-
రైతు బంధుపై రేవంత్ దొంగనాటకాలు
ఆత్మకూర్(ఎస్): రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి దొంగనాటకాలు ఆడుతున్నాడని, రైతు బంధు వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజీ పడేది లేదని, ఓట్ల రాజకీయం అవసరం లేదన్నారు. యాసంగి సాయం అందకముందే వానాకాలం సీజన్ మొదలైందన్నారు. వానాకాలం రైతు భరోసాపై రేవంత్ వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతు బంధు కొనసాగించేలా లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలవుతున్నా ఒక్క పథకాన్ని కూడా అమలుచేయలేదన్నారు. రాబోయే రోజుల్లో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు కనుమరుగు చేసేలా కనిపిస్తోందన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నిండాలంటే, కాంగ్రెస్ కబంధహస్తాలనుంచి తెలంగాణకు విముక్తి కలగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపీగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, బత్తుల రాజేంద్రప్రసాద్, నేరెళ్ల వెంకన్న, మర్ల చంద్రారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, బెల్లంకొండ యాదగిరి, ముద్దం క్రిష్ణారెడ్డి, కసగాని బ్రహ్మం, మిర్యాల వెంకటరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, సోమిరెడ్డి వెంకటరెడ్డి, బొడ్డు మల్సూర్, బోళ్ల వెంకటరెడ్డి, సోమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వాంకుడోత్ వెంకన్న, గునగంటి భిక్షం ఉన్నారు.ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
రైతు సంక్షేమమే ధ్యేయం
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, 150 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులే నన్ను గెలిపిస్తాయి. నేను రైతు బిడ్డను. రైతుల కష్టాలపై అవగాహన ఉంది. కృష్ణా, గోదావరి నదుల్లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన వాటా కోసం పోరాడుతా. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేస్తా. నాగార్జునసాగర్పై హక్కు కోల్పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా సాగర్ నుంచి ఈసారి సాగునీరు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తా. 1.90 లక్షల ఉద్యోగాలిచ్చాం బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో 1.90 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పటి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను విస్మరించింది. నేను గెలిచాక నిరుద్యోగుల తరఫున పోరాడుతా. రోడ్లు, రైల్వేలైన్లు అభివృద్ధి చేయిస్తా.. గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు రైల్వే, రోడ్ల సమస్యలను పట్టించుకోలేదు. నేను ఎంపీగా గెలిచాక రోడ్లు, రైల్వేల అభివృద్ధికి బాటలు వేస్తా. సూర్యాపేట మీదుగా హైదరాబాద్ – విజయవాడ రైలు మార్గం ఏర్పాటుకు కృషిచేస్తా. జాతీయ రహదారిపైన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, హైవేల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపడతా. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి -
యువత, మహిళలకు ఉపాధి కల్పిస్తాం
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పదేళ్లుగా అభివృద్ధితో కూడిన పాలనను అందిస్తున్నారు. ప్రజల్లో ఆయనపై ఉన్న సానుకూలత ఉంది. యువత మోదీ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. అందుకు నన్ను ఎంపీగా గెలిపిస్తారు. నేను ఎంపీగా గెలిస్తే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఎంపీలుగా ఉన్న వారు పట్టించుకోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలో వచ్చాక ఆయా పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తా. మహిళలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించి వారి స్వయం సమృద్ధి కోసం చర్యలు తీసుకుంటా. సాగునీటి కష్టాలు దూరం చేస్తా పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అత్యధికంగా రైతులే ఉన్నారు. ఇక్కడి ప్రజలు, రైతులకు సాగునీటి కల్పన విషయంపై ప్రత్యేక దృషి సారిస్తా. నదుల అనుసంధానం విషయమై కేంద్ర ప్రభుత్వం మాట్లాడి.. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి జిల్లా రైతులకు సాగునీటి కష్టాలను దూరం చేస్తా. డ్రైపోర్టు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతా. హైవేలు, రైల్వే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో హైవేల అభివృద్ధిపై దృష్టిపెడతాను. హుజూర్నగర్–దాచేపల్లి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు, మిర్యాలగూడ – జగ్గయ్యపేట ప్యాసింజర్ రైలు, సూర్యాపేట మీదుగా హైదరాబాద్– విజయవాడ కొత్త రైల్వే లైన్కు ప్రతిపాదిస్తా. బీబీనగర్ – నడికుడి డబ్లింగ్, నల్లగొండ – మాచర్ల రైల్వే లైన్ల పనుల వేగానికి కృషిచేస్తా. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి -
సాగునీరు, రైల్వే, రహదారులపై ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం ఉంది. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు, ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి సమన్వయం, కృషితో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాం. నేను ఎంపీగా గెలిస్తే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తా. దేవరకొండలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 7 ఎత్తిపోతల పథఽకాలు, మిర్యాలగూడలో 3, నాగార్జునసాగర్లో నెల్లికల్, ఇతర ఎత్తిపోతల పథకాలు పెండింగ్లో ఉన్నాయి. బ్రాహ్మణ వెల్లెంల చివరి దశలో ఉంది. వాటన్నింటినీ పూర్తి చేయిస్తా. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతం పరిస్థితుల ఆధారంగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తా. రైల్వే సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తా. నడికుడి – బీబీనగర్ డబ్లింగ్ పనులను వేగంగా పూర్తి చేసేలా చూస్తా. నల్లగొండ – కొండమల్లేపల్లి రోడ్డుతోపాటు పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కృషిచేస్తా. కేంద్రంతో మాట్లాడి నవోదయ విద్యాలయాలు తీసుకొస్తా. సాగర్పై హక్కుల కోసం కృషి నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. వారే ప్రాజెక్టును అప్పగిస్తూ సంతకాలు చేశారు. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నావంతు పనిచేస్తా. -
తప్పిన అంచనాలు
ధాన్యం కొనుగోలుకు అధికారులు వేసిన అంచనాలు కొంతమేర తప్పాయి. కొనుగోలు కేంద్రాలకు దాదాపు 3.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా.. ఇప్పటి వరకు 1,84,484 మెట్రిక్ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేశారు. మరో 50వేల నుంచి 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు భావిస్తుండగా.. సుమారుగా 1,01,412 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు తగ్గి కొన్నిచోట్ల పొలాలు ఎండిపోయాయి. సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ఎస్సారెస్పీ జలాలు అందక సాగు చేసినా నెలరోజులకే ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో పంట దిగుబడి తగ్గింది. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నందున రెండురోజులుగా అక్కడక్కడా కొనుగోళ్లు మందగించాయని, తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. -
ఆటల్లో నైపుణ్యం పొందేలా..
హుజూర్నగర్ : వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈనెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి 10 మంది శిక్షకులను నియమించారు. రోజూ 450 మంది క్రీడాకారులు ఈ శిబిరాలను వినియోగించుకుంటున్నారు. పది ప్రాంతాల్లో క్రీడల్లో శిక్షణ జిల్లాలోని వివిధ మండలాల్లో పది చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. బాలబాలికలకు వేసవి సెలవులు వృథా కాకుండా వారి క్రీడా నైపుణ్యాలను పెంచుకునేందుకు వీటిని ప్రారంభించారు. ఒక చోట అథ్లెటిక్స్, రెండు చోట్ల కబడ్డీ, రెండు చోట్ల ఖోఖో, ఐదు చోట్ల వాలీబాల్ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటిలో నడిగూడెంలో అథ్లెటిక్స్, చిలుకూరు, నూతనకల్ మండలం యర్రపహాడ్లో కబడ్డీ, సూర్యాపేట మండలం బాలెంల, గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలలో ఖోఖో, అనంతగిరి మండలం గొండ్రియాల, హుజూర్నగర్ మండలం లింగగిరి, పెన్పహాడ మండలం గాజులమల్కాపురం, సూర్యాపేట మండలం టేకుమట్ల, మఠంపల్లిలో వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. ఉత్సాహంతో.. వేసవి క్రీడా శిబిరాలకు గతంలో విశేష స్పందన లభించేది. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే వారు. నైపుణ్యాలు పెంచుకునేవారు. కరోనా నేపథ్యంలో 2019–20, 2020–21లో ఈ శిబిరాలు నిర్వహించలేదు. 2022 నుంచే ఈ శిబిరాలను మళ్లీ నిర్వహిస్తున్నారు. వీటిలో వివిధ ఆటల్లో నెల రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. జిల్లాలో చాలా వరకు పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలు ఆడించేదీ తక్కువే. దీంతో వేసవి క్రీడా శిబిరాలు చిన్నారులకు కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. క్రీడాకారులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పది ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు జిల్లా పరిధిలో ప్రాంతాల వారీగా శిక్షకులను నియమించారు. శిక్షకుడికి నెలరోజుల పాటు గౌరవ వేతనం చెల్లిస్తారు. వారు నెల రోజులు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మే 31 వరకు క్రీడా శిబిరాలు కొనసాగుతాయి. పది మంది శిక్షకులను నియమించాం. ఆసక్తిగల బాల బాలికలు ఈ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. వీటిల్లో తర్ఫీదు పొందిన వారికి క్రీడలశాఖ తరఫున ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. – కె జగదీశ్వర్రెడ్డి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ అధికారి ఫ జిల్లా వ్యాప్తంగా 10 చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఫ కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్లో తర్ఫీదు ఫ సద్వినియోగం చేసుకుంటున్న పిల్లలు ఫ రోజూ 450మంది వరకు హాజరు ఫ నెలాఖరు వరకు శిక్షణ -
No Headline
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై కాంగ్రెస్ ధీమా డ్రైపోర్టు, రైల్వే లైన్లు, ఉపాధిపై హామీలిస్తున్న బీజేపీ గతంలో చేసిన పనులు, కాంగ్రెస్ వైఫల్యాలను నమ్ముకున్న బీఆర్ఎస్ తాము గెలిస్తే.. చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రణాళికలను సాక్షితో పంచుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు -
యాసంగి రైతు భరోసాకు బ్రేక్!
భానుపురి (సూర్యాపేట) : రైతులకు పంటల పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా నిధులకు బ్రేక్ పడింది. ఈ యాసంగి సీజన్ ప్రారంభంలోనే చిన్న, సన్నకారు(ఐదెకరాలలోపు) రైతులకు డబ్బులను ప్రభుత్వం జమచేసింది. ఆ తర్వాత ఈ నిధులు విడుదల చేయకపోవడంతో చాలాకాలంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఐదెకరాల లోపు వారికే రైతుభరోసా ఇస్తారని ప్రచారం జరగ్గా.. ఈనెల 6వ తేదీనుంచి గతంలో మాదిరిగానే ఈ యాసంగి సీజన్కు సంబంధించి అందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం, మంగళవారం మధ్యాహ్నం వరకు జిల్లాలోని ఐదెకరాల నుంచి 15 ఎకరాల వరకు భూమిఉన్న రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం జమచేసినట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బుల జమను నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో డబ్బుల జమ ప్రక్రియ నిలిచిపోయింది. గతంలో చిన్న,సన్నకారు రైతులకు.. యాసంగి ప్రారంభంలోనే విడతల వారీగా ఐదెకరాల లోపు నిధులువిడుదల చేసింది. జిల్లాలో మొత్తం 2,70,853 మంది రైతులు ఉండగా 2,47,348 మందికి ఇదివరకే నిధులు జమ అయ్యాయి. ఇందులో 0 – 2.5 ఎకరాల లోపు 1,98,542 మంది, 2.5 ఎకరాల నుంచి 5.0 ఎకరాల లోపు 48,806 మంది ఉన్నారు. మిగిలిన 5.0 ఎకరాల నుంచి 10.0 ఎకరాల లోపు 19,489 మంది, 10 ఎకరాల పైబడి ఉన్న రైతులు 4,016 మంది.. మొత్తం 23,505 మందికి ఈనెల 6 నుంచి జమ అవుతున్నాయి. అయితే మంగళవారం సాయంత్రానికి నిధుల జమను ఎన్నికల కమిషన్(ఈసీ )నిలిపి వేసింది. అప్పటికే జిల్లాలో 15 ఎకరాల వరకు ఉన్న వారికి సాయం అందినట్లు రైతులు చెబుతున్నారు. ఇక మిగిలినకొద్ది మందికి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జమకానున్నాయి.ఫ ఈసీ ఆదేశాలతో తాత్కాలికంగా నిలిపివేత ఫ తాజాగా రెండు రోజుల పాటు కొందరు రైతుల అకౌంట్లలో జమ అయిన పెట్టుబడి సాయం ఫ గతంలో ఐదెకరాలలోపు 2,47,348 మందికి అందిన డబ్బులు -
No Headline
కాస్త శాంతించిన సూర్యుడు భానుపురి (సూర్యాపేట) : జిల్లా వ్యాప్తంగా సూర్యుడు కాస్త శాంతించాడు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఒక్క మునగాల మండలంలోని 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రెడ్ జోన్ లో ఉంది. మోతె మండలంలో 44.6 డిగ్రీలు, మేళ్లచెరువులో 43.9, మఠంపల్లిలో 43.9, కోదాడలో 43.8, నూతనకల్లో 43.7 చొప్పున ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యల్పంగా తిరుమలగిరిలో 39.6 డిగ్రీలు నమోదైంది. -
ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు
సూర్యాపేట: లోక్ సభ ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని కోదాడ, హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎన్నికల రూట్ మొబైల్స్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లారు. ఎన్నికల సామగ్రి స్ట్రాంగ్ రూంల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించడం నుంచి ఎన్నికలు ముగిసి మళ్లీ స్ట్రాంగ్ రూలకు చేరే వరకు రూట్ మొబైల్స్ సిబ్బంది అప్రమత్తంగా పని చేయాలన్నారు. గ్రామాల్లో పరిస్థితులు గమనిస్తూ ఈవీఎంలకు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి పూర్తి భద్రత కల్పించడంలో రూట్ మొబైల్స్ సిబ్బంది ప్రధానమైన భూమికపోషించాలన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రజితరెడ్డి, చరమందరాజు, ఎలక్షన్ సెల్ సిబ్బంది, టెక్నికల్ టీం సిబ్బంది, రూట్ మొబైల్ సిబ్బంది ఉన్నారు. ఎన్నికల్లో సెంట్రల్ ఆర్ముడ్ సిబ్బంది వినియోగం ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసులతో పాటు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఆయా పోలీస్, సైనిక్ అధికారులతో ఎస్పీ మాట్లాడారు. ఎన్నికల విధులు, జిల్లా పరిస్థితులను ఆయన వివరించారు. సిబ్బందికి గైడ్గా స్థానిక పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. ఎన్నికల సామగ్రికి ఆర్ముడ్ రక్షణ కల్పించడం, ఎస్కార్ట్, స్ట్రాంగ్ రూమ్ గార్డ్స్, పోలింగ్ కేంద్రం వద్ద రక్షణ కల్పించడం ముఖ్యమైన విధులు అని వివరించారు. ఫ ఎస్పీ రాహుల్హెగ్డే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రయాణ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను నమ్మి బ్యాగులు ఇవ్వొద్దని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎనిమిది ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఫిర్యాదులను త్వరగా పరిశీలించి బాధితులకు భరోసా కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. -
పాఠ్యపుస్తకాలు వచ్చాయ్..
ఫ పాఠశాలల పునఃప్రారంభం రోజు అందించేందుకు సన్నాహాలు ఫ జిల్లాకు ఐదు లక్షల పుస్తకాలు అవసరం ఫ ఇప్పటివరకు చేరినవి 27,680 పుస్తకాలు ఫ మిగతావి విడతల వారీగా వచ్చే అవకాశం సూర్యాపేటటౌన్: వచ్చే విద్యాసంవత్సరం (2024–25)లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలను జిల్లా కేంద్రానికి చేరవేస్తున్నారు. ఐదు లక్షల పుస్తకాలకు గాను.. జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 62వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ ఏటా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తోంది. మొత్తం పార్ట్–1, పార్ట్–2కు సంబంధించి ఐదు లక్షల వరకు పుస్తకాలు అవసరం ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రెండు విడతల్లో 27,680 పుస్తకాలు వచ్చాయి. మిగిలిన పుస్తకాలు కూడా విడతల వారీగా జిల్లా కేంద్రంలోని గోదాంకు వస్తాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యా సంవత్సరంలో రెండుసార్లు పంపిణీ చేస్తుండగా పార్ట్–1 పుస్తకాలు వస్తున్నాయి. అర్ధ సంవత్సరం ముగిసేలోపు పార్ట్–2 పుస్తకాలు పంపిణీ చేస్తారు. తెలుగు, ఇంగ్లిష్లో ముద్రణ ప్రస్తుతం పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్లో ముద్రిస్తున్నారు. దీంతో రెండు మాధ్యమాల వారు చదువుకునే వీలుంది. రెండేళ్ల క్రితం తొలిసారిగా 3 నుంచి 8వ తరగతి వరకు సరఫరా చేశారు. ఈ ఏడాది 9వ తరగతి వరకు బైలింగ్వెల్ పుస్తకాలు రానున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి పాఠానికి రెండు భాషల్లో ముద్రించడంతో విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జూన్ వరకు పూర్తిస్థాయిలో వస్తాయి ఇప్పటి వరకు రెండు విడతల్లో పుస్తకాలు వచ్చాయి. వాటిని జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలోని గోదాంలో భద్రపరుస్తున్నాం. జూన్ వరకు పూర్తి స్థాయిలో వస్తాయి. వచ్చాక మండలాలకు పంపిస్తాం. విద్యార్థులకు పుస్తకాల కొరత లేకుండా చూస్తాం. బైలింగ్వెల్ పుస్తకాలతో విద్యార్థుల సామర్థ్యం పెరుగుతుంది. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
లడ్డూ నాణ్యత, సైజులో తేడా రావద్దు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన లడ్డూలు అందజేయాలని దేవస్థానం ఈఓ భాస్కర్రావు అక్కడి బాధ్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఆలయ సన్నిధిలో ఉన్న లడ్డూ తయారీ విభాగాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. లడ్డూ తయారీ నాణ్యత, పరిమాణం(సైజు)పై సెక్షన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. లడ్డూ తయారీలో పరిమాణం, నాణ్యతలో ప్రమాణాలు పాటించాలని, తేడా రావద్దని సూచించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన లడ్డూను తిని రుచి చూశారు. అనంతరం టిక్కెట్ కౌంటర్కు వెళ్లి పరిశీలించారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట) : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆత్మకూరు ఎస్. మండలంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలించి మాట్లాడారు. ధాన్యం తడిసిందని అధైర్య పడవద్దన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ముందస్తుగా తార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ మిల్లులకు పంపాలని, మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 31,335 మంది రైతుల నుంచి 1,84,485.000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు ఇప్పటివరకు రూ. 225 కోట్లు చెల్లించామని వివరించారు. కేంద్రాల్లో కొత్త గోనె సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు అడ్రస్ లేకుండా చేయాలి
కోదాడ: అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం రాత్రి కోదాడ రంగా థియేటర్ సెంటర్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక గారడీ విద్యలు ప్రదర్శిస్తున్నారని, గుడులు, దేవుళ్లు అంటూ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని, ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి కుటుంబాల్లో మాత్రం రెండేసి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రే తనకు రైతుబంధు రాలేదని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తెలియజేస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా కేసీఆర్.. రైతుబంధును ఆపలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రతి పక్షనాయకుడిగా హామీల అమలు గురించి అడుగుతుంటే సీఎం హోదాలో రేవంత్ దిగజారి మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేంద్రంలో తెలంగాణ చక్రం తిప్పాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈరోడ్షోలో బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కటికం సత్తయ్యగౌడ్, సుంకర అజయ్కుమార్, పంకజ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
రవాణా చెక్పోస్టులు ఎత్తివేత!
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అంతర్ రాష్ట్ర చెక్పోస్టులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి చెక్పోస్టు సిబ్బంది లారీల డ్రైవర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని అనుమతులను ఆన్లైన్లో ఇస్తున్నందున ఈ చెక్పోస్టులను ఎత్తివేయడమే మంచిది. – కనగాల నాగేశ్వరరావు, కోదాడ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఫ ఉమ్మడి జిల్లాలో కోదాడ, వాడపల్లి, సాగర్ వద్ద చెక్పోస్టులు ఫ అవినీతికి ఆనవాళ్లుగా మారాయని ఆరోపణలు ఫ ఎన్నికల అనంతరం ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం●కోదాడ: అవినీతి నిలయాలుగా మారాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ప్రభుత్వం త్వరలో ఎత్తివేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖకు 15 చెక్పోస్టులు ఉండగా వాటిలో మూడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత కోదాడ వద్ద తెలంగాణ– ఏపీ సరిహద్దులో విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై , వాడపల్లి (విష్ణుపురం)వద్ద అద్దంకి– నార్కట్పల్లి రహదారిలో, నాగార్జునసాగర్ వద్ద హైదరాబాద్–సాగర్రోడ్డులో రవాణా శాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్పోస్టు వద్ద 10 నుంచి 15 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల పర్మిట్లను తనిఖీ చేయడం, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించడం వీరి పని. కానీ ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వానహనదారుల నుంచి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీటి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాటిని ఎత్తివేసి, అందులో పని చేస్తున్న 150 మంది సిబ్బందిని అవసరమైన చోట వినియోగించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ముక్కుపిండి వసూలు వాహనాలకు అన్ని అనుమతులు ఉన్నా ఈ చెక్పోస్టుల వద్ద సిబ్బంది వాహనదారుల నుంచి ఎంట్రీ ఫీజు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ చెక్ పోస్టుల వద్ద డ్యూటీలు చేయడానికి సిబ్బంది పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇక ఓవర్లోడ్ పేరుతో, పశువులను రవాణా చేసే వాహనాల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని చెక్పోస్టుల వద్ద అనధికార సిబ్బందిని నియమించుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రతి నెలా వీరు కొంత మందికి నెలవారీ వేతనాలు లక్షల్లో ఇస్తున్నారని తెలిసింది. ఆన్లైన్లోనే అనుమతులు జారీ చేస్తున్నందున.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత సరిహద్దులో ఏర్పాటు చేసిన వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులను ప్రభుత్వం ఎత్తివేసి రవాణా శాఖ చెక్పోస్టులను కొనసాగిస్తోంది. రవాణా శాఖకు చెందిన అన్ని అనుమతులు, పర్మిట్లు ఆన్లైన్లో జారీ చేస్తున్నందున ఈ చెక్పోస్టులను ఎత్తివేయాలని గతంలో కేంద్రంకోరినా గత సర్కార్ పట్టించుకోలేదు. తాజాగా ప్రభుత్వం ఈ చెక్పోస్టులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ చెక్ పోస్టులను ఎత్తివేయనున్నట్లు సమాచారం. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని ఆదివారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిగావించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సం జరిపించారు. కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజన, మంత్రపుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసా దాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, బదిరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషన మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
హుజూర్నగర్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటు వేసేందుకు అవకాశం ప్రతి ఎన్నికల్లోనూ కలిస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తు పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరు ఓటు వేసేందుకు హుజూర్నగర్ పట్టణంలోని వీవీఎం హైస్కూల్లో రెండు కౌంటర్లు, సూర్యాపేటలో ఆరు కేంద్రాలు, కోదాడలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లు ఈనెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు ఈ కౌంటర్లలో ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు 8,344 మంది ఉద్యోగుల నమోదు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారంతా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎనన్ఐసీ) పోర్టల్లో 12 ఫారం అప్లోడ్ చేసి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే 8,344 మంది ఉద్యోగులు పోస్టల్ ఓటింగ్కు నమోదు చేసుకున్నారు. ఇందులో సూర్యాపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్కు 2944 మంది, హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో 2,800 మంది, కోదాడ నియోజకవర్గంలో 2,600 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం వరకు హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో 396 మంది, సూర్యాపేటలో 716 మంది, కోదాడలో 573 మంది ఉద్యోగులు మొత్తం 1685 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఫ ఇప్పటివరకు ఓటు వేసిన 1,685 మంది ఉద్యోగులు ఫ 8వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ -
‘నీట్’కు 997 మంది హాజరు
సూర్యాపేటటౌన్: వైద్య విద్య ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని మొత్తం మూడు సెంటర్లలో 1,028 మంది విద్యార్థులకు గాను 997 మంది విద్యార్థులు హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో 528 మంది విద్యార్థులకు 508 మంది హాజరయ్యారు. 20 మంది గైర్హాజరయ్యారు. అంజలి స్కూల్ సెంటర్లో 216 మందికి 211 మంది హా జరు కాగా ఐదుగురు గైర్హాజరయ్యారు. ఎంఎస్సార్ సెంట్రల్ స్కూల్ సెంటర్లో 284 మంది విద్యార్థులకు 278 మంది హాజరు కాగా ఆరుగురు గైర్హాజరైనట్లు సిటీ కో ఆర్డినేటర్ ప్రభాకర్ తెలిపారు. ఫ 31 మంది విద్యార్థులు గైర్హాజరు ఫ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష -
ఉరుములు.. మెరుపులు
సాక్షి నెట్వర్క్: సూర్యాపేట జిల్లాలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులతో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. సూర్యాపేట పట్టణంలోని ఎంజీరోడ్డు, కొత్తబస్టాండ్ చౌరస్తాతో పాటు పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. నాగారం మండలంలో మామిడి, నిమ్మకాయలు నేలరాలాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాలెంల గ్రామంలోని ఓ ఇంటిపై, జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో దుర్గాభవాని హోటల్ వెనుక తాటిచెట్టుపై పిడుగు పడింది. నాగారం మండల కేంద్రం సమీపంలో జీబీకే సిమెంట్ బ్రిక్స్ ఎదురుగా తాటిచెట్టుపై, నాగారం గ్రామ శివారులోని శివాలయం సమీపంలో పిడుగు పడింది. అదేవిధంగా మద్దిరాల మండల పరిధిలోని చందుపట్లలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. అర్వపల్లిలో ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు, రేకులు, దుకాణాల బోర్డులు లేచిపోయాయి. కాగా కొనుగోలు కేంద్రాల్లో, హైవేలపై పోసిన ధాన్యం తడిసిపోయింది. నేరేడుచర్లలోని జాన్పహాడ్ రోడ్లో చెట్లు విరిగి రోడ్డుపై పడిపోయాయి. తిరుమలగిరిలో విద్యుత్ స్తంభాలు, భారీ వక్షాలు నేలకొరిగాయి. ఫ ఈదురుగాలులతో కూడిన వర్షం ఫ నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ఫ అంధకారంలో పలు గ్రామాలు -
వంటింట్లో ధరల మంట!
తిరుమలగిరి (తుంగతుర్తి): నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, కోడి గుడ్ల వంటి నిత్యావసరాల ధరలు చూసి సామాన్య, మధ్య తరగతి ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది క్రితంతో పోలిస్తే వంటింటి సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ప్రతి ఇంటా నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతోంది. పెరిగిన సన్న బియ్యం ధరలు సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. ఏడాది వ్యవధిలోనే సన్నబియ్యం క్వింటాకు రూ.1,200, పాత బియ్యం రూ.1,000 చొప్పున పెరిగాయి. ప్రతి ఒక్కరూ సన్న బియ్యం వినియోగిస్తుండటంతో ధరలు బాగా పెరిగాయి. సీజన్ ఆరంభంలోనే కొత్త బియ్యం ధర క్వింటా రూ.3,800 పలికితే ఇంకో రెండు నెలలు గడిస్తే మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం కొత్తవి క్వింటాకు రూ.4,800, పాతవి రూ.5,600 ధర పలుకుతోంది. గతంలో కంటే సన్న ధాన్యం తెగుళ్లతో నష్టం జరగడం, పంట దిగుబడి సరిగా రాకపోవడంతో బియ్యం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నాయి. కనికరించని కంది పప్పు కంది పప్పు ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగిస్తుంటారు. పప్పు లేకుంటే చాలా మందికి ముద్ద దిగదు. అయితే కంది పప్పు మార్కెట్లో కుతకుత ఉడుకుతోంది. గత ఏడాది జనవరిలో కిలో రూ.110 ఉంటే జూన్లో రూ.150కి చేరింది. ప్రస్తుతం కిలో కంది పప్పు రూ.170 ఉంది. జిల్లాలో పప్పు దినుసుల సాగు అంతంత మాత్రంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఇతర రాష్ట్రాల్లో కూడా దిగుబడి తగ్గిందని, అందువల్లే డిమాండ్కు అనుగుణంగా దిగుమతులు లేవని వ్యాపారులు చెబుతున్నారు. దరాఘాతంతో సామాన్యులు కందిపప్పుకు ప్రత్యామ్నాయంగా పెసర, శనగ, ఎర్ర పప్పులను వినియోగిస్తున్నారు. మినపప్పు ధర కూడా రూ.130 నుంచి రూ.200లకు పెరిగింది. అల్లం వెల్లుల్లి కూడా అంతే. బహిరంగ మార్కెట్లో అల్లం, వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరం జనవరిలో కిలో రూ.60 పలికిన అల్లం ధర ప్రస్తుతం కేజీ రూ.150 పలుకుతోంది. ప్రస్తుతం మార్కెట్లో వెల్లుల్లి ధర కేజీకి రూ.300 పలుకుతుంది. వేసవిలో మామిడి పచ్చళ్లకు ఉపయోగించే అల్లం, వెల్లుల్లి ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలు ఇలా..ధరలు 2023 2024 (రూ.లో) (రూ.లో) బియ్యం (కొత్తవి) 3,300 4,800 బియ్యం (పాతవి) 5,200 6,000 కంది పప్పు 110 170 పెసర పప్పు 90 130 శనగ పప్పు 70 90 మినపప్పు 140 200 అల్లం 60 150 వెల్లుల్లి 70 300ఫ భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు ఫ సామాన్య, మధ్య తరగతి ప్రజల నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం నిత్యావసరాలు కొనలేని పరిస్థితి గతంలో కంటే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. కనీసం కంది పప్పు కూడా తినలేని పరిస్థితి నెలకొంది. మామిడి కాయ పచ్చడి పెట్టాలన్నా ధరలు పెరగడంతో వెనకాడుతున్నాం. – రమ, తిరుమలగిరి -
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి చివ్వెంల(సూర్యాపేట): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం చివ్వెంల మండల పరిధిలోని గుంపుల, ఉండ్రుగొండ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ నానాటికి తగ్గుతుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీటీసీ భుక్యా సంజీవ్ నాయక్, మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్రెడ్డి, ధరావతు బాబు నాయక్, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహరావు, పీఏసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్రావు, నాయకులు షేక్ భాషా, ధరావతు సాగర్, జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, ఽగుగులోతు చాంప్లా నాయక్, అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలిదురాజ్పల్లి (సూర్యాపేట): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నియమించిన సిబ్బంది గతంలో నిర్వహించిన ఎన్నికల శిక్షణకు హాజరు కాని వారు ఈనెల 7న నిర్వహించే శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు హాజరు కాని 40 మంది సిబ్బందికి మరోసారి చివరి అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. హాజరు కాకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘బుద్ధ ధర్మం’ అందరికీ ఆమోదయోగ్యంసూర్యాపేట : బుద్ధ ధర్మం అందరికీ ఆమోదయోగ్యమని బుద్దిస్ట్ సొసైటీ రాష్ట్ర నాయకుడు గంపల అంతయ్య, న్యాయవాది తళ్లమల్ల హసేన్ అన్నారు. ప్రముఖ రచయిత డి.నటరాజ్ రచించిన ‘బుద్ధ ధర్మం– ఆనంద దాయకం’ పుస్తకాన్ని ఆదివారం బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆవి ష్కరించారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేపాక లింగయ్య, సామజిక న్యాయవేదిక అధ్యక్షుడు భద్రయ్య, తెలంగాణ ఉద్య మ నాయకులు చెన్నోజు రమణచారి, గోపి, వెంకన్న, నాగేందర్ నాయక్ పాల్గొన్నారు. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు
భానుపురి (సూర్యాపేట): మరో తొమ్మిది రోజుల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వంద శాతం పోలింగ్ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఇంటింటికీ పోల్ చిట్టీల పంపిణీని ప్రారంభించారు. జిల్లాలోని బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లకు పోల్ చిట్టీలను అందజేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 90.02 శాతం చిట్టీల పంపిణీ పూర్తయింది. ఈనెల 8వ తేదీ వరకు పోల్చిట్టీ ఇచ్చేందుకు అవకాశముంది. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో 76.35 శాతం చిట్టీలను అందించగా.. మిగతా చోట్ల 90 శాతానికి పైగానే పంపిణీ చేశారు. ఓటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఓటు హక్కును వినియోగించుకునే వారికి పోల్చిట్టీలు ఉపయోగకరంగా ఉంటాయి. గతంలో పోలింగ్కు ముందురోజు రాజకీయ పార్టీల నాయకులు తమ గుర్తులతో కరపత్రాలను పంపిణీ చేయగా.. ఈ పత్రాలు ఓటర్లకు సరిగా అందకపోవడంతో ఓటు ఎక్కడ ఉన్నది.. పోలింగ్ కేంద్రం ఎక్కడ.. అసలు ఓటు ఉందా.. లేదా అనే విషయంలో స్పష్టత లేకపోయేది. దీంతో ఓటర్లు చాలా ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పోల్చిట్టీల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో ఓటర్ల సమాచారంతో పాటు సంబంధిత బీఎల్ఓ పేరు, ఫోన్ నంబర్, పోలింగ్ కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలు, పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలు ఇందులో పొందుపర్చారు. జిల్లాలో పది లక్షలకు పైగా ఓటర్లు..! ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 9.85 లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు 10.02 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. నూతనంగా 14,050 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరందరికీ ఈ పోల్చిట్టీలను పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఈనెల 8వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఇప్పటికే జిల్లాలో 90.02 శాతం పోల్ చిట్టీలు పంచారు. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో 95.39 శాతం మంది ఓటర్లకు, కోదాడ పరిధిలో 92.65శాతం మంది ఓట ర్లకు, సూర్యాపేటలో 76.35 శాతం, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో 95.97 శాతం మంది ఓటర్లకు చిట్టీలు చేరాయి. మరో 97,787 మంది ఓటర్లకు అందాల్సి ఉంది.ఫ ఇప్పటికే 90.02 శాతం ఓటర్లకు చేరిన చిట్టీలు ఫ 8వ తేదీ వరకు పంపిణీకి గడువు -
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు మెరుగుపరుస్తున్నట్లు ఈఓ భాస్కర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదం కొనుగోలులో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గ్రహించి శివాలయం ఎదుట ప్రత్యేకంగా టికె ట్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. శని, ఆది వారాలు, సెలవు రోజుల్లో కొండపైన బస్టాండ్లో తాత్కాలిక అదనపు ప్రసాదం కౌంటర్లు ఏర్పా టు చేశామని చెప్పారు. హెల్ప్డెస్క్, వేసవి దృష్ట్యా చలి వేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిత్య కై ంకర్యాలు, స్వామివారి సంకీర్తనలు భక్తులకు వినిపించేలా ప్రత్యేక దివ్యవాణి ఏర్పాటు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే క్యూకాంప్లెక్స్లో వాల్మోటింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులను ఆహ్లాదం పంచేందుకు ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు సంగీత, నృత్య సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 8లక్షల మందికి ఉచిత రవాణా సౌకర్యం ఒక్క ఏప్రిల్లోనే 369 బస్సులను కొండపైకి, కొండ కిందకు 9,825 ట్రిప్పులు నడిపించామని తెలిపా రు. 8లక్షల మంది భక్తులు ఉచితంగా రవాణా సౌకర్యం పొందారని, ఇందులో 70 శాతం మహిళలు, 30శాతం పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదాయం రూ.15,64,05,949 ఏప్రిల్ నెలలో దేవస్థానానికి వివిధ విభాగాల ద్వారా మొత్తం రూ.15,64,05,949 ఆదాయం సమకూరినట్లు ఈఓ భాస్కర్రావు తెలిపారు. ఇందులో బ్రేక్ దర్శనాల ద్వారా రూ.69,10,200, వీఐపీ దర్శనం రూ.96,50,650, ఆర్జిత సేవలు రూ.1,34,56,805, వ్రతాలు రూ.43,37,300, ప్రసాద విక్రయం రూ.3,05,08,630, హుండీలు రూ.2,33,53,382, విచారణ శాఖ రూ.24,37, 718, ఇతర పూజల ద్వారా రూ.5,58,51,264 వచ్చినట్లు వెల్లడించారు. -
పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట: లోక్సభ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా పోస్టల్ బ్యాలెట్తో ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు సూచించారు. శనివారం సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు, ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన పెసిలిటేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చన్నారు. ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని సిబ్బంది చివరి అవకాశంగా ఈనెల 7న ఉదయం 10 గంటలకు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణకు హాజరు కాకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్లు శ్యామ్ సుందర్రెడ్డి, కృష్ణయ్య, మహీందర్రెడ్డి ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. సోషల్ మీడియాపై నిఘా పెంచాలి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై నిఘా పెంచి క్షుణంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. చెక్ పోస్టుల వద్ద, బ్యాంకు లావాదేవీలపైనా నిఘా పెంచాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు నగదు రూ.277.38 లక్షలు, రూ.149.16 లక్షల విలువైన 37,369.21 లీటర్ల మద్యం, రూ.24.56లక్షల విలువైన 46 వాహనాలు, రూ.121.43 లక్షలు విలువైన బంగారం, ఇతర ఆభరణాలు, రూ.93.51 లక్షలు విలువైన వస్తువులతో మొత్తం 6.66.04కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఫ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు ఇంటి వద్ద ఓటేసిన 644 మంది జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఈ నెల 3, 4 తేదీల్లో నిర్వహించిన హోం ఓటింగ్లో 644 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకటరావు తెలిపారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 508 మంది, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 136 మందితో కలిపి మొత్తం 644 మంది హోం ఓటింగ్ విధానంలో ఓట్లు వేశారని పేర్కొన్నారు. -
ఇండియా కూటమితోనే దేశరక్షణ
నేరేడుచర్ల, పాలకవీడు: ఇండియా కూటమితోనే దేశ రక్షణ సాధ్యమని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి నేరేడుచర్లలో నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డితో కలిసి రోడ్డు షో, సభ నిర్వహించారు. అంతకుముందు పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామంలో ఎన్నికల ప్రచార సభకు మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి రఘువీర్రెడ్డిని దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలపించాలని కోరారు. ఈ ఎన్నికలతో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్లకు డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోని వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు నెరవేర్చిందని, త్వరలో రైతు రుణమాఫీ చేయబోతున్నామన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రఘువీర్రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నేరేడుచర్లలో మున్సిపల్ కౌన్సిలర్ వేమురి నాగవేణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి.రమేష్బాబు, మాజీ సర్పంచ్ గంటా మల్లారెడ్డి, మత్స్య సొసైటీ చైర్మన్ యామిని వీరయ్యలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేరేడుచర్లలో జరిగిన రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, నల్లగొండ డీడీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్నాయక్, పార్టీ నేరేడుచర్ల మండల అధ్యక్షుడు కొణతం చిన వెంకట్రెడ్డి, నేరేడుచర్ల జెడ్పీటీసీ రాపోలు రాపోలు నర్సయ్య, మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాశ్, వైస్ చైర్మన్ అలక సరిత, కౌన్సిలర్లు లలిత, నాగవేణి, సులోచన, బాషా, నాయకులు జ్యోతిబాబు, గోపాల్, నాగిరెడ్డి, శకుంతల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జానపహాడ్లో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివారెడ్డి, పార్టీ పాలకవీడు మండల అధ్యక్షుడు ఏవీ.సుబ్బారావు, ఎంపీపీ భూక్యా గోపాల్, జెడ్పీటీసీ మాలోతు మోతీలాల్, నాయకులు బైరెడ్డి జితేందర్రెడ్డి, బెల్లంకొండ నరసింహారావు, సందీప్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ నేరేడుచర్ల, జాన్పహాడ్లో ఎన్నికల ప్రచారం
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా
కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)
AP: డీబీటీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement