vistara
-
హైదరాబాద్ నుంచి విస్తారా విమానాలు!
ఎయిర్ ఇండియాలో విలీనమైనప్పటికీ విస్తారా ఎయిర్వేస్కు చెందిన ఏ320 విమానాల సేవలు కొనసాగనున్నాయి. వీటిని దేశంలోని ఐదు కీలకమైన మెట్రో-టు-మెట్రో రూట్లలో నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ముంబైకి ఈ విమానాలు నడుస్తాయి.ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ మార్గాల్లో ఏ320 విమానాల సేవలు ఉంటాయని, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్లలో ప్రయాణం చేయొచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. ఈ విమాన సర్వీసులు ఏ12 కోడ్తో ప్రారంభమవుతాయని, టికెట్ల బుకింగ్ సమయంలో గమనించాలని సూచించింది.టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ ఈనెల ప్రారంభంలోనే పూర్తయింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 208 విమానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 67 వైడ్ బాడీ విమానాలు ఉన్నాయి. -
విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు
ఢిల్లీ: విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. లండన్-ఢిల్లీ విస్తారా విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రత్తమైన అధికారలు ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్ఫర్టకు పైలట్లు దారి మళ్లించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని విస్తారా ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. STORY | Vistara's Delhi-London flight diverted to Frankfurt after bomb threatREAD : https://t.co/d6PLa4w0GV pic.twitter.com/R1BzJcO2rW— Press Trust of India (@PTI_News) October 19, 2024విమానం మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశాక.. ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తేలిపారు. అనంతరం విమానం లండన్కు బయలుదేరింది. ఇటీవల కాలంలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. కేవలం ఒక వారంలో 15 విమానాలకు ఇలాంటి బెదిరింపులు గమనార్హం. విమానాల టేకాఫ్కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లించారు. -
ఎయిర్ ఇండియాలోకి విస్తారా: ఆ రోజే చివరి ఫ్లైట్
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara).. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలోకి విలీనం కానుంది. 2024 నవంబర్ 11న విస్తారా తన చివరి విమానం నడపనుంది. అంతకంటే ముందు (సెప్టెంబర్ 3) సంస్థ టికెట్ రిజర్వేషన్లను కూడా ఎయిర్ ఇండియా వెబ్సైట్కు మళ్ళించనున్నట్లు సమాచారం. అయితే విమాన ప్రయాణాలు మాత్రం నవంబర్ 11వరకు కొనసాగుతాయి.విస్తారా సంస్థ.. ఎయిర్ ఇండియాలో విలీనం కావడానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింగపూర్ ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంటే ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారాలో.. సింగపూర్ ఎయిర్లైన్స్ 25.1 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ & ఏఐ ప్రిఫిక్స్తో విస్తారా నెట్వర్క్.. విమానాలు కొనసాగుతాయి. విస్తారా సిబ్బంది.. విస్తారా విమానాలను 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా కింద నిర్వహిస్తారు. అయితే సర్వీస్ లెవల్స్, భోజనం, ఇతరత్రా కార్యకలాపాలు ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం ఉంటాయి.ఇప్పటికే విస్తారా ఫ్లైట్ టికెట్ నవంబర్ 11 తరువాతకు బుక్ చేసుకుని ఉంటే.. ఎయిర్ ఇండియాలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రయాణానికి ఏ లోటు లేదు. కానీ మీరు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవచ్చు. -
‘ఫ్రీడమ్’ ఆఫర్.. బస్ టికెట్ ధరతో ఫ్లైట్ జర్నీ
తక్కువ ధరకు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అది కూడా బస్ టికెట్ ధరకే. ఈ సూపర్ ఆఫర్ను టాటా గ్రూప్ ఎయిర్లైన్ కంపెనీ 'విస్తారా' తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకుంటే రూ.1,578లకే ఎంచక్కా ఫ్లైట్ ఎక్కేయచ్చు.ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా నవరాత్రి, దసరా వరకు ప్రయాణించవచ్చు. అయితే దీని కోసం ఆగస్టు 15లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. టాటా గ్రూప్కు చెందిన ఎయిర్లైన్ విస్తారా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ సేల్ను ప్రారంభించింది. ఈ ఆఫర్లో అక్టోబర్ 31 నుంచి ఆగస్టు 15 వరకు చౌకగా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.ఈ మార్గంలో రూ.1578విస్తారా సేల్లో బాగ్డోగ్రా నుంచి డిబ్రూగఢ్కు ప్రయాణించడానికి ఎకానమీ క్లాస్లో ఒకవైపు దేశీయ ఛార్జీ రూ.1,578 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ముంబై నుంచి అహ్మదాబాద్కి ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రారంభ ధర రూ.2,678. ఇక ముంబై నుంచి అహ్మదాబాద్కి బిజినెస్ క్లాస్ ధర రూ.9,978 నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి ఖాట్మండుకు అంతర్జాతీయ విమానానికి ఎకానమీ క్లాస్ ధర రూ.11,978 నుంచి ప్రారంభమవుతుంది. అదే ప్రీమియం ఎకానమీ విభాగంలో ఢిల్లీ నుంచి ఖాట్మండుకు ప్రారంభ ధర రూ.13,978. -
విస్తార కీలక ప్రకటన.. 20 నిమిషాలు ఫ్రీ వై-ఫై
అంతర్జాతీయ విమానాల్లో 20 నిమిషాల ఫ్రీ వై-ఫై అందజేస్తామని విస్తారా ప్రకటించింది. ఈ సర్వీస్ అందిస్తున్న మొదటి భారతీయ విమానయాన సంస్థగా విస్తారా రికార్డ్ క్రియేట్ చేసింది. టాటా-సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్లైన్ అన్ని క్యాబిన్లలో ప్రయాణీకులకు 20 నిమిషాల వై-ఫై యాక్సెస్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.ఈ ఫ్రీ వై-ఫై సర్వీస్ బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్, ఎయిర్బస్ ఏ321 నియో విమానాల్లో మాత్రమే లభించనున్నాయి. ఈ వై-ఫై మరింత సమయం కావాలనుకున్నప్పుడు ప్లాన్స్ పొందాల్సి ఉంటుంది. విస్టారా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఈ సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, దీపక్ రజావత్ వెల్లడించారు.బిజినెస్ క్లాస్, ప్లాటినం క్లబ్ విస్తార సభ్యులకు మరో 50 ఎంబీ డేటాను పొందవచ్చు. అన్లిమిటెడ్ వాట్సప్, ఫేస్బుక్ సేవల కోసం రూ. 372.74 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా రూ.1577.54 + జీఎస్టీ చెల్లిస్తే వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్లలో అన్లిమిటెడ్ డేటా యాక్సెస్ లభిస్తుంది. రూ.2707.05 + జీఎస్టీ చెల్లిస్తే అన్లిమిటెడ్ డేటా పొందవచ్చు.Don’t miss out on important updates even at 35000 ft. ! Get 20 minutes of complimentary in-flight Wi-Fi, a first in Indian Aviation. Now you can purchase the selected plans using Indian credit/debit card in addition to internationally issued credit cards. pic.twitter.com/NTYCOJFY5N— Vistara (@airvistara) July 27, 2024 -
వీఆర్ఎస్, వీఎస్ఎస్ ప్రకటించిన ఎయిరిండియా
ఎయిరిండియా స్వచ్ఛంద విభజన పథకం(వాలెంటరీ సెపరేషన్ స్కీమ్)తో పాటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) రూపొందించింది. కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని, ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి వీఎస్ఎస్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ పథకాలను నాన్ ఫ్లైయింగ్ పర్మనెంట్ స్టాఫ్ కోసం తయారుచేసినట్లు చెప్పింది. అయితే వీటికి సంబంధించిన నిర్దిష్ట వివరాలను మాత్రం వెల్లడించలేదు.ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేసిన తర్వాత శాశ్వత ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. విస్తారా ఎయిర్లైన్స్ టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి పథకాలు రావడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో రెండు ఎయిర్లైన్స్లోని దాదాపు 600 మంది ఉద్యోగులపై ఈ విలీనం ప్రభావం చూపుతుందని కొన్ని సంస్థలు నివేదికలు తెలిపాయి. ఎయిరిండియా, విస్తారాలో కలిపి సుమారు 23,000 మంది ఉద్యోగులు ఉన్నారు.ఇదీ చదవండి: కంపెనీలు వెళ్లిపోతాయ్..!విలీన ప్రక్రియలో భాగంగా ఫిట్మెంట్ విధానాలు, ఉద్యోగ స్థానాల కేటాయింపు పూర్తయిన తర్వాత విస్తారా కూడా ఇలాంటి స్కీమ్లను ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విస్తారా సింగపూర్ ఎయిర్లైన్స్, టాటా గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్గా ఉంది. రెండు సంస్థల విలీనం పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1 శాతం వాటా దక్కుతుంది. -
ఎయిర్లైన్స్ విలీనం.. 700 మంది తొలగింపు!!
ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ త్వరలో కలిసిపోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థల విలీనం వందలాది మంది ఉద్యోగాలపై మీదకు వచ్చింది. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ రెండింటిలో కనీసం 700 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారు. ఇద్దరు అధికారుల ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దీని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.అయితే రిటైర్మెంట్కు చేరుకుంటున్న ఉద్యోగులు, నిర్ణీత కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు ఇందులో ఉండరని ఆ ఇద్దరు అధికారులు తెలిపారు. హెచ్టీ లైవ్ నివేదిక ప్రకారం.. సుమారు 18,000 మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియా విస్తారాతో విలీనం కానుంది. ఇందుకోసం దాదాపు 6000 మంది విస్తారా ఉద్యోగులను విలీన యూనిట్లో చేయాల్సి ఉంటుంది.“అంతర్గత ఫిట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో తొలగింపుల ప్రకటన ఉంటుంది. స్థిర-కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు, త్వరలో పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు మినహా ఎయిర్ ఇండియా, విస్తారా రెండింటిలో దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది" ఒక అధికారి తెలిపారు.అదే సమయంలో పనితీరు ఆధారంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు మరో అధికారి తెలిపారు. "నాన్-ఫ్లైయింగ్ ఫంక్షన్లలోని ఉద్యోగులకు సంస్థాగత అవసరాలు, వ్యక్తిగత యోగ్యత ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు ఉంటుంది" అని మూడో అధికారి చెప్పారు. -
పైలెట్ల కొరత.. ఎయిర్ విస్తారా కీలక నిర్ణయం
ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఎయిర్ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరత కారణంగా విమాన కార్యకలాపాల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. విస్తారా రోజుకు దాదాపు 350 విమానాలను నడుపుతోంది. వాటిల్లో 25-30 విమానాల వరకు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. విస్తారా విమానాల రద్దు కారణంగా ముఖ్యంగా మెట్రో మార్గాల్లో ఛార్జీలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ-ముంబై రూట్లో విస్తారా రోజుకు దాదాపు 18 విమానాలను నడుపుతుండగా..ఇండిగో 19 విమానాలను నడుపుతోంది. ‘మేము మా కార్యకలాపాలను రోజుకు సుమారు 25-30 విమానాలు, అంటే 10శాతం సేవల్ని నిలిపివేస్తున్నాం. ఫిబ్రవరి 2024 చివరి వరకు ఎన్ని విమానాలు నడిపామో.. ఇక నుంచి అన్నే విమానాల్లో ప్రయాణికులకు సేవలందించాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో ఎయిర్ విస్తారా తెలిపింది. ఈ సందర్భంగా విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ మాట్లాడుతూ..మా సంస్థ పైలట్లను ఎక్కువగా వినియోగించుకుంటోందని, అంతరాయం కారణంగా సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. ఇకపై ఎక్కువ మంది పైలట్లను నియమించుకోవడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. -
పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు!
పైలట్ల సమస్యల పరిష్కారానికి ఇటీవల విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు రాజీనామాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత 2-3 రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే.. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
పైలట్ల కొరత.. సమస్య పరిష్కారానికి చర్చలు!
పైలట్ల సమస్యల పరిష్కారానికి ఇటీవల విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు రాజీనామాలకు తెరతీసిన సంగతి తెలిసిందే.తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత 2-3 రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే..ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలో మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కంపెనీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ప్రముఖ సంస్థ
విస్తారా ఎయిర్లైన్స్ తాత్కాలికంగా తన విమాన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. పైలెట్లు, ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది. వేతన సవరణకు వ్యతిరేకంగా వీరంతా అనారోగ్య సెలవులో ఉండడంతో, సోమవారం దాదాపు 50 సర్వీసులు రద్దు అయినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం ఈ సంఖ్య 70కి చేరొచ్చని అంచనా. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పాటు పలు కారణాల వల్ల విమానాల రద్దు, ప్రయాణాల్లో ఆలస్యం చోటు చేసుకుంటోందని విస్తారా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. విమాన సర్వీసుల రద్దుపై ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు తెలిపింది. సర్వీసుల రద్దుకు కారణాలను వెల్లడించలేదు. త్వరలోనే సాధారణ స్థాయిలో కార్యకలాపాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. రద్దు అయిన సర్వీసులకు చెందిన ప్రయాణికులకు ఛార్జీలు రీఫండ్ చేస్తామని చెప్పారు. విస్తారా ఎయిర్ ఇండియాతో విలీనానికి ముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుండడం గమనార్హం. విస్తారా 300 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతుంది. ప్రయాణాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్న ప్యాసింజర్లను తమ గమ్యస్థానం చేర్చడానికి వైడ్-బాడీ డ్రీమ్లైనర్లు, ఎయిర్బస్ A321లను వాడుతున్న కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: యాపిల్ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..? గత 2-3 రోజులుగా ప్యాసింజర్ల ప్రయాణాల్లో మరింత ఆలస్యం అవుతుందని, సోషల్ మీడియాలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. దానికితోడు సోమవారం ప్రధాని మోదీ ముంబై నగర పర్యటన ఉండడంతో వీవీఐపీలు రాకపోకలు సాగించారు. దాంతో విస్తారాతోపాటు ఇతర సంస్థల విమానాలు కూడా సోమవారం 30-40 నిమిషాలు ఆలస్యం అయ్యాయి. -
ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ సంస్థ
విస్తారా ఎయిర్లైన్స్ తాత్కాలికంగా తన విమాన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. పైలెట్లు, ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది. వేతన సవరణకు వ్యతిరేకంగా వీరంతా అనారోగ్య సెలవులో ఉండడంతో, సోమవారం దాదాపు 50 సర్వీసులు రద్దు అయినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం ఈ సంఖ్య 70కి చేరొచ్చని అంచనా. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పాటు పలు కారణాల వల్ల విమానాల రద్దు, ప్రయాణాల్లో ఆలస్యం చోటు చేసుకుంటోందని విస్తారా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. విమాన సర్వీసుల రద్దుపై ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు తెలిపింది. సర్వీసుల రద్దుకు కారణాలను వెల్లడించలేదు. త్వరలోనే సాధారణ స్థాయిలో కార్యకలాపాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. రద్దు అయిన సర్వీసులకు చెందిన ప్రయాణికులకు ఛార్జీలు రీఫండ్ చేస్తామని చెప్పారు. విస్తారా ఎయిర్ ఇండియాతో విలీనానికి ముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుండడం గమనార్హం. విస్తారా 300 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతుంది. ప్రయాణాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్న ప్యాసింజర్లను తమ గమ్యస్థానం చేర్చడానికి వైడ్-బాడీ డ్రీమ్లైనర్లు, ఎయిర్బస్ A321లను వాడుతున్న కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: యాపిల్ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..?గత 2-3 రోజులుగా ప్యాసింజర్ల ప్రయాణాల్లో మరింత ఆలస్యం అవుతుందని, సోషల్ మీడియాలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. దానికితోడు సోమవారం ప్రధాని మోదీ ముంబై నగర పర్యటన ఉండడంతో వీవీఐపీలు రాకపోకలు సాగించారు. దాంతో విస్తారాతోపాటు ఇతర సంస్థల విమానాలు కూడా సోమవారం 30-40 నిమిషాలు ఆలస్యం అయ్యాయి. -
ఇదేమైనా బావుందా? కేంద్రమంత్రి సంచలన ట్వీట్: విస్తారా రియాక్షన్
విస్తారా ఎయిర్లైన్స్లో తన కెదురైన అనుభవంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక సంచలన ట్వీట్ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సర్వీసు, క్యాబిన్ పరిస్థితి నచ్చలేదు అంటూ సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇండియా అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడుతున్న తరుణంలో ప్రయాణీకులకు ఇలా స్వాగతం చెప్పడం ఏమీ బాగాలేదు అంటూ విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. యూకేలో జరిగిన ఏఐ సేఫ్టీ సమ్మిట్ తర్వాత ఢిల్లీకి తిరుగి వస్తుండగా కేంద్ర మంత్రికి ఈ అనుభవం ఎదురైంది. లండన్ నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణానికి ఆయన విస్తారా విమానాన్ని ఎంచుకున్నారు.ప్రయణా సాఫీగా సాగినప్పటికీ, కానీ ఇదే బాలేదు అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. (ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?) ఈ క్రమంలో విస్తారా ఎయిర్క్రాఫ్ట్ క్యాబిన్లో పడివున్న వాటర్ బాటిల్స్, మిగిలిపోయిన ఆహార పదార్థాల ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేశారు. ప్రయాణికులకు స్వాగతం చెప్పే తీరు బాలేదు అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. దీనికి డిస్ అప్పాయింటెడ్ హ్యాష్ట్యాగ్ కూడా చేశారు. దీంతో ఇది వైరల్గామారింది. ఒక్కో యూజర్ తమకెదురైనా అనుభవాలను ఒక్కొక్కటిగా షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో స్పందించిన విస్తారా ఒక ప్రకటన జారీ చేసింది. (పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం) విస్తారా ప్రకటన: పోస్ట్ వైరల్ కావడంతో విస్తారా స్పందించింది. హాయ్ రాజీవ్ జీ మీ కెదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ట్వీట్ చేసింది. ప్రతి టచ్ పాయింట్ వద్ద కస్టమర్లకు చక్కటి అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. జరిగిన ఘటన తమ ప్రామాణిక శుభ్రతా విధానాలకు అనుగుణంగా లేదనేది అర్థ మైందనీ, దీనిని సీరియస్గా పరిగణించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. భవిష్యత్తులో మెరుగైన అనుభవాన్ని అందించడానికి బద్ధులై ఉన్నామంటూ వివరణ ఇచ్చింది. So decided to fly @airvistara from London to Delhi last nite. Nice new clean 787 aircraft and very smooth flight - but saddened by service & state of cabin -food & litter not the best way to welcome visitors to India or compete wth other global carriers 😥😥🤷🏻♂️#Disappointed… pic.twitter.com/LSsVDPOym5 — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 3, 2023 -
ఎయిరిండియా-విస్తారా విలీనం: సీసీఐ షోకాజ్ నోటీసులు!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా–విస్తారా విలీన ప్రతిపాదనపై కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. దీనిపై సంబంధిత పార్టీలకు సీసీఐ షోకాజ్ నోటీసులు పంపినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు సంస్థల విలీన ప్రతిపాదన భారత్ విమానయాన రంగానికి ప్రతికూలంగా ఉంటుందని, ఈ రంగంపై వీటికి గుత్తాధిపత్యం లభిస్తుందని వస్తున్న విమర్శలపై ఎందుకు విచారణ చేపట్టకూడదో తెలియజేయాలని ఎయిర్ ఇండియాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఫెయిర్–ట్రేడ్ రెగ్యులేటర్ పేర్కొన్నట్లు సమాచారం. ఒప్పందం తీరిది... విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్లైన్స్కు విస్తారాలో 49 శాతం వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51 శాతంగా ఉంది. ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్లైన్స్ కొనుగోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గత ఏడాది నవంబర్లో టాటా గ్రూప్ ప్రకటించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ విమానయాన రంగంలో ఈ ఒప్పందం అతిపెద్ద ఏకీకరణ ఒప్పందంగా సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. ఈ ఒప్పందం సాకారమైతే, దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్గా అలాగే ఇండిగో తర్వాత రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్గా ఎయిర్ ఇండియా రూపాంతరం చెందుతుంది. విలీనానికి సంబంధిత సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్లో సీసీఐ అనుమతి కోరాయి. వీటిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీస్పీఎల్), ఎయిర్ ఇండియా లిమిటెడ్, టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్లు ఉన్నాయి. కాగా, తాజా పరిణామంపై ఎయిర్ ఇండియా ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. సీసీఐ సంతృప్తి చెందకపోతే.. తాజా నోటీసులకు సంబంధిత సంస్థలు పంపిన ప్రతిస్పందనలకు సీసీఐ సంతృప్తిపడకపోతే... ఈ విషయంలో కమిషన్ రెండవ దశ చర్యలు చేపడుతుంది. దీనిలో ప్రతిపాదిత ఒప్పందం వివరాలను బహిరంగ పరచాలని పార్టీలకు సూచిస్తుంది. దీనిపై సంబంధిత వర్గాల అభిప్రాయాలనూ ఆహ్వానించి వాటిని పరిశీలిస్తుంది. ఒప్పందంపై తన తుది నిర్ణయం తీసుకునే ముందు సంస్థల నుండి సీసీఐ అదనపు సమాచారాన్ని పొందవచ్చు. పోటీ సంబంధ ఆందోళనలను పరిష్కరించడానికి గత సందర్భాల్లో సంస్థలు సీసీఐకి స్వయంగా పరిష్కార చర్యలను సమర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని సీసీఐ ఆమోదించడం, షరతులతో కూడిన ఆమోదాలను ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
వరల్డ్ టాప్ 100 ఎయిర్లైన్స్: మళ్లీ అదరగొట్టిన సంస్థ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ఎయిర్లైన్స్ జాబితాలో రెండు భారతీయ విమానయాన సంస్థలు చోటు సంపాదించు కున్నాయి. విమానయాన సంస్థలు విస్తారా, ఇండిగో మాత్రమే ఈ లిస్ట్లో ఉండటం విశేషం. టాప్ 100లో 49వ ర్యాంకు సాధించిన ఇండిగో మూడవ ఉత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా ఎంపికైంది. టాటా గ్రూపు నేతృత్వంలోని ఎయిరిండియా 10 అత్యంత మెరుగైన విమానయాన సంస్థల జాబితాలో 9వ స్థానంలో ఉంది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్ అవార్డుల ప్రకారం 2022లోని 20వ ప్లేస్నుంచి నాలుగు స్థానాలు ఎగబాకి మరీ విస్తారా 16వ స్థానానికి చేరింది.అటు ఇండిగో గత సంవత్సరం 45వ స్థానం నుండి రెండు స్థానాలు పెరిగి 43వ ర్యాంక్కు చేరుకుంది. టాప్ 100 ఎయిర్లైన్స్కు స్కైట్రాక్స్ ఈ అవార్డులను ఇచ్చింది. అలాగే 20 ‘ప్రపంచపు అత్యుత్తమ ఎయిర్లైన్ క్యాబిన్ క్రూ 2023’ జాబితాలో కూడా విస్తారా 19వ ప్లేస్ కొట్టేసింది. అంతేనా ఆసియాలోని టాప్ 10 ఎయిర్లైన్స్ జాబితాలో విస్తారా 8వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ) ఎయిర్లైన్ స్కైట్రాక్స్ టాప్ 20 ఎయిర్లైన్స్ జాబితాలో వరుసగా రెండవ సారి స్థానం పొందింది విస్తారా.అలాగే వరుసగా మూడో ఏడాది కూడా 'బెస్ట్ ఎయిర్లైన్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా' అవార్డును, ఇండియా దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' గా వరుసగా ఐదవసారి, 'భారతదేశం, దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' మూడవసారి గెలుచుకుంది. దీంతోపాటు 'వరల్డ్స్ బెస్ట్ ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ 2023' విభాగంలో 20వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100 దేశీల నుంచి వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్లో ఓటు వేయగా, మొత్తం 20.23 మిలియన్ల ప్రయాణికుల నుండి ఓట్లు వచ్చాయి.విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కణ్ణన్ మాట్లాడుతూ ఈ అవార్డులు తమ సేవలు, కస్టమర్ల నమ్మకంతో పాటు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తమని మరింత ఉత్తేజితం చేస్తామన్నారు. తమ ఉద్యోగులు, ముఖ్యంగా ఫ్రంట్లైన్ టీమ్లు, ఎనిమిదేళ్ల ప్రస్థానంలో విశేష కృషికి గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు. ఇండియా సౌత్ఏసియాలో ఉత్తమ విమానయాన సిబ్బంది అవార్డును ఐదోసారి గెలుచుకోవడం గొప్ప విషయమని స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ ప్లాస్టెడ్ అన్నారు. (రిలయన్స్ గ్రూప్లో కీలక పరిణామం: ప్రెసిడెంట్గా పారుల్ శర్మ) విస్తారా విస్తారా టాటా సన్స్ , సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. ప్రస్తుతం ఇది 61 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది, ఇందులో 46 ఎయిర్బస్ A320neo, 10 ఎయిర్బస్ A321, ఒక బోయింగ్ 737-800NG, నాలుగు బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ ఉన్నాయి. -
ఎయిరిండియాకు అపార అవకాశాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు అపార అవకాశాలున్నట్లు కంపెనీ సీఈవో క్యాంప్బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. వెరసి ఎయిరిండియా గ్రూప్ను అంతర్జాతీయ దిగ్గజంగా రూపుదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో విస్తారాను కంపెనీతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు విలేకరుల వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఇదేవిధంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్(ఎయిరేషియా ఇండియా)లను సైతం కంపెనీలో విలీనం చేసే కార్యాచరణకు ఇప్పటికే తెరతీసినట్లు తెలియజేశారు. ఎయిరిండియా గతంలో ఎన్నడూచూడని భారీ వృద్ధిని అందుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ నెల 14న ఎయిరిండియా 70 వైడ్బాడీ మోడల్సహా 470 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరించనున్నట్లు విల్సన్ తెలియజేశారు. వీటిలో ఎయిర్బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలను పొందనుంది. ఎయిరిండియాను గతేడాది జనవరిలో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మరో 370 విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. -
టాటా దూకుడు: ఏవియేషన్ మార్కెట్లో సంచలనం
న్యూఢిల్లీ: దేశీ ఏవియేషన్ మార్కెట్లో భారీ కన్సాలిడేషన్కు తెర తీస్తూ ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయనున్నట్లు టాటా గ్రూప్ మంగళవారం ప్రకటించింది. ఒప్పందం ప్రకారం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1 శాతం వాటా దక్కనుంది. ఈ డీల్ 2024 మార్చి నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం విస్తారాలో టాటా గ్రూప్నకు 51 శాతం, సింగపూర్ ఎయిర్లైన్స్కు (ఎస్ఐఏ) 49 శాతం వాటాలు ఉన్నాయి. ఈ కన్సాలిడేషన్తో దేశ, విదేశ రూట్లలో అత్యధికంగా సర్వీసులు నడిపిస్తున్న భారీ ఎయిర్లైన్స్గా ఎయిరిండియా ఆవిర్భవిస్తుందని టాటా గ్రూప్ తెలిపింది. అంతర్జాతీయ రూట్లకు సంబంధించి దేశీయంగా అతి పెద్ద సంస్థగాను, దేశీ రూట్లలో రెండో పెద్ద సంస్థగాను ఎయిరిండియా ఉంటుందని వివరించింది. విలీనానంతరం సంస్థ చేతిలో 218 విమానాలు ఉంటాయి. విలీన ఒప్పందం కింద ఎయిరిండియాలో రూ. 2,058.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఎస్ఐఏ తెలిపింది. తద్వారా తమకు ఎయిరిండియాలో 25.1 శాతం వాటా లభిస్తుందని, అలాగే అన్ని కీలక మార్కెట్ విభాగాల్లోనూ తమకు గణనీయంగా చోటు దక్కుతుందని పేర్కొంది. కీలక మైలురాయి .. ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్లైన్గా తీర్చిదిద్దే క్రమంలో రెండు సంస్థల విలీనం కీలక మైలురాయి వంటిదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ‘ఎయిరిండియా ఇటు నెట్వర్క్ను, అటు విమానాలను పెంచు కోవడంపై, కస్టమర్లకు అందించే సర్వీసులు మెరుగుపర్చుకోవడంపై, భద్రత.. విశ్వసనీయత.. సమయ పాలనను మెరుగు పర్చుకోవడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది‘ అని ఆయన చెప్పారు. టాటా గ్రూప్తో సంబంధాలను మరింత పటిష్టపర్చుకునేందుకు, దేశీ ఏవియేషన్ మార్కెట్ వృద్ధిలో పాలుపంచుకునేందుకు ఈ విలీనం చక్కని అవకాశం కాగలదని ఎస్ఐఏ సీఈవో గోహ్ చూన్ ఫోంగ్ తెలిపారు. విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ చెప్పారు. ఎయిరిండియా రూపాంతరం చెందే ప్రయత్నాలకు విలీన ఒప్పందం మరింత ఊతమివ్వగలదని సంస్థ సీఈవో క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. మరిన్ని పెట్టుబడులు .. ఎయిరిండియా భారీ విస్తరణ, కార్యకలాపాల నిర్వహణ కోసం అవసరమైతే 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్ఐఏ, టాటా సన్స్ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాయి. ‘విలీనానంతరం మాకు ఉండే 25.1 శాతం వాటా ప్రకారం మేము అదనంగా రూ.5,020 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయాల్సి రావచ్చు. విలీనం పూర్తయ్యాకే చెల్లించాల్సి ఉంటుంది‘ అని ఎస్ఐఏ తెలిపింది. టాటా గ్రూప్లో నాలుగు ఎయిర్లైన్స్.. టాటా గ్రూప్లో ప్రస్తుతం ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ఏషియా ఇండియా, విస్తారా అని నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను ఈ ఏడాది జనవరిలోనే కొనుగోలు చేసింది. ఎయిర్ఏషియా ఇండియా 2014లో, విస్తారా 2015లో, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 2005లో కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రస్తుతం విస్తారా, ఎయిరిండియా దేశీయంగా అతి పెద్ద ఎయిర్లైన్స్ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అక్టోబర్లో రెండింటి మార్కెట్ వాటా కలిపి 18.3 శాతంగా ఉంది. ఎయిర్ఏషియాతో కలిపితే 25.9 శాతంగా ఉంది. ఎయిరిండియాలో విలీనంతో విస్తారా బ్రాండ్ కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్ల విస్తారా.. తాము స్థాపించిన ఎయిరిండియా.. ప్రభుత్వం చేతికి చేరాక, టాటా గ్రూప్ దశాబ్దాల పాటు తిరిగి విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి ఎయిర్లైన్స్ను ప్రారంభించేందుకు 1994లో ప్రయత్నించినా కుదరలేదు. ఆరేళ్ల తర్వాత ఎయిరిండియాలో వాటాలు కొనుగోలు చేసి ఏవియేషన్లోకి ప్రవేశిద్దామనుకున్నా సాధ్యపడలేదు. చివరికి 2012లో ఏవియేషన్లో విదేశీ పెట్టుబడులపై పరిమితులను సడలించడంతో మళ్లీ ఎస్ఐఏతోనే జత కట్టి ఎట్టకేలకు 2015లో విస్తారా విమానయాన సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా విమానయాన మార్కెట్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం విస్తారా దేశీ, విదేశీ రూట్లలో 41 ప్రాంతాలకు రోజూ 260 పైగా ఫ్లైట్లు నడుపుతోంది. 54 విమానాలు, దాదాపు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. -
ఎయిరిండియా చెంతకు రెండు ఎయిర్లైన్స్!
ముంబై: విమాన సర్వీసుల వ్యాపార విభాగాన్ని కన్సాలిడేట్ చేయడంపై టాటా గ్రూప్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎయిరిండియా కిందికి ఎయిర్ఏషియా ఇండియా, విస్తారలను తీసుకురావడంపై కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికోసం ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ ఆర్ఎస్ సంధూ సారథ్యంలో ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసినట్లు వివరించాయి. ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ఏషియా ఇండియా అలాగే ఎయిరిండియా, విస్తార కార్యకలాపాల మధ్య సారూప్యతలను ఈ టీమ్ మదింపు చేయనున్నట్లు తెలిపాయి. ఏడాది వ్యవధిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఎయిర్ఏషియా ఇండియాను కన్సాలిడేట్ చేయాలని, 2024 నాటికి మొత్తం విమాన సేవల వ్యాపారాన్ని ఎయిరిండియా గొడుగు కిందికి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
మరో విమానం ఇంజన్ ఫెయిల్: వరుస ఘటనలతో ప్రయాణీకులు బెంబేలు
సాక్షి, న్యూఢిల్లీ: విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణీకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్ విమానంలో విండ్షీల్డ్ క్రాక్ కారణంగా బుధవారం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. దీనిపై డీజీసీఐ సంస్థకు నోటీసులు కూడా జారి చేసింది. తాజాగా మరో ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా విమానంలో ఇంజీన్ ఫెయిల్ అయిన ఘటన ఆందోళన రేపింది. అయితే విమానం సేఫ్టీగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి బయలుదేరి, ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే విస్తారా విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో విమానాన్ని ట్యాక్సీవే నుంచి పార్కింగ్ ప్రాంతానికి లాగాల్సి వచ్చింది. బ్యాంకాక్-ఢిల్లీ విమానం UK-122 (సింగిల్ ఇంజన్) నిన్న (మంగళవారం) ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగిందని ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఢిల్లీలో ల్యాండింగ్ తర్వాత, పార్కింగ్ బేకు వెళుతున్న క్రమంలో చిన్న విద్యుత్ సమస్య ఏర్పడిందని, అయితే ప్రయాణీకుల భద్రత రీత్యా అప్రమత్తమైన సిబ్బంది ట్యాక్సీవే నుంచి పార్కింగ్ విమానాన్ని తరలించారని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. -
మీ అంచనాల్ని అందుకోలేకపోయాం, ఏం చేస్తాం చెప్పండి..అంతాకరోనా ఎఫెక్ట్
ముంబై: కస్టమర్ల అంచనాలను గత కొన్ని నెలలుగా అందుకోలేకపోయినట్టు విస్తారా ఎయిర్లైన్స్ సీఈవో వినోద్ కన్నన్ అంగీకరించారు. అంతరాలను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కస్టమర్లకు ఆయన ఒక లేఖ రాశారు. సేవల్లో ఇటీవలి నెలకొన్న అవాంతరాలతో ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి రావడాన్ని, ఎయిర్లైన్స్ కాల్ సెంటర్ను చేరుకునేందుకు ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సి రావడాన్ని అంగీకరించారు. ‘‘విమాన ప్రయాణం అన్నది ఒక లావాదేవీ కాకుండా, సంతోషరమైన ఒక మరపురాని అనుభూతిగా మిగల్చాలని మేరు కోరుకుంటాము. ఈ విషయంలో గత కొన్ని నెలలుగా మేము అంచనాలను అందుకోలేని విషయం నిజమే. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు వెబ్సైట్ కానీ, యాప్ కానీ నిర్ధేశిత పరిష్కారాలను చూపించడం లేదని తెలుసు. విమానాశ్రయాల్లో ఆన్గ్రౌండ్ సేవల పరంగా కొన్ని సందర్భాల్లో మీ అంచనాలను అందుకోలేకపోతున్నట్టు అవగాహన ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు. కస్టమర్ల ఫిర్యాదులు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో కొన్ని సేవలను తాత్కాలికంగా కుదించాల్సి వచ్చినట్టు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
విస్తారా బంపరాఫర్: వారికి ఉచితంగా విమానయానం
ముంబై: కోవిడ్ విస్తరిస్తున్న వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపరాఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. విస్తారా ఎయిర్లైన్స్ ఆదివారం ఈ ఆఫర్ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగా తమ విమానంలో ప్రయాణించొచ్చు అని విస్తారా ప్రకటించింది. ఈ మేరకు విస్తారా ఎయిర్లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి లేఖ రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా తెలిపింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది. ఇక ఉచిత ప్రయాణం ఆఫర్లో విస్తారా ఒక కండీషన్ పెట్టింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్లైన్స్ పేర్కొంది. ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని తెలిపింది. చదవండి: యూఎస్కు నాన్స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను -
యూఎస్కు నాన్స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను
ముంబై, సాక్షి: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్లైన్స్ సంస్థ విస్తారా.. యూఎస్కు నాన్స్టాప్ సర్వీసులను నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రసిద్ధ టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ మధ్య ఏర్పాటైన ఈ భాగస్వామ్య సంస్థ(జేవీ) త్వరలో యూఎస్కు డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ నేపథ్యంలో నాన్స్టాప్ సర్వీసులకు భారీ డిమాండ్ నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎప్పటిలోగా సర్వీసులను ప్రారంభించాలన్న అంశాన్ని నిర్ణయించుకోలేదని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినోద్ కన్నన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 20-30 శాతం వరకూ నాన్స్టాప్ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి వివిధ ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు వినోద్ తెలియజేశారు. ఇందుకు విమానాలకున్న ఆవశ్యకత, తదితరాలపై కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2023కల్లా కంపెనీకున్న మొత్తం సీట్ల సామర్థ్యంలో 20-30 శాతం వరకూ అంతర్జాతీయ రూట్లకు కేటాయించాలని విస్తారా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇందుకు 10 శాతాన్నే వినియోగించింది. ఇదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) చివరికల్లా విమానాల సంఖ్యను 70కు పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం విస్తారా 48 విమానాలతో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేశాయి. -
ముంచుకొస్తున్న తుపాను : పలు విమానాలు రద్దు
సాక్షి, ముంబై: నిసర్గ తుపాను పెనువేగంతో ముంబై తీరంవైపు దూసుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాకపోకలను సాగించే విమానాలను రద్దు చేశాయి. ఇండిగో, విస్తారా, స్పైస్జెట్ సంస్థలు పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సమాచారాన్ని సంబంధిత ప్రయాణీకులకు అందించామనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు అప్రమత్తంగా కావాలని సూచించాయి. (తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’) ఇండిగో 17 విమానాలను రద్దు చేసింది. . ముంబై నుండి చండీగఢ్, రాంచీ పాట్నాకు కేవలం మూడు విమానాలను మాత్రమే నడుపుతున్నట్టు ఇండిగో పేర్కొంది. ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకునే అవకాశం లేదా క్రెడిట్ సౌకర్యాన్ని అందివ్వనున్నామని ఇండిగో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుపాను కారణంగా తమ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని విస్తారా ప్రకటించింది. ప్రధానంగా ముంబై, గోవా మధ్య విమానాలను రద్దు చేసినట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు విస్తారా అధికారిక వెబ్ సైట్ ను గానీ, 9289228888 నంబరుగానీ సంప్రదించాలని ట్వీట్ చేసింది. అలాగే ముంబై నుంచి , ఢిల్లీ కోల్కతాకు వెళ్లే విమానాలను కూడా బుధవారం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎయిరిండియా ఉదయం విమానాలను రీషెడ్యూల్ చేస్తోంది. అలాగే విమాన షెడ్యూల్లో ఏదైనా రద్దు, మార్పులను ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని స్పైస్జెట్ తెలిపింది. కాగా కరోనా వైరస్ , లాక్ డౌన్ కారణంగా పూర్తిగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలకు ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇటీవల అనుమతి లభించించి. మళ్లీ ఇంతలోనే నిసర్గ తుపాను రూపంలో అంతరాయం ఏర్పడింది. #6ETravelAdvisory : To know your flight status, click here https://t.co/Z25uUH5PWw #StaySafe #NisargaAlert pic.twitter.com/tkvwHX0OoA — IndiGo (@IndiGo6E) June 2, 2020 #TravelAdvisory : To check your flight status, please visit https://t.co/VkU7yLB2ny. pic.twitter.com/JYIW9ftpW3 — SpiceJet (@flyspicejet) June 2, 2020 #TravelUpdate Due to the movement of cyclonic storm "NISARGA" flights to/from Mumbai and Goa are likely to be impacted. Please visit https://t.co/IZ9taT0TOv or SMS UK to 9289228888 to check updated flight status before booking and leaving for the airport. Thank you. — Vistara (@airvistara) June 2, 2020 -
కోవిడ్: విస్తారా ఆ విమానాలు బంద్
సాక్షి, ముంబై: కోవిడ్-19 (కరోనా వైరస్ ) విజృంభిస్తున్న తరుణంలో విమానయాన సంస్థ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20 నుంచి మార్చి 31 వరకు తన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా విమాన ప్రయాణికుల ద్వారా ఈ మహమ్మారి తేలికగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న రేపథ్యంలో విస్తారా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ పరిస్థితి కారణంగా 2020 మార్చి 20 నుండి 2020 మార్చి 31 వరకు అంతర్జాతీయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, జాయింట్ వెంచర్ సంస్థ విస్తారా బుధవారం తెలిపింది.ప్రభావిత విమానాలలో బుక్ చేసుకున్న వినియోగదారులకు పూర్తిగా చార్జీలను తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. కాగా ఇప్పటికే గ్లోబల్గా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా బంద్ పెట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వరకు అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు మార్చి17న గో ఎయిర్ ప్రకటించింది. చైనాలోని వుహాన్ నగరంలో వ్యాపించి ప్రపంచదేశాలను చుట్టేస్తున్న కరోనా మహమ్మారి, ఇటు మానవ జాతిని, ఇటు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 8 వేలకు తాకింది. అలాగే ఈ వైరస్బారిన పడిన వారి సంఖ్య రెండు లక్షల మార్క్ను దాటేసింది. దేశీయంగా కరోనా సోకిన వారికి సంఖ్య 151కి చేరింది. -
కాలానికి పత్రం సమర్పయామి..!
సాక్షి, రాయపర్తి: కాలానికంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి కంప్యూటర్ యుగంలో మానవుడు ప్రకృతి ‘ప్రసాదా’లకు క్రమక్రమంగా దూరమైపోతున్నాడు. భూతల్లి అందించే సహజ వనరులను అందిపుచ్చుకునేందుకు అవకాశం లేక పర్యావరణం సమతుల్య తను దెబ్బతీసే ప్లాస్టిక్ భూతాన్ని ఆశ్రయిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. అభివృద్ధి పేరుతో బందీగా మారిన మానవుడు కాలగర్భంలో తనకు ఉన్న కళలు, అభిరుచులను ధారపోస్తూ ఉత్తిచేతులతో కాలం వెళ్లదీస్తున్నాడు. ప్రకృతిమాత అందించే విస్తరాకులను వదిలిపెట్టి డిస్పోజబుల్స్ కోసం పరుగులు తీస్తున్నాడు. దీంతో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుండగా.. గ్రామాల ప్రజలకు ఉపాధిని దూరం చేస్తోంది. ఆనాటి రోజులే బాగున్నాయి... కాలానికనుగుణంగా నేటి స్పీడుయుగంలో మోదుగు చెట్టు ఆకులతో తయారు చేసిన విస్తరాకులను పక్కనబెట్టి రంగురంగుల కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన ప్లాస్టిక్ ప్లేట్లవైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు ఆకర్షణీయమైన ప్లాస్టిక్తో తయారు చేసిన ప్లేట్లను వినియోగిస్తున్నారు. మోదుగుచెట్టు ఆకులతో తయారు చేసిన విస్తరాకులపై వేడివేడి అన్నం, కూరలతో వేడివేడిగా భోజనం చేస్తుంటే ఎంతో బాగుండేదని వృద్ధులు చెబుతుంటారు. మోదుగు ఆకు ప్రత్యేకం ఆయుర్వేదం ప్రకారం ఆకుపచ్చని ఆకులో భోజనం చేయడం వల్ల కళ్లు, మనసుకు ఇంపును ఇవ్వడంతోపాటు జీర్ణశక్తి పెరుగుతుందనేది పూర్వీకుల నమ్మకం. ఆకుపై ఎలాంటి రసాయన మైనపు పూతలు ఉండకపోవడం వల్ల వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. సహజసిద్ధంగా దొరికే మోదుగాకుకు ఎలాంటి రసాయనిక మైనపు పూతలు ఉండకపోవడం వల్ల ఆహారంలోకి ఎలాంటి రసాయనిక మార్పులు చేరవు. ఎక్కువ కాలం నిల్వ ఉండే విస్తరాకు మోదుగ. శుభ్రం చేయడానికి వీలుగా ఉంటుంది. అప్పటి రోజుల్లో మోదుగ, మర్రి, రావి, అరటిఆకు, పసుపు ఆకులను విస్తరులుగా చేసి భోజనం చేసేవారు. తెలంగాణలో విరివిగా దొరికే మోదుగ ఆకులను సేకరించి ఎండబెట్టి పనులు లేని సమయాల్లో ఇంటివద్ద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆకులు కుట్టేవారు. అలాంటిది ఇప్పుడు యాంత్రిక జీవనంలోకి రెడీమేడ్గా రంగురంగులతో తయారు చేసిన ప్లాస్టిక్ విస్తర్లు పల్లెసీమల్లోకి సైతం చేరాయి. వ్యవసాయ పొలాల్లోకి వనభోజనాలకు వెళ్లిన క్రమంలో అప్పుడే తయారు చేసిన మోదుగ ఆకులను విస్తర్లుగా చేసి భోజనం చేసి వచ్చేవారు. కానీ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులనే తీసుకెళ్లి వినియోగిస్తున్నారు. ఇక మోదుగు ఆకులను కేవలం దైవపూజలో మాత్రం ఉపయోగిస్తుండడం గమనార్హం. ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనంతో అనర్థాలు ప్లాస్టిక్ప్లేట్లలో వేడివేడి మటన్, చికెన్ కర్రీలు వేసుకొని భోజనం చేయడం వల్ల అందులో రసాయనాలు కరిగి ప్రతీ వారానికి 5గ్రాముల పాలిథిన్ పదార్థం మనిషి శరీరంలోకి చేరుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. భోజనం చేసేప్పటి నుంచి ప్రతీ పనికి ప్లాస్టిక్ను వినియోగించడం మూలంగా పాలిథిన్ శరీరంలోకి చేరి వివిధ రకాల వ్యాధుల బారిన పడడంతో పాటు కేన్సర్కు దారితీస్తుందని చెబుతున్నారు. ఎండాకాలంలో ఆకులు తీసుకొస్తా.. ఎండాకాలంలో మోదుగ ఆకులను సేకరించి మధ్యాహ్న సమయంలో విస్తరాకులను కుడతాను. ఒక్కో విస్తరాకు కట్టకు రూ.55 చెల్లించి తీసుకెళ్తారు. ఆ డబ్బు కుటుంబ ఖర్చులకు తోడ్పడుతాయి. చిన్నప్పుడే ఆకులను అల్లడం నేర్చుకున్నా. అప్పటి నుంచి ఏటా వరకు ఎండాకాలంలో మోదుగ ఆకులను సేకరించి కుట్టి విక్రయిస్తాను. మోదుగ ఆకు విస్తరిల్లో అన్నం తింటుంటే ఆ రుచే వారు. అయితే, ప్లాస్టిక్ ప్లేట్లు రావడంతో మోదుగ ఆకులకు డిమాండ్ తగ్గింది. – బాషబోయిన గౌరమ్మ, తిర్మలాయపల్లి మోదుగ విస్తర్లను దూరప్రాంతాల్లో విక్రయిస్తా.. ప్రత్యేకంగా ఆటో ఏర్పాటు చేసుకొని మండలంలోని ఆరెగూడెం, కొత్తూరు, వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో విస్తరాకులను ఒక్కో కట్టను రూ.55చొప్పున కొనుగోలు చేస్తాను. ఒక్క బెండలో 100 ఆకులు ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్లి వరంగల్, కాశిబుగ్గ, కొత్తవాడ, శివనగర్, రంగశాయిపేట, హన్మకొండ ప్రాంతాల్లో విక్రయిస్తాను. వీటిని ఎక్కువగా దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారు. తద్దినాలకు, పొద్దులు, దేవాలయాల్లో జరిగే పండగలకు మాత్రమే వాడుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర కార్యాలయాల్లో అందరూ ప్లాస్టిక్ విస్తరాకులే వాడుతుండడంతో గిరాకీ అంతంత మాత్రంగా ఉంటోంది. – బరిగెల ఎల్లయ్య, తిర్మలాయపల్లి -
విస్తారా వాలెంటైన్స్ డే సేల్
సాక్షి, ముంబై : వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని విస్తారా ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.899కే విమాన టికెట్లను అందిస్తోంది. పరిమిత కాల ఆఫర్గా తీసుకొచ్చిన ఈ సేల్ లో ప్రీమియం, ఎకానమీ, బిజినెస్ క్లాస్ టికెట్లపై 80శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు తెలిపింది. రేపు( ఫిబ్రవరి 13) అర్థర్రాతి తరువాత ఈ సేల్ ముగియనుంది. అన్ని రకాల ట్యాక్సులు కలిపి ప్రారంభ ధర కింద రూ.899కే టికెట్ లభిస్తుందని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక వైపు ప్రయాణానికి మాత్రమే. ఇలా బుక్ చేసుకున్న టికెట్లతో ఫిబ్రవరి 27నుంచి సెప్టెంబరు 18వరకు ప్రయాణించవచ్చు. బాగ్దోగ్రా, గువహటి మధ్య రూ.899, ప్రీమియం కేటగిరీలో ఢిల్లీ -ముంబై మధ్య రూ.2599 మాత్రమే నని తెలిపింది. వీటితోపాటు ఇతర ప్రాంతాలకు కూడా తక్కువ ధరల్లోనే విమాన ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. Don't miss the Vistara Valentine’s Day Sale! Book your tickets now and enjoy discounts of up to 80%, with fares starting at ₹899/- all inclusive. Hurry, limited seats available. Visit https://t.co/XlzoThWX1m pic.twitter.com/P3fIadX1XF — Vistara (@airvistara) February 12, 2019 -
రూ.899కే విమాన టికెట్
న్యూఢిల్లీ: పలు ప్రధాన రూట్లలో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు విస్తారా ఎయిర్లైన్స్, బడ్జెట్ ఎయిర్లైన్ ఇండిగో ప్రకటించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి సెప్టెంబర్ 28 వరకు చేసే జర్నీలపై సోమవారం నుంచి బుధవారం వరకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని వెల్లడించింది. దేశీ విమానాల్లో రూ.899కే విమాన టికెట్ను అందిస్తుండగా.. అంతర్జాతీయ రూట్లలో టికెట్ ప్రారంభ ధర రూ.3,399 నుంచి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇక ఫిబ్రవరి 27 నుంచి సెప్టెంబర్ 18 వరకు జరిగే ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్స్ను మంగళవారం ప్రారంభిస్తున్నట్లు విస్తారా ఎయిర్లైన్స్ ప్రకటించింది. కేవలం రెండు రోజులు మాత్రమే కొనసాగే ఈ డిస్కౌంట్ ఆఫర్ రేపటితో ముగియనుంది. ఢిల్లీ–అహ్మదాబాద్, ఢిల్లీ–కోల్కతా, ఢిల్లీ–చెన్నై, ముంబై–గోవా రూట్లలో ఇరు సంస్థలు ఆఫర్లను ఇస్తున్నాయి. -
విస్తారా ఫెస్టివ్ ‘24 గంటల’ సేల్
సాక్షి,ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా మరోసారి డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. 24గంటల విక్రయాలు పేరుతో ఈ ఫెస్టివ్ సేల్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఆఫర్ను 13వ తేదీ గురువారం అర్థరాత్రిదాకా పొడిగించినట్టు ట్విటర్లో షేర్ చేసింది. ఈ ఆఫర్లో విమాన టికెట్లు రూ.999లకే (అన్ని చార్జీలు కలిపి) ప్రారంభం కానున్నాయని తెలిపింది. తద్వారా 80శాతం డిస్కౌంట్ పొందవచ్చని వెల్లడించింది. మొత్తం అన్ని క్లాసెస్ (ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్) టికెట్లపై తమ తాజా ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. పరిమితమైన టికెట్ లుమాత్రమే అందుబాటులో ఉన్నాయని ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ ప్రకారం టికెట్లు కేటాయించబడతాయని పేర్కొంది. నేడు (డిసెంబరు 12 బుధవారం) మధ్యాహ్నం 12:01 గంటలకు ప్రారంభమై రేపు ముగియనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా డిసెంబరు 27, ఏప్రిల్ 10 మధ్య కాలంలో ప్రయాణించాల్సి ఉంటుంది. Announcing Vistara’s Festive Sale, fares starting at ₹ 999/- all inclusive. Book your tickets today and save up to 80%! Hurry, limited seats available.https://t.co/Q2yV0VIIcO pic.twitter.com/uI5sCI5I54 — Vistara (@airvistara) December 11, 2018 Sale extended till 13th Dec midnight! Book your tickets under Vistara’s Festive Sale and save up to 80%, with fares starting at ₹ 999/- all inclusive. Hurry, limited seats available. https://t.co/CuUtpBSVra pic.twitter.com/UftmocKLE7 — Vistara (@airvistara) December 12, 2018 -
‘విస్తార’ విస్తరణ!
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ ’విస్తార’... దేశీ, విదేశీ రూట్లలో కార్యకలాపాలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 19 ఎయిర్బస్, బోయింగ్ విమానాలకు ఆర్డరు ఇవ్వనుంది. వీటి విలువ 3.1 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 21,344 కోట్లు) ఉండనుంది. అలాగే ఏ320 నియో రకానికి చెందిన మరో 37 విమానాలను లీజుకు తీసుకోనుంది. విస్తార బుధవారం ఒక ప్రకటనలో ఈ మేరకు విస్తరణ ప్రణాళికలను వివరించింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తార.. కార్యకలాపాలు ప్రారంభించి మూడేళ్లు దాటింది. ప్రస్తుతం కంపెనీకి ఏ–320 రకం విమానాలు 21 ఉన్నాయి. 22 ప్రాంతాలకు వారానికి 800 పైచిలుకు ఫ్లయిట్స్ నడుపుతోంది. ఈ ఏడాది విదేశీ రూట్లలో కూడా సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది. రెండు సంస్థలతో ఒప్పందాలు.. కార్యకలాపాల విస్తరణ నేపథ్యంలోనే కొత్తగా ఎయిర్బస్ సంస్థ నుంచి ఏ320 నియో రకానికి చెందిన 13 విమానాలు, బోయింగ్ నుంచి 6 డ్రీమ్లైనర్స్ను (787–9 ఎయిర్క్రాఫ్ట్) కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు విస్తార పేర్కొంది. ఎయిర్బస్తో ఒప్పందం ప్రకారం విస్తార ముందుగా ఏ320, ఏ321 రకానికి చెందిన 13 విమానాలను కొనుగోలు చేయనుంది. సందర్భాన్ని బట్టి మరో ఏడు ఏ320 రకం విమానాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే లీజింగ్ కంపెనీల నుంచి మరో 37 కొత్త ఏ320 నియో విమానాలను కూడా విస్తార లీజు కు తీసుకోనుంది. నియో విమానాలు 2019– 2023 మధ్య డెలివరీ అయ్యే అవకాశముంది. ఈ విమానాలను దేశీ రూట్లలోనూ, సందర్భాన్ని బట్టి అంతర్జాతీయ రూట్లలోనూ ఉపయోగించనున్నారు. ఇక, బోయింగ్తో ఒప్పందం ప్రకారం విస్తార 787–7 డ్రీమ్లైనర్ విమానాలు ఆరు కొనుగోలు చేయనుంది. 787 డ్రీమ్లైనర్ కోవకి చెందిన మరో నాలుగింటినీ కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. -
ఎయిర్ హోస్టెస్పై వేధింపుల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ, విదేశీ విమానాల్లో వేధింపులు పరిపాటిగా మారిపోయాయి. ఇటీవల భాలీవుడ్ నటి జైరాను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపగా.. తాజాగా ఎయిర్ విస్తారా మహిళా ఉద్యోగిపట్ల ఓ ప్యాసెంజర్ అనుచితంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్నో-ఢిల్లీ విస్తారా విమానంలో మార్చి 24వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్నోనుంచి ‘యూకే 997’ విమానం ఢిల్లీలో అడుగుపెట్టినపుడు క్యాబిన్ క్రూ ఉద్యోగి పట్ల ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వైమానిక సిబ్బంది ఎయిర్ పోర్ట్లోని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు రాజీవ్ వసంత్ డానీ (62)గా గుర్తించారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని విస్తారా ధృవీకరించింది. సిబ్బందిపై ప్రయాణీకుల అనుచిత ప్రవర్తన, వేధింపులను సహించేది లేదని, ఈ వైఖరి ఇతర ప్రయాణీకులకు కూడా ఇబ్బందిగా మారుతుందని , దీనిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎయిర్లైన్స్ ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. కాగా గత ఏడాది దంగల్ నటి జైరా వాసిం తనకు జరిగిన అవమానంపై కంటతడి పెడుతూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై స్పందించిన విస్తారా ఎయిర్లైన్స్ జైరాకు క్షమాపణలు చెప్పింది. ఈ కేసులో ముంబైకి చెందిన వ్యాపారవేత్త వికాస్ సచ్దేవ్ లైంగిక వేధింపు ఆరోపణలతో ఐపిసి సెక్షన్ 354 కింద బుక్ అయిన సంగతి తెలిసిందే. -
గాల్లో 261మంది.. క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం!
ముంబై : సెకన్ల వ్యవధిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లోని తమ ప్రాణాలు కలిసిపోతాయని భావించిన 261 మంది ప్రయాణికులు, ప్రమాదం నుంచి సెకన్లలో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ఓ మహిళ పైలెట్ చూపించిన తెగువ ఇంతమంది ప్రాణాలను కాపాడ గలిగింది. వివరాల్లోకి వెళ్తే... ఫిబ్రవరి 7న రాత్రి 8 గంటల తర్వాత ముంబై నుంచి భోపాల్ వెళ్తున్న ఎయిరిండియా ఎయిర్బస్ ఏ1631, ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న విస్తార యూకే997 ముంబై ఎయిర్ స్పేస్లో ఎదురెదురుగా వచ్చాయి. దాదాపు 100 అడుగుల దగ్గరగా ఈ రెండు విమానాలు వచ్చాయి. విస్తార విమానంలో 152 మంది ప్రయాణికులుండగా.. ఎయిరిండియా విమానంలో 109 మంది ప్రయాణికులున్నారు. ఇరు విమానాలు దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో ఆ విమానాల పైలెట్లకు ఆటోమేటిక్ వార్నింగ్ అలర్ట్లు వెళ్లాయి. సెకన్లలో రెండు విమానాలు ఢీకొట్టుకోబోతున్నాయన్న తరుణంలో, వెంటనే స్పందించిన ఎయిరిండియా మహిళా పైలెట్ అనుపమ కోహ్లి అడ్వయిజరీ ఆదేశాలను పాటిస్తూ... ఎయిర్క్రాఫ్ట్ను సురక్షితమైన దూరంగా మరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విస్తార విమానం అదే అవరోహణ మార్గంలో ప్రయాణించింది. ఎట్టకేలకు తమ పైలెట్ సరియైన సమయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో, పెను ప్రమాదం నుంచి బయటపడినట్టు ఎయిరిండియా అధికారులు చెప్పారు. ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు పాటిస్తూ వెళ్తోందని, విస్తారా పైలెటే తప్పుడు మార్గంలో విమానాన్ని నడిపినట్టు ఎయిరిండియా అధికారులు ఆరోపించారు. విస్తారా ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలకు విరుద్ధంగా ప్రయాణించినట్టు పేర్కొన్నారు. తాను విమానాన్ని సురక్షితమైన మార్గంలోకి మరలించకముందు రెండు విమానాలు కేవలం 100 అడుగుల దూరంలోనే ఉన్నట్టు కోహ్లి, తన రెజుల్యూషన్ అడ్వయిజరీకి రిపోర్టు చేసింది. విస్తారా సైతం ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. తన ఇద్దరు పైలెట్లను విధుల నుంచి తొలగించింది. ఎయిరిండియా 27వేల అడుగుల స్థాయిలో ప్రయాణిస్తుండగా.. విస్తార విమానం 8 గంటల తర్వాత 27,100 అడుగుల స్థాయికి వచ్చింది. ఈ క్రమంలో ఈ రెండు విమానాలు ప్రమాదం అంచు వరకు వెళ్లాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రమాదంపై విచారణ చేపడుతోంది. -
విస్తార దివాలి సేల్: తక్కువకే టిక్కెట్
-
విస్తార దివాలి సేల్: తక్కువకే టిక్కెట్
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్ ఇంకా వినియోగదారులను మురిపిస్తూనే ఉంది. భారీ భారీ డిస్కౌంట్లతో బ్రాండ్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీనిలో విమానయాన సంస్థలు తామేమీ తక్కువ కాదంటూ నిరూపించుకుంటున్నాయి. తాజాగా యూకేకి చెందిన విస్తారా 48 గంటల లాంగ్ దివాలి సేల్ను ప్రకటించింది. ఈ సేల్ కింద ఎంపికచేసిన రూట్లలో టిక్కెట్ను రూ.1,149కే విక్రయించనున్నట్టు పేర్కొంది. 2017 అక్టోబర్ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య ప్రయాణాలకు ఈ టిక్కెట్ సేల్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 13 వరకు ఈ 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' సేల్ అందుబాటులో ఉంటుంది. గోవా, పోర్ట్ బ్లయిర్, లడఖ్, జమ్ము, శ్రీనగర్, కొచ్చి, గౌహతి, అమృత్సర్, భువనేశ్వర్, మెట్రో నగరాలు ఢిల్లీ, కోల్కత్తా, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి, ప్రాంతాలకు కస్టమర్లు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ రేపటి(అక్టోబర్ 13) వరకు ఉంటుంది. వన్ వే, ఎకానమీ క్లాస్, ప్రీమియం ఎకానమీలో రిటర్ను ట్రావెల్కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్లో చాలా తక్కువ సేల్ శ్రీనగర్-జమ్ము మార్గంలో ఉంది. ఇతర మార్గాలలో అద్భుతమైన ధరలను విస్తారా అందిస్తోంది. ఈ సేల్ కింద బుకింగ్స్ చేసుకున్న టిక్కెట్లు, మరే ఇతర డిస్కౌంట్ కిందకు రావని విస్తారా తెలిపింది. ఇండియాలో, డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఇది వాలిడ్లో ఉంటుంది. -
మావోయిస్టులకు సురక్షిత ప్రాంతం కావాలి?!
మావోయిస్టులు మళ్లీ తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? కొత్త ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లు నిర్వహిస్తున్నారా? ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్గఢ్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో కొత్త ప్రాంతాలపై దృష్టి సారించారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. సాక్షి, న్యూఢిల్లీ : ఏవోబీ, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు, తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో ఇప్పటికే మావోయిస్టల కీలక స్థావరాలను పోలీసులు ధ్వంసం చేసిన నేపథ్యంలో కొత్త ప్రాంతాల్లో పాగా వేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర-చత్తీస్గఢ్-మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అయిన బాలాఘాట్ జిల్లాను కేంద్రంగా మార్చుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర నిఘావర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్లో ఈ జిల్లా.. మూడు రాష్ట్రాలకు సరిహద్దు కావడం.. అక్కడ వామపక్ష భావజాలాన్ని పెంచితే ఉనికి మళ్లీ కాపాడుకోవచ్చని వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ బ్రిగేడ్ ట్రై జంక్షన్లో ఇప్పటికే మావోయిస్టులు విస్తారా బ్రిగేడ్ పేరుతో రిక్రూట్మెంట్లు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ రిక్రూట్మెంట్లకు, పార్టీ విస్తరణకు కీలక మావోయిస్ట్ నేత అయిన సుధాకర్ వ్యూహరఛన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చత్తీస్గఢ్, జార్ఖండ్లలో కీలకంగా పనిచేసిన సుధాకర్.. అక్కడ పోలీస్ దాడులు, కూంబింగ్లు అధికం కావడంతో.. కొన్నేళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సురక్షిత ప్రాంతం కోసమే కొన్నేళ్లుగా మావోయిస్టులకు బలమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్కౌంటర్లలో కీలక నేతలు హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లమలను కూడా పూర్తిగా పోలీసులు జల్లెడ పట్టేశారు. దీంతో చత్తీస్గఢ్లోని బస్తర్ అటవీ ప్రాంతానికి మకాం మార్చారు. అక్కడ కూడా పరిస్థితులు విషమంగా ఉండడంతో సురక్షిత, రక్షణ ప్రదేశం కోసం మావోయిస్టులు కొన్నేళ్లుగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. -
విస్తారా 'ఫ్రీడమ్ టు ఫ్లై': భారీ డిస్కౌంట్స్
ముంబై: ప్రముఖ ఎయిర్లెన్స్ విస్తారా విమాన టికెట్లలో భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. 'ఫ్రీడం సేల్' పేరుతో రెండు రోజుల అమ్మకాలను సోమవారం వెల్లడించింది. ఎంపిక చేసిన మార్గాలలో వన్ వేలో ఈ విమాన టికెట్లను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. అతి తక్కువ ధరను రూ. 799లుగా నిర్ణయించింది. వీటిల్లో అదనపు చార్జీలు, హిడ్డెన్ ఫీజులు వుండవని స్పష్టం చేసింది. ఈ ఫ్రీడమ్ టు ఫ్లై (వన్-వే, అన్నీ కలిపి) ఆఫర్ కేవలం 48 గంటలు మాత్రమే కొనసాగనుంది. ఆగష్టు 8-9 తేదీల్లో ఈ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అలాగే ఆగస్టు 23, 2017నుంచి ఏప్రిల్ 19, 2018 మధ్యకాలంలో ప్రయాణించేందుకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్ టికెట్ను కేవలం రూ. 799లకు, ప్రీమియం ఎకానమీ టికెట్లను రూ. 2,099 ధరల్లో అందిస్తోంది. 'ఫ్రీడమ్ టు ఫ్లై' సేల్ ద్వారా గోవా, పోర్ట్ బ్లెయిర్, లెహ్ (లడఖ్), జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, గువహతి, అమృత్సర్, భువనేశ్వర్, అలాగే ఢిల్లీ, కోల్కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి తమ ఫ్యావరేట్ డిస్టినేషన్స్కు చేరుకోవచ్చని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. పరిమిత సీట్లు అందుబాటులోఉంటాయని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ కింద టికెట్లను కేటాయిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా శ్రీనగర్-జమ్మూ మార్గంలో ఈ విక్రయానికి తక్కువ ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఛార్జీలు కూడా రాయితీ ఛార్జీల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ-అమృత్సర్ మధ్య టికెట్ రూ. 1,199, ఢిల్లీ-చండీఘడ్కు ధర రూ. 1,299 గాఉండనుంది. ఢిల్లీ-శ్రీనగర్, ఢిల్లీ-అహ్మదాబాద్ రూ. 1,499; ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-పూణేలకు రూ. 2,099; ఢిల్లీ-కోల్కతా రూ. 2,199; ఢిల్లీ-గోవా రూ. 2,799 ఢిల్లీ- హైదరాబాద్ మధ్య ఎకనాకమీ రూ. 2,399, ప్రీమియం ఎకానమీ టికెట్ రూ.4,199లకే అందిస్తోంది. -
వర్షాకాల ఆఫర్: రూ.849కే విమాన టిక్కెట్
వర్షాకాలం ఇలా వచ్చిందో లేదో అలా విమానయానసంస్థలన్ని మాన్ సూన్ ఆఫర్లతో పోటీపడుతున్నాయి. ఇండిగో, గోఎయిర్ సంస్థలు విమానటిక్కెట్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా విస్తారా కూడా వర్షాకాల ఆఫర్ ను తీసుకొచ్చింది. ఐదు రోజుల పాటు విస్తార 'గ్రేట్ మాన్ సూన్ సేల్' ను నిర్వహిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా పరిమిత కాలవ్యవధిలో 849 రూపాయలకే ఎకానమీ క్లాస్ టిక్కెట్లను విక్రయిస్తున్నట్టు పేర్కొంది. ఈ సేల్ లో భాగంగా ప్రీమియం ఎకానమీ సీట్ల కోసం టిక్కెట్లను రూ.2,099కు విక్రయిస్తోంది. ఈ ఆఫర్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ సేల్ జూన్ 13 అర్థరాత్రి నుంచి, జూన్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. జూన్ 28 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ప్రయాణాలకు ఈ టిక్కెట్లు వర్తిస్తాయని విస్తారా ఎయిర్ లైన్స్ తన ప్రకటనలో తెలిపింది. గోవా, పోర్టు బ్లయిర్, లడఖ్, జమ్ము, శ్రీనగర్, గౌహతి, అమృత్ సర్, భువనేశ్వర్, ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, బెంగహూరు వంటి మార్గాలను ఈ స్కీమ్ కవర్ చేస్తోంది. డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఇది వాలిడ్ లో ఉంటుందని, భారత్ లోనే ఈ ఆఫర్ వర్తిస్తుందని విస్తారా పేర్కొంది. జమ్ము-శ్రీనగర్ మార్గంలో వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్లను రూ.849కే విక్రయిస్తోంది. తమ వెబ్ సైట్ airvistara.com, మొబైల్ యాప్స్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని విస్తారా తెలిపింది. -
డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విస్తారా
ముంబై: ప్రముఖ ఎయిర్లెన్స్ విస్తారా కూడా తగ్గింపు ధరలను ప్రకటించింది. 'మిడ్-సమ్మర్' సేల్ పేరుతో మంగళవారం డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన మార్గాలలో అతి తక్కువ ధరను రూ. 999లుగా నిర్ణయించింది. ఈ ఆఫర్లో బుకింగ్స్ బుధవారం ప్రారంభమై మే 20న ముగియనున్నాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 2017, జూన్ 12 నుంచి ఫిబ్రవరి 20, 2018 మధ్య ప్రయాణించేందుకు అవకాశం. జమ్మూ-శ్రీనగర్, గువహతి-బాగ్డోగ్ర మార్గాల్లో విమాన టికెట్ను రూ.999 లకే అందిస్తున్నట్టు విస్టా ప్రకటించింది. ఢిల్లీ-చండీగఢ్ రూ .1499 ఢిల్లీ-లక్నో రూ .1,549, ఢిల్లీ-అమృతసర్ రూ.1699 లుగా వెల్లడించింది . అయితే, ఆఫర్ కింద కేటాయించిన సీట్ల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ధరలో ఎకానమిక్ క్లాస్లో మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది.అలాగే ప్రీమియం ఎకానమీలో రూ.2,000 ఆఫర్ను వాడుకోచ్చవని తెలిపింది. అలా ఏఈ రాయితీ ఛార్జీలు తిరిగి చెల్లించబడవని, గ్రూప్, ఇన్ఫాంట్ బుకింగ్లకు వర్తించవని ఎయిర్లైన్స్ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కాగా దేశీయ విమానయాన సంస్థలు వరుసగా డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎంపిక చేసిన మార్గాల్లో, నిర్ణీత కాలానికి గాను, గో ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఏసియా బడ్జెట్ ధరల్లో టికెట్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. A midsummer flight’s dream! Book at fares starting ₹999 all-in for travel between 12th Jun’17 – 20th Feb’18 https://t.co/9epGF2s6fx pic.twitter.com/qSAxTqjHjE — Vistara (@airvistara) May 16, 2017 -
విస్తారాలో భారీ పెట్టుబడులు
టాటా-సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎయిర్లైన్స్ సంస్థ 'విస్తారా'లో సింగపూర్ఎయిర్లైన్స్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దాదాపు 100 మిలియన్లకు పైగా సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్చేయనుంది. విస్తారా పనితీరుపట్ల ఆకర్షితమై అనుకున్నదానికి కంటే దాదాపు రెట్టింపు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే పెట్టుబడులను ధృవీకరించిన ఎస్ఏఐ ఎంత పెద్దమొత్తంలో అనేది వెల్లడించడానికి మాత్రం నిరాకరించింది. కమర్షియల్ కాన్ఫిడెన్సియల్ అని తెలిపింది. న్యూఢిల్లీ-ఆధారిత క్యారియర్ 2020వరకు లాభాలను ఆశించకపోయినప్పటికీ రెండు సంవత్సరాలకు పైగా దేశీయంగా సేవలందిస్తూ మంచి గ్రోత్ను సాధిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రాంతీయ క్యారియర్ సిల్క్ ఎయిర్ ద్వారా వినియోగదారులను పెంచుకునేందుకు విస్తారాతోభాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా సింగపూర్క స్టమర్ సింగపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకోవడానికి, అక్కడినుంచి 10 దేశీయ గమ్యస్థానాలకు విస్తారా ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో తమ బ్రాండ్ గురించి ఎక్కువ అవగాహనను విస్తరించడంలో ఈ ఒప్పందం కీలక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, తమ అంతర్జాతీయ ఆకాంక్షలకు మద్దతు ఇస్తుందని విస్తారా ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే విస్తారాలో ఎస్ఏఐ 49శాతం వాటాను కలిగిఉంది. వచ్చే ఏడాది జూన్నాటికి విస్టారా దాని 20 వ విమానం కొనుగోలుతో ముఖ్యమైన మైలురాయిని తాకుతుందని, అంతర్జాతీయ విమానాలను నిర్వహించడానికి వైమానిక మార్గాలను సుగమం చేస్తుందని భావిస్తున్నారు. జాయింట్ వెంచర్ వైమానిక సంస్థలో టాటా గ్రూప్ 51 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం 45 దేశీయ రూట్లలో13 విమానాలను విస్తారా కలిగింది. భారత పౌరవిమానయాన నియమాల ప్రకారం, ఇంర్నేషనల్ సేవలందించలంటే విస్టారాకు కనీసం 20 విమానాలు ఉండాలి. ఈ నేపథ్యంలో సుమారు 50 వైడ్ బాడీస్ సహా 100 విమానాలను కొనుగోలు ప్రణాళికలోఉన్నట్టు సమాచారం. అయితేఈ వార్తలను విస్తారా కొట్టిపారేసింది. టఫ్ ఆపరేటింగ్ వాతావరణం ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్ విస్తరించాలనేప్రణాళికలను పదేపదే ఎస్ఐఏ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకారం ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా భారతదేశం ఉంది. -
ప్రేమికులకు విస్తారా లవ్లీ ఆఫర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ స్పెషల్ ఫైవ్ డే సేల్ ద్వారా ప్రేమికులకు బంపర్ ఆపర్ ప్రకటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా అయిదురోజుల ప్రత్యేక వాలెంటైన్స్ డే అమ్మకాలకు తెరతీసింది. ఈ తగ్గింపు ధరలను సోమవారం ప్రకటించింది. రూ. 899 ప్రారంభమయ్యే విమాన్ టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎకానమీ క్లాస్ లో ఒక మార్గం ప్రయాణానికి గాను అన్నీ కలిపి ఈ తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది. టిక్కెట్ల అమ్మకాలు సోమవారం ఫిబ్రవరి 13, 2017 ప్రారంభం. శుక్రవారం ఫిబ్రవరి 17 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఫిబ్రవరి 28, 2017 సెప్టెంబర్ 20, 2017 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ క్లాస్ లో 60శాతం డిస్కౌంట్ తో స్పెషల్ డిస్కౌంట్, ప్రీమియం ఎకానమీలో 40శాతం వరకు రాయితీని వినియోగదారులకు అందిస్తోంది. భారతదేశంలో విస్తారా 20ప్రదేశాలకు ప్రయాణించేందుకు ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చని ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల లాంచ్ చేసిన పోర్ట్ బ్లెయిర్ (అండమాన్), అమృత్సర్, లేహ్ (లడఖ్) సహా, కొత్తగా ప్రారంభించిన కోలకతా-పుణే మార్గంలో కూడా ఈ ఆఫర్ను వర్తింపచేయనున్నట్టు విస్తారా తెలిపింది. -
విస్తారా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా తన రెండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. సంస్థ ఇందులో భాగంగా ఎకానమీ తరగతి ప్రయాణానికి సంబంధించిన టికెట్లను రూ.899ల ప్రారంభ ధరతో ప్రయాణికులకు అందిస్తోంది. నేటి నుంచి జనవరి 12 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు జనవరి 25 నుంచి అక్టోబర్ 1 వరకు ఉన్న మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని విస్తారా వివరించింది. ఈ పరిమిత కాల ఆఫర్ కేవలం దేశీ నెట్వర్క్కు మాత్రమే వరిస్తుందని పేర్కొంది. సంస్థ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకునే కస్టమర్లు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్స్ను పొందొచ్చని తెలిపింది. -
‘విస్తారా’, గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్లు
న్యూఢిల్లీ: విస్తారా, గోఎయిర్ విమానయాన సంస్థలు తక్కువ ధరలకు విమానయానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. విస్తారా రూ.999కు, గోఎయిర్ రూ.736కు విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. ‘సెలెబ్రేషన్ సేల్’’ పేరుతో అందిస్తున్న తమ ఆఫర్ కోసం బుధవారం నుంచి శుక్రవారం అర్థరాత్రి (ఈ నెల 25) వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని విస్తారా వెల్లడించింది. వచ్చే నెల 5 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 లోపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, ఎకానమీ క్లాస్కు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. గోఎరుుర్ విమానయాన సంస్థ తక్కువ ధరకే, రూ.736 ధరకు విమాన సర్వీసులను ఆఫర్ చేస్తోంది. అన్ని రూట్లలో వర్తించే ఈ ఆఫర్కు నేటి వరకూ (ఈ నెల 24న) టికెట్లు బుక్ చేసుకోవచ్చని గో ఎరుుర్ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్తో వచ్చే ఏడాది జనవరి 9 నుంచి మార్చి 31 వరకూ ప్రయాణించవచ్చని పేర్కొంది. రూ.500, రూ.1,000 నోట్లు నేటి అర్థరాత్రి వరకూ తమ టికెట్ కౌంటర్లలో చెల్లుతాయని వివరించింది. -
రూ.949 నుంచి విస్తారా విమాన టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా ఆల్ ఇన్క్లూజివ్ వన్-వే టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ రూ.949ల ప్రారంభ ధరలతో ప్రయాణికులకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 6 నుంచి 10 మధ్యలో టికెట్లను బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 12 నుంచి 30 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఇది పరిమిత కాల ఆఫర్ అని, ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకోవాలని విస్తారా తెలిపింది. -
2018 నుంచివిస్తారా విదేశీ సర్వీసులు!
ముంబై : దేశీ విమానయాన సంస్థ ‘విస్తారా’ అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇది 2018 ప్రధమార్దంలో విదేశాలకు విమానాలను నడిపే అవకాశముంది. ‘ఇప్పటికిప్పుడే ఏదోరకంగా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని మేం ఊవ్విళ్లూరడం లేదు. కానీ కచ్చితంగా విదేశాలకు విమానాలను నడుపుతాం. దీనికి మేం పూర్తిగా సన్నద్ధం కావాల్సి ఉంది.’ అని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఇందులో ఆయన యాక్సిస్ బ్యాంక్తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రధమంగా సార్క్, గల్ఫ్ దేశాలకు విదేశీ సర్వీసులను నడుపుతామని సంజీవ్ తెలిపారు. తమ వద్ద ఉన్న విమానాలు ఈ ప్రాంతాలకు మాత్రమే రాకపోకలు నిర్వహించగలవని పేర్కొన్నారు. కాగా విస్తారా దేశంలో తన కార్యకలాపాలను గతేడాది జనవరి 9న ప్రారంభించింది. ప్రస్తుతం 17 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతోంది. అక్టోబర్ నుంచి పోర్ట్బ్లెయిర్కు కూడా విమానాలు నడపనున్నది. ప్రస్తుతం విస్తారా వద్ద 11 విమానాలు ఉన్నాయి. సంస్థ అక్టోబర్లో మరో రెండింటిని డెలివరీ చేసుకోనున్నది. -
విస్తారా, ఎయిర్ ఏషియా కొత్త విదేశీ సర్వీసులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విమానయాన పథకం నేపధ్యంలో దేశీయ విమానయాన సంస్థలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ సర్వీసుల నిబంధనలో మార్పులు కొన్ని నూతన సంస్థలకు కాసులు పండించనున్నాయి. 5/20 నిబంధనలోని అయిదేళ్ల సర్వీసును తొలగించడంతో ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా సంస్థలు తమ విదేశీ సర్వీసులను ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు. ఇవి రాబోయే సంవత్సరంలో ఇంటర్నేషనల్ సేవలను ఆశించవచ్చని ఇండియా అండ్ సౌత్ ఏషియా ఐ జెట్స్ ఎండీ రాజన్ మెహ్రా మీడియాకు వెల్లడించారు. మొత్తంమీద సుదీర్ఘకాల నిరీక్షణ తరువాత వచ్చిన నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ పరిశ్రమ దీర్ఘకాలిక వృద్ధికి సానుకూలమని మెహ్రా అభిప్రాయపడ్డారు. అలాగే కొత్త పౌర విమానయాన విధానం భారతదేశం విమాన పరిశ్రమలో కొత్తగా ప్రవేశించిన ఎయిర్ఏషియా, విస్తారా లాంటి వాటికి మంచి ప్రయోజనకరంగా ఉంటుందనీ, మరోవైపు ఇండిగో, జెట్ ఎయిర్వేస్ వంటి పాత ఆటగాళ్లకు ప్రతికూలంగా ఉంటుందని తెలిపారు. 2020 నాటికి 300 మిలియన్ ప్రయాణీకుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. గంటకు రూ. 2500 చార్జ్ దేశీయ విమానయానానికి ప్రోత్సహాన్నిస్తుందన్నారు. పరిశ్రమల చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై దృష్టిపెట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టూరిజం, దేశీయ వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని మెహ్రా చెప్పారు. చార్జీల తగ్గింపుతోపాటు నిర్వహణ, మరమ్మత్తు. ఆపరేషన్స్ (ఎంఆర్వో) లకు రాయల్టీ చెల్లింపులకై కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం మంచి పరిణామమన్నారు. అంతేకాదు ఈ ఎంఆర్వో సర్వీసులపై వ్యాట్ ను ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని కేంద్రం చెప్పిందన్నారు . ఈ చర్యలు భారతదేశాన్ని ఎంఆర్ వో హబ్ గా మార్చేందుకు దోహదం చేస్తాయన్నారు. -
విస్తారా ధరలు కూడా తగ్గాయ్.. !
న్యూఢిల్లీ : వివిధ డిస్కౌంట్ స్కీమ్స్ తో విమానసంస్థలు ప్రయాణికుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ వంటి సంస్థలు ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా విస్తారా సైతం తన ప్రయాణికుల టిక్కెట్ ధరలకు డిస్కౌంట్ ను ప్రకటించింది. జూలై, సెప్టెంబర్ మధ్యలో ప్రయాణించేవారికి టిక్కెట్ ధరలపై 25 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది. మరో సంస్థ జెట్ ఎయిర్ వేస్ తన 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ను పొడిగించింది. దేశీయ మార్గాల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణాలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని, జూన్ 8 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు జాయింట్ వెంచర్ అయిన విస్తారా.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ ను తీసుకొస్తోంది. జూన్ 10 వరకు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చని విస్తారా తెలిపింది. ఆఫర్ ధరల కింద రూ.1,099కి ఎకానమీ క్లాస్, రూ.2,284కు ప్రీమియం ఎకానమీ, రూ.5,775కు బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు ప్రారంభం కాబోతున్నాయని విస్తారా ప్రకటించింది. ఈ స్కీమ్ కింద ఢిల్లీ నుంచి ముంబై మార్గ ఎకానమీ క్లాస్ ఎయిర్ టిక్కెట్లకు రూ.1,920 ధర ఆఫర్ చేస్తున్నామని, రెగ్యులర్ గా అయితే ఈ మార్గంలో ధర రూ.2,743గా ఉంటుందని తెలిపింది. ఢిల్లీ-బెంగళూరు మార్గంలో కూడా రెగ్యులర్ గా ఉన్న రూ.3,093 ధరను, డిస్కౌంట్ ఆఫర్ కింద రూ.2,165కు తగ్గించేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రమోషన్ ఆఫర్ టిక్కెట్ బుక్ చేసుకున్న అందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. విస్తారా వెబ్ సైట్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికైతే అదనంగా 5శాతం డిస్కౌంట్ ఆఫర్ ను పొందుతారని తెలిపింది. -
హైదరాబాద్ టూ చంఢీగర్ వయా ఢిల్లీ
విస్తారా కొత్త సర్వీసు ప్రారంభం చంఢీగర్: దేశీయ విమానయాన సంస్థ విస్తారా మరో నూతన సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్ ఎయిర్లైన్సు, టాటాసన్స్ తో సంయుక్తంగా పనిచేసే విస్తారా ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి చంఢీగర్కు కొత్త సర్వీసును సోమవారం ప్రారంభించారు. త్వరలో ఢిల్లీ మీదుగా చంఢీగర్ నుంచి బెంగుళూరు, పుణే, ముంబై, భువనేశ్వర్, అహ్మదాబాద్ సర్వీసులను కూడా నడుపుతామని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ అధికారి సంజీవ్ కపూర్ తెలిపారు. చంఢీగర్, ఢిల్లీ మధ్య ధర రూ. 1990 గా ఉంది. ఈ రూటులో బిజినెస్, ఎకానమీనే కాకుండా ప్రీమియం ఎకానమీ క్లాస్ను ప్రవేశపెట్టాం. ఉత్తర భారతంలో చంఢీగర్ కీలక ప్రాంతం. ఇక్కడ పర్యాటకానికి, వ్యాపారానికి పుష్కల అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్, విశ్రాంత ప్రయాణికులపైనే ప్రధానంగా దృష్టి సారించాం. కొత్త రూటు అంతర్జాతీయ సర్వీసులకు అనుసంధానం చేసేందుకు వీలుగా ఉంటుందని సంజయ్ కపూర్ అన్నారు. నూతనంగా ప్రారంభమైన సర్వీసుతో కలిపి ఉత్తర భారతంలో ఆరు, దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో విస్తారా సేవలు అందిస్తోంది. ప్రస్తుతానికి తొమ్మిది విమానాలున్నాయి. అక్టోబర్ కల్లా మరో నాలుగు కొనుగోలు చేస్తాం. వారానికి 16 మార్గాల్లో 417 సర్వీసులు నడుపుతున్నాం. త్వరలో వీటిని 580 కి పెంచుతామని కపూర్ పేర్కొన్నారు. -
లాభాల గాల్లో విమానాలు..!
♦ అన్సీజన్లోనూ ప్రయాణికుల జోరు.. ♦ గత మూడు నెలల్లో 24 శాతం వృద్ధి ♦ బ్రేక్ ఈవెన్ స్థాయిని దాటి నిండుతున్న సీట్లు ♦ డిమాండ్కు తగ్గట్టు సర్వీసులు పెంచుకుంటున్న సంస్థలు ♦ వచ్చే నెల్లో మరో చౌక విమాన సంస్థ రంగంలోకి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కింగ్ఫిషర్... పారమౌంట్... దమానియా... ఈస్ట్ వెస్ట్... స్పైస్ జెట్... జెట్ ఎయిర్వేస్... ఇవన్నీ ఒకప్పుడు నష్టాల్లో మునిగి తేలినవే. కాకపోతే ఆ నష్టాల్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి కొన్నిటికి మాత్రమే వచ్చింది. ఆ శక్తి లేకపోవటంతో కింగ్ఫిషర్... పారమౌంట్, దమానియా, ఈస్ట్ వెస్ట్ వంటివి మూతపడ్డాయి. ఎయిర్ దక్కన్ వంటివి వేరే సంస్థల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. స్పైస్జెట్ యజమాని మారగా, జెట్ ఎయిర్వేస్ ఎతిహాద్ అండతో నిలదొక్కుకుంది. ఇదంతా ఎందుకంటే... అప్పుడప్పుడే భారతీయులకు విమాన ప్రయాణం అలవాటవుతున్న తరుణంలో వచ్చిన సంస్థలివి. కానీ అవి చేసిన అలవాటు ఇపుడు తారస్థాయికి చేరుకుంది. ఫలితం!! విమానాలు నిండిపోతున్నాయి. విమాన ప్రయాణికుల్లో రికార్డు వృద్ధి నమోదవుతోంది. విమానయాన సంస్థలు లాభాల బాట పడుతున్నాయి. అదీ కథ. ఇపుడు విమాన యాన సంస్థలకు అన్సీజన్ లేదు. మార్చి, ఏప్రిల్ నెలలు ఇప్పటిదాకా అన్సీజనే అయినా... ఈ సారి ఆ నెలల్లో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ప్రస్తుతం దేశంలో సర్వీసులందిస్తున్న 11 విమానయాన సంస్థల్లోనూ సీట్లు రికార్డు స్థాయిలో భర్తీ అవుతున్నాయి. మార్చి నెలల్లో అన్ని విమానాల సగటు లోడ్ ఫ్యాక్టర్ (సీట్లు నిండటం) రికార్డు స్థాయిలో 83 శాతానికి చేరుకుంది. అమెరికా తర్వాత విమానాల్లో సీట్లు ఈ స్థాయిలో భర్తీ అవుతున్నది ఇక్కడే కావటం విశేషం. సాధారణంగా 100 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాల్లో సీట్లు 75-80 శాతం నిండితే బ్రేక్ ఈవెన్కి వచ్చినట్లేనని, ఇప్పుడు చాలా సర్వీసుల్లో అంతకంటే ఎక్కువ శాతం సీట్లు భర్తీ అవుతున్నాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొన్నాళ్ళు పరిస్థితులిలాగే ఉంటే అన్ని ఎయిర్లైన్స్ కూడా లాభాల్లోకి వస్తాయన్నారు. స్పైస్ జెట్ టాప్; విస్తారా లాస్ట్ గత నెలలో స్పైస్ జెట్ సగటు లోడ్ ఫ్యాక్టర్ 91 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 75 శాతంతో విస్తారా చివరి స్థానంలో ఉంది. నిజానికి 75 శాతమంటే అది కూడా బ్రేక్ ఈవెన్ పరిస్థితే. అంటే దాదాపు ఏ విమానయాన సంస్థా నికరకంగా సీట్లకు సంబంధించి నష్టాల్ని మూటగట్టుకోవటం లేదన్న మాట. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎయిర్కోస్టా లోడ్ ఫ్యాక్టర్ 82.1 ఉండగా, తరచు కొన్ని విమానాలు రద్దవుతున్నా ట్రూజెట్ కూడా 77.9 శాతం ఎస్ఎల్ఎఫ్ను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన ప్రయాణీకుల సంఖ్య 10 కోట్లు దాటుతుందని ఎడల్వైజ్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.5 కోట్ల మంది ప్రయాణించారు. ఇదే సమయంలో విమాన ఇంధన ధరలు కూడా బాగా తగ్గడంతో దాదాపు అన్ని విమానయాన సంస్థలు నిర్వహణ లాభాల్లో నడుస్తున్నాయి. డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీ బస్సుల్లాగా టాప్ ఎక్కి ప్రయాణించే పరిస్థితి కనపడుతోందని ఒక ఎయిర్లైన్స్ సంస్థ ప్రతినిధి నవ్వుతూ వ్యాఖ్యానించారంటే డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత సీజన్లో ఎయిర్లైన్ సంస్థలు ఆఫర్లు ప్రకటించడాన్ని తగ్గించాయి. మరో కొత్త ఎయిర్లైన్... పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో చౌక విమానయాన రంగంలోకి కొత్తగా మరో సంస్థ ప్రవేశించబోతోంది. తమిళనాడుకు చెందిన సీఎంసీ విద్యాసంస్థ ‘ఎయిర్ కార్నివాల్’ పేరుతో రంగంలోకి రాబోతోంది. మే నెల్లో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీంతో దేశీయంగా విమాన సర్వీసులు అందిస్తున్న సంస్థల సంఖ్య 12కి పెరగనుంది. మిగిలిన సంస్థలు కూడా డిమాండ్కు తగ్గట్టుగా విమానాల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఈ ఏడాది కొత్తగా మరో 50 విమానాల సేవలు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్కోస్టా ఈ డిసెంబర్ నాటికి విమానాల సంఖ్యను 4 నుంచి 8కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూజెట్ కూడా తన విమానాల సంఖ్యను ఈ ఏడాదిలోగా మూడు నుంచి 10కి పెంచుకోవాలనుకుంటోంది. వృద్ధి నమోదవుతోందిలా... ♦ అన్సీజన్గా భావించే ఫిబ్రవరిలో ఈ ఏడాది 79 లక్షల మంది ప్రయాణించారు. గతేడాదికన్నా దాదాపు 25% అధికం. ♦ 2016 తొలి మూడు నెలల్లో ప్రయాణించిన వారి సంఖ్య 2.3 కోట్లు. గతేడాది ఇదే కాలంలో ప్రయాణించిన 1.85 కోట్ల మందికన్నా దాదాపు 23 శాతం అధికం. -
విస్తార... హోలీ ప్రత్యేక ఆఫర్
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన సర్వీసులు నిర్వహించే విస్తార విమానయాన సంస్థ హోలీ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ చార్జీలను అందిస్తోంది. ఈ హోలీ ప్రత్యేక చార్జీలు రూ.999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే, దీనికి పన్నులు, ఇతర చార్జీలు అదనమని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్లో భాగంగా ఒక వైపు విమాన చార్జీలు ఎకానమీ క్లాస్కు రూ.999 నుంచి, ప్రీమియమ్ ఎకానమీ క్లాస్కు రూ.2,299 నుంచి మొదలవుతాయని వివరించింది. ఈ ప్రత్యేక చార్జీలకు బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, ఈ నెల 28 అర్థరాత్రి వరకూ ఉంటుందని, సీట్లు పరిమితమని తెలిపింది. తామందించే అన్ని దేశీయ రూట్లకు ఈ చార్జీలు వర్తిస్తాయని, కొత్త రూట్లు-జమ్ము, శ్రీనగర్, కోచిలకు కూడా ఈ చార్జీలు వర్తిస్తాయని విస్తార పేర్కొంది. -
టాటా విమాన సర్వీసులిక విస్తారం
న్యూఢిల్లీ: టాటా సన్స్-సింగపూర్ ఎయిర్లైన్స్ల జాయింట్ వెంచర్కు బ్రాండ్ నేమ్ విస్తారను, లోగోను సోమవారం ఆవిష్కరించారు. ఆకాశంలాగా పరిమితులు లేని విస్తరణను సూచించే విస్తారను బ్రాండ్నేమ్గా ఎంపిక చేశామని విస్తార సీఈవో టీక్ యోహ్ చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. విమాన సర్వీసులకు సంబంధించిన ఆమోదం (ఏయిర్ ఆపరేటర్ పర్మిట్-ఏఓపీ) ను పొందే ప్రక్రియ తుది దశలో ఉందని టీక్ యోహ్ చెప్పారు. తమ సంస్థ తొలి విమానం వచ్చే నెలలో వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా మొత్తం ఐదు విమానాలతో సర్వీసులను నిర్వహిస్తామని వివరించారు. ఎయిర్బస్ ఏ-320 విమానాలను ఇరవై వరకూ లీజుకు తీసుకోవాలని ఇప్పటికే ఈ కంపెనీ నిర్ణయించింది. వీటిల్లో అధునాతన తాజా టెక్నాలజీతో తయారైన ఏ-320 విమానాలు ఏడు వరకూ ఉన్నాయి. 11 నగరాలకు సర్వీసులు: కాగా విస్తార బ్రాండ్నేమ్, లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో టాటా-ఎస్ఐఏ ఎయిర్లైన్స్ చైర్మన్ ప్రసాద్ మీనన్, బోర్డ్ డెరైక్టర్లు ముకుంద్ రాజన్, స్వీ వాహ్ మ్యాక్లు కూడా పాల్గొన్నారు. ఏయే నగరాలకు విమాన సర్వీసులను నడపాలనే విషయమై దాదాపు తుది నిర్ణయానికి వచ్చామని టీక్ యోహ్ పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఈ సంస్థ ప్రారంభంలో ఐదు నగరాలకు విమాన సర్వీసులందిస్తుందని, ఆ తర్వాత 11 నగరాలకు వాటిని విస్తరిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్, జమ్మూ, శ్రీనగర్, పాట్నా, చండీఘర్ నగరాలకు ఈ సంస్థ విమాన సర్వీసులను అందించనున్నదని సమాచారం. భారత వైమానిక మార్కెట్లో విస్తార చెప్పుకోదగ్గ సంస్థ అవుతుందని ప్రసాద్ మీనన్ విశ్వాసం వ్యక్తం చేశారు. విస్తరంగా-ప్రయాణికుల సహజ ఎంపిక అవుతుం దని పేర్కొన్నారు. టాటా గ్రూప్ పెట్టుబడులు పెడుతున్న మరో విమానయాన సంస్థ ఎయిర్ ఏషి యా తమకు పోటీ కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయన్నారు.