TV channels
-
ఒకే ప్లాన్తో టీవీ చానళ్లు, ఓటీటీ యాప్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకే ప్లాన్తో ఇటు టీవీ చానళ్లు, అటు ఓటీటీ యాప్స్ను కూడా పొందే విధంగా డిష్ టీవీ కొత్తగా స్మార్ట్ప్లస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాన్ కిందే వీటిని పొందవచ్చని సంస్థ సీఈవో మనోజ్ దోభల్ తెలిపారు.రూ. 200 ప్యాక్ నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. పాత, కొత్త కస్టమర్లు.. స్మార్ట్ప్లస్ కింద సదరు ప్లాన్లోని టీవీ ఛానళ్లతో పాటు డిఫాల్టుగా లభించే హంగామా వంటి అయిదు ఓటీటీ యాప్లతో పాటు జీ5, డిస్నీప్లస్ హాట్స్టార్, సోనీ లివ్ తదితర యాప్ల నుంచి ఒకటి ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే మూడు రోజుల తర్వాత మరో యాప్నకు మారవచ్చు.పూర్తిగా 16 యాప్లు పొందాలంటే నెలకు రూ. 179 చార్జీ ఉంటుంది. కొత్త సర్వీసులతో మార్కెట్ వాటా 3–4 శాతం మేర పెంచుకోగలమని ఆశిస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ప్రస్తుతం తమకు డీటీహెచ్ మార్కెట్లో 21 శాతం వాటా ఉందని వివరించారు. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో ఆండ్రాయిడ్ 4కే బాక్స్, క్లౌడ్ టీవీ వంటి ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆ మీడియాలకు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కుట్రతో తనపైన, తన కుటుంబంపైన అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ చానళ్లతో పాటు యూట్యూబ్ సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు శనివరం లీగల్ నోటీసులు పంపించారు. పక్కా ప్రణాళికతో తనకు, తన కుటుంబానికి నష్టం కలిగించాలనే దురుద్దేశంతోనే ఈ చానళ్లు, మీడియా సంస్థలు దుష్ప్రచారం సాగిస్తున్నాయని ఆయన తాను పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మీడియా ముసుగులో పక్కా ఎజెండాతో సాగిస్తున్న కుట్రలో భాగంగా తమకు సంబంధం లేని అనేక అంశాల్లో తమ పేర్లను, ఫొటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన థంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుకొంటున్నారని, ఈ చానళ్లపై తగిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. వెంటనే ఆ వీడియోలను తొలగించండి తమకు, తమ కుటుంబానికి సంబంధంలేని అంశాలలో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ చానళ్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ చానల్స్ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని, అలాంటి వీడియోలను, కంటెంట్ను తీసివేసినట్లు చెప్పాయని కేటీఆర్ తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా చానళ్లు, యూట్యూబ్ చానల్స్ ఇలాంటి కంటెంట్ ని తీసివేయకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. యూట్యూబ్కి సైతం నోటీసులు కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్కి సైతం లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ తెలిపారు. తమ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ మరిన్ని లీగల్ నోటీసులకు, కేసులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. -
టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. మొత్తం 10 సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లతో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు. కేవలం ఒక కుట్ర, ఎజెండాలో భాగంగా తమపై ఈ ప్రచారం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. తమకు సంబంధం లేని విషయాలలో, తమ పేరును, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానళ్లపై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. గతంలోనూ తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఆయా సంస్థలు తప్పును సరిదిద్దుకొని, అసత్యపూరిత వీడియోలను తీసివేస్తున్నామని ప్రకటించాయి. ఇదీ చదవండి.. కడియంకు బీఆర్ఎస్ చెక్ -
మంచో చెడో ఏదో రకంగా పబ్లిసిటీ ఇస్తున్నాయిగా వదిలేద్దాం సార్!
మంచో చెడో ఏదో రకంగా పబ్లిసిటీ ఇస్తున్నాయిగా వదిలేద్దాం సార్! -
బాబు స్కిల్డ్ క్రిమినల్..
బాబుది అంతా చీకటి చరిత్ర: అమర్నాథ్ అసలు చంద్రబాబు రాజకీయ జీవితమంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని, ఆయనదంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని చెప్పారు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తాను నిజాయితీపరుడిని అని రోజూ ప్రవచనాలు వల్లించే చంద్రబాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు, టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని ఆయన తెలిపారు. దుబాయ్ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులను జైలుకు పంపాలి: రోజా చంద్రబాబు, లోకేశ్పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని మంత్రి ఆర్కే రోజా తిరుమలలో మీడియాతో అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డుగానీ, ఓటరు కార్డు గానీ, ఇల్లుగానీ లేకపోయినా హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారన్నారు. అలాగే, చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు. బాబు అత్యంత అవినీతిపరుడు: కొడాలి నాని చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, స్వార్థపరుడు, నమ్మక ద్రోహి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని ఆయన చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని, ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. చట్టాలు, రాజ్యాంగాలను అనుసరించి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఇప్పుడు ఐటీ శాఖాధికారులు ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం బయటపడిందని ఇప్పుడు తప్పించుకోలేరని నాని అన్నారు. బాబు, లోకేశ్ పెద్ద అవినీతిపరులు: ధర్మాన ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్లు పెద్ద అవినీతిపరులని, దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి ఓటు అడిగే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేదని, ఒక్క శాశ్వత పథకం కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. ఇక అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడడం తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేకపోయారన్నారు. -
విష ప్రచారం మానుకోండి
సాక్షి, అమరావతి: ప్రజా చైతన్యానికి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు దారి తప్పుతున్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తమ స్వలాభం, వర్గ ప్రయోజనాల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. విలువలను వదిలేసి విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కథనాలతో ఓ వర్గం మీడియా అంతిమంగా రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేదిగా మారుతోందన్నారు. నేడు నిబద్ధతతో పనిచేసే విలేకరుల అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం ‘జర్నలిజం మౌలిక సూత్రాలు–ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర’ అంశంపై విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, పత్రికా సంపాదకుడు కృష్ణంరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కేవీ శాంత కుమారి పాల్గొన్నారు. కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి.. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియాది ప్రధాన పాత్ర. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అంశంఒక్కటే అయినా గత ప్రభుత్వంలో ఒప్పు అయింది.. ఈ ప్రభుత్వంలో తప్పు అయినట్టు కథనాలు ఉంటున్నాయి. విలువలను ఉల్లంఘించడమే సంప్రదాయంగా కొన్ని పత్రికలు, చానళ్లు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం మారగానే వార్తల రూపం, స్వరూపం, ప్రాధాన్యం మారిపోతున్నాయి. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి లేనిది ఉన్నట్టు రాయడం క్షమించరాని తప్పు విశాఖలో జీఐఎస్ సదస్సుకు ఎందరో పారిశ్రామికవేత్తలు వచ్చి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనిపైనా కొన్ని పత్రికలు వక్రీకరించి కథనాలు ప్రచురించాయి. దీనివల్ల ఎవరికి లాభం?.. నష్టపోయేది ఎవరు? అనేది పాత్రికేయులు ఆలోచించాలి. సైనికుడి చేతిలో ఆయుధం, విలేకరి చేతిలోని కలం ఒకటే. లేనిది ఉన్నట్టు రాయడం క్షమించరాని తప్పు. – కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ సమాజ ప్రగతికి గొడ్డలిపెట్టు మీడియాలో విలువలు దిగజారిపోతున్నాయి. ఇది సమాజ ప్రగతికి గొడ్డలిపెట్టు. తమకు వ్యక్తులపై ఉన్న కక్షను వ్యవస్థపై రుద్దేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆ పత్రికలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు.. ప్రజాసంక్షేమం గిట్టదు. – పి.విజయబాబు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆ రెండు పత్రికలకు మంచి కనిపించదు.. ఆ రెండు పత్రికలకు రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజలకు జరుగుతున్న మంచి కనిపించదు. జగన్ సీఎం అయినప్పటి నుంచి అవి అదే ధోరణి అవలంబిస్తున్నాయి. –మల్లాది విష్ణు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు -
ప్రసార మాధ్యమాలపై సుప్రీం వ్యాఖ్యలు ఆలోచించదగినవే
టీవీ ప్రసార మాద్యమాలపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆలోచించదగినవే. కచ్చితంగా టీవీ చానళ్లు బాధ్యతగా ఉండాలి. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండరాదు. ఈ సూత్రం ఒక్క టీవీ చానళ్లకే కాదు.. అన్ని వ్యవస్థలకు వర్తిస్తుంది. గౌరవ న్యాయ స్థానం ఆ విషయాన్ని గుర్తించే ఇంత ఆవేదనగా తన వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. అయితే అదే సమయంలో కొన్నిసార్లు ప్రభుత్వాలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినవారిపై , వారి ప్రసంగాలను విస్తారంగా ప్రచారం చేసిన చానళ్లపై కేసులు పెడితే న్యాయ వ్యవస్థ స్టే లు ఇవ్వడమో, లేక మరో రకంగానో వారికి రక్షణ కల్పించాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఒక్కోసారి ఒక్కో గౌరవ న్యాయమూర్తి ఒకో రకంగా స్పందించడం కాకుండా , ఇలాంటి విషయాలలో ఒకే అభిప్రాయం వ్యక్తం అయ్యేలా వ్యవస్థ వ్యవహరిస్తే అప్పుడు దేశానికి ఒక మార్గదర్శకం అవుతుందని చెప్పాలి. సందర్భం ఏదైనా సుప్రీంకోర్టు ఇప్పుడు విద్వేష సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. టీవీ చానళ్లను బలమైన దృశ్యమాద్యమంగా మారాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అది వాస్తవమే. అందులోను పాజిటివ్ సమాచారం కన్నా, నెగిటివ్ సమాచారానికే ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. వాటికి టిఆర్పి రేటింగ్ ముడిపడి ఉండడంతో ఆయా చానళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. అందులో భాగంగా అశ్లీల నృత్యాలు, విద్వేషపూరిత ప్రసంగాలు, చర్చలు వంటివి ఉంటున్నాయి. కచ్చితంగా వీటిని అడ్డుకోవల్సిందే. అందుకోసం ఏమి చేయాలన్నదానిపై కొన్ని మార్గదర్శక సూత్రాలు లేకపోలేదు. కానీ వాటిని కొంతమంది పట్టించుకోవడం లేదు. దాంతోనే ఈ సమస్య వస్తోంది.దానికి మీడియా స్వేచ్చ అనే ముసుగు తగిలిస్తున్నారు.కచ్చితంగా మీడియా స్వేచ్చను కాపాడాల్సిందే. అలాగే వారు ఏదైనా విద్వేషాన్ని పెంచుతుంటే దానిని అరికట్టవలసిందే. కానీ కొన్నిసార్లు న్యాయ వ్యవస్థ పూర్తి వివరాలలోకి వెళ్లకముందే విద్వేష వ్యాప్తి చేశారన్న ఆరోపణలు ఉన్నవారికి రక్షణ కల్పిస్తోందన్న అభిప్రాయం ఉంది. పైగా ఆ సమయాలలో కొందరు న్యాయమూర్తులు పోలీసు వ్యవస్థపైన , ప్రభుత్వాలపైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో అసలు సమస్య పక్కకుపోయి, ఈ తీవ్ర వ్యాఖ్యలే చర్చనీయాంశం అవుతున్నాయి. ఉదాహరణకు ఆంద్ర ప్రదేశ్ లో ఒక ఎమ్.పిగారు రోజూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తుండేవారు. కొన్ని కులాలను కించపరిచేలా మాట్లాడడం, కొన్ని మతాలను అగౌరవపరచేలా సంభాషించడం చేసేవారు. దానిని కొన్ని చానళ్లు నియంత్రించకపోగా, చాలా గొప్ప విషయం అన్నట్లుగా ప్రసారం చేసేవి.ఈ నేపధ్యంలో పోలీసులు సంబందిత రికార్డు అంతటిని తయారు చేసి కేసు పెడితే న్యాయ వ్యవస్థ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. సదరు ఎమ్.పిగారు తనను పోలీసులు కొట్టారని ఆరోపించారు. ఆయనను నిజంగా కొట్టారో, లేదో తేల్చాలని గౌరవ సుప్రింకోర్టువారు ఆర్మి ఆస్పత్రికి పంపించారు. ఆ ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులకు ఆయన చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లిపోయారు.అయినా న్యాయ వ్యవస్థ ఆయనపై చర్య తీసుకోలేదు. పోలీసులు ఆయనపై రాజద్రోహం కేసు పెడతారా అంటూ ఫైర్ అయింది. దాని సంగతి తేల్చేస్తామని చెప్పారు. అదీ జరగలేదు.గౌరవ కోర్టువారు ఎపి ప్రభుత్వ ఆస్పత్రులు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాత , ఇమేజీలను అబ్జర్వు చేసిన తర్వాత తగు నిర్ణయం చేసినట్లు అనిపించలేదు. అయినా ఫర్వాలేదు. ఒకవేళ పోలీసులు ఏమైనా తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. కాని అలా కాకుండా ఆ కేసు పక్కదారి పట్టేలా సాగితే మరి ఎవరిని తప్పు పట్టాలి. ఇప్పటికీ ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. చివరికి ఆ ఎంపీగారు ఆ రాష్ట్రానికి వెళ్లడం మానుకున్నారు. పైగా పోలీసుల విచారణకు కూడా హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దానికి తోడు ప్రతిపక్షం పోలీసులపై , ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తుంటుంది. దానికి న్యాయవ్యవస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణం. ఈ విషయాన్ని కూడా గౌరవ న్యాయమూర్తులు పరిశీలించవలసిన అవసరం ఉంది. విద్వేషపూరిత ప్రసారాల విషయంలో ముందుగా రాజద్రోహం సెక్షన్లు వర్తిస్తాయా?లేదా? ఒకవేళ వర్తించకపోతే, మరే సెక్షన్ కిందకేసు పెట్టాలి?అన్నది తేల్చిన తర్వాత సుప్రింకోర్టు ఈ విషయంలో ముందుకు వెళితే బాగుంటుందనిపిస్తుంది. ఈ ఎంపీగారి కేసులో విద్వేషపూరిత ప్రసంగాన్ని, దానిని ప్రసారం చేసిన చానళ్లను ఒక కేసు కింద, ఒకవేళ పోలీసులు ఆ ఎంపీని హింసించి ఉంటే దానిని విడిగా మరో కేసు కింద పరిగణించి విచారణ చేపట్టి ఉంటే న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరిగేది. కొన్నిసార్లు కొందరు న్యాయమూర్తులు తమ సొంత అభిప్రాయాలను యధేచ్చగా వ్యక్తం చేస్తున్నారు. అవి ఒక్కోసారి రాజకీయ వ్యాఖ్యల మాదిరిగా ఉంటున్నాయి. అలాంటి స్వేచ్చ న్యాయమూర్తులకు ఉండవచ్చు.కాని వాటివల్ల కూడా రాజకీయంగా కొందరికి ప్రయోజనం కలిగేలా ఉండడం సరైనదేనా అన్నది ఆలోచించాలి. అలాకాకుండా వారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా,దానిని లిఖిత పూర్వక తీర్పులో ఉండాలన్న డిమాండ్ ను కొన్ని పక్షాలు చేస్తున్నాయి. కానీ న్యాయమూర్తులు వాటిని పట్టించుకోకుండా, తమ మానాన తాము రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని ప్రభావం కూడా సమాజంపై పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కచ్చితంగా న్యాయ వ్యవస్థ తగురీతిలో స్పందించాలి. అలాగని ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటోందన్న అబియోగానికి తావివ్వకూడదు. ఏది ఏమైనా సుప్రింకోర్టు విద్వేషవ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం చొరవ చూపడం మంచిదే. కొన్నిసార్లు భావ స్వేచ్చగాను, మరికొన్నిసార్లు విద్వేషంగాను పరిగణించకుండా, ఒక కొలమానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది.అందుకు తగ్గ ప్రమాణాలను న్యాయ వ్యవస్థ రూపొందిస్తే మంచిది. ఎన్నో కీలకమైన సంస్కరణలకు, మార్పులకు సుప్రింకోర్టు గతంలో నాందీ పలికింది. ఇప్పుడు ఈ విద్వేష వ్యాప్తిని అరికట్టడానికి వీలుగా తగు సంస్కరణలు తీసుకువస్తే సంతోషించవచ్చు. కచ్చితంగా సమాజాన్ని చీల్చి, విద్వేషాలను పెంచి లాభపడాలన్న వ్యక్తులు, రాజకీయ నేతలకు, టీవీ చానళ్లకు ముకుతాడు వేయగలిగితే ఆహ్వానించదగిన పరిణామమే అవుతుంది. -
సమాజాన్ని చీలుస్తున్నాయి
న్యూఢిల్లీ: వార్తల ప్రసారంలో పలు చానళ్ల తీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాధ్యతారాహిత్యంతో అవి సమాజాన్ని చీలుస్తున్నాయంటూ ఆగ్రహించింది. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేలా చూడటంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విద్వేష ప్రసంగాలు సమాజం పాలిట పెను బెడదగా పరిణమించాయంటూ ఈ సందర్భంగా మండిపడింది. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బాధ్యతారాహిత ప్రసారాలతో సమాజంలో సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించే చానళ్లపై చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘మనకు కావాల్సింది సంతులనంతో కూడిన స్వేచ్ఛాయుతమైన మీడియా. కానీ హెచ్చు టీఆర్పీ రేటింగులు సాధించడమే ఈ రోజుల్లో వార్తల కవరేజీకి పరమావధిగా మారింది. అందుకోసం చానళ్లు తమలో తాము పోటీ పడుతూ ప్రతిదాన్నీ సంచలనాత్మంగా మారుస్తున్నాయి. చాలాసార్లు టీవీల్లో లైవ్ చర్చల్లో యాంకర్లు తామే సమస్యలో భాగంగా మారిపోతున్నారు. ప్యానల్లోని వ్యక్తులు మాట్లాడుతుండగానే ఇష్టారాజ్యంగా మ్యూట్ చేస్తున్నారు. వారికి తమ వాదన విన్పించే అవకాశమే ఇవ్వడం లేదు. టీవీ దృశ్య మాద్యమం కావడంతో పత్రికల కంటే చాలా శక్తిమంతమైనది. వీక్షకులను ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. దురదృష్టవశాత్తూ ప్రేక్షకుల్లో చాలామంది పరిణతి ఉన్నవాళ్లు కాదు. టీవీలు చూపించే దృశ్యాలను చూసి రెచ్చిపోకుండా ఉండటం కష్టం. ఈ నేపథ్యంలో పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరిగా టీవీ ప్రసారాల విషయంలో ఎలాంటి నియంత్రణ వ్యవస్థా లేకపోవడం శోచనీయం’’ అంటూ జస్టిస్ జోసెఫ్ ఆందోళన వెలిబుచ్చారు. విద్వేష వ్యాఖ్యల వ్యాప్తి ద్వారా సమస్యలో భాగంగా మారుతున్న టీవీ న్యూస్ యాంకర్లను ప్రసారం నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. చానళ్లు తీర్పరులుగా మారి విచారణ కూడా జరుపుతున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాయి. అతనింకా విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రతివారికీ పరువు ప్రతిష్టలుంటాయి’’ అన్నారు. పోలీసును పొడిచేసినా పట్టించుకోరా! ఢిల్లీలో ఇటీవల ఒక పోలీసు అధికారిని చైన్స్నాచర్ పట్టపగలు అందరి ముందే పొడిచేసినా ఎవరూ పట్టించుకోలేదని ఒక్కరూ అడ్డుకోలేదని జస్టిస్ నాగరత్న ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కానీ చానళ్లలో, బయటా మాత్రం ఎవరు ఏమైనా మాట్లాడే పరిస్థితి నెలకొంది. వార్తా చానళ్లు వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో వాటిపై ఇప్పటికీ ఎలాంటి నియంత్రణలూ లేవు. భావ ప్రకటన స్వేచ్ఛ గొప్ప బాధ్యతతో కూడుకుని ఉంటుంది. టీవీ చానళ్లు విద్వేష ప్రసంగాల వ్యాప్తికి పాల్పడి కార్యక్రమాల నియమావళిని ఉల్లంఘిస్తే వాటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. ఒకరిపై అలాంటి చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్లంతా దారికొస్తారని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలో ఇలాంటి వేలాది ఫిర్యాదులొచ్చాయని, సదరు చానళ్లపై చర్యలు కూడా తీసుకున్నామని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ చాలా సున్నితమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. దానికి భంగం కలగని రీతిలో చానళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఈ సమస్య ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ బదులిచ్చారు. విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సమస్యగా మారొద్దు ‘‘ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత యాంకర్దే. యాంకరే సరిగా వ్యవహరించకపోతే భిన్నాభిప్రాయాలను అనుమతించరు. అవతలి వక్తను మ్యూట్ చేయడమో, వారిని అసలు ప్రశ్నలే అడగకపోవడమో చేస్తారు. ఇది పక్షపాతమే. ఇలాంటి సందర్భాల్లో యాంకర్లపై ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నారు? సమాజంపై ఎంతో ప్రభావం చూపగల అత్యంత బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నామని మీడియాలోని వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సమస్యలో భాగంగా మారి మనసుకు ఏది తోస్తే అది మాట్లాడొద్దు’’ అంటూ ధర్మాసనం హితవు పలికింది. -
కొత్త సంవత్సరంలో టీవీ చూసేవారికి ఊహించని షాక్!
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇదిలా ఉండగా టీవీ లవర్స్కి సైతం కొత్త ఏడాదిలో పెద్ద షాక్ తగలనుంది. ప్రముఖ టీవీ బ్రాడ్కాస్టర్లు ఛానళ్లకు సంబంధించి అలకార్టే, బౌక్వెట్ రేట్లను పెంచేశాయి. ఈ ధరల పెంపు నిర్ణయం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుంది. దీని కారణంగా, టీవీ రీఛార్జ్ కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్యాక్ ఖరీదుగా మారనుంది. 3 సంవత్సరాల తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. సోనీ పిక్చర్స్, స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్తో సహా 42 ప్రసారకర్తలు 332 కంటే ఎక్కువ ఛానెల్లు ఉన్నాయి. ప్రసారకర్తలు ఈ ఛానెల్లను చూడటానికి నెలవారీ రుసుములను నిర్ణయించారు. దీని ధర 10 పైసల నుంచి 19 రూపాయల వరకు ఉంటుంది. టీవీ బ్రాడ్కాస్టర్లు 3 సంవత్సరాల తర్వాత ఛానెల్ల ధరలను సవరించారు. నవంబర్ 22న ప్రసార సేవల నియంత్రణ ఫ్రేమ్వర్క్ను ట్రాయ్ (TRAI) సవరించినందున ఈ ధరల పెంపు జరిగింది. ఆ తర్వాత జీ (ZEE), కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్ సోనీ, సన్ టీవీనెట్వర్క్ తమ రిఫరెన్స్ ఇంటర్కనెక్ట్ ఆఫర్లను (RIO) ఫైల్ చేశాయి. ఆర్ఓఐ అనగా సర్వీస్ ప్రొవైడర్ జారీ చేసిన నియమ నిబంధనల పత్రం. ఒక సర్వీస్ ప్రొవైడర్ మరో నెట్వర్క్తో ఇంటర్కనెక్షన్ కోరుకునే నిబంధనలు, షరతులు అందులో ఉంటాయి. మరో వైపు డిస్నీ స్టార్ ఇండియా, వయాకామ్ 18 వంటి సంస్థలు కూడా త్వరలోనే ఆర్ఐఓలను దాఖలు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి కొత్త ధరలు నివేదిక ప్రకారం.. టీవీ వీక్షకుల నెలవారీ టీవీ చందా బిల్లు పెరగబోతోంది. ఎందుకంటే, ప్రధాన టెలివిజన్ ప్రసారకర్తలు ఛానెల్ల బౌక్వెట్ రేట్లను పెంచాయి. ఛానెల్లను వీక్షించడానికి పెరిగిన కొత్త ధరలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో టీవీ ఛానెల్లను చూడటానికి వీక్షకులు ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే కొన్ని బౌక్వెట్స్ ధరలు 10-15% రేట్లు పెంచినట్లు సమాచారం. సోనీ తన రూ. 31 ధర గల బౌక్వెట్ని నిలిపివేసి, దాని స్థానంలో రూ. 43 కొత్తదాన్ని తీసుకొచ్చిందని ఓ కేబుల్ టీవీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వార్తా సంస్థకు తెలిపారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారంపై నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా, పౌరుల మధ్య విద్వేషం పెంచేలా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారం వెంటనే ఆపేయాలని టీవీ చానళ్లను దేశ ఎలక్ట్రానిక్ మీడియా, రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) ఆదేశించింది. వీటిని ఉల్లంఘిస్తే షోకాజ్ కూడా ఇవ్వకుండా నేరుగా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. ‘లాంగ్ మార్చ్ పేరిట ఇమ్రాన్ చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఇటీవల చేసిన పలు ప్రసంగాల్లో.. తన హత్యకు కుట్ర పన్నాయంటూ సైన్యంసహా దేశ అత్యున్నత విభాగాలపై నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ప్రసంగాలు ప్రజల మధ్య విద్వేషం పెంచే ప్రమాదముంది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ఇలాంటి ప్రసంగాల ప్రసారం ఆపేయండి’ అని పేర్కొంది. -
ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక
వెంగళరావునగర్: దాదాపు ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన ఓ బాలిక సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఓ టీవీ కార్యక్రమం ఆ బాలిక పాలిట వరంలా మారి..అనాథ జీవితానికి తెర పడింది. వివరాల్లోకి వెళ్తే..ఈసీఐఎల్ కమలానగర్కు చెందిన పిన్నమోని కృష్ణ, అనూరాధ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇందు, సింధు కవలలు. 2014లో వినాయక ఉత్సవాలకు వెళ్ళిన సందర్భంగా ఇందు అనే మూడున్నరేళ్ల కుమార్తె తప్పిపోయింది. ఆ సమయంలో ఆ పాపను ఓ మహిళ తీసుకెళ్లినట్టుగా సీసీ టీవీలో కూడా కనిపించింది. దాంతో తల్లిదండ్రులు నాటి నుంచి చాలా ప్రాంతాల్లో గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల ఓ టీవీ చానల్ కార్యక్రమంలో ఆ పాప కనిపించడంతో తల్లిదండ్రులు గుర్తించి తమ కుమార్తెలాగానే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆరా తీశారు. టీవీ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులను కలిసి విషయం తెలిపారు. వారి సాయంతో కిస్మిత్పూర్లోని చెరిస్ అనాథ బాలికల సంరక్షణ కేంద్రాన్ని చేరుకున్నారు. అక్కడ ఉన్న పిల్లల్లో తమ కుమార్తె ఉండటంతో తల్లిదండ్రులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. దాంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రంగారెడ్డి, జిల్లా బాలల హక్కుల చైర్మన్ నరేందర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్కుమార్, మహిళా శిశుసక్షేమశాఖ అధికారులు తల్లిదండ్రుల వద్ద వివరాలను, ఆ బాలిక వివరాలను పరిశీలించారు. ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన పాప, అనాథాశ్రమంలో ఉన్న పాప ఒక్కరే అని నిర్ధారణకు వచ్చారు. సోమవారం స్థానిక మధురానగర్లో ఉన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కార్యాలయంలో తల్లిదండ్రులకు తమ కుమార్తెను అప్పజెప్పారు. తప్పిపోయిన తమ కుమార్తె తిరిగి తమ వద్దకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి) -
రష్యన్ చానల్స్పై నెట్ఫ్లిక్స్ నిషేధం
మాస్కో: రష్యన్ చానల్స్ను ఏవీ తాము ప్రసారం చేయడం లేదని నెట్ఫ్లిక్స్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన వారం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించింది. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చానల్స్ అన్నీ ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతాయని అందుకే వాటిని ప్రసారం చేయడం లేదని నెట్ఫ్లిక్స్ ప్రతినిధి చెప్పారు. రష్యాలో ఇటీవలే నెట్ఫ్లిక్స్ అడుగుపెట్టింది. చట్టాల ప్రకారం ఆ దేశంలో ప్రసారాలు ఉంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చానల్స్ని తప్పనిసరిగా ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే యూ ట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ రష్యా ప్రభుత్వ చానల్స్పై నిషేధం విధించాయి. -
కన్నీళ్లకు కరగని తాలిబన్లు! అతని కళ్ల ముందే..
కాబుల్: అఫ్గన్లో తాలిబన్ల షరతుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా సంగీత వాయిద్యాల (మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్)ను అఫ్గన్ తాలిబన్లు నడి వీధిలో తగలబెడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను అఫ్గన్ తాలిబన్లు తగలబెడుతుండగా కన్నీరు పెట్టుకుంటున్న సంగీత విద్యాంసుడు, గన్ పట్టుకుని అతన్ని చూసి హేళనగా నవ్వుతున్న తాలిబన్ ఈ వీడియోలో కనిపిస్తారు. చుట్టు చేరిన వారిలో కొంత మంది అతని దయనీయ స్థితిని వీడియో తీయడం కూడా కనిపిస్తుంది. ఈ సంఘటనకు చెందిన వీడియోను అఫ్గన్ జర్నలిస్టు అబ్దుల్హాక్ ఒమెరి అఫ్గనిస్తాన్లోని పాక్టియా ప్రావిన్స్లో చోటుచేసుకున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశాడు. కాగా గతంలో తాలిబన్లు వాహనాల్లో సంగీతాన్ని నిషేధించారు. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల్లో లైవ్ మ్యూజిక్ కూడా తాలిబన్లు నిషేధించారు. మహిళలు, పురుషులు వేర్వేరు హాళ్లలో సంభరాలు జరుపుకోవాలనే వింత హుకుం జారీ చేసినట్లు అఫ్గనిస్తాన్లోని ఓ హోటల్ యజమాని గత ఏడాది అక్టోబర్లో మీడియాకు తెలిపాడు. హెరాత్ ప్రావిన్స్కు చెందిన బట్టల దుకాణాల్లోని బొమ్మల (మానెక్వీన్స్) తలలు తొలగించాలని, అది షరియత్ చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని తాలిబన్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విధమైన నిషేధాజ్ఞలు కాబుల్ వీధుల్లో మళ్లీ కనిపించడం ప్రారంభించాయి. అఫ్గనిస్తాన్ టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే డ్రామాలు, ఇతర కార్యక్రమాల్లో మహిళలను ప్రదర్శించడం నిలిపివేయాలని పిలుపునిస్తూ మత పరమైన మార్గదర్శకాలను కూడా తాలిబన్ మినిస్ట్రీ విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు అమలుచేయకపోవచ్చని సమూహం చెప్పినప్పటికీ, కరడుగట్టిన షరియా చట్టాన్ని మాత్రం అక్కడ తప్పక అమలుచేసి తీరుతారనేది చరిత్ర చెబుతోంది. 20 ఏళ్ల తర్వాత మరోసారి అఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి రావడంతో, తీవ్రవాదుల పాలనలో అక్కడి మహిళలు సందిగ్ధభరితమైన అనిశ్చిత జీవితాన్ని జీవించాల్సిఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. Video : Taliban burn musician's musical instrument as local musicians weeps. This incident happened in #ZazaiArub District #Paktia Province #Afghanistan . pic.twitter.com/zzCp0POeKl — Abdulhaq Omeri (@AbdulhaqOmeri) January 15, 2022 చదవండి: నన్ను కాదని సోనూసూద్ సోదరికి సీటిచ్చారు..! అందుకే బీజేపీలోకి..: కాంగ్రెస్ ఎమ్మెల్యే -
రేపటి నుంచి ఆ ఛానళ్లు బంద్
తెలుగు సినిమాలు బోర్ కొడితే హిందీవి చూస్తాం. అవీ బోర్ కొడితే హాలీవుడ్ సినిమాలను ఆశ్రయిస్తాం. కొందరైతే సినిమాలు చూడటం తప్ప మరో పనే లేదన్నట్లుగా టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి సినీ ప్రియులకు ఓ విషాదకర వార్త. ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్బీఓ, డబ్యూబీ.. ఇండియాలో కనిపించకుండా పోనున్నాయి. రేపటి (డిసెంబర్ 15) నుంచి భారత్తో సహా పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్లో ఈ రెండు ఛానళ్లను వార్నర్మీడియా నిలిపివేయనుంది. (చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం) అయితే దక్షిణాసియాలో పిల్లలు ఎక్కువగా ఆదరించే కార్టూన్ నెట్వర్క్, పోగో ఛానళ్లను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్ సీఎన్ఎన్ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్ మీడియా యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ఫామ్లు డిస్నీ హాట్ స్టార్, నెట్ఫ్లిక్స్ లాంటి ఆన్లైన్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ కంపెనీ ఇతర ఓటీటీ యాప్లకు పోటీగా హెచ్బీఓ మాక్స్ అనే కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: థియేటర్తో పాటు ఓటీటీలోనూ విడుదల) -
మీడియాపై ఆగ్రహం.. కరణ్కు మద్దతు
బాలీవుడ్లో డ్రగ్స్ వాడకం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణంతో బాలీవుడ్లో మాదకద్రవ్యాల వినియోగం తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇప్పటికే దీపికా పదుకోనె, రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారు కూడా విచారణ కూడా హాజరవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టీవీ చానెళ్లల్లో ఓ వీడియో తెగ ప్రసారం అవుతుంది. గత సంవత్సరం కరణ్ జోహార్ నిర్వహించిన హౌస్ పార్టీని హైలైట్ చేస్తున్న ఈ వీడియోపై మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ శుక్రవారం స్పందించారు. మీడియా పార్లమెంటు ఇటీవల ఆమోదించిన వివాదాస్పద వ్యవసాయ బిల్లుల గురించి మాట్లాడటానికి బదులు గత సంవత్సరం కరణ్ జోహార్ ఇంట్లో నిర్వహించిన పార్టీ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ కన్ను) If Karan johar had invited some farmers too for his party life would have been easier for our TV channels.They would not have had to choose between farmers protest and Karan’s party!. it seems that Karan’s do is the second most favourite PARTY of our channels — Javed Akhtar (@Javedakhtarjadu) September 25, 2020 ‘కరణ్ జోహార్ తన పార్టీ కోసం కొంతమంది రైతులను కూడా ఆహ్వానించినట్లయితే, మన టీవీ చానెళ్ల పని సులభం అయ్యేది. అలా జరిగి ఉంటే ప్రస్తుతం వారు రైతుల నిరసన, కరణ్ పార్టీల మధ్య దేన్నో ఒక దాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఉండేది కాదు! కరణ్ తన రెండో పార్టీని మన చానెళ్లతో చేయాల్సి ఉన్నట్లు అనిపిస్తుంది’ అంటూ అక్తర్ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియోలో కనిపించే ప్రముఖులలో, బాలీవుడ్ తారలు దీపికా పదుకోనె, రణబీర్ కపూర్, విక్కీ కౌషల్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్లతో పాటు చిత్ర నిర్మాతలు జోయా అక్తర్, అయాన్ ముఖర్జీ ఉన్నారు. దీనిలో కనిపించే సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నారనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి -
అయోధ్యలో టీవీ చర్చలకు అనుమతి తప్పనిసరి
అయోధ్య: అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన జరిగే రామమందిరం భూమిపూజ జరగనున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ యంత్రాంగం టీవీ వార్తా చానళ్లకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. అయోధ్య నుంచి ప్రసారం చేసే చర్చా కార్యక్రమాల్లో ‘మందిరం–మసీదు వివాదం’కక్షిదారులెవరూ ఉండరాదని స్పష్టం చేసింది. భూమిపూజ రోజున చానళ్లు చేపట్టే చర్చలు, ఇతర కార్యక్రమాల్లో ఏమతానికీ లేదా వ్యక్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉండరాదని తెలిపింది. ఇందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా చానళ్లు ముందుగా మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు అన్ని వార్తా చానళ్లకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపింది. వెండి ఇటుకలను విరాళంగా ఇవ్వకండి వెండి లేదా ఇతర లోహాలతో తయారు చేసిన ఇటుకలను ఆలయానికి విరాళంగా ఇవ్వవద్దని రామాలయ ట్రస్టు కోరింది. భూమిపూజను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు ఇప్పటికే ఒక క్వింటాల్ వెండి, ఇతర లోహాలతో తయారైన ఇటుకలను బహూకరించారని ఆలయ ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. వీటిని ఆలయంలో భద్ర పరచడానికి గానీ, ఈ ఇటుకల్లో స్వచ్ఛతను పరీక్షించడానికి గానీ తమ వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేవన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నగదు రూపంలో విరాళాలను ఆలయ బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. (అయోధ్యలో ఉగ్ర కుట్రలకు పాక్ పన్నాగం!) -
‘టీవీ షూటింగ్స్కు అనుమతివ్వండి’
సాక్షి, హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని, వారిని ఎంటర్టైన్ చేసేందుకు టీవీ షూటింగులకు అనుమతులు ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను పలు చానళ్ల ప్రతినిధులు కోరారు. శనివారం స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే,సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రసాద్లు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. టీవీ షూటింగులకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చదవండి : ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ -
వారిలో సమాజ హితం లేదు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మేలు కోరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే రాష్ట్రంలోని కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. వారి రాతల్లో, ప్రసారాల్లో ఏమాత్రం సమాజ హితంలేదని, సొంత సామాజికవర్గ స్ఫూర్తి మాత్రమే కనిపిస్తోందని ఈనాడు, ఈటీవీపై రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 జనవరి 9న ఈనాడు పత్రిక ‘ఇవి మీకు తెలుసా?’ అనే శీర్షికన ప్రచురించిన ఫొటోలు, కథనాల్లో రామోజీరావు తాలూకు స్వార్థం, సామాజికవర్గ స్ఫూర్తి కనిపిస్తోందన్నారు. ఆ ఫొటోలను మంత్రి ఉటంకిస్తూ.. 2016 అక్టోబర్ నుంచి సచివాలయంలో పాలన సాగుతోందని.. 2017 మార్చి నుంచి శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయని రాశారన్నారు. అయితే, అవి జరుగుతున్నవి తాత్కాలిక భవనాల్లో అనే విషయం వాస్తవమా, కాదా? అని రామోజీరావును చెప్పమనండి? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో 2019 జూలై నుంచి రాజ్భవన్ పనిచేస్తోందని, జగన్ అధికారంలోకి వచ్చాక గతంలో మాజీ ముఖ్యమంత్రి వినియోగించిన ఈ భవనాన్ని ఆయనకు కేటాయించారన్నారు. అంతేకాదు.. విజయవాడ, గుంటూరులో అద్దె భవనాల్లో కొన్ని, సొంత భవనాల్లో కొన్ని ప్రభుత్వ శాఖలున్నాయనేది కూడా నిజమేననీ.. అయితే హంగులన్నీ ఉన్న అమరావతికి అదనంగా ఖర్చుచేయాల్సిన అవసరంలేదని మరో పెద్ద శీర్షికతో కథనం రాసిందని ఆయన ప్రస్తావించారు. అమరావతిలో అన్ని హంగులూ ఉంటే రాజధాని నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు అవుతుందని ఇదే ఈనాడు పత్రిక 2018 డిసెంబర్ 24న ‘నిలువెత్తు దగా’ అని వార్త ఎలా రాశారన్నారు. నిజంగా అంతా అయిపోయి ఉంటే మొన్నటి ఎన్నికలకు ముందు రూ.53 వేల కోట్ల మేరకు టెండర్లు ఎందుకు పిలిచారో చెప్పాలి? అన్నారు. అలాగే, గురువారం 2020 జనవరి 9 నాటి కథనంలో రూ.3 వేల కోట్లు ఖర్చుచేస్తే అంతా అయిపోతుందని రాశారని బొత్స అన్నారు. ఎన్నికలకు ముందేమో దగా అని రాసి ఇప్పుడేమో అద్భుతం అంటారా? అని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. శివరామకృష్ణన్ నివేదికను ప్రచురించాలి రాష్ట్ర విభజన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో ఈనాడులో ప్రచురించాలని బొత్స డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వంత పాడొద్దని రామోజీరావుకు ఆయన హితవు పలికారు. కాగా, విశాఖపట్నానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు దూరం, దగ్గరని రాస్తున్నారని.. మరి విశాఖపట్నం విజయవాడకు 400 కిలోమీటర్లు ఉన్నపుడు విజయవాడ నుంచి విశాఖ ఏమైనా 40 కిలోమీటర్లే ఉంటుందా? దూరం కాదా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న వారు మనుషులు కారా? వారికి అభివృద్ధి అవసరంలేదా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చి ఏం చేశారని రామోజీరావు ఏనాడూ తన పత్రికలో ఎందుకు అడగలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రాంతీయ అసమానతలను తగ్గించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. ఇలాంటి బ్లాక్మెయిలింగ్ వార్తలకు తాము భయపడేదేలేదని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. పవన్కు కోపం వస్తే కవాతు అంటే ఎలా? కాగా, రాజధాని ప్రాంతంలో పవన్కళ్యాణ్ చేస్తానని చెబుతున్న నిరసన కవాతు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆయనకు కోపం వచ్చినపుడు కవాతు అంటే ఎలా? ఆయన మాదిరిగా మాకు కేకలు వేయడం, యాక్షన్ చేయడం రాదు’ అని బొత్స బదులిచ్చారు. అసలు ఆయనకు ఏ విషయంపై కూడా స్పష్టతలేదన్నారు. రైతులు చంద్రబాబు ఉచ్చులో పడొద్దని, గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టంచేశారు. ఎన్ని గొంతుకలో? ఈనాడు పత్రిక ఎన్నికలకు ముందు ఒక గొంతుక, ఎన్నికలయ్యాక మరో గొంతుకను వినిపిస్తోందని బొత్స ధ్వజమెత్తారు. రామోజీరావులో సమాజ స్పృహ కన్నా సామాజికవర్గ స్పృహ ఎక్కువగా ఉందని.. ఎందుకీ పాపపు మాటలని ప్రశ్నించారు. వయస్సు, అనుభవం పెరిగిన ఆయన ఇంకా ఏం సాధించడానికి ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. వీరి వ్యవహారం చూస్తుంటే.. వారి మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలా వార్తలు.. మరొకరు సీఎం అయితే ఇంకోలా రాస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులందరూ మీ అడుగులకు మడుగులు ఒత్తాలా? మీకు తొత్తులుగా ఉండాలా? అని ఆయన మండిపడ్డారు. -
ప్రైవేటు టీవీ చానళ్లకు కేంద్రం వార్నింగ్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందండంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రైవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు కీలక సూచనలు చేసింది. హింసను ప్రేరేపించేలా, దేశ వ్యతిరేక వైఖరిని ప్రోత్సహించేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న దృశ్యాలను ప్రసారం చేయవద్దని హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఘర్షణల దృశ్యాలను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో సమాచార, ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అంశాలను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయకుండా అన్ని చానళ్లు అప్రమత్తతో ఉండాలని, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది. గతంలో కూడా పలుమార్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ టీవీ చానళ్లపై అంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
ఇస్లామోఫోబియా పోగొట్టేందుకు టీవీ చానల్
ఇస్లామాబాద్: పశ్చిమదేశాల్లో ముస్లింలకు సంబంధించిన అంశాలతోపాటు ఇస్లాం అంటే ఉన్న భయాన్ని పోగొట్టేందుకు పాకిస్తాన్, మలేసియా, టర్కీ కలిసి బీబీసీ తరహా ప్రత్యేక టీవీ చానల్ను ప్రారంభించనున్నాయి. ఇటీవలి ఐరాస సమావేశాల్లో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఈ విషయం ప్రకటించడం తెల్సిందే. ఇంగ్లిష్లో ప్రసారమయ్యే టీవీ చానెల్తోపాటు సంయుక్తంగా సినిమాలు, వెబ్ సిరీస్లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నా.. చానల్ను ఎప్పుడు ప్రారంభించేదీ ఇంకా నిర్ణయించలేదు. -
మరో 96 గంటలే..
సాక్షి, అమరావతి: సుదీర్ఘ నిరీక్షణకు మరో 96 గంటల్లో తెరపడనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరిగాయి. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు రావడానికి మిగిలింది ఇక నాలుగు రోజులే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం తేలడానికి కౌంట్డౌన్ మొదలైంది. ఓటరు దేవుడి ఆగ్రహానికి, అనుగ్రహానికి గురైంది ఎవరో తెలిసిపోనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ఆదివారం జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెలవడనున్నాయి. ఈ ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు, అసలు ఫలితాలకు మధ్య లంకె కుదిరేనా? అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు టీవీ చానళ్లు, సర్వే ఏజెన్సీలు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. రాష్ట్రంలో లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరచడం ఖాయమని పలు జాతీయ టీవీ చానళ్లు, సర్వే సంస్థలు వెల్లడించాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడంతోపాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారని ఇప్పటికే జాతీయ పత్రికలు, చానళ్లు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగిసే వరకు అంటే సాయంత్రం 6 గంటల దాకా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడిపై నిషేధం ఉంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బహిర్గతం చేయడానికి జాతీయ చానళ్లు, సర్వే సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కొంత స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓటమి భయంతో చంద్రబాబు గగ్గోలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం తప్పదని సర్వేల్లో తేటతెల్లమైంది. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన కూడా అదే వాతావరణం నెలకొంది. పోలింగ్ ముగిసిన తరువాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాము ఘనవిజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తన ఓటమిని ఊహించి, ఈవీఎంలపై గగ్గోలు ప్రారంభించారు. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే రాష్ట్రంలో 30 శాతం మేర ఈవీఎంలు పనిచేయడం లేదని ఆరోపించారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకుని, ఓటు వేసినట్లు వేలికి ఉన్న సిరా గుర్తును మీడియాకు చూపిస్తూ ఫోజులు ఇచ్చారు. సాయంత్రం అయ్యే సరికి తన ఓటు ఎవరికి పడిందో తెలియడం లేదని చెప్పారు. పోలింగ్ ముగిసిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని చంద్రబాబు దుర్భాషలాడారు. పలు ఆరోపణలు చేశారు. ఆ మరుసటి రోజు ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగ్గా పని చేయలేదంటూ ఫిర్యాదు చేశారు. ఈవీఎంలపై నమ్మకం లేదు, బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిరోజూ పాత పాటే పాడారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అనవసర రాద్థాంతం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘చిలక’ జోస్యంపై జనం అనాసక్తి సీఎం చంద్రబాబు గూటిలోని చిలక ‘లగడపాటి’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించి, బొక్కబోర్లాపడ్డారు. పోలింగ్ పూర్తయిన తరువాత సర్వే ఏజెన్సీలు టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ప్రకటించగా, లగడపాటి మాత్రం మహా కూటమి గెలుపు తథ్యమని తేల్చిచెప్పారు. తీరా ఫలితాలను చూస్తే లగడపాటి చిలక జోస్యం వాస్తవానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. దీంతో లగడపాటి సర్వేలపై ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబుకు లాభం చేకూర్చడానికే లగడపాటి దొంగ సర్వేలు నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం జనంలో నాటుకుపోయింది. -
మార్చి దాకా పొడిగింపు..
న్యూఢిల్లీ: కొత్త బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సేవల విధానం కింద టీవీ వీక్షకులు తమకు కావాల్సిన చానల్స్ను ఎంచుకునేందుకు నిర్దేశించిన గడువును టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా మార్చి 31 దాకా పొడిగించింది. ఒకవేళ కస్టమర్లు నిర్దిష్టంగా చానల్స్ను ఎంచుకోని పక్షంలో సముచితమైన ప్లాన్ను (బెస్ట్ ఫిట్ ప్లాన్) వారికి అందించాలని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫాం ఆపరేటర్స్ (డీపీవో– కేబుల్ ఆపరేటర్లు)కు సూచించింది. ఆయా కస్టమర్ల వినియోగ ధోరణి, భాషల ప్రాధాన్యం, పాపులర్ చానల్స్ తదితర అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ‘ఇప్పటిదాకా చానళ్లను ఎంచుకోని సబ్స్క్రయిబర్స్ని ఉద్దేశించి గడువును మార్చి 31 దాకా పొడిగించాం. అప్పటిదాకా డీపీవోలు అమలు చేసే బెస్ట్ ఫిట్ ప్లాన్ను గడువులోగా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. తాము ఎంపిక చేసుకున్న చానల్స్ను డీపీవోకి తెలియజేస్తే 72 గంటల్లో తదనుగుణంగా ప్లాన్ను మార్చడం జరుగుతుంది‘ అని ట్రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బెస్ట్ ఫిట్ ప్లాన్కు మారినంత మాత్రాన ప్రత్యేకంగా లాకిన్ వ్యవధి ఏమీ ఉండదని, మార్చి 31లోగా ఎప్పుడైనా మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త బ్రాడ్కాస్టింగ్ విధానం గతేడాది డిసెంబర్ 29నే అమల్లోకి వచ్చినప్పటికీ.. టీవీ వీక్షకులు నచ్చిన చానల్స్ను ఎంపిక చేసుకునేందుకు జనవరి 31దాకా ట్రాయ్ గడువిచ్చింది. తాజాగా దాన్నే పొడిగించింది. 65 శాతం ఎంపిక పూర్తి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల కేబుల్ కనెక్షన్లు, 6.7 కోట్ల డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. ఇప్పటికే కేబుల్ యూజర్లు 65% మంది, డీటీహెచ్ కస్టమర్లు 35% తమకు కావాల్సిన చానల్స్ను ఎంపిక చేసుకున్నట్లు ట్రాయ్ పేర్కొంది. కొత్త విధానంతో సబ్స్క్రయిబర్స్ కోరుకునే చానల్స్కే చెల్లించేందుకు వెసులుబాటు లభిస్తుందని తెలిపింది. నిర్దిష్టంగా చానల్స్ను ఎంపిక చేసుకోని వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బెస్ట్ ఫిట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు వివరించింది. కస్టమరు తనకు కావాల్సిన చానల్స్ను ఎంపిక చేసుకునే దాకా లేదా బెస్ట్ ఫిట్ ప్లాన్కు బదిలీ అయ్యే దాకా పాత పథకమే కొనసాగుతుందని ట్రాయ్ పేర్కొంది. -
మరోసారి టీవీ చానళ్ల ఎంపిక గడువు పొడగింపు
న్యూఢిల్లీ: టీవీ ప్రేక్షకులకు ట్రాయ్ మరోసారి ఊరట కల్పించింది. వినియోగదారులు తమకు ఇష్టమైన చానళ్లను ఎంచుకునే గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ట్రాయ్ మంగళవారం ప్రకటించింది. దీంతో టెలివిజన్ వీక్షకులకు కొంత మేర ఊరట కలిగినట్టయింది. ట్రాయ్ తొలుత పేర్కొన ప్రకారం డిసెంబర్ 29న నూతన విధానం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల విజ్ఞప్తితో ట్రాయ్ తొలుత జనవరి 31 వరకు ఈ గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ.. చాలా మంది వినియోగదారులు నూతన విధానంలోకి మారకపోవడం వల్ల వారికి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో సోమవారం డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్వోలతో సమావేశం నిర్వహించిన ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల కోసం ప్రస్తుతం వారు చెల్లిస్తున్న మొత్తానికి మించకుండా, వారు కోరుకున్న చానళ్లను అందించేలా ప్యాకేజీలు రూపొందించాలని ఆపరేటర్లకు సూచించింది. కొత్త నిబంధన వల్ల టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన చానళ్లను చూసుకునే అవకాశం అభిస్తుందని, వారిపై భారం కూడా తక్కువగానే పడుతుందని ట్రాయ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఆమే నా గాడ్ మదర్
సస్పెన్స్ కథనంతో, అనూహ్యమైన మలుపులతో రక్తి కట్టించే విధంగా సీరియల్ని ముందుకు నడిపించడంలో మంజులానాయుడు స్టైలే వేరు. దూరదర్శన్లో సీరియల్స్ కొత్తగా వస్తున్న రోజులవి. అక్కడ మొదలైన ప్రయాణం తెలుగులో కమర్షియల్ చానెల్స్ మొదలయ్యాక ఊపందుకుంది. ‘రుతురాగాలు’ తెలుగు టీవీ సీరియల్స్ని మలుపు తిప్పిన సీరియల్. కస్తూరి, మొగలిరేకులు .. ఇలా ఎన్నో సెన్సేషల్ టీవీ సీరియల్స్ ఆమె చేతిలో రూపుదిద్దుకున్నాయి. టీఆర్పి రేటింగ్స్ని పరిగెత్తించే సత్తా గల ఆమే మంజునాయుడు. సీరియల్స్ సక్సెస్ గురించి... నాది, బిందు(చెల్లెలు)ది వేవ్లెంగ్త్ బాగుంటుంది. మంచే చూపించాలి అనుకునేవారం. దానివల్లే మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. వారంలో ఒకరోజు స్టోరీ చర్చకోసం అని పెట్టుకునేవాళ్లం. 2 గంటల్లో స్టోరీ డిస్కషన్ ఉండేది. దాంతో రాబోయే వారం స్టోరీ లైన్ వచ్చేసేది మీరు సీరియల్స్ తీసేనాటికి ఇప్పటికీ ఓవరాల్ సీరియల్స్ వ్యూ.. (నవ్వుతూ) ఇప్పటి కంటెంట్లో చాలా మార్పులు వచ్చాయి. చూసేవాళ్లంతా చెబుతుంటారు ఆ తేడా. ఆ విషవలయం అనేది ఎప్పుడు బ్రేక్ అవుతుందో చెప్పలేం. ప్రేక్షకులు ఏమంటారంటే.. ‘మీరు తీస్తున్నారు కాబట్టి మేం చూస్తున్నాం’ అంటారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఏమంటారంటే.. ‘ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి మేం తీస్తున్నాం’ అంటున్నారు. సీరియల్స్ అయినా ఇతర కార్యక్రమాలైనా ప్రేక్షకుల స్పృహ తప్పనిసరి. ఇంట్లో పిల్లలు ఏం చూస్తున్నారు? వాటి వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం.. అనే ఆలోచన ప్రేక్షకుల్లోనే ఉండాలి. అలాగే సీరియల్స్ తీసే దర్శక నిర్మాతలకూ సామాజిక బాధ్యత ఉండాలి. సీరియల్స్ డౌన్ ట్రెండ్ ఇప్పుడు చాలా ఎక్కువ. ఆధునికతకు, మెచ్యూరిటీకి చాలా తేడా ఉంది. ఇది ఒక్కరిదే లోపం అనలేం అందరూ ఆలోచించాల్సిన విషయం. వీటన్నింటి నడుమ ఎన్నో మంచి సీరియల్స్ కూడా వచ్చాయి. వస్తున్నాయి. నేనలాంటి ఔట్ఫోకస్ ఉన్న సీరియల్సే తీసాను. కక్షలు, మోసాలు అన్నింటా ఉంటాయి. అయితే, ఏం చూపుతున్నాం అనేది కూడా దర్శకుడికి చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా డిప్రెసివ్ సినారియో నడుస్తుంది. యంగ్జనరేషన్ ఇష్టపడేవి.. ఇప్పటి యంగ్ జనరేషన్లో హానెస్టీ ఉంటుంది. ప్రతీ థాట్లో ఓపెన్నెస్ని బాగా ఇష్టపడుతున్నారు. మాటలు, చేతలు, ధైర్యంగా ఇష్టాయిష్టాలు చెప్పుకోవడం.. ఇలా ప్రతీది ఓపెన్గా కనిపిస్తున్నారు. అది మంచికో చెడుకో అనేది మళ్ళీ క్వెశ్చన్స్ వేసుకోవాల్సిందే. నా విషయానికి వస్తే చిన్న వయసులోనే ఈ ఫీల్డ్లోకి ఎంటరయ్యాను. 18 ఏళ్లకే నాకు పెళ్లయింది. అప్పుడు ఇంటర్మీడియేట్ మాత్రమే. రిజల్ట్ వచ్చాక ఇంట్లో ఇంకా చదువుకోవాలన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా పెద్ద కొడుకు పుట్టాడు. కాలేజీలో ఉన్నప్పుడు డ్రామాలు కూడా వేసేదాన్ని. మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసేవారు. మా వారు దూరదర్శన్లో వర్క్ చేసేవారు. చిత్రలహరికి టైటిల్స్ రాయమన్నారు. బొమ్మలేసే అలవాటు ఉండటం వల్ల ఆ వర్క్ తీసుకున్నాను. అలా టీవీలో నా వర్క్ డాక్యుమెంట్స్కి చేయడం వరకు వెళ్లింది. డిగ్రీ పూర్తయ్యాక అక్కడ చేయాల్సిన ప్రాజెక్ట్స్ మరికొన్ని కనిపించాయి. అలా నేచరల్గా టీవీ సీరియల్ వర్క్లోకి ఎంటరయ్యాను. ముందు తక్కువ ఎపిసోడ్స్ ఉన్న సీరియల్స్ చేశాను. తర్వాత 26 ఎపిసోడ్స్, 50 ఎపిసోడ్స్, వంద, వెయ్యి... అలా పెద్ద సీరియల్స్ వరకు వెళ్లాం. ఏ సీరియల్ బాగా ఇష్టం? సీరియల్ ఆఫ్ స్క్రీన్లో గ్రేట్ మూమెంట్స్.. రుతురాగాలు బాగా ఇష్టమైన సీరియల్. అలా స్మూత్గా వెళ్లిపోయింది కథ. ప్రతీ సీరియల్ ఎండ్ మూమెంట్ అనేసరికి చాలా బాధనిపించేది. యూనిట్లో అంతా ఏడుపులతో గందరగోళంగా ఉండేది. స్టోరీతోనూ, ఆ పాత్రలు, వర్క్ చేసే ప్రతి ఒక్కరి మధ్యా ఒక బంధం ఉండేది. రేపటి నుంచి ఇక కలవం అనుకుంటే చాలా బాధగా ఉండేది. ప్రేక్షకులతో ఉండే ఒక బాండ్ కూడా అక్కడితో ఎండ్ అవుతుంది. కానీ, ఎన్నాళ్లో అలా సాగదీయలేం కదా! సీరియల్స్ ద్వారా జనాలకు ఇచ్చే సందేశం మెసేజ్ ఇవ్వడానికి సీరియల్, సినిమాను మించిన సాధనం లేదు. సీరియల్ ద్వారా అరగంట ఆడియన్స్ టైమ్ మనచేతిలో ఉందంటే చెప్పే విషయం పట్ల చాలా క్లారిటీ ఉండాలి. సొసైటీని డీ జనరేట్ కానివ్వకూడదు. మంచి–చెడు చెప్పగలగాలి. సృష్టించే క్యారెక్టర్కి విలువలు ఉండాలి. కథలో సస్పెన్స్ ఉండాలి. వాటితో పాటే క్యార్టెక్టర్తో ప్రేక్షకుడికి ఒక బంధం ఏర్పడాలి. ఆగమనం సీరియల్ నుంచి కెరటాల దాక మోరల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, సెల్ఫ్ డిఫెన్స్, ఇండివిడ్యువాలిటీ గురించి చెప్పాం. ఈ ఆలోచన కూడా ఏదో పనిగట్టుకొని రాదు. అది మన మైండ్లో నేచురల్గా చేరిపోతుంది. నటీ నటుల ఎంపిక... ఈ ఫేస్ అయితే ఈ క్యారెక్టర్కి కరెక్ట అనుకుంటాం. కొన్ని ఆర్టిస్ట్ను బట్టి మార్పులు చేసుకుంటాం. కొంతమంది బాడీలాంగ్వేజెస్ ఇంట్రస్టింగ్గా ఉంటాయి. వాళ్లని బట్టి కూడా కొత్త కథలు పుట్టుకువస్తాయి. నటీనటుల్లో ‘నటించగలం’ అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. కొత్తకథ అనుకున్నప్పుడు ఆర్టిస్టుల గురించి అనౌన్స్ చేస్తాం. లాంగ్ సీరియల్స్ని కొనసాగించడం చాలా కష్టం అనుకుంటారు. కానీ, చాలా సింపుల్. తక్కువ మందితో ముందే అనుకున్న కథనంతో సీన్ నడిపించేస్తాం. కొంతమంది వెళ్లి వెనక వంట కూడా చేసేస్తుంటారు. ప్రతిరోజూ ఒక పిక్నిక్లా ఉంటుంది. తెలుగు సీరియల్స్ – ఫారిన్స్ సీరియల్స్కి తేడా! ఇంగ్లిష్ సీరియల్స్ కల్చర్ చాలా భిన్నంగా ఉంటుంది. ‘శాంటాబార్బరా, బోల్డ్ అండ్ బ్యూటీఫుల్..’ వంటివి అలా కొనసాగుతూనే ఉంటాయి. వాటిలో ఉండే పాత్రలు అక్కడి కల్చర్కి అనుగుణంగా ఉంటాయి. అక్కడి బంధాలు కూడా వాళ్లు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే డబ్బు ఫ్లో కూడా వారికి సపోర్టింగ్గా ఉంటుంది. సీరియల్స్కి తీసుకున్న కథలు ? సీరియల్స్ తీయాలని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మేం అనుకున్నాం.. ‘మనమే రాసేద్దాం’ అని. కామన్ఫ్రెండ్స్ కొందరు యుద్ధనపూడి సులోచనారాణిగారిని కలవమన్నారు. దాంతో ఆవిడ పుస్తకాలు ఇచ్చి ఏం కావాలో సెలక్ట్ చేసుకోమన్నారు. అలా ‘ఆగమనం’ చేశాం. నాటినుంచి కథ అంటే ఆవిడ దగ్గరకు పరిగెత్తేదాన్ని. ఆమే నా గాడ్ మదర్. ఆ తర్వాతి సీరియల్స్నీ ఆమెతో చర్చించాను. ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి..? కథ, పాత్రల గురించి ముందు నేను కన్విన్స్ అవ్వాలి. అందుకే ఏడాది పాటు బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు నవలలు చదువుతున్నాను. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథనాలను ఇష్టపడుతున్నాను. వచ్చే అక్టోబర్ వరకు పుస్తకాలతోనే నా కాలక్షేపం. పోలిక లేకుండా మనసు పెట్టి చేస్తే ఎవ్వరైనా తమ వృత్తిలో సక్సెస్ అవుతారు. – నిర్మలారెడ్డి -
టీవీ ఛానెల్స్కు మంచి రోజులు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయివేటు టీవీ ఛానళ్లకు తీపి కబురు చెప్పింది. మొన్న వార్తాపత్రికలకు ఇచ్చే ప్రకటనల రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ టీవీ ఛానళ్లకు ఇచ్చే ప్రకటన రేట్లను పెంచింది. ప్రయివేటు టీవీ చానెళ్లకు అందించే ప్రకటనల రేట్ల సవరణకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అంగీకరించిందని బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్(బీవోసీ) ప్రకటించింది. 11శాతం పెంచుతూ శుక్రవారం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. దేశీయంగా వారి ప్రదర్శన, రేటింగ్స్ ఆధారంగా న్యూస్, నాన్-న్యూస్ ఛానళ్లకు వైవిధ్యమైన రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సమీక్ష కమిటీ జనవరి 1, 2019న అందించిన నివేదిక ఆధారంగా ఈ రేట్లను సవరించినట్టు పేర్కొంది. కాగా ఇటీవల వార్తాపత్రికల కిచ్చే ప్రకటన రేట్లను 25శాతం పెంచుతూ బీవోసీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దూరదర్శన్కు మరో రెండు సైన్స్ చానళ్లు
న్యూఢిల్లీ: దూరదర్శన్ మరో రెండు కొత్త చానళ్లకు శ్రీకారం చుట్టింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా సైన్స్ పేరుతో రెండు చానళ్లను దూరదర్శన్ మంగళవారం ప్రారంభించింది. డీడీ సైన్స్ పేరుతో ఒక చానల్ను, ఇండియా సైన్స్ పేరుతో వెబ్ చానల్ను దూరదర్శన్ ప్రారంభించింది. ఈ చానళ్ల ప్రారంభోత్సవానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్దన్ హాజరై మాట్లాడారు. శాస్త్రీయ దృక్పథం అభివృద్ధికి ఓ చానల్ అత్యవసరమని అందుకు డీడీ సైన్స్ 24/7 చానల్ను సైన్స్కు అంకితమిస్తునట్లు తెలిపారు. దూరదర్శన్ జాతీయ చానల్లో ఒక గంటపాటు డీడీ సైన్స్ చానల్ కార్యక్రమాలుంటాయని, ఇండియా సైన్స్ చానల్ మాత్రం ఇంటర్నెట్ ఆధారిత చానల్ అని పేర్కొన్నారు. దేశంలో ప్రతిభావ్యుత్పత్తులకు, మెరుగైన ఆలోచనలకు కొదవలేదన్నారు. దేశంలో వాటర్ షెడ్ ఉద్యమం కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్కే పరిమితం కాదని సమాజంలో అభివృద్ధి చెందిన శాస్త్రీయ దృక్పథానికి ఆ ఉద్యమం నిదర్శనమన్నారు. త్వరలోనే ఈ డీడీ సైన్స్ చానల్కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలోనే మన దేశం మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. -
మోదీ ఫస్ట్, కేజ్రివాల్ సెకండ్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక కాలంలో మీడియా ప్రభావం అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా వార్తల కోసం మీడియాపై ఆధారపడుతున్న వారి సంఖ్య గడచిన నాలుగేళ్ల కాలంలో బాగా పెరిగింది. రేడియో వార్తల శ్రోతలు తగ్గుతుండగా, ఇంటర్నెట్లో వార్తలు చూసే వారి సంఖ్య పెరగకుండా, తగ్గకుండా ఓ మోస్తారులోనే ఉంది. ఇక వార్తల కోసం పత్రికలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగి ఓ స్థాయిలో నిలిచిపోయింది. టీవీ ఛానళ్లలో వార్తలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక వార్తల్లో ఎక్కువగా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న వారిలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో, అరవింద్ కేజ్రివాల్ రెండోస్థానంలో, రాహుల్ గాంధీ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయాల్లో మీడియా ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశంపై ‘లోక్నీతి– సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ (1994 నుంచి 2014 మధ్యకాలంపై) నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వార్తల కోసం 46 శాతం మంది టీవీ ఛానళ్లను వీక్షిస్తుండగా, 26 శాతం మంది వార్తా పత్రికలపై ఆధారపడుతున్నారు. దాదాపు ఐదు శాతం మంది మాత్రమే వార్తల కోసం ఇంటర్నెట్పై ఆధారపడ్డారు. ఇంటర్నెట్లో వార్తలు చూసే వారి సంఖ్య 2017లో 16 శాతం మంది ఉన్నట్లు ‘ప్యూ గ్లోబల్ ఆటిట్యూడ్’ నిర్వహించిన సర్వేలో తేలింది. ఉన్నత విద్యావంతులు, పట్టణ ప్రాంతాల్లోనే వార్తల కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా మహిళలకన్నా పురుషులే ఈ రెండు మీడియాలను ఎక్కువగా చూస్తున్నారు. మీడియాలో ఎక్కువగా బీజేపీనే ప్రాచుర్యం పొందగా, ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది కూడా బీజేపీనే. మీడియాలో బీజేపీ ప్రాచుర్యం 39 శాతం ఉండగా, కాంగ్రెస్ ప్రాచుర్యం 27 శాతం ఉంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతానికి నరేంద్ర మోదీ ప్రభావం, ప్రాచుర్యం బాగా తగ్గింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి, ఆయన పార్టీకే ఓటేస్తామని టీవీల్లో హిందీ వార్తలు చూసే ప్రజలు తెలియజేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో వార్తలు చూసేవారు కచ్చితంగా ఈసారి కాంగ్రెస్కు ఓటేస్తామని చెబుతున్నారు. బీజేపీతో పోలిస్తే మీడియాలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ ప్రాచుర్యం ఉన్నా ఓటింగ్ శాతం మాత్రం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. -
బుల్లి తెర భారం
వరంగల్: ఇకపై ప్రేక్షకులకు బుల్లితెర వీక్షణం మరింత భారం కానుంది. నేరుగా ఇంటింటికీ ప్రసారాలు (డీటీహెచ్) అందించే సంస్థలకు మాదిరిగా పే చానళ్లకు సంబంధించి అదనపు చార్జీలను కేబుల్ టీవీ నిర్వాహకులకు చెల్లించాలని టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సామాన్యులపై భారం పడనుంది. ఇప్పటివరకు కేబుల్ టీవీ వినియోగదారులు వారి ప్రాంతాల్లోని ఆపరేటర్లు నిర్ణయించిన ప్రకారం నెలనెలా బిల్లులు చెల్లించేవారు. వారు ప్రసారం చేసే అన్ని చానళ్లను వీక్షించే అవకాశం ఉండేది. డిజిటల్ ప్రసారాలు, సెట్టాప్ బాక్స్లు ఏర్పాటు చేసినప్పటికీ బిల్లుల చెల్లింపుల్లో పెద్దగా తేడా రాలేదు. ప్రసారాలు డిజిటల్గా మారడంతో చిత్రం, మాటల్లో స్పష్టత పెరిగింది. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో 250 నుంచి 400 చానళ్ల వరకు కేబుల్ ఆపరేటర్లు.. ఎంఎస్ఓల సాయంతో వినియోగదారులకు అందజేస్తున్నారు. ఉచితంగా లభించే వినోదం, వార్తలు, సినిమాలు, వంట ప్రోగ్రాం, స్పోర్ట్స్ చానళ్లు హిందీ, ఇంగ్లిష్, తమిళం, మళయాలం, ఉర్దూ భాషల్లో ప్రసారం అవుతున్నాయి. నగరాల్లో మాస్టర్ కంట్రోల్ రూం ఆపరేటర్లు చేసే ప్రసారాల్లో స్థానిక ఆపరేటర్లు తన ప్రాంత వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రసారాలను అందిస్తున్నారు. సెట్టాప్ బాక్స్లు ఏర్పాటు చేశాక, ప్రధానమైన మాస్టర్ ఆపరేటర్ల పరిధిలో ఎంత మంది వినియోగదారులు టీవీప్రసారాలను తిలకిస్తున్నారనే లెక్క తేలింది. తదనుగుణంగా ఆదాయం ఎంఎస్ఓలకు పెరిగింది. నెలరోజుల పాటు టీవీ ప్రసారాలు తిలకించిన వినియోగదారుడు బిల్లులు చెల్లించే పద్ధతి ఇప్పుడు అమలులో ఉంది. డీటీహెచ్ ప్రసార సంస్థలు : ప్రస్తుతం ఎంఎస్ఓలు డిజిటల్ ప్రసారాలను వినియోగదారులకు అందజేస్తున్నారు. వీటిలో చానళ్లకు విడివిడిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రసారాల పరంగా క్రీడలు, సినిమాలు, ఇంగ్లీ్లషు చానళ్లకు ప్యాకేజీల వారీగా చెల్లించాలి. అప్పుడే ఆయా చానళ్ల ప్రసారాలు జరిగేవి. చానళ్లకు ఒక రేటు, ప్యాకేజీలకు ఒక రేటన్లుండేవి. ఇవి పొందేందుకు నెలవారీగా, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది సబ్స్క్రిప్షన్లను రీచార్జి చేసుకుంటేనే ప్రసారాలు చూసే వీలుంది. ఆరునెలలు, ఏడాది కోసం ఒకేసారి రీచార్జి చేసుకుంటే కొంత రాయితీలను డీటీహెచ్ కంపెనీలు అందిస్తున్నాయి. నూతన విధానం ఇలా.. కేబుల్ టీవీ ఆపరేటర్లకు వినియోగదారులు ప్రీపెయిడ్ పద్ధతిలో ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం నిర్ధారిత రుసుముకు ఆపరేటర్లు 100 ఉచిత చానళ్లను వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. దీనికి కేబుల్ ఆపరేటర్కు రూ.130తో పాటు జీఎస్టీ చెల్లించాలి. పే చానళ్లు వీక్షించాలంటే ఆయా కంపెనీలకు ప్యాకేజీల వారీగా ముందుగానే చెల్లింపులు చేయాలి. ప్రస్తుతం కేబుల్ ఆపరేటర్లు అందిస్తున్న అన్ని చానళ్లు చూడాలంటే నెలవారీ బిల్లులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తెలుగు సీరియళ్లు, సినిమాలు, క్రీడా చానళ్లు చూడాలంటే ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే ఎక్కువ మొత్తం (కనీసం రూ.350) చెల్లించక తప్పదని ఎంఎస్ఓలు చెబుతున్నారు. దీంతో సగటు రూ.150 నుంచి రూ.250 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. గడువు ఈ నెల 29 : ఒక ప్యాకేజీలో చేరాలంటే చానల్కు గరిష్టంగా రూ.19 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంతకు మించి చానల్ ధర నిర్ణయించుకుంటే ఏ ప్యాకేజీలో భాగం అయ్యే వీలుండదు. ఆ చానల్ ప్రసారం చేసే ప్రసారాల(సొంత కంటెంట్)పై విశ్వాసం ఉంటేనే ప్రత్యేక ధర నిర్ణయించుకునే వీలుంటుంది. తెలుగు చానళ్లను చూస్తే వార్తా చానళ్లు ఉచితంగానే లభిస్తుండగా పలు చానళ్ల ధర రూ.17, రూ.19గా నిర్ణయించారు. వినియోగదారులు కోరుకున్న చానళ్లు మాత్రమే చూడగలగడం నూతన విధానం ప్రత్యేకతగా ఎంఎస్ఓలు తెలుపుతున్నారు. నూతన విధానానికి ఈ నెల 29వ తేదీ వరకు సిద్ధం కావాల్సి ఉంది. జిల్లాలో సుమారు 300 చానళ్లను ప్రసారం చేస్తున్నా నెలకు రూ.150 నుంచి 220 వరకు వసూలు చేస్తున్నారు. ఇకపై ఇంట్లో ఎవరెవరూ ఏ చానల్ను చూడాలో అన్న విషయాలను చర్చించి ఆ ప్యాకేజీలను పొందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
పవన్ సంచలన ట్వీట్లు.. క్షణాల్లో వైరల్
హైదరాబాద్ : మన అక్కాచెల్లెళ్లు, అమ్మలు, కూతుళ్లను దుర్భాషలాడుతూ కథనాలు ప్రసారం చేసే టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బహిష్కరించాలంటూ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. నిస్సహాయులైన చెల్లెమ్మలకు సహాయం చేయడానికి బదులుగా వారిని అశ్లీలంగా చూపిస్తూ వ్యాపారం చేసుకోవాలని చూసే ఆ ఛానల్స్ను బాయ్కాట్ చేయడం ఉత్తమమని పవన్ చేసిన ట్వీట్లకు విశేష స్పందన వస్తోంది. ఫ్యాన్స్ ఓపికగా ఉండాలి జనసేన కార్యకర్తలు, తన అభిమానులకు పవన్ కల్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి హింసాత్మక ఘటనల్లో మీరు తలదూర్చవద్దంటూ పవన్ ట్వీట్లు చేశారు. రేపు ఒకవేళ శ్రీనిరాజు తనమీద పరువునష్టం కేసు వేసినా మీరు నిగ్రహంగా ఉండాలని సూచించారు. కొన్ని ఛానల్స్ అధినేతలు, కీలక వ్యక్తులపై న్యాయపరంగా బలమైన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పోస్టులో పవన్ పేర్కొన్నారు. తాజాగా పవన్ చేసిన ట్వీట్లు క్షణాల్లో వైరల్గా మారాయి. Boycott TV9, TV5, ABN for abusing our Mothers,Daughters & Sisters And also we have to boycott them for making business out of nudity & profanity.Making business out of a helpless sister .. — Pawan Kalyan (@PawanKalyan) 20 April 2018 I appeal to all jansainiks to be quiet and don’t indulge in any violent acts..From tomorrow onwards SriniRaju is going to put a defamation case on me but you please restrain yourself. And I am also going for a long and powerful legal battle on these channel heads. — Pawan Kalyan (@PawanKalyan) 20 April 2018 -
పాకిస్తాన్లో ఇస్లామిస్ట్ మంటలు
ఇస్లామాబాద్/రావుల్పిండి : పాకిస్తాన్లో ఇస్లామిస్ట్ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. నిరసనకారుల దాడిలో ఒక పోలీస్ మృతి చెందారు. ఇస్లామిస్ట్ నిరసనకారులు శనివారం ఇస్లామాబాద్, రావుల్పిండి నగరాల్లో నిరసనలకు దిగారు. ఇస్లామిస్ట్ నిరసనకారులను చెదరగొట్టేందుకు శుక్రవారం నుంచి ఫ్రాంటియర్ కానిస్టేబుల్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారుల మీద టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను పోలీసులు ప్రయోగించారు. సైన్యం బలప్రయోగానికి దిగడంతో.. ఆగ్రహించిన ఇస్లామిస్ట్ నిరసనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులు మూకుమ్ముడిగా సైన్యం మీద భౌతిక దాడులకు దిగారు. అల్లర్లను రెచ్చగొడుతున్న 50 మంది ఇస్లామిస్ట్ నిరసనకారులను సైన్యం అదుపులోకి తీసుకుంది. భారీగా బలగాలు ఇస్లామాబాద్లో 2 వేల మంది నిరసనకారులను నియంత్రించేందుకు ప్రభుత్వం భారీగా సైన్యాన్ని బరిలోకి దింపింది. 8,500 మంది ఎలైట్ పోలీసులు, పారామిలటరీ బలగాలతో అల్లర్లను అదుపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పలువురికి గాయాలు ఇస్లామిస్ట్ నిరసనలు పాకిస్తాన్లో మిన్నంటాయి. ఈ నిరసన అల్లర్లలో 130 మంది గాయపడినట్లు పాకిస్తాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పదులో సంఖ్యలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లర్లలో ఒక పోలీస్ మృతి చెందారు. మీడియాపై నిషేధం పాకిస్తాన్ మీడియా రెగ్యులేటింగ్ చట్టాన్ని టీవీ చానళ్లు అతిక్రమించాయన్న కారణంతో..శనివారం ప్రయివేట్ టీవీ ఛానళ్లపై అధికారులు నిషేధం విధించారు. ఇస్లామిస్ట్ నిరసనకారులపై సైనిక చర్య జరుగుతున్న సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు చేయరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్ ప్రసారాలు కొనసాగాయి. MEDIA COVERAGE OF SIT-IN AT FAIZ-E-ABAD, ISLAMABAD pic.twitter.com/YqEGTWpFIR — Report PEMRA (@reportpemra) November 25, 2017 -
అమ్మ ఆరోగ్యం: తమిళ టీవీ చానల్ షేర్ల లాభాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళన క్రమంలో స్టాక్ మార్కెట్లో టీవీ నెట్ వర్క్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఒకవైపు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు అమ్మకు కార్డియాక్ అరెస్ట్ వార్తలతో తమిళ టీవీ చానళ్ల షేర్లకు డిమాండ్ పెరిగింది. దాదాపు 6- 9 లాభాలమధ్య కొనసాగుతున్నాయి. సన్ టీవీ నెట్వర్క్ షేరు 6.5 రాజ్ టీవీ 8.8 శాతం దూసుకెళ్లాయి. జీ ఎంటర్ టైన్ మెంట్ 2.17శాతం, టీవీ18 0.14 శాతం, డిష్ టీవీ 1.64 శాతం నష్టపోవడం గమనార్హం. కాగా సన్ టీవీ అధినేత కళానిధి మారన్ తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత కరుణానిధికి మారన్ మునిమేనల్లుడున్న సంగతి విదితమే. -
ఐఐటీ అభ్యర్థుల కోసం 3 చానళ్లు
న్యూఢిల్లీ: ఐఐటీ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా మానవ వనరుల అభివృద్ధి శాఖ మూడు కొత్త టీవీ చానళ్లను ప్రారంభిస్తోంది. వీటిని భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితశాస్త్రాల బోధనలకు ఉపయోగిస్తారు. వీటిలో ప్రసారమయ్యే సిలబస్ను ఢిల్లీ ఐఐటీ నిపుణులు రూపొందించారు. ప్రస్తుతం సిలబస్ ఆంగ్లంలో అందుబాటులో ఉండగా, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లోకి త్వరలో అనువదిస్తారు. -
దేశంలో 889 ప్రైవేటు టీవీ చానెళ్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం 889 ప్రైవేటు టీవీ చానెళ్లు ప్రసారమవుతున్నాయని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. ఈ ఏడాది జూలై వరకు 149 ఛానెళ్ల లెసైన్సులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ రద్దుచేసింది. 399 వార్తా చానెళ్లు. 768 ప్రైవేటు టీవీ చానెళ్లు అప్లింక్, డౌన్లింక్ అనుమతులు పొందాయి. -
టీవీ చానళ్లకు ప్రధాని వార్నింగ్
ఢాకా: ఉగ్రవాదుల దాడి సందర్భంగా బంగ్లాదేశ్ టీవీ చానళ్లు ప్రదర్శించిన అత్యుత్సాహంపై ప్రధాని షేక్ హసినా మండిపడ్డారు. టీవీ చానళ్ల లైసెన్సులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పలువురిని బందీలుగా పట్టుకున్న ఐసిఎస్ ముష్కరులను మట్టుబెట్టెందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. 'ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు మేము చేపట్టిన ఏర్పాట్లను వార్తా చానళ్లు లైవ్ ప్రసారం చేశాయి. ఈ ప్రసారాలు ఉగ్రవాదులు చూస్తారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. తమను అంతం చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుందో తెలిస్తే ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశముంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో సంయమనం పాటించాలని వార్తా చానళ్ల యజమానులను కోరుతున్నా'నని హసినా అన్నారు. శనివారం సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు. సైనిక చర్య సందర్భంగా టీవీ చానళ్లు వ్యవహరించిన తీరును ఆమె విమర్శించారు. 'అమెరికాలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు సీఎన్ఎన్ లేదా బీబీసీ ప్రభుత్వ చర్యలను పక్షపాతంతో చూపిస్తాయా? కానీ మన దేశంలో టీవీ చానళ్ల మధ్య ఎక్కువ ఉండడంతో అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. మా ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. వాటిని రద్దు చేసే అధికారం కూడా మాకుంది. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముంద'ని హసినా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. భద్రతాబలగాలు 10 గంటల పాటు సైనిక చర్య జరిపి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించాయి. -
3 చానళ్లపై కేసులు
ఢిల్లీ సర్కారు నిర్ణయం జేఎన్యూ వివాదంపై నకిలీ వీడియోల ప్రసారం న్యూఢిల్లీ: జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ వివాదాస్పద కార్యక్రమంపై నకిలీ వీడియోలను ప్రసారం చేసిన మూడు టీవీ చానళ్లపై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు టీవీ చానళ్లు మార్పుచేసిన వీడియోలను ప్రసారం చేశాయంటూ మెజిస్టీరియల్ దర్యాప్తు నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ చానళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నియమించిన న్యాయబృందం సూచించిందని ఓ అధికారి ఒకరు చెప్పారు. అయితే చానళ్ల పేర్లను ఢిల్లీ మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తన నివేదికలో పొందుపరచలేదన్నారు. ఫిర్యాదు ఆధారంగా సీఆర్పీసీ సెక్షన్ 200 ప్రకారం మేజిస్ట్రేట్ అభియోగాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. మెజిస్టీరియల్ బృందం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు ఏడు వీడియో క్లిప్పింగులను పంపగా, అందులో మూడు బూటకమని తేలింది. ఆ వీడియోలను ఎడిట్ చేసి స్వరాన్ని జతచేసినట్లు నిర్ధారణ అయింది. కన్హయ్య జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు విచారణ బృందం ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. కాగా, అంతకుముందు ఈ టీవీ చానళ్లపై చర్య తీసుకోవాలంటూ సీపీఎం నేత సీతారాంఏచూరి, జేడీయూ నేత కేసీ త్యాగి సీఎం కేజ్రీవాల్ను కలసి డిమాండ్ చేశారు. ఉమర్, అనిర్బన్ల విడుదలకు ఉద్యమిస్తా: రాజద్రోహం కేసు ఎదుర్కొం టూ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న జేఎన్యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యల విడుదల కోసం ఉద్యమిస్తానని కన్హయ్య చెప్పారు. అదే కేసుకు సంబంధించి కన్హయ్యకు ఇటీవలే ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆదర్శ్ అరెస్ట్.. కన్హయ్యను చంపినోళ్లకు రూ.11 లక్షలు రివార్డు ఇస్తామంటూ పోస్టర్లు అతికించిన పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్చేశారు. కాగా.. ఆదర్శ్ బ్యాంకు ఖాతాలో రూ.150 మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఈ ముఖం బస్తర్ పోరుకు ప్రతిబింబం: సోనీ న్యూఢిల్లీ: ‘నా ఈ ముఖం బస్తర్లో జరుగుతున్న పోరుకు ప్రతిబింబం’ అని గతనెలలో ఛత్తీస్లో యాసిడ్ తరహా రసాయనంతో దాడికి గురైన ఆదివాసీ హక్కుల కార్యకర్త సోనీ సొరీ అన్నారు. జేన్యూ విద్యార్థులకు ఆమె సోమవారం సంఘీభావం ప్రకటించారు. వర్సిటీలో ప్రసంగిస్తూ.. ‘నాది, కన్హయ్యది ఒకే పరిస్థితి. ఇద్దరం తప్పుడు కేసులతో జైలుకు వెళ్లాం. నన్ను నక్సలైట్ల మద్దతుదారునని ఆరోపించారు’ అని సోని పేర్కొన్నారు. కస్టడీలో ఉండగా తనను పోలీసులు లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఆమె 2014 లోక్సభ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. -
కాపు ఐక్యగర్జనకు కరెంట్ కట్
సెల్ సిగ్నళ్లు, కేబుల్ ప్రసారాల నిలిపివేత పిఠాపురం/తొండంగి: తుని వద్ద ఆదివారం నిర్వహించిన కాపు ఐక్యగర్జన బహిరంగసభకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. బహిరంగ సభ ప్రారంభం నుంచి సభ జరిగే ప్రాంతంతో పాటు సమీప గ్రామాలకూ విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీనికి తోడు ‘జామర్లు’ ఏర్పాటు చేసినట్టుగా అన్ని కంపెనీల సెల్ సిగ్నళ్లూ పనిచేయలేదు. టీవీ చానళ్లు, కేబుల్ టీవీ ప్రసారాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సభకు అడ్డంకులు కల్పించడానికి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి అవాంతరాలు సృష్టించారని సభకు వచ్చిన కాపు నాయకులు మండిపడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యుత్ సరఫరా, సెల్ సిగ్నల్స్ లేకపోవడం, ప్రసార మాధ్యమాలు పనిచేయకపోవడంతో సభకు వచ్చిన వారితో పాటు సమీప గ్రామాల ప్రజలు సైతం ఇబ్బందులు పడ్డారు. ప్రశాంతంగా ప్రారంభమై.. తుని రూరల్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆదివారం నిర్వహించిన కాపు ఐక్యగర్జన సభ ఉదయం ప్రశాంతంగానే ప్రారంభమైంది. ముద్రగడ పిలుపు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తంగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వివిధ జిల్లాలకు చెందిన కాపులు సభాప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభించారు. అప్పటినుంచి చూస్తే.. 10.10 గంటలకు ముద్రగడ పద్మనాభం తన మనవరాలు భాగ్యశ్రీతో కలసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 10.45 గంటలకు జామర్ల ఏర్పాటుతో సభా ప్రాంగణంలో సెల్ సిగ్నల్స్ స్తంభించి పోయాయి. 12.45 గంటల సమయంలో వేదిక, ప్రెస్ గ్యాలరీలు కూడా సభికులతో నిండిపోయాయి. 1.30 గంటలకు వేదికపై నాయకులు ఆశీనులయ్యారు. 1.45 గంటలకు అభిమానుల హర్షధ్వానాల మధ్య ముద్రగడ వేదికనెక్కి అందరికీ అభివాదం చేశారు. 2.37 గంటల నుంచి 2.54 గంటల వరకు ముద్రగడ ప్రసంగించారు. అనంతరం వేదికనుంచి దిగిన ముద్రగడ హైవేపై ధర్నాకు దిగారు. అభిమానులు అనుసరించగా అక్కడ ప్రసంగం చేశారు. 3.00 గంటలకు ఆందోళనకారులు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు. 3.15 గంటల సమయంలో విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను ఆపేందుకు ప్రయత్నించారు. వేగం తగ్గించిన డ్రైవర్ ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంలోనే డ్రైవర్లకు, కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రైలును నిలిపివేసిన డ్రైవర్లు రైలు వదిలి పరుగులు తీశారు. ప్రయాణికులు తమ తమ లగేజీలతో రైలు దిగిపోయారు. 4.40 గంటల సమయంలో కొందరు రత్నాచల్కు నిప్పు అంటించారు. అడ్డుకోబోరుున నలుగురు ఆర్పీఎఫ్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. 5.00 గంటలకు హైవేపై టైర్లకు ఆందోళనకారులు నిప్పు అంటించారు. -
చదువు.. సంస్కారం...శీలవైభవం
విద్య - విలువలు తెల్లవారి లేస్తే పేపర్లలో, టీవీ ఛానళ్లలో రక్తపుముద్దలను భయంకరంగా విపులీకరించి చూపడం, పైగా దానిని స్లోమోషన్లో అనేక పర్యాయాలు చూపించడం. ఎక్కడో ఎవడో ఉన్మాదంగా ప్రవర్తిస్తే దాన్నే పదేపదే చూపించడం... అరే. పిల్లలుంటారు, వాళ్ళకూ మనసులనేవి ఉంటాయి, లేతగా ఉంటాయి, వాటిపై ప్రభావం ఉంటుంది, అది గంట ఉండొచ్చు, కొన్ని రోజులుండొచ్చు, కొన్ని జీవితపర్యంతం ఉండొచ్చు, వారేమైపోతారని ఆలోచించగలిగినవాడు లేడు. ఆరోగ్యవంతమైన భయం... దీన్ని గురించి చెప్పేవాడే లేడు. ఈ పరిస్థితుల్లో సంస్కారం అనే మాట మీ జీవితాల్లోకి ఎలా ప్రవేశించగలుగుతుంది. అసలు చేరే అవకాశమే ఉండదు. లేనప్పుడు ఎటువంటి పనైనా సరే, ఎంత చెయ్యగూడని పనైనా సరే, చెయ్యడానికి సిద్ధపడిపోతున్నారు. పైగా దీనికంతటికీ ఏం చెబుతున్నారంటే.. నిర్భయత్వం. ఏ భయం లేకుండా ఉండాలని. అసలు మనిషికి భయమనేది ఉండకూడదని. ఏం చెయ్యడానికైనా తెగింపు ఉండాలని అంటున్నారు. తెంపరితనానికి, తెగింపుకు మారుపేరు ఉల్లంఘనం.. గీతదాటడం. మీరు మంచిమాటలు విడిచిపెట్టి ప్రవర్తించడమే ఉల్లంఘనం. నేను చట్టానికి లోబడి ఉండాలనే భయం ఒక పౌరుడికి ఉండాలి. ఉంటే.. సంస్కారం ఉంటుంది. అవతలివాడికి ప్రయోజనం లేని మాట నేను మాట్లాడకూడదనే భయం వక్తకు ఉండాలి. అప్పుడే అతని మాట సమాజానికి పనికి వస్తుంది. ఐశ్వర్యవంతుడికి నా సంపద నలుగురికీ ఉపయోగపడాలనే తాత్విక చింతన, కర్తవ్య నిష్ఠతో కూడిన సామాజిక భయం ఉండాలి. అప్పుడు వాడి ద్రవ్యానికి ఒక విలువ ఉంటుంది. ఏ భయం లేని చోట ఎవరికి విలువ ఉంటుందో చెప్పండి. నీకు నీవు బరువైపోతావు. సమాజానికి బరువైపోతావు. చదువుకోవడం చాలా గొప్ప విషయం, చాలా గొప్పగా చదువుకుంటున్నారు. కానీ ఆ పక్కన చేరవలసిన సంస్కారం చేరడం లేదు. దానికి కారణం పిల్లలు మాత్రం కాదు, కారణం చదువులో ఉంది. చదువుతో పాటూ దాని పక్కన ఇది చేరాలి. ఇది లేని నాడు, ఎంత చదువుకున్నా అది శోభించదు. అది మీకు ఉపయుక్తం కాదు. అది గుబాళించాలి. అది క్షీర వైభవంగా ప్రకాశించాలి. అంటే నీకు ఎప్పుడూ ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. అది లేకపోతే మీరు పాడయిపోతారని చెప్పేవాడు లేకపోవడం సమాజ దురదృష్టం. చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారు కంచికామకోఠి పీఠాధిపత్యాన్ని స్వీకరించిన తొలిరోజుల్లో ఒక రోజున ఆయన మధ్యాహ్నం భిక్ష(భోజనం) చేస్తూ ‘ఈ పదార్థం బాగుంది, ఏమిటిద’ని అడిగారట. ‘‘అది తోటకూరపప్పు’’ అని వంటవాడు చెప్పాడు. ‘‘ఓ చాలా బాగుంది’’ అన్నారట. మరునాడు భిక్షలో కూడా అది కనిపించింది. ఆయన బాగుంది’’ అన్నారట. అలా రోజూ కనిపిస్తున్నది. ఐదవరోజున వంటవాడిని పిలిచి రోజూ ఎందుకుచేస్తున్నావని అడిగారు. దానికి వంటమనిషి ‘ఈ మఠానికి మీ శిష్యులు చాలా మంది వస్తారు. వారితో చెప్పాను. మీకిష్టమని వారు ఇక్కడికి వచ్చేటప్పుడు కట్టలుకట్టలతోటకూర ఆకుకూర పట్టుకొస్తున్నారు. అందుకని రోజూ చేస్తున్నా’ అని చెప్పాడు. ఆయన విని ఊరుకున్నారట. మరునాడు భిక్షసమయానికి విస్తరి ముందు కూర్చోకుండా గోశాలలోకి వెళ్లి, అక్కడినుంచి ఆవుపేడ తీసి నాలుకకు రాసుకున్నారట. ఆ పక్కరోజున కూడా ఇలాగే చేస్తుంటే మఠం మేనేజర్ చూసి పరుగు పరుగున వచ్చి ‘‘అయ్యా! మీరేం చేస్తున్నారు’’అని అడిగాడు. దానికి స్వామి వారు...‘‘నేను ప్రపంచానికి మార్గదర్శకం చేయవలసిన పీఠాధిపతిని. సత్యదండం ధరించి, కాషాయం ధరించి వెడుతుంటే సాక్షాత్ శంకరాచార్యులవారు వస్తున్నారు’ అని అంటారు. ఏ ఊరువెళ్ళినా ఈ వార్త వెడుతుంది. శంకరాచార్యులవారికి తోటకూర పప్పు ఇష్టమని కొన్నాళ్ళు తెస్తారు. ఎండాకాలం వస్తుంది. ఎక్కడినుంచో కష్టపడి తెస్తారు. ఆ తరువాత ఈ శంకరాచార్యుల వారికి తోటకూర తేవడానికి ఛస్తున్నాం’ అంటారు. పదిమందికి మంచి గురించి, నిగ్రహం గురించి చెప్పవలసిన వాడిని, భోజనం విషయంలో నాలుక నిగ్రహం చేసుకోలేని నేను ఈ నాలుకతో దేశానికి ఏం మంచిమాట చెప్పగలను. వంటవాడిది కాదు తప్పు, రుచికి లొంగిన నాది. అందుకే రుచికి లొంగడం మానితే తప్ప మంచిమాట చెప్పడం కుదరదని నాలుకను గోమయంతో శుభ్రం చేసుకుంటున్నాను. శుద్ధి తర్వాత మళ్ళీ పదార్థాలు తీసుకుంటాను’’ అని చెప్పి మూడు రోజుల తర్వాత ఆయన ఆహారం తీసుకున్నారు. అదీ శీలవైభవం. అదీ ఆరోగ్యవంతమైన భయం అంటే. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
టీవీలో 'గ్రాండ్ మస్తీ'కి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: అడల్ట్ కామెడీ సినిమా 'గ్రాండ్ మస్తీ'ను టీవీలో ప్రసారం చేయడానికి లైన్ క్లియర్ అయింది. సినిమాటోగ్రఫి చట్టం-1952లోని నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పున్చింది. చీఫ్ జస్టిస్, జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ తో కూడిన ధర్మాసనం ఈ సినిమా ప్రదర్శనపై విధించిన స్టేను ఎత్తివేసింది. ఇప్పటికే టీవీల్లో ఈ సినిమా మూడుసార్లు ప్రదర్శితమైన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఒబ్రరాయ్, అఫ్తాబ్ శివదాసని నటించిన 'గ్రాండ్ మస్తీ' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎదారా గోపీచంద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ అడల్డ్ కామెడీ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు, అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని కోర్టుకు నివేదించారు. దీంతో ఈ చిత్రాన్ని టీవీల్లో ప్రదర్శించరాదని గత ఆగస్టులో హైకోర్టు స్టే విధించింది. -
హిందుజా-హిట్స్ సర్వీసులు ప్రారంభం
నెక్ట్స్ డిజిటల్ బ్రాండ్ కింద ఆపరేటర్లకు 500 పైగా టీవీ చానల్స్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ : కేబుల్ టీవీ ఆపరేటర్లకు దాదాపు 500 పైచిలుకు టీవీ చానళ్లను అందుబాటులోకి తెచ్చే వినూత్నమైన హిట్స్ (హెడ్ఎండ్ ఇన్ ది స్కై) సర్వీసులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఆవిష్కరించారు. కస్టమర్లకు మరిన్ని ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లు దీనితో అందుబాటులోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. హిందుజా గ్రూప్నకు చెందిన హిట్స్ నెట్వర్క్.. నెక్ట్స్ డిజిటల్ బ్రాండ్ కింద మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్వోలు), లోకల్ కేబుల్ ఆపరేటర్లకు (ఎల్సీవోలు) సర్వీసులు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో రూ. 5,000 కోట్లపైగా పెట్టుబడులు ఉం డగలవని హిందుజా వెంచర్స్ చైర్మన్ అశోక్ హిం దుజా ఈ సందర్భంగా తెలిపారు. నెక్స్ట్ డిజి టల్ ప్లాట్ఫామ్ను పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొం దించినట్లు ఆయన వివరించారు. కేబుల్ ఆపరేటర్లు స్వతంత్రంగా సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడగలదని హిందుజా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, త్వరలో మిగతా రాష్ట్రాల్లోనూ లభిస్తాయని ఆయన తెలిపారు. -
'ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దు'
న్యూఢిల్లీ: పంజాబ్లోని గురుదాస్ పూర్ ఉగ్రవాదుల దాడి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ మేరకు టీవీ చానెళ్లకు సూచించింది. కొన్ని చానెళ్లు నిబంధనలను ఉల్లంఘించి లైవ్ కవరేజీ అందించాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్లో ఈ రోజు ఉదయం నుంచి ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2015 కేబుల్ నెట్ వర్క్ నిబంధనల ప్రకారం.. భద్రత దళాలు చేపట్టే ఉగ్రవాద నిర్మూలన చర్యలను టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయరాదని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గురుదాస్ పూర్ ఘటనకు సంబంధించి కొన్ని చానెళ్లు నిబంధనలు ఉల్లంఘించాయని పేర్కొంది. -
ఒకే వేదికగా అన్ని చానళ్ల వీక్షణం
ఇండియాన్టీవీ.కామ్ వెబ్సైట్ను ప్రారంభించిన జగన్ సాక్షి, హైదరాబాద్: దేశంలో వివిధ టీవీ చానళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలు ఇకపై ఒకే వేదికగా వీక్షించవచ్చు. ఈ కార్యక్రమాలను అనుసంధానం చేయడానికి రూపొందించిన వెబ్సైట్ ఇండియాన్టీవీ.కామ్(ఐఎన్డీఐఓఎన్టీవీ.సీఓఎం)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవార మిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైట్ చైర్పర్సన్ పద్మజారెడ్డి, మేనే జింగ్ డెరైక్టర్ ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని అనేక టీవీ చానళ్ల ప్రసారాలను తమ వెబ్సైట్లో అనుసంధానం చే యడం దీని ప్రధాన ఉద్దేశమని ప్రకాశ్ పేర్కొన్నారు. దీనిలోకి వెళితే చానళ్లు ప్రసారం చేసిన కార్యక్రమాలన్నింటినీ వీక్షించే అవకాశం ఉంటుందని వివరించారు. రాజకీయ వార్తలు, విశ్లేషణలు, ఆరోగ్యం, సాహిత్యం, భక్తి, వంటలకు సంబంధించిన అంశాలన్నింటినీ ఒకే వేదికగా ఈ వెబ్సైట్ ద్వారా అనుసంధానం చేసి ఒక ప్రత్యేకమైన శైలిలో రూపొందించామని ఆయన పేర్కొన్నారు. -
రేటింగ్ల కోసం రేప్లకు ప్రచారం!
కర్ణాటక హోంమంత్రి జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీజేపీ ధ్వజం బెంగళూరు: టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగ్ల కోసం అత్యాచారాల ఘటనలకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్ వ్యాఖ్యానించటంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. హోంమంత్రి మీడియాపై నెపం వేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విధులు సక్రమంగా నిర్వర్తించటం చేతకాకుంటే పదవి నుంచి తప్పుకోవాలని జార్జ్కు సూచించింది. ‘మీడియాపై నిందలేసి ఆయన తప్పించుకోవాలని భావిస్తున్నారు. అసలు రేప్ ఘటనలు వెలుగులోకి రావటానికి చాలావరకు మీడియా కృషే కారణం’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప గురువారం బెంగళూరులో చెప్పారు. హోంమంత్రి మాటలు ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమని య డ్యూరప్ప తెలిపారు. అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని ధ్వజమెత్తారు. మీడియాపై బురద చల్లటం సరికాదని మాజీ సీఎం, బీజేపీ నేత జగదీష్ షెట్టర్ సూచించారు. హోంమంత్రి వ్యాఖ్యల గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఎలాంటి సందర్భంలో ఆయన ఈ ప్రకటన చేశారో వివరణ కనుక్కుంటానని చెప్పారు. బెంగళూరు పాఠశాలల్లో ఇటీవల చిన్నారులపై తరచూ లైంగిక దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో జార్జ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీకు ఇలాంటి వార్తలే కావాలి. టీఆర్పీ పెంచుకునేందుకే వీటిని చూపుతున్నారు. మంచి వార్తలు చూపితే బాగుంటుంది’ అని జార్జ్ మీడియాను ఉద్దేశించి బుధవారం పేర్కొన్నారు. -
టెలివిజన్ ఛానెల్లను అభినందించిన మోడీ!
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినం తర్వాత వీధుల్లో పేరుకు పోయిన చెత్తపై ప్రత్యేక కథనాల్ని ప్రసారం చేసిన టెలివిజన్ చానెల్లను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. పరిశుభ్రత ఆవశ్యకతను తెలిపే కథనాలు ప్రసారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని అన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి టెలివిజన్ ప్రసారాలు ఉపయోగపడుతాయని మోడీ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దీపావళి పండగ తర్వాత చెత్త చెదారాన్ని తొలగించడానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పండగ తర్వాత వీధుల్లో చెత్త పేరుకుపోవడాన్ని టెలివిజన్ చానెల్లు ప్రసారం చేశాయి. పరిశ్రుభత అవగాహన కల్పించడానికి టెలివిజన్ చానెల్లు చేసిన కృషి ప్రశసించదగినది అని ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి అక్టోబర్ 2 తేదిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. I saw several TV channels showing dirt left behind after crackers. I congratulate them for spreading awareness on importance of cleanliness — Narendra Modi (@narendramodi) October 24, 2014 -
యూకే,యూరప్లో యప్ టీవీ... సన్ నెట్వర్క్
హైదరాబాద్ : యూకే, యూరప్లలో సన్ టీవీ నెట్వర్క్ చానల్స్ అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్లో అగ్రగామిగా ఉంటూ, ప్రపంచవ్యాప్తంగా కూడా వీక్షకులకు అత్యున్నత స్థాయి కంటెంట్ను అందించేందుకు కొనసాగిస్తున్న ప్రయాణంలోభాగంగా యప్ టీవీ ప్రతిష్టాత్మక సన్ నెట్వర్క్కు చెందిన ప్రజాదరణ పొందిన చానల్స్ను యూకే, యూపరప్లోని వీక్షకుల కోసం ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నెట్పై భారతీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లను పొందగలిగేలా చేయడం లక్ష్యంగా యప్ టీవీ ప్రస్తుతం అత్యుత్తమ నెట్వర్క్ ఆఫర్లను ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో యూకే, యూరప్ అంతటా ఉన్న వీక్షకుల కోసం అందిస్తోంది. ఈ సందర్భంగా యప్ టీవీ సీఈఓ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ ఆసియాకు చెందిన అతిపెద్ద, అత్యంత అభిమానపాత్రమైన టెలివిజన్ నెట్వర్క్లలో సన్ టీవీ నెట్వర్క్ కూడా ఉందని, భారతీయ వీక్షకులు అత్యత్తమంగా భావించే చానళ్లను ఇప్పుడు యూకే, యూరప్ అంతటా అందించటం ఆనంద దాయకమన్నారు. ఆసియాకు చెందిన అమిత ప్రజాదరణ గల సన్ టీవీ నెట్వర్క్ దేశవ్యాప్తంగా వివిధ రకాల టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు బహుభాషల్లో కలిగి ఉంది. సన్ టీవీ నెట్ వర్క్ సోప్ ఒపెరాలు, గేమ్ షోలు, మూవీలు, కామెడీ, వార్తా ప్రసారాలు, వినోద కార్యక్రమాలతో సహా విస్తృత శ్రేణి షోలను ప్రసారం చేస్తోంది. యప్ టీవీ దక్షిణాసియా కంటెంట్, లైవ్ టీవీ, క్యాచ్ అప్ టీవీ, ఆన్ డిమాండ్ మూవీ సొల్యూషన్స్కు సంబంధించి యప్ టీవీ ప్రపంచపు అగ్రగామి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కంటెంట్ ప్లేయర్గా ఎదిగింది. జార్జియాలోని అట్లాంట ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. యప్ టీవీ 200కు పైగా టీవీ చానళ్లు, 4500 వీడియోలు, అపరిమిత మూవీలు, లైవ్ ఈవెంట్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది. -
భూకంపం వదంతులతో జనం జాగారం
సంగారెడ్డి/ నిజామాబాద్: ‘భూకంపం వస్తోంది.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ప్రాణాలు రక్షించుకోండి’ అని బంధువుల నుంచి ఫోన్లు రావడంతో జనం ఆందోళన చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక మొదలైన కలకలం ఉదయం ఆరు గంటల దాకా సాగింది. జనం భయంతో రోడ్లపైకి వచ్చారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పుకార్లు వ్యాపించాయి. నిజా మాబాద్ వాసులకు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి భూకంపం వదంతులపై ఫోన్లు వచ్చాయి. పలు టీవీ చానళ్లలో భూకంపంపై వదంతులు వ్యాపించినట్లు స్క్రోలింగ్లు కూడా వచ్చాయి. చివరికి వదంతులేనని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
భవిష్యత్తును తెలుసుకునేందుకు.. ఆస్ట్రాలజీ
అప్కమింగ్ కెరీర్ : తమ స్థితిగతులను, భవిష్యత్తును తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది విశ్వసించే ప్రాచీన విధానం.. జ్యోతిష్యం లేదా జోస్యం(ఆస్ట్రాలజీ). జీవితంలో జరిగిపోయిన జరుగుతున్న, జరగబోయే విషయాలను జననకాలం, గ్రహస్థితిని బట్టి చెప్పడాన్నే జ్యోతిష్యం అంటున్నారు. ఇది హిందూ ధర్మ శాస్త్రం. ఆరు వేదాంగాల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ జనాదరణ పొందుతున్న ప్రాచీన శాస్త్రాల్లో జ్యోతిష్యం కూడా ఉంది. హస్త సాముద్రికం, గోచారం, నాడీ జోస్యం, న్యూమరాలజీ మొదలైన వాటిని జ్యోతిష్యంలో భాగంగా పరిగణిస్తున్నారు. జ్యోతిష్యానికి ఆదరణ పెరుగుతుండడంతో యువత దీన్ని కెరీర్గా ఎంచుకొనేందుకు ఆసక్తి చూపుతోంది. టీవీ ఛానళ్లలోనూ అవకాశాలు ఆధునిక కాలంలో జ్యోతిష్యం అనేది మంచి ఆదాయాన్ని అందించే ఆకర్షణీయ మైన కెరీర్గా మారింది. ప్రస్తుతం ఆస్ట్రాలజిస్టులకు మంచి డిమాండ్ ఉంది. తమ ఆర్థిక, సామాజిక పరిస్థితిని మార్చుకోవాలనుకునేవారు జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. వారి సలహాల మేరకు నడుచుకుంటున్నారు. నూతన కార్యాలను చేపట్టడా నికి శుభ ముహూర్తాల కోసం ఆస్ట్రాలజర్ల సూచనలు తీసుకుంటున్నారు. ఇక టీవీ ఛానళ్లలోనూ ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఉదయం వారఫలాల కార్యక్రమాల్లో ఆస్ట్రాలజర్లు పాల్గొంటున్నారు. ఇటీవలి కాలంలో కంప్యూటర్ జ్యోతిష్యానికి గిరాకీ పెరిగింది. ఆస్ట్రాలజర్గా ప్రతిభను మెరుగుపర్చుకుంటే అధిక ఆదాయాన్ని ఆర్జించొచ్చు. వీలును బట్టి పార్ట్టైమ్గా, ఫుల్టైమ్గా పనిచేసుకోవచ్చు. ఆస్ట్రాలజర్గా గుర్తింపు తెచ్చుకోవాలంటే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. క్లయింట్లకు అర్థమయ్యేలా చెప్పగలిగే నేర్పు అవసరం. మంచి కౌన్సెలర్కు ఉండే లక్షణాలు ఉండాలి. అర్హతలు: మనదేశంలో ఎన్నో విద్యాసంస్థలు ఆస్ట్రాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వీటిలో చేరొచ్చు. వేతనాలు: ఆస్ట్రాలజర్లు తమ నైపుణ్యాలను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో నెలకు రూ.10 వేలకు తక్కువ కాకుండా ఆదాయం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవాన్ని బట్టి అధిక ఆదాయం ఆర్జించొచ్చు. నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే జ్యోతిష్యులు మనదేశంలో ఉన్నారు. ఆస్ట్రాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వెబ్సైట్: http://teluguuniversity.ac.in జ్యోతిష్యశాస్త్రానికి ఆదరణ భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు సైన్స్తో ముడిపడినవే అనేది వాస్తవం. ఇప్పటి పరిశోధనల్లోనూ అదే నిర్ధారణ అవుతోంది. పాశ్చాత్య జ్యోతిష్యంతో పోల్చితే వేదిక్ ఆస్ట్రాలజీనే అధికశాతం విశ్వసిస్తున్నారు. జీవనస్థితి గతులను తెలుసుకోవడానికే కాకుండా స్టాక్మార్కెట్లలోనూ ఆస్ట్రాలజర్లను నియమించుకుంటున్నారు. అయితే దీన్ని మూఢ నమ్మకంగా కాకుండా శాస్త్రంగా భావించినప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. గతంతో పోల్చితే ప్రస్తుతం ఈ సబ్జెక్టుకు క్రేజ్ పెరిగింది. పలు విద్యాసంస్థలు ఆస్ట్రాలజీలో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వేదిక ఆస్ట్రాలజీలో భారతీయులకు విపరీతమైన డిమాండ్ ఉంది. విదేశాల్లో 5 నిమిషాలకు 10 డాలర్లు తీసుకుంటారు. మొబైల్, టీవీ ఛానెల్స్, ఆన్లైన్ విభాగాల్లో అవకాశాలు అనేకం. విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రిడెక్షన్ విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. -డాక్టర్ సి.వి.బి.సుబ్రహ్మణ్యం, హెడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్, తెలుగు విశ్వవిద్యాలయం -
టీవీక్షణం: వాళ్లకు ప్రమాదం... మనకు వినోదం
సాహసాలు చేసేవాళ్లకి కష్టమేమో గానీ... చూసేవాళ్లకి మహా సరదాగా ఉంటుంది. ఈ విషయం తెలుసు కనుకనే టీవీ చానెళ్లు సాహసోపేత కార్యక్రమాలకు తెర తీశాయి. మన తెలుగు చానెళ్లలో ఇలాంటి కార్యక్రమాలు ఉండవు కానీ... ఆంగ్ల చానెళ్లు పెడితే మాత్రం బోలెడు కనిపిస్తాయి. డిస్కవరీ, యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రాఫిక్ చానెళ్లు చూసేవాళ్లందరికీ అడ్వెంచరస్ కార్యక్రమాల గురించి చెప్పాల్సిన పని లేదు. రకరకాల సాహసకృత్యాలు, విచిత్రమైన విన్యాసాలు, వింతలు, విశేషాలు... ఎంజాయ్ చేయాలే కానీ ఎంటర్టైన్మెంట్కి కొదువ ఉండదు. అడవిలో తప్పిపోతే బయటకు రావడం ఎలా, బయటకు వచ్చేవరకూ బతకడం ఎలా, నదుల్ని దాటడం ఎలా, కొండల్ని ఎక్కడం ఎలా, నిప్పు రాజేయడం ఎలా... ఇలాంటి షోలు కొన్ని. పాముల్ని పట్టడం ఎలా, మొసళ్లను లొంగదీయడం ఎలా, క్రూరమృగాలను మచ్చిక చేసుకోవడం ఎలా... ఈ తరహా షోలు కొన్ని. ఇంకో రకం కూడా ఉంది. కంటికి కనిపించేవాటితో కాదు... కనిపించని దెయ్యాలతో షోలు చేస్తుంటారు. అంటే... ఎక్కడైనా దెయ్యం ఉందని తెలిస్తే అక్కడికెళ్లి జరిగే సంఘటనల్ని చిత్రీకరించడం, దెయ్యం ఉందా లేదా అని పరిశోధించడం వంటివి చేస్తుంటారు. ప్రేక్షకులకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని చెబుతుంటారు నిర్వాహకులు. వారికి ప్రమాదమైనా మనకు వినోదాన్ని ఇవ్వడం ముఖ్యమనుకుంటామని కూడా చెబుతుంటారు. ఒక రకంగా అది నిజమే కావచ్చు. విష జంతువులను లొంగదీయడంలో సిద్ధహస్తుడైన స్టీవ్ వండర్స్... ఓ విషజీవి కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు. భర్తతో పాటు ‘మ్యాన్ ఉమన్ వైల్డ్’ షోలో నిర్మానుష్య ప్రదేశాల్లో సంచరించే రూత్... అలాస్కాలో మంచు కొండల్లో మనలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇలాంటి వాటన్నిటినీ వాళ్లు అధిగమించి కార్యక్రమాలను రక్తి కట్టిస్తుంటారు. అయితే... వాటిని ప్రేక్షకులు నిజంగా ఎంజాయ్ చేస్తున్నారా?! కచ్చితంగా చేస్తున్నారు. లేదంటే ఇన్ని రకాల కార్యక్రమాలు ఎలా పుట్టుకొస్తాయి? మ్యాన్ వర్సెస్ వైల్డ్, మ్యాన్ హంట్, ఘోస్ట్ అడ్వెంచరర్స్, ఎక్స్పీడిషన్ గ్రిజ్జీ, డ్యూయల్ సర్వైవల్, బియాండ్ ద డివైడ్... ఇలా ఎన్నో. విష ప్రాణుల్ని చూసి ముఖం తిప్పుకునేవాళ్లున్నా, క్రూరమృగాలను చూసి కంగారుపడేవాళ్లున్నా, దెయ్యాలంటే భయపడి ముసుగు తన్నేవాళ్లున్నా ఆ ప్రోగ్రాములు విజయవంతంగానే సాగిపోతున్నాయి. టీఆర్పీ రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి! -
‘టీవీ చానళ్ల వల్లే రేప్లు’
న్యూఢిల్లీ/లక్నో:ఉత్తరప్రదేశ్లో పెరిగి పోతున్న అత్యాచార ఘటనలపై ఆ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు తలా తోకా లేని వాదనలు చేస్తున్నారు. అసలు రేప్లు పెరిగిపోవడానికి టీవీ చానళ్లే కారణమని వాదిస్తున్నారు. కొందరు విలేకరులు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ముందు బదౌన్ దారుణాన్ని ప్రస్తావించగా.. ‘మీరు మీ పని చేసుకోండి.. మేం మా పని చేసుకుంటాం..’ అంటూ రుసరుసలాడారు. సీఎం అఖిలేష్ సైతం బాధ్యతారహితంగా మాట్లాడారు. గూగుల్లో చూస్తే ఇలాంటి సంఘటనలు దేశమంతా కనిపిస్తాయన్నారు. చానళ్ల కార్యక్రమాల్లో అశ్లీలత, హింస పెరిగిపోవడం వల్లే ఘోరాలు జరుగుతున్నాయని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు. -
అమ్మవారి సన్నిధిలో ఆధిపత్య పోరు
అందరూ కలసికట్టుగా ఉంటేనే ఇంటి నిర్వహణ అయినా, ఆలయ బాధ్యతలయినా సక్రమంగా ఉంటాయి. ఎవరికి వారు ఆధిపత్యానికి ప్రయత్నిస్తే నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. నలుగురిలో నవ్వులపాలవుతారు. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఇదే జరుగుతోంది. అర్చకులు, సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సింది పోయి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. దీంతో ఆలయ పాలన గాడి తప్పింది. ఫలితంగా అమ్మవారి లక్ష్మీకాసుల హారం మూడు రోజులపాటు మాయమై టీటీడీ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసింది. ఇప్పటికైనా వీరంతా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు వదిలి, అమ్మవారి సేవకు తమ సమయాన్ని వెచ్చిస్తే ఏ హారాలూ పోవు.. భక్తుల మనోభావాలూ దెబ్బతినవు! తిరుచానూరు, న్యూస్లైన్ : పద్మావతి అమ్మవారి ఆలయంలో అధికారులు, అర్చకులు, విజిలెన్స్ సిబ్బంది మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. టీటీడీలో తిరుమల శ్రీవారి ఆలయం తరువాత అంత ప్రాశస్త్యం ఉన్నది తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికే. ఈ ఆలయంలో తమదే పైచేయిగా ఉండాలన్నదే వీరి ఆధిపత్య పోరుకు కారణం. కొంతకాలంగా ఈ మూడు వర్గాల మధ్య సఖ్యత కొరవడింది. సమన్వయం లేకపోవడంతో అమ్మవారి కైంకర్యాల్లోనూ, ఇతర వ్యవహారాల్లోనూ పొరపాట్లు దొర్లుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అమ్మవారి లక్ష్మీహారం మాయమవడం.. మూడురోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షమవడం అంతా అమోమయంగా ఉంది. సాధారణంగా రెండు మూడు గ్రాముల బంగారు నగ కనిపిం చకుండా పోతేనే ఇల్లంతా వెతుకుతాం. ఊర్లోని వారందరికీ చెబుతాం. అదే 217 గ్రాముల బరువున్న లక్ష్మీకాసుల హారం పోతే! ఎంత కంగారు.. ఎంత భయం! ఎంతగా వెతుకుతాం.. ఎంతమందికి చెబుతాం! తిరుచానూరు ఆలయంలో మాత్రం అర్చకులు, అధికారులు ఈ వ్యవహారాన్ని మూడు రోజులు రహస్యంగా ఉంచారు. మంగళవారం హారం మాయమైతే గురువారం ఈ విషయం బయటకు పొక్కింది. పలు టీవీ చానళ్లలో ప్రసారం అయింది. దీంతో హారం శుక్రవారం ఆల యంలో ప్రత్యక్షమయింది. నీటి తూములో ఉందని, ఎక్కడికీ పోలేదని అర్చకులు తెలి పారు. పవిత్రమైన లక్ష్మీకాసుల హారం గర్భగుడిలోని నీటి తూములో పడి ఉండడం సందేహానికి తావిస్తోంది. ఇంత పెద్ద హారం కిందపడి ఉండడాన్ని అర్చకపరిచారకులు ఎందుకు గుర్తించలేకపోయారు. విలువైన లక్ష్మీకాసుల హారం కనిపించకపోవడానికి కారణాలు ఏమిటి, దీని వెనుక ఎవరి పాత్ర అయినా ఉందా, ఈ ఘటనకు బాధ్యులెవరు అనే కోణంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఎంత నిర్లక్ష్యమో.. కొన్నేళ్ల క్రితం తిరుచానూరు ఆలయంలో కీలక హోదాలో విధులు నిర్వహించిన ఓ అధికారి ఏకంగా అమ్మవారి నగలను ఎటువంటి భద్రత లేకుండా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఇది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పనితీరు సరిగా లేకపోవడంతోనే ఆ అధికారి విలువైన బంగారు ఆభరణాలను ఎటువంటి భద్రత లేకుండా టీటీడీ జ్యుయెలరీ విభాగానికి తీసుకెళ్లారని విచారణలో తేలింది. ఈ వ్యవహారంతో విజిలెన్స్ అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ చర్యతో అధికారులు, అర్చకులు, విజిలెన్స్ అధికారుల మధ్య విభేదాలు చోటుచేసున్నాయి. గతంలో తాళం చెవి మాయం.. సుమారు ఏడాది క్రితం అమ్మవారి ఆలయంలోని పరకామణికి సంబంధించిన తాళం చెవులు కనిపించకుండా పోయాయి. సిబ్బంది పొరపాటు, నిర్లక్ష్యం కారణంగా తాళంచెవి అమ్మవారి హుండీలో పడిపోయింది. హుండీలోని డ బ్బులు లెక్కించే సమయంలో తాళాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఓ ఉద్యోగిపై వేటుపడింది. ఇప్పటికైనా ఆలయ అధికారులు, అర్చకులు, విజిలెన్స్ సిబ్బంది ఆధిపత్య పోరుకు స్వస్తి పలికి అమ్మవారి ఆలయం, టీటీడీ ప్రతిష్టకు భంగం కలగకుండా వ్యవహరించాలని అటు స్థానికులు, ఇటు భక్తులు కోరుతున్నారు. -
టీవీ చానళ్లతో పోటీ పడనున్న ఆకాశవాణి
న్యూఢిల్లీ : సాధారణ ఎన్నికల వేళ టెలివిజన్ చానళ్లలో పోటీపడేందుకు ఆకాశవాణి సిద్ధమవుతోంది. టీవీ చానళ్ల తరహాలోనే ఎన్నికల వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు,ఫలితాలు, ట్వీట్లు ప్రసారం చేయనుంది. ఇటీవల ఉత్తరాదిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాలుగు ప్రాంతీయ రేడియో స్టేషన్లను ప్రత్యక్షంగా అనుసంధానం చేయడంతో అద్భుతమైన ఫలితాలను ఏఐఆర్ సాధించింది. దీంతో మాంచి ఊపుమీదున్న ఆకాశవాణి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరింత సమర్థంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం, వార్తలను, విశ్లేషణలను ప్రసారం చేయడంతోపాటు ట్వీట్లను కూడా శ్రోతలకు అందజేయనుంది. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇవన్నీ ప్రారంభిస్తామని ఆకాశవాణి డెరైక్టర్ జనరల్(న్యూస్) అర్చనా దత్తా తెలిపారు. డిసెంబర్ ఎనిమిదిన చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో రేడియో స్టేషన్ల వార్తా విభాగాలను అనుసంధానించి మంచి ఫలితాలు రాబట్టామని ఆమె చెప్పారు. ప్రత్యక్ష ంగా ఫోన్ ఇన్ కార్యక్రమాలు కూడా నిర్వహించామని ఆమె తెలిపారు. టీవీ చానళ్ల వలెనే ప్రత్యక్ష ప్రసారం చేయడంతో శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ఆమె వివరించారు. అందుకే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రయోగాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు అర్చన చెప్పారు. రాజకీయ పరిశీలకులతో చర్చలు, విశ్లేషణలు, వ్యాఖ్యాతలతో ఫలితాల ప్రకటనలు ఉంటాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్షంగా వీటిని ప్రసారం చేస్తామన్నారు. ఆకాశవాణి కరస్పాండెంట్ల ద్వారా, రాజకీయ నాయకుల వ్యాఖ్యానాలు, విశ్లేషకుల అభిప్రాయాలు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తామన్నారు. ఇందుకోసం అనేక వర్క్షాప్లు కూడా నిర్వహిస్తామని ఆమె వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విధానాలు, పనితీరు మార్చుకోవాలని నిర్ణయించామన్నారు. తొలిసారిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే జ్రీవాల్ సీఎన్జీ ధరల పెంపుపై చేసిన ట్వీట్ను ఢిల్లీ ఆకాశవాణిలో ప్రసారం చేసినట్టు ఆమె చెప్పారు. -
కేబుల్ కట్ !
ప్రసారాలకుశ్రీకారం చుట్టింది. రూ.70 నెలసరి అద్దెతో 90 చానళ్లను అరసు కేబుల్ ద్వారా రాష్ట్రంలో అందిస్తూ వస్తున్నారు. అయితే, చెన్నైలో మాత్రం ఈ ప్రసారాలకు తరచూ అవాంతరాలు ఎదురవుతోన్నాయి. తొలుత అనివార్య కారణాలు, ప్రస్తుతం కేంద్రం రూపంలో ఛానళ్ల ప్రసారాలకు బ్రేక్ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేబుల్ టీవీ ప్రసారాల్ని డిజిటల్మయం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ఈ డిజిటలైజేషన్కు గత ఏడాది నవంబర్ వరకు గడువు ఇచ్చారు. అన్ని నగరాలు డిజిటల్మయం కాగా, చెన్నైలో మాత్రం ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా పరిస్థితి మారింది. డిజిటల్ అనుమతి కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నా, ఇంతవరకు అక్కడి నుంచి స్పందన లేదు. దీంతో కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడువు ముగిసినా సాధారణ టెక్నాలజీతోనే ప్రసారాల్ని అందిస్తూ వస్తున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో, కేంద్రం అనుమతి ఇస్తుందో లేదోనన్న వేచి చూసే ధోరణిలో ఉన్న రాష్ట్ర కేబుల్ కార్పొరేషన్కు ట్రాయ్ షాక్ ఇచ్చింది. గడువు ముగిసినా ఇంత వరకు అరసు కేబుల్ చెన్నైలో డిజిటల్మయం కాకపోవడంతో టెలికాం రెగులేటరీ అథారిటీ(ట్రాయ్) రంగంలోకి దిగింది. చెన్నైలోని అరసు కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్వోలతో ట్రాక్ కార్యదర్శి రాజీవ్ అగర్వాల్ రెండు రోజుల క్రితం భేటీ అయ్యారు. డిజిటల్మయం కాకపోవడానికి గల కారణాల్ని మాత్రం ట్రాయ్ పరిగణన లోకి తీసుకోకపోవడం గమనార్హం. డిజిటల్ మయం కానందున చానళ్ల ప్రసారాల్ని నిలుపుదల చేయాలన్న ఆదేశాలను ఇచ్చారు. కేబుల్ ప్రసారాల్ని నిలుపుదల చేయని పక్షంలో జరిమానా లేదా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్న హెచ్చరికను రాజీవ్ జారీ చేయటంతో చెన్నైలో అరసు కేబుల్ ప్రసారాలప సందిగ్ధత నెలకొంది. చెన్నైలో అరసు కేబుల్ ఛానల్ వినియోగదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. కేబుల్ ప్రసారాలు ఆగిపోతాయన్న సమాచారంతో వారిలో ఆందోళన నెలకొంది. అయితే, ప్రసారాల నిలుపుదలకు ఆస్కారం లేదంటూ కేబుల్ కార్పొరేషన్ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. డిజిటల్ మయం అనుమతిని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఇవ్వాల్సి ఉందని, వారు నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే పనులు ఆగాయని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమను చూపుతున్న కేంద్రం, తాజాగా కేబుల్ ప్రసారాలపై కన్నేసినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్మయం అనుమతి వ్యవహారం హైకోర్టులో ఉన్న దృష్ట్యా, ప్రసారాల్ని నిలుపుదల చేసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. డిజిటల్మయం పనులు పూర్తి చేసి ఉన్నామని, కేంద్రం అనుమతి రాగానే, సెట్ ఆఫ్ బాక్సుల్ని పంపిణీ చే యడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ అధికారి పేర్కొన్నారు. కేబుల్ ప్రసారాలు డిజిటల్మయం అనుమతి ఉత్తర్వుల్ని ఇచ్చిన పక్షంలో టీవీ ప్రసారాల బాధ్యతల్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు అవుతుంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే సర్కారు అధికారంలో ఉన్న దృష్ట్యా, ఈ అనుమతిని కేంద్రం ఇచ్చేనా అన్నది వేచి చూడాల్సిందే. -
టీవీక్షణం: వంట.. జీవితాన్నే మార్చేస్తుంది !
వంట... అరవై నాలుగు కళల్లో ఒకటి. కానీ అది దైనందిన కార్యక్రమాల్లో ఒకటిగా ఇన్నాళ్లూ ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే ఓ కళగా నిజమైన గుర్తింపు పొందుతోంది. దానికి కారణం... టీవీ చానెళ్లు. మీ ఇంటి వంట, మా ఊరి వంట, ఘుమఘుమలు, స్వీట్హోమ్ అంటూ పలు రకాల కుకరీ షోలకు తెర తీశాయి మన తెలుగు చానెళ్లు. అయితే జెమిని టీవీలో వస్తోన్న ‘వంటింట్లో వండర్స్’ వీటన్నిటికీ భిన్నమైనది. ఇది వంటల ప్రోగ్రామ్ కాదు... వంటల పోటీ. కాస్త వైవిధ్యంగా ఉండటంతో బాగానే సక్సెస్ అయ్యింది. అయితే ఇది మనకు కొత్తేమో గానీ, ఉత్తరాది వారికి కాదు. ఎందుకంటే అక్కడ ఇలాంటి ఒక పోటీ సంచలనం సృష్టించింది. వంట చేసేది కడుపు నింపుకోవడానికే కాదు, అది జీవితాన్నే మార్చేయగలదు అన్న భావన తీసుకొచ్చింది. కుకరీ షోలకి కొత్త అర్థం చెప్పిన ఆ ప్రోగ్రామ్.. మాస్టర్ చెఫ్! కొందరు పోటీదారులు. అందరూ చక్కగా వండగలిగినవారే. పలు రౌండ్స్లో వారందరి పాక నైపుణ్యాన్నీ పరీక్షిస్తారు. మారుమూల గ్రామాల వంటకాల నుంచి, విదేశాల్లోని స్టార్ హోటళ్లలో లభించే అరుదైన డిషెస్ వరకూ... దేనినైనా చేయాల్సి రావచ్చు. చేస్తేనే గెలుపు. అయితే కొన్నిసార్లు కొందరు బాగా తెలిసిన వంటకాన్ని తయారు చేయడంలో సైతం విఫలమవుతారు. అందుకే వారానికొకరు ఎలిమినేట్ అవుతారు. చివరకు మిగిలినవారు మాస్టర్ చెఫ్ టైటిల్ని గెలుచుకుంటారు. కోటి రూపాయల నగదు, స్టార్ హోటల్లో చెఫ్గా ఉద్యోగం, తమ వంటల్ని పుస్తకంగా ముద్రించుకునే అవకాశంతో పాటు విదేశీయానం తదతర బహుమానాలు వచ్చి విజేత ఒళ్లో వాలతాయి. కలర్స్ చానెల్లో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ ఇప్పటికే మూడు సిరీస్లు పూర్తి చేసుకుంది. పంకజ్ భదోరియా, షిప్రా ఖనా, రిపూదమన్ హాండాలు విజేతలు. మొదటి సిరీస్కి ఒకప్పుడు చెఫ్గా పని చేసిన హీరో అక్షయ్కుమార్తో పాటు చెఫ్ అజయ్ చోప్రా, కునాల్ కపూర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తే... రెండో సిరీస్కి అజయ్, కునాల్లతో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వికాస్ఖన్నా జడ్జిగా వ్యవహరించారు. మూడో సిరీస్కి కునాల్, వికాస్లతో మన దేశ నంబర్వర్ చెఫ్ సంజీవ్ కపూర్ జతకట్టారు. ఇప్పుడు జరుగుతున్న మాస్టర్ చెఫ్ జూనియర్స్ నడుస్తోంది. అనుభవం గల చెఫ్ల ఆధ్వర్వంలో జరగడంతో పాటు, గెస్టులుగా వచ్చే సినీ తారలు ప్రోగ్రామ్కి మరింత క్రేజ్ను తీసు కొచ్చారు. అందుకే దీనికి ప్రాచుర్యం ఎక్కువ. టీఆర్పీ కూడా ఎక్కువే. నిజానికి మాస్టర్ చెఫ్ వెనకాల పెద్ద చరిత్రే ఉంది. 1990లో యూకేకి చెందిన ఫ్రాంక్ రోడమ్ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్కి రూపకల్పన చేశారు. అది విజయవంతం కావడంతో పలు దేశాల చానెళ్లు ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టాయి. ఇప్పుడు మొత్తం ముప్ఫై అయిదు దేశాల్లో ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతోందంటే అర్థం చేసుకోవచ్చు... అది జనాన్ని ఎంతగా ఆకర్షించిందో! ప్రతి దేశంలోనూ ప్రోగ్రామ్ ఫార్మేట్ ఒకటే. లోగో కూడా ఒకటే. ఎలాంటి మార్పులూ లేకుండా, ఇన్ని దేశాల్లో ఒకే విధంగా ప్రదర్శితం కావడం, ఒకే రకమైన క్రేజ్ సంపాదించడం... బహుశా మాస్టర్ చెఫ్కి మాత్రమే చెల్లిందేమో! -
విభజన మనస్తాపంతో రైతు ఆత్మహత్య
కేవీబీపురం, న్యూస్లైన్: రాష్ట్ర విభజన ప్రకటన మ రొకరిని బలిగొంది. పిల్లల భవిష్యత్కు ముప్పు తప్ప దని కలత చెంది మండలంలోని మహదేవపురం లో రైతు కృష్ణయ్య(40) ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు... మహదేవపురానికి చెందిన సన్నకారు రైతు కృష్ణయ్యకు భార్య జయంతి, ఇంటర్ చదువుతున్న కూతురు వాణి, పాలిటెక్నిక్ చదువుతున్న కొడుకు ఉమాపతి ఉన్నారు. రెండెకరాల పొలంలో సరిగా పంటలు పండక, గిట్టుబాటు ధర లేక ఇప్పటికే అప్పుల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయడంతో ఆవేదన చెందాడు. రెండు నెలలుగా జరుగుతున్న సమైక్య ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. ఆదివారం టీవీ చానళ్లలో ‘‘విభజన తప్పదు.. దాన్ని ఎవరూ ఆపలేరు’’ అన్న కేసీఆర్ ప్రసంగాన్ని విని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తీవ్రంగా మదనపడ్డాడు. పొలానికి నీళ్లు కట్టి వస్తానని వెళ్లి పురుగులమందు తాగాడు. తండ్రి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం ఉమాపతి పొలం వద్దకు వెళ్లి చూశాడు. అప్పటికే కృష్ణయ్య మృతిచెందాడు. సమైక్యాంధ్ర కోసం తపిస్తూ తమ తండ్రి చనిపోయాడని, ఇక తమ చదువులు సాగేదెలా అని ఉమాపతి, వాణి ఆవేదన చెందుతున్నారు. తమకు దిక్కెవరని జయంతి విలపిస్తోంది. కాగా సమైక్యాంధ్ర కోసం ఆత్మత్యాగం చేసుకున్న కృష్ణయ్య మృతదేహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గవర కృష్ణయ్య, సర్పంచ్ భారతి, టీడీపీ మండల నాయకులు రామాంజులనాయుడు, తొట్టంబేడు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తెరణి ధనుంజయరెడ్డి, జయరాంరెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు.