్చే మహిళల క్యూలైన్, రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్ నుంచి ఒకటి, వీఐపీ పాస్లతో వచ్చే వారికి దీని పక్కనే మరొకటి, సాధారణ భక్తులకు క్యూలైన్, అంజలీ థియేటర్, టొబాకో బజార్ నుంచి రెండు సాధారణ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీలు వచ్చిన సమయంలో దేవాలయ ఆర్చ్ గేటు నుంచి నేరుగా దేవాలయం లోపలికి తీసుకుని వెళ్తారు. ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నాలుగు కూడళ్లలో 550 మంది కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్, బాటా చౌరస్తా, సీఎంఆర్, రాణిగంజ్ చౌరస్తాలో ఈ కళాబృందాలు భక్తులను అలరించనున్నాయి. 3వ తేదీ సోమవారం రంగం రోజు అంబారీ ఊరేగింపులోనూ ప్రత్యేకత ఉంటుంది. గుర్రాలు, ఒంటెలు, లంబాడా నృత్యాలు, బాజా బజంత్రీలతో కోలాహలంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఉచిత ప్రసాదాల పంపిణీ మొట్టమొదటి సారిగా ఈ సంవత్సరం జాతరకు వచ్చే భక్తులకు దేవాలయం తరుపున ఉచితంగా ప్రసాదం (పులిహోర) పంపిణీ చేస్తున్నారు. దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత టొబాకో బజార్లో ఈ కౌంటర్ ఏర్పాటు చేశారు. మొబైల్ టాయిలెట్లు మహిళలకు పురుషులకు నాలుగు చోట్ల మొబైల్ టాయిలెట్లను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ వద్ద, అంజలీ థియేటర్ వద్ద రెండు సాధారణ ప్రజలకు, పోలీస్స్టేషన్కు మరోవైపు, దేవాలయం వెనుకవైపు వీఐపీలకు టాయిలెట్లు సిద్ధం చేశారు. వీటితో పాటు చుట్టు పక్కల ఉండే టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు బోనాల జాతర కోసం ఉత్తర మండలం డీసీపీ ప్రశాశ్రెడ్డి నేతృత్వంలో 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 55 మంది సీఐలు, 155 మంది ఎస్సైలు, 700 మంది కానిస్టేబుళ్లును నియమించారు. అలాగే 10 ప్లాటూన్ల బలగాలను, సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాలు ఇవే.. బోనాల జాతరకు వాహనాల్లో వచ్చే వారికి ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సీఎంఆర్, ప్యారడైజ్, పార్క్లేన్ గాంధీ విగ్రహం, రాణిగంజ్ అడవయ్య చౌరస్తాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేడు ఘటాల ఊరేగింపు... చార్మినార్: ఆషాడ బోనాల ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం పాతబస్తీలో ఘటాల సామూహిక ఊరేగింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాలిబండలోని కాశీ విశ్వనాథ ఆలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపు లాల్దర్వాజా మోడ్ మీదుగా ఆయా ఆలయాలకు చేరుకుంటుంది. లాల్దర్వాజా మోడ్ వద్ద హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఘటాలకు స్వాగతం పలుకుతారు. ప్రత్యేక పూజలు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద శనివారం సందడి కనిపించింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు, సాక, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ ఏర్పాట్లు పరిశీలించారు. ఐజీ నాగిరెడ్డి, డీసీపీ ప్రకాశ్రెడ్డి, తదితర ఉన్నతాధికారులతో కలిసి ఆయన శాంతిభద్రతలు, ట్రాఫిక్ గురించి సమీక్షించారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్, బండ కార్తీకరెడ్డి, ఎమ్మెల్యే సంపత్ తదితరులు శనివారం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గాజులు, పసుపు కుంకుమ పంపిణీ మున్నూరు కాపు మహాసభ కాచిగూడ ఆధ్వర్యంలో మహిళా భక్తులకు గాజులు, పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు. అధ్యక్షులు ఆనంద్కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహులు, కార్యదర్శి చామకూర ప్రదీప్, సభ్యులు మానిక్ప్రభు, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
పండుగలా అవతరణ వేడుకలు
అధికారులకు సీఎస్ రాజీవ్శర్మ ఆదేశం జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు కార్యక్రమాలు పరేడ్ మైదానంలో అవతరణోత్సవాలు తెలంగాణ సంస్కృతి, వైభవానికి ఉత్సవాల్లో పెద్దపీట ట్యాంక్బండ్పై ముగింపు ఉత్సవాలు హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పండుగలా నిర్వహించాలని ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ అధికారులను ఆదేశించారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించాలని, ఇందుకోసం జిల్లా ఇన్చార్జి మంత్రులను సంప్రదించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై బుధవారం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 2న ఉదయం 9 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అమర వీరులకు నివాళి అర్పించేందుకు జిల్లాల్లో అమరవీరుల స్తూపాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, ట్రాఫిక్ ఐలాండ్లు, ప్రధాన ర హదారులను విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు. రాజధానిలో.. హైదరాబాద్లో జూన్ 2న ఉదయం 9.30 నుంచి 11.30 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. పోలీసుల మార్చ్ఫాస్ట్, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన ఉంటుంది. రాజ్భవన్, నెక్లెస్రోడ్డు, హుస్సేన్సాగర్, లుంబినీపార్కు, ట్రాఫిక్ ఐలాండ్లు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. దుకాణాలు, ప్రైవేటు సంస్థల్లోనూ రాష్ట్ర అవతరణ ఉత్సవ లోగోలు ప్రదర్శిస్తారు. రెండో తేదీ రాత్రి 8 గంటలకు పీపుల్స్ప్లాజాలో బాణసంచా కాల్చుతారు. వైభవం, సంస్కృతిని చాటేలా.. తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేలా సాంస్కృతిక వారధి కళాకారులు ‘తెలంగాణ సాంస్కృతిక జైత్రయాత్ర’ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ప్రణాళికను సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వెల్లడించారు. కళాకారులు ప్రతిరోజు రెండు జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 2న నెక్లెస్రోడ్డులో, 3న మెదక్, నిజామాబాద్, 4న ఆదిలాబాద్, కరీంనగర్, 5న వ రంగల్, ఖమ్మం, 6న నల్లగొండ, మహబూబ్నగర్లో జైత్రయాత్ర నిర్వహిస్తారు. ఏడో తేదీన హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై భారీ ప్రదర్శన నిర్విహ స్తారు. ఈ కార్యక్రమం సరికొత్త పంథాలో ఉండేలా కళాప్రదర్శనలు రూపొందిస్తున్నారు. ఆవిర్భావ వేడుక లపై తెలంగాణ సాంస్కృతిక వారధి రూపొందించిన 10 వేల సీడీలను, సీఎం కేసీఆర్ సందేశంతో కూడిన తెలంగాణ మాసపత్రిక కాపీలను జిల్లాలకు పంపించారు. -
వైభవంగా అవతరణం
వారం రోజులపాటు వేడుకలు - రూ.కోటి నిధులు విడుదల.. ఉత్తమ అవార్డుల అందజేత - తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు - తొలి అవతరణ వేడుకలపై కలెక్టర్ సమీక్ష హన్మకొండ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ తొలి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. జూన్ ఒకటి అర్ధరాత్రి నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అధికారులు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వారంపాటు రంగు రంగుల విద్యుత్ వెలుగుల్లో ఉండేలా చర్యలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి నిధులు విడుదల చేసింది. ఉత్సవాల్లో కాకతీయుల చరిత్రపై కూడా కళాప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకతీయ పట్నాభివృద్ధి సంస్థ (కుడా), టూరిజం, మహా నగరపాలక సంస్థల సమన్వయంతో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఒక్కో పనికి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థలను కలెక్టర్ కోరారు. ఉత్సవాల ఏర్పాట్లుపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎస్పీ అంబర్ కిషోర్ఝాతో కలిసి కలెక్టర్ వాకాటి కరుణ సమీక్షించారు. 31 నుంచి ఏర్పాట్లు ఈనెల 31 నుంచి నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ భ వనాలు, కళాశాలలు, విద్యా, వాణిజ్య సంస్థల భవనాలకు విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలని క లెక్టర్ కోరారు. పబ్లిక్గార్డెన్లో కళాప్రదర్శనతోపా టు. జిల్లావ్యాప్తంగా కళాకారుల కళారూపాలు ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానకూడళ్లలో ఫుడ్ కోర్డులు, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిభిరాలు, మ్యూ జికల్ కాన్సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. 5కే రన్తోపాటు ముగింపు కార్యక్రమాలు జూన్ 7న కనుల పండవగా ఉండేలా ముగింపు వేడుకలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పనుల నిర్వాహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. వారం రోజులపాటు... జిల్లా వ్యాప్తంగా వారంరోజుల పాటు స్థానిక కవులు, కళాకారులతో కార్యక్రమాలు, అవధానాలు, కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, ఖవ్వాలీలు, గజల్స్, కళాప్రదర్శనలు నిర్వహించనున్నారు. సేవా ప్రతిభ అవార్డులు... వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉత్తమ అవార్డులు అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లాస్థాయి కమిటీ ఉత్తములను ఎంపిక చేయనుంది. కమిటీలో జిల్లా మంత్రి, ఉపాధ్యక్షులుగా జెడ్పీ చైర్పర్సన్, సభ ్యకన్వీనర్గా కలెక్టర్ ఉంటారు. వివిధ శాఖలనుంచి ఈనెల 25లోగా ఉత్తమ ఉద్యోగి, ఉద్యోగినుల పేర్లు జిల్లా కమిటీకి అందజేయాలి. కమిటీ తుదిజాబితా ఖరారు చేస్తుంది. అదేవిధంగా స్వచ్ఛభార త్, హరిత హారం అవార్డులు కూడా అందజేయనున్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ సుధాకర్రావు, ఏజేసీ తిరుపతిరావు, డీఆర్వో శోభ, ఆర్డీఓ మాధవరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్రావు, టూరిజం అధికారి శివాజి, ‘కుడా’ అధికారి అజిత్రెడ్డి, జెడ్పీ సీఈఓ, డ్వామా పీడీ శేఖర్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. రోజువారీ కార్యక్రమాలు... - జూన్ ఒకటి రాత్రి 10.30 : స్థానిక కళాకారులతో ఉత్సవాలు ప్రారంభం. - అవతరణకు సూచికగా రాత్రి 11.55 నుంచి 12.10 వరకు అమరవీరుల స్థూపం, కీర్తి స్థూపం వద్ద బాణసంచా పేలుళ్లు. - జూన్ 2 : అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం7.30నుంచి 8.30 మధ్యజాతీయ పతాక ఆవిష్కరణ. అమరవీరుల స్థూపాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించడం, పరేడ్ గ్రౌండ్లో ఉపముఖ్యమంత్రి పతాకావిష్కరణ, ఉత్తములకు అవార్డులు, సాంస్కృతిక కార్యక్రమాలు. - జూన్ 7 : ముగింపు కార్యక్రమాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, సంబరాలు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కవితల పోటీలు... విద్యారణ్యపురి : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ సోషల్స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో కవితల పోటీలు నిర్వహించనున్నట్లు ఆఫోరం జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, కార్యదర్శి గిరిగాని కృష్ణ తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్ధి విభాగాల వారీగా కవితలను ఒక పేజీకి మించకుండా ఈనెల 28తేదీలోపు పోస్టుద్వారా కాకతీయ సోషల్స్టడీస్ ఫోరం, ఇంటినెంబర్ 19-10-257, రంగశాయిపేట, వరంగల్ పేర పంపాలని సూచించారు. కేఏఎస్ఓఎఫ్వో డబ్లూజీఎల్.జిమెయిల్.కామ్ వెబ్సైట్కు కూడా పంపవచ్చని పేర్కొన్నారు. రెండు విభాగాల నుంచి పది మంది చొప్పున ఎంపిక చేసి జూన్ 3న డీఈఓ చేతులమీదుగా వారికి ప్రశంసపత్రాలు, మెమొంటోలను అందజేయనున్నట్లు వెల్లడించారు. -
బోనమెత్తిన శకటం సకల కళామకుటం
కొత్తగా ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణ గణతంత్రదినోత్సవాల్లో తన తొలి శకటాన్ని ప్రదర్శిస్తోంది. దేశ సార్వభౌమాధికారాన్ని చాటే ఉత్సవాల్లో తొలిసారి ’ తెలంగాణ స్వేచ్ఛా స్వరూపం, సంస్కృతీ సంప్రదాయాల ‘ప్రతిరూపం’ సగర్వంగా సాక్షాత్కరించనుంది. దేశ ప్రథమపౌరునితో పాటు అగ్రరాజ్యాధినేత ఒబామా సాక్షిగా తెలంగాణ వైభవం కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ శకటానికి రూపుకట్టిన మన రాష్ట్ర ప్రసిద్ధ చిత్రకారుడు, హైదరాబాద్ నివాసి ఎం.వి.రమణారెడ్డి తన మనోభావాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారిలా.. - ఎస్.సత్యబాబు తొలి తెలంగాణ శకటాన్ని రూపొందించే అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అనుమతి ఆలస్యం కావడం వల్ల అతి తక్కువ సమయమే ఉన్నా ఛాలెంజ్గా తీసుకున్నాం. మిగిలిన రాష్ట్రాల శకటాలకు థీటుగా 15 రోజుల రికార్డ్ టైమ్లో దీన్ని రూపొందించాం. తెలంగాణ సంస్కృతికి రెండు కళ్లలాంటివి బతుకమ్మ, బోనాలు. డిఫెన్స్ విభాగం సమకూర్చిన 45 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉన్న ప్రత్యేక వాహనం వేదికగా... బోనాల వైభవాన్ని చాటుతున్నాం. ప్రస్తుతం మహిళల రక్షణ సమాజంలో అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో మహిళా రక్షకుడిగా, శక్తిమంతమైన పోతరాజును చూపుతున్నాం. ఈ శకటానికి ముందు భాగంలో పోతరాజు భీకర రూపం ఉంటుంది. వెనుక భాగం గోల్కొండ కోటను చూపుతుంది. సంప్రదాయదుస్తుల్లో బోనమెత్తిన ఇద్దరు మిహ ళలుంటారు. డప్పు, కొమ్ము, తష, పగడం... పరికరాలను వాయించే 25 మంది కళాకారుల ప్రత్యక్ష ప్రదర్శన మరో ప్రధాన ఆకర్షణ. దీనితో పాటే మహంకాళి అమ్మవారి మాటగా భవిష్యవాణిని చెప్పే మహిళ... అచ్చమైన బోనాల సందడితో, అణువణువూ అద్భుతమైన తెలంగాణ ప్రతిరూపంగా దీన్ని మలుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన కొరియోగ్రాఫర్ రాఘవరాజ్ భట్, డప్పు కళాకారుడు శేఖర్,10మంది యువతులు... మరెందరో ఈ సందడిలో భాగం అవుతున్నారు. మొత్తం 18 రాష్ట్రాలు, 25 శకటాలతో 4కి.మీ సాగే ఈ పెరేడ్లో మన శకటానిది 9వ నెంబరు. వ్యక్తిగతం... సిద్ధిపేటలో పుట్టాను. తెలంగాణ బిడ్డగా... చిత్రకారుడిగా తెలంగాణ చిత్రకారులను ఏకతాటి మీదకు తెచ్చి తెలంగాణ ఆర్టిస్ట్స్ ఫోరంను ఏడేళ్ల క్రితమే ఏర్పాటు చేశాను. పేద, ప్రోత్సాహం కరవైన తెలంగాణ చిత్రకారుల కోసం పదుల సంఖ్యలో పది జిల్లాల్లో ఆర్ట్ క్యాంప్ లు నిర్వహించాను. పేరు తెచ్చిన కాన్వాస్నే సాధనంగా చేసుకుని పుట్టిన గడ్డకు సేవ చేయాలనేదే నా లక్ష్యం. -
ధూంధాంగా ఏడుపాయల జాతర
పాపన్నపేట: ‘‘మాస్టర్ ప్లాన్తో ఏడుపాయలకు మెరుగులు దిద్దుతాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న తొలి అతిపెద్ద జాతర ఏడుపాయలే. ఇక నుంచి ఏడుపాయల వనదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తాం. మాస్టర్ ప్లాన్ సర్వే కోసం రూ.20 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నాం. జానపదుల జాతరగా పేరొందిన ఏడుపాయల జాతరను ధూంధాంగా నిర్వహించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేందుకు శాయశక్తులా కృషి చేస్తాం’’ అని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏడుపాయల్లో మాఘ అమావాస్య ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏడుపాయల జాతరను తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ఎస్.కుమార్ ఆర్కిటెక్చర్ కంపెనీతో ఒప్పందం జరిగినట్లు చెప్పారు. వెంటనే యాక్షన్ప్లాన్ తయారు చేసేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి అతిపెద్ద జాతర ఏడుపాయల జాతరేనన్నారు. ఇకనుంచి ప్రతి మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వం తర ఫున దుర్గమ్మతల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, ఈ మేరకు దేవాదయ శాఖ మంత్రితో మాట్లాడామని చెప్పారు. ఈ మహాజాతరను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఈనెల 24న కలెక్టర్, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతిరోజు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏడుపాయల్లో విశాలమైన రోడ్లు, అందరికీ సరిపడ తాగునీరు, విద్యుత్ కాంతులు, పచ్చని హరిత వనాలు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. జైకా నిధుల కింద అమ్మవారి ఆలయం ఎదుట బ్రిడ్జిని, 33/11కేవీ సబ్స్టేషన్ను, ఔట్పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు. వనదుర్గ ప్రశస్తిని తెలంగాణలోని పల్లెపల్లెకూ విస్తరింపజేస్తామన్నారు. అమ్మవారి పవిత్రతను కాపాడుతూ యజ్ఞశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. డిప్యూటీ స్పీకర్ వెంట పాలక మండలి చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఆర్డీఓ మెంచు నగేష్, ఈఓ వెంకట కిషన్రావులు ఉన్నారు. -
తెలంగాణ సంస్కృతిని చాటాలి
* రాష్ట్ర యువజనోత్సవాల ప్రారంభోత్సవంలో మంత్రి మహేందర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను జాతీయ స్థాయిలో చాటిచెప్పాలని మంత్రి పి.మహేందర్రె డ్డి కళాకారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని శిల్పారామంలో రాష్ట్ర యువజనోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ కళాకారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అస్సాంలోని గౌహతిలో ఈ నెల 8 నుంచి జరిగే జాతీయ యువజనోత్సవాలలో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలుండాలని సూచించారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె.వి.రమణాచారి, రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల కార్యదర్శి లవ్ అగర్వాల్, టెన్నిస్ క్రీడా కారిణి నైనా జైస్వాల్, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. కాగా, అట్టహాసంగా ప్రారంభమైన యువజనోత్సవాల్లో 18 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. 10 జిల్లాల నుంచి దాదాపు 650 మంది కళాకారులు విచ్చేశారు. పల్లే అందాలు సింగారించుకున్న శిల్పారామంలో కళాకారుల కోలాహలం నెలకొంది. సంప్రదాయ వేదికలో సంప్రదాయ నృత్యాలు, యాంఫీ థియేటర్లో జానపద నృత్యా లు, గేయాలు, శిల్పసంధ్యా వేదికలో సంప్రదాయ వాయిద్యాలు, క్రాఫ్ట్ సెంటర్లో వ్యాస రచన, వక్తృత్వం, మిమిక్రీ తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలు గౌహతిలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొంటారు. -
తెలంగాణ సంస్కృతి చాటి చెప్పాం
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఢిల్లీ ప్రగతిమైదాన్లో నిర్విహ స్తున్న ట్రేడ్ ఫెయిర్ ఓ వేదికగా నిలుస్తోందని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డా. వేణుగోపాలాచారి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ ట్రేడ్ ఫెయిర్లో తెలంగాణ పెవిలి యన్కు అశేష ఆదరణ లభిస్తోందన్నారు. ట్రేడ్ ఫెయిర్లో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను ప్రగతిమైదాన్ లాల్చౌక్ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలకు వేణుగోపాలచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అనువైన పరిస్థితులున్నాయని, సింగిల్విండో పద్దతిలో కావాల్సిన అనుమతులు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారని వివరించారు. తెలంగాణ కళారూపాలకు వందల ఏళ్లనాటి చరిత్ర ఉందని వివరించారు. పేరిణినాట్యం ఎంతో గొప్పదన్నారు. ఈ సందర్భగా కళాకారులు ప్రదర్శించిన పేరిణి నాట్యం అలరించింది. కళాకృష్ణ నేతృత్వంలో లయబద్దంగా కళాకారులు శ్రీధర్, వెంకట్, రమాదేవి, జయప్రద, పావనిలు అలరించారు. అనంతరం నిర్వహించిన ఖవ్వాలీకి అనూహ్య స్పందన లభించింది. ఉత్తరాదికి చెందిన పలువురు హైదరాబాదీ వార్సి సోదరుల ఖవ్వాలీకి మంత్రముగ్ధులయ్యారు. జనాబ్జీ మహబూబ్, జబ్బార్, అజిత్ఖాన్,సబీ తదితరులు అలరించారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్కుమార్ నాయక్, తెలంగాణ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ అజయ్ మిశ్రా, ఇండస్ట్రీస్ కమిషనర్ జయేష్ రంజన్, ఇన్ఫర్మేషన్ అధికారి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఐలోని జాతరకు అధికారిక గుర్తింపు
ఐనవోలు(వర్ధన్నపేట) : జానపదుల జాతరగా ప్రసిద్ధిచెందిన ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. మండలంలోని ఐనవోలు గ్రామంలో కొలువుదీరిన యాదవుల ఇలవేల్పు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఈ జాతరను తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా ప్రభుత్వమే వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్ రెండు రోజుల క్రితం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతర ఏర్పాట్లపై సమీక్ష జరిపి అవసరమైన నిధులు సమకూర్చాలని కలెక్టర్ కిషన్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జాతర నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనులు వేగవంతం వచ్చే ఏడాది జనవరి 13, 14, 15 తేదీల్లో ఐలో ని మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండగా ముఖ్యమంత్రి నిర్ణయంతో అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంది. ఆలయం ఎదురుగా ఉన్న నృత్యమండపం ప్రాంగణంలో కుడా ఆధ్వర్యంలో రూ.16 లక్షలతో చేపట్టిన ఫ్లోరింగ్ పనులు మూడు నెలలుగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రధా న ద్వారం కుడివైపు కూడా రూ. 21.5 లక్షలతో ఫ్లోరింగ్ పనులకు టెండర్లు పిలిచారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి దర్పణంగా ఉన్న కాకతీయ కళాతోరణం, నృత్యమండపం, ఆలయ కట్టడానికి నష్టం వాటిల్లకుండా అభివృద్ధి పనులు నిర్వహించడానికి పురావస్తుశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నృత్య మండపంపై ప్రత్యేక దృష్టి ఆలయం ఎదురుగా పూర్తిగా శిథిలావస్థకు చేరిన నృత్య మండపాన్ని ఇప్పటికిప్పుడు పూర్తిగా అభివృద్ధి చేయడం సాధ్యం కాకపోనా తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. ఆలయంలో నూతనంగా గాలిగోపురం నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న కల్యాణ కట్ట నిర్మాణం పూర్తి చేసేలా పురావస్తుశాఖ అధికారులు ముందుకెళ్తున్నారు. ప్రత్యేక స్నానఘట్టాలు జాతరకు లక్షకు పైగా భక్తులు రానుండడంతో స్నానఘట్టాలను నిర్మించే చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ సమీపంలోని వడ్లవానికుంట లోకి దేవాదుల నీటిని విడుదల చేసి కట్టకు శాశ్వత స్నానఘట్టాలను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. మేడారం జాతరలాగా బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ను ఏర్పాటు చేసేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఎంపీ దత్తత గ్రామంగా ఐనవోలు.. సంసద్ గ్రామీణ యోజన పథకంలో ఐనవోలు గ్రామాన్ని ఎంపీ కడియం శ్రీహరి దత్తత తీసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రయాణం సులభతరం చేయడానికి ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. రూ.8 కోట్లు ఆర్ఆండ్బీ నిధులతో పెద్దపెండ్యాల, వెంకటాపూర్, ఐనవోలు, పున్నేలు రహదారిని విస్తరించే పనులను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. దీంతోపాటు గ్రామంలో 132/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే రమేష్ వెల్లడించారు. -
నా ఊరే..నా చిత్రం
అడుగులు నడకలు నేర్పిన ఇల్లు... కోయిల చిలుకల ఆవాసాలైన చెట్లు...నేడు వర్ణ రంజితమై ప్రకాశిస్తున్నాయి. పల్లె పడచుల వయ్యారాలు.. వారు అలంకరించుకున్న వస్త్రాభరణాలు...కాన్వాస్పై కవితలల్లుతున్నాయి. పుట్టిన ఊరు.. పెరిగిన పరిసరాలు.. కనులను తాకి... కలలను రేపిన ప్రతి దృశ్యం ఇప్పుడు అపు‘రూపం’. మనసును తడిమి.. కుంచెగా మారిన ‘జీవన చిత్రం’ తోట వైకుంఠం. తెలంగాణ సంస్కృతికి విశ్వఖ్యాతి తెచ్చిన రుషి.. తన నేపథ్యమే ‘చిత్రమై’... స్ఫూర్తి నింపుతున్న వైకుంఠం ప్రయాణం ‘సిటీ ప్లస్’కు ప్రత్యేకం. కరీంనగర్ జిల్లాలో మాది మారుమూల గ్రామం... బూరుగుపల్లి. వేములవాడకు ఐదు కిలోమీటర్లు. ఇప్పటికీ మా ఊరికి బస్సు లేదు. చిన్నప్పటి నుంచీ ఆర్టిస్టును కావాలనే కోరిక. మెట్రిక్యులేషన్ తరువాత 1960లో చిత్రకళ నేర్చుకోవాలని హైదరాబాద్కు వచ్చా. ఇక్కడి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఓ ఫ్రెండ్ ఉండేవాడు. సీనియర్. ఎందుకొస్తావు ఇక్కడికి! ఇది నేర్చుకుని మహా అయితే డ్రాయింగ్ టీచర్ కాగలవు.. అంటూ నిరాశపరచాడు. నేనేమో.. ఏ ఎలక్ట్రికలో, మెకానికలో (ఐటీఐ) నేర్చుకోవచ్చంటే... నాన్నతో కొట్లాడి మరీ సిటీకి వచ్చా. అంతా కొత్తగా... సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్లి అక్కడి నుంచి నగరానికి రైల్లో వచ్చా. రైలును చూడటం అప్పుడే. కాచిగూడ స్టేషన్లో దిగా. జట్కా బండ్లు, సైకిళ్లు, రిక్షాలు.. విద్యుత్ కాంతులు... పెద్ద హంగామా! కోఠి భారతీయ విద్యాభవన్ సమీపంలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఉండేది. గంగారామ్ అని మంచి సింగర్. ఆయనతో కలసి హాస్టల్లో ఉండేవాడిని. హైదరాబాద్ రావడానికి ఆయనే సాయం చేశాడు. అన్నీ కలిపి ఇరవై... రూమ్ అద్దె, భోజనం, ఇతర ఖర్చులూ అన్నీ కలిపి నెలకు ఇరవై రూపాయల్లో అయిపోయేది. అప్పట్లో దుర్గా విలాస్లో ఫుల్ మీల్స్ 60 పైసలు. బృందావన్లో గ్రాండ్ భోజనం రూపాయే. సీనియర్ల సహవాసం... ప్రముఖ ఆర్టిస్టులు సూర్యప్రకాశ్, లక్ష్మాగౌడ్ కాలేజీలో నాకు సీనియర్లు. కాలేజీలో చెప్పే పాఠాలేవీ నాకు ఆర్ట్లా అనిపించలేదు. తిరిగి వెళ్లిపోదామన్నంత ఫీలింగ్. కానీ, నాన్నతో కొట్లాడి వచ్చా కదా..! అందుకే ఆగానేమో! రూమ్మేట్ సత్యానంద్. ఆయనది కాకినాడ. ఎడ్యుకేటెడ్. హోదాగల పెద్ద ఫ్యామిలీ వాళ్లది. పెయింటింగ్స్ బాగా వేసేవాడు. ఆయనకు సైకిల్ ఉండేది. అప్పట్లో అదో స్టేటస్ సింబల్. ఓసారి కాళీయమర్దనం వేయమంటే... అంతా ఒకేలా గీశారు. అతనొక్కడే డిఫరెంట్గా, అద్భుతంగా వేశాడు. అతని ఆర్ట్లో మోడ్రనైజేషన్ కనిపించేది. ఫతే మైదాన్.. పబ్లిక్ గార్డెన్... నన్ను ప్రోత్సహించి, కొత్త మార్గం చూపింది లక్ష్మాగౌడ్. ఓసారి ఫతేమైదాన్కు తీసుకెళ్లాడు. అక్కడున్న స్ట్రీట్ చూసి... యాజ్ ఇటీజ్గా గీయమన్నాడు. తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్.. అక్కడి పరిసరాలు, గుర్రాలు, జట్కాలు. చివరకు అదో హాబీగా మారిపోయింది. రోజూ కాలేజీకి వెళ్లే ముందు పబ్లిక్ గార్డెన్కు వెళ్లి... పూల తోటలు, మసీద్ వంటివన్నీ గీస్తూ ఉండేవాడిని. ఫ్రెండ్స్ షరీఫ్, అబ్బూరి గోపాలకృష్ణ, నరసింహారావు, కర్నారావు (ప్యారిస్) కూడా బాగా ప్రోత్సహించారు. అంతా కాపీనేగా! ఏంచేయాలన్నా నాకు డబ్బు సమస్య. దాంతో పెయింటింగ్స్ వేయలేకపోయా. 1964లో బాంబే వెళ్లి కొన్ని ట్రయల్స్ వేశా. వర్కవుట్ కాలేదు. వెనక్కి వచ్చేశా. దేవరకొండ వెళ్లి ఓ ప్రైవేటు స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేరా. రెండుమూడేళ్లు చేసి, నచ్చక వదిలేశాను. బరోడా (1970) మహారాజా గైక్వాడ్ స్కూల్లో ఇండియన్ అండ్ వెస్ట్రన్ ఆర్ట్పై చర్చాగోష్టి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల నుంచి ఆర్టిస్టులు వచ్చారు. ఎవర్ని చూసినా.. హీరోలా పోజిచ్చేవారు. వాళ్లంతా... ‘మీ భారత్లో ఏముంది.. అంతా వెస్ట్రన్ ఆర్ట్ను కాపీ కొట్టడమేగా’ అన్నారు. అప్పుడు ఆలోచించా.. నా ప్రత్యేకత, శైలి ఏముందని! నేటివిటీనే నేపథ్యం... వెనక్కి వచ్చి మళ్లీ ఉద్యోగంలో చేరా గానీ... మనసు మాట వినడం లేదు. అవే కామెంట్స్ రింగుమంటున్నాయి. అదే నాలో ఆలోచనలు రేపింది. స్థానిక పరిసరాలు, సంస్కృతి, సంప్రదాయాలు తీసుకొని పెయింటింగ్స్ వేస్తే వాటిల్లో జీవ కళ ఉంటుందని అర్థమైంది. నా ఊరు... నేను చూసిన మనుషులు... అక్కడి పండుగలు... పబ్బాలు... ఇప్పుడు ఇవే నా ఆర్ట్కు మూలం. శ్రమ జీవి ముఖం చూస్తే... అతడి కథ, కష్టం తెలుస్తుంది. అంత డెప్త్ ఉంటుందా మోములో. పల్లె పడచులు వేసుకొనే వస్త్రాలు, ధరించే ఆభరణాలు, పాలేర్లు, ఆడుకోవడం, ముస్తాబవడం, చిలుక, అద్దం.. ఇలా అన్నీ నా ఊళ్లో చిన్నప్పటి నుంచి నేను చూసినవే. నా ఆర్ట్ అంతా లైన్స్, ఫ్లాట్ సర్ఫేస్, డాట్స్. అన్నీ ప్రకృతిలో కనిపించే ప్రైమరీ కలర్సే. ‘మై కలర్స్ ఓన్లీ బిలాంగ్స్ టు మై విలేజ్’. అందుకే నా చిత్రాల్లో లైట్స్, షాడోస్ ఉండవు. దాంతో తొలినాళ్లలో అవి ఎవరికీ నచ్చలేదు. ఇవేం పెయింటింగ్స్ అన్నారు. హుస్సేన్కు నచ్చింది... నాలుగైదేళ్లు ఇలా గడిచిపోయాయి. భోపాల్లో పెయింటింగ్ ఎగ్జిబిషన్. అందులో ప్రదర్శించే పెయింటింగ్స్ సెలెక్ట్ చేయడానికి ఓ కమిషన్ వేశారు. దానికి లక్ష్మాగౌడ్ హెడ్. దాదాపు 70 మంది ఫైనలిస్టుల్లో నా పేరు కూడా ఉంది. ప్రదర్శనలో బెస్ట్ సెలెక్ట్ చేయడానికి కొందర్ని నియమించారు. రెండు రౌండ్లు అయిపోయాయి. నా బొమ్మను ఎవరూ పట్టించుకోలేదు. చివరిగా ఎంఎఫ్ హుస్సేన్ వచ్చారు. ఓ రౌండ్ వేసి... ఠక్కున నా పెయింటింగ్ సెలెక్ట్ చేశారు. లిస్టులో నా పేరుంది. షాకయ్యా. అప్పుడు ఆనందం వర్ణించలేదు. అదే నా లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందులో ప్రైజ్ రూ.25 వేలు. నా పెయింటింగ్ రూ.500కు అమ్ముడైంది. అదే మొదటిది. ఇప్పుడైతే ఎంతైనా ఇచ్చి కొనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా, నా ధ్యాసంతా బొమ్మలు వేయడమే. 2000లో అమెరికా వెళ్లినప్పుడు అక్కడ అందరూ నన్ను గుర్తు పట్టారు. ఆ గొప్ప నాది కాదు, నా బొమ్మలది. వాటిలోని తెలంగాణ సంస్కృతిది. -
ఆర్ట్ ఆఫ్ తెలంగాణ
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకారులు గీసిన చిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. సాలార్జంగ్ మ్యూజియంలో ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ఎగ్జిబిషన్లో 90 మందికిపైగా ఆర్టిస్టులు గీసిన పెయింటింగ్లను ప్రదర్శనకు ఉంచారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్ సోమవారం ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ ఆర్టిస్టులు లకా్ష్మగౌడ్, యక్క యాదగిరి, ఏలె లక్ష్మణ్, శంకర్, అంజూ పొద్దర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12 వరకు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభానికి ముందు సినీ దర్శకుడు బి.నర్సింగరావు 1987లో తీసిన 51 నిమిషాల నిడివిగల ‘మా ఊరు’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తెలంగాణ పల్లెల్లోని వాతావరణానికి కళ్లకు కట్టేలా చూపిన ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించేందుకోసం ఆరు వేల కిలోమీటర్లు చుట్టుముట్టి సుమారు వంద గ్రామాలను కలియ తిరిగానని నర్సింగరావు పాతరోజులను గుర్తుచేసుకున్నారు. -
ప్రేమించడమే తెలంగాణ సంస్కృతి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి అంటే తాగడం, తినడం కాదని.. ఎదుటివారిని గౌరవించడం, ప్రేమించడమే తెలంగాణ సంస్కృతి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. అన్నా హజారే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సంపూర్ణ మద్యనిషేధం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రకుమార్ మాట్లాడుతూ... మద్యం మత్తు వీడినప్పుడే అభివృద్ది సాధ్యపడుతుందని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మద్యరహిత సమాజాన్ని ప్రజలు కోరుకున్నారని గుర్తు చేశారు. నాటి ప్రజల స్వప్నాన్ని సాకారం చేసేలా మద్యరహిత సమాజాన్ని స్థాపించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అన్నా హజారే ఫౌండేషన్ అధ్యక్షులు రంగయ్య గౌడ్, పీవోడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య,అఖిల భారత మహిళా ఫెడరేషన్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ పండుగకు బతుకమ్మ బ్రాండ్
సిద్దిపేట అర్బన్: ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పువ్వులను పండుగగా మార్చిన సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. సిద్దిపేటలో మంగళవారం సాయంత్రం జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. రాత్రి కోమటి చెరువు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణకు బ్రాండ్గా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సిద్దిపేటకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని ఇది సిద్దిపేట ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. బంగారు తెలంగాణ సాధనలో బతుకమ్మ పండుగ పునాదిగా మారాలన్నారు. ఈ విశిష్టమైన బతుకమ్మ పండుగను బావి తరాలకు పదిలంగా అందించడానికే ప్రతీయేటా బతుకమ్మ పండుగలను జాగృతి నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిరాదరణకు గురైందని ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినందు వల్ల మన సంస్కృతిని మనం రక్షించుకోవాలని, ప్రపంచానికి చాటిచెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఐక్యతను పెంచిన బతుకమ్మ పండుగ: మంత్రి హరీష్ తెలంగాణ సుదీర్ఘ ఉద్యమ పథంలో బతుకమ్మ పండుగ అన్ని వర్గాల ప్రజలను ఐక్యంగా నిలిపిందని సమావేశానికి అధ్యక్షతన వహించిన మంత్రి హరీష్రావు అన్నారు. ప్రపంచమంతట బతుకమ్మ పండుగను నిర్వహించడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమన్నారు. మున్ముందు ఈ పండుగను మరింత వేడుకగా నిర్వహిస్తామన్నారు. మహిళలకు బతుకమ్మ బంగారు కానుక: డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి తెలంగాణ ఆడ పడచులకు బతుకమ్మను కానుకగా ఇచ్చారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి చెప్పారు. 14 యేండ్ల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఇందు లో అమరులైన అమరవీరుల తల్లుల గర్బశోకం తీర్చడానికి కేసీఆర్ రూ. పది లక్షల ఎక్స్గ్రేషియాను చెల్లిం చేందుకు నిర్ణయించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జెడ్పీ చైర్మన్ రాజమణి తదితరులు మాట్లాడుతూ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేటలో బతుకమ్మ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కుతుందన్నారు. అనంతరం బతుకమ్మలను కోమటి చెరువులో నిమజ్జనం చేశారు. కాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం పలికారు. -
‘తంగెడి పువ్వులు తెచ్చేవాడిని’
-జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి నిజామాబాద్ కల్చరల్, ప్రగతినగర్ : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం లభించడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ చం ద్రశేఖర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో సోమవారం రాత్రి జరిగిన ‘బంగా రు బతుకమ్మ’ సంబురాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన చిన్నతనంలో బతుకమ్మ పండుగ ఎంతో వైభవంగా జరిగేదన్నారు. బతుకమ్మ కోసం తంగడి పువ్వును తెంపుకు వచ్చేవాడినని గుర్తుచేశారు. ఘనంగా నిర్వహిస్తున్నాం : కలెక్టర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబించే పండుగైన బతుకమ్మను మహిళలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారన్నారు. ఈ పం డుగను వైభ వంగా నిర్వహించేందుకు అధికారి కంగా తమవంతు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
బతుకమ్మ పాటమ్మ ఉయ్యాలో...
తెలంగాణా సంస్కృతి విశిష్ఠమైనదేకాదు విలక్షణమైనది కూడా. తెలంగాణీయులు జరుపుకునే పండుగలన్నీ సామాజిక కౌటుంబిక సంబంధాలకు అద్దం పడుతాయి. బతుకమ్మా అంతే! బతుకమ్మ సహజ సౌందర్యానికి ప్రతీకయైన పండుగ. ఇందులో పేర్చే పూలల్లో తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్షలకే అగ్రతాంబూలం. ఇవి అల్కటల్కటి పూలు. నీళ్ళలో తేలిపోవడానికి అనుకూలమైన లక్షణం గలవి. ఇది పూలపండుగే కాదు, ఆటల పండుగ, పాటల పండుగ, కోలాటాల పండుగ. అన్నిటినీ మించి ఆడపిల్లల ఆటవిడుపు పండుగ. సంవత్సరం సాంతం అత్తవారింట్లో గడిపిన ఆడపిల్లలను తల్లిగారింటికి తప్పనిసరిగా తీసుకొచ్చే పండుగ. ఊరు ఊరంతా ఒకేచోట కలుసుకోగల్గిన పండుగ. ప్రపంచంలో మరెక్కడా లేని పండుగ. వినాయక నిమజ్జనానంతరం అంటే అనంత చతుర్దశి తర్వాత వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పౌర్ణమి అంటారు. కొందరు పౌర్ణమితోనే బొడ్డెమ్మ ఆటను ప్రారంభిస్తే, మరికొందరు పంచమి నుండి ఆడతారు. పిల్లల పండుగ అంటే పెండ్లికాని పిల్లలది. కొందరు పుట్టమన్నుతో పీటపై చతురాస్రాకారపు తంతెలుగా బొడ్డెమ్మను తయారు చేస్తే మరికొందరు పెండతో తయారు చేస్తారు. ప్రాంతాల వారిగా ఐదురకాల బొడ్డెమ్మ వేడుకలుంటాయి. ఈ బొడ్డెమ్మను ప్రతిరోజు ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేసి పూలతో అలంకరిస్తారు. ప్రతిరోజు అక్కడికి వచ్చే పిల్లలు ఏ ధాన్యమో తెచ్చి బొడ్డెమ్మ మీది కలశంలో పోస్తారు. ఆట ముగిసిన తర్వాత- ‘‘నిద్రపో బొడ్డెమ్మా నిద్రపోవమ్మ - నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు / నినుగన్న తల్లికి నిండునూరేండ్లు - పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు’’ అంటూ నిద్రపుచ్చుతారు. ఇక పెతర అమావాస్యతో బతుకమ్మ ఆట షురూ! తొమ్మిది రోజుల పండుగ. బతుకమ్మ ధరచోళ దేశమున ధర్మాంగదుడి వరపుత్రిక. ‘‘ధర చోళ దేశంబున ఉయ్యాలో- ధర్మాంగదుడను రాజు’’ అంటూ పాడుతూ ధర్మాంగదుడికి నూరుగురు కొడుకులు మరణించిన అనంతరం వరంగా పుట్టిన బిడ్డ కాబట్టి, ఆమె చిరకాలం జీవించాలనే కోరికతో బతుకమ్మ అని పేరుపెట్టాడనీ, ఆ బిడ్డ పేరిట కొనసాగిన ఆట పాటే బతుకమ్మ అని కొందరి అభిప్రాయం. కన్యకాపరమేశ్వరి ఆత్మాహుతి అనంతరం ఆమెను తిరిగి బతుకమని చెప్పడంలో భాగంగా ఈ ఆట వచ్చిందనీ, రైతు బిడ్డపై మరదలు అఘాయిత్యం చేసి చంపి పూడ్చిన సమాధి నుండి ఆమె ఎలుగెత్తి కోరిన కోరికే ఈ పండుగనీ, రుద్రమదేవిని రక్షించే క్రమంలో ఆమె అనుచరురాలి ఆత్మార్పణమే ఈ పండుగనీ... ఇలా భిన్నాభిప్రాయాలున్నాయి. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ -ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ- తంగేడు మొగ్గొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ కట్లాయి పువ్వొప్పునే గౌరమ్మ - కట్లాయి కాయొప్పునే గౌరమ్మ మొదట్లో బతుకమ్మ పాటలన్నీ పండుగను ప్రతిబింబిస్తూ సాగాయి. ఇక, ఈ కింది పాటను గమనిస్తే- ‘‘యాదగిరి పట్నాన ఉయ్యాలో - నీలమాదేవి ఉయ్యాలో సంతానమే లేక ఉయ్యాలో - సతిచింతా చెందే ఉయ్యాలో కానరాని చెట్లకు ఉయ్యాలో - కానుకలు చెల్లించు ఉయ్యాలో’’ అంటూ పూజలు చేస్తూనే, మిక్కిలి దుఃఖిస్తుంది. కన్నీరు ఏరులై పారగా పార్వతీదేవి ‘మొగులు లేనివాన ఉయ్యాలో ఎక్కడిది శివడ ఉయ్యాలో’ అంటూ ప్రశ్నించడం, శివుడు కారణం తెలుపుతూనే నీలిమాదేవికి ప్రత్యక్షమై సంతానవరాన్ని ఇవ్వడం జరిగిపోతాయి. జానపదుల రామాయణంలో రావణాసురుడు మాయా జంగమ వేషంలో వచ్చి భిక్ష వేడగా, సీతాదేవి భిక్ష దోసిట్లో తీసుకొని- ‘‘పటు జంగమయ్యా ఉయ్యాలో - చారెడు ముత్యాలు ఉయ్యాలో / పిలిచి భిక్షా పెడితే ఉయ్యాలో- పుడుతాదయ్యా బిడ్డ ఉయ్యాలో’’ అంటూ ముందుకొస్తుంది. మరో పాటలో, అత్తవారింట్లో ఉన్న కొత్తగా పెళ్ళయిన చెల్లెలు అన్నరాగానే కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు పెట్టుకుంటుంది. దానికి అన్న- ‘‘ఏందమ్మా చెల్లెలా ఉయ్యాలో - ఏడిసేటి పనులు ఉయ్యాలో’’ అని అడుగుతాడు. అందుకు ఇంకా బిడ్డ కలగని చెల్లె ‘‘పాలివారి బాధ ఉయ్యాలో - పడరాదె అన్న ఉయ్యాలో’’ అంటుంది. ‘‘ఫలములందేదాక ఉయ్యాలో- పడవాలె చెల్లె ఉయ్యాలో తొట్టెల బాలుడు ఉయ్యాలో- తొలుకాడెదాక ఉయ్యాలో ఆకిట్ల బాలుడు ఉయ్యాలో -అంబాడేదాక ఉయ్యాలో’’ అంటూ చెల్లెను అనునయిస్తాడు అన్న. బతుకమ్మ పాటల్లో పురాణాలకు సంబంధించినవి ఎక్కువగా చేరాయి. తమ ఎదుట ఉన్న వ్యక్తులనే పౌరాణిక పాత్రలుగా ఊహించుకొని వాళ్ళపై పాటలు పాడుకోవడం కూడా పరిపాటి. రామాయణ రాముడు ఏకపత్నీవ్రతుడు కావచ్చు గానీ జానపదుల రాముడు కాదు. ‘‘చిట్ట చిట్ట ఇల్లలికి ఉయ్యాలో - సిరిముగ్గులేసె ఉయ్యాలో సీతమ్మరామూలూ ఉయ్యాలో - జూదమాడంగ ఉయ్యాలో ఆడుతాడుతా సీత ఉయ్యాలో - చిరునిద్రలేపోయె ఉయ్యాలో సీతను మరిపించి ఉయ్యాలో - రాముడే పాయెను ఉయ్యాలో కాల్లకాడ కూసున్న ఉయ్యాలో - కస్తూరి కుక్క ఉయ్యాలో’’ అంటూ రాముని పోకడ గురించి కుక్కనూ, పిల్లినీ, ఆకాశాన పోయేటి పక్షినీ అడుగుతుంది సీత. అతని జాడ చెప్తే, ‘‘గుత్తు కాళ్ళకు ఉయ్యాలో - గజ్జెలూ చేయింతు ఉయ్యాలో’’ అంటుంది. భర్త పరస్త్రీ వ్యామోహంలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతా స్త్రీదే కదా! ఇక, ఆడవాళ్ళపై అఘాయిత్యాలు ఎప్పుడూ ఉన్నాయి. అది కూడా ఇలా పాటగా మారింది. ‘‘ఇదరక్క సెల్లెండ్లు ఉయ్యాలో - ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో - వచ్చన్న బోడాయె ఉయ్యాలో’’ అని బాధపడుతుంటే, ‘‘ఎట్లొస్తూ చెల్లెలా ఉయ్యాలో - ఏరడ్డమాయె ఉయ్యాలో’’ అని అన్న బదులిస్తాడు. అయితే, జానపదాల్లో ఒక్కోసారి సమన్వయం లేని కొనసాగింపులుంటాయి. ‘‘బాలెంత వడికింది ఉయ్యాలో- బంగారిపోగు ఉయ్యాలో వయసుదీ వడికింది ఉయ్యాలో - వజ్రాలపోగు ఉయ్యాలో ముసలిది వడికింది ఉయ్యాలో- ముత్యాల పోగు ఉయ్యాలో ఆపోగు ఈ పోగు ఉయ్యాలో - తక్కేడు పోగు ఉయ్యాలో’’ ఆ పోగులన్నీ తీసుకెళ్లి చింతకింది శాలాయనకు ఇచ్చారు. ఆయన నెలకొక్కపోగు నేసేసరికి చీర ఆలస్యంగా తయారైంది. ‘‘ఆ చీరకట్టుకుని ఉయ్యాలో - కొంగలాబాయికి ఉయ్యాలో కొంగలాబాయికి ఉయ్యాలో - నీళ్ళకంటూ బోతే ఉయ్యాలో కొంగలన్నీ గూడి ఉయ్యాలో - కొంగంతా చింపె ఉయ్యాలో’’ అదే విధంగా హంసల బాయికి పోతె హంసలు అంచంతా చింపినవి. చిలుకల బాయికి పోతె చిలుకలైతే చీరంతా చింపినవి. నిజానికి ఆడవాళ్ల మీద దుండగులు చేసే అఘాయిత్యాలను ఇలా పిట్టల పేరు మీద చెప్పడమే ఇక్కడ జరిగింది. ‘‘నీల నీలారి బాల నీళ్ళకెళ్ళిందో నీళ్ళకెళ్ళిందో ఎన్నడెల్లని బాల నీళ్ళకెళ్ళిందో నీళ్ళకెళ్ళిందో సక్కని సూర్యుడు సూడొచ్చినాడో సూడొచ్చినాడో సూశినంతసేపు చూసి జడవట్టి గుంజె జడవట్టి గుంజె ఇడువిడువు సూర్యుడా మా జడలిడువు మా జడలిడువు’’ అంటూ మా అమ్మ తిడుతుందనీ, కొడుతుందనీ కన్నెపిల్ల వేడుకోవడం, ఆమె చెప్పినా వినకుండా అతడు బలవంతం చేయడం, బలహీన క్షణాన ఆమె లొంగిపోవడం, గర్భం దాల్చడం జరిగింది. ‘‘గుట్టల్ల పొంగనే గుబులే పుట్టిందో గుబులే పుట్టిందో చెట్లల్ల పోంగనే చెమటాలొచ్చినవో చెమటాలొచ్చినవో ఉసుకుల్ల పోంగనే కూసులయ్య పుట్టె కూసులయ్య పుట్టె ఏటికీ కాల్వలు పారతున్నాయి పారుతున్నాయి పారేటి కాల్వల్ల బాలున్ని ఏసి బాలున్ని ఏసి’’ ఇలా హృదయవిదారకంగా పాట సాగుతుంది. బహు భార్యత్వం తగదని కూడా బతుకమ్మ పాటల్లోకి వచ్చింది. ‘‘రెండుగుట్టలా నడుమా కోల్ జడలా శంకరుడా స్నానం చేత్తురావయ్య కోల్ జడలా శంకరుడా దండెం మీద పట్టుదోతి కోల్ ఆరే ఉన్నాది గౌరమ్మ గంగమ్మా కోల్ గవ్వలాడంగ గవ్వాచిట్లంగా కోల్ కయ్యామే పెరుగంగ’’ చివరికి ఆ కయ్యం వాళ్ళు కాసె పూసి, ఇద్దరూ మన్ను దెచ్చుకొని గోడ పెట్టుకునేవరకు వచ్చింది. ఇలాంటి కొట్లాటలు లోకంలో సాధారణమే కదా! అలాగే, వదినా మరదళ్ళకు సంబంధించి ఇలా సాగుతుంది. ‘‘అమ్మ ఏమన్నదే సిలకమ్మ సిలకా అమ్మ అన్నం తినమని చెప్పెనే సిలకా నాయిన ఏమన్నడే సిలకమ్మ సిలకా నాయన నాను చేయిస్తనన్నడే సిలకా అన్న ఏమన్నడే సిలకమ్మ సిలకా అన్న ఆరునెల్లు ఉండిపొమ్మన్నడే సిలకా వదిన ఏమన్నదే సిలకమ్మ సిలకా వదిన ఒద్దుపొమ్మన్నదే సిలకా’’ సమిష్టి కుటుంబంలోని పొరపొచ్చాలు మామూలేకదా. స్త్రీల ఆలోచనలన్నీ భగవత్చింతన చుట్టూ ఉండాలని చెప్పేవీ లేకపోలేదు. ‘‘చిత్తూ చిత్తూల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ బావిలోన రాగి బిందె తీస్క రమణీ నీళ్ళకు పోతే రాములోరెదురాయె నమ్మా ఈ వాడలోన వెండి బిందె తీస్క వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయె నమ్మో ఈ వాడలోన పగడాల బిందె తీస్క పడతీ నీళ్ళకు పోతె పరమాత్ముడెదురాయెనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీస్క భామ నీళ్ళకుపోతె భగవంతుడెదురాయె నమ్మో ఈ వాడలోన’’ ఈ పాటలో పైకి ఆ స్త్రీలకు భగవద్దర్శనమైనట్లు చెప్పుకుంటున్నా నిజానికి తమ మగస్నేహితులను కలుసుకున్నట్లు అంతరార్థంగా కనపడుతుంది. మరికొన్ని పాటల్లో స్త్రీలకు జరిగిన అన్యాయం కనబడుతుంది. ‘‘తూర్పుదిక్కునా ఉయ్యాలో- తులసీవానలు కురిసే ఉయ్యాలో పడమటి దిక్కునా ఉయ్యాలో- పాలవాన కురిసె ఉయ్యాలో దక్షిణపు దిక్కునా ఉయ్యాలో- దండి వానలు కురిసె ఉయ్యాలో ఉత్తరపు దిక్కునా ఉయ్యాలో- ఉరిమురిమి కురిసె ఉయ్యాలో ఆ వాన ఈ వాన ఉయ్యాలో- చెరువు నిండీపాయె ఉయ్యాలో కట్టమీది మైసమ్మ ఉయ్యాలో- వరము కోరిందమ్మ ఉయ్యాలో ఇస్తవా ఓ రాజ ఉయ్యాలో- పెద్దకోడలినైన ఉయ్యాలో’’ అయితే రాజు తన మిగిలిన కొడుకులు, కోడండ్లను వదిలి, ఏ వివక్ష కారణంగానో చిన్నకోడలును నీళ్ళు తెచ్చే నెపంతో చెరువు గట్టుకు పంపుతాడు. వరద ఉధృతిలో బిందె మునగనందున ఆమెను మరింత లోతుగా పొమ్మని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడామె ఇంకా లోతట్టుకుపోయి చెరువులో మునిగిపోతూ- ‘‘నా శిరస్సు మునుగొచ్చె ఉయ్యాలో- నీ శిరస్సు కొట్టెయ్య ఉయ్యాలో’’ అని తిడుతూనే, ఆకాశాన బోయే పక్షులతో తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకూ- ‘‘మా తల్లిదండ్రులకు ఉయ్యాలో- బిడ్డలేదని చెప్పు ఉయ్యాలో తొట్టెల్ల బాలునికి ఉయ్యాలో- అమ్మ లేదని చెప్పు ఉయ్యాలో అంబాడె బాలునికి ఉయ్యాలో- అమ్మ లేదని చెప్పు ఉయ్యాలో’’ అంటూ సందేశం పంపుతుంది. మేఘ సందేశాన్ని తలపించే పాట ఇది. ఆ అవసరం అలాంటిది మరి. ఇక్కడ మరో విషయాన్ని గమనించవచ్చు. అంబాడే పిల్లవాడితోపాటు తొట్లె పిల్లవాడున్నాడు. అంటే వెంట వెంట కాన్పులను పట్టించుకోని కుటుంబ వాతావరణం. బలి త్యాగానికి ప్రతీక. ఒక గొప్పకార్యాన్ని నిర్వర్తించడంలో ప్రాణాలను తృణప్రాయంగా కైంకర్యం చేయడం. అంతేకాని ఒకరు చస్తే దేవతలు శాంతిస్తారనే మూఢనమ్మకం ప్రచారంలో ఉండడం, అర్భకులను బలి ఇవ్వడం విషాదకరం. ఇక్కడ అదే జరిగింది. ఇట్లా సామాజికంగా ఆయా కాలాలను బట్టి బాలనాగమ్మ కథ, ఎల్లమ్మ కథ, అక్కమహాదేవి కథలు పాటల్లో చోటు సంపాదించుకున్నవి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బతుకమ్మ పాట ఇలా రూపుదిద్దుకుంది. ‘‘నల్గొండ రాజ్యాన ఉయ్యాలో- నల్గొండ రాజ్యాన ఉయ్యాలో జనగామ తాలూక ఉయ్యాలో- ఇసునూరు గ్రామంలో ఉ॥ ఎంత ఘోరము చూడు ఉయ్యాలో- ఆ దొరోడు పాడుగాను ఉ॥ ఏమి చేస్తుండమ్మ ఉయ్యాలో- ఎంత అన్యాయమమ్మ ఉ॥ ఎత్తై మనిషమ్మ ఉయ్యాలో- పాలకుర్తి ఐలమ్మ ఉయ్యాలో పెద్దపైసంతైన ఉయ్యాలో- పెట్టింది బొట్టు ఉయ్యాలో పాలకుర్తీలోన ఉయ్యాలో- వెట్టి చాకల్దమ్మ ఉయ్యాలో గట్టిదే ఐలమ్మ ఉయ్యాలో- సంగంబు పెట్టింది ఉయ్యాలో తానె సంగమాయె ఉయ్యాలో- సంగంలో ప్రజలకు ఉయ్యాలో’’ పాలకుర్తి ఐలమ్మ విసునూరి రామచంద్రారెడ్డికి ఎదురొడ్డి తన కౌలు పొలంలో పండించుకున్న పంటకై చేసిన పోరాటం ఈ పాటలో వ్యక్తమైంది. మరో పాటలో చంద్రమ్మ అనే స్త్రీ ఊళ్ళో జనాన్ని దొర వద్దకు జీతానికి తీసుకునిపోతుంది. దొర ఇవ్వాల్సిన కూలీ ఇవ్వకపోగా వాళ్లను చాకిరీతో పీల్చి పిప్పిచేస్తాడు. చంద్రమ్మ కూడా దొరకు వంత పాడుతుంది. అప్పుడు కూలీలంతా- ‘‘ఏమి పనియని ఉయ్యాలో- చేస్తివీ చంద్రమ్మ ఉయ్యాలో ‘‘పంచాద్రి బోర్డులో ఉయ్యాలో- చెట్టు ఉన్నాదమ్మ ఉయ్యాలో చెట్టుకూ కట్టేసి ఉయ్యాలో- యేపవి బరిగెలు ఉయ్యాలో శింతయూ బరిగెలు ఉయ్యాలో- రెండుమోపులు దెచ్చి ఉ॥ అర్ధశేరైనను ఉయ్యాలో- కారం తెచ్చిరి ఉయ్యాలో కండ్లల్ల గుప్పిరి ఉయ్యాలో- కట్టెలతో కొట్టిరి ఉయ్యాలో’’ ఆపై చంద్రమ్మలో మార్పు వచ్చి ఆమె నాయకత్వంలోనే దొరపై తిరుగుబాటు చేస్తారు. సూర్యాపేట తాలూకా నల్గొండ జిల్లాలో జన్నారెడ్డి ప్రతాపరెడ్డి లక్షా యాభైవేల ఎకరాల భూమికి యజమాని. తన పొలంలో పనిచేసిన వాళ్లందరికీ నామమాత్రపు కూలీలిచ్చి పని చేయించుకునేవాడు. అందువల్ల పోరాటం సాగుతున్న కాలంలో- ‘‘పల్లెల్లో స్త్రీలంత ఉయ్యాలో- పరువు కాపాడుకొన ఉయ్యాలో బయలుదేరినారు ఉయ్యాలో- శీలరక్షణ కొరకు ఉయ్యాలో స్త్రీలంత కూడారు ఉయ్యాలో- లారీల చుట్టేసి ఉయ్యాలో లడాయి చేసిరి ఉయ్యాలో’’ అంటూ పాడుకున్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం సర్దార్ వల్లభాయిపటేలుకు లొంగిపోయాడు. సంఘం పోరాటం సాగిస్తూనే ఉంది. యూనియన్ సైన్యం భూస్వామ్య వర్గంతో చేతులు కలిపి ప్రజలను క్రూరంగా హింసించింది. ఆ సమయంలో పోరాట దిశగా పనిచేస్తున్న స్త్రీలను చైతన్య పరచడానికి- ‘‘అమ్మ భారతదేశమున ఉయ్యాలో- కాంగ్రెసు వచ్చిందమ్మ ఉ॥ కాని కాంగ్రెసు రాజ్యాన ఉయ్యాలో- కలుపు ఉన్నాదమ్మ ఉ॥ అమ్మ కలుపు దీస్తె ఉయ్యాలో- కష్టాలు తీరునమ్మ ఉయ్యాలో అమ్మ కమ్యూనిస్టు పద్ధతిన ఉయ్యాలో-ఎర్రజెండ ఎగరవేద్దాము ఉయ్యాల’’ అంటూ శ్రామిక రాజ్యాన్ని స్థాపించాలని పాడుకున్నారు. ఇది మరో ఘోర కథ. బోనగిరి గ్రామంలో నక్క ఆండాళమ్మ పెండ తెద్దామని ఊరిబయటకు వెళ్ళింది. ఒక దుర్మార్గుడు దర్గా లోపల పెండ చాలా ఉన్నదని నమ్మించి ఆమెను దారి తప్పించాడు. అక్కడ దర్గాలోపల ఉన్న ఆరుగురు గుండాలు ఆమెపై అత్యాచారం చేశారు. అదే జనం నాలుకలపై కన్నీటిపాటగా మారింది. ‘‘అమ్మ నీకు పేడ అందులో ఉన్నదని/ దరుగ లోపల త్రోవ దారిచూపినాడు / అదివిని ఆండాళు ఆనందముప్పొంగి/ పరుగు పరుగునా లోనికి పరుగెత్తె / పేడకొరకు చెయ్యి పెట్టే నేలపైన/ గది నుండి వచ్చినా గా గుండాగాడు / ఎర్రదస్తిని తీసి కండ్లెకు బిగియించి/ అర్రలోపల వేసి భరియింపరానట్టి / బాధలెన్నో పెట్ట ప్రాణాలు విడిచింది/ శవము నెత్తుకపోయి పైటకొంగున చాల / పలుగురాళ్ళను గట్టి పాడుపడ్డా పాత నూతిని జూచి/ పైనుంచి వారలు పడవేసిరందులో’’ 1954లో వసంత వాగు వద్ద పెద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన కూడా ఉయ్యాల పాటగా దర్శనమిచ్చింది. ‘‘శ్రీరామ జయరామ ఉయ్యాలో- శ్రీ సీతారామ ఉయ్యాలో హే రామ రఘురామ ఉయ్యాలో - అయోధ్యరామ ఉయ్యాలో ...అయ్యలారా వినుడి ఉయ్యాలో- అమ్మలారా వినుడి ఉ॥ రెండురోజులనుండి ఉయ్యాలో - మెండుగా వర్షాలు ఉయ్యాలో కుండతో నీళ్ళను ఉయ్యాలో - కుమ్మరించినట్లు ఉయ్యాలో’’ మొదట ఒక లోకల్ బండి జనగామ నుండి బయలుదేరింది. ఆ తర్వాత వచ్చిన ఎక్స్ప్రెస్ను కూడా గార్డు వదిలిండు. యశ్వంతపురం బ్రిడ్జిపైకి రాగానే కొంత దూరం పోయిందో లేదో- ‘‘ఉయ్యాల రీతిగా వూగెనే పట్టాలు పెళ్లుమని పట్టాలు బెడిసి విరిగినావి తల్లక్రిందుల గాడి డొల్లుచున్నాదమ్మ దేవునీ కృపచేత యీవలొక్క డబ్బ ఆవలొక్క డబ్బ మద్య డబ్బాలైదు మాయమగూచుండెనే గొర్ల మందారీతి తర్లు చున్నారమ్మ చెట్టుకొక్కా శవము గట్టుకొక్కా శవము పట్టాలలోనిరికి పడియుండె వ్రేలాడె చెట్టుకే వెంట్రుకలు తట్టుకొని వ్రేలాడి’’ ఘోరంగా జనం చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారికి కాంగ్రెసువాళ్లే కాకుండా యువత కూడా తరలి వెళ్లి సేవ చేసింది. జడ్చర్ల ప్రమాదం, లాథూర్ భూకంపం లాంటి దుర్ఘటనల్ని కూడా పాటలుగా ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకోవడం పరిపాటయ్యింది. అదే క్రమంలో వీరుల దేశనాయకుల పాటలు వచ్చాయి. ‘‘ఒక్కేసి పువ్వేసి సందమామ - ఒక్క జాము ఆయె సందమామ తెలంగాణా చరితమ్ము సందమామ - తెలియజెప్పుతాను సందమామ’’ అంటూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు పాటలుగా వెల్లువెత్తాయి. ప్రజల కాంక్షలు అందులో వెల్లడైనాయి. ఇలా బతుకమ్మ పాట కాలంతో పాటు తన వరుసలను మార్చుకుంటూ పోయింది. సమాజానికి దర్పణం పట్టడంలో ముందు వరుసలో నిలిచింది. - తిరునగరి దేవకీదేవి ‘‘కలవారికోడలూ ఉయ్యాలో - కలికి కామాక్షి ఉయ్యాలో కడుగుచున్నది పప్పు ఉయ్యాలో - కడవలో బోసి ఉయ్యాలో అప్పుడే వచ్చెను ఉయ్యాలో - ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకూ నీలిచ్చి ఉయ్యాలో - కన్నీళ్ళు నింపె ఉయ్యాలో’’ అన్న చెల్లెలిని అత్తింటి వాళ్ళ అనుమతి తీసుకొని రమ్మనగా, అత్త దగ్గరికి వెళ్లి, ‘‘వంట చేసేటి తలి ్లఉయ్యాలో - ఓ అత్తగారు ఉయ్యాలో మాయన్నలొచ్చారు ఉయ్యాలో - మమ్మంపుతార ఉయ్యాలో’’ అని అడుగుతుంది. ‘‘నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో - నీమామ నడుగు ఉయ్యాలో’’ అని అత్త బదులిస్తుంది. ఆ క్రమంలో ఆమె మామను, బావను, అక్కను అడిగి చివరగా భర్త అనుమతి పొందడమేకాదు ఇరుగుపొరుగువారికి చెప్పి బయలుదేరుతుంది. -
పాఠ్యాంశాల్లో మార్పులు
ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, చరిత్ర తదితర అంశాలను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాఠ్యపుస్తకాల్లో వాటిని పొందుపర్చాలని నిర్ణయించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, చరిత్ర తదితర అంశాలు ప్రతిబింబించేలా పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు సబ్జెక్టుల వారీగా పుస్తక సమీక్ష కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వికాస్రాజ్ గురువారం జీఓ 51 జారీ చేశారు. మాజీ వైస్ చాన్స్లర్లు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రముఖులు, అధికారులతో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిపై పాఠశాల విద్యాకమిషనర్ తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలుగు పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీ సభ్యులు... జాతీయ స్థాయి: రమాకాంత్ అగ్నిహోత్రి (రిటైర్డ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ) రాష్ట్ర స్థాయి: రవ్వా శ్రీహరి (మాజీ వీసీ, ద్రవిడ విశ్వవిద్యాలయం), కోవెల సుప్రసన్నాచార్య(రిటైర్డ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ), ప్రొఫెసర్ బన్న ఐలయ్య (కాకతీయ యూనివర్సిటీ), ఎస్.రఘు (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ), డాక్టర్ గుమ్మన్నగారి బాలా శ్రీనివాస్మూర్తి (అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ యూనివర్సిటీ). ఎక్స్పర్ట్స్..: చుక్కా రామయ్య(విద్యావేత్త), నందిని సిధారెడ్డి (రిటైర్డ్ లెక్చరర్), దేశపతి శ్రీనివాస్ (తెలుగు పండిట్), డి.చంద్రశేఖర్రెడ్డి (రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఓరియంటల్ కాలేజీ) డి.సాంబమూర్తి(రిటైర్డ్ ప్రిన్సిపాల్, కాలేజీ టీచర్ ఎడ్యుకేషన్), వేణు సంకోజు (రిటైర్డ్ లెక్చరర్, తెలంగాణ రచయితల వేదిక), నలిమెల భాస్కర్(రిటైర్డ్ లెక్చరర్). రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి: సువర్ణ వినాయక్ (కరిక్యులమ్ అండ్ టెక్ట్స్బుక్స్, తెలంగాణ ఎస్సీఈఆర్టీ, వి.శరత్బాబు, (తెలుగు పండిట్), పల్లెర్ల రామ్మోహన్రావు, వి. చెన్నయ్య (స్కూల్ అసిస్టెంట్స్). సాంఘిక శాస్త్రాల పుస్తక సమీక్ష కమిటీ సభ్యులు.. జాతీయ స్థాయి: సీఎన్ సుబ్రహ్మణ్యం (ఏకలవ్య వర్సిటీ, భోపాల్), ఎంవీ శ్రీనివాసన్ (అసోసియేట్ ప్రొఫెసర్, డీఈఎస్హెచ్, ఎన్సీఈఆర్టీ). రాష్ట్ర స్థాయి: డాక్టర్ కె.విజయబాబు (హిస్టరీ ప్రొఫెసర్ కాకతీయవర్సిటీ) కె.కైలాష్ (పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ), ప్రొఫెసర్ కోదండరాం (పొలిటికల్ సైన్స్ విభాగం, సికింద్రాబాద్ పీజీ కాలేజీ) డాక్టర్ ఈఎస్ నాగిరెడ్డి (పురావస్తు శాఖ). క్షేత్రస్థాయి: ఎ.లక్ష్మణరావు (ఎస్ఏ, కరీంనగర్) డాక్టర్ ఆర్.గణపతి (ఎస్ఏ వరంగల్), పి.జగన్మోహన్రెడ్డి, పి.శ్రీనివాసులు, (ఎస్ఏ, మెదక్) పి.రత్తంగపాణిరెడ్డి(ఎస్ఏ, మహబూబ్నగర్), ఎం.పాపయ్య (లెక్చరర్, ఎస్సీఈఆర్టీ). అన్ని స్థాయిల సమన్వయం-మార్గదర్శనం.. దీపిక, కృష్ణమోహన్, డాక్టర్ ఎన్.ఉపేందర్రెడ్డి(కరిక్యులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్ విభాగం) ఎస్.జగన్నాథరెడ్డి (డెరైక్టర్, తెలంగాణ ఎస్సీఈఆర్టీ). -
అంతా నవాబుల స్టైల్!
సాక్షి, హైదరాబాద్: ‘చుట్టూ రాజభటులు.. మధ్యలో ముజ్రా నృత్యాలు.. ఒకవైపు నౌబత్ సంగీత వాద్యం.. మరోవైపు ఖవ్వాలీ బృందగానం.. ఇంకోవైపు షెహ్రీ బాజా.. మధ్యమధ్యలో పేరిణి శివతాండవం.. చిందు యక్షగానం.. కొమ్ము కోయ, గుస్సాడి, బంజారా, డప్పు నృత్యాలు.. ఒగ్గుడోళ్ల విన్యాసాలు.. కంచు బూరలు.. ఇంకా మంద హెచ్చుల కథలు...’.. స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ఆవిష్కృతమైన దృశ్యమిది. నాటి నవాబుల దర్పానికి అద్దం పట్టేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఇలాంటి దృశ్యాలెన్నో శుక్రవారం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న వారికి కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత గోల్కొండ కోటలో తొలిసారి నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొద్ది మందికే ఆహ్వానం ఉండటంతో... మిగతా వారంతా కోట బయట నిలుచుని వీక్షించేందుకు ప్రయత్నించారు. ఇక కోట లోపలికి వచ్చిన వారంతా ఉదయం నుంచే ప్రారంభమైన జానపద నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలను కళ్లార్పకుండా తిలకించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం పరేడ్ మైదానానికి వెళ్లి సైనిక అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అటు నుంచి నేరుగా గోల్కొండ కోటకు బయలుదేరారు. సీఎం కాన్వాయ్ గోల్కొండ కోటలోకి ప్రవేశించగానే కోట చుట్టూ రాజభటుల వేషధారణలో ఉన్న కళాకారులు తలవంచి నమస్కారం చేయగా.. డప్పులు, సంగీత వాద్యాలు, కంచు బూరలతో మరికొందరు కళాకారులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ సైతం ఉత్సాహంగా అందరికీ అభివాదం చేస్తూ రాణిమహల్ వద్దకు చేరుకున్నారు. ఆయన రాగానే అక్కడున్న విద్యార్థులంతా ‘జై తెలంగాణ, జైహింద్’ అని నినదిస్తూ త్రివర్ణాల బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం సీఎం సరిగ్గా 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం కేసీఆర్ బయలుదేరుతుండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన కాన్వాయ్ వద్దకు వచ్చారు. వారిని నిలువరించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. మరోవైపు అదే సమయంలో మజ్లిస్ నాయకులంతా రాణిమహల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చి ఎంఐఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ సతీమణితోపాటు కుమార్తె, అల్లుడు కూడా హాజర య్యారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్తోపాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులంతా గోల్కొండ కోటకు తరలివచ్చారు. -
బోనభాగ్యం.. ఇక నుంచి అధికారిక సంబరం
* తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం * ఇక నుంచి అధికారిక సంబరం * ‘అమ్మా బెలైల్లినాదో నాయనా.. తల్లీ బయలెల్లినాదో నాయనా..’ ఏటా ఆషాఢ మాసంలో ఈ గానం భాగ్యనగరాన్ని పులకింపజేస్తుంది. ఆధ్యాత్మికతలో ఓలలాడిస్తుంది. నాలుగు శతాబ్దాల పైచిలుకు నగరంలో అన్ని వర్గాల ప్రజలు, విభిన్న సంస్కృతులను ఐక్యం చేసే మహోన్నత చారిత్రక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. జాతీయ ఖ్యాతి గడించిన విశిష్ట వేడుక. ఆషాఢంలోని తొలి ఆదివారం లేదా గురువారం ప్రారంభమయ్యే పండుగను నెల రోజులు నిర్వహిస్తారు. రాష్ర్టప్రభుత్వం అధికారిక ఉత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నేడు గోల్కొండ కోటలో బోనాలకు శ్రీకారం. వచ్చే నెల 27 వరకు కోటపై తొమ్మిది రకాల పూజలు నిర్వహిస్తారు. ఇవే రోజుల్లో పాతబస్తీ లాల్దర్వాజ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వేడుకలూ ప్రారంభమవుతాయి. నగరమంతటా సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’ ప్రత్యేక కథనం.. గోల్కొండ రాజధానిగా పాలించిన కుతుబ్షాహీల కాలంలోనే బోనాలకు శ్రీకారం చుట్టారు. అబుల్ హసన్ తానీషా కొలువులో మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నల సలహాతో తానీషా తన కోటపైన శ్రీ జగదాంబిక, మహంకాళి అమ్మవార్ల ఆలయాన్ని కట్టి ఉత్సవాలు ప్రారంభించాడు. తరువాత అధికారంలోకి వచ్చిన అసఫ్జాహీలు వాటిని కొనసాగించారు. ఇది ఆనవాయితీగా మారింది. కోటపై ఉన్న అమ్మవారిని గోల్కొండ ఛోటాబజార్లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో తిరిగి కోటపైన ప్రతిష్టిస్తారు. నవాబు పూజతో శాంతించిన మూసీ 1908 సెప్టెంబర్లో మూసీ వరదల కారణంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వరద నీరొచ్చింది. వరదలో అప్పటికే వేలాది మంది చనిపోయారు. నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి రాజా కిషన్ పర్షాద్ లాల్దర్వాజా అమ్మవారి మహత్యాన్ని నిజాం నవాబుకు వివరించారు. ఆలయంలో పూజలు చేస్తే అమ్మవారు శాంతించి వరదలు తగ్గుముఖం పడతాయన్నారు. దీంతో నవాబు ఒక బంగారు చాటలో కుంకుమ, పసుపు, మేలిమి ముత్యాలు తీసుకొని పూజలు చేశారు. అలా ఈ ఆలయంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. 1968లో కంచి కామకోటి పీఠాధిపతి చంద్ర శేఖరేంద్ర సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు. 2008 ఏప్రిల్లో అప్పటి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వర్ణ శిఖరం, వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్యమంత్రం బోనాల వేడుకల్లో ప్రతీ ఘట్టం ఆరోగ్య పరిరక్షణతో ముడిపడిందే. తొలకరి వర్షాలతో పాటే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. దీంతో రకరకాల వ్యాధులు ప్రబలుతాయి. నీటి కాలుష్యం వల్ల కలరా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. అలాంటి కలుషిత వాతావరణాన్ని శుభ్రం చేసే అద్భుతమైన ప్రక్రియ బోనాల పండుగలో ఉంది. ఇంటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రం చేసుకొని పసుపు, గుగ్గిలం, మైసాక్షి వంటి వాటిని పొగ వే యడం వల్ల వ్యాధికారక క్రిములు నశిస్తాయి. ఇక వేపచెట్టు గొప్పతనం అందరికీ తెలిసిందే. వేపాకు ముద్దను ఒంటికి పట్టించి స్నానం చేస్తే చర్మవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులకు వేప దివ్య ఔషధం. బోనాల పండుగ రోజు వేప కొమ్మలతో బోనాలను అలంకరించినా, గుమ్మానికి, దర్వాజలకు వాటిని వేలాడదీసినా స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇక బోనం. కొత్త కుండలో పసుపుతో కలిపి అన్నం వండడం కూడా ఆరోగ్య పరిరక్షణలో భాగమే. ఈ వేడుకల్లో ఆరోగ్యభాగ్యం కూడా ఇమిడి ఉందని నగరానికి చెందిన ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అభిప్రాయపడ్డారు. వరాల వల్లి.. ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జూలై 13, 14వ తేదీల్లో జరుగుతాయి. ఈ వేడుకలకు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 1813లో కలరా సోకింది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఇది అక్కడ మిలటరీ విధులు నిర్వహిస్తున్న సికింద్రాబాద్కు చెందిన సూరటి అప్పయ్యను కలచి వేసింది. వెంటనే ఆయన ఉజ్జయినీ మహంకాళిని... కలరాను తగ్గించమనీ, అలా చేస్తే తన స్వస్థలంలో ఆలయం నిర్మిస్తామని వేడుకున్నారు. కలరా అదుపులోకి వచ్చింది. దీంతో అప్పయ్య సహచరుల సాయంతో 1815లో సికింద్రాబాద్లో కర్ర విగ్రహాన్ని ప్రతిష్టించి ‘ఉజ్జయినీ మహంకాళి’గా నామకరణం చేశారు. 1864లో ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అప్పయ్యే చేయించి, ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. 1953 నుంచి దేవాదాయ శాఖ వేడుకలు నిర్వహిస్తోంది. చల్లని చూపుల... శీతల్మాత పిల్లా పాపలను ఆయురారోగ్యాలతో చల్లంగా చూసే అమ్మవారు శీతల మాత. సుల్తాన్షాహీలో వెలసిన ఈ అమ్మవారిని భక్తులు శీతల్ మాతగా... సిత్లా మాతగా కొలుస్తున్నారు. వందేళ్ల కిందట నిజాంల పాలన లో ఆర్థిక లావాదేవీలు చూసే అధికారిగా ఉన్న శాలిబండ దేవ్డీ నివాసి రాజా కిషన్ పర్షాద్ ఈ దేవాలయాన్ని సుల్తాన్షాహిలో నిర్మించారు. పిల్లలకు మశూచి, ఆటలమ్మ (చికెన్పాక్స్)లు వచ్చినప్పుడు అమ్మవారికి సాక పెట్టి పూజించేవారు. 1976లో ఆలయ కమిటీ ఏర్పడిన అనంతరం శ్రీ జగదాంబ దేవాలయంగా నామకరణం చేశారు. మీరాలంమండి అమ్మ నిజాం కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతీరోజు రైతులు కూరగాయలు,ధాన్యం ఎడ్ల బండ్లపై మీరాలం మండికి తీసుకువచ్చిన రైతులు తమ ఎడ్ల బండ్లను ‘బండిఖానా’ లో నిలిపేవారు. ఇక్కడే ఒక రావిమొక్కను నాటి దాని వద్ద అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజలు చేశారు. 1960లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన చేసినప్పటి నుంచి ఆషాఢ మాసం మూడో బుధవారం రోజు బోనాల పండుగ జరుగుతుంది. ఐదు తరాలుగా.. అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత జరిగే రెండో ప్రధాన ఘట్టం రంగం. ఇందు లో ఏటా స్వర్ణలత చెప్పే ‘భవిష్యవాణి’కి ఎంతో ప్రాముఖ్యత. ఆ వివరాలు ఆమె వూటల్లోనే... వూ అమ్మపేరు ఎరుపుల ఇస్తారమ్మ. నాన్న నరసింహ. అక్క స్వరూప. తమ్ముడు దినేష్. నాతో కలిపి అమ్మ నాన్నలకు ముగ్గురు పిల్లలం. ప్రస్తుతం మారేడుపల్లిలో ఉంటున్నాం. మా ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే అమ్మవారికి అంకితం చేసే ఆచారం అనాదిగా వస్తోంది. అక్క స్వరూపను, నన్ను ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి అంకితం చేశారు. బడికి వెళ్లినా పెద్దగా చదువుకోలేదు. అక్క స్వరూప చనిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర రంగంలో భవిష్యవాణి వినిపించే బాధ్యత తీసుకున్నా. అక్కన్న,మాదన్నలు కొలిచిన తల్లి హరిబౌలిలోని అక్కన్న మాదన్నల మహంకాళి దేవాలయం హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నం. పాతబస్తీలోని ఈ ఆలయం లోని అమ్మవారికి భక్తులు 17వ శతాబ్దం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. గోల్కొండ రాజు తానీషా వద్ద కీలక హోదాల్లో పనిచేసిన అక్కన్న, మాదన్నలిరువురు అన్నదమ్ములు. వారు విధినిర్వహణలో భాగంగా రోజూ కోటకు వెళ్లే ముందు ఇక్కడ పూజలు నిర్వహించే వారు. 1948లో జరిగిన సైనిక చర్య తరువాత అప్పటి ఆర్యసమాజ్ ఈ ఆలయాన్ని గుర్తించింది. కోటకు రక్షణగా.. మైసవ్ము శాలిబండ హరిబౌలిలోని శ్రీ బంగారు మైసవ్ము దేవాలయుం పాతబస్తీ భక్తుల పాలిట కొంగుబంగారం. నిజాం పరిపాలనలో ప్రధాని కిషన్ పర్షాద్ దేవిడీలోనే శ్రీ బంగారు మైసమ్మ ఆలయం వెలసింది. కోట రక్షణ గోడకు ఎడమ వైపున అమ్మవారి దేవాలయం ఉంటే అన్ని విధాల కలిసొస్తుందనే నమ్మకంతో నిజాం కాలంలో ఇక్కడ అమ్మవారి దేవాలయం ఏర్పాటు చేశారు. హనుమంతు ఉరఫ్ పోతరాజు..! అతను అమ్మవారికి అంగరక్షకుడు. గ్రామదేవతల తోబుట్టువు. వారికి కావలి. ఇదీ పోతరాజు పరిచయం. అదంతా కథల్లోనే.. కానీ పాతబస్తీ ప్రజలకు ఎనిమిది దశాబ్దాలుగా తెలిసిన పోతరాజు మాత్రం హనుమంతే. నిలువెత్తు విగ్రహం, చక్కని శరీర సౌష్ఠవం.. కోర మీసాలు, జులపాల జుత్తు.. పెద్ద కళ్లు. భీతి గొలిపే రూపం.. మెడలో నిమ్మకాయల హారం. ఒంటినిండా పసుపు.. నుదుటిన పొడవాటి కుంకుం బొట్టు. చేతిలో కొరడా.. కాళ్లకు గజ్జెలు. బోనాల ఊరేగింపులో అగ్రభాగాన ఉండి ఎగిరి గెంతులేస్తూ, నృత్యం చేస్తూ జనాన్ని అదిలిస్తూ, బెదిరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ ‘పోతరాజు’ చెప్పే వివరాలు ఆయన మాటల్లోనే... మూసీనదికి వరదలొచ్చినప్పుడు పుట్టిన్నట.. మాయమ్మ చెప్పింది. ఆ వరదలు ఊర్ని ముంచెత్తుతా ఉంటే నన్నెత్తుకొని గంగబాయి గుట్ట మీదకు పరుగెత్తిందట. ఒక చింతచెట్టెక్కి ప్రాణాలు దక్కించింది. నా పుట్టుక గురించి నాకు తెలిసింది ఇంతే. మాయమ్మ పేరు నర్సమ్మ. నాయిన రామన్న. చిన్నప్పటి నుంచి ధూల్పేట్లోనే. మా పెద్దనాయిన నర్సింహ్మ. చెట్టుమీదికెక్కి సిగాలు ఊగేవాడు. మా పెద్దనాయిన నీడ నాకు (దేవత ఆవహించింది) పడింది. అప్పుడు నాకు పదిహేనేళ్లు. మస్తు బలంగా ఉండేవాణ్ణి. గోకుల్ప్రసాద్ అనే పూజారి నాతో తొలిసారి పోతరాజు వేషం వేయించిండు. ఇప్పటి వరకు ఆ ఆచారాన్ని తప్పలేదు. పురాణాపూల్, మంగల్హాట్, ధూల్పేట, గౌలిగూడ, గోడీ కీ కబర్, జిన్సీ చౌరాయి.పాతబస్తీలో ఎక్కడ బోనాల పండుగైనా పరుగెత్తుకొని పోయిన. అప్పట్లో యాటను (మేకపోతును) గావు (గొంతు కొరికేయడం) పట్టేవాణ్ణి.అమ్మవారి పండుగొచ్చిందంటే నాకు నిమిషం తీరిక ఉండేది కాదు. పూరానాపూల్లో మహంకాళమ్మ గుడి కట్టించిన. యాదగిరిగుట్ట నుంచి గాంధీ బొమ్మ తెప్పించి ఇక్కడ పెట్టించింది కూడా నేనే. ఎన్నెన్నో అపురూప ఘట్టాలు మహంకాళి జాతరలో అనేక అపురూపమైన ఘట్టాలుంటాయి. ఈ నెల 29వ తేదీన ఘటాల ఎదుర్కోలుతో వేడుకలు ప్రారంభమవుతాయి. జాతర సందర్భంగా సికింద్రాబాద్ జనసంద్రాన్ని తలపిస్తుంది. పుట్టింటి నుంచి వచ్చే అమ్మవారికి ఘటం తో స్వాగతం పలుకుతూ తోడ్కొని వచ్చేదే ఘటోత్సవం. ఆలయం నుంచి పసుపు, కుంకుమ,పూలను తీసుకెళ్లి కర్బలమైదాన్లో ఘటాన్ని అలంకరిస్తారు. వెదురు దబ్బల మధ్యలో రాగి చెంబు ఉంచి, అమ్మవారి వెండి విగ్రహాన్ని పెడతారు. అలా ఊరి పొలిమేర నుంచి బయలుదేరిన తల్లి భక్తజనం నడుమ ఆలయానికి విచ్చేస్తుంది. 9 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తుంది. బోనాల చివరి రోజు జరిగే అంబారీ ఊరేగింపుతో తల్లిని సాగనంపుతారు. కుస్తీలకూ పోయేవాణ్ని... ఆ రోజుల్లో లాల్ పహిల్వాన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న. కుస్తీపోటీలకు పోయేవాణ్ని. గద్వాల్ మహారాణి దగ్గర కూడా పోటీలల్ల పాల్గొన్నం. బతికినన్ని రోజులు బాగానే బతికిన. నవాబులకు కూడా క్షవరాలు చేసిన. ‘సర్కార్ క్యా హై’ అంటే చాలు చేతికి ఎంతొస్తే అంత డబ్బు ఇచ్చే వాళ్లు. నాకు ఇద్దరు భార్యలు కమలమ్మ, యాదమ్మ. కమలమ్మ చనిపోయింది. ఇద్దరికీ కలిపి 15 మంది పిల్లలు. వారిని నేనూ, యాదమ్మ సాది పెంచి పెద్ద జేసినం. చాలా కష్టపడ్డం. కడుపు మాడ్చుకొని బతికినం. కానీ ఏం లాభం. అంతా చెట్టుకొకలు, పుట్టకొకలు పోయిండ్రు.హైదరాబాద్ల ఎవ్వరు ఎక్కడ ఉంటండ్రో తెల్వదు. నా పెద్దకొడుక్కే 75 ఏళ్లు ఉంటది. ఎంతమంది పిల్లలు ఉంటే మాత్రం ఏమైంది. నా బతుకు నేనే బతకుతున్నా. పిల్లలకు మంత్రం వేయమని నా దగ్గరకొస్తరు. పైసో,ఫలమో ఇస్తరు. ఆ డబ్బులతోనే బతుకుతున్న...’ అని ముగించాడు హనుమంతు. ఉజ్జయినీ మహంకాళి రంగం చెప్పడానికి ముందుగా పెళ్లి (మాంగల్యధారణ) జరగాల్సి ఉంది. అందరికీ జరిగే పెళ్లిలాగే నాకూ జరిగినా పెళ్లి కొడుకు ఉండడు. ఖడ్గంతో నాకు మాంగల్యధారణ చేయించి ఆ తంతు పూర్తి చేశారు. నాటి నుంచి నా జీవితం అమ్మవారికే అంకితమైంది. అలా పదహారేళ్లుగా భవిష్యవాణి వినిపిస్తున్నా. ఆదివారం బోనాలు సమర్పించడం పూర్తికాగానే సోమవారం రంగం ఏర్పాట్లుంటారుు. ఆ రోజు తెల్లవారు జామునే లేచి స్నానం చేసి దుస్తులు ధరించి ఆలయానికి వస్తా. రోజంతా ఉపవాసమే. ముఖానికి పసుపు రాసుకుంటా.మహంకాళి ఎదురుగా ఉండే మాతంగేశ్వరీ ఎదురుగా పచ్చి కుండపై నన్ను నిలబెడతారు.అప్పుడు అమ్మవారు నన్ను ఆవహిస్తారు. అటు తర్వాత ఏం జరిగిం దనేది నాకు గుర్తుండదు. టీవీల్లో చూసి అసలు నేనేనా ఇదంతా చెప్పిందనిపిస్తుంది. అవ్మువారి సేవకు అంకితమైన నాకు కుటుంబం, పిల్లలు వంటి ఆలోచనలు ఉండవు. ఆలయం నుంచి కొన్నేళ్లుగా నెలకు రూ.3వేలు వస్తున్నాయి. నా జీవనం కోసం కుట్టు పనిచేస్తుంటా. ప్రతి శుక్ర, మంగళవారాల్లో అమ్మవారి దేవాలయానికి వచ్చి ముత్తయిదువులకు పసుపు కుంకుమ అందిస్తుంటా. తొలుత మా పూర్వీకురాలు జోగమ్మ భవిష్యవాణి వినిపించేది. అటు తర్వాత బాలమ్మ, పోచమ్మ, మా నాన్నమ్మ బాగమ్మ, మా అక్క స్వరూపరాణి దాన్ని కొనసాగించారు. ఐదు తరాల నుంచి మేవుు తల్లిసేవలో కొనసాగుతున్నాం. - దార్ల వెంకటేశ్వరరావు -
తలెత్తుకునేలా .. అభివృద్ధి సాధిద్దాం
స్వరాష్ట్రంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు - జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుదాం - ఉద్యమానికి ఊతమిచ్చింది మెతుకుసీమే - కేసీఆర్ సీఎం కావటం జిల్లా ప్రజల అదృష్టం - సంక్షేమం, అభివృద్ధే నూతన ప్రభుత్వ లక్ష్యం - ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ స్మితా సబర్వాల్ - పోలీసు పరేడ్ గ్రౌండ్సలో జాతీయజెండా ఎగురవేత సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: అరవై ఏళ్ల కల ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, స్వరాష్ట్రంలో ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా జిల్లాను అభివృద్ధిపథంలో నడిపిద్దామని కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టర్ మొదట సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహం ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత పోలీసు పరేడ్గ్రౌండ్కు చేరుకుని జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీ బాజ్పేయ్ తదితర అధికారలతో కలిసి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ తెలంగాణ తల్లి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పోలీసు పరేడ్ గ్రౌండ్స్ వేదికపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి విత్తనాలు నాటి, నాయకత్వాన్ని అందించింది జిల్లా ప్రజలేనని అన్నారు. జిల్లా ముద్దుబిడ్డ కె. చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ పునర్నిర్మాణం జరగనుండటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం కావని, అంచెలంచెలుగా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణను, జిల్లాను అభివృద్ధిలో ముందుంచాలని ప్రజలు, అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం అంకితభావంతో కృషి చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే నూతన ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబాల సభ్యులను పరామర్శించి వారిని సత్కరించారు. జిల్లాలోని అమరులైన 42 మంది కుటుంబాల సభ్యులను కలెక్టర్ స్మితాసబర్వాల్ సన్మానించారు. ఆవిర్భావ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీబాజ్పాయ్, న్యాయమూర్తి రాధారాణి, ఏజేసీ మూర్తి, డీఆర్ఓ దయానంద్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, ఆర్వీఎం పీడీ యాస్మిన్బాషా తదితరులు పాల్గొన్నారు. -
నింగే హద్దుగా.. తెలంగాణ పండగ
సాక్షి, నల్లగొండ, నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష, 60 ఏళ్ల పోరాటం ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం వచ్చే నెల 2వ తేదీన మనుగడలోకి రానుంది. ఈ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కనీవిని ఎరుగని రీతిలో అధికారికంగా స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. మొత్తం ఆరు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రాథమిక ప్రణాళిక రూపొందించింది. 1947లో దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చినప్పుడు కలిగినంత ఆనందం కంటే రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ అవతరణ ఉత్సవాలను జరపాలని కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రెండు మూడు తరాలపాటు సంబరాలు గుర్తిండిపోయేలా ఉత్సవాలు నిర్వహించాలన్న కృత నిశ్చయంతో అధికారులు అడుగులు వేస్తున్నారు. ఉత్సవాల తోరణం.. ‘నీలగిరి తెలంగాణ అవతరణ ఉత్సవాలు’ పేరిట ఈనెల 28 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు కార్యక్రమా లు చేపట్టాలని ప్రణాళిక తయారు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టు, బొట్టుకు అద్దం పట్టే లా ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. సామన్యుడి నుంచి జిల్లా ఉన్నతాధికారి వరకు ఈ ఉత్సవాల్లో పాలుపంచుకునేలా కార్యక్రమాలను రూపకల్పన చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానం ఇందుకు వేదిక కానుంది. ఈ క్రమంలో కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దనున్నారు. ఉత్సవాల కోసం ఇప్పటికే 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఒకరు నుంచి నలుగురు వరకు అన్ని శాఖల జిల్లా అధికారులు ఉంటారు. ఒక్కో కమిటీకి ఒక్కో బాధ్యత అప్పగించారు. నిర్వహణ, ఆహ్వాన, ఆర్థిక, క్రీడలు, సాంస్కృతిక, ప్రచార కమిటీలు ఏర్పాటయ్యాయి. కార్యక్రమాలు ఇలా.. ఈనెల 28న మండలస్థాయిలో పురుషులు, మహిళలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ముగ్గులు, బతుకమ్మ పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు 29న డివిజన్స్థాయి పోటీలు నిర్వహిస్తారు. 30వ తేదీన జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. 31వ తేదీన ఉదయం జిల్లా చరిత్ర సంస్కృతి-సాహిత్యంపై కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం జిల్లాలోని జానపద కళారూపాలను క్రోడీకరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చేనెల ఒకటో తేదీ రాత్రి ఏడు నుంచి 10 గం టల వరకు కార్నివాల్ (తిరునాలు) నిర్వహిస్తా రు. ఎన్జీ కళాశాల మైదానం నుంచి మొదలుకొని క్లాక్టవర్ వరకు రోడు పక్కన తిరునాలు నిర్వహించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం అక్కడక్కడ ఆరు ప్రధాన వేదికలు ఏర్పా టు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. అంతేగాక తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, ఖవ్వాలి వంటి కార్యక్రమాలు చేపడతారు.అదేరోజురాత్రి 10.30 నుంచి 12 గంటలకు వరకు సెలబ్రిటీని ఆహ్వానించి ఆర్కెస్ట్రా నిర్విహ స్తారు. అనంతరం ‘ఫైర్ వర్క్స్’ కార్యక్రమం పేరిట టపాసులు కాల్చి తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలుకుతారు. వ తేదీన ఉదయం ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు చేపడతారు. -
జానపదానికి గ్లామర్ రావాలి: అశోక్తేజ
- యాస అమ్మలాంటిది... నల్లగా ఉందని అమ్మని తరిమేస్తామా? - మట్టి చరిత్రను ఆవిష్కరిస్తేనే ఆవిర్భావానికి అర్థం - ఊరూవాడా వీధులన్నింటికీ త్యాగధనుల పేర్లు పెట్టాలి - సాక్షికి సుద్దాల అశోక్తేజ ఇంటర్వ్యూ... మన కల్చర్కు ప్రాధాన్యం ఇవ్వాలి... మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి.. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి.. బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: పుష్కరాలను ఎలా నిర్వహిస్తారో సమ్మక్క సారక్క జాతరను కూడా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. బతుకమ్మ, బోనాల పండుగలు కూడా తెలంగాణ సంస్కృతికి ఐకా న్ వంటివి. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించాలి. తెలంగాణలో జాన పదం ఎక్కువగా ఉంటుంది. ఆట-పాట- మాట ఎవరికివారే రాసుకొని ట్యూన్ చేసుకుని ఆడుతూ పాడతారు. వీరినే వాగ్గేయకారులం టారు. వీటిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర జానపద సాంస్కృతిక అకాడమీని ఏర్పాటు చేయాలి. ఆ రంగంలో కృషిచేస్తున్న వారిని ఏడాదికి నాలుగుసార్లకు తగ్గకుండా కార్య క్రమాలను రూపకల్పన చేయాలి. అన్నమయ్య పీఠంలా జానపద పీఠాన్ని ఏర్పాటు చేయాలి. వృత్తికళాకారులను చేరదీయాలి. వారికి వేతనాలు ఇవ్వాలి. గౌరవ పారితోషకాలు అందజేయాలి. కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. సినిమాకు ఇస్తున్న ప్రాధాన్యంలో 25 శాతం వీటికి అన్ని ఛానళ్లలో ప్రాముఖ్యం ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. అప్పుడుగానీ వీటికి గ్లామర్ రాదు. ప్రభుత్వం ఆదరిస్తే జానపద కళలకు కూడా గ్లామర్ వస్తుంది. ఒక రంగాన్ని పెంచిపోషి ంచాలంటే ముందుగా దాన్ని ఫోకస్లోకి తీసుకురావాలి. గ్లామర్ ఇవ్వాలి. టీఆర్ఎస్ ఉద్యమంతో వేలాదిమంది కళాకారులు పుట్టుకొచ్చారు. అలాగే కొన్ని టీవీల్లో జానపద కళారూపాలను ప్రదర్శించడం వల్ల ఆ కళాకారులకు గ్లామర్ పెరిగింది. అనేకమంది అమెరికా వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇచ్చారు. పాలకుర్తి సోమనాథుడు, పోతన, వేముల వాడ భీమకవి పేరుమీద పరిశోధనాలయాలు నిర్మించా లి. వారి పేర్లతో కళాపీఠాలు ఏర్పాటు చేయాలి. సుద్దాల హన్మంతు పేరుతోనూ కళాపీఠం ఏర్పాటు చేయాలి. కొమురం భీం, చాకలి ఐలమ్మ పేర్లమీద జిల్లాల్లో స్మారక మందిరాలు నిర్మించాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారు, తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి విగ్రహాలను ప్రతిష్టించాలి. వీధులకు, గ్రామాలకు, కూడళ్లకు వారి పేర్లు పెట్టాలి. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేటితరానికి తెలియనే తెలియదు. దాన్ని సిలబస్లో పెట్టాలి. అమెరికాకు వెళ్లి వివేకానందుడు ఎంతో గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. అతను ఉపన్యాసం ఇచ్చిన హాలును జ్ఞాపకార్థంగా పర్యాటక క్షేత్రంగా అమెరికా ప్రభుత్వం ఉంచి గౌరవిస్తోంది. దాన్ని వేలాది మంది సందర్శిస్తుంటారు. పరాయి దేశ వ్యక్తిని ఒక అగ్రరాజ్యం అలా గుర్తించినప్పుడు మన వీరులను మనం ఎందుకు గుర్తుంచుకోకూడదు? వరంగల్ జిల్లాలో బైరాన్పల్లిలో మరో జలియన్వాలాబాగ్ వంటి సంఘటన జరిగింది. వందల మంది తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అక్కడ చనిపోయా రు. ఈ విషయం ఎందరికి తెలుసు? తెలంగాణ వంటకాలను హోంసైన్స్లో పాఠ్యాంశాలు చేయాలి... తెలంగాణలో శిలాశాసనాలను వెతికి పట్టుకుని వాటిని గ్రంథాలుగా చేయాలి. పుస్తకాలు, సీడీలుగా మార్చాలి. తాళపత్ర గ్రంథాలను సీడీలుగా మార్చాలి. వెబ్సైట్లలో పెట్టాలి. వందలాదిగా ఉన్న ప్రజల ఆచారాలను బయటకు తీయాలి. జొన్న, సజ్జ రొట్టెలకు ఉన్న విలువెంతో తెలుసా? పచ్చి పులుసు, అరిసెలు, గారెలు వంటివాటిని తెలంగాణ సృష్టించింది. వాటిలో ఉన్న ఆరోగ్య రహస్యాలను హోంసైన్స్లో సిలబస్గా పెట్టాలి. కల్చర్ అంటే మనం వేసుకునే బట్టలు, మనం నివసించే ఇళ్లు, మన ఆహారం, మన కళలు, మన భాష, మన సాహిత్యం, మన వ్యవసాయం, దాన్ని కాపాడుకునే విధానం, ఒక పద్ధతి కలిస్తేనే కల్చర్. దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి. యాసను కాపాడుకోవాలి... తెలంగాణ మాట్లాడే విధానంలోని యాసల సోయగాన్ని సొంపులను పట్టుకొని కాపాడుకోవాలి. యాసను వెక్కిరించొద్దు. యాస అమ్మలాంటిది. అమ్మ నల్లగా ఉందని వెళ్లగొడతామా? యాసలోని సొంపు సోయగాలను సీడీలుగా మార్చాలి. గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలి. వాటిని ధ్వంసం చేయొద్దు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడమంటే సీఎం పదవి తెలంగాణ వారికి రావడమేనా? గద్దెల మీద మనుషులను మార్చడం కాదు. తెలంగాణ మట్టి చరిత్రను ఆవిష్కరించాలి. అధికార మార్పిడి కాదు కావాల్సింది. సినిమా రంగం తెలుగు సంస్కృతికి దూరమైంది. సహజత్వానికి దూరమైంది. తెలుగు అనుబంధాలకు ఇంకా దూరమైంది. పురిటి నొప్పులను కూడా సెక్సీగా చూపించే దుస్థితి సినిమాల్లో దాపురించింది. తెలంగాణ కళాకారులను సినిమా రంగంవైపు ప్రోత్సహించేందుకు ఫిల్మ్లో శిక్షణ ఇవ్వాలి. అందుకు ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేయాలి. బాలచందర్, గిరీష్కర్నాడ్ వంటి వారిని తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాలి. ఈ పనిని ప్రభుత్వమే చేయాలి. -
తెలంగాణ సంస్కృతిని కాపాడాలి
నాందేవ్వాడ,న్యూస్లైన్ : తెలంగాణ సాంసృతీ, సంప్రదాయాలను కాపాడేందుకు జిల్లాలోని ఆర్యవైశ్యులందరూ కృషిచేయాలని రాష్ట్ర ఆర్యవైశ్య సేవా సమితి ఉపాధ్యక్షుడు మహంకాళి విజయ్ అన్నారు.నగరంలోని గాజులపేటలో నగరంలోని 50 డివిజన్లకు చెందిన మహిళలకు నగర వైశ్య భవన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ పోటీల విజేతలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మహాజన్ సుదర్శన్గుప్త, కార్యదర్శి విజయ్, కోశాధికారి కోటగిరి చంద్రప్రకాశ్, న్యాయనిర్ణేతలుగా పెద్దిజగదీశ్వర్గుప్త, కట్కం చిరంజీవిరావు, నారాయణ, ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు. -
తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కతిని కాపాడుకునేందుకు కృషి చేయాలని పలువురు తెలంగాణవాదులు కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ‘బతుకమ్మ’ వ్యాస సంకలనాన్ని జాగృతి వ్యవస్థాపకురాలు కె.కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ, సంపాదకుడు కె.శ్రీనివాస్, కవి నందిని సిధారెడ్డి, క ళాకారుడు దేశ్పతి శ్రీనివాస్, రచయిత గటిక విజయ్కుమార్, తెలంగాణ జాగృతి యువత అధ్యక్షుడు దాస్యం విజయ్భాస్కర్ తదితరులు ప్రసంగించారు. బతుకమ్మ తెల ంగాణ సంస్కృతిలో భాగమే కాకుండా ఈ ప్రాంత ప్రజలు సంబంధాలను కలిపే వేదికని అన్నారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ సంస్కృతిని దెబ్బతీశారని, పలు మీడియా సంస్థలు సైతం అందుకు ఆజ్యం పోశాయని ఆరోపించారు. బంగారు బతుకమ్మ పేరుతో తెలంగాణ జాగృతి చేపట్టబోయే కార్యక్రమ వివరాలను ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. శుక్రవారం నుంచి జిల్లాల వారీగా బంగారు బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించి ఈనెల 12న ట్యాంక్బండ్ వద్ద పెద్ద ఎత్తున మహిళలంతా బతుకమ్మ ఆడనున్నట్లు చెప్పారు. కాళోజీ నారాయణరావు మొదలుకొని నేటితరం రచయిత నందిని సిధారెడ్డి వరకు బతుకమ్మ పండుగపై రాసిన కవితలను సంకలనం రూపంలో ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. బతుకమ్మ పండగ ఉద్యమ సంకేతంగా మారిందని, మర్చిపోతున్న పండుగను తెలంగాణ ఉద్యమం నిలబెట్టిందని అల్లం నారాయణ అన్నారు. డిగ్రీ కూడా చదవని ఏపీఎన్జీవో నేత అశోక్బాబు తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడటం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. కె.శ్రీనివాస్ మాట్లాడుతూ...అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగను కాపాడుకునేందుకు తెలంగాణలోని చెరువులు సంరక్షించుకోవడం ముఖ్యమన్నారు. -
బతుకమ్మల సాక్షిగా బల ప్రదర్శన!
గజ్వేల్ కే ంద్రంగా ఏర్పాట్లు 4న విమలక్క ‘బహుజన బతుకమ్మ’ 9న ఎంపీ విజయశాంతి సంబురాలు 11న జాగృతి ‘బంగారు బతుకమ్మ’ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాలు గజ్వేల్ కేంద్రంగా బల ప్రదర్శనకు వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల నాలుగో తేదీ మొదలుకుని 11వ తేదీ వరకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎవరికి వారుగా బతుకమ్మ వేడుకలు జరిపేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ నెల 11న ‘బంగారు బతుకమ్మ’ ఉత్సవాలు నిర్విహ స్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. గతంలో సిద్దిపేట, సంగారెడ్డి, దుబ్బాకలో సంబురాలు నిర్వహించిన కవిత ఈ యేడాది గజ్వేల్ను వేదికగా ఎంచుకున్నారు. తెలంగాణ జాగృతి ఏర్పాట్ల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కూడా గజ్వేల్లో ఈ నెల 9న బతుకమ్మ వేడుకలు భారీగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో గజ్వేల్ నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్న టీఆర్ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్టు తెలిసింది. తెలంగాణ జాగృతి బంగారు బతుకమ్మ ఏర్పాట్లతో తమ ప్రణాళిక ఎంతమాత్రం పోటీ కాదని పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గం పరిధిలోని జగదేవ్పూర్ మండలం ఎర్రవెల్లిలో ‘గ్రాండ్ లెజెండ్ యూత్ అసోసియేషన్’ తొలిసారిగా ఈ నెల 4న బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తోంది. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకలకు ‘బహుజన బతుకమ్మ’గా పేరు పెట్టారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఇదే గ్రామ పరిధిలో వుండటం బహుజన బతుకమ్మపై ఆసక్తి నెలకొంది. అధికారిక ఏర్పాట్లు అంతేనా? బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సద్దుల బతుకమ్మ’ను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రెండేళ్లుగా లక్ష రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తోంది. బతుకమ్మ నిమజ్జన వేదికల వద్ద ఫ్లెక్సీల ఏర్పాటుకు మాత్రమే అధికారులు పరిమితమవుతున్నారు. ఈ యేడాది పండుగ నిర్వహణకు జిల్లాకు రూ.5 లక్షల చొప్పున కేటాయించాలంటూ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పండుగ ఘనంగా జరిగే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, జోగిపేట ప్రాంతాల్లో ఈ నిధులను ఖర్చు చేయాలనే డిమాండు వినిపిస్తోంది.