thalasani srinivas yadav
-
టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృతంగా ముందుకు వెళుతున్నందునే, ప్రభుత్వం టార్గెట్ చేసి రచ్చచేస్తోందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్ బావమరిది రాజ్పాకాల సొంతంగా ఫామ్హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారని, దాన్ని రేవ్పార్టీ అంటూ కుట్రలకు తెరతీశారని వారు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వా రు మాట్లాడారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ప్రభుత్వంపై కేటీఆర్ దూకుడుగా వెళ్తున్నందునే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ బావమరిది కాబట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు రాజకీయాల్లో ఇప్పుడే చూస్తున్నాం అన్నారు. వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని, ఆయనపై కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.పోలీసు కుటుంబాలు రోడ్డెక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదని, రాజ్ పాకాల విషయంలో మా త్రం వీడియో రిలీజ్ చేశారని విమర్శించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు లేవని, ఇప్పుడు కొత్తగా అలాంటి సంస్కృతిని తీసుకురావద్దని అన్నారు. లేని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారని శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కాగా, మాజీ మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలు చేస్తు న్నారని బీఆర్ఎస్ సీని యర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ను ఇరికించే ప్రయత్నమిదికాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమ లు చేయకుండా, సమస్యలపై నిలదీస్తున్న కేటీఆర్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్, నాయకు లు గెల్లు శ్రీనివాస్, సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు. జన్వాడ పార్టీ వ్యవహారంలో ఆయనను కావాలనే ఇరికిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. -
తొమ్మిదిన్నరేళ్లలో నగర రూపురేఖల్నే మార్చాం
యాభయ్యేళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని పనులెన్నో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలోనే చేసి చూపించిందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇప్పటి వరకూ చేసిన పనులేమిటో చెబుతూ, మున్ముందు మరిన్ని పనులు చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల వారెవరన్నది తాను పట్టించుకోనన్నారు. ఏ పనులు చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో సరిగ్గా తెలియని కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ కూడబెట్టిన అవినీతి సొమ్మును వెలికితీసి దాంతో తమ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెబుతున్న మాటలు హాస్యాస్పదమన్నారు. గాలి మాటలతోనే కాంగ్రెస్ హామీలు ఫేక్ అని వెల్లడవుతోందని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను ఆయన వెల్లడించారు. మీ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలేమిటి? వాటినెలా పరిష్కరిస్తారు? సమస్యలనేవి నిరంతరం ఉంటాయి. ఒకటి పరిష్కరిస్తే మరొకటి పుట్టుకొస్తుంది. సమస్యల్ని క్రమేపీ తగ్గించుకుంటూ, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా పనులు చేస్తున్నాను. అందుకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం ఇస్తోంది. నగరానికి, మీ నియోజకవర్గానికి ఇస్తున్న హామీలు? హైదరాబాద్ నగరానికి కేసీఆర్ ప్రభుత్వం చాలా చేసింది. దేశంలోనే అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దింది. ఈ అభివృద్ధిని ఇంకా విస్తరించుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రజలకు 24 గంటల కరెంటుకు ఢోకాలేదు. యాభయ్యేళ్ల వరకు తాగునీటి సమస్యల్లేకుండా చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాలు ఇప్పటికే అందుతున్నాయి. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల నుంచీ నీటిని రప్పించే పనులున్నాయి. ముంపు సమస్యల్లేకుండా ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టాం. పూర్తయిన పనులతో వరద సమస్యలు కొంత తగ్గాయి. అన్నీ పూర్తయితే ఈ సమస్యలిక ఉండవు. వాటికోసం ఎంత ఖర్చయినా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చేసిన పనుల్లో ముఖ్యమైనవి? చెప్పాలంటే చాలా ఉన్నాయి. 70 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జీఓ 58, 59ల ద్వారా ఇళ్ల పట్టాలు చేతికొచ్చాయి. పేదలకు ఇప్పటికే 70వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చాం. మరో 30వేల ఇళ్లు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. దళితబంధు, కళ్యాణలక్ష్మి, పెన్షన్లు తదితర పథకాలు అమలవుతున్నాయి. అధికార బీఆర్ఎస్పై వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారు ? డబుల్బెడ్రూం ఇళ్లు వచ్చిన ప్రజలు సంతోషంగా ఉన్నారు. రానివారు బాధపడుతున్నారు. వారి బాధ కూడా తీరుస్తాం. మరో లక్ష ఇళ్లు నిర్మిస్తాం. అసలీ పథకాలు తెచ్చింది. అమలు చేస్తున్నదే కేసీఆర్ ప్రభుత్వం. గత పాలకులకు కనీసం ఇలాంటి ఆలోచనలు కూడా రాలేదు. చేసిన పనులు కళ్లముందే కనిపిస్తున్నాయి. దశల వారీగా అన్ని పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. మిగతా పార్టీల మాటలు నమ్మొద్దు. అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే ప్రచారం ఉంది. తగ్గించలేరా ? డబ్బుతో ప్రజలను కొనలేరు. అభ్యర్థులు కూడా వీలైనంత మేరకు ఎన్నికల వ్యయం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంటింటికీ వెళ్లి చేసిన పనులు, చేయబోయే పనులు చెప్పుకోవడం ద్వారా ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాంగ్రెస్ హామీలను ఎలా చూడొచ్చు? మాకు పాలనానుభవం ఉంది. వచ్చే రెవెన్యూ ఎంతో, ఎంత ఖర్చు చేయొచ్చో తెలిసిన నాయకుడున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు ఇంతకుముందే విన్నా. బీఆర్ఎస్ దగ్గరి అవినీతి సొమ్ము వెలికితీసి వారి ఆరు గ్యారంటీలు అమలు చేస్తారట. గాలి మాటలు తప్ప అది సాధ్యమా ? అలాంటి హామీలు ఫేక్ కాక , వాటికి శాంక్టిటీ ఉంటుందా ? కాబట్టి కాంగ్రెస్ను ఎవరూ నమ్మరు కూడా. నగరంలో సీఎం సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ? ఈనె ల 25వ తేదీన గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. భారీయెత్తున నిర్వహించనున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా పార్టీ క్యాడరే కాక నగర ప్రజలకు, చదువుకున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం బాగా పని చేస్తోందనే నమ్మకం ఉంటే అధిక సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో, కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ బలం కనిపించడం లేదు ఎందుకంటారు? రాజకీయ నేతలపై, వివిధ రంగాల్లో ప్రముఖులపై కనీస గౌరవం లేకపోవడంతో పాటు సోషల్ మీడియాలో వారిని ఇష్టానుసారం చిత్రీకరించడం కొందరికి ఫ్యాషన్గా, ప్యాషన్గానూ మారింది. ఇంకొందరు సర్వేలపేరిట తోచింది రాస్తున్నారు. సర్వేల నివేదికలంటూ ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. వాటికెలాంటి శాంక్టిటీ లేదు. వాటి గురించి పట్టించుకోవద్దు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరేమిటో గ్రహిస్తున్నారు. చేసిన మంచి పనులు కళ్లముందే ఉన్నాయి. ఉదాహరణకు కరోనా వైరస్ తరుణంలోనూ ప్రభుత్వపరంగా ఏంచేశామో ప్రజలు చూశారు. నియోజకవర్గంలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ప్రత్యర్థి గురించి ఆలోచించను. నియోజకవర్గంలో నేను చేసిన పనులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నా. గత ప్రభుత్వాలు యాభయ్యేళ్లలో చేయని పనులు తొమ్మిదిన్నరేళ్లలో చేశాం. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాం. వాటితోపాటు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, రాత్రుళ్లు ఎల్ఈడీ వీధి దీపాలు, ఇండోర్ స్టేడియాలు, తగినన్ని తాగునీటి రిజర్వాయర్లు తదితరమైన వాటిపైనే నా ఫోకస్. -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్యాదవ్ కార్పొరేటర్గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్లో 2014లో గోపాల్పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన జగదీశ్వర్గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్అలీ, మాజిద్ హుస్సేన్లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్యాదవ్ సనత్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
రెండు సీట్లు రాని బీజేపీ బీసీని సీఎంను చేస్తుందా?
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ.. ఇప్పుడు బీసీలకు సీఎం పదవి అనడం హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశారు. ఏదైనా చెప్పేముందు దానిలో వాస్తవికత ఉండాలని అన్నారు. సీఎం కేసీఆర్పై పోటీ చేస్తామన డం కొందరికి ఫ్యాషన్గా మారిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని తలసాని స్పష్టం చేశారు. తమది ఏ టీమ్ అని, సింగిల్ గానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. బీఆర్ఎస్కు తగినన్ని సీట్లు రావనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, 78 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెప్పారు. కేంద్రంలోనూ కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు! పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి లేరని తలసాని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన 27 మందికి సీట్లివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారికి వెంటనే సీట్లు ఇస్తోందన్నారు. బల్దియా ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తేవడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడిన డ్రామా అని విమర్శించారు. తాము అమలు చేస్తు న్న పథకాలను దేశమే కాపీ కొడుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు ఓటువేసే హక్కును ఉపయోగించుకోవాలని, ఓట్లు వేయరనే అపప్రదను చెరిపి వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం, చంద్రబాబు అరెస్టు, తదితర పరిణామాల ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందంటూ, తమ(ఎమ్మెల్యేల)ఇళ్ల స్థలా లు కూడా ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. -
ఇలాంటి ఇళ్లు చూపిస్తే రాజీనామా చేస్తా
రామచంద్రాపురం (పటాన్చెరు): సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో పేదల కోసం ఇలాంటి ఆధునిక ఇళ్లు కట్టించిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కిందన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో రూ.కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా తానే తీసుకెళ్లి ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లను చూపించానని తలసాని చెప్పారు. కానీ ఈ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదన్నట్లు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారని, ఆయన వివేకానికే వదిలేశానని వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, దానం నరేందర్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
‘డబుల్’పై బీజేపీ డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ విమర్శించారు. దేశంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర మేనని అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కిషన్ రెడ్డికి అధికారికంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏం ఆశించి, ఎందుకోసం ఈ రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని, పేద ప్రజల సంక్షేమం కోసం మీరేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే.. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తలసాని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకు న్నట్లు తెలిపారు. కొల్లూరులో రూ. 6,700 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇళ్ల కాలనీని ఇటీవలే సీఎం ప్రారంభించారన్నారు. గతంలో డబుల్బెడ్ రూం ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో కిషన్రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. -
వృద్ధులకు ఇంటి వద్దే ఉచిత చికిత్స
కంటోన్మెంట్: ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద ప్రభుత్వ, రెడ్ క్రాస్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో లేని ప్రాంతాలు, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ వాహనం ద్వారా 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. అవసరమైన మందులు కూడా ఉచితంగానే అందజేస్తామన్నారు. 14 జిల్లాలలో ఈ తరహా 17 వాహనాల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వాహనంలో డాక్టర్, నర్స్, టెక్నీషియన్, అసిస్టెంట్ ఉంటారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పేదలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడమే కాకుండా 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రజలు ఈ సేవలను సది్వనియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సీఈఓ మదన్ మోహన్, కో ఆర్డినేటర్ స్వర్ణలత, అడ్వైజర్ శ్రీనివాస్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ రాజేందర్, సీనియర్ సిటిజన్ సహదేవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి
కవాడిగూడ (హైదరాబాద్): మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు గొల్లకురుమల వృత్తిని కించపరిచేలా, యాదవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనికి రేవంత్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మ న్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ యాదవ, కురుమ సంఘాల జేఏసీ కన్వీనర్ అయిలయ్య, కో కన్వినర్ జి. శ్రీనివాస్ యాదవ్లు డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం కురుమ, యాదవ సంఘాలు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించాయి. దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యాదవులు, కురుమలు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల రేవంత్రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై గొల్ల వృత్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తక్షణమే రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాలు డెడ్లైన్ ప్రకటించినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో మహాధర్నా చేపట్టామన్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. చలో గాందీభవన్తో ఉద్రిక్తత ధర్నా అనంతరం కురుమ, యాదవ సంఘాలు గాందీభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ధర్నా చౌక్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. -
8,9,10 తేదీల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్ : మృగశిరకార్తె సందర్భంగా వచ్చే నెల 8,9,10 తేదీల్లో మత్య్సశాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించాలని అధికారులకు మత్య్స, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. ఫిష్ పుడ్ ఫెస్టివల్కు అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్పై బుధవారం సచివాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చరాం భూక్యాలతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫెస్టివల్లో 20 నుంచి 30 వరకు వివిధ రకాల చేప వంటకాల స్టాల్స్, విజయ డెయిరీ ఉత్పత్తులతో కూడిన స్టాల్ ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఫెస్టివల్ మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. సమీక్ష సందర్భంగా మత్స్య సహకార సంఘాల సొసైటీ నూతన చైర్మన్గా నియమితులైన పిట్టల రవీందర్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ (వీఏఎస్) అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. వీఏఎస్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల వారీగా పశుసంవర్ధక శాఖ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ పశువైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. -
పెండ పిసికేటోడు నన్నేం పిసుకుతాడు.. తలసానికి రేవంత్రెడ్డి కౌంటర్
కంటోన్మెంట్ (హైదరాబాద్): చాలాకాలం దున్నపోతు లతో తిరిగి వాటి పెండ పిసికే అలవాటున్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తనను పిసికేస్తానంటూ ప్రగ ల్భాలు పలకడం హాస్యాస్పదమని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. ఆయినా ఆయన ఏం పిసకాలనుకుంటు న్నాడో సమయం చెబితే తాను వస్తానని చెప్పారు. తలసాని ఎన్నాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాళ్లు పిసికినా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి అధ్యక్షుడినైన తన స్థాయికి రాలేడ ని వ్యాఖ్యానించారు. బుధవారం కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్పరాగ్ నమిలేటోడు కూడా తన గురించి మాట్లాడితే గౌరవంగా ఉండదని రేవంత్ అన్నారు. తలసాని పాన్పరాగ్ మానేస్తే బాగుంటుందని, ప్రజాప్రతినిధులుగా మనం యువ కులకు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. కేంద్రం, రాష్ట్రం నిధులివ్వాల్సిందే.. కంటోన్మెంట్కు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాల్సిందేనని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. సర్విసు చార్జీల బకాయిలు ఇప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై ఉందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్కు రావాల్సిన పన్నుల వాటాను తన ఖాతాలోకి మళ్లించుకోకుండా నేరుగా కంటోన్మెంట్కే చెల్లించాలన్నారు. హైటెక్ సిటీ సమీపంలో మెట్రోకు అప్పగించిన 15 ఎకరాలను దొడ్డిదారిన ప్రైవేటు సంస్థకు ఇచ్చారని రేవంత్రెడ్డి ఆరోపించారు. తలసానికి రేవంత్ క్షమాపణ చెప్పాలి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను దూషించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డిని ప్రజా క్షేత్రంలో యాదవ్ కురుమలు అడ్డుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. యాదవ కురుమలకు పెండ పిసకడం తెలుసు, బరాబర్ నీ కుతిక పిసకడం కూడా తెలుసు అని హెచ్చరించారు. రేవంత్ క్షమాపణ చెప్పకపోతే జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. చదవండి: నీకు మైండ్ ఉందా.. నువ్వు నోర్మూసుకో -
పర్సనాలిటీ గింత.. పిసికితే ప్రాణం పోద్ది
సనత్నగర్ (హైదరాబాద్): ‘ప్రియాంకా గాంధీ సభలో డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. ఎమ్మెల్యే అని లేదు.. మంత్రి అని లేదు.. వాడు.. వీడు అని మాట్లాడతాడు.. ఉన్న పర్సనాలిటీ గింత.. పిసికితే ప్రాణం పోద్ది.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నడు..’ అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తీవ్రస్థాయిలో దూషించారు. ప్రియాంకా గాందీపై కూడా విమర్శలు కురిపించారు. ‘మా తాత ఇదుండే..మా అమ్మమ్మ అదుండే.. మా నాయన అది అని ప్రియాంకా గాంధీ చెబుతుంది. మరి 40 సంవత్సరాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని మీరే పరిపాలించారు కదా..పేద వాళ్ళకు రూ.2 వేల పెన్షన్ ఇవ్వాలని, 24 గంటల కరెంటు, ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చిన ఆలోచన..మీకు ఎందుకు రాలేదు?..’అని నిలదీశారు. మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని ధనియాలగుట్ట వైకుంఠ ధామం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలసాని పాల్గొని మాట్లాడారు. ఎక్కడైనా ఇళ్లు మునిగిన పరిస్థితి ఉందా? ‘వరదల ఇబ్బందులు గతంలో పరిపాలన చేసిన కాంగ్రెస్ పాపం కాదా? ఎక్కడపడితే అక్కడ ఆక్రమణలు, నాలాలు మూసుకుపోయిన పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ హయాంలో.. వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గతంలో కంటే ఎక్కువగా వర్షాలు వచ్చాయి. ఎక్కడైనా ఇళ్లు మునిగిన పరిస్థితి ఉందా?..’అని మంత్రి ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు వరదలు వస్తే ముఖ్యమంత్రి ఇంటికి పది వేల రూపాయలు చొప్పున ఇచ్చారని తెలిపారు. నాకు బొట్టు పెట్టడం బీజేపీ వాళ్లు నేర్పిస్తారా? ‘ప్రైమ్ మినిస్టర్, వీళ్లు హైదరాబాద్ సిటీలో శ్రీనివాస్యాదవ్కు కొత్తగా బొట్టు పెట్టడం నేర్పిస్తారా? నేను చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటున్నా. ప్రధానమంత్రి గానీ, దేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గానీ ఇక్కడి వైకుంఠధామం లాంటిది ఒక్కటైనా కట్టారా? ఎంతకూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలి.. వైషమ్యాలు, లేనిపోని సమస్యలు సృష్టించాలి. ఇదే పని. జై హనుమాన్, జై బజరంగ్ అంటూ దేవుళ్ల పేర్లు చెప్పడమే తప్ప బీజేపీ నాయకులు ఎక్కడైనా ఒక్క దేవాలయం కట్టారా? అద్భుతమైన యాదాద్రిని నిర్మించిన కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా?. కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పరిస్థితి ఉండేది. కేసీఆర్ వచ్చాక నేను పోతాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అన్న పరిస్థితి రాష్ట్రంలో వ చ్చింది..’అని చెప్పారు. ప్రజల ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ‘చూస్తే అమెరికాలో వైట్హౌస్ చూడాలి..లేదా తెలంగాణలో సెక్రటేరియట్ చూడాలి. దేశంలోని నాయకులందరూ అంబేడ్కర్ పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవాలని చూస్తారు..కానీ నిజమైన నాయకుడు కేసీఆర్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు..’అని తలసాని తెలిపారు. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాన్ని, నాయకులను కాపాడుకోవాలని అన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి..కొత్త బిచ్చగాళ్లు వస్తుంటారు..ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతుంటారు..పనిచేయని వాడు మనకు అవసరం లేదు. ఎవరైతే మనకు పనిచేస్తారో వారి గురించే ఆలోచన చేయాలని తలసాని విజ్ఞప్తి చేశారు. నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా: తలసాని ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదని, రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాతనంతో వ్యవహరించాలని తలసాని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. రేవంత్ అసభ్యకర భాషతో చేసిన విమర్శలతో తాను ఆవేదన చెందానని, ఆ ఆవేదన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలను బాధ్యత కలిగిన మంత్రిగా ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరికాదని, ఇకనైనా బాధ్యతగా మాట్లాడదామని సూచించారు. -
నీరా కేఫ్, క్యాంటీన్ ప్రారంభం
పంజగుట్ట: తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరాతోపాటు వాటి ఉప ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్, క్యాంటీన్ హైదరాబాద్వాసులకు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్, క్యాంటీన్లను రాష్ట్ర ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలసి బుధవారం ప్రారంభించారు. నీరాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, నీరా దేవతల పానీయం అని చెప్పేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలతో కలసి మంత్రులు ఈ సందర్భంగా నీరా తాగారు. నీరాలో ఎలాంటి ఆల్కహాల్ ఉండదని... ఇది తాగడంవల్ల మత్తు రాదని శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఇందులో పుష్కలంగా విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయని చెప్పారు. సహజంగా లభించే పానియాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... వారికి గీత కార్మికుల ఆత్మగౌరవ ప్రతీకగా తీసుకొచ్చిన నీరా కేఫ్ చెంపపెట్టులాంటిదన్నారు. నీరా వంటకాలు సైతం.. క్యాంటీన్లో నీరా విత్ బోటీ, నీరా విత్ తెలంగాణ వంటకాలు, నీరా విత్ బిర్యానీ, నీరా విత్ వెజ్ స్నాక్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర, తేనె, నీరాతో చేసిన ‘బూస్ట్’ పొడి కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే నీరా ఐస్క్రీం, తాటి ముంజ ఐస్క్రీంలను అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని... అందులో భాగంగానే రైతు బీమా తరహాలో గీత కార్మికులకు రూ. 5 లక్షల బీమా తీసుకొచ్చారని శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారని, ట్యాంక్బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. నీరా కేఫ్ ప్రారంభించినందుకు, గీత కార్మికులకు బీమా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ చిత్రపటాలకు అఖిల భారత గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, రాష్ట్ర పర్యాటక, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆంజనేయ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయన రాజమౌళి కాదు.. రాజముని
‘‘ఆస్కార్’ అవార్డు సాధించి ఎంతో మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన రాజమౌళి కాదు.. రాజముని. ఆయన చేసిన గొప్ప ప్రయోగం (ఆర్ఆర్ఆర్) తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటింది’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్లను హైదరాబాద్లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ–‘‘ఆస్కార్ అంటే ఆకాశంలో తారలాంటిది. ఆ తారని నేలకు తెచ్చిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్లకు అభినందనలు. తెలుగువారు గర్వపడేలా తెలుగు ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలిపిన వారికి ఏపీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున అభినందనలు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ రావాలని లక్షల మంది ఎదురు చూశారు.. ఆ అవార్డు రానే వచ్చింది. ఈ విజయాన్ని సాధించిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్గార్లకు అభినందనలు’’అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ–‘‘ఒక సినిమాకి నంది అవార్డు వచ్చిందంటే చాలా గొప్పగా అనుకుంటున్నాం. అలాంటిది తొలిసారి ఒక తెలుగు పాటకి ప్రపంచంలో అత్యున్నతమైన ‘ఆస్కార్’ అవార్డు రావడం తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సమయం. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్కి అభినందనలు’’ అన్నారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ అవార్డు రావడం వెనుక రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అద్భుతంగా డ్యాన్స్ చేసిన రామ్చరణ్, ఎన్టీఆర్, ఉక్రెయిన్ డ్యాన్సర్స్ కృషి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నచ్చింది కాబట్టే ‘నాటు నాటు..’ పాట నచ్చింది, అవార్డు వచ్చింది. ఇది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సమిష్టి కృషికి లభించిన విజయం’’ అన్నారు. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ–‘‘తమ్ముడూ.. నువ్వు పాడటంపై దృష్టి పెట్టొద్దు.. రాయడంపై దృష్టి పెట్టు’ అని చెప్పిన గుర్రా శ్రీనాథ్ అన్న, ‘పెళ్లిసందడి’ సమయంలో ‘బోస్ని మనతోపాటు చెన్నై తీసుకెళదాం’ అంటూ రాఘవేంద్రరావుగారితో చెప్పిన కీరవాణిగార్ల మాటలు నా జీవిత గమనాన్ని మార్చి ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆస్కార్ని చేతిలో పట్టుకున్నప్పుడు భారత సాహిత్య పతాకాన్ని పట్టుకున్నంత ఆనందం కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొత్తవారిని ప్రోత్సహించాలి
‘‘తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త తరం అవసరం చాలా ఉంది. కొత్తవారు చేస్తున్న ఈ ‘అష్టదిగ్బంధనం’ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్తవారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సూర్య భరత్ చంద్ర, ఇషికా ముఖ్య తారలుగా బాబా పీఆర్ దర్శకత్వంలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాం. ఒక వినూత్న కథాంశంతో బాబా పీఆర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది’’ అని బాబా పీఆర్ అన్నారు. ‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నాను’’ అన్నారు సూర్య భరత్ చంద్ర. ‘‘తెలుగులో నాకు ఇది మూడో సినిమా’’ అన్నారు ఇషికా. -
టాలీవుడ్కి యువత రావాలి
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు యువత రావాల్సిన అవసరం ఉంది. బ్యాక్గ్రౌండ్తో పని లేకుండా ప్రతిభతో చరిత్ర సృష్టించే అవకాశం సినిమా పరిశ్రమలోనే ఉంటుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా అరుణ్ భారతి ఎల్.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. అస్లాం కీ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదలకు తలసాని శ్రీనివాస్, హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘యష్ పూరి నాన్నగారు నా చిన్నప్పటి స్నేహితుడు. యువత చూడాల్సిన చిత్రం ‘చెప్పాలని ఉంది’’ అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ‘‘మన యూత్ సినిమా ఇది.. థియేటర్లో చూద్దాం’’ అన్నారు నిఖిల్. ‘‘అన్ని భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం ఒక విధంగా పాన్ ఇండియా ఫిలిం’’ అన్నారు అరుణ్ భారతి. యష్ పూరి, స్టెఫీ పటేల్, సంగీత దర్శకుడు అస్లాం కీ, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడారు. -
గణేష్ నిమజ్జనం ఆంక్షల వివాదంపై తలసాని స్పందన
-
నిర్మాతలు ఆ విషయం చెప్పడం సంతోషంగా ఉంది: నిఖిల్
‘‘కార్తికేయ’ సినిమా చూశాను.. బాగుంది. ఆ సినిమాలానే ‘కార్తికేయ 2’ కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు చిత్రపరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా ముందుకు వెళ్లాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘కార్తికేయ 2’ తీసిన స్పిరిట్ నన్ను ఇక్కడికి నడిపించింది. ఇండస్ట్రీకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, సినిమానే దాన్ని అధిగమిస్తుంది.. ఎటువంటి పరిస్థితులకి ఇండస్ట్రీ లొంగలేదు’’ అన్నారు. ‘ ‘కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా మొహమాటానికి కొన్నిసార్లు ఫంక్షన్స్కి రావాల్సి ఉంటుంది. కానీ, ‘కార్తికేయ 2’ చాలా బాగుంది’’ అన్నారు ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్. ‘మా సినిమా కచ్చితంగా బాగుంటుంది’’ అన్నారు చందు మొండేటి. ‘‘మంచి కంటెంట్తో సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్కి వస్తారని ఇటీవల ‘బింబిసార, సీతారామం’ నిరూపించాయి. అలానే మా సినిమాకి కూడా బుకింగ్స్ బాగున్నాయని మా నిర్మాతలు చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిఖిల్. -
వజ్రోత్సవ వేడుకలపై సినీ ప్రముఖులతో మాట్లాడిన తలసాని
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 9 నుండి 22 వరకు ఘనంగా నిర్వహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ అధికారులు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు తలసాని. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుగారి ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నాం. ఇక విద్యార్థులందరికీ మహాత్మా గాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాలను రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్థ్యంతో ఉన్న 563 స్క్రీన్లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను థియేటర్లకు తీసుకెళ్ళే రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే చేపడుతుంది. అలాగే సినిమాల ప్రదర్శన సమయాల్లో వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తాం’’ అని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, ఎఫ్డీసీ ఈడీ కిషోర్బాబులతో పాటు యూఎఫ్ఓ క్యూబ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. -
ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి
ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్ నారంగ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూమార్తె జాన్వి వివాహ వేడుక గురువారం రాత్రి హైదబాద్లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధమిత్రుల సమక్షంలో ఆదిత్యతో జాన్వి ఏడడుగులు వేసింది. ఈ వివాహ మహోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్ హీరోలు సందడి చేశారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, దర్శకుడు శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, అనుదీప్, తమిళ హీరో శివకార్తికేయన్తో పాటు నిర్మాతలు సురేశ్ బాబు, సి. కల్యాణ్, నాగవంశీ, మిర్యాల రవీందర్రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: 10వ తరగతిలో సత్తాచాటిన సూర్య కూతురు, మార్కుల జాబితా వైరల్ అలాగే సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ సైతం ఈ వేడుకకు హజరయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా సునీల్ నారంగ్కు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఇటీవల ఈ బ్యానర్లో వచ్చిన లవ్స్టోరీ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో పలు ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల-ధనుశ్ కాంబినేషన్లోని ఓ చిత్రం కాగా.. అనుదీప్-శివ కార్తికేయ కాంబోలో రూపొందుతున్న ప్రిన్స్ మూవీ. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
ప్రతి ఒక్కరు మా సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు: హీరో ధృవ
మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమా కిరోసిన్. పెళ్లి చూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం వంటి సినిమాలతో తన నటన అందరిని ఆకట్టుకున్న ధృవ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమాను బగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ లు నిర్మించారు. తాజాగా ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఇక జాన్ 17న ఈ సినిమాగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. ‘కిరోసిన్ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. నేను గతంలో పోషించిన పాత్రల కంటే ఇది విభిన్నంగా ఉంటుంది. నా దర్శకత్వంలో రాబోందుతున్న సినిమా కావడం, అందులో నేనే హీరోగా ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి. జూన్ 17వ తేదీన థియేటర్లలోకి వస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి’ అని అన్నారు. -
గోడౌన్లో అగ్నిప్రమాదంపై మంత్రి తలసాని దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి మంత్రి తలసాని చేరుకుని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సంఘటన చాలా బాధాకరమని, మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా కృషి చేసినప్పటికీ భారీగా ప్రాణ నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఉదయం మూడున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని, అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అధికారులకు ఆదేశాలు జారిచేయనున్నట్లు తెలిపారు. -
సైదాబాద్లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్: సైదాబాద్లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తున్నారు. -
భారీగా పెరిగిన మటన్, చేపల ధరలు
సాక్షి, హైదరాబాద్ : పప్పులు, నూనెలే కాదు..మటన్, చేపల ధరలు మార్కెట్లో మండిపోతున్నాయి. సామాన్య ప్రజానీకం ఒక కిలో కొనుక్కుని వండుకోవాలన్నా అందనంత దూరానికి వెళ్లిపోయాయి. మామూలుగా కిలో రూ.500 అంతకంటే కొంచెం ఎక్కువ ఉండే మటన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.800 అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మటన్ ధర కిలో రూ.700 దాటకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మటన్ ధరను అదుపు చేయలేకపోతున్నాయి. పరిస్థితిని బట్టి మటన్ రూ.1000 వరకు కిలో అమ్ముతుండటం గమనార్హం. ఇక, చేపల ధరలు కూడా కొండెక్కాయి. రవ్వ, బొచ్చె, కొరమీను..ఏదైనా కిలోకు మూడొంతుల ధర పెరగడంతో మత్స్య ప్రియులు కూడా వెనక్కు తగ్గాల్సి వస్తోంది. కొరమీను కిలో రూ.650 వరకు చేపల ధరలు సైతం రోజురోజుకూ పైపైకి వెళ్లుతున్నాయి. రవ్వ, బొచ్చలు మామూలుS రోజుల్లో అయితే కిలో రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతారు. ఇప్పుడు కిలో రూ.180 నుంచి రూ.220 వరకు అమ్ముతున్నారు. కొరమీను అయితే కిలో రూ. 600 నుంచి రూ.700 వరకు అమ్ముతున్నారు. పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి తక్కువగా ఉండటం, తెలంగాణలో ప్రభుత్వం ఉచితంగా విడుదల చేసిన చేపలు ఇంకా పెరగకపోవడం వంటి అంశాలు కూడా ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. వినియోగం పెరిగింది.. ధరలు పెరిగాయి గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో మటన్ కనీసంగా రోజుకు 60 టన్నుల నుంచి 70 టన్నుల వరకు అమ్మేవారు. పండుగ సమయంలో అయితే ఇది 100 టన్నులకు పైగానే అమ్ముతారు. పోయిన వారంలో ఏకంగా మటన్ 170 టన్నుల వరకు వెళ్లిందని అధికారులు చెబుతున్నాయి. ప్రజల్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కిలో మటన్ రూ. 700లకు మించి అమ్మొద్దని నిబంధనలు ఉన్నా అధికారులు మాటలకే పరిమితం కావడంగమనార్హం. చేపల ధరలు గతంలో, ఇప్పుడు చేపలు రవ్వ బొచ్చెలు కొరమీను రొయ్యలు (కిలోకు రూపాయల్లో) గతంలో 150 160 500–600 250–350 ఇప్పుడు 200 220 600–700 350–450 ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలే మార్కెట్లో మాంసం ధరలు పెంచి అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. సోమవారం దీనిపై ప్రకటన చేస్తామన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉంది కదా అని ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ -
అందరూ బాగుండాలి...
‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే మంచి కథ ఉన్న సినిమాలో అలీ, నరేశ్ నటిస్తుండడం సంతోషంగా ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నటుడు అలీ ‘అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అలీ, సీనియర్ నరేశ్, మౌర్యాని ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీబాబ, కొనతాల మోహనకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కెమెరామేన్ ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నేను, ఈ చిత్రదర్శకుడు కిరణ్ చెన్నైలో రూమ్ మేట్స్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వికృతి’ సినిమాకు ఇది రీమేక్’’ అన్నారు అలీ. ‘‘అలీ ఓ చిత్రం చేస్తున్నాడంటే దానికి ఒక బ్రాండ్ వస్తుంది’’ అన్నారు నరేశ్. ‘‘బుధవారమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు శ్రీపురం కిరణ్. ఈ చిత్రానికి సంగీతం: రాకేష్ పళిడమ్, కెమెరా: ఎస్. మురళీ మోహన్ రెడ్డి. -
మా ఇంటి నుంచి పోటీ చేయడం లేదు: మంత్రి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వరదలపై పక్క రాష్ట్రాలు సాయం చేయడానికి ముందుకు వచ్చినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు పేదల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. ఇక ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం 4,75,781 మందికి నేరుగా వరదసాయం అందజేసిందని మంత్రి తెలిపారు. అనంతరం మీసేవ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించామని, గత మూడురోజుల్లో రూ. 165 కోట్లు మీసేవ ద్వారా వరద బాధితులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ వరదసాయం నిలిపివేసినా, ఫలితాల అనంతరం ఈ మొత్తాన్ని ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నేను ఫైటర్ని.. దేనికి భయపడను : కేసీఆర్) ప్రజలు ఆలోచించాలి ‘‘ప్రతిపక్షాలు టీఆర్ఎస్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్తే ప్రజలే తేల్చుతారు. స్వాతంత్రం వచ్చాక ఇక్కడ ఎన్నడూ జరగని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగింది. వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏమి చేసిందో హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. దేశంలోని ప్రతీ ఒక్కరూ నగరం వైపు చూస్తున్నారు. ఆధునాతన రోడ్లు, సీసీ కెమెరాలు, ఎల్ఈడీలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. భారతదేశంలో మేము కట్టిన ఇళ్లు ఎవరూ కట్టలేదు’’ అని మంత్రి తలసాని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఇక దుబ్బాకలో బీజేపీ విజయం నేపథ్యంలో... ఒక ఎన్నిక గెలిచిన్నంత మాత్రాన మొత్తం అదే ప్రపంచం అనుకుంటే ఎలా అంటూ చురకలు అంటించారు. ఎవరు ఎన్నిరకాలుగా అడ్డుపడినా, ఎన్నికల తర్వాత ప్రజలకు వరద సాయం అందిస్తామని వెల్లడించారు. పోటీ చేయడం లేదు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తమ ఇంటి నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రజాస్వామ్యం లో పోటీ చేసే హక్కు అందరికి ఉంటుందని, మేయర్ అభ్యర్థిపై తమకు ఆశలు లేవని పేర్కొన్నారు. చిన్న వయసులోనే తన కుమారుడికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారని, అదే ఎక్కువగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ బరిలో నిలపగా, ఆయన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
మంత్రి కేటీఆర్కు జగ్గారెడ్డి కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరంటున్నారని, వారి వద్ద ఉన్న వాళ్లందరూ తమ వాళ్లేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి తమ దుకాణం ఖాళీ చేసి, వాళ్లది నింపుకున్నారని, తమ గవర్నమెంట్ వస్తే.. టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పారు. మంత్రి తలసాని వ్యాఖ్యలతో ప్రభుత్వం అభాసుపాలవుతోందని, లక్ష ఇళ్లని చెప్పి.. ఆఖరుకు 20 వేలకు మించి చూపలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ వేదికగా ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ముందు పెట్టాం. 131 జీవోను రద్దు చేసి, ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని కోరాం. రెగ్యులరైజ్కు సమయం రెండు నెలలు కాకుండా.. ఏడాది కాలం ఇవ్వాలని కోరాం. డబ్బులు 50 శాతం తగ్గించాలని కోరినప్పుడు కేటీఆర్ వెంటనే స్పందించారు. మంత్రి కేటీఆర్కు మీడియా ముఖంగా కృతజ్ఞతలు చెబుతున్నా. డబ్బులు తగ్గించడంతో పాటు 6 నెలల సమయం ఉంటుందన్నారు. లక్ష రూపాయలు కట్టే ప్లాట్పై 40 వేల రూపాయలకు కుదిస్తే.. సంతోషంగా చెల్లిస్తారు. రెవెన్యూ చట్టంలో మార్పులు చేర్పులకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. తక్షణమే రిజిస్ట్రేషన్లు జరిగేలా జీవో ఇవ్వాలి. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టమే’’అని అన్నారు. -
సీఎం కేసీఆర్కి చిరంజీవి కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగ్లకు అనుమతిస్తూ ఉత్తర్వులూ జారీ చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చస్త్రశారు. షూటింగ్లకు అనుమతి ఇచ్చినందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి,విధి విధానాలు రూపొందించి సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్కి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు’ అని చిరంజీవి ట్విట్ చేశారు. (చదవండి : తెలంగాణలో షూటింగ్లకు అనుమతులు ) కాగా, పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. (చదవండి : పెంగ్విన్ టీజర్: సైకో ఎవరు?) -
పేద బ్రాహ్మణునికి తలసాని సాయం..
సనత్నగర్: ఓ పురోహితుడు వాహనదారులను యాచిస్తున్న సంఘటన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను కలచివేసింది. ‘హతవిధీ’ శీర్షికన లాక్డౌన్ సమయంలో జనులు పడుతున్న కష్టాలకు దర్పణంగా నిలుస్తూ ఓ పేద బ్రాహ్మణుడు వాహనదారులను యాచిస్తుండడంపై ‘సాక్షి’లో బుధవారం ఫొటో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన మంత్రి ఆగమేఘాలపై వారి వివరాలను సేకరించి వారికి సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. నెల రోజులకు సరిపడా బియ్యం, మంచినూనె, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులతో పాటు రూ.2,000ల నగదును మంత్రి తలసాని అందజేశారు.(సొంతూళ్లకు వెళ్లేందుకు ఓకే) -
విజయనిర్మల నా భార్య కావడం నా అదృష్టం
‘‘విజయనిర్మల ఐదారు సినిమాల్లో నటించాక డైరెక్ట్ చేస్తానంది.. వంద సినిమాల్లో నటించి, ఆ తర్వాత డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నాను. ఆమె అలానే చేసింది’’ అని నటుడు కృష్ణ అన్నారు. గురువారం నటి, దర్శక–నిర్మాత విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్రామ్గూడలోని కృష్ణ– విజయనిర్మల నివాసంలో ఏర్పాటు చేసిన విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని కృష్ణ ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినీరెడ్డికి నటుడు కృష్ణంరాజు, హీరో మహేష్బాబు అందించారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల దర్శకత్వం వహించిన మొదటి మలయాళ సినిమా ‘కవిత’ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో తీసిన ‘మీనా’ వందరోజులు ఆడింది. మొత్తం 46 సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల విజయాల్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘విజయ నిర్మల గారు 50 సినిమాలకి దర్శకత్వం వహించడం ఓ చరిత్ర’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. మహేష్ బాబు మాట్లాడుతూ– ‘‘నా సినిమాల మొదటి ఆట చూసి నాన్నగారు నాతో మాట్లాడేవారు. తర్వాత విజయనిర్మలగారు మాట్లాడి అభినందనలు చెప్పేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తర్వాత నాన్నగారు అభినందించారు.. తర్వాత ఆవిడ మాట్లాడబోతుందనుకుని వెంటనే ‘ఆమె లేరు కదా’ అనే విషయాన్ని రియలైజ్ అయ్యాను. ఆ రోజు ఆ లోటు కనిపించింది’’ అన్నారు. ‘‘మా అమ్మ పేరున నటీనటులకు ప్రతి సంవత్సరం అవార్డు అందించనున్నాం’’ అన్నారు నరేష్ విజయకృష్ణ. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
వెండితెరకు కాళోజీ జీవితం
ప్రజాకవి, ప్రముఖ రచయిత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత స్వర్గీయ కాళోజీ నారాయణరావు జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ ‘ప్రజాకవి–కాళోజీ’ పేరుతో ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ‘‘కాళోజీగారి జీవితమంతా పోరాటమే. ఆ పోరాటాన్ని ‘ప్రజాకవి– కాళోజీ’గా తెరకెక్కిస్తున్నాం. కాళోజీ పాత్రలో శ్రీ మూలవిరాట్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారి పాత్రను వారి తమ్ముడు మనోహర రావుగారు పోషిస్తున్నారు. కాళోజీ భార్యగా విజయలక్ష్మీ జైనీ కనిపిస్తారు. ఈ సినిమాకు ఎస్ఎస్. ఆత్రేయ సంగీతదర్శకుడు’’ అని చిత్రబృందం తెలిపింది. కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, నాగిళ్ళ రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, పొట్టపల్లి శ్రీనివాసరావు, కవి అన్వర్ పాల్గొన్నారు. -
కేటీఆర్ డమ్మీ లీడర్ కాదు: తలసాని
సాక్షి, హైదరాబాద్: ‘ఇతర పార్టీల్లోని కొందరు నాయకుల మాదిరిగా కేటీఆర్ డమ్మీ లీడర్ కాదు. ఆయనకు సీఎం పదవిపై సమయం, సందర్భాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో కలిసి తలసాని విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కోసం టీఆర్ఎస్ నేతల నడుమ అంతర్గత పోటీ ఉందని, కాంగ్రెస్, బీజేపీకి దిక్కూదివాణం లేదని తలసాని ఎద్దేవా చేశారు. పార్టీ లో సుదీర్ఘ అనుభవం, సీనియారిటీ ఉన్న నేతలకు టికెట్లు రాకపోతే ఆవేశ పడొద్దన్నారు. కాగా, తాండూరు మున్సిపాలిటీ పరిధిలో కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని పి.మహేందర్రెడ్డి, రోహిత్రెడ్డి ప్రకటించారు. -
సంగీతంలో సస్పెన్స్
సందీప్, శివ, విశ్వాస్, ఠాగూర్, సాన్య, జోయా ముఖ్య తారలుగా గంటాడి కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గడ్డం రవి సమర్పణలో గంటాడి కృష్ణ, సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. గంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో సంగీత ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథతో కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు సురేష్ రెడ్డి. ‘‘కచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్, విశ్వాస్. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ బామ్మిశెట్టి, సహ నిర్మాతలు రాధాకృష్ణ, మహేష్ కల్లె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాహుల్, పరిటాల. -
బకాయిల వల్లే టెండర్లకు కాంట్రాక్టర్లు దూరం
సాక్షి, హైదరాబాద్: బకాయిలు పేరుకుపోవడంతో వివిధశాఖల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మం గళవారం వివిధ శాఖల పద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతా కలిపి రూ.27 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, బడ్జెట్లో నిధుల కేటాయింపు నిరాశపరిచిందన్నారు. వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు పాత బకాయిలకు సరిపోవన్నారు. సీఎం మరో రెండు మార్లు తానే అధికారంలో ఉంటానని ధీమాగా చెబుతున్నారని, కానీ ఆయనకు మరో నాలుగేళ్లు మాత్రమే అధికారంలో ఉండేందుకు ప్రజలు ఓటేశారన్నారు. రెండోసారి అధికారం కట్టబెడితే తనపై నమ్మకంలేక ప్రతిపక్షసభ్యులను పారీ్టలోకి చేర్చుకోవడం దారుణమని రాజగోపాల్రెడ్డి మండిపడ్డారు. దీంతో అధికారపక్ష సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. గందరగోళం నెలకొనడంతో సభలో రసాభాస జరిగింది. ‘మీకు మీ సీఎంను అడిగే దమ్ములేదు. అలాంటిది మమ్మల్ని అడ్డుకుం టే ఎలా? మమ్మల్ని నోరుమూసుకొని కూర్చోవడానికి ప్రజలు ఇక్కడకు పంపించలేదు. ప్రశ్నించాలని పంపించారు. నా గొంతును మూసేసే దమ్ము మీకు లేదు’ అని రాజగోపాల్రెడ్డి అధికారపక్ష సభ్యులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. భజనపరులకు ప్రజాసమస్యలు అర్థంకావు... సీఎం ఏం చేసినా కీర్తిస్తూ మంత్రులు ఆయనకు భజనపరుల్లాగా మారారని, వారికి జనం సమస్య లు అర్థం కావని, తాను ఎమ్మెల్యేగా ప్రజల సమ స్యలను దగ్గరగా చూసి చెబుతున్నానని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు వంద రోజుల ప్రణాళిక అంటూ హడావుడి చేస్తున్నారని, చివరకు నిధులు మాత్రం ఇవ్వర న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకున్నా, ఉద్యమనేత సీఎం అయ్యారని సంతోషించామని, కానీ ఆయన ప్రజల పక్షాన పనిచేయటం లేదన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంæ అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందన్నారు. పార్టీ మారితే రాజీనామా చేస్తా... తాను పార్టీ మారితే రాజీనామా చేసి మరో పారీ్టలో చేరతానని, తలసానిలా వేరే పారీ్టలో చేరి మంత్రి పదవి పొందలేదని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తలసాని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్కు పబ్లిసిటీ పిచ్చి ఉందన్నారు. రాజ గోపాల్ ఇక్కడ ఏదో మాట్లాడి.. ఆ తర్వాత నెల రోజులపాటు గాయబ్ అవుతారని ఎద్దేవా చేశారు. ఇంతలో దానం నాగేందర్ జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క జోక్యం చేసు కుని ‘నాగేందర్ మంత్రిగా లేరు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటూ మాట్లాడతారు? ఇంకా తాను మంత్రి అని అనుకుంటున్నారేమో’ అని చురకలంటించారు. మాట్లాడుతుంటే మధ్యలో మైక్ కట్ చేస్తారా... అంటూ భట్టి స్పీకర్ను ప్రశ్నించారు. మంత్రి ప్రశాంత్రెడ్డి జోక్యం చేసుకుంటూ భట్టి సీఎల్పీ లీడర్ కాదని, ఆయన అందరిలాగే సాధారణ సభ్యుడన్నారు. తాను కాంగ్రెస్ పక్ష నేత అని భట్టి జవాబిచ్చారు. సభలో మున్సిపల్ బిల్లు జీరో అవర్ అనంతరం సభ ప్రారంభమైన వెంటనే మంత్రి కేటీఆర్ మున్సిపల్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. పం చాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్ శాఖలకు చెందిన పద్దులను మంత్రులు ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి ప్రవేశపెట్టారు. పద్దులపై టీఆర్ఎస్ సభ్యుడు నరేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయా లని, దీనివల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మరో సభ్యుడు రామ లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలన్నారు. ఎంఐఎం సభ్యుడు మొయినుద్దీన్ మాట్లాడుతూ నగరంలో వైరల్, డెంగీ జ్వరాలు పెరిగాయని, ఆసుపత్రుల్లో వసతులు పెంచాలని అన్నారు. -
సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు
‘‘ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూశా. సినిమా ఆఫీస్ ప్రారంభం నుంచి ఆ చిత్రం విడుదలయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనేది అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునాదిరాళ్లు’’ అని హీరో చిరంజీవి అన్నారు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ‘తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం’ హైదరాబాద్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ–‘‘షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లే. కాబట్టి సినిమా సక్సెస్లో వారి వంతు చాలా ఉంటుంది. ‘సైరా’ సినిమా షూటింగ్ లొకేషన్ కోసం మా మేనేజర్ లొకేషన్ వారి కాళ్లమీద పడి అనుమతి తీసుకున్నారు. ఇందుకు మేనేజర్స్కి మా హృదయపూర్వక నమస్కారాలు. మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ రజతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ–‘‘సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు ఈ ఫంక్షన్కు రావడం హర్షించదగ్గ విషయం. ఈ వేడుకను ఇంత గ్రాండ్గా చేసిన మేనేజర్స్ యూనియన్కు అభినందనలు. భవిష్యత్తులో కూడా నేను చిత్ర పరిశ్రమకు సహాయపడతాను’’ అన్నారు. నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్ మేనేజర్స్ ఇంత మంచి ఫంక్షన్ చేస్తారని ఊహించలేదు. వారు తలుచుకుంటే సినిమాని టైమ్లో పూర్తి చేయగలరు. తెలుగు చిత్ర పరిశ్రమలో గత 50 ఏళ్ల నుండి ఎంతో మంచి మేనేజర్స్ను చూశాను. వారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి’’ అన్నారు. నటుడు గిరిబాబు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్ మేనేజర్ల సేవలు చాలా అమూల్యమైనవి. సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు వారు సినిమాకు చాలా సహాయంగా ఉంటారు. వారు పదికాలాల పాటు చల్లగా ఉండాలి’’ అన్నారు. దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ చూడలేదు. మేనేజర్లు చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ దిశగా ముందుకు వెళుతుంది. నేను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన మేనేజర్స్కు కృతజ్ఞతలు’’ అన్నారు. హీరో మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్లో చిరంజీవిగారిని కలవడం కొత్త ఎనర్జీని ఇచ్చింది. మేనేజర్స్ చేస్తున్న ఈ వేడుకకు రావడం సంతోషంగా భావిస్తున్నా. భవిష్యత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చేయాలి’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మేనేజర్లు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరవడం సంతోషం. నేను 32 సినిమాలు తీశాను కాబట్టి రూ.32 లక్షలు మేనేజర్స్ యూనియన్కు ఇస్తున్నా. నేను నిర్మించిన మంచి చిత్రాల్లో మేనేజర్స్ సహాయ సహకారాలు ఉన్నాయి’’ అన్నారు. కాగా మేనేజర్స్ యూనియన్కు నటీనటులు జీవిత, రాజశేఖర్ రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి, కోటా శ్రీనివాసరావు, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, అల్లు అరవింద్, సురేశ్ బాబు, నీహారిక, నాగబాబు, రామ్–లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశీఖన్నా, రెజీనా, ప్రగ్యాజైస్వాల్, పూజాహెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, శ్రీకాంత్, అశ్వినీదత్, బోయపాటి శ్రీను, టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీతో పాటు ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ గౌరవ అధ్యక్షుడు ఎమ్.సీతారామరాజు, అధ్యక్షుడు అమ్మిరాజు కాసుమిల్లి, ప్రధాన కార్యదర్శి: ఆర్.వెంకటేశ్వర రావు, కోశాధికారి: కె.సతీష్, ఉపాధ్యక్షులు డి.యోగనంద్, కుంపట్ల రాంబాబు, జాయింట్ సెక్రటరీలు సురపనేని కిషోర్, జి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. రోజారమణి, సుమలత, టి. సుబ్బరామిరెడ్డి, జయప్రద, చిరంజీవి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రఘురామకృష్టం రాజు, అమ్మిరాజు, రాజశేఖర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహాగణపతి నిమజ్జనం 11.30 లోపే..
ఖైరతాబాద్: ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ రామ్మోహన్లు వెల్లడించారు. ఈ సంవత్సరం నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని సాగర్లో పూర్తిగా నిమజ్జనం అయ్యే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. అలాగే ఉదయం 11.30 కల్లా మహాగణపతి నిమజ్జన ఘట్టం పూర్తవుతుందన్నారు. సోమవారం వీరు ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ ముషారఫ్ ఫారుకీ, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి ఖైరతాబాద్ మహాగణపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 65 సంవత్సరాల చరిత్ర ఉన్న ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్అండ్బి, వాటర్వర్క్స్, ఇంజనీరింగ్, హెల్త్, జీహెచ్ఎంసీ, విద్యుత్ తదితర శాఖల సాయంతో ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. సెన్సేషన్ థియేటర్, ఖైరతాబాద్ రైల్వేగేటు, మింట్ కాంపౌండ్ రోడ్లను వినాయక చవితి లోపు ఆధునీకరించాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని వైపులా ఎల్ఈడీ విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వినతి మేరకు ఉత్సవాల 9 రోజులు మహాగణపతి ప్రాంగంలో కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటుచేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్కు, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. పూర్తిగా నిమజ్జనం చేస్తాం.... ప్రతీ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయిన నాలుగైదు రోజుల తర్వాత కూడా నీటిలో సగం తేలుతూ కనిపిస్తుందని, ఈ సంవత్సరం అలా కాకుండా ప్రత్యేకంగా నిపుణుల పర్యవేక్షణలో మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేవిధంగా చూస్తామని తెలిపారు. ఇందుకు సాగర్లో నిమజ్జనం గావించే ప్రాంతాల్లో లోతైన ప్రాంతాన్ని గుర్తించామని మంత్రి వెల్లడించారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీజీపీ, సీపీ ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే ఉంటుందని, విద్యుత్ సరఫరా విషయంలో అధికారులు అలర్ట్గా ఉంటారన్నారు. మహాగణపతి నిమజ్జనం 11.30 లోపే పూర్తి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు లక్షలాది మందికి ఆసక్తి ఉంటుందని..అందుకే ఈ సంవత్సరం కూడా నిమజ్జనాన్ని ఉదయం 11.30 లోపే పూర్తిచేస్తామని, ఇందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ అంగీకరించాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీ సాయంతో మహాగణపతి నిమజ్జనం పూర్తిగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాగణపతి ప్రాంగణంలోని రోడ్లన్నీ వైట్ టాపింగ్ రోడ్లుగా ఆధునీకరిస్తామని తెలిపారు. గత సంవత్సరం 33 వేల వినాయక విగ్రహాలు ఉంటే ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశముందన్నారు. ఈ సంవత్సరం నిమజ్జనంకోసం ఇప్పటికే 33 చెరువుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, 29 వినాయక పాండ్స్ కూడా పూర్తిచేసినట్లు మేయర్ తెలిపారు. పర్యవేక్షక పర్యటనలో సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్రెడ్డి, డి.ఐ నర్సింలు, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ డీఎంసీ గీతారాధిక, ఎఎంఓహెచ్ భార్గవర్ నారాయణ, జీహెచ్ఎంసీ ఎఈ శరత్బాబు, ఈఈ నర్సింగ్రావు, డీఈ విజయకుమార్, ఖైరతాబాద్ ఎమ్మార్వో కృష్ణకుమార్, విద్యుత్ ఎఈ నర్సింహ్మస్వామి, డీఈ వెకంటయ్య, ఏడీఈ రమేష్, ఏఈ గంగారాం, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగరి సుదర్శన్, భాగ్యనగర్ గణేష్ ఉత్సివ కమిటీ నాయకులు భగవంతరావు, స్థానిక నాయకులు మహేందర్బాబు, చందు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. తొలిసారి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గంగాహారతిని ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన హోం మంత్రి మహమూద్అలీ, మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్లు వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సచివాలయంలో సమీక్షించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 55 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తలసాని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద 9 రోజులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
పశుసంవర్థక శాఖతో వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక, మత్స్య, డెయిరీ అనుబంధ రంగాల్లో రాష్ట్రం అంతకంతకు అభివృద్ధి చెందుతూ వేల కోట్ల సంపద సృష్టిస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఐదేళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మాక మార్పులు, అభివృద్ధిపై 2018–19 వార్షిక నివేదికను శుక్రవారం ఆయన విడుదల చేశారు. గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు, ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై పాడి పశువుల పంపిణీ.. ఇలా కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ప్రతి తెలంగాణ బిడ్డను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలన్నదే మా లక్ష్యమని అన్నారు. వేసవి పూర్తవగానే రెండో విడత గొర్రెల పంపిణీ మొదలవుతుందని చెప్పారు. విజయ డెయిరీ నెయ్యి అన్ని దేవాలయాలకు సరఫరా చేస్తామని, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ విజయ డెయిరీ వాటర్ బాటిళ్లను వాడేలా ఆదేశాలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్ద ఉందన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి నీల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలు ఆచరించేలా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు మంజువాణీ, లక్ష్మారెడ్డి, రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు. వార్షిక నివేదికలోని కొన్ని అంశాలు.. - గొర్రెల అభివృద్ధి పథకం కోసం 84 లక్షల గొర్రెలను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పథకం కింద 3.65 లక్షల మంది లబ్ధిదారులకు 3.65 లక్షల యూనిట్లు పంపిణీ చేశారు. వాటికి పుట్టిన గొర్రె పిల్లల (70.88 లక్షలు) ద్వారా రూ.3,189.60 కోట్ల ఆదాయం చేకూరింది. అలాగే ఈ జీవాల ద్వారా 38,182 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది. - పశు గణ రంగం 2018–19లో రాష్ట్ర స్థూల ఆదాయానికి రు.55,394 కోట్లతో రాష్ట్ర స్థూలఉత్పత్తికి 7% సమకూర్చింది. - 100 సంచార పశు వైద్య శాల ద్వారా రైతు ఇంటి ముంగిటనే పశువులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాం. దేశంలో గాలి కుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తొలిసారి ప్రకటించారు. - రాష్ట్రంలో గోపాలమిత్రలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రస్తుత జీవనోపాధి భత్యాన్ని ప్రతినెల రూ.3,500 నుంచి రూ.8,500లకు పెంచింది. - రాష్ట్రంలో పశువులు, గొర్రెలు, కోళ్ల సంఖ్య అధికంగా ఉంది. దేశంలోని పశు సంపదలో తెలంగాణ వాటా 6.51 శాతంగా ఉంది. దేశ గణాంకాలతో పోలిస్తే, తెలంగాణ కోడిగుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, చేపల ఉత్పత్తిలో 8వ స్థానం, పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉంది. - రాష్ట్రంలో రోజూ 12,170 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. తలసరి నెలవారీ వాడకం 4.6 లీటర్లతోను, తలసరి లభ్యత రోజుకు 300 గ్రాములతోను, జాతీయ సగటు లభ్యతతో పోలిస్తే రోజుకు 355 గ్రాములతో కాస్త వెనుకంజలో ఉంది. - తెలంగాణ విజయ డెయిరీ రోజుకు 3.92 లక్షల లీటర్ల పాలసేకరణ, 3.20 లీటర్ల పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తోంది. - రాష్ట్రంలో 2.13 లక్షల పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.1,677.11 కోట్లు అంచనా ప్రాజెక్టు వ్యయంతో సహకార డెయిరీల ద్వారా పాడి పశువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 2018–19లో ఈ పథకం కింద 57,538 పశువులను పంపిణీ చేశారు. విజయ తెలంగాణ ప్యాక్డ్ తాగునీరును అందుబాటులోకి తీసుకువచ్చారు. - మత్స్యకారుల సమగ్రాభివృద్ధికై రూ.1,000 కోట్లతో ప్రభుత్వము సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది. ఈ పథకం కింద 2018–19లో 2,46,648 మత్స్యకారులు లబ్ధి పొందారు. - వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ పథకం కింద గతేడాది 49.15 కోట్ల చేప పిల్లలను 10,776 జల వనరులలో, 3.19 కోట్ల రొయ్య పిల్లలను 24 జలాశయాలలో విడుదల చేశారు. ఫలితంగా గతంతో పోలిస్తే 13% ఉత్పత్తి పెరిగింది. - రాష్ట్రంలో 27.14 లక్షల మంది మొత్తం మత్స్యకారుల జనాభా వుండగా అందులో 3.04 లక్షల మంది క్రియాశీలక మత్స్యకారులు నమోదయ్యారు. -
కాంగ్రెస్ పార్టీకి ఏమీ మిగల్లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మిగిలింది ఏమీ లేదని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఏ ఒక్క స్థానంలోనూ మాకు పోటీ ఇవ్వలేకపోయిందని చెప్పారు. తెలంగాణభవన్లో మంత్రి తలసాని సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘దేశం గర్వపడే విధంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. ఇటీవల ఉగ్రవాదులను తెలంగాణ పోలీస్ సహకారంతో ఎన్ఐఏ పట్టుకుంది. ఉగ్రవాదం పెరగడానికి బీజేపీనే కారణం. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది. అభినందన్ను వదలకపోతే పాకిస్తాన్కు కాలరాత్రి అని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. భద్రత, ఉగ్రవాదం లాంటి అంశాలపై బాధ్యతతో మాట్లాడాలి. బీజేపీ నేతలు దద్దమ్మలు. దత్తాత్రేయ రిటైరై ఇంట్లో కూర్చోవాలి. ప్రతి అంశాన్ని ఎంఐఎంతో ముడిపెట్టి మాట్లాడటం తగదు. బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడి పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రతి అంశంలోనూ ఎంఐఎంను బూచిగా చూపుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్, భట్టి విక్రమార్క పెద్ద మేధావుల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడండి. బ్యాలెట్ అయితే బాగుంటుందని మాట్లాడుతున్న ఉత్తమ్ ఈవీఎంలతో గెలవలేదా? ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ నేతలు వారి ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలు. మా పాలన బాగుంటేనే ప్రజలు మాకు పట్టం కట్టారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. నివేదిక వచ్చాక ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మిషన్ భగీరథ నూటికి నూరు శాతం పూర్తయింది’అని తలసాని వ్యాఖ్యానించారు. -
మీ ప్రోత్సాహంతోనే పోటీ చేస్తున్నా..
బంజారాహిల్స్: ప్రజాసేవ కోసం వచ్చానని, ఆశీర్వదిస్తే ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడతానని సీఎం కేసీఆర్ ఆశయ సాధన కోసం లోక్సభలో గళం విప్పుతానని సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో గురువారం ఎఫ్ఎన్సీసీ, ‘మా’, ఫిలింనగర్ సొసైటీ, పలువురు సినీ ప్రముఖులతో ఎన్నికల సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరైన సమావేశంలో సాయికిరణ్ మాట్లాడారు. తనకు ఎంత పెద్ద పదవి వచ్చినా మీ బిడ్డగా మీ మధ్యలోనే ఉంటానని, మీ తమ్ముడిలా ఆదరించాలని, మీ ప్రోత్సాహంతోనే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని నంబర్వన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ ఎల్లవేళలా తనకు అండగా నిలుస్తున్న సినీ ప్రముఖులు, సినీ కార్మికులు, చిత్రపరిశ్రమకు చెందిన సాంకేతిక నిపుణులు ఈ ఎన్నికల్లో తన బిడ్డ సాయికిరణ్ యాదవ్ను గెలిపించాలన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ సాయి తన బిడ్డతో సమానమని గెలిపించి తీరుతామని వెల్లడించారు. దర్శకుడు ఎన్. శంకర్, నటి హేమ, ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కేఎల్ నారాయణ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, దర్శకులు బి.గోపాల్, సాగర్ ఉన్నారు. -
భీమవరం వేడుకల్లో తలసాని, మాధవరం కృష్ణారావు
సాక్షి,సిటీబ్యూరో: పట్నం బోసిపోయింది. నిత్యం అత్యంత రద్దీగా కనిపించే దారులన్నీ ఆదివారం వెలవెలబోయాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ వారితో పాటు తెలంగాణ జిల్లాల పల్లెలకు సంక్రాంతి ప్రయాణాలు భారీగానే సాగాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొనడం ఓ కారణమైతే... ఆంధ్రాకు మాత్రం పండగ సెంటిమెంట్ నగరవాసులను క్యూ కట్టించింది. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికలు, విజయోత్సవ సభలతో ఫుల్ బిజీగా గడిపిన నగర ఎమ్మెల్యేలు ఈసారి తమ నియోకజవర్గంలో స్థిరపడ్డ ఏపీ మిత్రులతో కలిసి సంక్రాంతి సంబరాలకు వెళ్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భీమవరంలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. వీరితో పాటు నగరంలో పలువురు కార్పొరేటర్లు సైతం ఆంధ్రాబాట పట్టారు. ఇదిలావుంటే నగరం నుంచి భారీ ఎత్తున పందెం రాయుళ్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పయనమయ్యారు. గతంలో మాదిరిగా ఈ ఏడు కూడా నగరంలోని బార్కాస్ నుంచి ఆంధ్రా జిల్లాలకు పందెం కోళ్లు భారీ ఎత్తున ఎగుమతి అయ్యాయి. బార్కాస్లో పందెం కోసమే పెంచడంతో పాటు వాటికి ప్రత్యేక తర్ఫీదునిచ్చిన శిక్షకులు సైతం వారి వెంట వెళ్తున్నారు. తలసాని పర్యటన ఇలా... సనత్నగర్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్లో జరిగే సంక్రాంతి సంబరాలకు హాజరు కానున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం 7గంటలకు నగరం నుంచి రోడ్డు మార్గంలో ఆయన ఏపీకి బయలుదేరుతారు. 10గంటలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఇంద్రకీలాద్రి వరకు వెళ్తారు. 10:30 గంటలకు కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడ నుంచి భీమవరం చేరుకుంటారు. అక్కడి ప్రసిద్ధ మావురాలమ్మను దర్శించుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. భీమవరంలో 15న జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అక్కడి అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. -
ఎవరు..ఎక్కడ? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే...
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరక పోవటం, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఇంకా కొత్తవేవీ లేకపోవటంతో నగర ఎమ్మెల్యే ఫుల్లుగా కాలక్షేపం చేస్తున్నారు. కొందరు అత్యధిక సమయం ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. సన్నిహితుల శుభకార్యాలు, విందు భోజనాలకు హాజరవుతున్నారు. మరి కొందరు మాత్రం ఆరోగ్య కారణాలతో గెలిచిన కొన్ని రోజుల తర్వాత మాయమైపోయారు. గతంలో కేసీఆర్ కేబినెట్లో కీలక శాఖలు నిర్వహించిన సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావులు గడిచిన వారం క్రితం వరకు పార్టీ విజయోత్సవ సభల్లో పాలుపంచుకుని ప్రస్తుతం ఇళ్లు, క్యాంప్ కార్యాలయాలకే పరిమితమయ్యారు. నగరంలో పంచాయతీ ఎన్నికల సందడి కూడా లేకపోవటంతో రాజకీయ సందడి తగ్గిపోవటంతో వారు కుటుంబసభ్యులకు అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే హన్మంతరావు తాజాగా పుణ్యక్షేత్రాల సందర్శనలతో బిజీగా ఉండగా..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ శుభకార్యాలతో బిజీ అయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎన్నికలకు ముందు..తర్వాత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడి కొంత కాలం విశ్రాంతి తీసుకుని ఇంటి నుండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు సైతం ఇళ్లు, క్యాంప్ కార్యాలయాల్లోనే అధిక సమయం గడుపుతున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ఇంకా విజయోత్సవ కార్యక్రమాల్లోనే బిజీగా ఉంటూ, మిగిలిన సమయాన్ని కుటుంబసభ్యులతో గడిపేస్తున్నారు.. సాయన్న ఎక్కడ.. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి విజయం సాధించిన సాయన్న ఎన్నికల తర్వాత..మాయమైపోయారు. విజయానికి సంబంధించిన సర్టిఫికెట్ అందుకున్న తర్వాత ముఖ్య నాయకులకు సైతం అందుబాటులో లేకుండాపోయారు. ఆరోగ్య సమస్యలతోనే సాయన్న ఇతర ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని, అందుకే ఇటీవల కంటోన్మెంట్ బోర్డు సమావేశానికి కూడా హాజరు కాలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. సంక్రాంతి తర్వాతే సాయన్న ప్రజల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.. చెన్నైలో దానం.. చివరి నిమిషంలో ఖైరతాబాద్ టికెట్ దక్కించుకుని విజయం సాధించిన దానం నాగేందర్ చెన్నైలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఎన్నికల్లో విరామం లేకుండా ప్రచారం చేసిన దానం, ఎన్నికల అనంతరం ఆరోగ్యసమస్యలతో ఇబ్బంది పడ్డారు. డిసెంబర్ చివరి వారమంతా ఇంటికే పరిమితమైన దానం, మూడు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి, తిరిగి మెరుగైన ఫిజియోథెరపీ కోసం చెన్నై చేరారు. పూర్తిగా ఫిట్ అయి సంక్రాంతి తర్వాతే విస్తృత కార్యక్రమాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. -
ఆంధ్రావాళ్లంతా టీఆర్ఎస్ వైపే: తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఆంధ్రావాళ్లంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, నిజాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. బుధవారం తెలంగాణభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ మేనిఫెస్టోను మక్కికి మక్కి కాపీ కొట్టారని ఉత్తమ్కుమార్రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. గతంలో రూ.రెండు లక్షల రుణమాఫీ అని కాం గ్రెస్ చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు రూ.5వేల ఫించన్లు ఇస్తామన్నా నమ్మరు. కాంగ్రెస్ దిక్కుమాలిన పార్టీ. ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడా... చెప్రాసా? ఏమీ తెలుసుకోకుండా ఇంటింటికీ నీళ్లు రాలేదంటున్నాడు. కాంగ్రెస్ నేతల్లా మేం ఉద్యోగాలు అమ్ముకోలేదు. టీఎస్పీఎస్సీతో ఉద్యోగాలు ఇచ్చాం. నిజాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి’’అని సూచించారు. పుట్టి పెరిగిన గ్రామాన్ని పట్టించుకోని జైపాల్రెడ్డి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఓట్ల కోసమే సెటిలర్లను పొగుడుతున్నామనేది సమంజసం కాదని తలసాని స్పష్టంచేశారు. -
నన్ను మోసం చేసి లాక్ చేశాడు
‘‘నాకు అవార్డు ఇస్తానంటే వేడుకకు రాను..ఇవ్వనంటేనే వస్తానని సురేశ్కి ముందే చెప్పా. కానీ, నన్ను మోసం చేసి గానకోకిల ఎస్.జానకిగారి చేతులమీదుగా అవార్డు బహూకరించి నన్ను లాక్ చే సేశాడు. కాదనలేక ఈ అవార్డు తీసుకుంటున్నా’’ అని హీరో చిరంజీవి అన్నారు. 16వ ‘సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం’ ఆదివారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సింగపూర్లో ఓ అవార్డుల కార్యక్రమంలో జానకిగారు, నేను కలిసాం. మళ్లీ ‘సంతోషం’ వేడుకల్లోనే కలిసాం. తొలిసారి ఆమె చేతుల మీదుగా ‘సంతోషం’ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇందుకు సురేశ్కి థ్యాంక్స్. మరొకరి చేతుల మీదుగా అవార్డు ఇచ్చుంటే తిరస్కరించేవాణ్ని. ఎందుకంటే ఇలాంటి అవార్డులు కొత్త వారికి ఇచ్చి ప్రోత్సహిస్తే వాళ్లలో ఉత్సాహం నింపినట్లు ఉంటుంది’’ అన్నారు. మరో ముఖ్య అతిథి గాయని ఎస్. జానకి మాట్లాడుతూ– ‘‘సురేశ్ 5 ఏళ్ల నుంచి ఫంక్షన్కు రావాలని అడుగుతున్నా కుదరక రాలేకపోయా. ఈసారి కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకుని వచ్చా. ఇక్కడ చిరంజీవిగార్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమాల్లోని అప్పటి హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నావే. ఆయన 125 ఏళ్లు సంతోషంగా జీవించాలి. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా చూసా. పాత చిరంజీవిని చూసినట్లే ఉంది’’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్లగా సురేశ్ ఒక్కడే అన్నీ తానై ఈ వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం. సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో ఎందరో పెద్దల కృషి ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడుగారులాంటి వల్ల సాధ్యమైంది’’ అన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందించారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్బాబు, కె.ఎల్ నారాయణ, నటులు రాజేంద్ర పసాద్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, ప్రసన్న, దర్శకుడు, నటుడు టి. రాజేందర్, రచయిత సాయిమాధవ్ బుర్రా, కథానాయికలు తమన్నా, మెహరీన్, ఈషా, స్నేహ, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి, నృత్యదర్శకుడు శేఖర్ మాస్టర్, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా రాధాకృష్ణ, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
మినీ థియేటర్స్ కోసం
రానున్న రోజుల్లో బస్టాండ్స్లో మినీ థియేటర్స్ ప్రత్యక్షం కానున్నాయి. దాని కోసం కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, అధ్యక్షుడు పి. రామ్మోహనరావులు పలువురు అధికారులతో చర్చించి, తెలంగాణా చలన చిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టీసీ బస్టాండ్స్లో మినీ థియేటర్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు బస్టాండ్స్లో, వాటికి సంబంధించిన ఖాళీ స్థలాల్లో 80 నుంచి 100 మినీ థియేటర్ల ఏర్పాటుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణతోనూ రామ్మోహన్ రావు చర్చించారు. ‘‘ఈ ప్రాజెక్ట్ను చేపట్టాల్సిందిగా టెండర్లను ఆహ్వానించినా సరైన స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, మినీ థియేటర్ల ఏర్పాటుకు తగిన అనుమతులు తీసుకోవాలనుకుంటున్నాం’’ అని రామ్మోహనరావు అన్నారు. -
డిఫరెంట్ స్టోరీతో..
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. కృష్ణ విజయ్ ఎల్. దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటరై్టన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్. ప్రొడక్షన్స్ పతాకాలపై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. కృష్ణ విజయ్ ఎల్. మాట్లాడుతూ– ‘‘అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ’ చిత్రాల తర్వాత ఈ సినిమాకు నిర్మాణంలో భాగస్వామ్యం అవడంతో పాటు దర్శకత్వం వహిస్తుండటం హ్యాపీగా ఉంది. జూలైలో షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విజయ్గారితో పని చెయ్యడం హ్యాపీ. ఈ సినిమా అన్ని వర్గాలవారికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘విజయ్ ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా ఫీల్ అయ్యాను. అంత డిఫరెంట్గా ఉంది’’ అన్నారు రిజ్వాన్. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు. రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (డైరెక్టర్), అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శ్రీ ఓం సినిమా, సహ నిర్మాతలు: ఖుర్షీద్ (ఖుషి), అచ్చుత్ రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మనోజ్ మావిల్ల, లైన్ ప్రొడ్యూసర్: సందీప్ గడ్డపు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: వినయ్ మాండ్ల, కెమెరా: సిద్. -
దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు
‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి అసోసియేట్గాను, నేను నటించిన ‘జగత్ కిలాడీలు, ‘హంతకులు, దేవాంతకులు’ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. ఆ తర్వాత నేను హీరోగా ‘రాధమ్మ పెళ్లి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. 150 సినిమాలకు పైగా తెరకెక్కించిన ఘనత దాసరిగారిది. నాకు తెలిసి భవిష్యత్లో ఏ దర్శకుడూ ఇన్ని సినిమాలు చేయలేరేమో’’ అని సీనియర్ నటుడు కృష్ణ అన్నారు. శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జరిగిన దాసరి విగ్రహావిష్కరణలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆయన తన భుజాలపై వేసుకుని పరిష్కరించేవారు. మంచి, చెడు అన్నీ ఆయనే చూసుకునేవారు. పరిశ్రమను తన కుటుంబంలా చూసుకున్నారు. దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు’’ అన్నారు. ‘‘మా నాన్నగారి (నందమూరి తారక రామారావు)తో దాసరిగారు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తీశారు. ఆయన 150వ చిత్రం ‘పరమవీర చక్ర’లో నటించే అవకాశం నాకు కలిగింది. ఒక కార్మికుడిలా ఇండస్ట్రీ బాగు కోసం జీవితాన్ని త్యాగం చేశారు’’ అన్నారు బాలకృష్ణ. దాసరికి భారతరత్న ఇవ్వాలని, ఈ అంశాన్ని తాము పార్లమెంట్లో కూడా లేవనెత్తామని, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వాలని మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఫిలింనగర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, కార్యదర్శి కాజా సూర్యనారాయణ, నిర్మాతలు సి. కళ్యాణ్, అల్లు అరవింద్, నటి–దర్శకురాలు విజయ నిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మే 4.. డైరెక్టర్స్ డే దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 4ని డైరెక్టర్స్ డేగా ప్రకటించింది తెలుగు సినీ దర్శకుల సంఘం. వేదికపై డైరెక్టర్స్ అందరూ కలిసి ‘హ్యాపీ డైరెక్టర్స్ డే’ అని అనౌన్స్ చేశారు. ‘‘దాసరి జన్మదినాన్ని డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేయాలని నిర్ణయించిన దర్శక పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజానికి ఇది దాసరిగారి హక్కు’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. తనికెళ్ల భరణి ‘సినిమా’ మీద రాసిన కవిత్వం, డైరెక్టర్స్పై చంద్రబోస్ రచించిన పాటను ప్రదర్శించారు. ఈ గీతానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. దాసరిపై రచయిత గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలను వినిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్. అప్పుడు దండం పెట్టినవాళ్లు ఇప్పుడు ఎక్కడ? – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దాసరి నారాయణరావు 76వ జయంతి వేడుకలను ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్’ ఛైర్మన్ బీయస్యన్ సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ‘దాసరి టాలెంట్ అకాడమీ వెబ్సైట్’ ఆవిష్కరణ జరిగింది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘దాసరిగారి దగ్గర ఉండాలని చాలామంది పోటీపడేవారు. ఎప్పుడూ గురువుగారి పక్కన ఉండే మాలాంటి వాళ్లని కూడా తోసేసేవారు. వాళ్లు ఈ రోజు రాలేదు. కొన్నేళ్ల క్రితం ‘వీళ్లతో ఎందుకు గురువుగారూ.. మీతో పనులు చేయించుకుని, మీ ఇంటి తలుపు దాటక ముందే తిడుతున్నారు’ అని నేనంటే, ‘ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారో నాకు తెలియదని కాదు. కానీ ఇండస్ట్రీలో ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు అన్న రోజునే వీళ్లందరూ భయపడతారు. లేకపోతే ఇండస్ట్రీ కకావికలం అయిపోతుంది’ అన్నారు. ఆ కకావికలం దాసరిగారు లేని ఈ వన్ ఇయర్లో చూశాం’’ అన్నారు. దాసరిగారు నిజంగా ఓ శిఖరం – ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి మాట్లాడుతూ – ‘‘ఇక్కడున్న అందరికీ దాసరిగారితో సినిమా అనుబంధం ఉంటే నాకు పత్రికానుబంధం ఉంది. ‘ఉదయం’లో పని చేసిన ఏ ఇద్దరు కలిసినా గత 25 ఏళ్లుగా ఏం జరిగిందని మాట్లాడుకోకుండా ‘ఉదయం’ రోజులు ఎలా గడిపాం అని మాట్లాడుకుంటాం. 1984 నుంచి నేనెక్కడున్నా దాసరిగారు ఎక్కడున్నా తప్పకుండా మే 4న ఆయన్ను కలిసి అభినందించాల్సిందే. గతేడాది వరకూ దాసరిగారిని అభినందించని సంవత్సరం లేదు. దాసరిగారు చాలామందికి సహాయం చేసేవారు. ఇటీవల సినిమా పరిశ్రమలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు నారాయణరావుగారు ఉంటే బావుండు అనుకున్నాం. ఈ కథను ఇంత దూరం రానిచ్చేవారు కాదు. పరిష్కరించేవారని మా జర్నలిస్ట్లంతా అనుకున్నాం. ‘సాక్షి’ ఎక్స్లెన్స్ అవార్డ్స్ అని నాలుగు సంవత్సరాల ముందు మొదలుపెట్టాం. దాసరిగారికి ‘దర్శక శిఖరం’ అని బిరుదును కూడా ప్రదానం చేశాం. ఆయన నిజంగా శిఖరం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, సి. కల్యాణ్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దాసరి స్వగృహంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ‘డైరెక్టర్స్ డే’ని ప్రకటిస్తున్న చిత్రరంగ ప్రముఖులు -
ఉత్తమ్ భాష తీరు మారాలి: తలసాని
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వాడిన భాషను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ ప్రసంగంలో కేసీఆర్ అన్నీ నిజాలే చెప్పారని, దాంతో కాంగ్రెస్ నేతలు భయాం దోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలే పొగుడుతున్నారని, కానీ రాష్ట్ర నేతలకు ఇవేవీ కనిపించడం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తన భాష తీరును మార్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. -
కోఆర్డినేటర్ వ్యవస్థను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: సినిమారంగంలో వివిధ పరిణామాలకు దారితీస్తున్న కోఆర్డినేటర్ వ్యవస్థను రద్దు చేసి, వారి స్థానంలో మేనేజర్ స్థాయి వ్యక్తులను కొనసాగించాలని సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్స్ చెల్లిస్తున్న రెమ్యునరేషన్ నేరుగా వారి ఖాతాల్లో జమయ్యే విధంగా చూడాలని, అంతేకాకుండా ఆయా రంగాల్లోని వారికి చెల్లిస్తున్న రెమ్యునరేషన్ను షూటింగ్ ప్రాంతాలలో ప్రదర్శించాలని, ప్రొడ్యూసర్స్ కార్యాలయాలలో బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, చలనచిత్ర రంగ ప్రముఖులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని శనివారం సచివాలయంలో తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైనా అంశంపై మీడియా ముందుకు వెళ్లేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఇందులో అన్ని రంగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకునేలా జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. కచ్చితమైన నిబంధన లను రూపొందించి వాటిని అతిక్రమించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మా జనరల్ సెక్రటరీ నరేశ్ పేర్కొన్నారు. ఆర్టిస్టుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎఫ్డీసీలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వేధింపులు, మోసాలకు గురయ్యే మహిళలు ఈ సెల్లో కానీ, షీ టీమ్స్కు కాని ఫిర్యాదు చేయాలని తెలిపారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొ స్తున్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లను నియం త్రించేందుకు మార్గదర్శకాలను రూపొం దించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మహిళలకు షూటింగ్ ప్రాంతాలలో కనీస సౌకర్యాలను కల్పించాలని, ఆడిషన్స్ నిర్వహించే సమయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. వారం, పదిరోజుల్లో కమిటీ సమావేశాలు నిర్వహించి ఇటీవల జరిగిన పరిణామాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తుది నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తే, అన్నివర్గాల వారితో చర్చించి మహిళా ఆర్టిస్టులకు తగు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని మంత్రి వారికి వివరించారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ రాంమోహన్రావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేదీ, కార్మికశాఖ కమిషనర్ మహ్మద్ నదీమ్, ఎఫ్డీసీ ఈడీ కిషోర్బాబు, సీఐడీ ఎస్పీ అపూర్వారావు, మా అధ్యక్షుడు శివాజీరాజా, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, చిత్ర ప్రముఖులు జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, జెమిని కిరణ్, సి.కళ్యాణ్ పాల్గొన్నారు. -
నాన్నగారి పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం
‘‘ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి, లవకుశ, దేశోద్ధారకులు’ వంటి విజయవంతమైన చిత్రాలు విడుదలైన ఈ రోజున ఆయన బయోపిక్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను చూస్తే ఎన్టీఆర్ గురించి తెలియనివారికి కూడా పూర్తిగా తెలిసేలా, చక్కటి సందేశంతో రూపొందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఉప రాష్ట్రపతిఎం. వెంకయ్యనాయుడు. తేజ దర్శకత్వంలో ఎన్.బి.కే ఫిలిమ్స్ బ్యానర్పై వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పణలో నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘యన్.టి.ఆర్’. బాలకృష్ణ టైటిల్ రోల్లో నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. విష్ణు సహనిర్మాత. దుర్యోధనుడు గెటప్లో ఉన్న బాలకృష్ణపై తీసిన తొలి సీన్కి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, వెంకయ్యనాయుడు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ, సాయికృష్ణ దర్శక–నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు. ‘‘భారతదేశం గర్వించదగ్గ అందాల నటుడు ఎన్టీఆర్గారు. బాలయ్యగారిని చూస్తుంటే ఎన్టీఆర్గారిని చూసినట్లుంది’’ అన్నారు టి. సుబ్బరామిరెడ్డి. ‘‘ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న బాలయ్య ధన్యుడు. దర్శకత్వం వహిస్తున్న తేజ అదృష్టవంతుడు’’ అన్నారు రాఘవేంద్రరావు. ‘‘ఎన్టీఆర్ చరిత్రను తెరపైకి తీసుకురావడమే సాహసం. దానికి బాలకృష్ణ మాత్రమే అర్హుడు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్.‘‘నాన్నగారి పాత్రలో నటిస్తుండటం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు బాలకృష్ణ. ‘‘దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత విష్ణు. ‘‘ఎన్టీఆర్గారి బయోపిక్ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం అదృష్టం. బాగా చేయాలని ప్రయత్నిస్తున్నాను. కథ బాగా వచ్చింది. బాలకృష్ణగారు బాగా చేస్తారు. ఏమైనా చిన్నతప్పులు ఉంటే ఫ్యాన్స్ క్షమించాలి’’ అన్నారు తేజ. సంగీత దర్శకుడు కీరవాణి, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయి మాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు. -
ఎ టు ఎ మంచి విజయం సాధించాలి – మంత్రి తలసాని
‘‘ఇప్పుడు ఏ సమాచారం, వార్త కోసం అయినా ముందు వెతుకుతున్నది డిజిటిల్ మీడియాలోనే. అలాంటి డిటిజల్ మీడియాలో ప్రమోషన్స్ చేయడం వైవిధ్యం. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్న ‘అమీర్పేట్ టు అమెరికా’ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బ్రహ్మానందం, మణిచందన, సమ్మెట గాంధీ, రజని, వేణుగోపాల్, వేణు మాధవ్ ప్రధాన పాత్రల్లో రామ్మోహన్ కొమండూరి, భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎ టు ఎ’(అమీర్పేట్ టు అమెరికా). తమ సినిమా విశేషాలను పంచుకునేందుకు, ప్రమోషన్కు ‘ఎ టు ఎ’’ టీమ్ రూపొందించిన యాప్ని తలసాని విడుదల చేశారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తేజస్, పల్లవి దొర, మేఘనా లోకేష్, వంశీకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: స్వప్న కొమండూరు, కెమెరా: అరుణ్ ఐ.కె.సి, జి.ఎల్.బాబు, సంగీతం: కార్తీక్ కొడకండ్ల. -
జీవాలకు సేవ చేయడం అదృష్టం: తలసాని
సాక్షి, హైదరాబాద్: జీవాలకు సేవ చేయడం ఎంతో అదృష్టమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. జీవాలకు అవసరమైన వైద్యం సకాలంలో అందించడంతో పాటు గ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పశుసంవర్థక శాఖ అధికారుల నూతన డైరీ, క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశుసంవర్థక శాఖలో నూతన నియామకాలు చేపట్టడంతో పాటు, పదోన్నతులు ఇచ్చామని తెలిపారు. రానున్న రోజుల్లో శాఖ మరింత అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశు వైద్య సేవలను మెరుగుపర్చడంతో పాటు ఆస్పత్రులలో మౌలిక వసతులు కల్పించామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇటీవల బదిలీ అయిన పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్చందా శాఖ అభివృద్ధికి ఎంతో కృషిచేశారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు కార్యదర్శి రేణుకాదేవి, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, పశుసంవర్థక శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బేరీ బాబు, వీఏఎస్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పెంటయ్య, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలను కించపరిస్తే సహించం: మర్రి
సనత్నగర్: ఖబరస్థాన్ స్థల విషయంలో మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముస్లింలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి మర్రిశశిధర్ రెడ్డి అన్నారు. ఓల్ట్ కస్టమ్స్ బస్తీలో తహరిక్ ఖబరస్థాన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఖబరస్థాన్ కు తాను ఒక ఎకరా కేటాయిస్తానని చెబితే...తలసాని రెండెకరాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రితో చెప్పించారని, అయితే రెండేళ్లు గడిచినా ఎక్కడా స్థలం కేటాయించకుండా వారిని మోసం చేశారని ఆరోపించారు. ధనాలగుట్ట వద్ద ముస్లింలకు ఒక ఎకరా స్థలం కేటాయించి, హిందూ శ్మశానవాటికకు మిగతా స్థలంతో పాటు మరింతగా విస్తరించుకునేందుకు తాను ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. అయితే ఎన్నికల కారణంగా అది పెండింగ్లో పడిందని తెలిపారు. ముస్లింలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో సలీంఖాన్ , అనీఫ్, అబ్దుల్వాహిద్, శంకర్యాదవ్, సాబేర్, జాఫర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న మర్రి శశిధర్రెడ్డి -
తలసాని తులాభారం
రాంగోపాల్పేట్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తులాభారం నిర్వహించారు. బంగారంతో (బెల్లం) తులాభారం నిర్వహించి అమ్మవారికి పూజలు చేశారు. -
వేడుకగా నాట్స్ అవార్డుల ప్రదానోత్సవం
లాస్ఏంజిల్స్ నుంచి సాక్షి ప్రతినిధి: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) మహాసభలు స్థానికంగా గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటుడు బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా, ప్రముఖ వైద్యుడు ఎల్.ప్రేమ్సాగర్రెడ్డి అవార్డులు అందజేశారు. సినీనటుడు సాయికుమార్, సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ తెలుగు రచయిత కొలకలూరి ఇనాక్ తదితరులు అవార్డులు అందుకున్నారు. కూచిబొట్ల ఆనంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే అమెరికాలో వివిధ రంగాల్లో రాణించిన కె. ఉమామహేశ్వరి, కిరణ్ ప్రభ, రాజురెడ్డి, రమేశ్, పి.పి.రెడ్డి, దేశి గంగాధర్, వై.వి.నాగేశ్వర్రావుకు అవార్డులు అందజేశారు. నాట్స్ మహా సభల సమన్వయకర్త ఆలపాటి రవి, బోర్డు చైర్మన్ కొర్రపాటి మధు, వ్యవస్థాపక అధ్యక్షుడు మాదాల రవి, అధ్యక్షుడు ఆచంట రవి, సినీనటులు తనికెళ్ల భరణి, కాజల్, అలీ, సంగీత దర్శకుడు వందేమాతం శ్రీనివాస్ తదితరులు సభలకు హాజరయ్యారు. -
తలసాని ఒక సన్నాసి..
చీము, నెత్తురుంటే పోటీ చేసి మళ్లీ గెలవాలి: రేవంత్రెడ్డి సవాల్ హైదరాబాద్ : తలసాని శ్రీనివాస్యాదవ్ ఒక సన్నాసి. ఆయన అనుభవించిన పదవుల వెనుక టీడీపీ పెట్టుబడి, శ్రమ, రక్తం ఉంది. ఆ సన్నాసికి సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యేగా గెలిపించిన సైకిల్ పార్టీకి రాజీనామా చేయాలి. దమ్ముంటే టీడీపీని వీడి టీఆర్ఎస్ డొక్కు కారు ఎక్కి మళ్లీ గెలిచి, తనకున్న బలమేంటో నిరూపించుకోవాలని టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం సికింద్రాబాద్లో టీడీపీ మినీ మహానాడు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సనత్నగర్లో చంద్రబాబును, పవన్కల్యాణ్ను పోటీచేయాలంటూ సవాల్ విసురుతున్న తలసాని టీడీపీలో చేరకముందు.. మోహన్బాబు సినిమా షూటింగ్ల వద్ద బౌన్సర్గా పనిచేశాడని, పచ్చగా ఉన్నచోట తిని, వెచ్చగా ఉన్న చోట పడుకునే స్వార్థపరుడని రేవంత్ అభివర్ణించారు. కేసీఆర్ది కుటుంబ పాలన, టీఆర్ఎస్ దొరలు, దొంగల పార్టీ అని టీటీడీపీ రాష్ట్ర నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఆ ప్రభుత్వంలో పేదలకు చోటులేదని, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోతే నిధులెందుకు ఇవ్వరు, 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఎందుకు పరామర్శించరని ధ్వజమెత్తారు. -
సంక్షేమ పథకాలు పేదలకు చేరాలి
అమీర్పేట(హైదరాబాద్ సిటీ): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు ఉపయోగ పడే విధంగా చూడాలని వాణిజ్యపన్నులు, సినీమాటోగ్రఫి శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పార్టీ నాయకులకు సూచించారు. అమీర్పేట డివిజన్లో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు గురువారం మంత్రిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలు పేదలకు అందిన పుడే నాయకులపై నమ్మకం కలుగుతుందని, అర్హులైన ప్రతి వ్యకి ్తకీ అవి అందేలా కృషిచేయాలని సూచించారు. ఎక్కడైన ప్రజలకు ఇబ్బందులు కలిగితే వెంటనే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు.