invest
-
బార్క్లేస్ బ్యాంక్ పెట్టుబడులు.. రూ. 2,300 కోట్లకు రెడీ
ముంబై: దేశీ అనుబంధ సంస్థ బార్క్లేస్ బ్యాంక్ పీఎల్సీ ఇండియాకు బ్రిటిష్ మాతృ సంస్థ బార్క్లేస్ బ్యాంక్ రూ. 2,300 కోట్ల మూలధనం సమకూర్చనుంది. తద్వారా బ్యాంక్ బ్యాలన్స్షీట్ పటిష్టంకావడంతోపాటు ఇన్వెస్ట్మెంట్, ప్రయివేట్ బ్యాంకింగ్లో బిజినెస్ విస్తరించేందుకు సహాయపడనుంది.దీంతో మరింతమంది క్లయింట్లకు బ్యాంక్ చేరువకానుంది. ప్రధానంగా కార్పొరేట్, ఫైనాన్షియల్ పెట్టుబడులున్న క్లయింట్లు, అత్యంత సంపన్న వర్గాలలో మరింత విస్తరించనున్నట్లు బార్క్లేస్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. వెరసి ప్రపంచంలోనే వేగవంత వృద్ధిలో ఉన్న ఆర్ధిక వ్యవస్థపట్ల దీర్ఘకాలిక కట్టుబాటును ప్రదర్శిస్తున్నట్లు తెలియజేసింది.బార్క్లేస్ ఇండియా ఆర్థిక పరిస్థితిఇండియా రేటింగ్స్ ప్రకారం.. బార్క్లేస్ ఇండియా క్యాపిటల్ అడెక్వసీ రేషియో (సీఏఆర్) 2024 మార్చి చివరి నాటికి 15.93 శాతంగా ఉంది. బాసెల్-3 మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు కనీసం టైర్-1 మూలధన నిష్పత్తిని 11 శాతంగా నిర్వహించాలి.2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి భారత్లో కంపెనీ ఆస్తులు రూ.53,910 కోట్లుగా ఉన్నాయి. బార్క్లేస్ ఇండియా రుణాల్లో ఎక్కువ భాగం టర్మ్ లోన్స్ (2024 ఆర్థిక సంవత్సరంలో 49.2 శాతం), బిల్ డిస్కౌంటింగ్ (35.0 శాతం), వర్కింగ్ క్యాపిటల్ రుణాలు (15.8 శాతం) ఉన్నాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది. -
రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’
ప్రత్యేక పెట్టుబడి పథకాలకు(SIF) సంబంధించి సెబీ నిబంధనల కార్యచరణను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి సిఫ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కనీసం రూ.250 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS)లో అయితే పెట్టుబడికి కనీసం రూ.50 లక్షల ఉండాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేస్తూ.. అధిక పెట్టుబడి పెట్టే సామర్థం, రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్)ను ప్రవేశపెట్టడం గమనార్హం.అన్ని రకాల సిఫ్ కేటగిరీల్లో ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) సాధనాలను వినియోగించుకోవచ్చు. మొత్తం మీద పెట్టుబడి విలువ రూ.10 లక్షలకుపైనే ఉండాలి. మార్కెట్ పతనం కారణంగా రూ.10లక్షల్లోపునకు వచ్చేస్తే, మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. సిఫ్లో 25 శాతం మేర డెట్లో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాండ్ 1 నుంచి 5 వరకు మొత్తం ఐదు స్థాయిల్లో రిస్క్ను సెబీ వర్గీకరించింది.ఇదీ చదవండి: ఏఐకి కంపెనీల జైప్రస్తుత మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ నుంచి అనుమతి తీసుకుని సిఫ్లను ప్రారంభించొచ్చు. ఇందుకు నిర్దేశిత అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కనీసం మూడేళ్లకు పైగా కార్యకలాపాలతో, రూ.10,000 కోట్ల నిర్వహణ ఆస్తులు కలిగినవి దరఖాస్తు చేసుకోవచ్చు. మరో మార్గంలో కనీసం 10 ఏళ్లు ఫండ్ నిర్వహణలో అనుభవం ఉండి, కనీసం రూ.5,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహించిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ను సిఫ్కు నియమించడం ద్వారా వీటి నిర్వహణకు అనుమతి కోరొచ్చని సెబీ ప్రకటించింది. -
ప్రపంచం చూపు భారత్ వైపు
భోపాల్: భారతదేశ ఆర్థిక ప్రగతి పట్ల ప్రపంచం మొత్తం ఎంతో ఆశాభావంతో ఉందని, ఇలాంటి పరిణామం మన దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ నుంచి సామాన్య ప్రజలతోపాటు ఆర్థికవేత్తలు, ప్రపంచ దేశాలు, సంస్థలు ఎంతో ఆశిస్తున్నాయని అన్నారు. మనపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నాయని తెలిపారు. సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ‘ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్–గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రపంచం భవిష్యత్తు భారత్లో ఉందనడంలో సందేహం లేదన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచబ్యాంక్ సైతం ఆశాభావం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. ‘సోలార్ పవర్లో ఇండియా సూపర్ పవర్’ అని వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రశంసించిందని తెలిపారు. చాలా దేశాలు కేవలం మాటలకు పరిమితం అవుతుండగా, ఇండియా మాత్రం కార్యరంగంలోకి దిగి, ఫలితాలు సాధించి చూపుతోందని స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా ఏరోస్పేస్ సంస్థలకు మన దేశమే అతిపెద్ద సరఫరాదారుగా మారిందన్నారు. రాబోయే కొన్నేళ్లలో టెక్స్టైల్, టూరిజం, టెక్నాలజీ వంటి రంగాల్లో యువతకు కోట్లాది ఉద్యోగాలు దక్కబోతున్నాయని వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో దూసుకెళ్తున్నాం గత దశాబ్ద కాలంలో ఇంధన రంగంలో మునుపెన్నడూ లేని ప్రగతి సాధించామని ప్రధానమంత్రి మోదీ వివరించారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నామని చెప్పారు. పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్ల(రూ.6 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో గత ఏడాది 10 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో పెట్టుబడులకు అద్బుతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటిని సది్వనియోగం చేసుకోవాలని దేశ విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో మధ్యప్రదేశ్ ముందంజలో ఉందని తెలిపారు. రాష్ట్రం అతిపెద్ద తయారీ కేంద్రంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి వివరించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 18 నూతన విధాన నిర్ణయాలను మోదీ ఆవిష్కరించారు. విద్యార్థుల కోసమేఆలస్యంగా వచ్చా భోపాల్లో పెట్టుబడిదారుల సదస్సుకు ప్రధాని మోదీ కొంత ఆలస్యంగా హాజరయ్యారు. దీనిపై ఆయన సదస్సులో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఈ రోజు పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయని చెప్పారు. రాజ్భవన్ నుంచి తాను బయలుదేరే సమయానికే వారు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉందని తెలిపారు. తాను బయటకు వస్తే రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేస్తారు కాబట్టి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో దాదాపు 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరానని వెల్లడించారు. తన వల్ల విద్యార్థులు నష్టపోవడాన్ని తాను భరించలేనన్నారు. వారు సరైన సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. -
డెల్టా ఎల్రక్టానిక్స్ 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాల విస్తరణపై 50 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తైవాన్కి చెందిన డెల్టా ఎల్రక్టానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజమిన్ లిన్ తెలిపారు. స్మార్ట్ తయారీ, విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి భారత్ స్వయం సమృద్ధిని సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు ’ఎలెక్రమా 2025’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. బెంగళూరుకు దగ్గర్లోని కృష్ణగిరిలో ఉన్న ప్లాంటులో ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్కి అవసరమైన ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, టెలికం పరిశ్రమలో ఉపయోగించే డైరెక్ట్ కరెంట్ కన్వర్టర్లు, రెక్టిఫయర్లు మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నామని లిన్ చెప్పారు. ఈ ప్లాంటును కూడా విస్తరిస్తున్నామని తెలిపారు. 2003లో భారత మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి గణనీయంగా ఇన్వెస్ట్ చేసినట్లు లిన్ చెప్పారు. -
రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు
కేరళ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహంగా అదానీ గ్రూప్ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం, అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉండబోతున్నట్లు తెలిపింది. ‘ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ 2025’ సందర్భంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఈమేరకు ప్రకటన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సదస్సును ప్రారంభించారు.కీలక పెట్టుబడి రంగాలువిజింజం పోర్టు అభివృద్ధి: రూ.20,000 కోట్ల పెట్టుబడిలో గణనీయమైన భాగాన్ని విజింజం పోర్టు అభివృద్ధికి మళ్లించనున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే ఈ ప్రాజెక్టులో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. విజింజం పోర్టును దేశంలోనే మొదటి ట్రాన్స్ షిప్మెంట్ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యాన్ని 45 లక్షల ప్రయాణికుల నుంచి 1.2 కోట్లకు పెంచేందుకు అదానీ గ్రూప్ రూ.5,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇది విమానాశ్రయం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది.కొచ్చి లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్ హబ్: కొచ్చిలో లాజిస్టిక్స్, ఈ-కామర్స్ హబ్ను ఏర్పాటు చేసి అదానీ గ్రూప్ ఈ రంగంలో కేరళ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. సమర్థవంతమైన సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను ఈ హబ్ సులభతరం చేస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఈ-కామర్స్ పరిశ్రమకు మద్దతు ఇస్తుంది.సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు: కొచ్చిలో తన సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అదానీ గ్రూప్ ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఈ పెట్టుబడి నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలకు తోడ్పడుతుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: మస్క్, బెజోస్ను మించిన ‘బ్లాక్పాంథర్’ సంపదఅభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..కేరళ పురోగతికి అదానీ గ్రూప్ కట్టుబడి ఉందని కరణ్ అదానీ నొక్కిచెప్పారు. కేరళ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఈ వృద్ధిలో అదానీ గ్రూప్ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. సంస్థ ప్రకటించిన ఈ పెట్టుబడులు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్పారు. స్థానిక వ్యాపారాలను పెంచుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. -
రుణాల ప్రీక్లోజర్ ఛార్జీలపై ఆర్బీఐ స్పందన
బ్యాంక్లు రుణాల ముందస్తు చెల్లింపులపై రుణగ్రహీతల నుంచి ప్రీ పేమెంట్ పెనాల్టీ/ ఫోర్క్లోజర్ పేరుతో వసూలు చేసే ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా ఆర్బీఐ(RBI) ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. వ్యక్తులు, ఎంఎస్ఈలు తీసుకునే అన్ని ఫ్లోటింగ్ రేటు రుణాలు, వ్యాపార అవసరాలకు తీర్చుకునే వాటిపైనా ముందస్తు చెల్లింపుల చార్జీలు ఉండకూడదన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.‘టైర్ 1, టైర్ 2 ప్రాథమిక అర్బన్ కోపరేటివ్ బ్యాంక్లు, బేస్ లేయర్ ఎన్బీఎఫ్సీలు మినహా అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీలు (ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని రకాల బ్యాంక్లు, ఇతర ఎన్బీఎఫ్సీలు) ఫ్లోటింగ్ రేటు రుణాలను ముందుగా తీర్చివేస్తే ఎలాంటి చార్జీలు/పెనాల్టీలు విధించరాదు’ అని ఆర్బీఐ ముసాయిదా సర్క్యులర్ పేర్కొంది. ఎంఎస్ఈ రుణ గ్రహీతలు అయితే రూ.7.50 కోట్ల వరకు పూర్తి రుణ మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఎలాంటి లాకిన్ పీరియడ్ లేకుండా దీన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాపై మార్చి 21 వరకు సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.రిస్క్ ఇన్వెస్టింగ్పై అవగాహన కల్పించాలిఅన్సెక్యూర్డ్ రుణాలు, వేలం వెర్రిగా డెరివేటివ్స్ ట్రేడింగ్ పెరిగిపోతుండటంపై రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక లాభాల్లో ఉండే ఆకర్షణ వల్ల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత గురించి పట్టించుకోని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అనాలోచితమైన విధంగా ఆర్థిక సేవలను విస్తరిస్తే (ఆర్థికీకరణ) రిస్కులు తప్పవని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక సంస్థలను హెచ్చరించారు.ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’ఈ నేపథ్యంలో ప్రజల్లో అన్సెక్యూర్డ్ రుణాలు, స్పెక్యులేటివ్ ఇన్వెస్టింగ్ వల్ల తలెత్తే రిస్క్ల గురించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై ఆర్థిక రంగానికి చెందిన ఇతర నియంత్రణ సంస్థలతో కూడా ఆర్బీఐ కలిసి పని చేస్తోందని రావు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్లే అమాయకులు మోసగాళ్ల బారిన పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయని వివరించారు. ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వ్యవస్థే పూనుకోవాలని సూచించారు. శరవేగంగా మారిపోతున్న ప్రపంచంలో నియంత్రణనేది చాలా సున్నితమైన అంశంగా మారిందని రావు చెప్పారు. నియంత్రణను మరీ తగ్గిస్తే వ్యవస్థాగతంగా రిస్క్లు పెరుగుతాయని, అలాగని మరీ ఎక్కువగా నియంత్రిస్తే కొత్త ఆవిష్కరణలకు, రుణ లభ్యతకు అవరోధాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. -
ఆరేళ్లలో వేకా రూ. 100 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తలుపులు, కిటికీలకి సంబంధించిన యూపీవీసీ ప్రొఫైల్స్ తయారీ సంస్థ వేకా వచ్చే ఆరేళ్లలో కార్యకలాపాల విస్తరణపై రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ. 16 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఎన్సీఎల్–వేకాలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసి కంపెనీని టేకోవర్ చేసిన సందర్భంగా వేకా ఏజీ జర్మనీ సీఈవో ఆండ్రియాస్ హార్ట్లీఫ్ ఈ విషయాలు తెలిపారు. జేవీలో వేకాకు గతంలో 50 శాతం వాటాలు ఉండగా, తాజాగా ఎన్సీఎల్ నుంచి మరో 50 శాతాన్ని కొనుగోలు చేసింది. టేకోవర్తో ప్రస్తుతం ఎన్సీఎల్ వేకా చైర్మన్గా ఉన్న అశ్విన్ దాట్ల ఇకపై డైరెక్టరుగా కొనసాగనుండగా, ఎండీగా యూఎస్ మూర్తి కొనసాగుతారు. ప్రణాళికల్లో భాగంగా వేకా ప్రధానంగా ఎక్స్ట్రూషన్పైన, ఎన్సీఎల్.. ఫ్యాబ్రికేషన్పైనా దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్భంగా అశ్విన్ వివరించారు. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్లో 28 లైన్లతో ఒక ఎక్స్ట్రూషన్ ప్లాంటు, బెంగళూరులో ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఉన్నట్లు చెప్పారు. కంపెనీ గతేడాది రూ. 442 కోట్ల ఆదాయం ఆర్జించగా, 15 శాతం వార్షిక వృద్ధి అంచనా వేస్తున్నట్లు మూర్తి తెలిపారు. -
యూకేలో ఓయో పెట్టుబడులు
ఆతిథ్య రంగంలో ఉన్న ఓయో తాజాగా యూకేలో సుమారు రూ.540 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపింది. ప్రీమియం హోటల్ పోర్ట్ఫోలియో విస్తరణకు వచ్చే మూడేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. తద్వారా యూకే ఆతిథ్య రంగంలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించింది. విస్తరణలో భాగంగా దీర్ఘకాలిక లీజు, నిర్వహణ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. 2018లో యూకే మార్కెట్లో అడుగుపెట్టినట్టు కంపెనీ వివరించింది. 200లకుపైగా హోటళ్లు ఓయో జాబితాలో ఉన్నాయి. యూకేలో 65 నగరాల్లో ఇవి విస్తరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 ప్రీమియం హోటళ్లను అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ గతంలో ప్రకటించింది. ఇందులో ఇప్పటికే 18 తెరుచుకున్నాయి. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్లో జీఎంఆర్ ఎయిర్పోర్ట్కార్పొరేట్ల సుస్థిర అభివృద్ధి ప్రణాళికల అమలుకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్లో (యూఎన్జీసీ) చేరినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీఏఎల్) వెల్లడించింది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపరంగా యూఎన్జీసీ నిర్దేశించుకున్న పది సూత్రాలకు, అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (ఎస్డీజీ) అనుగుణంగా తమ వ్యూహాలు, కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వివరించింది. తమ విమానాశ్రయాలన్నింటికీ యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లేదా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ ఉన్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అక్రమ జామర్స్తోనే కాల్ డ్రాప్స్పర్యావరణహిత ఏవియేషన్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగే దిశగా ఇదొక కీలక అడుగని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ సీఈవో కిరణ్ కుమార్ గ్రంధి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా, మెడాన్ (ఇండొనేషియా) విమానాశ్రయాలను జీఏఎల్ నిర్వహిస్తోంది. అలాగే, విశాఖలోని భోగాపురం, గ్రీస్లోని క్రెటెలో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. ఫిలిప్పీన్స్లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సాంకేతిక సేవలు అందిస్తోంది. -
సీఎం రేవంత్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు
-
ఫైనాన్స్లో దిట్ట.. అయినా వాటి జోలికి వెళ్లలేదు!
"సర్దార్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ" అని పిలిచే భారత మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ( Manmohan Singh ) కన్నుమూశారు. ఫైనాన్స్ పట్ల అసమానమైన అవగాహన ఉన్న ఆయన దేశ ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ( Prime Minister ) పనిచేశారు. ఆర్థిక సంస్కర్తగా ( Economic Reforms ) ఘనత వహించిన మన్మోహన్ సింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ (invest ) చేసేవారు.. ఆయన పొదుపు ప్రణాళికల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సంప్రదాయ పెట్టుబడులకు ప్రాధాన్యత1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయినప్పుడు సెన్సెక్స్ 999 పాయింట్ల వద్ద ఉండేది. ఆయన సంచలనాత్మక బడ్జెట్ సంస్కరణల తరువాత ఆ సంవత్సరం చివరి నాటికి సెన్సెక్స్ ( Sensex ) దాదాపు రెండింతలు పెరిగింది. భారతదేశ ఆర్థిక రూపును దిద్దడంలో ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు ( FD ), పోస్టాఫీసు పొదుపు పథకాలు వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత ఇచ్చారు.ఎఫ్డీలు, పోస్టాఫీసు పొదుపులుప్రధానమంత్రిగా ఆయన 2013 అఫిడవిట్ ప్రకారం.. మన్మోహన్ సింగ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 11 కోట్లు. మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గురు శరణ్ కౌర్ ఇద్దరూ కలిసి రూ. 1 లక్ష నుండి రూ. 95 లక్షల విలువైన ఎనిమిది ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టారు. 2013 నాటికి వారి ఎప్డీలు, బ్యాంకు సేవింగ్స్ మొత్తం రూ. 4 కోట్లు కాగా వారి పోస్టాఫీసు ( Post office ) పొదుపు రూ. 4 లక్షలు.ఆస్తులు ఇవే.. 2019 నాటికి మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ రూ. 15 కోట్లు. ఢిల్లీ, చండీగడ్లోని ఆయన ఆస్తుల విలువ రూ. 7 కోట్లు. ఇక గురుశరణ్ కౌర్ వద్ద రూ. 3 లక్షల విలువైన 150 గ్రాముల బంగారం ఉండగా వారి బ్యాంకు ఎఫ్డీలు, సేవింగ్స్ రూ. 7 కోట్లు ఉన్నాయి. అదనంగా, వారు జాతీయ పొదుపు పథకం ( NSS )లో రూ.12 లక్షలు పొదుపు చేశారు.ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంమన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. ఉదాహరణకు 2013 ఫిబ్రవరి 2 నుండి క్రమశిక్షణతో కూడిన ఆయన ఆర్థిక ప్రణాళికను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఆ రోజున ఆయన మూడు ఎఫ్డీలలో రూ.2 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మూడేళ్లలో ఇవి రూ. 2.62 కోట్లు అయ్యాయి. ఈ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టారు. ఆరేళ్లలో ఆయన సంపద రూ.4 కోట్లకు చేరింది. ఈ క్రమశిక్షణతో కూడిన విధానం ఆయన పెట్టుబడులును సురక్షితంగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసింది.స్టాక్ మార్కెట్కు దూరంఫైనాన్స్ మీద అపారమైన అవగాహన ఉన్నప్పటికీ అధిక రాబడి కోసం మన్మోహన్ సింగ్ ఎన్నడూ స్టాక్ మార్కెట్ ( Stock market ) జోలికి వెళ్లలేదు. 1992లో స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ‘స్టాక్మార్కెట్ను తలుచుకొని నా నిద్రను చెడగొట్టుకోను’ అంటూ స్టాక్ మార్కెట్పై తన అంతరంగాన్ని పార్లమెంటులో వెల్లడించారు. -
ఎఫ్పీఐల స్పీడ్
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా అమ్మకాల బాటలో సాగిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఇటీవల ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు. దేశీ స్టాక్స్లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. వెరసి ఈ నెల తొలి వారంలో ఎఫ్పీఐలు రూ. 24,454 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అక్టోబర్లో కొత్త రికార్డుకు తెరతీస్తూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లో కొంత వెనకడుగు వేసి రూ. 21,612 కోట్ల అమ్మకాలకు పరిమితమయ్యారు. అయితే సెపె్టంబర్లో అంతక్రితం 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇకపై యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు, వడ్డీ రేట్లు, రాజకీయ భౌగోళిక అంశాల ఆధారంగా ఎఫ్పీఐల పెట్టుబడులు నమోదుకానున్నట్లు మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. -
డిపాజిట్లా.. స్టాక్మార్కెట్టా.. మన కష్టార్జితం ఎటువైపు..?
చినుకు చినుకు కలిస్తే జడివాన అవుతుందన్నది ఎంత వాస్తవమో... రూపాయి రూపాయి కూడబెడితేనే రేప్పొద్దున్న అవి వేలు, లక్షలుగా మారతాయి అన్నది కూడా అంతే వాస్తవం. ఇలా కూడబెట్టడానికి, సంపద పెంచుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టార్జితంతో చెలగాటం ఆడలేం కాబట్టి... ముందు చూపుతో తెలివిగా వ్యవహరించడం అత్యంత ప్రధానం. ఇదివరకటి రోజుల్లో మన ఖర్చులు పోగా మిగిలే డబ్బుల్ని బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో డిపాజిట్ చేసుకునేవారు. లేదంటే ఏ బంగారమో కొనుక్కునే వారు. ఇప్పుడు రోజులు మారాయి. సంప్రదాయ మార్గాలు కొత్త రూటు వెతుక్కున్నాయి. అలా ఈమధ్య కాలంలో నలుగురూ కొత్తగా దృష్టి పెడుతున్నదే షేర్లలో పెట్టుబడులు. మన డబ్బులు స్వల్ప వ్యవధిలోనే ఇంతలింతలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే క్రమశిక్షణ పాటించాలి సుమా.... మన దగ్గరున్న డబ్బులు ఏయే మార్గాల్లో దాచుకుంటే/పెట్టుబడి పెడితే ఎంత అవ్వడానికి అవకాశం ఉంటుందో ఉదాహరణ పూర్వకంగా పరిశీలిద్దాం. ఉదాహరణకు... మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం. వాటిని ఏయే మార్గాలకు మళ్లిస్తే ఎంత గిట్టుబాటు అవుతుందో పరిశీలిద్దాం.1. పోస్ట్ఆఫీస్వడ్డీరేట్లు 7-7.5 స్థాయిలోఉన్నాయి. అయిదేళ్లకాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్డీ ఏడాదికి రూ. 7,000-7,500. ఐదేళ్లకురూ.35,000 -37,500.* ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి అయిదేళ్లపాటు వదిలేయడమే. * చాలా తక్కువ రాబడి. * పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * అయితే పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించలేకపోయినా, మధ్యలో అవసరానికి వెనక్కి తీసుకున్నా చార్జీలు వసూలు చేస్తారు. * డిపాజిట్ చేసిన ఆరు నెలలలోపు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. * ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఎఫ్డీ వడ్డీ రేటు కాకుండా సేవింగ్స్ వడ్డీరేటు చెల్లిస్తారు. * ఏడాది పైబడితే.. వాస్తవానికి నిర్ధారించిన ఎఫ్డీ రేటు కంటే 2% తక్కువగా అప్పటికి ఎన్నినెలలు పూర్తయితే ఆనెలలకు లెక్కగడతారు. మిగతా కాలానికి సేవింగ్స్ రేటుని పరిగణనలోకి తీసుకుంటారు.2. బ్యాంకు డిపాజిట్వడ్డీ రేట్లు గరిష్టంగా 7 శాతం దాకా ఉన్నాయి. అయిదేళ్ల కాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్ డీఏడాదికి రూ. 7,000. అయిదేళ్లకు రూ.35,000.* ఇంచుమించు పోస్ట్ఆఫీస్ మాదిరిగానే ప్రతిఫలాలు ఉంటాయి. * ఎలాంటి రిస్క్ ఉండదు.* ఒకసారి పెట్టుబడి పెట్టి మెచ్యూర్ అయ్యే వరకు ఆగొచ్చు. * తక్కువ రాబడి కానీ పెట్టుబడి సురక్షితం. * అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. * పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. * డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించకపోతే అరశాతం నుంచి 1% దాకా (బ్యాంకునుబట్టి) చార్జీలు వసూలు చేస్తారు.* నిర్ణీత వ్యవధిలోపు డిపాజిట్ను ఉపసంహరించుకుంటే అప్పటిదాకా జమకూడిన వడ్డీ నుంచి గాని, అసలు మొత్తం నుంచి గాని ఈ చార్జీలను మినహాయించుకుంటారు. * మధ్యలోనే వెనక్ కితీసుకుంటే డిపాజిట్ మెచ్యూర్ అయినప్పుడు వచ్చే పూర్తి వడ్డీ మొత్తం కోల్పోతారు.3. స్టాక్ మార్కెట్కరోనా తర్వాతి కాలంలో చాలా మందిని ఆకర్షించిన పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది స్టాక్ మార్కెట్టేనని చెప్పుకోవచ్చు. కుప్పలు తెప్పలుగా డీమ్యాట్ అకౌంట్లు పుట్టుకొచ్చేశాయి. అయితే ఇలా ఖాతాలు తెరిచినవారిలో ఎక్కువ మంది పెట్టుబడుల కంటే ట్రేడింగ్ పైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అలా కాకుండా దీన్నో పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటే కచ్చితంగా అధిక ప్రతిఫలాన్ నిపొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిట్లో ఉన్నట్లే ఇందులోనూ ప్రయోజనాలు లోటుపాట్లు ఉండటం సహజం. అవేమిటంటే...* నిర్ణీత పెట్టుబడితోనూ అధిక రాబడి పొందొచ్చు. * డిపాజిట్లతో పోలిస్తే వచ్చే ప్రయోజనం ఎక్కువ. అదేసమయంలో రిస్క్ కూడా ఎక్కువే. * పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరిస్తే గ్యారంటీ ప్రతిఫలాన్ని పొందవచ్చు. * పై ఉదాహరణనే పరిశీలిస్తే లక్ష రూపాయల పెట్టుబడిని ఏడాది కాలవ్యవధితో పెట్టుబడి పెట్టారనుకుందాం. ఉదా: ఈ రూ. లక్షతో రూ. 2000 విలువ చేసే షేర్లు కొంటే 50 వస్తాయి. ఇంత విలువ ఉన్న షేర్లు ఏడాది వ్యవధిలో కనీసం రూ.200 పెరిగే అవకాశం ఉంటుంది (మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బాగోకపోతే షేర్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మార్కెట్లోకి అడుగు పెట్టేటప్పుడే మనం ఎంత వరకు రిస్క్ భరించగలమో చూసుకుని దిగాలి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎప్పుడూ మంచి ప్రతిఫలాలనే ఇస్తాయని చరిత్ర చెబుతున్న వాస్తవం). * మన 50 షేర్ల మీద రూ. 10,000 రిటర్న్ వచ్చినట్లన్నామాట. దీన్ని అయిదేళ్లకు లెక్కగడితే రూ. 50,000 ప్రతిఫలం ముట్టినట్లు. * బ్యాంకు డిపాజిట్లు, పోస్ట్ఆఫీస్ డిపాజిట్లతో పోలిస్తే అధిక రాబడి సాధించినట్లే అవుతుంది. ఇక్కడ నేను చెప్పింది కనీస స్థాయిలో లెక్కగట్టి మాత్రమే అన్న విషయాన్ని గ్రహించాలి. ఇంతకంటే ఎక్కువ కూడా... అంటే లక్షకు లక్ష, రెండు లక్షలు... అంతకుమించి కూడా సంపాదించిపెట్టే అవకాశం స్టాక్ మార్కెట్కు మాత్రమే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. * చెప్పానుగా..రిస్క్ కూడా ఎక్కువే... ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు షేర్ ధరను పడగొడితే సంపాదించడం మాట అటుంచి పోగొట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే మనం కొనే షేర్/షేర్ల నుబట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఏ చెత్తపడితే ఆచెత్త షేర్ ను కొనేయకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు. దీనికి సంబంధించి మళ్ళీ మరోసారి విడమర్చి చెబుతా..డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో మనం ఏది ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో అర్ధం అయిందనుకుంటా... బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీచేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
మూడు ఐఐటీలతో హ్యుందాయ్ ఒప్పందం.. భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుదీకరణ రంగాలలో సహకార పరిశోధనా వ్యవస్థను నెలకొల్పేందుకు మూడు ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుండై మోటార్ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం ఐదేళ్లలో 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ వీటిలో ఉన్నాయి.సహకారంలో భాగంగా హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఐఐటీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తామని, హ్యుండై మోటార్ గ్రూప్ నుండి స్పాన్సర్షిప్ల ద్వారా నిర్వహిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాటరీలు, విద్యుదీకరణలో పురోగతిని నడిపించడం హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాథమిక లక్ష్యం. ప్రధానంగా భారతీయ మార్కెట్ యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.ఈ సెంటర్ భారత విద్యా వ్యవస్థ నుండి ప్రతిభావంతులైన వ్యక్తులతో బలమైన నెట్వర్క్ను పెంపొందించగలదని నమ్ముతున్నామని, ఆవిష్కరణలు, భవిష్యత్తు వృద్ధిని ప్రోత్సహిస్తుందని హ్యుండై మోటార్ గ్రూప్ రిసర్చ్, డెవలప్మెంట్, ప్లానింగ్, కోఆర్డినేషన్ సెంటర్ హెడ్ నక్సప్ సంగ్ వివరించారు. హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకడమిక్–పారిశ్రామిక సహకార ప్రాజెక్టులపై సంయుక్త పరిశోధనలను నిర్వహించడమే కాకుండా.. కొరియా, భారత్కు చెందిన బ్యాటరీ, విద్యుద్దీకరణ నిపుణుల మధ్య సాంకేతిక, మానవ వనరుల మార్పిడిని సులభతరం చేస్తుందని సంస్థ తెలిపింది. -
13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్
మా అమ్మాయికి మంచి విద్య అందించాలనుంది. ప్రస్తుతం రూ.లక్షల్లో ఫీజులున్నాయి. తన వయసు ఇప్పుడు 10 ఏళ్లు. తన పేరుమీద నెలకు రూ.20వేల వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. మంచి రాబడులు వచ్చే పథకాలు ఏవైనా ఉన్నాయా? కనీసం 13 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి అంచనా వేయవచ్చు? - విక్రమ్పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే మీ కోరికకు ధన్యవాదాలు. మీరు అన్నట్లు ప్రస్తుతం ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. మీ పాప వయసు 10 ఏళ్లు. తాను ఉన్నత చదువులు చదివేటప్పటికీ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులు లెక్కేస్తే చాలా డబ్బు అవసరం అవుతుంది. విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతూనే ఉంది. పెట్టుబడిపై అధిక రాబడి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనికి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీరు నెలకు రూ.20వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. 13 ఏళ్ల పాటు 12 శాతం రాబడితో మీ ఇన్వెస్ట్మెంట్ దాదాపు రూ.75,18,623 అయ్యే అవకాశం ఉంది. అయితే ముందుగా మీరు అమ్మాయి భవిష్యత్ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించాలి. అందుకోసం టర్మ్పాలసీను తీసుకోవాలి. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీకు ఏదైనా జరిగినా పాలసీ డబ్బు మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ‘ఎవరికి చెల్లింపులు చేసినా నాకు తెలుస్తుంది’ఇటీవల కాలంలో బంగారం ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా? ఎంత సమయం పెట్టుబడి పెట్టాలి? - ప్రకాశ్పెట్టుబడులను డైవెర్సిఫైడ్గా ఉంచుకోవాలి. ఓకే విభాగంలో ఇన్వెస్ట్ చేయకూడదు. బంగారం ధరల్లో ఒడిదొడుకులు సహజం. తాత్కాలికంగా ధరలు పెరుగుతున్నాయని, తగ్గుతున్నాయని ఇన్వెస్ట్ చేయకూడదు. దీర్ఘకాలం కొనసాగితేనే ఇన్వెస్ట్ చేయాలి. మీ పెట్టుబడిలో 10-15 శాతం మేరకే బంగారంలో ఉండేలా చూసుకోవాలి. అంతకుమించి పెట్టుబడి మంచిది కాదు. మిగతా మొత్తాన్ని విభిన్న ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయండి. కనీసం అయిదేళ్లకు మించి సమయం ఉంటేనే మంచి రాబడులు అందుకోవచ్చు. -
డేటా సెంటర్ మార్కెట్లో బెంగళూరు కంపెనీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో ఉన్న బెంగళూరు కంపెనీ ఆర్ఎంజడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. డేటా సెంటర్ ఆపరేటర్ కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్తో సమాన వాటాగా సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్ఎంజడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ద్వారా భారత డేటా సెంటర్ మార్కెట్లో 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆర్ఎంజడ్ వెల్లడించింది.ఈ నిధులతో తొలుత నవీ ముంబై, చెన్నైలోని అంబత్తూర్లో ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తారు. భవిష్యత్తులో అదనంగా మూడవ కేంద్రాన్ని జోడిస్తారు. అన్ని దశలు పూర్తి అయితే డేటా సెంటర్ల పూర్తి సామర్థ్యం 250 మెగావాట్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. యూరప్, జపాన్తోపాటు భారత్లో కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్ 25 ఏళ్లుగా డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమై ఉంది. -
అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు
పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ సామర్థ్యంతో సోలార్, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై వచ్చే ఐదేళ్లలో 35 బిలియన్ డాలర్లు (రూ.2.94 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. ‘2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ నాయకుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సీఈవో ప్యానెల్ చర్చలో భాగంగా సాగర్ అదానీ ఈ వివరాలు వెల్లడించారు.ఇదీ చదవండి: ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!గుజరాత్లోని ఖావ్డాలో 30,000 మెగావాట్ సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇంధన స్థిరత్వం, ఇంధన పరివర్తనం విషయంలో అదిపెద్ద గ్రీన్ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని సాగర్ అదానీ పేర్కొన్నారు. ‘‘మన దగ్గర 500 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తలసరి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మూడింత ఒక వంతు పరిమాణంలోనే ఉన్నాం. వచ్చే 7–8 ఏళ్లలో ప్రపంచ సగటు తలసరి విద్యుత్ వినియోగానికి చేరుకోవాలంటే మరో 1,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అవసరం. చైనా స్థాయికి చేరుకోవాలంటే మరో 1,500 మెగావాట్ల సామర్థ్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలకు సమాన స్థాయికి చేరుకోవాలంటే మరో 2,500–3,000 మెగావాట్ల సామర్థ్యం అవసరం అవుతుంది’’అని వివరించారు. -
గోల్డ్ ఈటీఎఫ్లు కళకళ
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు) అక్టోబర్లోనూ మెరిశాయి. ఏకంగా రూ.1961 కోట్లను ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతో గత రెండేళ్లుగా బంగారం ర్యాలీ అవుతుండడం చూస్తున్నాం. దీంతో బంగారం మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.1,233 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే అక్టోబర్లో 59 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రూ.841 కోట్ల కంటే రెట్టింపునకు పైగా అధికమయ్యాయి.గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.39,823 కోట్ల నుంచి అక్టోబర్ చివరికి రూ.44,545 కోట్లకు దూసుకుపోయాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) అక్టోబర్లో నికరంగా 2 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం ఫోలియోలు 59.13 లక్షలకు చేరాయి. ఈ ఏడాది ఆగస్ట్లో రూ.1,611 కోట్లు, జులైలో రూ.1,337 కోట్లు, జూన్లో రూ.726 కోట్లు, మే నెలలో రూ.396 కోట్ల చొప్పున పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు జీసీసీ రంగం!కరోనా విపత్తు, అనంతరం ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్తో ఇజ్రాయెల్ పోరు ఇవన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అనిశ్చితులకు దారితీయడం గమనార్హం. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ ఏర్పడి ర్యాలీకి దారితీసింది. దీంతో 2020 జనవరి నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.24,153 కోట్లు నికరంగా వచ్చాయి. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది 0.75 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగింది. ఇది అంతర్జాతీయంగా బంగారం ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీన్నుంచి ప్రయోజనం పొందాలన్న ఇన్వెస్టర్ల ఆకాంక్ష ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెరగడానికి దారితీసి ఉండొచ్చు’అని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
ఎన్టీపీసీ గ్రీన్ రూ. లక్ష కోట్ల పెట్టుబడి
ముంబై: ఐపీవో బాటలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2026–27 నాటికి సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిలో 20 శాతం ఈక్విటీ రూపంలో రావాలంటే.. విస్తరణ కోసం రూ.20,000 కోట్ల సొంత నిధులు అవసరమవుతాయని సంస్థ సీఎండీ గుర్దీప్ సింగ్ వెల్లడించారు.రాబోయే ఐపీవో ద్వారా రూ.10,000 కోట్ల నిధులు వస్తాయని అన్నారు. కంపెనీ అంతర్గత వనరుల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ఏజెన్సీల నుండి కంపెనీ మెరుగైన క్రెడిట్ రేటింగ్ను పొందుతోందని, ఇది పోటీ కంపెనీలతో పోల్చినప్పుడు తక్కువ రేట్లతో రుణాన్ని అందుకునేందుకు వీలు కల్పిస్తుందని సింగ్ చెప్పారు. ఇతర విభాగాల్లోకీ ఎంట్రీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకూడదని, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ పవర్, ఎనర్జీ స్టోరేజీ విభాగాల్లో ఎంట్రీపై కూడా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ను నెలకొల్పడానికి విశాఖపట్నం సమీపంలోని 1,200 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ తీసుకుంది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని సింగ్ వెల్లడించారు. 2027కల్లా 19,000 మెగావాట్లు.. ప్రస్తుతం 3,220 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. 2025 మార్చికి 6,000 మెగావాట్లకు, 2026 మార్చి నాటికి 11,000 మెగావాట్లకు, 2027 మార్చి కల్లా 19,000 మెగావాట్లకు సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 11,000 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సింగ్ వెల్లడించారు.నవంబర్ 19 నుంచి ఐపీవో.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఒక్కొక్కటి రూ.102–108 ప్రైస్ బ్యాండ్తో రూ.10,000 కోట్ల వరకు విలువైన తాజా షేర్లను జారీ చేయడానికి కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 138 షేర్లతో కూడిన లాట్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి వాటాలు కావాల్సినవారు మరిన్ని లాట్స్కు బిడ్లు వేసుకోవచ్చు.ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 75 శాతం, నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాలు కేటాయిస్తారు. అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.5 డిస్కౌంట్ను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగుల కోటాకై రూ.200 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. హ్యుండై మోటార్ ఇండియా, స్విగ్గీ తర్వాత ఈ ఏడాది మూడవ అతిపెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది. -
హైదరాబాద్లో రూ.440 కోట్లతో ప్లాంటు విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీర్డ్ స్టోన్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలోని ప్లాంటు విస్తరణకు రూ.440 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. మేకగూడ ప్లాంటులో ఇటలీకి చెందిన బ్రెటన్ ఎస్పీఏ సాంకేతిక సహకారంతో మూడవ లైన్ను జోడిస్తామని పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. 2026 మార్చిలో 8.1 లక్షల చదరపు మీటర్ల సామర్థ్యం తోడవనుందని అన్నారు.మేకగూడ కేంద్రంలో 2021 మార్చిలో యూనిట్–2 అందుబాటులోకి వచ్చిందని కంపెనీ సీఈవో పరాస్ కుమార్ జైన్ చెప్పారు. కాగా, సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ లిమిటెడ్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.33 కోట్ల నుంచి రూ.45 కోట్లకు చేరింది. టర్నోవర్ రూ.197 కోట్ల నుంచి రూ.253 కోట్లకు ఎగసింది. పోకర్ణ షేరు ధర మంగళవారం 1.81% దూసుకెళ్లి రూ.1,103.20 వద్ద ముగిసింది. -
బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?
విజయదశమి నుంచి ప్రారంభమైన బంగారం ధరల పెరుగుదల.. ధన త్రయోదశి, దీపావళి పండుగల నాటికి జీవితకాల గరిష్టాలను తాకింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 82వేలుకు చేరువలో ఉంది. ఆంటే ఒక్క గ్రామ్ పసిడి కొనుగోలు చేయాలంటే రూ. 8,200 చెల్లించాల్సిందే అని స్పష్టమవుతుంది. ఇలాంటి సమయంలో బంగారం మీద పెట్టుబడులు సురక్షితమేనా అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ప్రస్తుతం భారీగా పెరుగుతున్న బంగారం ధరలు, మళ్ళీ ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంటుందా అని పెట్టుబడిదారులు కొంత గందరగోళానికి గురి కావచ్చు. అయితే గత ఐదేళ్లలో పసిడి ధరలు భారీగా పెరగడం బహుశా ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశాలు లేదు.బంగారం ధరలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ రేట్ల కోతలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలని తెలుస్తోంది. అంతే కాకుండా యుద్ధం లాంటి పరిస్థితి ప్రపంచ వృద్ధి రేటును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతోంది. భారతదేశంలో బంగారంపై కస్టమ్స్ డ్యూటీలో కోత.. ధరల పెరుగుదలకు హేతువు అయింది. ఇదీ చదవండి: 102 టన్నుల బంగారం.. ఆర్బీఐ సీక్రెట్ ఆపరేషన్!డిమాండ్ అనేది సరఫరాను మించి ఉన్నప్పుడు.. ధరల పెరుగుదల సర్వసాధారణం. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారంపైన నిశ్చింతగా పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పసిడిపై పెట్టిన పెట్టుబడులు తప్పకుండా లాభాలను తెచ్చిపెడతాయని చెబుతున్నారు. -
సినిమాల్లోకి ‘సీరమ్’!
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్తో చిరపరిచితమైన వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సినిమాల నిర్మాణంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సీఈవో అదార్ పూనావాలా ఏర్పాటు చేసిన సిరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్లో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 1,000 కోట్లు వెచ్చించనుంది. ధర్మ ప్రొడక్షన్స్, ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లలో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సిరీన్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. దీంతో ధర్మలో 50 శాతం వాటాను సిరీన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకోనుంది. మిగిలిన 50 శాతం వాటాతోపాటు యాజమాన్యాన్ని కరణ్ జోహార్ కలిగి ఉంటారని సిరీన్ స్పష్టం చేసింది. వెరసి పూనావాలా పెట్టుబడులు ధర్మ విలువను రూ. 2,000 కోట్లుగా నిర్ధారించాయి. ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ధర్మ, సిరీన్ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటైనట్లు సిరీన్ పేర్కొంది. సినిమాల నిర్మాణంలో ధర్మకున్న నైపుణ్యం, అదార్ పూనావాలాకున్న వనరులు ఇందుకు తోడ్పాటునివ్వగలవని అభిప్రాయపడింది. ధర్మ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని, మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు తాజా పెట్టుబడులపై స్పందిస్తూ పూనావాలా పేర్కొన్నారు. భవిష్యత్ దృక్పథ వ్యూహాలు, నైపుణ్యంతోకూడిన సినిమాల నిర్మాణాల సక్రమ కలయికను తాజా భాగస్వామ్యం ప్రతిఫలిస్తున్నదని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. బాధ్యతలు ఇలా: కంపెనీ నూతన ఏర్పాటులో భాగంగా ధర్మకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కరణ్ జోహార్ సృజనాత్మక కార్యక్రమాలను రూపొందిస్తారు. సీఈవోగా అపూర్వ మెహతా వ్యూహాత్మక మార్గదర్శకుడిగా కరణ్తో కలిసి బాధ్యతలు నిర్వహిస్తారు. కంటెంట్ నిర్మాణం, పంపిణీ, ఆధునిక టెక్నాలజీలను ఏకీకృతం చేయడం, ప్రొడక్షన్ విధానాలను మెరుగుపరచడం, ఆడియన్స్ను ఆకట్టుకోవడం తదితర కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు సిరీన్ వివరించింది. దేశీయంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాజా డీల్కు ప్రాధాన్యత ఏర్పడింది. -
రూ.12 లక్షలు ఉన్నాయి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
నా వద్ద రూ.12 లక్షలు ఉన్నాయి. ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ, ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? – సుర్జిత్ సింగ్ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి 65 శాతం వరకు ఈక్విట్లీలో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మూడింట ఒక వంతు డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. మార్కెట్ల పతనాల్లో అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరి, ఈ ఫండ్స్ మరీ అంత నష్టాలను నమోదు చేయవు. ఇక మీ వద్దనున్న రూ.12లక్షలను ఈ ఫండ్స్లో ఒకే విడతలో పెట్టేయకూడదు.12 నెలసరి సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఈక్విటీ ఆటుపోట్లను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఒకే విడత రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి.. ఆ తర్వాత ఈక్విటీలు 20 శాతం పడిపోయినా నష్టం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆందోళనకు గురికావొచ్చు. ఏడాది కాలం పాటు సిప్ రూపంలో రూ.12 లక్షలను ఇన్వెస్ట్ చేయడం వల్ల విశ్వాసం కూడా పెరుగుతుంది.ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్క్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్ విభాగంలో ఏ పథకాలను ఎంపిక చేసుకోవాలి. – శిల్పారామన్దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడం కష్టం. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్క్యాప్ స్టాక్స్ మంచి ప్రదర్శన చేస్తాయి.కొన్ని సందర్భాల్లో స్మాల్క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక అన్నింటిలో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంతో ఆ సైకిల్ను అధిగమించగలరు. -
టొరెంట్ పవర్ భారీ పెట్టుబడులు
గాంధీనగర్: ప్రయివేట్ రంగ కంపెనీ టొరెంట్ పవర్ పునరుత్పాదక(గ్రీన్) ఇంధన ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులకు తెరతీయనుంది. గ్రీన్, సస్టెయినబుల్ ఎనర్జీ ప్రాజెక్టులపై మొత్తం రూ. 64,000 కోట్లుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా 26,000 మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. ఈ బాటలో పెట్టుబడుల కట్టుబాటును ప్రదర్శిస్తూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖకు రెండు శపథ పత్రాలను దాఖలు చేసింది.పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)తో కలసి పునరుత్పాదక ఇంధన శాఖ నిర్వహించే ఆర్ఈ–ఇన్వెస్ట్ 4వ సదస్సులో భాగంగా టొరెంట్ పవర్ 2030కల్లా 10 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకునే లక్ష్యాన్ని ప్రకటించింది. తొలి శపథ పత్రంలో భాగంగా సుమారు రూ. 57,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగావకాశాలు లభించే వీలుంది. ఇందుకు ద్వారకలో 5 గిగావాట్ల సోలార్ లేదా విండ్ లేదా రెండింటి కలయికతో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వంతో తాజాగా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది.ఇక రెండవ శపథ పత్ర ప్రకారం ఏడాదికి లక్ష కిలో టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 7,200 కోట్లు వెచ్చించనుంది. తద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుంది. దేశంలోని విద్యుత్ రంగ దిగ్గజాలలో ఒకటైన టొరెంట్ పవర్ భారత్ పునరుత్పాదక ప్రయాణంలో భాగమయ్యేందుకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ చైర్మన్ సమీర్ మెహతా పేర్కొన్నారు. -
పిల్లలకూ పెన్షన్!
న్యూఢిల్లీ: పిల్లల పేరిట పింఛను పథకం ప్రారంభించి, ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ‘ఎన్పీఎస్ వాత్సల్య’ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ పథకాన్ని 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఎన్పీఎస్ పథకం మెరుగైన రాబడులను అందిస్తోందని, భవిష్యత్ ఆదాయం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ఎన్పీఎస్లో ఈక్విటీ విభాగంలో 14 శాతం, కార్పొరేట్ డెట్లో 9.1 శాతం, జీ–సెక్లలో 8.8 శాతం చొప్పున రాబడులు ఉన్నట్టు వివరించారు. ‘పీఎం వాత్సల్య పథకాన్ని అమలు చేసే క్రమంలో దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ సరీ్వసెస్ విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల తెలిపారు. ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..? ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్లో బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీస్కు వెళ్లి రూ.1,000తో ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించొచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరుమీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్లు నిండే వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభించేందుకు పీఎఫ్ఆర్డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి, కొందరు పిల్లలను పేరిట ఖాతాలు తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపదగా మారుతుంది. -
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్తోపాటు, ఎన్పీఎస్లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్పీఎస్లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్పీఎస్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్పీఎస్లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్పీఎస్లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్పీఎస్లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ/సిప్కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్పీఎస్లో 60% నిధి, ఈపీఎఫ్లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్పీఎస్లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్పీఎస్లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్పీఎస్లోనూ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్డెస్క్ -
భారీ పెట్టుబడులకు ఎల్ఐసీ రెడీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024 –25) దేశీ స్టాక్ మార్కెట్లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రూ. 1.3 లక్షల కోట్లను స్టాక్స్లో సరికొత్తగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 38,000 కోట్ల పెట్టుబడులు కుమ్మరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23,300 కోట్ల విలువైన పెట్టుబడులు చేపట్టింది. కాగా.. ఈ క్యూ1లో ఎల్ఐసీ ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులపై రూ. 15,500 కోట్ల లాభం ఆర్జించింది. ఇవి గతేడాది క్యూ4(జనవరి–మార్చి)తో పోలిస్తే 13.5 శాతం అధికంకావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ కదలికలు, ధరల్లో మార్పులను నిశితంగా పరిశీలిస్తూ పెట్టుబడి అవకాశాలను వినియోగించుకుంటామని మొహంతీ తెలియజేశారు. కనీసం గతేడాది(రూ. 1.32 లక్షల కోట్లు) స్థాయిలో ఈ ఏడాది పెట్టుబడులను వెచి్చంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ జూన్ చివరికల్లా స్టాక్స్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు. బీమా దిగ్గజం మొత్తం 282 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. ఏఎంసీ జూమ్: జూన్కల్లా ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 16 శాతంపైగా ఎగసి రూ. 53,58,781 కోట్లను తాకాయి. గత క్యూ1కు ఇవి రూ. 46,11,067 కోట్లు. క్యూ1 తీరిలా: క్యూ1లో ఎల్ఐసీ లాభం 10% వృద్ధితో రూ. 10,461 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1,88,749 కోట్ల నుంచి రూ. 2,10,910 కోట్లకు పెరిగింది. -
భారత్లో రూ. 500 కోట్ల పెట్టుబడులు : తోషిబా గ్రూప్
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాల విస్తరణపై 10 బిలియన్ జపాన్ యెన్లు (సుమారు రూ. 500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తోషిబా గ్రూప్ వెల్లడించింది. పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సామర్థ్యాన్ని 1.5 రెట్లు పెంచుకునేందుకు తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ఈ నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. 2024–2026 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ మేరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు టీటీడీఐ చైర్పర్సన్ హిరోషి ఫురుటా తెలిపారు. భారత్లో తయారీ, భారత్ నుంచి ఎగుమతుల నినాదానికి అనుగుణంగా చేసే ఈ పెట్టుబడులతో నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపర్చుకోనున్నట్లు వివరించారు. భారత మార్కెట్లో ట్రాన్స్ఫార్మర్ల డిమాండ్ను తీర్చడానికి, ఎగుమతులను పెంచుకోవడానికి పవర్ ట్రాన్స్ఫార్మర్ల విస్తరణ తోడ్పడగలదని హిరోషి పేర్కొన్నారు. -
ఎఫ్పీఐల భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) మళ్లీ ఇటువైపు చూస్తున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్ చేశారు. డెట్ మార్కెట్లో రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. మొత్తం మీద భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 3.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈక్విటీల నుంచి ఎఫ్పీఐలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. 2020–21లో ఏకంగా రూ. 2.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్పీఐలు ఆ మరుసటి సంవత్సరం రూ. 1.4 లక్షల కోట్లు, ఆ తర్వాత 2022–23లో రూ. 37,632 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2023–24లో భారీగా ఇన్వెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సానుకూలంగా కొత్త ఏడాది.. కొత్త ఆర్థిక సంవత్సరంపై కూడా అంచనాలు కాస్త సానుకూలంగానే ఉన్నాయని భారత్లో మజార్స్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ భరత్ ధావన్ తెలిపారు. పురోగామి పాలసీ సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గాల కారణంగా దేశంలోని ఎఫ్పీఐల ప్రవాహం స్థిరంగా కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అంశాల కారణంగా మధ్యమధ్యలో ఒడిదుడుకులు ఉండవచ్చన్నారు. -
హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ నుంచి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఫండ్
హెచ్డీఎఫ్సీ మ్యుచువల్ ఫండ్ సంస్థ తాజాగా హెచ్డీఎఫ్సీ రియల్టీ ఇండెక్స్ ఫండ్ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో మార్చి 21తో ముగుస్తుంది. గత 6–7 ఏళ్లుగా లిస్టెడ్ రియల్టీ కంపెనీల ఫండమెంటల్స్, లాభదాయకత మెరుగుపడ్డాయి. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ, సెజ్ ప్రాజెక్టుల వ్యాప్తంగా దీర్ఘకాలిక వృద్ధికి రియల్టీ రంగానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ను ప్రతిబింబించే ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉండగలదని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ నవ్నీత్ మునోత్ తెలిపారు. -
స్మాల్, మిడ్క్యాప్పై సెబీ అలర్ట్
న్యూఢిల్లీ: స్మాల్క్యాప్, మిడ్క్యాప్ స్టాక్స్ విలువలు గణనీయంగా పెరిగిన సమయంలో మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ కీలక సూచనలు చేసింది. స్మాల్క్యాప్, మిడ్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి రక్షణ దృష్ట్యా తగిన కార్యాచరణను/విధానాలను అమల్లో పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. ఈ విభాగాల్లోకి వచ్చే తాజా పెట్టుబడులపై ఆంక్షలు, పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్ తదితర చర్యలను పరిశీలించాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తన సభ్యులను కోరింది. సెబీ తరఫున యాంఫి ఈ సూచనలు చేసింది. నిజానికి గడిచిన ఏడాది కాలానికి పైగా స్మాల్, మిడ్క్యాప్ విభాగంలో పెద్దగా దిద్దుబాటు రాలేదు. 2023లో మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.22,913 కోట్లు రాగా, స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.41,305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంత భారీగా పెట్టుబడులు వస్తుండడం, స్టాక్స్ విలువలను మరింత పైకి తీసుకెళుతోంది. ఈ తరుణంలో సెబీ ఫండ్స్ సంస్థలను అప్రమత్తం చేయడం గమనార్హం. 21 రోజుల్లోగా నూతన విధానాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్త.. ప్రతి నెలా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.వేలాది కోట్లు వస్తుంటే, వాటిని ఫండ్ మేనేజర్లు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్టాక్స్ విలువలు మరింత పెరిగిపోతాయి. ఈ ర్యాలీని చూసి ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ, దిద్దుబాటు మొదలైందంటే, దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడికి స్టాక్స్ విలువలు దారుణంగా పడిపోయే రిస్క్ ఉంటుంది. దీన్ని నివారించేందుకు, పెట్టుబడుల రాకను క్రమబద్దీకరించేందుకు సెబీ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కోటక్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా, ఎస్బీఐ, టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్మాల్క్యాప్ పథకాలకు సంబంధించి లంప్సమ్ (ఏక మొత్తం/ఒకే విడత) పెట్టుబడులను అనుమతించడం లేదు. సిప్ పెట్టుబడిపైనా కొన్ని సంస్థలు పరిమితులు అమలు చేస్తున్నాయి. -
ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
గోవా: భారత్ వృద్ధి బాటలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆహ్వనిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. వచ్చే 5 నుండి 6 సంవత్సరాలలో భారతదేశం ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా ఎనర్జీ వీక్.. రెండవ ఎడిషన్ను ఇక్కడ ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ ఎకానమీ 7.5%కన్నా అధిక వృద్ధి రేటుతో పురోగమిస్తోందన్నారు. అమెరికా (25.5 ట్రిలియన్ డాలర్లు) చైనా (18 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)ల తర్వాత దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లతో ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, త్వరలో మూడో స్థానానికి చేరడం ఖాయమని మోదీ ఉద్ఘాటించారు. ఇదే విషయాన్ని పలు సంస్థలూ స్పష్టం చేస్తున్నాయని ప్రధాని అన్నారు. 2030 నాటికి దేశం తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని 254 ఎంఎంటీపీఏ (సంవత్సరానికి మిలియన్ మెట్రిక్ టన్నులు) నుండి 450 ఎంఎంటీపీఏకి పెంచుతుందని భావిస్తున్నామని ఆయన పేర్కొంటూ... ఈ నేపథ్యంలో భారతదేశ ఇంధన రంగ వృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రపంచ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఇంధన రంగంలో మునుపెన్నడూ జరగని విధంగా భారతదేశం భారీ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని అన్నారు. 2045 నాటికి దేశ ప్రాథమిక ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని కూడా ఆయన చెప్పారు. ముడిచమురు, ఎల్పీజీల్లో మూడో స్థానం... ముడిచమురు, ఎల్పీజీ వినియోగం విషయంలో భారత్ మూడవ అతిపెద్ద దేశంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఎల్ఎన్జీ విషయంలో నాల్గవ అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం ఉందని మోదీ అన్నారు. గత రెండేళ్లలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని పేర్కొన్న ఆయన, ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో దేశం ఇంధన నిర్వహణ వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంస్కరణలు దేశీయ సహజ వాయువు ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతున్నాయని మోదీ తెలిపారు. చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేయండి ► గ్లోబల్ దిగ్గజ సంస్థల సీఈవోలతో ప్రధాని భేటీ చమురు, గ్యాస్ రంగంలో ప్రత్యేకించి అన్వేషణ, ఉత్పత్తిలో పెట్టుబడులకు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఈ రంగంలో ప్రముఖ ఎగ్జిక్యూటివ్లకు విజ్ఞప్తి చేశారు. ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఎక్సాన్మొబిల్, బీపీల నుండి ఖతార్ ఎనర్జీ, ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ వరకు దాదాపు 20 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లతో మోదీ సమావేశమయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి హాజరైన భారతీయ సీఈఓలలో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్తో పాటు రిలయన్స్ అధికారులు ఉన్నారు. దేశంలో చమురు, గ్యాస్ వనరులను కనుగొని, ఉత్పత్తి చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకుగాను ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆహ్వానించేందుకు ఇటీవల ప్రారంభించిన ‘ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ రౌండ్’ విధానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, రానున్న మూడేళ్లలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని రోజుకు 300,000 బ్యారెళ్లకు రెట్టింపు చేయడానికి 4 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడికి తమ సంస్థ యోచిస్తున్నట్లు ఈ సందర్భంగా అనిల్ అగర్వాల్ తెలిపారు. ఖతార్తో ఎల్ఎన్జీ డీల్ పొడిగింపు ► 20 ఏళ్లకు 78 బిలియన్ డాలర్ల డీల్ ►ఏటా 6 బిలియన్ డాలర్ల ఆదా బెతుల్ (గోవా): ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులకు సంబంధించిన డీల్ను మరో 20 ఏళ్ల పాటు పొడిగిస్తూ ఖతార్ఎనర్జీతో దేశీ దిగ్గజం పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 78 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఈ డీల్ 2048 వరకు అమల్లో ఉంటుంది. ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ కొనుగోలు కోసం ఖతార్ఎనర్జీతో ఒప్పందాన్ని పొడిగించుకున్నట్లు పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్, ఎరువుల ఉత్పత్తి కోసం ఈ గ్యాస్ ఉపయోగపడనున్నట్లు పేర్కొంది. ప్రస్తుత రేట్ల కన్నా తక్కువ ధరకే ఎల్ఎన్జీని ఖతార్ సరఫరా చేయనుండటంతో భారత్కు ఏటా 6 బిలియన్ డాలర్లు ఆదా కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడున్న ధరలతో పోలిస్తే కొత్త ఒప్పందం ప్రకారం యూనిట్కు (ఎంబీటీయూ) భారత్కి 0.8 డాలర్ల మేర మిగులుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్లుగా ఉండగా ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతుల బిల్లు 3.9 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే భారత్ లక్ష్యానికి ఈ కాంట్రాక్టు తోడ్పడగలదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. భారత ఎకానమీ వృద్ధిలో తాము కూడా భాగంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఖతార్ ఇంధన శాఖ మంత్రి, ఖతార్ఎనర్జీ సీఈవో సాద్ అల్–కాబి తెలిపారు. ఎల్ఎన్జీ సరఫరా కోసం ఆ్రస్టేలియా, అమెరికా, రష్యాతో కూడా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం ఏటా 8.5 ఎంటీపీఏ దిగుమతి.. ఖతార్ఎనర్జీ నుంచి పెట్రోనెట్ రెండు కాంట్రాక్టుల కింద ఏటా 8.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంటోంది. వాటిలో 25 ఏళ్లకు సంబంధించిన 2024లో కుదుర్చుకున్న ఒక ఒప్పందం 2028తో ముగిసిపోనుంది. దీన్నే పెట్రోనెట్ తాజాగా పొడిగించింది. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో ఖతార్ ఎనర్జీతో పెట్రోనెట్ ఒప్పందం వాటా దాదాపు 35%గా ఉంటుంది. -
నమ్మకమైన రాబడులకు పెట్టుబడులు పెట్టే స్కీమ్..
లార్జ్క్యాప్, మిడ్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే పథకం ఇది. గతంలో మిడ్క్యాప్ పథకంగా ఉండగా, సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యస్థీకరణ ఆదేశాల నేపథ్యంలో.. లార్జ్, మిడ్క్యాప్ పథకంగా మారింది. లార్జ్, మిడ్క్యాప్ మధ్య పెట్టుబడులను వర్గీకరిస్తుంది. బీఎస్ఈ లార్జ్ మిడ్క్యాప్ టీఆర్ఐ సూచీని ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా భావిస్తున్నారు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. లార్జ్క్యాప్ కంపెనీలలో పెట్టుబడులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. రాబడుల్లోనూ స్థిరత్వం ఉంటుంది. మిడ్క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెడతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల విధానం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీ, పెట్టుబడుల కేటాయింపుల విధానాలను ఈ పథకం మార్చుకుంటూ ఉంటుంది. 2014, 2017 మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం 99 శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీల్లోనే కలిగి ఉంది. అలాగే, 2015, 2018, 2020 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సందర్భాల్లో సురక్షిత రంగాలు, కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. ఆ సమయంలో ఈక్విటీల్లో గరిష్ట పెట్టుబడులు 94–96 శాతం మధ్యే పరిమితం చేసింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలను అస్థిరతల సమయాల్లో నమ్ముకున్నది. స్టాక్స్ను కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు అందులో కొనసాగడం అనే విధానాన్ని పాటిస్తోంది. రాబడులు ఈ పథకం ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 25.66 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో బీఎస్ఈ లార్జ్మిడ్క్యాప్ టీఆర్ఐ రాబడులు కూడా ఇంచు మించు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఈ పథకం మూడేళ్ల కాలంలో ఏటా 18 శాతం చొప్పున రాబడులను అందించింది. ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 17.20 శాతం, పదేళ్లలో 21.83 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది. బీఎస్ఈ లార్జ్ మిడ్క్యాప్ టీఆర్ఐతో పోలిస్తే ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకంలోనే అధిక రాబడి ఉంది. పోర్ట్ఫోలియో ఈ పథకం 60–70 స్టాక్స్తో చక్కని వైవిధ్యాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం 67 స్టాక్స్ ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో 18,845 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 97.37 శాతాన్ని కేటాయించింది. నగదు, నగదు సమానాల్లో 2.63 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 67.58 శాతం పెట్టుబడులు లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 32 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. స్మాల్క్యాప్ కేటాయింపులు అరశాతానికే పరిమితమయ్యాయి. వీలైనంత వరకు రిస్క్ను తగ్గించి, మెరుగైన, స్థిరమైన రాబడిని అందించే వ్యూహం ఈ పథకం పెట్టుబడుల వెనుక కనిపిస్తోంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 28 శాతం కేటాయింపులను ఈ రంగం కంపెనీలకే కేటాయించింది. ఆటోమొబైల్ రంగ కంపెనీలకు 14 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 11.46 శాతం కేటాయింపులు చేసింది. సేవల రంగ కంపెనీల్లో 8 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్డాడ్ పూర్డాడ్’ పుస్తక రచయిత.. కారణం ఇదే..
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం అన్న వెంటనే చాలా మందికి ఆర్థిక పాఠాలు, గుడ్ డెట్-బ్యాడ్ డెట్, స్టాక్మార్కెట్లో పెట్టుబడులు, వాటి ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి, వ్యాపారం.. ఇలా చాలా అంశాలు గుర్తుకొస్తాయి. 1997లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పుస్తకం దాదాపు 4 కోట్ల కాపీలు అమ్ముడైంది. అయితే ఈ పుస్తకం రచయిత రాబర్డ్టి కియోసాకి ప్రస్తుతం అప్పుల్లో ఉన్నారంటూ ఆయనే స్వయంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం. రాబర్ట్టి కాయోసా ఇన్స్టా వేదికగా ఓ రీల్ పోస్ట్ చేశారు. అందులో ఆస్తులు, రుణాల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడారు. ‘మన చుట్టూ ఉన్నవాళ్లు చాలా మంది విలాసాల కోసం అప్పు చేస్తారు. కానీ నేను మాత్రం ఆస్తులను కొనడానికి అప్పు చేస్తాను. ఫెరారీ, రోల్స్ రాయల్స్ వంటి విలాసవంతమైన వాహనాలు అప్పు. అవి ఆస్తులు కావు. సంపాదనను డబ్బు రూపంలో ఆదా చేయను. ఆ మొత్తాన్ని వెండి, బంగారం రూపంలో మారుస్తాను. పెట్టుబడుల్లో భాగంగా నేను చేసిన అప్పు 1.2 బిలియన్ డాలర్ల(రూ.10 వేల కోట్లు)కు చేరింది’ అని ఆయన చెప్పారు. పెట్టుబడుల రూపంలో తాను చేసిన అప్పే ఆయన ఆస్తి అని కియోసాకి అన్నారు. ఇదీ చదవండి: అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు కియోసాకి తన పుస్తకంలో పెట్టుబడులకు సంబంధించి వివరంగా చెప్పారు. అత్యవసర వస్తువులు, అవసరమైన వస్తువులు, అనవసరమైన వస్తువులు అంటూ విభజించుకుని డబ్బు వెచ్చించాలని చెప్పారు. డబ్బును మరింత పెంచేలా పెట్టుబడిపెట్టేందుకు చేసే రుణాలు గుడ్ డెట్ అని ఆయన రాశారు. డబ్బు ఖాళీగా బ్యాంక్ ఖాతాల్లో ఉండడంకంటే మంచి రాబడులు వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. స్టాక్మార్కెట్లో డివిడెంట్ ఇచ్చే స్టాక్ల్లో పెట్టుబడి పెట్టాలని, మార్కెట్ ఒడుదొడుకులను లోనైతే బంగారం, రియల్ ఎస్టేట్లో మదుపు చేయాలని ఆయన తన పుస్తకంలో రాశారు. -
గ్రీన్ ఎనర్జీపై అదానీ దృష్టి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పర్యావరణహిత(గ్రీన్) ఇంధనం(ఎనర్జీ)కి మరింత ప్రాధాన్యత ఇస్తోంది. 2030కల్లా 45 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా అదానీ కుటుంబం రూ. 9,350 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధపడుతోంది. గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఈఎల్) ప్రమోటర్ కుటుంబీకులతోపాటు ఆర్డౌర్ ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ లిమిటెడ్, అదానీ ప్రాపర్టిస్ ప్రయివేట్ లిమిటెడ్కు మొత్తం 6.31 కోట్ల వారంట్లను జారీ చేయనుంది. ఒక్కో వారంట్ను రూ. 1,480.75 ధరలో కేటాయించేందుకు కంపెనీ బోర్డు తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనున్నట్లు అదానీ గ్రీన్ పేర్కొంది. తాజా పెట్టుబడుల కారణంగా కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 3.83 శాతం వాటా లభించనుంది. వచ్చే ఏడాది 1.2 బిలియన్ డాలర్ల విలువైన బాండ్ల గడువు తీరనుంది. ఇప్పటికే వీటి చెల్లింపులు లేదా రీఫైనాన్సింగ్కు కంపెనీ ప్రణాళికలు వేసింది. 19.8 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకి అదానీ గ్రీన్ ఇప్పటికే ఒప్పందాన్ని పీపీఏ కుదుర్చుకుంది. ప్రమోటర్ పెట్టుబడుల వార్తలతో అదానీ గ్రీన్ షేరు బీఎస్ఈలో 4.3 శాతం ఎగసి రూ. 1,600 వద్ద ముగిసింది. -
ఏమీ చేయకుండా నెలకు రూ. 9 లక్షలు.. ఫలించిన కుర్రాడి ఐడియా!
ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి జనం వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వీరిలో సంపాదనకు చక్కటి మార్గాలను కనుగొన్నవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే కరుణ్ విజ్. అతను భారతీయుడే అయినప్పటికీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. కరుణ్ విజ్ ప్రతి నెలా సగటున రూ.9 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు కరుణ్ సంపాదనకు లాభసాటి మార్గాన్ని కొనుగొన్నారు. 33 ఏళ్ల కరుణ్ మొదటి నుంచి ప్రాపర్టీ ఓనర్గా మారాలనుకునేవారు. రియల్ ఎస్టేట్.. మంచి లాభదాయకమైన వ్యాపారమని కరుణ్ కాలేజీ రోజుల్లోనే గ్రహించారు. ఈ సమయంలో కరణ్.. దేశంలోని ఇన్స్టిట్యూట్ల చుట్టుపక్కల ఉండే ఇళ్లకు సంబంధించి ఒక ఆలోచన చేసేవారు. మొత్తం ఇంటిని ఒకరికే అద్దెకు ఇవ్వకుండా.. గదుల ప్రాతిపదికన రెంట్ వసూలు చేయడం లాభదాయకమని భావించారు. ఇంటినంతటికీ అద్దెదారుకు అద్దెకు ఇవ్వకుండా విద్యార్థుల కోసం ప్రత్యేక గదులుగా మలచి, అద్దెకు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమనేది గ్రహించారు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం కరుణ్ కెనడాలో మొత్తం 28 గదులు కలిగిన నాలుగు ఇళ్లను కలిగి ఉన్నాడు. అతను వాటిని అద్దెకు ఇచ్చాడు. దీంతో ప్రతినెలా రూ.9 లక్షలకు పైగా మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. అయితే ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు కరుణ్ దాదాపు రూ.19 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2016వ సంవత్సరంలో తన 26 ఏళ్ల వయస్సులో కరుణ్ కెనడాలోని అంటారియోలో తన మొదటి పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో దాదాపు రూ.2.7 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి, ఏడుగురు కాలేజీ విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు. కరుణ్ కేవలం అద్దె ఆదాయంపై మాత్రమే ఆధారపడటం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కరుణ్ అప్లికేషన్స్ ఇంజనీర్గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, తన జీతం సొమ్ముతో కరుణ్.. దక్షిణ అంటారియోలో భారీగా ఆస్తులను కూడబెట్టారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత -
‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’లో చేనేత హవా
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా–ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) జాతీయ అవార్డుల ప్రక్రియ తుది దశకు చేరింది. ఓడీఓపీ జాతీయ అవార్డు–2023కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 25నుంచి జూలై 31 మధ్య దేశంలోని 751 జిల్లాల నుంచి 1,102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళా ఉత్పత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. వడపోత అనంతరం దేశంలో మొత్తం 63 ఉత్పత్తులను పరిశీలనకు తీసుకున్నారు. వాటిలో ఏపీ నుంచి 14 ఉత్పత్తులకుచోటు లభించింది. వీటిని ఇన్వెస్ట్ ఇండియా బృందం (జాతీయ స్థాయి టీమ్) క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ నెల 10న మొదలైన ఈ బృందం పర్యటన ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. 14 ఉత్పత్తులు ఇవే.. రాష్ట్రం నుంచి పరిశీలనకు ఎంపికైన ఉత్పత్తులలో పొందూరు ఖద్దరు (శ్రీకాకుళం), బొబ్బిలి వీణ (విజయనగరం), అరకు కాఫీ (ఏఎస్ఆర్), సముద్ర రొయ్యలు (విశాఖ), పులగుర్త చొక్కాలు, చీరలు (తూర్పుగోదావరి), ఉప్పాడ జాందానీ చీరలు (కాకినాడ), కొబ్బరి, కొబ్బరి పీచు (అంబేడ్కర్ కోనసీమ), మంగళగిరి చేనేత చీరలు (గుంటూరు), పెద్ద రొయ్యలు (బాపట్ల), ఉదయగిరి చెక్క కత్తిపీట (నెల్లూరు), చేనేత సిల్క్ చీరలు (కర్నూలు), మదనపల్లె సిల్క్ చీరలు (అన్నమయ్య), సిల్క్ చీరలు (శ్రీ సత్యసాయి), వెంకటగిరి చీరలు (తిరుపతి) ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇండియా తరఫున ఆరాధన, హరిప్రీత్సింగ్, నమీర అహ్మద్, రాబిన్ ఆర్ చెరియన్, సోనియా, ఆకాంక్ష, జిగిషా తివారీ బృందం వేర్వేరుగా 8 రోజులపాటు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవార్డుకు ఎంపికైతే మంచి మార్కెటింగ్ వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తుల ప్రతిభను వెలికితీసి వాటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓడీఓపీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహించేలా అవార్డులు ఇస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 24 జిల్లాల్లో ప్రత్యేకత సంతరించుకున్న 38 రకాల ఉత్పత్తులను ఎంపిక చేసి ఓడీఓపీ జాతీయ అవార్డుకు దరఖాస్తు చేశాం. ఏపీ నుంచి 14 ఉత్పత్తులను తుది పరిశీలనకు ఎంపిక చేయగా.. వాటిలో 8 చేనేత వస్త్రాల ఉత్పత్తులు ఉండటం గొప్ప విషయం. జాతీయ అవార్డుకు ఎంపికైన వాటికి మార్కెటింగ్ రంగంలో మంచి గుర్తింపు లభించి ఆయా జిల్లాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుంది. – కె.సునీత, ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర చేనేత జౌళి శాఖ -
రిలయన్స్ రిటైల్లో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ దాదాపు రూ. 2,070 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇందుకుగాను కేకేఆర్కు 1,71,58,752 ఈక్విటీ షేర్లను జారీ చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. దీంతో రిలయన్స్ రిటైల్లో కేకేఆర్ వాటా 1.17 శాతం నుంచి 1.42 శాతానికి బలపడింది. ఈ నెల మొదట్లో అనుబంధ రిటైల్ సంస్థలో కేకేఆర్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పేర్కొన్న సంగతి తెలిసిందే. 1976లో ఏర్పాటైన కేకేఆర్ 2023 జూన్కల్లా 519 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉంది. కాగా.. ఈ నెల మొదట్లోనే ఆర్ఐఎల్ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) నుంచి రూ. 8,278 కోట్ల పెట్టుబడులను అందుకుంది. తద్వారా రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో 1 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక 2020లో వివిధ గ్లోబల్ పీఈ సంస్థలకు 10.09 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 47,265 కోట్లను సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ విషయం! -
అంతరిక్ష రంగంలోకి సులభతరంగా ఎఫ్డీఐలు
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థలను ఆకర్షించే దిశగా కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను మరింత సరళతరం చేయడంపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అంతర్–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ రంగంలో విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉపగ్రహాల సంబంధ కార్యకలాపాల విభాగంలో 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉన్నప్పటికీ అది ప్రభుత్వ అనుమతికి లోబడి ఉంటోంది. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో జీ–20 కూటమిలోని మూడు దేశాలు .. అంతరిక్ష రంగంలో భారత్తో కలిసి పని చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల కోసం ఉపయోగించే ఉపకరణాల తయారీ మొదలుకుని స్పేస్ హార్డ్వేర్, టెక్నాలజీ సేవలు మొదలైన వాటి దాకా అనేక అంశాలు అంతరిక్ష రంగ అవసరాల్లో ఉంటాయి. వివిధ నివేదికల ప్రకారం అంతర్జాతీయంగా అంతరిక్ష రంగం పరిమాణం 546 బిలియన్ డాలర్లుగా ఉంది. 2040 నాటికి ఇది 1 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. సాంకేతిక పురోగతి, వ్యయ నియంత్రణ చర్యలు మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి. -
అదానీ గ్రీన్లో టోటల్ ఎనర్జీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్తో ఏర్పాటు చేయనున్న శుద్ధ ఇంధన భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ తాజాగా వెల్లడించింది. కొత్తగా నెలకొల్పనున్న జేవీలో 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. మిగిలిన 50 శాతం వాటాను అదానీ గ్రీన్ ఎనర్జీ పొందనుంది. ఈ జేవీ మొత్తం 1,050 మెగావాట్ల పోర్ట్ఫోలియోను కలిగి ఉండనుంది. వీటిలో 300 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే ప్రారంభంకాగా.. 500 మె.వా నిర్మాణంలో ఉంది. మరో 250 మె.వా సోలార్, విండ్ కలయికతో అభివృద్ధి దశలో ఉంది. కాగా.. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల తదుపరి గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీతో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ తొలిసారి పబ్లిక్ డీల్ను కుదుర్చుకోవడం గమనార్హం! శుద్ధ ఇంధన ప్రాజెక్టుల పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా టోటల్ తాజా పెట్టుబడులను చేపట్టింది. ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.7 శాతం వాటాను కలిగిన టోటల్.. 2,353 మె.వా. పోర్ట్ఫోలియోగల ఏజీఈ23ఎల్(జేవీ)లో అదానీ గ్రీన్తో సమాన వాటాను కలిగి ఉంది. ఇక 2019లోనే అదానీ టోటల్ గ్యాస్లో 37.4 శాతం వాటాను టోటల్ పొందింది. ఇందుకు 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. -
ఏషియా హెల్త్కేర్ గూటికి ఏఐఎన్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ(ఏఐఎన్యూ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు ఏషియా హెల్త్కేర్ హోల్డింగ్స్(ఏహెచ్హెచ్) తాజాగా పేర్కొంది. తదుపరి దశలో రూ. 600 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. పెట్టుబడులను ప్రైమరీ, సెకండరీ ఈక్విటీ మార్గంలో చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా కొనుగోలు ద్వారా ఏహెచ్హెచ్ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోకి ప్రవేశించనుంది. డాక్టర్లయిన సి. మల్లికార్జున్, పి.సి. రెడ్డిల నేతృత్వంలో ప్రముఖ యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు కలిసి 2013లో ఏఐఎన్యూను ఏర్పాటు చేశారు. దీనికి హైదరాబాద్, విశాఖపట్టణం, సిలిగురి, చెన్నైలలో 7 ఆసుపత్రులు ఉన్నాయి. రోబోటిక్ యూరాలజీ సర్జరీలో ప్రత్యేకతను కలిగి ఉంది. 500కుపైగా పడకలతో సేవలను అందిస్తోంది. 4 లక్షలకుపైగా రోగులకు సేవలు అందించడంతోపాటు యూరాలజీలో 1,000కి పైగా రోబోటిక్ సర్జరీలను పూర్తి చేసింది. తమ ప్లాట్ఫామ్కు ఏఐఎన్యూ కొత్త స్పెషాలిటీలను జత చేయడమేకాకుండా సంస్థ విజన్ మరింత పటిష్టమయ్యేందుకు దోహదపడనుందంటూ ఏహెచ్హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విశాల్ బాలి పేర్కొన్నారు. నగరాలలోనేకాకుండా టైర్–2 పట్టణాలలోనూ యూరాలజీ రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు ఏఐఎన్యూ ఎండీ, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున్ తెలియజేశారు. భవిష్యత్లో యూరోఆంకాలజీ, యూరోగైనకాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ సేవలకు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ఈడీ పి.సి. రెడ్డి వివరించారు. సంస్థ తదుపరి దశ వృద్ధికి ఏహెచ్హెచ్ దోహదపడగలదని పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఏహెచ్హెచ్ పోర్ట్ఫోలియోలో మదర్హుడ్ హాస్పిటల్స్, నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వంటి సంస్థలు ఉన్నాయి. మదర్హుడ్ హాస్పిటల్స్కు 11 నగరాల్లో 23 మహిళా, శిశు ఆస్పత్రులు, నోవా ఐవీఎఫ్కు 44 నగరాల్లో 68 ఐవీఎస్ సెంటర్లు ఉన్నాయి. -
ఏపీకి గుడ్న్యూస్: మరో రూ.300 కోట్ల పెట్టుబడి
వారణాసి: స్విచ్లు, స్విచ్ బోర్డుల తయారీలో ఉన్న ప్యానాసోనిక్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఇండియా సామర్థ్యం పెంపునకు ఆంధ్రప్రదేశ్లో మరో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ‘శ్రీ సిటీ ప్లాంటులో తొలి దశలో ఇప్పటికే రూ.300 కోట్లు వెచ్చించాం. 2026 నాటికి మరో రూ.300 కోట్లు ఖర్చు చేస్తాం. ఎగుమతుల కోసం ఈ కేంద్రాన్ని వినియోగించుకుంటాం. తొలుత మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తాం’ అని ప్యానాసోనిక్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఇండియా పవర్ బిజినెస్ యూనిట్ డైరెక్టర్ రాజేశ్ నంద్వానీ వెల్లడించారు. శ్రీ సిటీ, డామన్, హరిద్వార్ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 62 కోట్ల యూనిట్లు ఉంది. 2025 నాటికి 70 కోట్లు, 2030 కల్లా 100 కోట్ల యూనిట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. జపాన్కు చెందిన ఈ సంస్థకు భారత్లో 8,900 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. -
పదేళ్ల పాటు ప్రతి నెలా రూ.50,000 ఇన్వెస్ట్ చేయాలంటే..! ఏది బెస్ట్?
నేను విశ్రాంత జీవనం కోసం కావాల్సిన నిధిని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. రిటైర్మెంట్ ఫండ్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు స్మాల్క్యాప్ ఫండ్స్ అనుకూలమేనా? – వర్షిల్ స్మాల్క్యాప్లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటీ సరిపోదు. పెట్టుబడులు పెట్టిన తర్వాత స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి కనిపించే నష్టాలకు, యూనిట్ల విలువ క్షీణతకు తట్టుకోగలిగి ఉండాలి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. అయినప్పటికీ స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడులు అంత సులభమేమీ కాదు. అవి అదే పనిగా నిర్ణీత సమయాల్లో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, అదే సమయంలో స్మాల్క్యాప్లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే సామాన్య ఇన్వెస్టర్లు ఆందోళన చెందకుండా ఉండడం కష్టం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే నయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారిందనడానికి వందలాది ఉదాహరణలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ కూడా ఓ హెచ్డీఎఫ్సీ బ్యాంకు కాదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది. దీర్ఘకాంలో చిన్న కంపెనీలు సంపదను సృష్టించగలవు. లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు. సాధారణంగా చిన్న కంపెనీలను ఎక్కువ మంది అనుసరించరు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చాలా చిన్న కంపెనీలకు దూరంగా ఉంటారు. ప్రతి స్మాల్క్యాప్ ఫండ్ భిన్నంగా పనిచేస్తుంటుంది. వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. సిప్ ద్వారా స్మాల్క్యాప్ కంపెనీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువగా ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్దిపాటి అమ్మకాల ఒత్తిడికే షేర్ల ధరలు భారీగా నష్టపోతుంటాయి. మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా డైనమిక్గా ఉండేవి తక్కువే. ముఖ్యంగా చిన్న కంపెనీల్లో ఏ ధరలో కొనుగోలు చేశారు? (సహేతుక వ్యాల్యూషన్ వద్ద) అన్నది రాబడులకు కీలకం అవుతుంది. నా వయసు 45 ఏళ్లు. నా విశ్రాంత జీవనం కోసం వచ్చే పదేళ్ల పాటు, ప్రతి నెలా రూ.50,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – ఆశిష్ అథాలే రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవాలనుకునే వారు వాస్తవికంగా ఆలోచించాల్సిందే. ముందుగా రిటైర్మెంట్ కోసం ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకోవాలి. రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోగలరో అవగాహనకు రావాలి. విశ్రాంత జీవన అవసరాలకు కావాల్సినంత మీరు కూడబెట్టే విధంగా ప్రణాళిక ఉండాలి. రెండు నుంచి మూడు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. నెలవారీ సిప్ ద్వారా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మరో పదేళ్ల పాటు మీ కెరీర్ కొనసాగనుంది. కనుక మీ పెట్టుబడి వృద్ధి చెందడానికి తగినంత వ్యవధి మిగిలి ఉంది. ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి అవగాహన లేకపోతే, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే కొంచెం తక్కువ అస్థిరతలతో ఉంటాయి. అలాగే రిటైర్మెంట్ కోసం ఫిక్స్ డ్ ఇన్కమ్ పథకాలు, ఈక్విటీ పథకాలను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. ఈక్విటీ పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లోకి మార్చాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే సగం పెట్టుబడులు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్) సాధనాల్లోనే ఉంటాయి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా, వడ్డీ రేట్లు తగ్గి నప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలపై పడే ప్రభావాన్ని అధిగమించేలా ఈ సమతూకం ఉండాలి. -ధీరేంద్ర కుమార్ - సీఈవో వాల్యూ రీసెర్చ్ -
ఓఎన్జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: తక్కువ కర్బన ఇంధన సంస్థగా అవతరించే లక్ష్యంతో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ ఈ దశాబ్దం చివరికి రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. తక్కువ కర్బన ఇంధనాల పోర్ట్ఫోలియోను పెంచుకునే స్పష్టమైన కార్యాచరణతో ఉన్నట్టు ఓఎన్జీసీ తాజాగా ప్రకటించింది. ‘‘దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఓఎన్జీసీ సైతం అడుగులు వేస్తుంది. బిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాల విడుదలను కట్టడి చేయడం, 2030 నాటికి కర్బన తీవ్రతను 45 శాతానికి తగ్గించడం కోసం కృషి చేస్తాం’’అని ఓఎన్జీసీ తెలిపింది. సుస్థిర విధానాలను అనుసరించడం వల్ల గడిచిన ఐదేళ్లలో స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాల విడుదలను 17 శాతం తగ్గించినట్టు పేర్కొంది. 2022–23లోనే ఉద్గారాల విడుదలను 2.66 శాతం తగ్గించుకున్నట్టు వివరించింది. 2038 నాటికి స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురానున్నట్టు ప్రకటించింది. తక్కువ కర్బన ఇంధనాల కోసం ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. రెండు గ్రీన్ఫీల్డ్ ఆయిల్2కెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 10 గిగావాట్లకు చేర్చనున్నట్టు తెలిపింది. -
సాక్షి మనీ మంత్రా: పెట్టుబడికి ఉత్తమ మార్గాలు - నిపుణుల సలహాలు
Sakshi Money Mantra: సాధారణంగా స్టాక్ మార్కెట్ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులు కూడా కొన్ని సార్లు భారీ నష్టాలను చవి చూస్తుంటారు. అయితే ఇలాంటి నష్టాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఎలాంటి మార్గాలున్నాయి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. రోజూ ఒకే రకమైన ఫుడ్ తింటూ ఉంటే మనకు కావాల్సిన పోషకాలు ఎలా లభించివో.. అలాగే ఎప్పుడూ కూడా ఒకే దగ్గర పెట్టుబడిగా పెడితే ఒకే సారి నష్టాలు రావచ్చు లేదా లాభాలు రావచ్చు. నష్టాలు వస్తే భారీగా దెబ్బ పడుతుంది. కావున సంపాదించిన డబ్బుని వివిధ రంగాల్లో పెట్టుబడిగా పెడితే తప్పకుండా లాభాలను పొందవచ్చంటున్నారు నిపుణులు. కేవలం స్టాక్ మార్కెట్ మీద మాత్రమే కాకుండా బంగారం, ఆటో మొబైల్స్ సెక్టార్లలో ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడితే తప్పకుండా ఆశించిన లాభాలు పొందవచ్చు. దీనినే ఫోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటే ఇదే. ఒకే సెక్టార్లలో కాకుండా వివిధ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందటం. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి. -
మెరుగైన రాబడులకు హైబ్రీడ్ వ్యూహం..
ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు వారెన్ బఫెట్ కావచ్చు.. హోవార్డ్ మార్క్స్ కావచ్చు.. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందుకునేందుకు అధిక అవకాశాలు ఉంటాయని చెబుతారు. ఈ విషయంలో హైబ్రీడ్ ఫండ్స్కి మెరుగైన రికార్డు ఉంది. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్ను గుర్తించి, ఇన్వెస్ట్ చేయడంలో ఇవి బాగా రాణిస్తున్నాయి. రిసు్కలకు తగ్గట్లుగా హైబ్రీడ్ వ్యూహాలు మంచి రాబడులు అందించగలుగుతున్నాయి. హైబ్రీడ్ ఫండ్స్లో ప్రధానంగా అయిదు రకాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్ధ్యాలను బట్టి వీటిని పరిశీలించవచ్చు. అవేంటంటే.. ► కన్జర్వేటివ్ హైబ్రీడ్: ఈ ఫండ్స్ 10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతా 75–90 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్నవారు, డెట్కు ప్రాధాన్యం ఇస్తూనే కాస్త అధిక రాబడుల కోసం ఈక్విటీల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేయదల్చుకున్నవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. ► అగ్రెసివ్ హైబ్రీడ్: ఈ కేటగిరీ స్కీముల కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో, మిగతా 20–35 శాతాన్ని డెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్కు సామర్ధ్యాలు ఉన్న ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. ► బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్: ఈ ఫండ్స్లో అసెట్స్కు కేటాయింపులు డైనమిక్గా మారుతుంటాయి. కాబట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి పోర్ట్ఫోలియోలోని 0–100 శాతం మొత్తాన్ని పూర్తిగా ఈక్విటీల్లోనైనా లేదా డెట్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక మోస్తరు రిస్కు సామరŠాధ్యలు ఉన్నవారికి ఇవి అనువైనవి. ► మలీ్ట–అసెట్ అలొకేషన్: ఈ కేటగిరీ ఫండ్లు ఈక్విటీ, డెట్, బంగారం/వెండి, రీట్స్, ఇని్వట్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ అసెట్స్ అన్నీ పరస్పరం సంబంధం లేకుండా వివిధ రకాలైనవి కావడం వల్ల తగు విధమైన డైవర్సిఫికేషన్ వీలవుతుంది. రాబడులూ మెరుగ్గా ఉండగలవు. ఉదాహరణకు గతేడాది బెంచ్మార్క్ రాబడులు 5.8 శాతం స్థాయిలో ఉండగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మలీ్ట–అసెట్ ఫండ్ గతేడాది 16.8 శాతం రాబడులు ఇచి్చంది. ► ఈక్విటీ సేవింగ్స్: ఈ ఫండ్స్ ఈక్విటీ, తత్సంబంధ సాధనాల్లో 65 శాతం వరకు, డెట్లో 10 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ విభాగంలో చాలా మటుకు ఫండ్స్ డెరివేటివ్స్ను ఉపయోగిస్తాయి. తద్వారా రిస్కును తగ్గించడంపై దృష్టి పెడతాయి. ఇన్వెస్టర్లకు డెట్కన్నా మెరుగ్గా, ఈక్విటీ కన్నా కాస్త తక్కువగా రాబడులను అందించేందుకు ఈ తరహా ఫండ్స్ ప్రయతి్నస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్న వారు వీటిని పరిశీలించవచ్చు. మలీ్ట–అసెట్ విధానం పాటిస్తాయి కాబట్టి ఓపికగా ఉండే ఇన్వెస్టర్లకు రిసు్కలకు తగినట్లుగా మెరుగైన రాబడులను అందించేందుకు హైబ్రీడ్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. -
మహారాష్ట్రలో గోగోరో వేల కోట్ల ఇన్వెస్ట్ - కారణం తెలిస్తే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ విభాగాన్ని ప్రోత్సహించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రముఖ బ్యాటరీ స్వాపింగ్ కంపెనీ 'గొగోరో' (Gogoro) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాటరీ స్వాప్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు 'అల్ట్రా మెగా ప్రాజెక్ట్' ప్రారంభించనుంది. దీని కోసం దాదాపు 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) అల్ట్రా మెగా ప్రాజెక్ట్లో భాగంగా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో ఓపెన్ అండ్ యాక్సెస్ చేయగల బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. దీనికి మహారాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో రాష్ట్రం అగ్రగామిగా కావాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా దాదాపు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. (ఇదీ చదవండి: మస్క్ & జుకర్బర్గ్ రియల్ ఫైట్? చూడటానికి సిద్ధమేనా!) ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. కావున ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేయడానికి స్వాపబుల్ స్మార్ట్ బ్యాటరీ స్టేషన్లు చాలా సహాయపడతాయి. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడంలో కూడా సహాయపడే అవకాశం ఉందని భావిస్తున్నాయి. తైవాన్లో మల్టిపుల్ వెహికల్ తయారీదారులకు మద్దతు ఇచ్చే ఓపెన్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ను గొగోరో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి భారతదేశంలో కూడా తన ఉనికిని చాటుకోనుంది. ఇది తప్పకుండా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాము. -
అదానీలో జీక్యూజీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ కంపెనీలలో జీక్యూజీ పార్ట్నర్స్ తదితర పెట్టుబడి సంస్థలు తాజాగా బిలియన్ డాలర్లు(సుమారు రూ. 8,200 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. గ్రూప్లోని డైవర్సిఫైడ్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో 1.6 శాతం వాటాకు సమానమైన 1.8 కోట్ల షేర్లు కొనుగోలు చేశాయి. ఈ బాటలో అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ 2.2 శాతం వాటాకు సమానమైన 3.52 కోట్ల షేర్లను సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీల సమాచారంమేరకు రెండు కంపెనీలలో బ్లాక్ట్రేడ్స్ నమోదయ్యాయి. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల తదుపరి చైర్మన్ గౌతమ్ అదానీ.. గ్రూప్పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించేందుకు ముందస్తు రుణ చెల్లింపులు, నిధుల సమీకరణ తదితర చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సమయంలో జీక్యూజీ పార్ట్నర్స్.. అదానీ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో అదానీ గ్రూప్లోని నాలుగు కంపెనీలలో ప్రమోటర్లు 1.87 బిలియన్ డాలర్ల(రూ. 15,446 కోట్లు) విలువైన వాటాలను జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించారు. తదుపరి మే నెలలో మరో 40–50 కోట్ల డాలర్ల విలువైన షేర్లను జీక్యూజీ కొనుగోలు చేసింది. బ్లాక్డీల్స్ ఇలా.. అదానీ ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో మంగళవారం ధర రూ. 2,281తో పోలిస్తే షేరుకి రూ. 2,300 ధరలో బుధవారం బీఎస్ఈలో లావాదేవీ నమోదైంది. అయితే అదానీ గ్రీన్లో ముందురోజు ధర రూ. 960తో పోలిస్తే రూ. 925–920 ధరలో బ్లాక్డీల్స్ జరిగాయి. తద్వారా రెండు కంపెనీలలోనూ విడిగా 50 కోట్ల డాలర్ల విలువైన ప్రమోటర్ల వాటాలు విదేశీ సంస్థలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 5.3 శాతం జంప్చేసి రూ. 2,404 వద్ద నిలవగా.. అదానీ గ్రీన్ స్వల్ప నష్టంతో రూ. 958 వద్ద ముగిసింది. తొలుత 7 శాతం పతనంకావడం గమనార్హం! మేలో నిర్వహించిన బోర్డు సమావేశాలలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ 2.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 21,000 కోట్లు) సమీకరణకు ఆమోదించాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయించాలని ప్రతిపాదించాయి. -
వ్యాల్యూ స్టాక్ గుర్తించడం ఎలా?
అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్ను గుర్తించడం ఎలా? – కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్ను గుర్తించం కూడా ఒక కళేనని చెప్పుకోవచ్చు. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నిధులను నిజాయితీగా నిర్వహిస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. నేను మూడు, నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నందున, ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నందున లాంగ్టర్మ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? దీనికంటే మరేదైనా మెరుగైన ఆప్షన్ ఉందా? – అంకిత్ ముద్రా వడ్డీ రేట్లు, వీటికి సంబంధించిన సైకిల్ (కాల వ్యవధి) అనేవి ఊహించనివి. పరిస్థితులు, సూక్ష్మ ఆర్థిక అంశాల ఆధారంగా ఇవి మార్పులకు లోనవుతుంటాయి. కరోనా మహమ్మారి రాకతో ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు 2020 మార్చి–మేలో వడ్డీ రేట్ల కోతను గుర్తుకు తెచ్చుకోండి. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఇటీవల వరుసగా చేపట్టిన రేట్ల పెంపులు కూడా ఒక నిదర్శనమే. కచ్చితంగా వడ్డీ రేట్ల సైకిల్ను అంచనా వేయడం ఎవరి వల్లా కాదు. ఆ విధమైన అంచనాలతో పోర్ట్ఫోలియో ఏర్పాటు చేసుకోవడం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. కనుక స్థూల ఆర్థిక అంశాల కంటే మీ పెట్టుబడుల కాలవ్యవధికి అనుగుణమైన సాధనాలపై దృష్టి సారించడమే మంచిది. మూడు నాలుగేళ్ల కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అప్పుడు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన సాధనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో పెట్టుబడికి రక్షణ ఉండాలి. అటువంటప్పుడు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలం. ఈ పథకం కాల వ్యవధి, మీ పెట్టుబడుల కాల వ్యవధికి ఒకే రకంగా ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో (డెట్ సాధనాలు) పెట్టుబడులు పెట్టడం వెనుక ఉద్దేశ్యం స్థిరమైన రాబడులు ఆశించడమే. ఈక్విటీల్లో మాదిరి అస్థిరతలు లేకుండా, పెట్టుబడికి రక్షణ కల్పించుకోవడం. లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ చూడ్డానికి ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ అవి ఎంతో అస్థిరతలతో ఉంటాయి. దీర్ఘకాలంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో మాదిరే రాబడులను ఇస్తాయి. డెట్ ఫండ్స్ ఎంపిక చేసుకునేప్పుడు అనుసరించాల్సిన సూత్రం మీ పెట్టుబడుల కాల వ్యవధి, ఎంపిక చేసుకునే సాధనం పెట్టుబడుల కాలవ్యవధి ఒకే విధంగా ఉండాలి. ఇక మీ పెట్టుబడుల కాలవ్యవధి మూడు నాలుగేళ్లు కనుక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ను కూడా చూడొచ్చు. ఈక్విటీలతో వచ్చే రిస్క్ కొంత ఇందులో ఉంటుంది. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చే స్తాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ కంటే ఎక్కువ రాబడులు ఇస్తాయి. అచ్చమైన ఈక్విటీలతో పోలిస్తే తక్కువ అస్థిరతలతో మెరుగైన రాబడులు ఇస్తాయి. ధీరేంద్ర కుమార్ - సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ 2030 నాటికి ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై రూ. 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2038 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ (కర్బన ఉద్గారాల విడుదల, తగ్గింపు మధ్య సమతౌల్యం పాటించడం) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా నెట్ జీరో ఎమిషన్స్కు మార్గదర్శ ప్రణాళికలను వేసుకుంటున్న తోటి సంస్థలు ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్), గెయిల్, భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) మొదలైన వాటి సరసన చేరనుంది. కంపెనీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ఈ విషయాలు వెల్లడించారు. తాము అంతర్గతంగా నెట్–జీరోపై కసరత్తు చేసి 2038 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని 189 మెగావాట్ల నుంచి 1 గిగావాట్లకు పెంచుకోవాలని ఓఎన్జీసీ నిర్దేశించుకుంది. ఇప్పటికే రాజస్థాన్లో 5 గిగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా.. అదే స్థాయిలో మరో ప్రాజెక్టును నెలకొల్పే అంశం పరిశీలనలో ఉన్నట్లు సింగ్ వివరించారు. మంగళూరులో వార్షికంగా 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ప్లాంటును ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికీ మొత్తం మీద రూ. 1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఉంటాయని సింగ్ వివరించారు. ఆయిల్ ఉత్పత్తి అప్.. 2022–23లో ఓఎన్జీసీ 19.584 మిలియన్ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 21.263 ఎంటీకి, తదుపరి 21.525 ఎంటీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో 22.389 ఎంటీకి చేరనుంది. 2021–22లో చమురు ఉత్పత్తి 19.545 ఎంటీగా నమోదైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 2022–23లో 20.636 బీసీఎం (బిలియన్ ఘనపు మీటర్లు)గా ఉండగా, 2023–24లో 23.621 బీసీఎం, తర్వాత ఏడాది 26.08 బీసీఎం, 2025–26లో 27.16 బీసీఎంకు చేరనుంది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రాజెక్టుల్లో ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు కొత్త నిక్షేపాలను కూడా అభివృద్ధి చేస్తుండటంతో ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతోంది. ఇదీ చదవండి: ఆర్క్యాప్ నష్టాలు తగ్గాయ్ -
ఆ స్కీమ్ గడువు మళ్ళీ పెంచిన హెచ్డీఎఫ్సీ - కస్టమర్లకు పండగే!
HDFC Senior Citizen Scheme: ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ ప్రత్యేకంగా తీసుకువచ్చిన సీనియర్ సిటిజన్స్ ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువును మరింత పొడిగించింది. 60 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న వారికి 'స్పెషల్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ' ద్వారా గరిష్ఠ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ స్కీమ్ 2020లోనే అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దాని గడువును 2023 జులై 7 వరకు పెంచింది. ఈ స్కీమ్ ద్వారా సీరియర్ సిటిజన్ ఇన్వెస్టర్లకు అదనంగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు లభిస్తుంది. అంటే దీని ప్రకారం సాధారణ కస్టమర్లకు ఇప్పటికే అందించే 50 బేసిస్ పాయింట్లకు అదనంగా సీనియర్ సిటిజన్లకు 25 బేసిస్ పాయింట్లు కలుస్తాయి. అంటే దీని ప్రకారం సీనియర్ సిటిజన్స్ 0.75 శాతం ఎక్కువ వడ్డీని పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో సీనియర్ సిటిజన్ ఐదు సంవత్సరాలకంటే ముందే ప్రీమెచ్యూర్ చేస్తే వారికి 1% వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల తరువాత దీనిపైన 1.25% శాతం వడ్డీ లభిస్తుంది. (ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్యువి700 సన్రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు.. 7 రోజుల నుంచి 14 రోజులకు & 15 నుంచి 29 రోజులకు వడ్డీ 3.50 శాతం 30 రోజుల నుంచి 45 రోజుల వరకు వడ్డీ 4.0 శాతం 46 రోజుల నుంచి 60 రోజుల & 61 రోజుల నుంచి 89 రోజుల వరకు వడ్డీ 5.0 శాతం 90 రోజుల నుంచి 6 నెలల లోపు వరకు వడ్డీ 5.0 శాతం 6 నెలల ఒక రోజు నుంచి 9 నెలల లోపు 6.25 శాతం 9 నెలల ఒక రోజు నుంచి ఒక సంవత్సరం లోపు 6.50 శాతం ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు 7.10 శాతం 15 నెల్ల నుంచి 18 నెలల లోపు 7.60 శాతం 18 నెలల నుంచి 21 నెలల లోపు 7.50 శాతం 21 నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు 7.50 శాతం రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి రెండు సంవత్సరాల 11 నెలల వరకు 7.50 శాతం 2 ఏళ్ల 11 నెలలు (35 నెలలకు) వడ్డీ 7.70 శాతం 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ 7.75 శాతం -
ఫిజిక్స్ వాలా దూకుడు! రూ. 120 కోట్ల పెట్టుడులు
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం ఫిజిక్స్ వాలా వచ్చే రెండు, మూడేళ్లలో రూ. 120 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. టెక్నాలజీని, ప్లాట్ఫాంను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్ను రూపొందించడం, పరిశ్రమ నిపుణులను నియమించుకోవడం తదితర అంశాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ మహేశ్వరి తెలిపారు. సాధారణంగా కోర్సుల్లో ప్రాక్టికల్ శిక్షణకు అంతగా ప్రాధాన్యం ఉండటం లేదని ఆయన వివరించారు. ప్రాంతీయ భాషల్లో శిక్షణ చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ నిపుణులు ప్రాథమికాంశాల నుంచి బోధించేలా నాణ్యమైన కంటెంట్ను పోటీ సంస్థలతో పోలిస్తే చౌకగా అందించడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఫిజిక్స్ వాలా ప్రస్తుతం డేటా సైన్స్, జావా, సీప్లస్ప్లస్ వంటి వాటిల్లో హైబ్రిడ్ కోర్సులను రూ. 3,500 నుంచి అందిస్తోంది. ఇదీ చదవండి: Friendship Recession: మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు? -
ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్.. ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
పదేళ్లకు మించి నేను సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయగలను. నా ఈక్విటీ పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్ యాదవ్ దీర్ఘకాల పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీలకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. ఒకే రకం ఫండ్ లేదా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండాలి. 50–60% మేర మిడ్, స్మాల్ క్యాప్స్ పెట్టుబడులతో ప్రధాన పోర్ట్ఫోలియో నిర్మించుకోవడం అన్నది సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్క్యాప్ పెట్టుబడులు 25– 30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్క్యాప్ పెట్టుబడులు 70% మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ ఎ క్కువగా ఉంటుంది. అందుకే వీటికి 50–60% కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక అస్థితరలు ఉన్నా సరే, దీర్ఘకాలంలో అధిక రాబడులు కో రుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్తోపాటు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా నెలవారీ, త్రైమాసికం వారీ ఆదాయం వచ్చేలా ఎస్డబ్ల్యూపీ ఎంపిక చేసుకోవాలా? – శంకర్ నారాయణన్ ఇండెక్స్ ఫండ్ అనేది నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ తదితర సూచీల్లో (ఇండెక్స్ల్లో) ఇన్వెస్ట్ చేసేది. మరోవైపు సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అనేది పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకునే సాధనం. ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే సంబంధిత సూచీ రాబడులకు అనుగుణంగానే ఉంటాయి. ఎస్డబ్ల్యూపీ ద్వారా మీరు కోరుకున్నంత ప్రతి నెలా ఉపసంహరించుకోవచ్చు. రూ.లక్షను 10 నెలల్లో ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే ప్రతి నెలా రూ.10వేలను ఎస్డబ్ల్యూపీగా ఎంపిక చేసుకోవాలి. మీ దగ్గర కొంత మొత్తం ఫండ్ ఉండి, ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటుంటే దాన్ని ఒకే విడత కాకుండా ఆరు నుంచి 12 నెలల పరిధిలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయ మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే.. మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ వద్దనుకునే వారు లార్జ్క్యాప్ ఫండ్ లేదా ఇండెక్స్ ఫండ్ను ఎంపిక చేసుకోవాలి. ఒక ఏడాది అవసరాలకు సరిపడా (మొత్తం పెట్టుబడిలో 6 శాతం మించకుండా) లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్లో, అది కూడా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోవాలి. ఏడాదికోసారి మీ ఈక్విటీ పెట్టుబడులు 33–35 శాతం మించకుండా, తగ్గకుండా రీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఏటా ఏడాది అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్లోకి మళ్లించుకోవాలి. ఈ మొత్తాన్ని ఏటా 5 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అలాగే, ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడిలో 6 శాతం మించకుండా చూసుకోవాలి. -
ఈఎల్ఎస్ఎస్ను అలవాటుగా మార్చుకోండి
ఒకవైపు పన్ను భారాన్ని తగ్గించుకుంటూ మరోవైపు సంపదను పెంచుకునేలా పెట్టుబడులను ఉపయోగించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీములు (ఈఎల్ఎస్ఎస్) ఆ కోవకి చెందినవే. ఇలాంటి సాధనంలో ఇన్వెస్ట్ చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ► కష్టమైనదైనా స్థిరంగా, తరచుగా ఒకే పనిని పదే పదే చేయడం వల్ల అలవాటు ఏర్పడుతుంది. ఒకసారి అలవాటుగా మారిన తర్వాత ఆ పని చేయడం కూడా సులువవుతుంది. ఆర్థిక క్రమశిక్షణలోనూ కొన్ని మంచి అలవాట్లు మనల్ని ఎంతగానో ఆదుకుంటాయి. సాధారణంగా మనకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయాలను నిత్యం ఎదురయ్యే అవసరాల కోసం ఖర్చు పెడుతుంటాం. ఈ క్రమంలో పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కన్నా ఖర్చు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడమనేది మనకు సులువైన అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే పొదుపు, పెట్టుబడి చేసి తర్వాతెప్పుడో ప్రతిఫలాన్ని అందుకోవడం కన్నా ఇప్పటికిప్పుడు ఖర్చు చేయడం వల్ల తక్షణం కలిగే సంతృప్తి ఎంతో ఎక్కువగా అనిపిస్తుంది. ఇదే ధోరణికి అలవాటు పడిపోయి తీరా ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చేసి, పన్ను భారం భయపెడుతుంటే అప్పుడు ఆ భారాన్ని తప్పించుకునేందుకు మార్గాలను వెదకడం మొదలుపెడుతుంటాం. ఆ ఒత్తిడిలో ఇటు పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు మెరుగైన రాబడులను ఇవ్వగలిగే పెట్టుబడి సాధనాలను క్షుణ్నంగా తెలుసుకునే అవకాశాలు కోల్పోతుంటాం. ముందు నుంచే కాస్త జాగ్రత్తపడితే అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవచ్చు. ► వేతనజీవులైన ట్యాక్స్పేయర్ల విషయంలో వారి కంపెనీలు పీఎఫ్ రూపంలో ప్రతి నెలా ఎంతో కొంత ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తుంటాయి. పన్ను ఆదా చేసుకునేందుకు సింహభాగం వాటా ఈ రూపంలోనే వెడుతుంటుంది. పన్ను ఆదాకు సంబంధించి సెక్షన్ 80సి కింద ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సహా అనేక చాయిస్లు ఉన్నాయి. దీనితో ఏది ఎంచుకోవాలనేదానిపై కాస్త సందిగ్ధం ఏర్పడవచ్చు. ► సెక్షన్ 80సి కింద పన్ను ఆదా చేసుకునేందుకు ఉపయోగపడే సాధనాల్లో ఈఎల్ఎస్ఎస్ అనేది ఎంతగానో ప్రాచుర్యం పొందింది. దీనితో రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. పన్నులను ఆదా చేసుకోవడం ఒకటైతే, సంపద సృష్టికి ఉపయోగపడటం రెండోది. మెరుగైన రాబడులు.. మిగతా సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీలు మరింత మెరుగైన రాబడులు ఇస్తాయని రుజువైంది. నిఫ్టి 500 టీఆర్ఐ గత పదేళ్లలో 13.32 శాతం మేర వార్షిక రాబడులు ఇచ్చింది. మిగతా ట్యాక్స్ సేవింగ్ సాధనాలతో పోల్చితే ఈఎల్ఎస్ఎస్ లాకిన్ పీరియడ్ చాలా తక్కువగా మూడేళ్లే ఉంటుంది. కాబట్టి ఈక్విటీలపై ఆసక్తి గల ఇన్వెస్టర్లు ఈ సాధనాన్ని పరిశీలించవచ్చు. సిప్ ప్రయోజనాలు.. మీకు ప్రతి నెలా ఎలాగైతే వేతనం వస్తుందో, పీఎఫ్ కటింగ్ జరుగుతుందో అదే విధంగా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానాన్ని ఎంచుకోవచ్చు. మన ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేసేటప్పుడు ఆ ప్రక్రియను ఆటోమేటిక్ చేయడం వల్ల ఇన్వెస్ట్ చేయడం సులభతరం అవుతుంది. ఆదాయం ఆర్జించడం, ఖర్చు చేయడం, పొదుపు, విందులు.. విహారయాత్రల తరహాలోనే ట్యాక్స్ సేవింగ్ను కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. ఫలితంగా పన్ను ఆదా చేసుకోవడం కోసం ఆఖరు నిమిషంలో హడావిడిగా పరుగులు తీయనక్కర్లేదు. ► సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీలు ఒకోసారి పెరుగుతాయి ఒకోసారి తగ్గుతాయి. ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకే రేటు దగ్గర కొనుగోలు చేసినట్లవుతుంది. అలా కాకుండా సిప్ విధానంలో కాస్త కాస్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. అంటే కొనుగోలు రేటు సగటున తగ్గుతుంది. తత్ఫలితంగా తదుపరి మరింత రాబడులను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ► ఈఎల్ఎస్ఎస్లో అవసరమైనప్పుడు మీకు కావాల్సిన విధంగా పెట్టుబడిని పెంచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ముందుగా మీ పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మొత్తంతో మొదలుపెట్టండి. క్రమంగా ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి పెట్టుబడులు ఒకవేళ సెక్షన్ 80సి కింద గల రూ. 1.5 లక్షల పరిమితి కన్నా తక్కువగానే ఉంటే కాస్త పెంచుకోండి. ► ఇలా క్రమం తప్పకుండా సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇటు సంపద సృష్టికి అదనంగా అటు పన్నుల ఆదాను చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. -
రెట్టింపు ఆదాయంపై ఎన్టీటీ ఇండియా దృష్టి
ముంబై: జపాన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎన్టీటీ గ్రూప్ భారత్లో తమ స్టోరేజీ సామర్థ్యాన్ని, కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. వచ్చే రెండేళ్లలో ఈ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నట్లు ఎన్టీటీ డేటా ఇండియా ఎండీ అభిజిత్ దూబే తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో దేశీయంగా 2.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. మరిన్ని డేటా సెంటర్లు, హరిత శక్తి, సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ సదుపాయాలు మొదలైన వాటిపై ఈ నిధులను వెచ్చించనున్నట్లు దూబే తెలిపారు. 2018లో ప్రకటించిన 2 బిలియన్ డాలర్లకు అదనంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఆయన వివరించారు. జపాన్ వెలుపల తమకు ఇదే అతి పెద్ద మార్కెట్ అని దూబే తెలిపారు. వివిధ దేశాల్లో తమకు మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. భారత్లో ఏకంగా 37,000 మంది పైగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ గ్రూప్ ఆదాయం 20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా.. భారత విభాగం వాటా 700 మిలియన్ డాలర్లుగా ఉందని దూబే చెప్పారు. రాబోయే రెండేళ్లలో దీన్ని రెట్టింపు చేసుకుని సుమారు 2 బిలియన్ డాలర్లకు పెంచుకోగలమని ఆయన ధీమా వ్య క్తం చేశారు. నెట్మ్యాజిక్ సంస్థ కొనుగోలు ద్వారా ఎన్టీటీ గ్రూప్.. భారత మార్కెట్లో ప్రవేశించింది. -
Dao EVTech: వంద కోట్ల పెట్టుబడికి శ్రీకారం.. ఆ ప్రాంతానికి మహర్దశ
భారతీయ ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మన దేశంలో కొన్ని కంపెనీలు విరివిగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ Dao EVTech భారీ పెట్టుబడిని ప్రకటించింది. మహారాష్ట్ర పూణే సమీపంలోని చకన్లోని 'డావ్ ఈవీటెక్' (Dao EVTech) తమిళనాడులో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 షోరూమ్లను కలిగి ఉన్న ఈ కంపెనీ మరిన్ని షోరూమ్లను ప్రారభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. (ఇదీ చదవండి: పది గ్రాముల బంగారం రూ. 2 లక్షలకుపైనే .. ఎక్కడంటే?) తమిళనాడులో ఇప్పటికే మధురై, పొల్లాచ్చి, కోయంబత్తూర్, తంజావూరు ప్రాంతాల్లో డీలర్షిప్లను కలిగి ఉన్న డావ్ ఈవీటెక్ మరిన్ని డీలర్ నెట్వర్క్స్ ప్రారంభించనుంది. చెన్నైలో ప్రారభించాలనుకున్న డీలర్షిప్లు త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన నగరాల్లో డీలర్షిప్లు ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమళనాడు చాలా కీలకమైన ప్రాంతం. చెన్నైలో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఎక్కువ జనాభా ఉండటం వంటి అంశాలు ఎలక్ట్రిక్ వాహన విక్రయాలకు చాలా దోహదపడతాయని కంపెనీ చైర్మన్ డాక్టర్ మైఖేల్ లుయి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కంపెనీని మరింత విస్తరించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
రూ.7 డిపాజిట్ చేస్తే నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చు!
దేశంలో అర్హులైన పౌరులకు 60 ఏళ్ల తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందించే లక్ష్యంతో కేంద్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది . ఈ పథకం పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో పనిచేస్తుంది. బెన్ఫిట్స్ ఈ పథకం కింద ఒక వ్యక్తి 60 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి కనీసం నెలకు రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000, గరిష్టంగా రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు. అటల్ పెన్షన్ పథకానికి అర్హులు ఇంతకుముందు ఈ పథకం అసంఘటిత రంగాల్లో పనిచేసే వ్యక్తుల కోసం మాత్రమే ప్రారంభించబడింది. ఇప్పుడు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిటర్లు 60 ఏళ్ల తర్వాత నెల నెల పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. అయితే, పన్ను చెల్లింపుదారులు ఇకపై అక్టోబర్ 1, 2022 నాటికి ఈ ప్రభుత్వ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అన్హరులు. ఈ పెన్షన్ స్కీమ్లో చేరాలనుకునేవారికి ఈ పథకాన్ని పొందేందుకు, ఒక వ్యక్తి తప్పనిసరిగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పోస్టాఫీస్ ఖాతాను కలిగి ఉండాలి. రూ. 5000 పెన్షన్ ఎలా పొందాలి లబ్ధిదారులు తప్పనిసరిగా నెలవారీ, త్రైమాసిక, సెమీ యాన్యవల్ డిపాజిట్ చేయాలి. ఇలా చేస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుండి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. రూ.7లతో..రూ.5000 పెన్షన్ ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో పథకంలో చేరి నెలకు రూ. 210, లేదా రోజుకు రూ.7 డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ. 5వేలు పెన్షగా తీసుకోవచ్చు. అదేవిధంగా త్రైమాసికానికి (3నెలల కాలానికి) రూ. 626, 6 నెలలకు రూ.1239, నెలకు రూ.42 డిపాజిట్ చేస్తే నెలకు పెన్షన్ రూ. 1000 పొందవచ్చు. లేదంటే రూ.2వేలు పెన్షన్ కావాలంటే నెలకు రూ.84, రూ.3వేలు కావాలంటే నెలకు రూ.126 డిపాజిట్ చేయాలి. నెలవారీ పెన్షన్ రూ. 4000 కావాలనుకుంటే రూ.168 డిపాజిట్ చేయాలి. పన్ను ప్రయోజనాలు పథకంలో పెట్టుబడి పెట్టే వారు ఆదాయపు పన్ను చట్టం 80 సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా, కొన్ని సందర్భాల్లో రూ. 50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది. మొత్తంగా ఈ పథకం ద్వారా రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. అటల్ పెన్షన్ స్కీమ్లో చేరడం ఎలా? మీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్లో అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫారమ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్ను పూరించండి. ఆధార్ కార్డు తో పాటు వ్యక్తిగత వివరాల్ని అందించాలి. యాక్టీవ్గా ఉన్న ఫోన్ నెంబర్ను అందిస్తే సరిపోతుంది. -
మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: అపారమైన సహజ వనరులు, ప్రగతిశీల విధానాలు గల తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఒడిశాలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఒడిశా ప్రభుత్వం, ఫిక్కి సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు భువనేశ్వర్లో నిర్వహించే ‘‘మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ 22’’కార్యక్రమానికి సన్నాహకంగా హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో సోమవారం పెట్టుబడిదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఒడిశా నిలిచిందన్నారు. భువనేశ్వర్లో ఐటీ కంపెనీల ఏర్పాటు వేగంగా సాగుతోందని, ఒడిశా స్టార్టప్ హబ్ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఒడిశా పరిశ్రమల శాఖ మంత్రి ప్రతాప్ కేశరి దేబ్, ఒడిశా సీఎస్ సురేశ్ చంద్ర మహాపాత్ర, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి హేమంత్ శర్మ తెలంగాణకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీల యజమానులు సమావేశంలో పాల్గొన్నారు. -
స్టార్టప్లకు ఏఐఎఫ్ల దన్ను
న్యూఢిల్లీ: ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) స్టార్టప్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే 720 స్టార్టప్లలో రూ.11,206 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. స్టార్టప్ల కోసం ఉద్దేశించిన ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్).. స్టార్టప్లలలోనే పెట్టుబడులు పెట్టే 88 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)కు రూ.7,385 కోట్లు సమకూర్చనున్నట్టు తెలిపింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతానికి కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ మద్దతుతో ఏఐఎఫ్లు రూ.48,000 కోట్ల పెట్టుబడులను స్టార్టప్లకు అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వీటిల్లో చిరేట్ వెంచర్స్, ఇండియా క్వొటెంట్, బ్లూమ్ వెంచర్స్, ఇవీ క్యాప్, వాటర్బ్రిడ్జ్, ఓమ్నివేర్, ఆవిష్కార్, జేఎం ఫైనాన్షియల్, ఫైర్సైడ్ వెంచర్స్ కీలకంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. -
ఈక్విటీల్లో రిటైలర్లకు రాబడులు అంతంతే!
ముంబై: గడిచిన రెండు దశాబ్దాల్లో ఈక్విటీ మార్కెట్లు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. కానీ, ఈ ప్రయాణంలో రిటైల్ ఇన్వెస్టర్లు పొందిన రాబడులు (సొంతంగా) మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాదు, మార్కెట్లు ప్రతికూలంగా మారిపోతే రిటైల్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను వేగంగా మార్చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన వివరాలను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. 2003 నుంచి 2022 వరకు (20 ఏళ్లు) ఈక్విటీ మార్కెట్లు, డెట్ ఫండ్స్కు సంబంధించి 2009–2022 (14 ఏళ్లు) గణాంకాలను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ చేసి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో ఈక్విటీ లేదా హైబ్రిడ్ ఫండ్స్ విభాగాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడులు కనిష్ట స్థాయిలో ఉంటే, మ్యూచువల్ ఫండ్స్ రాబడులు గరిష్టంగా ఉన్నాయి. ఇదీ వ్యత్యాసం.. 2003 నుంచి 2022 మధ్య మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈక్విటీ పెట్టుబడులపై సగటున 19.1 శాతం వార్షిక రాబడులను సంపాదించాయి ఇదే కాలంలో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడి 13.8 శాతంగానే ఉంది. ఇక సిప్ ద్వారా వచ్చిన రాబడులు 15.2 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్ల రాబడి 7.4 శాతం మేర ఉంటే, ఫండ్స్ సంస్థలకు 12.5 శాతం చొప్పున వచ్చాయి. ఇక్కడ కూడా సిప్ రాబడి 10.1 శాతానికి పరిమితమైంది. ఇక పూర్తిగా డెట్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు 6.6 శాతం మేర వార్షిక రాబడి సంపాదించగా, సిప్ ఫండ్స్ సంస్థల రాబడి 7 శాతం చొప్పున ఉంది. ఎందుకని..? మరి రిటైల్ ఇన్వెస్టర్ల రాబడులు ఎందుకు తక్కువగా ఉన్నాయి..? మార్కెట్లు అస్థిరంగా మారిన వెంటనే ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ను వేగంగా మార్చేస్తుండడం రాబడులను దెబ్బతీస్తోంది. మార్కెట్ ధోరణికి తగ్గట్టు పరుగెత్తకుండా.. పూర్తి మార్కెట్ సైకిల్ వరకు పెట్టుబడులను కొనసాగించడమే దీనికి పరిష్కారమని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో సూచించింది. పాయింట్ టు పాయింట్ (కచ్చితంగా నిర్ణీత కాలానికి) రాబడులు అధ్యయనంలోకి తీసుకుంది. స్వల్పకాల మార్కెట్ల అస్థిరతలను చూసి సిప్ నిలిపివేస్తే, అసలు లక్ష్యమే దెబ్బతింటుందని యాక్సిస్ మ్యాచువల్ ఫండ్ హెచ్చరించింది. అస్థిరతల్లో స్థిరత్వం కోల్పోకుండా, పెట్టుబడులను నమ్మకంగా కొనసాగించడం.. అది సాధ్యం కాకపోతే రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఈ నివేదిక తెలియజేస్తోంది. -
ఎస్పైర్ హాస్పిటాలిటీ విస్తరణ
ముంబై: ఆతిథ్య రంగ కంపెనీ ఎస్పైర్ హాస్పిటాలిటీ గ్రూప్ విస్తరణ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా రానున్న నాలుగేళ్లలో రూ. 550 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. విస్తరణకుతోడు బిజినెస్ల ఆధునీకరణను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో 2023కల్లా 20 హోటళ్లు, 700కుపైగా గదులను జత కలుపుకోవాలని ప్రణాళికలు వేసినట్లు గ్రూప్ సీవోవో అఖిల్ అరోరా వెల్లడించారు. అన్ని బ్రాండ్లనూ కలుపుకుని ప్రస్తుతం 318 గదులను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. తాజా పెట్టుబడులను ప్రస్తుత హోటళ్ల ఆధునీకరణ, లీజింగ్ తదితరాలకు సైతం వినియోగించనున్నట్లు వివరించారు. ఉత్తరాఖండ్లోని జిమ్కార్బెట్, భిమ్టాల్తోపాటు, పంజాబ్లోని అమృత్సర్లో హోటళ్లను నిర్వహిస్తోంది. ఉదయ్పూర్లో తొలిసారి జానా లగ్జరీ ఎస్కేప్స్ పేరుతో హోటల్ను ఏర్పాటు చేసింది. -
స్టార్టప్లకు ఫండమెంటమ్ నిధులు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కోచైర్మన్ నందన్ నీలేకని సహవ్యవస్థాపకుడిగా ఏర్పాటైన ఫండమెంటమ్ పార్టనర్షిప్ దేశీయంగా తొలి దశ స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు వీలుగా 22.7 కోట్ల డాలర్లు(రూ. 1,793 కోట్లు) సమీకరించినట్లు వెల్లడించింది. తద్వారా ప్రాథమికస్థాయి వృద్ధిలోగల స్టార్టప్లకు నిధులు అందించనున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో సిరీస్–బి రౌండ్ ద్వారా స్టార్టప్లకు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు ఫండమెంటమ్ సహవ్యవస్థాపకుడు, జనరల్ పార్టనర్ ఆశిష్ కుమార్ పేర్కొన్నారు. ఏదైనా ఒక స్టార్టప్ కొన్ని మైలురాళ్లకు చేరడం, వృద్ధి బాట పట్టడం వంటి పరిస్థితుల్లో రెండో రౌండ్ ద్వారా నిధులను అందించే సంగతి తెలిసిందే. ఇది రెండో ఫండ్ అని పేర్కొన్న ఆశిష్ ఏడాదికి 4–5 స్టార్టప్లకు 2.5–4 కోట్ల డాలర్ల మధ్య పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వివరించారు. 10 కోట్ల డాలర్లతో తొలి ఫండ్ను నిర్వహించిన ఫండమెంటమ్.. ప్రస్తుతం యూనికార్న్ హోదాను పొందిన ఫార్మ్ఈజీ, స్పిన్నీ తదితరాలకు నిధులు అందించిన విషయం విదితమే. -
కర్బనరహితంగా మ్యాక్రోటెక్!
న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ మ్యాక్రోటెక్ డెవలపర్స్ రానున్న 5–7ఏళ్లలో 50 కోట్ల డాలర్లు(రూ. 3,950 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. సస్టెయినబిలిటీ చర్యల్లో భాగంగా అన్ని ప్రాజెక్టులపైనా నిధులను వెచ్చించనున్నట్లు లోధా బ్రాండుతో రియల్టీ ఆస్తులను విక్రయించే కంపెనీ తెలియజేసింది. తద్వారా 2035కల్లా కర్బనరహిత కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించింది. నవీ ముంబై దగ్గర్లోని పాలవ సిటీ సమీకృత టౌన్షిప్ ప్రాజెక్టుకు ఆర్ఎంఐ నుంచి సాంకేతిక మద్దతును తీసుకుంటున్నట్లు పేర్కొంది. 4,500 ఎకరాలలలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును‘ లోధా నెట్ జీరో అర్బన్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్’కింద ప్రకటించింది -
స్టాక్స్లో ఈపీఎఫ్వో మరిన్ని పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సొమ్ములో ఈక్విటీ వాటా పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈక్విటీ వాటా పెంచడం వల్ల మరిన్ని రాబడులకు అవకాశం ఉంటుంది. అప్పుడు సభ్యులకు మెరుగైన రాబడి రేటు ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈపీఎఫ్ నిధిలో ఈక్విటీ వాటాను 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ఈపీఎఫ్వో పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ తన మొత్తం నిర్వహణ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతమే కేటాయిస్తోంది. ఈక్విటీలకు మరిన్ని పెట్టుబడులు కేటాయించడం వల్ల డెట్ సాధనాల్లో రాబడుల అంతరాన్ని పూడ్చుకోవచ్చని ఈపీఎఫ్వో ఆలోచనగా ఉంది. రాబడుల లక్ష్యాలను చేరుకోలేకపోతున్న దృష్ట్యా ఈక్విటీల వాటా పెంచడం ద్వారా ఆ సమస్యను అధిగమించొచ్చన్న అభిప్రాయం ఉంది. ఈపీఎఫ్వోకు చెందిన ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ రెండు వారాల క్రితమే సమావేశమైంది. ఈ అంశంపై చర్చించి ఈక్విటీల వాటాను 25 శాతం పెంచేందుకు సిఫారసు చేసింది. ఒకే విడత కాకుండా తొలుత 15 శాతం నుంచి 20 శాతానికి ఈక్విటీ పెట్టుబడులను తీసుకెళతారు. అక్కడి నుంచి 25 శాతానికి పెంచుతారు. ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ సిఫారసుపై జూన్ చివరి వారంలో జరిగే ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సీబీటీ దీనికి ఆమోదం తెలిపితే దాన్ని తుది ఆమోదం కోసం కేంద్ర కార్మిక శాఖకు, కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
అదానీ గ్రీన్కు భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పర్యావరణ అనుకూల కంపెనీలలో ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ) భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. అబు దాబికి చెందిన ఐహెచ్సీ అదానీ గ్రూప్నకు చెందిన మూడు గ్రీన్ కంపెనీలకు 200 కోట్ల డాలర్లు(సుమారు రూ. 15,000 కోట్లు) పెట్టుబడులు అందించనుంది. గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్)లో రూ. 7,700 కోట్లు(1.02 బిలియన్ డాలర్లు), అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్)లో రూ. 3,850 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో అదానీ ట్రాన్స్మిషన్(ఏటీఎల్)కు సైతం రూ. 3,850 కోట్లు అందించనుంది. ఇందుకు వీలుగా మూడు కంపెనీలూ ఐహెచ్సీకి ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నాయి. ఇందుకు శుక్రవారం సమావేశమైన కంపెనీల బోర్డులు ‘గ్రీన్’సిగ్నల్ ఇచ్చాయి. అయితే తద్వారా మూడు కంపెనీలలోనూ ఐహెచ్సీకి ఎంతమేర వాటా లభించనున్నదీ అదానీ గ్రూప్ వెల్లడించలేదు. తాజా పెట్టుబడులను ఆయా కంపెనీల బిజినెస్ వృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. బ్యాలెన్స్షీట్లను పటిష్టపరచడం, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. -
పోర్ట్ఫోలియో వైవిధ్యానికి ఈటీఎఫ్లు
హెల్త్కేర్, బ్యాంకింగ్, వినియోగం, టెక్నాలజీ మొదలైనవన్నీ కచ్చితంగా అవసరమైనవే కాబట్టి .. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఈ రంగాలు వృద్ధి బాటలోనే ఉంటాయి. కాబట్టి ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల పోర్ట్ఫోలియోకు కాస్త భద్రతతో పాటు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్ వృద్ధి కూడా చెందుతుందని భావించవచ్చు. అయితే, ఆయా రంగాల్లో మెరుగైన కంపెనీలను వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడం కష్టమైన ప్రక్రియే. ఇక్కడే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ సాధనాలైన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అక్కరకొస్తాయి. నిర్దిష్ట సూచీపై ఆధారితమై ఉండే ఈటీఎఫ్లు.. షేర్ల ఎంపికలో రిస్కులను తగ్గించడంతో పాటు వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా తోడ్పడతాయి. ఇవి ఎక్సే్చంజీలో ట్రేడవుతాయి కాబట్టి సులభంగానే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అందుకే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ థీమ్లు, రంగాల ఆధారిత సూచీలు, ఈటీఎఫ్ల గురించి అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేక కథనం. ► వినియోగం: ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్, ఆటో, టెలికం, హోటల్స్, మీడియా.. వినోదం, కన్జూమర్ గూడ్స్ .. సర్వీసులు, టెక్స్టైల్స్ వంటి వాటిపై ఖర్చు చేసే ధోరణులు కూడా పెరుగుతుంటుంది. మార్కెట్ క్యాప్ పరంగా భారీవైన 30 వినియోగ ఉత్పత్తుల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ సూచీ ద్వారా అవకాశం దొరుకుతుంది. ► హెల్త్కేర్: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైద్య సేవల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, ఔషధాల తయారీ సంస్థలు, పరిశోధన.. అభివృద్ధి సంస్థలు మొదలైనవి హెల్త్కేర్ రంగం కిందికి వస్తాయి. ఇలాంటి 20 బడా హెల్త్కేర్ ఆధారిత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు నిఫ్టీ హెల్త్కేర్ ఇండెక్స్ సహాయపడుతుంది. ► టెక్నాలజీ: క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి టెక్నాలజీ రంగాన్ని నడిపిస్తున్నాయి. సమీప, దీర్ఘకాలికంగా భవిష్యత్తులో దాదాపు ప్రతీ రంగంలోనూ టెక్నాలజీ వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ద్వారా 10 పెద్ద ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ► బ్యాంకింగ్: ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకింగ్ రంగంతో ముడిపడే ఉంటాయి. ఇంతటి కీలకమైన బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సహాయకరంగా ఉంటుంది. ఈ సూచీలో ప్రధానంగా 95.7 శాతం వాటా లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ కంపెనీలదే ఉంటోంది. ► బంగారం: సెంటిమెంటుపరంగానే కాకుండా ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా కూడా బంగారానికి ఉన్న ప్రాధాన్యతను వేరే చెప్పనక్కర్లేదు. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో ఇది ఎంతో ప్రత్యేకం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పసిడిలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్లు ఉపయోగపడతాయి. దొంగల భయం, స్టోరేజీ, ప్యూరిటీ మొదలైన వాటి గురించి ఆందోళన పడే పరిస్థితి ఉండదు. ► ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్): ఇటు ఈక్విటీ, అటు ఫిక్సిడ్ ఇన్కం .. రెండు సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడానికి ఇది కూడా ఒక మార్గం. ఇందులో వ్యక్తిగత ఇన్వెస్టరు.. దేశీ ఫండ్లో పెట్టుబడి పెడతారు. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలకు తగ్గ విధంగా రాబడులు అందించే దిశగా.. ఈ దేశీ ఫండ్ ఆ డబ్బును ఇతర దేశీయ లేదా అంతర్జాతీయ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. భారత ఈక్విటీ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లలోనూ పెట్టుబడుల కారణంగా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్కు ఆస్కారం ఉంటుంది. ఈటీఎఫ్లతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు స్వల్పకాలిక ఒడిదుడుకుల నుంచి భద్రత ఉంటుంది. తక్కువ పెట్టుబడి వ్యయాలతో.. మార్కెట్లలో సత్వరం ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుంది. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అవసరాలు తీరడం తో పాటు ఇతర ఇన్వెస్టర్లతో పోలిస్తే భవిష్యత్లో మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి వీలు కాగలదు. అలాగే, పన్నుపరంగా చూసినా ఈటీఎఫ్లు ప్రయోజనకరంగానే ఉంటాయి. – అశ్విన్ పట్ని, ప్రోడక్ట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ విభాగం హెడ్, యాక్సిస్ ఏఎంసీ -
రాష్ట్రంలో వెయ్యి కోట్ల పెట్టుబడికి ఎంఆర్ఎఫ్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ రాష్ట్రంలో మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. గురువారం రాష్ట్రమంత్రి కేటీఆర్తో ఎంఆర్ఎఫ్ వైస్ చైర్మన్, ఎండీ అరుణ్ మమ్మెన్ భేటీ అయ్యారు. రూ.వెయ్యి కోట్లతో సదాశివపేట ప్లాంట్ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఎండీ వెల్లడించారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా తెలియజేశారు. మన ఊరు–మన బడి కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.4 కోట్ల చెక్ను కేటీఆర్కు అరుణ్ మమ్మెన్ అందజేశారు. అదేవిధంగా అస్సోచామ్ ప్రతి నిధులు కేటీఆర్తో సమావేశమయ్యారు. పెట్టుబడు లకు సంబంధించి కేటీఆర్తో చర్చించినట్టు సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. -
డీఎస్పీ అంతర్జాతీయ ఫండ్స్లో పెట్టుబడులకు బ్రేక్
న్యూఢిల్లీ: డీఎస్పీ మ్యూచువల్ ఫండ్.. విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఆరు పథకాల్లోకి తాజా పెట్టుబడులు స్వీకరించడం లేదని ప్రకటించింది. డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్, డీఎస్పీ గ్లోబల్ అలోకేషన్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ గోల్డ్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ మైనింగ్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ అగ్రికల్చర్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ ఎనర్జీ ఫండ్ పథకాలకు ఈ నిర్ణయం అమలవుతుంది. విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలకు తాజా సబ్స్క్రిప్షన్లు తీసుకోవద్దంటూ సెబీ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడులు 7 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు) మించకూడదని సెబీ లోగడే పరిమితి విధించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విలువ ఈ పరిమితి దాటిపోవడంతో తాజా సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం నిలిపివేయాలని సెబీ ఆదేశించింది. దీంతో ఫిబ్రవరి 2 నుంచి అన్ని కొనుగోళ్లు.. స్విచ్ ఇన్, న్యూసిప్/ఎస్టీపీ/డీటీపీ రిజిస్ట్రేషన్ అభ్యర్థనలు ఆమోదించడం లేదని డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ ప్రకటన జారీ చేసింది. -
ఎయిర్టెల్లో గూగుల్కు చోటు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా దేశీ టెలికం భారతి ఎయిర్టెల్లో దాదాపు 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో భాగంగా సుమారు 700 మిలియన్ డాలర్లతో 1.28 శాతం వాటాలు కొనుగోలు చేయనుండగా, మిగతా 300 మిలియన్ డాలర్ల మొత్తాన్ని రాబోయే సంవత్సరాల్లో సర్వీసుల విస్తరణపై వెచ్చించనుంది. షేరు ఒక్కింటికి రూ. 734 రేటు చొప్పున గూగుల్ తమ సంస్థలో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5,224.3 కోట్ల (సుమారు 700 మిలియన్ డాలర్లు) విలువ చేసే 7,11,76,839 ఈక్విటీ షేర్లను గూగుల్కు కేటాయించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. కొత్త ఉత్పత్తులతో భారత్ డిజిటల్ లక్ష్యాల సాకారానికి రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు సిద్ధంగా ఉన్న తమ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్ఫాంలు, చెల్లింపుల వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడగలవని ఆయన వివరించారు. కంపెనీలు డిజిటల్ బాట పట్టడంలో తోడ్పడేందుకు, స్మార్ట్ఫోన్లు.. కనెక్టివిటీని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు ఎయిర్టెల్తో ఒప్పందం దోహదపడగలదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా ఇరు సంస్థలు భారత్ కోసం ప్రత్యేకమైన 5జీ సొల్యూషన్స్ను కనుగొనడంపై కృషి చేయనున్నాయి. ఎయిర్టెల్ తన 5జీ ప్రణాళికలను మరింత దూకుడుగా అమలు చేసేందుకు, మార్కెట్ దిగ్గజం జియోకి దీటుగా పోటీనిచ్చేందుకు గూగుల్ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి. 1.28 శాతం వాటాల కోసం గూగుల్ చేస్తున్న 700 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రకారం ఎయిర్టెల్ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లుగా (54.7 బిలియన్ డాలర్లు) ఉండనుంది. ఇప్పటికే జియోలో గూగుల్... దేశీయంగా డిజిటలీకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న గూగుల్ .. రాబోయే 5–7 ఏళ్లలో భారత్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 2020 జూలైలో జియో ప్లాట్ఫామ్స్లో దాదాపు 4.5 బిలియన్ డాలర్లు వెచ్చించి 7.73 శాతం వాటాలు కూడా కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడుల ప్రకారం అప్పట్లో జియో ప్లాట్ఫామ్స్ విలువను రూ. 4.36 లక్షల కోట్లుగా (దాదాపు 58.1 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు. శుక్రవారం బీఎస్లో భారతి ఎయిర్టెల్ షేరు 1 శాతం పైగా పెరిగి రూ. 716 వద్ద క్లోజయ్యింది. -
50 బిలియన్ డాలర్ల లక్ష్యం...! యాపిల్..మేక్ ఇన్ ఇండియా..!
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో మరిన్ని తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 50 బిలియన్ డాలర్లే లక్ష్యంగా..! వచ్చే 5-6 ఏళ్లలో భారత్లో యాపిల్ వార్షిక ఉత్పత్తిని సుమారు 50 బిలియన్ డాలర్లకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లోకల్ మేడ్ ఐఫోన్స్, మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్ పాడ్స్ వంటి యాపిల్ ఉత్పత్తులను భారత్లో తయారుచేయాలని కేంద్రం కోరింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు యాపిల్ అధికారులతో ఇటీవల సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రితో సహా సీనియర్ ప్రభుత్వ అధికారులు హజరైనట్లు సమాచారం. పది లక్షల ఉద్యోగాల కల్పన..! వచ్చే ఐదారు ఏళ్లలో భారత్లో పది లక్షల ఉద్యోగాలను కల్పించే విధంగా కంపెనీ పనిచేస్తోందని యాపిల్ ప్రొడక్ట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అంతేకాకుండా 2017 నుంచి బెంగళూరులో ఫెసిలిటీ సెంటర్లో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని యాపిల్ ఏర్పాటు చేసిందనే విషయాన్ని గుర్తుచేశారు. ఐఫోన్ విడిభాగాల ఓఈఎమ్ సంస్థ ఫాక్సాకాన్ చెన్నైలో ఇప్పటికే ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11, ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్ల అసెంబ్లీ చేస్తోంది. చదవండి: చిక్కుల్లో యాపిల్..విచారణకు ఆదేశాలు -
రోజూ డబ్బులు వస్తాయని నమ్మించి దంపతులకు టోపి
సాక్షి, హిమాయత్నగర్(హైదరాబాద్): ఇన్వెస్ట్ చేస్తే రోజూ డబ్బులు వస్తాయని నమ్మించి తమని ఓ వ్యక్తి మోసం చేశాడంటూ యూసఫ్గూడకు చెందిన భార్యాభర్తలు శుక్రవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన దంపతులిద్దరికీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇష్టం. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఆర్టీ గోల్డ్ యాప్లో డబ్బు పెట్టించాడు. ముందుగా రూ. 500కి రూ. 1000 ఇచ్చి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ. 2.80 లక్షలు ఇన్వెస్ట్ చేయగా.. వాటిలోంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రశీన్రెడ్డి తెలిపారు. మరో ఘటనలో.. ఆభరణాల తయారీకి ఇచ్చిన 43 తులాల బంగారంతో పరార్ హిమాయత్నగర్: ఆభరణాల తయారు చేసేందుకు ఇచ్చిన 43 తులాల బంగారంతో పనివాళ్లు పరారయ్యారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్హెచ్ఓ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదర్గూడలోని యాష్ జ్యువెలరీ షాప్ యజమాని అభిషేక్ అగర్వాల్ కొంత కాలంగా వీరికి నమ్మకంగా ఉన్న అభిజిత్ మైతితో ఆభరణాలను తయారు చేయిస్తున్నారు. ఇటీవల ఒకేసారి 43 తులాల బంగారాన్ని ఆభరణాల తయారు చేసేందుకు ఇచ్చారు. సదరు ఆభరణాలు ఈ నెల 18న ఇవ్వాల్సి ఉంది. అవి రాకపోవడంతో యజమాని అభిషేక్ అగర్వాల్ అభిజిత్ మైతికి ఫోన్ చేయగా.. తనవద్ద పని చేస్తున్న రాహుల్ అమిన్తో పంపిస్తున్నానని తెలిపారు. గంటలు గడిచినా రాలేదు. సరికదా ఇద్దరి ఫోన్స్ స్విచ్చాఫ్ వస్తున్నాయి. దీంతో తాను మోసయోయానని తెలుసుకున్న బాధితుడు అభిషేక్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ గట్టుమల్లు వివరించారు. చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి.. -
క్యుబోటా చేతికి ఎస్కార్ట్స్
న్యూఢిల్లీ: వ్యవసాయ పరికరాల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్లో జపనీస్ భాగస్వామి క్యుబోటా కార్పొరేషన్ మెజారిటీ వాటాను పొందనుంది. ఇందుకు రూ. 10,000 కోట్లవరకూ పెట్టుబడులను వెచ్చించనుంది. ఇందకు రెండు సంస్థలూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిలో భాగంగా తొలుత ఎస్కార్ట్స్లో క్యుబోటా దాదాపు రూ. 1,873 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా 5.9 శాతం అదనపు వాటాను పొందనుంది. దీంతో క్యుబోటా కార్ప్ వాటా 14.99 శాతానికి పెరగనుంది. ప్రస్తుతం 9.09 శాతం వాటాను కలిగి ఉంది. ఫలితంగా ఎస్కార్ట్స్కు సంయుక్త ప్రమోటర్గా క్యుబోటా ఆవిర్భవించనుంది. తాజా ఒప్పందం ప్రకారం క్యుబోటాకు ఫ్రిఫరెన్షియల్ పద్ధతిలో 93.64 లక్షల షేర్లను ఎస్కార్ట్స్ జారీ చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 2,000 ధరలో వీటి జారీ ద్వారా రూ. 1,873 కోట్లు సమకూర్చుకోనుంది. ఆపై ఎస్కార్ట్స్ వాటాదారులకు క్యుబోటా ఓపెన్ ఆఫర్ను ప్రకటించనుంది. సెబీ నిబంధనల్లో భాగంగా పబ్లిక్ నుంచి 26% వాటా కొనుగోలును చేపట్టవలసి ఉంటుంది. ఇందుకు షేరుకి రూ. 2,000 ధరలో రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. దీంతో ఎస్కార్ట్స్లో 44.80% వాటాను క్యుబోటా సొంతం చేసుకోనుంది. తదుపరి ఎస్కార్ట్స్ బెనిఫిట్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్కు ఎస్కార్ట్స్లోగల వాటాను రద్దు చేయనుంది. వెరసి క్యుబోటా వాటా 53%కి బలపడనుంది. పేరు మార్పు: కంపెనీ పేరును ఎస్కార్ట్స్ క్యుబోటా లిమిటెడ్గా సవరించేందుకు బోర్డు అనుమతించినట్లు ఎస్కార్ట్స్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా దేశీయంగా గల భాగస్వామ్య అనుబంధ సంస్థలను ఎస్కార్ట్స్లో విలీనం చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో క్యుబోటా వాటా 54–55 శాతానికి చేరనుంది. కాగా.. ఎస్కార్ట్స్లో 11.6 శాతం వాటాను కలిగిన ప్రస్తుత ప్రమోటర్ నందా కుటుంబం ఎలాంటి వాటానూ విక్రయించడంలేదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం నందా కుటుంబం, ఎస్కార్ట్స్ బెనిఫిట్ ట్రస్ట్లకు సంయుక్తంగా 36.59 శాతం వాటా ఉంది. తాజా వార్తలతో ఎస్కార్ట్స్ షేరు దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 1,803 వద్ద ముగిసింది. -
‘వెపా’ ప్రెసిడెంట్గా ఇన్వెస్ట్ ఇండియా ఎన్నిక
న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలకు సంబంధించిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ (వైపా) ప్రెసిడెంట్గా ఇన్వెస్ట్ ఇండియా ఏకగ్రీవంగా ఎన్నికైంది. భారత్పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2021–23 కాలానికి వైపా స్టీరింగ్ కమిటీలో ప్రెసిడెంట్గా ఇన్వెస్ట్ ఇండియా ఉండనుండగా, ఈజిప్ట్.. స్విట్జర్లాండ్ వైస్–ప్రెసిడెంట్లుగా వ్యవహరించనున్నాయి. బ్రెజిల్, దక్షిణ కొరియా మొదలైన తొమ్మిది దేశాలు ప్రాంతీయ డైరెక్టర్లుగా ఉంటాయి. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే వైపా మండలిలో ఐక్యారాజ్య సమితికి చెందిన వివిధ సంస్థలు, వరల్డ్ బ్యాంక్ మొదలైన వాటికి సభ్యత్వం ఉంది. భారత్లో పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లకు తోడ్పడేందుకు జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక, సమన్వయ ఏజెన్సీగా ఇన్వెస్ట్ ఇండియా ఏర్పాటైంది. వ్యాపారాలను స్వాగతించేందుకు పలు కీలకమైన ఆర్థిక సంస్కరణల అమలుకు భారత్ నిరంతరం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. దీనితో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు కలి్పంచేందుకు అవకాశమున్న 155 బిలియన్ డాలర్ల పైగా సూచనప్రాయ పెట్టుబడులకు ఇన్వెస్ట్ ఇండియా సమన్వయకర్తగా వ్యవహరిస్తోందని వివరించారు. -
రిటైర్మెంట్ తర్వాత స్టాక్ మార్కెట్లో ప్రవేశించవచ్చా?
నా వయసు 61 ఏళ్లు. పదవీ విరమణ తీసుకున్నాను. నా దగ్గరున్న నిధిపై మంచి రాబడుల కోసం ఈక్విటీలను పరిశీలించొచ్చా? – టీకే సిన్హా 20 ఏళ్ల క్రితం అయితే పదవీ విరమణ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదనే ఆలోచన ఉండేది. ఎందుకంటే నాడు స్థిరాదాయ పథకాలు (డెట్) మెరుగైన రాబడులను ఇచ్చేవి. అప్పట్లో ఈక్విటీ పెట్టుబడులు మరింత రిస్క్తో ఉండేవి. కానీ, ఇప్పుడు సురక్షితంగా మారాయి. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో పదవీ విరమణ తీసుకున్న చాలా మందికి ఈక్విటీ పెట్టుబడులు సైతం కీలకంగా మారాయి. కనుక ఈక్విటీల్లోనూ కొంత భాగం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని సందర్భాల్లో.. మీ వద్ద తగినంత పొదుపు నిధి లేకపోతే.. కేవలం స్థిరాదాయ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ అవసరాలు మీ మూలనిధిని మించిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోవడం కూడా రిస్కీ అవుతుంది. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత మంచిది. గతంలో అయితే ఇంటి అద్దె, పెన్షన్ ఆదాయం లేదా డెట్ నుంచి అధిక ఆదాయం ఉండేది. కానీ, నేటి పరిస్థితుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టుకోవడం తప్పనిసరి. నేను పెట్టుబడులకు కొత్త. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఎలా ప్రారంభించాలి? – ఎండీ అబీద్ హుస్సేన్ సెక్షన్ 80సీ కింద ఆదాయంపై పన్ను మినహాయింపు కోరుకునేట్టు అయితే పన్ను ఆదా పథకాలు (ఈఎల్ఎస్ఎస్) రెండింటిని ఎంచుకుని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోరుకోనట్టు అయితే.. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో రెండు మంచి పథకాలను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లేదా మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. సిప్ ద్వారా పెట్టుబడులు మొదలు పెట్టి కనీసం మూడేళ్లపాటు అయినా కొనసాగించాలి. క్రమశిక్షణతో, మార్కెట్లు పడినా, పెరిగినా ప్రతికూల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోకుండా కొనసాగడం అవసరం. ఇలా చేయగలిగితే ఈక్విటీ మార్కెట్ల పనితీరుపై చక్కని అవగాహన ఏర్పడుతుంది. ఆత్మ విశ్వాసంతో మరింత ప్రణాళికాయుతంగా పెట్టుబడుల విషయంలో ముందుకు వెళతారు. ఖర్చులను జీవిత భాగస్వామి భరించేట్టు అయితే.. స్వయం ఉపాధిలోని మహిళ ప్రతీ నెలా తన ఆదాయం నుంచి రూ.10,000–20,000 మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? – గోపాల్ ప్రసాద్ మీ విషయంలో ఆర్జించే మొత్తంపై స్వేచ్ఛ ఉన్నట్టే. దీన్ని వినియోగానికి మళ్లించకుండా.. పద్ధతి ప్రకారం పెట్టుబడులు పెట్టుకోవాలి. ఈ విషయంలో పెట్టుబడులకు సంబంధించిన సూత్రాలను ఆచరణలో పెట్టాలి. ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేస్తారన్న అంశంపై పెట్టుబడి సాధనం ఆధారపడి ఉంటుంది. ఐదేళ్లు, ఆలోపే డబ్బులతో అవసరం ఉందనుకుంటే.. అప్పుడు పెట్టుబడి సాధనాల విషయంలో కాస్త రక్షణాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం రాజీలేని లక్ష్యం అయితే మరింత రక్షణాత్మకంగా వ్యవహరించాలి. అప్పుడు స్థిరాదాయ పథకాలను దాటి వెళ్లకూడదు. ఒకవేళ కొంత ఆలస్యం అయినా ఫర్వాలేదనుకుంటే.. ఉదాహరణకు ఇంటి రుణానికి డౌన్ పేమెంట్ కోసం అయితే ఏడాది, రెండేళ్ల పాటు లక్ష్యాన్ని వాయిదా వేసుకోగలరు. అటువంటి సందర్భాల్లో 15–20 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐదేళ్లు, అంతకుమించిన కాల వ్యవధి కోసం అయితే ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడుల విలువను రోజువారీగా చూడడం మానుకోవాలి. అప్పుడు ఆందోళన లేకుండా స్థిరంగా వ్యవహరించగలరు. -
ఎన్ఆర్ఐల ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్ట్ 19 వేదిక
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ఒక గేట్వేను ఆవిష్కరించనున్నట్టు ఇన్వెస్ట్ 19 ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్ నాటికి ఈ ప్లాట్ఫామ్ను తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ ఇప్పటికే ఆన్లైన్ మల్టీబ్రోకింగ్ సేవలు అందిస్తోంది. ఒకే క్లిక్తో భారత ఈక్విటీల్లో పెట్టుబడుల అవకాశాలను ఎన్ఆర్ఐలకు కలి్పంచాలన్న ప్రణాళికతో ఉన్నట్టు వివరించింది. నిరీ్ణత శాతం మేర దేశ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారని.. వారు భారత ఈక్విటీ మార్కెట్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకునే మార్గం లేదని ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌసలేంద్రసింగ్ సెంగార్ తెలిపారు. యూఎస్, బ్రిటన్, ఆ్రస్టేలియాలో ఒక శాతానికిపైనే భారత సంతతి ప్రజలున్నట్టు.. కెనడాలో అయితే 4 శాతానికి పైనే ఉన్నట్టు పేర్కొన్నారు. -
టెక్ స్టార్టప్లకు మైక్రోసాఫ్ట్ ఊతం..
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా తాజాగా ఇన్వెస్ట్ ఇండియాతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఇన్వెస్ట్ ఇండియాలో భాగమైన యాక్సెలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్ (అగ్ని మిషన్)తో మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్స్ కలిసి పనిచేస్తుంది. ఇందులో భాగంగా 11 అంకుర సంస్థలు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్స్ కార్యక్రమంలో చేరాయి. వ్యవసాయం, రక్షణ, ఇ–మొబిలిటీ, వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన యాంపిల్ఎర్త్ ప్యాకేజింగ్ అండ్ సిస్టమ్స్, అరిష్టి సైబర్టెక్, డేబెస్ట్ రీసెర్చ్ వంటి సంస్థలు వీటిలో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ స్టార్టప్స్ ప్రోగ్రాం కోసం ఎంపికైన అంకుర సంస్థలకు మైక్రోసాఫ్ట్ సాంకేతికతలు (అజూర్, గిట్హబ్, ఎం365 మొదలైనవి) అందుబాటులో ఉంటాయి. స్టార్టప్లు తమ వ్యాపార ప్రణాళికలను మెరుగుపర్చుకోవడం, విస్తరించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. -
అమెరికన్ బ్యాటరీల సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా అమెరికాకు చెందిన సంస్థ ఆంబ్రీలో ఇన్వెస్ట్ చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ (ఆర్ఎన్ఈఎస్ఎల్) ద్వారా 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆంబ్రీ సంస్థ పవర్ గ్రిడ్లకు అవసరమైన బ్యాటరీలను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సహా పలువురు ఇన్వెస్టర్లు 144 మిలియన్ డాలర్లు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుండగా.. ఆర్ఎన్ఈఎస్ఎల్ కూడా కొంత మేర పెట్టుబడులు పెడుతోంది. దీనితో ఆంబ్రీలో ఆర్ఎన్ఈఎస్ఎల్కు 4.23 కోట్ల షేర్లు లభిస్తాయి. ఈ నిధులను తయారీ కేంద్ర నిర్మాణం, టెక్నాలజీ విక్రయం తదితర అవసరాల కోసం ఆంబ్రీ వినియోగించనుంది. 2022లో తమ లిక్విడ్ మెటల్ గ్రిడ్ బ్యాటరీ సాంకేతికతను వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలని కంపెనీ భావిస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే సగం ధరకే ఈ టెక్నాలజీతో బ్యాటరీలను తయారు చేయొచ్చు. మరోవైపు, భారత్లో భారీ స్థాయి బ్యాటరీ తయారీ కేంద్రం ఏర్పాటుపై కూడా ఆర్ఎన్ఈఎస్ఎల్, ఆంబ్రీ చర్చలు జరుపుతున్నాయి. -
ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు
సాక్షి, అమరావతి: ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతం అవుతున్నాయి. రాష్ట్రంలో భారీ ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)తో పాటు చిన్నాచితకా కలిపి మొత్తం 33 ఉక్కు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏటా 8.4 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి వున్నాయి. ఇందులో ఆర్ఐఎన్ఎల్ ఒక్కటే 6.3 మిలిమిన్ టన్నుల సామర్థ్యంతో ఉంటే మిలిగిన 32 కంపెనీలు 2.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే ఐదో స్థానంలో ఉన్న ఏపీని మూడవ స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఉక్కు ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. రాష్ట్రానికి కంపెనీల క్యూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప ఉక్కు ఫ్యాక్టరీలో భాగస్వామిగా చేరడానికి ఎస్సార్ స్టీల్ కంపెనీ ముందుకొచ్చింది. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ పనులను నవంబర్ నుంచి ప్రారంభించే విధంగా ఎస్సార్ స్టీల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం రేవుకు సమీపంలో రూ.7,500 కోట్ల పెట్టుబడితో 2.25 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ కంపెనీ ముందుకు రాగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజ కంపెనీ పోస్కో కూడా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే కృష్ణపట్నం వద్ద స్థలాలను పరిశీలించి వెళ్లారు. మరోవైపు హ్యుందాయ్ స్టీల్, జేఎస్డబ్ల్యూ, గ్రీనె ట్క్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో తయారవుతున్న వాహనాల్లో ఉపయోగించే 55 శాతం ఉక్కు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతుండటం, రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరం, పోర్టులు ఉండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఉక్కు దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. -
వెయ్యి కోట్ల భారీ పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్/గీసుకొండ: చిన్నపిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంస్థ ‘కిటెక్స్’ (కిటెక్స్ గ్రూప్) తెలంగాణలో పెట్టుబ డులు పెట్టనుంది. తొలిదశలో వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కిటెక్స్ సంస్థ ఎమ్డీ సాబు ఎం. జాకబ్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వస్త్ర పరిశ్రమకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు తమకు నచ్చాయని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అరుదని ప్రశంసించారు. సాబు జాకబ్తో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శుక్రవారం కొచ్చి నుంచి హైదరాబాద్ చేరుకుంది. అనంతరం టీఎస్ఐఐసీ ఎండీ నర్సిం హారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందంతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్లోని కేఎంటీపీని సందర్శించింది. అనంతరం హైదరాబాద్ తిరిగొచ్చి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో ప్రత్యే కంగా భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలు, పారిశ్రామిక విధానం ప్రత్యేకతల గురించి కిటెక్స్ బృందానికి మంత్రి కేటీఆర్ వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు, పారిశ్రామిక అవసరాలకు నిరంతర విద్యుత్, పత్తిసాగులో రాష్ట్రం ప్రత్యేకత తదితర అంశాల గురించి విపులంగా తెలియజేశారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ వంటిది దేశంలో ఎక్కడా లేదన్న కిటెక్స్ ప్రతినిధి బృందం.. ప్రభుత్వ విధానాలపై, తమ ప్రతిపాదనలకు సర్కారు స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా కిటెక్స్ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్కు వివరించింది. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టీయస్ ఐపాస్ చట్టం మేరకు మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ అధికారులు శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సర్కారు సత్వర చొరవతో.. కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్.. తాజాగా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ సహా 9 రాష్ట్రాలు ఆ సంస్థను ఆహ్వానించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది. సాబు జాకబ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రప్పించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు కిటెక్స్ ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. సంస్థ ప్రతినిధులు వరంగల్ టెక్స్టైల్ పార్క్ను సందర్శించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. -
సల్లూ భాయ్తో భాగస్వామ్యం వర్కౌట్ అవుతోందా...!
న్యూఢిల్లీ: సంక్షిప్త వీడియోల వేదిక చింగారీలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పెట్టుబడి పెట్టారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఆయన వ్యవహరిస్తారు. ఎక్కువ మంది యూజర్లను యాప్ ఆకట్టుకోవడానికి సల్మాన్తో భాగస్వామ్యం దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. భారత్కు చెందిన టెక్4బిలియన్ మీడియా ప్రమోట్ చేస్తున్న చింగారీ 2018 నవంబరులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్తోసహా 14 భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం గతేడాది టిక్టాక్తోసహా పలు చైనా యాప్స్ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీం తో చింగారీ, రొపోసో, జోష్ వంటి దేశీయ యా ప్స్ యూజర్ల సంఖ్య అమాంతం పెరిగింది. చదవండి: ఎట్టకేలకు వారి కోరికను నెరవేర్చిన సల్మాన్ -
ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘పోస్కో’ తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్తో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో తమ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వారు ముఖ్యమంత్రి జగన్కు చెప్పారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం జగన్ ఈ సందర్భంగా వారికి బదులిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమల అభివృద్ధికి తగిన తోడ్పాటునం దిస్తాయన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చున్, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ అన్, సీనియర్ జనరల్ మేనేజర్ జంగ్ లే పార్క్ తదితరులున్నారు. -
అసమాన పెట్టుబడి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ఇటీవల చేపట్టిన కార్మిక, వ్యవసాయ సంస్కరణలు భారత్లో వ్యాపారం చేయడాన్ని మరింత సులభతరం చేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మార్కెట్ను ఎంచుకోవడానికి రైతులకు హక్కు కల్పిస్తోందని, అలాగే ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా–2020 సదస్సులో ఆయన వీడియో ద్వారా కీలకోపన్యాసం చేశారు. భారత్–కెనడా మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. శక్తివంతమైన ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత్వం, వ్యాపారానికి అనుకూలమైన విధానాలతో విదేశీ వ్యాపారులకు భారత్ అసమాన పెట్టుబడి కేంద్రంగా నిలిచిందని ప్రధాని అన్నారు. పెద్ద ఎత్తున సంస్కరణలు.. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకే విద్య, వ్యవసాయం, కార్మిక వంటి ప్రధాన రంగాల్లో సంస్కరణలు చేపట్టామని మోదీ తెలిపారు. ‘కార్మిక చట్టాల సంస్మరణలతో లేబర్ కోడ్స్ తగ్గుతాయి. ఇవి సంస్థలకు, ఉద్యోగులకు స్నేహపూర్వకంగా ఉంటాయి. అలాగే ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి దోహదం చేస్తాయి. విద్యా రంగంలో సంస్కరణలతో యువత నైపుణ్యం మెరుగవుతుంది. విదేశీ యూనివర్సిటీలు భారత్కు వస్తాయి. విద్య, తయారీ, సేవలు, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడి, సహకారానికి భారత్ సరైన వేదిక’ అని వివరించారు. అవకాశాలను అందుకున్నాయి.. మౌలిక రంగ పెట్టుబడిలో ఉన్న పెద్ద సంస్థలకు కెనడా కేంద్రంగా ఉందని ప్రధాని గుర్తు చేశారు. ‘కెనడాకు చెందిన పెన్షన్ ఫండ్స్ తొలుత ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. హైవేస్, ఎయిర్పోర్టులు, లాజిస్టిక్స్ రంగాల్లో కెనడా సంస్థలు ఇక్కడి అవకాశాలను అందుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ నేడు బలంగా ఉంది. రేపు మరింత శక్తివంతమవుతుంది. ఎయిర్పోర్టులు, రైల్వేలు, హైవేలు, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నాం. ఎఫ్డీఐ విధానాలను సరళీకరించాం. సార్వభౌమ సంపద, పెన్షన్ ఫండ్స్ విషయంలో స్నేహపూర్వక పన్నుల విధానం అనుసరిస్తున్నాం. కోవిడ్–19 నేపథ్యంలో ప్రత్యేక విధానాన్ని అమలుచేశాం. పేదలు, చిన్న వ్యాపారుల కోసం ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చాం. నిర్మాణాత్మక సంస్కరణలకు దీనిని అవకాశంగా తీసుకున్నాం’ అని చెప్పారు. ఔషధ కేంద్రంగా భారత్.. ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ నిలిచిందని నరేంద్ర మోదీ తెలిపారు. ‘150కిపైగా దేశాలకు భారత్ మందులు అందించింది. 2019లో అంతర్జాతీయంగా ఎఫ్డీఐల రాక 1 శాతం తగ్గితే, భారత్ విషయంలో ఇది 20 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ పట్ల నమ్మకం కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 20 బిలియన్ డాలర్లకుపైగా ఎఫ్డీఐలను భారత్ స్వీకరించింది. అంతర్జాతీయంగా కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఇది సాధించాం’ అని వివరించారు. కాగా, భారత్లో విదేశీ పెట్టుబడుల్లో కెనడా 20వ స్థానంలో ఉంది. 600లకుపైగా కెనడా కంపెనీలు భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇవి 50 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు చేశాయి. -
ఇండియాలో గూగూల్ భారీ పెట్టుబడి
-
సౌర విద్యుత్పై ఎన్టీపీసీ దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ 2022 నాటికి మరో 10 గిగావాట్ల మేర సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. దీనికోసం రూ. 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గ్రీన్ బాండ్స్ ద్వారా ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సౌర విద్యుత్ సహా ఎన్టీపీసీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 920 మె.వా.గా ఉంది. 2032 నాటికి 130 గి.వా. కంపెనీగా ఎదగాలని ఎన్టీపీసీ దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో 30 శాతం వాటా పునరుత్పాదక విద్యుత్దే ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 2,300 మె.వా. సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 2020–21, 2021–22 మధ్య ఏటా 4 గి.వా. మేర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోనున్నట్లు వివరించాయి. 2022కల్లా పర్యావరణహిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 175 గి.వా.కు పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకున్న నేపథ్యంలో ఎన్టీపీసీ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
పసిడిలో పెట్టుబడులు పటిష్టమే!
ప్రస్తుతం పెట్టుబడులకు పసిడి సురక్షిత సాధనమేనని నిపుణుల అంచనా. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో పసిడి ధర 20వ తేదీతో ముగిసిన వారంలో ఔన్స్కు (31.1గ్రా) 1,482 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు, అమెరికా స్థూల దేశీయోత్పత్తి, ప్రత్యేకించి వినియోగ గణాంకాలు సానుకూలత, డాలర్ పటిష్టత వంటి అంశాలు స్వల్పకాలంలో పసిడి ధర దిగువకు రావడానికి కొంత దారితీసినా.. 1,450 డాలర్ల వద్ద పసిడికి పటిష్ట మద్దతు ఉందన్నది వాదన. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన ధోరణుల వల్ల పసిడి దీర్ఘకాలంలో పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అనిశ్చితిని ధీటుగా ఎదుర్కొనడానికి పసిడి కొనుగోళ్లవైపు మొగ్గుచూపాలని ఇరాన్, మలేషియా, టర్కీ, కతార్లు భావిస్తున్నట్లు స్వయంగా మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మహ్మద్ ప్రకటించడం ఇక్కడ గమనార్హం. -
ఇక చిన్న మదుపరికీ బాండ్లు!
న్యూఢిల్లీ: ఈక్విటీల మాదిరే కార్పొరేట్ బాండ్ మార్కెట్లోనూ రిటైల్ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. బడ్జెట్లో పేర్కొన్నట్టుగా బాండ్ మార్కెట్ను ఇది మరింత విస్తృతం చేస్తుందని కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ‘‘భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్ ఈటీఎఫ్ అందిస్తుంది’’ అని మంత్రి వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. బాండ్లకు డిమాండ్ పెరిగితే, అప్పుడు తక్కువ ఖర్చుకే నిధులను సమీకరించుకునే అవకాశం ప్రభుత్వరంగ సంస్థలకుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల రుణ అవసరాలకు అనుగుణంగా ఏటా బాండ్ కేలండర్ను రూపొందిస్తామన్నారు. కాగా, ఈ నెల్లోనే భారత్ బాండ్ ఈటీఎఫ్ను ప్రారంభించే అవకాశాలున్నాయని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ సందర్భంగా తెలియజేశారు. బాండ్ ఈటీఎఫ్ విశేషాలు.. ► భారత్– 22 ఈటీఎఫ్ మాదిరే ‘భారత్ బాండ్ ఈటీఎఫ్’నూ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ► ఒక్కో యూనిట్ విలువ రూ.1,000. ఈ లెక్కన ఇన్వెస్టర్లు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ► క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్లా... మూడేళ్లు, పదేళ్ల స్థిర కాల వ్యవధితో భారత్ బాండ్ ఈటీఎఫ్ను జారీ చేస్తారు. వాటి కాలవ్యవధి వరసగా 2023లో, 2030లో ముగుస్తుంది. ► గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. డివిడెండ్ ఆప్షన్ ఉండదు. ► రాబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగ్గా, స్థిరంగా ఉంటాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్తో (ప్రస్తుతం 6.47 శాతం) పోలిస్తే 0.50–1.40% అధికంగా ఉండొచ్చని అంచనా. ► బాండ్ ఈటీఎఫ్లో పెట్టుబడులపై వచ్చిన మూలధన లాభాల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్ లాభం) మినహాయిస్తారు. ఆ తరవాతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది కనక పన్ను చాలావరకూ తగ్గుతుంది. ► ప్రతి ఆరు నెలలకోసారి ఈటీఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఉంటుంది. ఇందుకోసం ఎన్ఎస్ఈ ఒక ఇండెక్స్ను రూపొందిస్తుంది. ► ఈటీఎఫ్ అన్నది పలు బాండ్ల సమూహం. ఏదైనా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ తన నిధుల కోసం భారత్ బాండ్ ఈటీఎఫ్ కింద బాండ్లను జారీ చేయవచ్చు. ► ఈ భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్వహణ బాధ్యతలను ఎడెల్వీజ్ ఏఎంసీ చూస్తుంది. రిస్క్ చాలా తక్కువ... ఐఎల్అండ్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, ఎస్సెల్ గ్రూపులు.. రుణపత్రాలపై తీసుకున్న బకాయిల్ని చెల్లించటంలో విఫలమవ్వడాన్ని ఇటీవల చూశాం. వీటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఇన్వెస్ట్ చేసినా, లేక మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసినా డిఫాల్ట్ రిస్క్ ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న భారత్ బాండ్ ఈటీఎఫ్లో ఇలాంటి పరిస్థితి ఉం డదు. ఎందుకంటే ఈ ఈటీఎఫ్ కింద బాండ్ల రూపంలో నిధులు సమీకరించేవన్నీ ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలే. ప్రభుత్వ సంస్థలు రుణ చెల్లింపుల్లో విఫలం కావడం ఇప్పటివరకు అరుదే. ఎందుకంటే వీటి వెనుక ప్రభుత్వం ఉంటుంది. లిక్విడిటీతో కూడిన, నాణ్యమైన ప్రభుత్వరంగ బాండ్లలో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరింత మంది ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యానికి ఇది వీలు కల్పిస్తుంది. – ఎన్ఎస్ వెంకటేశ్, సీఈవో, యాంఫి ప్రభుత్వరంగ సంస్థలకు నిధుల సమీకరణకు ఇదొక కొత్త మార్గంగా సాయపడుతుంది. ప్రారంభంలో 3 ఏళ్లు, 10 ఏళ్ల మెచ్యూరిటీతో భారత్ బాండ్ ఈటీఎఫ్ ఉంటుంది. – రాధికా గుప్తా, సీఈవో, ఎడెల్వీజ్ ఏఎంసీ బాండ్ ఈటీఎఫ్లో కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండటం రిటైల్ ఇన్వెస్టర్లకు చాలా మంచిది. వారు తక్కువ రిస్క్తో కూడిన కార్పొరేట్ బాండ్లలో పాల్గొనేందుకు ఇదో మంచి అవకాశం. – అనిల్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్, ఇక్రా -
మీ పోర్ట్ఫోలియోకు అస్సెట్ అలోకేషన్..!
దీర్ఘకాలంలో సంపదను సమకూర్చుకోవాలనుకుంటే అందుకు కీలకంగా తోడ్పడే వాటిల్లో అస్సెట్ అలోకేషన్ కూడా ఒకటి. అస్సెట్ అలోకేషన్ అన్నది ఒక ఇన్వెస్టర్ తన పెట్టుబడులను ఏ మేరకు భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేశారన్నది తెలియజేస్తుంది. ఇది రిస్క్ను పరిమితం చేయడంతోపాటు, రాబడుల్లో అనిశ్చితులను కూడా తగ్గిస్తుంది. సరైన విభాగానికి సరైన సమయంలో పెట్టుబడులను కేటాయించడం ప్రభావవంతమైన అస్సెట్ అలోకేషన్ అవుతుంది. ఎందుకంటే కాల క్రమంలో.. ఒక్కో సమయంలో ఒక్కో అస్సెట్ క్లాస్ (పెట్టుబడుల విభాగం) మంచి పనితీరు చూపించొచ్చు. తాము బాగా అర్థం చేసుకోతగిన ఒక అస్సెట్ క్లాస్లోనే ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు సౌకర్యంగా భావించొచ్చు. అయితే, ఒకే సాధనంలో పూర్తిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కాలానుగుణంగా, ఆయా విభాగంలో అనిశ్చితుల రిస్క్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారికి వైవిధ్యమైన పోర్ట్ఫోలియో ఎంతో సాయపడుతుంది. పోర్ట్ఫోలియోలో భిన్న పెట్టుబడుల సాధనాలను అస్సెట్ అలోకేషన్గా పేర్కొంటారు. అనుకూలమైన అస్సెట్ అలోకేషన్ను నిర్ణయించుకుని, దానికి కట్టుబడి ఉండడంతోపాటు, రిస్క్ను సర్దుబాటు చేసుకుంటూ దీర్ఘకాల లక్ష్యాలకు క్రమానుగత పెట్టుబడుల విధానాన్ని అనుసరించడం సాయపడుతుంది. భిన్న సాధనాల మధ్య.. అస్సెట్ అలోకేషన్ పరంగా ఈక్విటీల్లో తక్కువ విలువల వద్ద కొనుగోలు చేసి, అధిక విలువల వద్ద విక్రయించడం అన్నది అనుసరణీయమే. కానీ, ఆచరణలో అదంత సులభం కాదు. ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా చేస్తుంటారు. అదే డెట్ విభాగంలో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల గమనం ఏ విధంగా ఉందన్న దానితో సంబంధం లేకుండా తమకు సౌకర్యమైన పెట్టుబడి సాధనాలను ఎంచుకుంటుంటారు. బంగారం అన్నది భావోద్వేగాలతో ముడిపడినది. ముఖ్యంగా ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. ఈ విధంగా చూసినప్పుడు పెట్టుబడుల కేటాయింపు ఒకే రంగా ఉండిపోతుంది. దీనివల్ల ఇన్వెస్టర్ ఒక పెట్టుబడి సాధనానికి సంబంధించి మారుతున్న ఆకర్షణను కోల్పోవచ్చు. దీనికి పరిష్కారంగా మ్యూచువల్ ఫండ్స్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ను ఆరంభించాయి. మారుతున్న పవనాలకు అనుగుణంగా ఈ ఫండ్స్ పెట్టుబడుల మార్పుతో ఇన్వెస్టర్లు చెప్పుకోతగిన విధంగా లాభపడేందుకు తోడ్పడతాయి. ఈ విభాగంలో ఒకానొక ప్రముఖ పథకం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అస్సెట్ అలోకేషన్ ఫండ్. డెట్, ఈక్విటీ విభాగాలకు వాటి ఆకర్షణీయతకు అనుగుణంగా పెట్టుబడులను ఈ ఫండ్ కేటాయిస్తుంది. అలాగే పెట్టుబడి పెట్టే ముందు ఈక్విటీ, డెట్ మార్కెట్ల వ్యాల్యూషన్లను ఫండ్ మేనేజర్ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్లు అనిశ్చితుల్లో ఉన్న సమయాల్లోనూ ఇన్వెస్టర్లు అస్సెట్ అలోకేషన్ను కొనసాగించడం అన్నది దీర్ఘకాలంలో... భిన్న సాధనాల్లో జరిగే ర్యాలీల్లో పాలు పంచుకునేందుకు సాయపడుతుంది. జి.వనకృష్ణ వీకీ ఫిన్సర్వ్ ఎల్ఎల్పీ -
రూ. 700 కోట్లతో ‘స్కైవర్త్’ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ స్కైవర్త్ సిద్ధమవుతోంది. మొదటి దశలో రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ చైర్మన్ లై వీడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్లో భేటీ అయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్ బ్రాండ్... ఎల్ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను తయారు చేయాలని స్కైవర్త్ నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి దేశంలోకెల్లా భారీ చైనా పెట్టుబడుల్లో ఒకటిగా దీనిని పరిశ్రమశాఖ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. 5 వేల మందికి ఉపాధి స్కైవర్త్ పెట్టుబడులతో రాష్ట్రంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక పారిశ్రామిక అనుకూల విధానాలతో అనేక కంపెనీల పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందన్నారు. నైపుణ్యం గల మానవవనరులతోపాటు శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమాన, రవాణా సౌకర్యాలు తదితరాల మూలంగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. స్కైవర్త్ భారీ పెట్టుబడులతో భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయి: లీ వైడ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయని స్కైవర్త్ చైర్మన్ లై వీడ్ తెలిపారు. అత్యుత్తమ నాణ్యతగల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ పనిచేస్తుందన్నారు. తమ సంస్థ కార్యకలాపాలకు భారత్ వ్యూహాత్మక మార్కెట్ అని, స్కైవర్త్ నాణ్య త, ఆధునిక టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులు వినియోగదారుల ఆదరణ పొందినట్లు స్కైవర్త్ ఉపాధ్యక్షుడు వాంగ్ జెంజున్ తెలిపారు. సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభా గం డైరక్టర్ సుజయ్ కారంపురి, టీఎస్ఐఐసీ ఛైర్మన్ ఈ.వి.నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
భారత్లో అమెజాన్ భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా రూ. 4,400 కోట్లను ఇక్కడి మార్కెట్లో పెట్టుబడిగా పెట్టనుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించిన తాజా సమాచారం మేరకు.. అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్ డాట్ కామ్ ఇంక్ సంస్థలు ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నాయి. రైట్స్ ఇష్యూ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. ఏ విభాగంలో ఎంత పెట్టుబడి చేరుకోనుందనే విషయానికి వస్తే.. అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ (మార్కెట్ ప్లేస్ యూనిట్) రూ. 3,400 కోట్లు, అమెజాన్ పే ఇండియా రూ. 900 కోట్లు, అమెజాన్ రిటైల్ ఇండియా (ఫుడ్ రిటైల్ వ్యాపారం) రూ. 172.5 కోట్లను అందుకోనున్నాయి. వివిధ విభాగాల్లో 2018–19 కాలంలో రూ. 7,000 కోట్ల పెట్టుబడి పెట్టిన అమెజాన్.. ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలతో పెరిగిన పోటీ కారణంగా భారత్లో తన పెట్టుబడిని మరింత పెంచనున్నట్లు ఈ రంగ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెట్టుబడికి సంబంధించి ఇక్కడి వ్యాపార విభాగాల నుంచి అధికారిక ప్రకటన ఏమీ లేకపోయినప్పటికీ.. 2016లో సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారత్లో పెట్టుబడులను 5 బిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటన చేసిన ఆధారంగానే ఈ నూతన పెట్టుబడులు చేరనున్నాయని విశ్లేషిస్తున్నాయి. -
ఎక్స్ పెన్స్ రేషియో అధికం... ఇన్వెస్ట్ చేయాలా? వద్దా?
పరాగ్ పరీక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కాకుండా అంతర్జాతీయంగా షేర్లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా ? అసలు మన ఫండ్స్కు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే అవకాశం, అనుమతులు ఉన్నాయా? విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్కు సంబంధించి పన్ను నియమాలు ఎలా ఉంటాయి? ఈ పరాగ్ ఫండ్కు సంబంధించిన డైరెక్ట్ ప్లాన్ ఎక్స్పెన్ ్స రేషియో అధికంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్స్పెన్ ్స రేషియోను కూడా పరిగణనలోకి తీసుకోవాలా? –రవీందర్ జైన్ , సికింద్రాబాద్ పరాగ్ పరీక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్కు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే అనుమతి ఉంది. తన కార్పస్లో 35 శాతం మేర విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ ఫండ్కు ఉంది. గతంలో కూడా ఈ ఫండ్ తన కార్పస్లో 20–25 శాతం మేర విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇలా విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి æ అనుమతులు ఉన్న మరో రెండు, మూడు ఫండ్స్ కూడా ఉన్నాయి. అయితే వీటితో పోల్చితే ఈ పరాగ్ ఫండ్ నిరంతరాయంగా విదేశీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇక ఈ ఫండ్కు సంబంధించి పన్ను నిబంధనలు ఇతర ఈక్విటీ ఫండ్స్ పన్ను నిబంధనలుగానే ఉంటాయి. ఈ ఫండ్ ఎక్స్పె¯Œ ్స రేషియో 1.5 శాతంగా ఉంది. ఇది మరీ ఎక్కువేమీ కాదని నా అభిప్రాయం. తన నిర్వహణ ఆస్తులు పెరిగితే, ఎక్స్పెన్స రేషియోను తగ్గిస్తానని తన ఆఫర్ డాక్యుమెంట్లో పరాగ్ ఫండ్ పేర్కొంది. ఎక్స్పె¯Œ ్స రేషియోకు సంబంధించిన పన్ను నిబంధనలను ఇటీవలే మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ సవరించింది. ఈ మేరకు ఎక్స్పెన్ ్స రేషియోలో త్వరలోనే ఈ ఫండ్ మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కొంత కాలం ఎదురు చూడండి. ఇక ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్స్పెన్ ్స రేషియో ను పరిగణనలోకి తీసుకోవలసిందే. అయితే ఎక్స్పె¯Œ ్స రేషియో అధికంగా ఉందన్న ఒక్క కారణంగా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలను వాయిదా వేయడం సరికాదు. డెట్ ఫండ్స్ విషయంలో ఎక్స్పెన్ ్స రేషియో చాలా ముఖ్యమైన అంశం. ఈ ఫండ్స్ రాబడులు అధికంగా వచ్చే అవకాశాలు లేనందున పరిమిత ప్రభావం చూపే ఎక్స్పె¯Œ ్స రేషియో డెట్ ఫండ్స్ విషయంలో కీలకమైన అంశమే. అయితే ఈక్విటీ ఫండ్స్లో రాబడులు అధికంగా వస్తాయి. కాబట్టి, ఎక్స్పె¯Œ ్స రేషియోను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. వాల్యూ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయమేనా? మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి ప్రభుత్వానికి పన్ను ఆదాయం భారీగానే వస్తుందా? –కిరీటి, విజయవాడ వాల్యూ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే, చాలా ఓపిక కావాలి. వాల్యూ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పటికైతే సరైన సమయం రాలేదని చెప్పొచ్చు. వాల్యూ ఫండ్సే కాదు, ›గ్రోత్ ఫండ్స్ల్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయం కాదు. కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగుండి, నికర లాభాలు మెరుగుపడితేనే, కంపెనీల షేర్లు పెరుగుతాయి. అప్పుడు మాత్రమే గ్రోత్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో వాల్యూ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు సరైన సమయం మాత్రం కాదు. ఈ ఫండ్స్ పోర్ట్ఫోలియోను పరిశీలిస్తే, కంపెనీలన్నీ సమతూకంగానే ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్స్లో కొంత మొత్తాన్ని వాల్యూ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సముచితమే. ప్రస్తుతానికైతే మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లభించదనే చెప్పవచ్చు. 2018, íఫిబ్రవరి నుంచి చూసినా, మ్యూచువల్ ఫండ్స్పై దీర్ఘకాలిక మూలధన లాభాలు.. పన్ను చెల్లించాల్సిన స్థాయిలో రాలేదని చెప్పొచ్చు. అందుకని ప్రభుత్వానికి ఫండ్స్ లాభాలపై విధించే మూలధన లాభాల పన్ను పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. నా వయస్సు 50 సంవత్సరాలు. రిటైర్మెంట్ కోసం ఇప్పటిదాకా ఎలాంటి పొదుపు, మదుపు చేయలేదు. నేనే 65 లేదా 70 ఏళ్ల వరకూ పనిచేయగలను. నా రిటైర్మెంట్ అవసరాల కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? –ఫయాజ్, విశాఖపట్టణం రిటైర్మెంట్ అవసరాల కోసం సాధారణంగా 30 ఏళ్ల నుంచే ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాలి. రిటైర్మెంట్ అనేది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లా¯Œ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీ విషయానికొస్తే, మీకు ఎంత సాధ్యమైతే అంత ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా ఈక్విటీ ఫండ్ను గానీ, మల్టీ క్యాప్ ఫండ్ను గానీ ఎంచుకోండి. ఈ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేసే సొమ్ములను ఇతర అవసరాల కోసం వినియోగించవద్దు. ఇప్పటి నుంచి మీరు మరో పది పదిహేనేళ్లు పనిచేయగలరు అనుకుంటున్నారు. కాబట్టి, తర్వాతి 10–15 ఏళ్ల అవసరాల కోసం ఇప్పటి నుంచి 10–15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయండి. ఫండ్స్ల్లో సిప్ విధానంలో పదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులే వస్తాయి. -
అటూ ఇటు లాభమే
సాధారణంగా షేర్లలోనూ, షేర్ల ఆధారిత ఫండ్స్లోనూ పెట్టుబడులంటే అధిక రాబడులకు అవకాశాలు ఉన్నా అందుకు తగ్గ స్థాయిలో రిస్కులూ ఉంటాయి. ఇక పెట్టుబడులకు పెద్ద రిస్కులు లేని సురక్షితమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేద్దామంటే ఫండ్స్ వైపు చూద్దామంటే రాబడులు ఓ మోస్తరు స్థాయిలోనే ఉంటాయి. అలా కాకుండా ఇటు అధిక రాబడులివ్వగలిగే ఈక్విటీలు, అటు సురక్షితమైన డెట్ సాధనాల ప్రయోజనాలను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పొందాలనుకునే వారికి అనువైనవి హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ ఆధారిత ఫండ్లు ప్రధానంగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే.. డెట్ ఆధారిత ఫండ్స్ ప్రధానంగా డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ ఇస్ట్రుమెంట్స్, ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ రెండు అసెట్స్ ప్రయోజనాలను ఒకే సాధనం ద్వారా అందించగలిగే హైబ్రీడ్ ఫండ్స్పై అవగాహన పెంచేదే ఈ కథనం. హైబ్రీడ్ ఫండ్స్ స్వరూపం ఇదీ.. పెట్టుబడుల కేటాయింపు విధానం, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేష ద్వారా హైబ్రీడ్ ఫండ్స్ తక్కువ నష్టభయంతో ఎక్కువ ఫలితం పొందేందుకు అవకాశం కల్పిస్తాయి. తన కార్పస్ ఫండ్లో 65 శాతం నిధులను ఈక్విటీల్లోనూ, మిగతా మొత్తాన్ని డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్ను ఈక్విటీ ఆధారిత హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్గా వ్యవహరిస్తారు. దీనికి భిన్నంగా 65 శాతం భాగాన్ని డెట్ సాధనాల్లోనూ, మిగతా మొత్తాన్ని ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్ను డెట్ ఆధారిత హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్గా వ్యవహరిస్తారు. వీటినీ మరికొన్ని రకాలుగా వర్గీకరించారు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి.. సంప్రదాయ హైబ్రీడ్ ఫండ్స్ (10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతాది డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేవి), బ్యాలె¯Œ ్సడ్ హైబ్రీడ్ ఫండ్స్ (40–60 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి), అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్స్ (65–80 శాతం షేర్లలో ఇన్వెస్ట్ చేసేవి) మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ ఫండ్స్ ఎందుకంటే.. కొత్తగా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్న వారు ఇలాంటి ఫండ్స్ను ఎంచుకోవచ్చు. మిగతా వాటితో పోలిస్తే పెట్టుబడికి కొంత ఎక్కువ భరోసానివ్వగలిగే హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్స్లో వివిధ రకాల ఫండ్స్ ఉన్నందున తమ రిస్కు సామర్థ్యాన్ని బట్టి అనువైన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ అనుభవంతో ఫండ్స్లో పెట్టుబడులపై అవగాహన తెచ్చుకోవచ్చు. ఒకవేళ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే.. ఈక్విటీలకు అధిక కేటాయింపులు జరిపే ఫండ్స్ అనువైనవిగా ఉంటాయి. ఈక్విటీల్లో కనీసం 65 శాతం దాకా ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్నులపరమైన ప్రయోజనాలు కూడా లభించవచ్చు. కొత్త ఇన్వెస్టర్లకు, సమయానుకూలంగా ఇన్వెస్ట్ చేసేవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. కాగా ఆయా అంశాలపై మరింత అవగాహనకు అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. -
ఈఎల్ఎస్ఎస్ తక్షణమే ఆరంభిస్తే మంచిది
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ఆదాకు ఉపకరించే ఈక్విటీలింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. ఏప్రిల్ నుంచి ఆరంభించి మార్చి వరకు క్రమానుగతంగా ప్రతీ నెలా ఎంపిక చేసుకున్న ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏడాది చివర్లో ఆందోళన పడక్కర్లేదు. పైగా ఎంపిక విషయంలో పొరపాట్లకు అవకాశం లేకుండాచూసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ సహా పలు ఫండ్స్ ఉన్నాయి. పన్ను ఆదా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తం పెట్టుబడులపై పన్ను మినహాయింపు అవకాశం ఉంటుంది. సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పథకాల్లో ఈఎల్ఎస్ఎస్ కూడా ఒకటి. అన్ని పన్ను ఆదా సాధనాల్లోనూ తక్కువ లాకిన్ పీరియడ్ (మూడేళ్లు) ఉన్నది కూడా ఈఎల్ఎస్ఎస్లోనే. పైగా ఈక్విటీల్లో పెట్టుబడులకు అవకాశం. మార్కెట్ క్యాప్తో సంబంధం లేకుండా మంచి రాబడులకు అవకాశం ఉన్న కంపెనీలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఈ ఫండ్స్ మేనేజర్లకు ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల లక్ష్యాలకు సరిపడా సంపదను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. డివిడెండ్ ఆప్షన్ ఎంచుకుంటే వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సమయంలో వచ్చే లాభం రూ.1 లక్ష వరకు పన్ను ఉండదు. అంతకుమించితే ఆ మొత్తంపై కేవలం 10 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నెలా రూ.12,500 మొత్తాన్ని సిప్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 12 నెలల్లో మొత్తం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టవుతుంది. పన్ను ప్రయోజనం పరంగా ఇది అత్యుత్తమ విధానం. సరైన పథకం ముఖ్యంగా పన్ను ఆదా ప్రయోజనం ఒక్కటే ప్రాముఖ్యం కాదు. మంచి రాబడులను ఇచ్చే పథకాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమే. ఆ విధంగా చూసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల చరిత్ర ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్టర్మ్ ఈక్విటీ ఫండ్లో చూడొచ్చు. మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో సగటున స్థిరమైన రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో వార్షికంగా 10.54 శాతం, పదేళ్లలో వార్షికంగా 14.3 శాతం చొప్పున రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. -
బంగారాన్ని అందుకు కొంటున్నారా?
ఎస్బీఐ గోల్డ్ఫండ్లో 2012లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్కు సంబంధించి గ్రోత్ ఆప్షన్ డైరెక్ట్ ప్లాన్ను ఎంచుకున్నాను. ఈ ఫండ్ ఎన్ఏవీ ఆరంభంలో ఎంత ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఆరంభం నుంచే ఈ ఫండ్ ఎన్ఏవీను గమనిస్తున్నాను. ఈ ఫండ్ గరిష్ట ఎన్ఏవీ రూ.10.82 మాత్రమే. ఎన్ఏవీలో ఎలాంటి ఎదుగూ, బొదుగూ లేకపోవడం నష్టమేగా! ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? –ధనుంజయ్, విశాఖపట్టణం రాబడుల కోసం పుత్తడిలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టొద్దు. పుత్తడి మంచి వెలుగులు విరజిమ్మింది కొన్ని సంవత్సరాల్లోనే. 2005 నుంచి 2012 సంవత్సరాల వరకూ పుత్తడి ధరలు పెరిగాయి. 2008లో మంచి ధర పలికిన ఒకే ఒక అసెట్ క్లాస్.. బంగారం మాత్రమే. ఆ ఏడాది అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉండటంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పుత్తడికి బాగా డిమాండ్ పలికింది. ఒక విధంగా చెప్పాలంటే బంగారం... అనుత్పాదక ఆస్తి. చివరి సురక్షిత మదుపు సాధనం కూడా ఇదే. ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇది రాణించగలుగుతుంది. లేకుంటే చాలా అధ్వాన పనితీరు చూపించే మదుపు సాధనం కూడా ఇదే. మీరు ఏ ఆస్తిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు, దాని మీద ఎంత రాబడి వస్తుందో అని ఆలోచించాలి. బాండ్లలో పెట్టుబడులు పెట్టినా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ), ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసినా, మీకు గ్యారంటీగా కొంత మొత్తంలో రాబడులు వస్తాయి. అదే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, ఆ మేరకు మీకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. అదే రియల్టీలో ఇన్వెస్ట్ చేస్తే, ఇల్లు గానీ, స్థలం గానీ మీ పరమవుతుంది. ఇంట్లో మీరు నివసించవచ్చు. లేదా అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు. కాలంతో పాటు ఇల్లు, స్థలం విలువలు పెరుగుతాయి. అదే మీరు పుత్తడిలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఇలాంటి ఏ విలువలూ మీకు రావు. ఇది కేవలం విలువ నిల్వకు మాత్రమే పనికొస్తుంది. అంతేకాకుండా మీ దగ్గర బంగారం ఉంటే, దాని భద్రత కోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది కూడా. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్కు ఎక్స్పెన్స్ రేషియో అధికంగా ఉంటుంది కూడా ! బంగారం కేవలం వినియోగం కోసమే, ఆభరణాలు ధరించి ఆనందం పొందడం కోసమే. పెట్టుబడుల కోసం పుత్తడిని ఎప్పుడూ పరిగణించకూడదు. అందుకని మీ ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ నుంచి వైదొలగండి. పుత్తడితో అనుసంధానమున్న ఏ పెట్టుబడి సాధనంలోనూ భవిష్యత్తులో ఇన్వెస్ట్ చేయకండి. ప్ర: మార్కెట్లో రంగాల వారీ ప్రత్యేక ఫండ్స్ చాలా అందుబాటులో ఉన్నాయి కదా! వీటిల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను? తగిన సూచనలివ్వండి? –రమణి, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా మంది ఇన్వెస్టర్లు చేసే మొదటి పని.. వివిధ కేటగిరీల ఫండ్స్ పనితీరు ఎలా ఉందో పోల్చి చూడటం. ఇలా మదింపు చేసేటప్పుడు ఒక ప్రత్యేక రంగానికి చెందిన ఫండ్స్ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక్కోసారి రంగాల వారీ (సెక్టోరియల్) ఫండ్స్ అగ్రభాగంలో ఉండొచ్చు. ఒక్కోసారి అట్టడుగున ఉండొచ్చు. రెండు, మూడేళ్ల క్రితం ఫార్మా ఫండ్స్లో ఇన్వెస్టర్లు బాగా ఇన్వెస్ట్ చేసేవారు. అప్పుడు వాటి పనితీరు కూడా బాగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే, వాటి రాబడులు బాగా పడిపోయాయి. చెప్పాలంటే ఈ ఫండ్స్ అట్టడుగుకు పడిపోయాయి. సెక్టోరియల్ ఫండ్స్ ఆ ప్రత్యేక రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు ఫార్మా ఫండ్స్ అయితే ఫార్మా కంపెనీల్లోనూ, ఇన్ఫ్రా ఫండ్స్ అయితే ఇన్ఫ్రా కంపెనీల్లోనూ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలా ఒకే రంగానికి పరిమితమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్. పైగా డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు లభించవు. అందుకని రిటైల్ ఇన్వెస్టర్లు ఇలాంటి సెక్టోరియల్ ఫండ్స్కు దూరంగా ఉండటమే మంచిది. ఒక్కొక్కసారి ఈ సెక్టోరియల్ ఫండ్స్.. అన్ని ఫండ్స్ కంటే కూడా అధికంగా రాబడులనిస్తాయి. అందుకని ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది టెంప్ట్ అవుతుంటారు. ఈ ఫండ్స్ అధిక రాబడులు ఇస్తున్నాయంటే, అధిక రిస్క్ ఉంటుందని గమనించాలి. ఈ అధిక రాబడులు ఒక విధంగా వార్నింగ్ బెల్స్గా గుర్తించాలి. నేను కొంత మొత్తాన్ని మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమంటారా?లేదా ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్ను ఎంచుకోమంటారా? –పవన్, విజయవాడ మీరు కొంత మొత్తాన్ని మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.., ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. మీకు ఒకింత మంచి రాబడులు వస్తాయి. లిక్విడ్ ఫండ్స్, ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్కు సంబంధించి రిస్క్ ప్రొఫైల్లో తేడాలుంటాయి. 91 రోజుల కాలవ్యవధికి మించిన మెచ్యూరిటీ ఉన్న బాండ్లలో లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవు. ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న బాండ్లలో ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా అరుదైన సందర్భాల్లోనే నష్టాలు భరించాల్సి రావచ్చు. మొత్తం మీద చూస్తే, మూడు నెలల నుంచి ఆరు నెలల కాలానికి ఇన్వెస్ట్ చేయడానికి ఆల్ట్రా షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. -
డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి మూలధన లాభాలపై పన్నులు ఎలా ఉంటాయో కొంత వరకూ అవగాహన ఉంది. అయితే పాక్షికంగా విత్డ్రాయల్స్ విషయంలో పన్నులు ఎలా ఉంటాయి ? – అనురాధ, హైదరాబాద్ మీరు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసి కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేశారు. దీంట్లో కొంత భాగాన్ని విక్రయించారనుకుందాం. మీరు యూనిట్లు కొనుగోలు చేసిన తేదీ, యూనిట్లను విక్రయించిన తేదీలను పరిగణనలోకి తీసుకొని మీకు వచ్చిన లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాలా ? స్వల్ప కాలిక మూలధన లాభాలా అనే విషయాన్ని నిర్దారిస్తారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్(ఎఫ్ఐఎఫ్ఓ) సూత్రాన్ని ఇక్కడ అన్వయిస్తారు. మొదటగా కొనుగోలు చేసిన దాన్ని మొదటగా రిడీమ్ చేసినట్లుగా భావిస్తారు. ఉదాహరణకు మీరు ఒక ఈక్విటీ ఫండ్లో రూ.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఈ ఫండ్లో కొన్నేళ్లుగా ఇన్వెస్ట్ చేశారనుకుందాం. దీంట్లోంచి రూ. లక్ష మేర యూనిట్లను విక్రయించాలనుకున్నారనుకుందాం. వెయ్యి యూనిట్లను విక్రయించి రూ. లక్ష రిడీమ్ చేశారనుకుందాం. అన్నింటి కంటే ముందుగా కొన్న యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ముందు కొన్న యూనిట్లను ముందుగా రిడీమ్(విక్రయించినట్లుగా) చేసినట్లుగా భావిస్తారు. మీరు విక్రయించిన యూనిట్లలో ఏడాది క్రితం కొన్నవి కొన్ని, ఏడాది లోపల కొన్నవి కొన్ని ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి రావచ్చు. ప్ర: నేను మరో ఐదేళ్లలో రిటైర్ కాబోతున్నాను. రిటైర్మెంట్ అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాను. రిటైరైన తర్వాత మొదటి ఐదేళ్ల ఖర్చుల నిమిత్తం ఈ రిటైర్మెంట్ నిధి నుంచి కొంత మొత్తాన్ని డెట్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇటీవలి ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఎపిసోడ్ నేపథ్యంలో డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయమేనా ? ఇప్పుడు నేను ఏం చేయాలి ? –ఈశ్వర్, విశాఖపట్టణం ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఎపిసోడ్ నేపథ్యంలో డెట్ ఫండ్స్ పట్ల మీకే కాదు చాలా మందికి సంశయాలు ఏర్పడ్డ విషయం వాస్తవమే. అయితే ఈ భయాల నుంచి వీలైనంత త్వరగా బైటకు రండి. అలా చేయకపోతే, మీరు డెట్ ఫండ్స్ అందించే మంచి ప్రయోజనాలు మిస్ చేసుకున్నవారవుతారు. కొత్తగా వచ్చిన సైడ్–పాకెటింగ్ రూల్స్(మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన ఏవైనా కంపెనీలు చెల్లింపుల్లో విఫలమైనా, ఆ తర్వాత రికవరీ చేసుకొని, ఆ రికవరీని ఇన్వెస్టర్లకు అందించడం(ఈ ఇన్వెస్టర్లు యూనిట్లను విక్రయించినా సరే, భవిష్యత్తులో వారికి ఆ మొత్తాన్ని అందించే వెసులుబాటు ఈ సైడ్ పాకెటింగ్ రూల్స్లో ఉన్నాయి) కారణంగా జరగరానిది ఏదైనా జరిగినా, మీ డబ్బులు పూర్తిగా రికవరీ అయ్యే అవకాశాలున్నాయి. డెట్ ఫండ్స్ పట్ల మీకు ఇప్పుడు సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఒక విభిన్నమైన వ్యూహాన్ని సూచిస్తున్నాను. మీరు రిటైరైన తర్వాత మూడున్నరేళ్లకు కావలసిన మొత్తం ఖర్చులు ఎంతో లెక్కేయ్యండి. ఈ మొత్తాన్ని సేవింగ్స్ లింక్డ్ డిపాజిట్ ఖాతాలో డిపాజిట్ చేయండి. బాండ్ల ఫండ్ల కన్నా ఈ ఖాతాలో రెండు నుంచి రెండున్నర శాతం తక్కువ రాబడులు వస్తాయి. అయితే మీరు ఈ సొమ్ములను ఎప్పుడు అవసరమైతే, అప్పుడు సులభంగా తీసుకోవచ్చు. ఆ తర్వాతి నాలుగేళ్ల కాలానికి అవసరమైన సొమ్ములను మంచి క్వాలిటీ ఉన్న డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇక మిగిలిన మొత్తాన్ని ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ప్ర: నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిపి రూ. కోటి దాటాయి. ఈ మొత్తాన్ని సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో రిడీమ్ చేసుకుందామనుకుంటున్నాను. ఎంత కాలంలో నేను ఈ డబ్బులను వెనక్కి తీసుకోవాలి ? ఈ విషయంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. –రాజేశ్, విజయవాడ ఏదైనా ఆర్థిక లక్ష్యం(ఇల్లు కొనుగోలు చేయడం, పిల్లల ఉన్నత చదువులు, తదితరాలు) కోసం మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే, ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఉపసంహరణ ప్రణాళిక (విత్డ్రాయల్ ప్లాన్)ఉండాలి. అలా కాకుండా కోటి రూపాయల నిధి ఏర్పాటు చేసుకోవడమే మీ లక్ష్యమైతే, మీ అవసరాలకు అనుగుణంగా విత్డ్రాయల్ ప్లాన్ ఉండాలి. ఈ డబ్బులు మీకు తక్షణం అవసరం లేని పక్షంలో ఈ మొత్తాన్ని ఫిక్స్డ్–ఇన్కమ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే 30–50 శాతం మొత్తాన్ని ఫిక్స్డ్–ఇన్కమ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన మొత్తన్నా ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా కొనుగోలు నిమిత్తమో, లేదా వినియోగం నిమిత్తమే ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేశారనుకోండి. దానికి తగ్గట్లుగా మీ ఉపసంహరణ ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు మీ పాప/ బాబు ఉన్నత విద్యావసరాలకు రూ.50 లక్షలు అవసరమవుతాయనుకుందాం. మొదటి ఏడాది రూ.12.5 లక్షలు అవసరమనుకోండి. ఈ సొమ్ములు అవసరమయ్యే ఒక ఏడాదికి ముందే రూ.50 లక్షల మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన రూ.50 లక్షల మొత్తాన్ని 12–18 నెలల కాలంలో సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్(ఎస్డబ్ల్యూపీ)రూపంలో బదిలీ చేయండి. దీంతో మీ కోటి రూపాÆయలకు మార్కెట్ రిస్క్ ఉండదు. ఒకవేళ ఇప్పట్లో మీకు ఈ డబ్బులు అవసరం లేని పక్షంలో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ను కొనసాగించండి. మరిన్ని రాబడులు వస్తాయి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వాకూల్ రూ.100 కోట్ల పెట్టుబడులు
ముంబై: జపాన్కు చెందిన ప్రీమియం లోదుస్తుల బ్రాండ్ ‘వాకూల్’ భారత్లో పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో 2021 నాటికి భారత్లో రూ.100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపింది. భారత్లో విక్రయాలు పెంచుకునేందుకు గాను ఎక్స్క్లూజివ్ స్టోర్ల సంఖ్యను 12 నుంచి 70కు పెంచనున్నట్టు, షాప్ ఇన్ షాప్ స్టోర్లను 80కి, దేశవ్యాప్తంగా స్టోర్లను 150కి పెంచనున్నట్టు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు, కోల్కతా మార్కెట్లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయడంతోపాటు, దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ టాప్ 10 పట్టణాలపై మరింత దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. టైర్–1, 2 ప్రాంతాల్లో 30 పట్టణాలకు విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు మింత్రా, జబాంగ్, టాటా క్లిక్, వాకూల్ ఇండియా డాట్ కామ్ ద్వారా విక్రయాలను పెంచుకునే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. -
వాకూల్ రూ.100 కోట్ల పెట్టుబడులు
ముంబై: జపాన్కు చెందిన ప్రీమియం లోదుస్తుల బ్రాండ్ ‘వాకూల్’ భారత్లో పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో 2021 నాటికి భారత్లో రూ.100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపింది. భారత్లో విక్రయాలు పెంచుకునేందుకు గాను ఎక్స్క్లూజివ్ స్టోర్ల సంఖ్యను 12 నుంచి 70కు పెంచనున్నట్టు, షాప్ ఇన్ షాప్ స్టోర్లను 80కి, దేశవ్యాప్తంగా స్టోర్లను 150కి పెంచనున్నట్టు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు, కోల్కతా మార్కెట్లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయడంతోపాటు, దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ టాప్ 10 పట్టణాలపై మరింత దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. టైర్–1, 2 ప్రాంతాల్లో 30 పట్టణాలకు విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు మింత్రా, జబాంగ్, టాటా క్లిక్, వాకూల్ ఇండియా డాట్ కామ్ ద్వారా విక్రయాలను పెంచుకునే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. -
వాకూల్ రూ.100 కోట్ల పెట్టుబడులు
ముంబై: జపాన్కు చెందిన ప్రీమియం లోదుస్తుల బ్రాండ్ ‘వాకూల్’ భారత్లో పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో 2021 నాటికి భారత్లో రూ.100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపింది. భారత్లో విక్రయాలు పెంచుకునేందుకు గాను ఎక్స్క్లూజివ్ స్టోర్ల సంఖ్యను 12 నుంచి 70కు పెంచనున్నట్టు, షాప్ ఇన్ షాప్ స్టోర్లను 80కి, దేశవ్యాప్తంగా స్టోర్లను 150కి పెంచనున్నట్టు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు, కోల్కతా మార్కెట్లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయడంతోపాటు, దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ టాప్ 10 పట్టణాలపై మరింత దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. టైర్–1, 2 ప్రాంతాల్లో 30 పట్టణాలకు విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు మింత్రా, జబాంగ్, టాటా క్లిక్, వాకూల్ ఇండియా డాట్ కామ్ ద్వారా విక్రయాలను పెంచుకునే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. -
ఠీవీగా రిటైర్మెంట్..!
వేతన జీవులు అందరూ తాము రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నిశ్చింతగా జీవించేందుకు ముందుగానే ప్రణాళికా బద్ధంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇటీవలి సంవత్సరాల్లో అవగాహన విస్తృతం అవుతోంది. విశ్రాంత జీవితానికి క్రమం తప్పని పెట్టుబడులు ఎంతో కీలకం. ఇందుకోసం బాగా ప్రాచుర్యంలో ఉన్న సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్, యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఈపీఎఫ్, పీపీఎఫ్, వీపీఎఫ్ ఉన్నాయి. వీటిలోని లాభ, నష్టాలు తెలుసుకున్న తర్వాత తమ రిస్క్ ప్రొఫైల్కు అనుగుణంగా భిన్న సాధనాల మధ్య ఎంత పెట్టుబడుల కేటాయించాల్సిన మొత్తాలపై ప్రణాళిక వేసుకోవాలి. ఆ తర్వాత క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడంతోపాటు, నిర్ణీత కాలానికి ఆ పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఇందుకు సంబంధించిన పెట్టుబడి సాధనాల వివరాలను తెలియజేసే కథనమే ఇది. మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ పథకాలు రిటైర్మెంట్ జీవనానికి నిధి సమకూర్చుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలు సరైన ఎంపిక అవుతుంది. లార్జ్క్యాప్, మిడ్క్యాప్, మల్టీక్యాప్, స్మాల్క్యాప్, ఈఎల్ఎస్ఎస్ ఇలా ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో మార్కెట్లలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ ఈ విభాగాల్లోని పథకాలు వార్షికంగా 16–21 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇదే కాలంలో సెన్సెక్స్ టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఇండెక్స్) రాబడులు 17.8 శాతంగా ఉన్నాయి. 25 ఏళ్ల కాలంలో చూసుకుంటే సెన్సెక్స్ వార్షిక రాబడులు 11 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో టాప్ లార్జ్క్యాప్ ఫండ్స్ వార్షికంగా 19 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చాయి. కాకపోతే సెబీ ఇటీవలి కాలంలో పథకాల పునర్వ్యస్థీకరణకు చేసిన మార్పులు, గత ఏడాది కాలంలో మార్కెట్ల పనితీరు నత్తనడకనే ఉండడం వంటి అంశాలతో లార్జ్క్యాప్ పథకాల పనితీరు బెంచ్మార్క్కు అనుగుణంగా లేదు. కనుక మిడ్, స్మాల్క్యాప్ విభాగంలో యాక్టివ్ పథకాలు దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపించగలవు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం, నిర్ణీత కాలానికోసారి పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్ చేసుకోవడం, పనితీరు ఆశించిన మేర లేని పథకాల నుంచి వైదొలగి, వాటి స్థానంలో వేరే వాటిని ఎంచుకోవడం చేస్తుండాలి. నిర్ణీత లక్ష్యానికి సమయం దగ్గర పడుతుంటే ఈక్విటీల నుంచి వైదొలిగి సురక్షిత సాధనాల్లోకి పెట్టుబడులు మళ్లించుకోవాలి. ఇందుకోసం అధిక నాణ్యత కలిగిన డెట్ ఫండ్స్, బ్యాంకు ఎఫ్డీలు పనికొస్తాయి. సాధారణ ఈక్విటీ పథకాలకు అదనంగా ప్రత్యేకించి రిటైర్మెంట్ అవసరాల కోసం రిటైర్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఈ విభాగంలోనివే. వీటిల్లో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. ఇక టాటా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఆది త్య బిర్లా సన్లైఫ్ కూడా పథకాలను ప్రవేశపెట్టాయి. ఇందులో టాటా రిటైర్మెంట్ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ప్రొగ్రెసివ్, మోడరేట్ పేరుతో నడిచే రెండు ఈక్విటీ పథకాల్లోనూ ఐదేళ్ల కాలంలో రాబడులు 18 శాతం స్థాయిలో ఉన్నాయి. బెంచ్మార్క్ కంటే ఈ పథకం ఎక్కవే రాబడులు తెచ్చిపెట్టింది. యూటీఐ రిటైర్మెంట్, ఫ్రాంక్లిన్ పెన్షన్ అన్నవి డెట్తో కూడిన బ్యాలన్స్డ్ ఫండ్స్. డెట్కు, ఈక్విటీలకు 40:60 నిష్పత్తిలో పెట్టుబడులను కేటాయిస్తాయి. ఈ రెండు పథకాలు గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10–11 శాతం రాబడులను ఇచ్చాయి. ఈ పథకాలన్నీ కూడా నెలవారీగా తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియో వివరాలను ఇన్వెస్టర్లకు వెల్లడిస్తుంటాయి. ఇండెక్స్ ఫండ్స్ 1–1.5 శాతం స్థాయిలో చార్జ్ చేస్తుంటే, ఈటీఎఫ్ల్లో ఎక్స్పెన్స్ రేషియో 0.5 శాతంగా ఉంటోంది. యాక్టివ్గా నడిచే ఈక్విటీ ఫండ్స్ మాత్రం 1.6–2.7 శాతం మధ్య చార్జీలను రాబడుతున్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో 2.3–2.8 శాతం మధ్య ఉంది. ఇక డైరెక్ట్ ప్లాన్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే అర శాతం వరకు ఎక్స్పెన్స్ రేషియో భారం తగ్గుతుంది. పన్ను వివరాలు ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్లు రెండింటిలోనూ పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ ఫండ్స్లో తొలుత పెట్టుబడి చేసేటప్పుడు మినహాయింపు లభిస్తుంది కానీ...వాటిపై వచ్చే రాబడులపై పన్ను వుంటుంది. ఈ రెండూ డెట్తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్. మూడేళ్లకు మించి పెట్టుబడులు కొనసాగిస్తే రాబడులపై 20 శాతం పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ రాబడులకు ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం మినహాయింపు) ప్రయోజనం ఉంటుంది. మూడేళ్లలోపు వైదొలిగితే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించుకోవాలి. అదే ఈక్విటీ పథకాలు అయితే ఏడాది దాటిన తర్వాత రాబడులపై 10 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను పడుతుంది. రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా ప్రతీ నెలా తమ అవసరాలకు సరిపడా వెనక్కి తీసుకోవచ్చు. దీంతో పన్ను భారం అంతగా ఉండదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) విశ్రాంత జీవనానికి అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల్లో అత్యంత ముఖ్యమైనది ఎన్పీఎస్. ఈక్విటీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్ల సమతూకంతో పలు రకాల పెట్టుబడి ఆప్షన్లు ఎన్పీఎస్లో ఉన్నాయి. ఎనిమిది ఫండ్ మేనేజర్లలో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు. వీటిల్లో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, యూటీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్ మెరుగ్గా ఉన్నాయి. బిర్లా సన్లైఫ్ మినహా మిగిలిన ఫండ్ సంస్థలు ఎన్పీఎస్లు ఏ మేరకు రాబడులను ఇచ్చాయన్నదానిపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు అందుబాటులో ఉంది. ఆ వివరాలను పరిశీలించి అనువైన దానిని ఎంచుకోవచ్చు. వార్షికంగా కనీసం రూ.1,000ను ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతాన్నే యాక్టివ్ చాయిస్ కింద ఎంచుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని తప్పనిసరిగా కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు కేటాయించుకోవాల్సి ఉంటుంది. 50 ఏళ్ల వయసు దాటితే యాక్టివ్ చాయిస్ చందాదారులు ఈక్విటీలకు కేటాయింపులను క్రమంగా 50 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే ఆటో చాయిస్లో అయితే ఎన్పీఎస్ చందాదారుని వయసు ఆధారంగా ఈక్విటీలకు పెట్టుబడుల రేషియో మారుతూ ఉంటుంది. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి అయితే, 100 సంవత్సరాల కాలంలో 40 ఏళ్లను తీసివేయగా, మిగులు 60 శాతం ఉంటుంది కనుక ఈ విధానం ప్రాతిపదికన ఆటో చాయిస్లో ఈక్విటీలకు 60 శాతం డెట్సాధనాలకు 40 శాతం ఫండ్ మేనేజర్లే కేటాయింపులు చేస్తారు. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్, సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ 100 స్టాక్స్లోనే ఫండ్స్ సంస్థలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈక్విటీతో కూడిన పెట్టుబడి ఆప్షన్ కింద ఫండ్స్ మేనేజింగ్ సంస్థలు వార్షికంగా 11–13 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇందులో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్, యూటీఐ 12 శాతానికి పైబడి రాబడులను ఇచ్చాయి. గిల్ట్ విభాగంలో పెట్టుబడులపై ఇవి గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10–11 శాతం మేర రాబడులు తెచ్చి పెట్టాయి. కార్పొరేట్ బాండ్స్ విభాగంలో రాబడులు 9–10 శాతం మధ్య ఉన్నాయి. పాక్షిక ఉపసంహరణలకు అనుమతి కొన్ని రకాల అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే, పిల్లల విద్యావసరాలు, ఇంటి కొనుగోలు సమయాల్లో పాక్షిక ఉపసంహరణలకు ఎన్పీఎస్ పథకంలో అనుమతి ఉంది. ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు నెలవారీగా, కొన్ని సందర్భాల్లో అర్ధ సంవత్సరానికోసారి పోర్ట్ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఎన్పీఎస్ను ప్రారంభించుకోవచ్చు. ఖాతా ప్రారంభ చార్జీ కింద రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక నిర్వహణ ఫీజు కింద ఎన్ఎస్డీఎల్కు రూ. 95 చెల్లించాలి. వీటికి అదనంగా ప్రతీ లావాదేవీపై రూ.3.75 చార్జీ ఉంటుంది. కార్వీ సంస్థ తక్కువ చార్జీలను వసూలు చేస్తోంది. ఇంకా పాయింట్ ఆప్ ప్రెజెన్స్ (డిస్ట్రిబ్యూటర్కు చెల్లించేది) చార్జీ పేరుతో ప్రారంభంలో రూ.200 చార్జీ చెల్లించుకోవాలి. అంతేకాదు, ఇక ఆ తర్వాత చేసే అన్ని పెట్టుబడులపై 0.25 శాతం కమీషన్ కూడా డిస్ట్రిబ్యూటర్కు వెళుతుంది. ఈఎన్పీఎస్ ద్వారా పెట్టుబడి పెడితే అప్పుడు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్కు కేవలం 0.1 శాతమే కమీషన్ వెళుతుంది. కనుక ఆన్లైన్లో నేరుగా ఎన్పీఎస్ సైట్ ద్వారా చందాలు చేసుకోవడం ద్వారా ఆదా చేసుకోవచ్చు. అలాగే, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీజు కూడా వార్షికంగా 0.01 శాతమే పడుతుంది. ఆదాయపన్ను ప్రయోజనాలు ఎన్పీఎస్కు అదనంగా ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడుల తర్వాత కూడా మరో రూ.50,000 మొత్తంపై పన్ను మినహాయింపును సెక్షన్ 80సీసీడీ కింద ఎన్పీఎస్లో పెట్టుబడుల ద్వారా పొందే అవకాశం ఉంది. ఎన్పీఎస్లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేసినా మొత్తం సెక్షన్ 80సీ, సీసీడీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్ల తర్వాత మొత్తం నిధిలో 60 శాతాన్ని పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి. యూనిట్లింక్డ్ ప్లాన్లు ఈక్విటీ ఆధారిత పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటిని బీమా సంస్థలు ఆఫర్ చేస్తుంటాయి. బజాజ్ అలియాంజ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ లైఫ్ పెన్షన్లను ప్లాన్లను అందిస్తున్నాయి. బీమా సంస్థలు తాము నిర్వహించే ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. రాబడులకు హామీ ఉండదు. మార్కెట్ పనితీరు ఆధారంగానే ఉంటాయి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు ఎంచుకున్న పథకాలను బట్టి 6.5–14.1 శాతం మధ్య ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 7.3–12.6 శాతంగా ఉన్నాయి. ఎటువంటి చార్జీలను మినహాయించకముందు రాబడుల వివరాలు ఇవి. రాబడులు ఆశించిన విధంగా లేకపోతే భిన్న ఆప్షన్ల మధ్య పెట్టుబడులను మార్చుకునే అవకాశాన్ని బీమా సంస్థలు ఈ పథకాల్లో అనుమతిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత సమకూరిన నిధిలో మూడింట రెండొతులను పెన్షన్ యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఒక వంతును వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్లు ప్రతీ నెలా పోర్ట్ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. కాకపోతే ఈ పాలసీల్లో బీమా కూడా ఉంటుంది కనుక అదనపు చార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. యూనిట్ లింక్డ్ప్లాన్ ఎందులో అయినా పెట్టుబడులు, బీమా కలగలసి ఉంటాయి. దీంతో మోర్టాలిటీ చార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, ప్రీమియం అలోకేషన్ చార్జీలు ఇలా రకరకాల రూపంలో చార్జీల భారం ఉంటుంది. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ 1–1.35 శాతం వరకు ఉంటుంది. పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ 0.3–0.4గా ఉంటుంది. వార్షిక ప్రీమియానికి బీమా మొత్తం కనీసం 10 రెట్లు ఉంటే, పన్ను మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 80సీ కింద ప్రీమియానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే, ఉపసంహరణ సమయంలో ఒక వంతుకు పన్ను ఉండదు. మిగిలిన రెండొంతులను యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అందుబాటులో ఉన్న సురక్షిత పెట్టుబడి సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో పెట్టుబడులకు హామీ ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 8 శాతం. ప్రతీ త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్రం సవరిస్తుంటుంది. దీనికి అదనంగా పన్ను మినహాయింపులు (పెట్టుబడులపై, రాబడులు, ఉపసంహరణలపైనా) ఉన్నందున ఇది ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన సాధనం. ఇది డెట్ సాధనం. వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత కావాలంటే వ్యవధిని ఐదేళ్లు పెంచుకోవచ్చు. కనుక దీర్ఘకాలిక అవసరాల కోసం తగిన ఎంపిక అవుతుంది. ఏడాదిలో కనీసం 500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడులకే పన్ను మినహాయింపు లభిస్తుంది. మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాల వ్యవధి అమల్లోకి వస్తుంది. ఉదాహరణకు 2018 అక్టోబర్లో మొదటి వాయిదా కట్టారనుకోండి. అప్పుడు 2019 ఏప్రిల్ 1 నుంచి 2034 ఏప్రిల్1 వరకు కాల వ్యవధి అమలవుతుంది. మూడు నుంచి ఆరో ఏట వరకు రుణం తీసుకోవచ్చు. రుణం తీసుకోవడానికి రెండేళ్ల ముందు నాటికి ఉన్న బ్యాలన్స్లో 25 శాతాన్ని రుణంగా ఇస్తారు. తిరిగి మూడేళ్ల కాలంలో రుణాన్ని తీర్చివేయాలి. ఏడో ఏట నుంచి పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. పీపీఎఫ్లో పెట్టుబడులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. అలాగే, పెట్టుబడులపై వడ్డీ, చివర్లో ఉపసంహరణల మొత్తం మీదా పన్ను ఉండదు. దీంతో 30% పన్ను పరిధిలో ఉన్న వారికి వాస్తవంగా గిట్టుబాటయ్యే వడ్డీ 11.9 శాతంగా అంచనా వేసుకోవచ్చు. అధిక పన్ను శ్లాబుల్లోని వారికి పీపీఎఫ్ ఎంతో ఆకర్షణీయమైన సాధనం అవుతుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అన్ని రకాల డెట్ సాధనాల్లో అధిక రాబడులను ఇస్తున్న సాధనం ఇది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ కంటే ఎక్కువగానే ఈపీఎఫ్ చందాలపై వడ్డీ రేటును నిర్ణయించడం జరుగుతోంది. ఇందులో పెట్టుబడులు, రాబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఇటీవలే 2018–19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యోగి వేతనం (బేసిక్, డీఏ కలిపిన మొత్తం)లో 12 శాతాన్ని మినహాయించి ఈపీఎఫ్, ఈపీఎస్కు జమ చేయడం జరుగుతుంది. అలాగే, ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా చెల్లిస్తుంది. పనిచేసే సంస్థను మారిపోయి, మరో ఉద్యోగంలో చేరినా ఈపీఎఫ్ను కొనసాగించుకోవచ్చు. దీనికి అదనంగా ఉద్యోగి తన బేసిక్, డీఏ మొత్తంలో 100 శాతాన్ని వీపీఎఫ్ (వాలెంటరీ ప్రావిడెంట్ ఫండ్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఈపీఎఫ్ వడ్డీ రేటే అమలవుతుంది. పన్ను ప్రయోజనాలు ఈపీఎఫ్, వీపీఎఫ్కు సమానంగా వర్తిస్తాయి. పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందొచ్చు. రాబడులు, ఉపసంహరణలకూ పన్ను లేదు. -
ఎఫ్డీ.. డెట్ ఫండ్.. ఏది బెటర్?
నేను కొంత మొత్తాన్ని డెట్ ఫండ్లో నాలుగేళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. 8 శాతానికి పైగా రాబడినిచ్చే డెట్ ఫండ్స్ ఉన్నాయా? బ్యాంక్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైనా పన్ను ప్రయోజనాలు ఉంటాయా? –ప్రియ, హైదరాబాద్ డెట్ ఫండ్స్లో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ 8 శాతానికి పైగా రాబడినిచ్చే అవకాశాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో రాబడులు ఖచ్చితంగా ఇంత వస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు. అదే మీరు ఏదైనా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, ఏడాది తర్వాత ఇంత మొత్తం, రెండేళ్ల తర్వాత ఇంత మొత్తం ఇలా మీకు గ్యారంటీగా ఎంత రాబడులు వస్తాయో ముందే తెలుస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా గ్యారంటీగా రాబడులు రావు. కాకుంటే చాలా డెట్ ఫండ్స్ గతంలో 8 శాతానికి పైగా రాబడులు ఇచ్చాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ స్థాయి రాబడులు రావచ్చనే అంచనాలు ఉంటాయి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు అదనంగా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మీరు కొంత మొత్తాన్ని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం. దీనిపై వచ్చే వడ్డీపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని మీ ఆదాయానికి కలపి పన్ను లెక్కిస్తారు. మీరు 30 శాతం పన్ను శ్లాబులో ఉంటే, ఆ శ్లాబ్ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మూడేళ్లలోపు ఎప్పుడైనా ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, వచ్చే లాభాలను మీ ఆదాయానికి కలిపి పన్ను లెక్కిస్తారు. మీరు యూనిట్లను విక్రయించినప్పుడు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి. ప్రతీ ఏడాది వచ్చే వడ్డీని పరిగణనలోకి తీసుకొని పన్ను లెక్కిస్తారు. మూడేళ్ల తర్వాతనే డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించారనుకుందాం. అప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. అప్పుడు మీరు ఇండేక్సేషన్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. వచ్చిన లాభాల నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసివేసి 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు. ఊళ్లో పొలం అమ్మగా నా వాటా కింద రూ.8 లక్షలు వచ్చాయి. దీంట్లో మూడు లక్షలు మా అమ్మ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వడ్డీకి ఆమెకు అందే ఏర్పాటు చేశాను. మిగిలిన రూ.5 లక్షలను ఒక ఆర్బిటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్ నుంచి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) విధానంలో ఏదైనా ఇండెక్స్ ఫండ్లోకి బదిలీ చేయాలనేది నా ఆలోచన. మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమేనా?– సురేందర్, విశాఖపట్టణం మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మొత్తాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి, ఎస్టీపీ ద్వారా ఇండెక్స్ ఫండ్స్లోకి బదిలీ చేయాలన్న మీ వ్యూహం మంచిదే. కానీ ఆర్బిట్రేజ్ ఫండ్కు బదులుగా మీరు లిక్విడ్ ఫండ్ను ఎంచుకోండి. ఈ రెండు ఫండ్స్కు తేడా పెద్దగా ఏమీ ఉండదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు లభించినప్పటికీ, ఈ ఫండ్స్ చాలా తక్కువ రాబడులను ఇస్తున్నాయి. అలా కాకుండా లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, మీకు కొంచెం ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మ్యూచువల్ ఫండ్స్లో నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సూచనలివ్వండి. –కార్తికేయ, ఈ మెయిల్ ద్వారా మీరు ఈక్విటీ, ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేసే ముందు మొదటగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆరు నెలల అవసరాలకు సరిపడే మొత్తంతో ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో ఉంచడమో లేదా లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడమో చేయండి. అత్యవసర నిధి తయారైన తర్వాత నెలకు కొంత మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. అది కూడా ఆన్లైన్లోనే తీసుకోండి. చిన్న వయస్సులో టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే, మీకు ఎక్కువ బీమా కవరేజ్, తక్కువ ప్రీమియమ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇక ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే... సమీప భవిష్యత్తులో అవసరం పడని డబ్బులనే మీరు ఈ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా హైబ్రిడ్ ఫండ్స్తో మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఆరంభించండి. ఈ హైబ్రిడ్ ఫండ్స్ తమ కార్పస్లో మూడింట రెండొంతులు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు ఒకింత రక్షణ హైబ్రిడ్ ఫండ్స్కు లభిస్తుంది. మార్కెట్ పతనమవుతున్నప్పుడు కూడా క్రమశిక్షణగా మీ ఇన్వెస్ట్మెంట్స్ను కొనసాగించడం మరచిపోవద్దు. మీరు ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే, హైబ్రిడ్ ఫండ్కు బదులుగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్స్కు లాక్–ఇన్–పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. పైగా మీకు ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అన్ని రకాల స్టాక్స్లో పెట్టుబడికి అవకాశం
ఈ పథకం లార్జ్క్యాప్, మిడ్, స్మాల్ క్యాప్ ఇలా అన్ని రకాల స్టాక్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. అందుకు ఇది మల్టీక్యాప్ విభాగంలోకి వస్తుంది. దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు నిలకడగా ఉండడాన్ని గమనించొచ్చు. ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే బెంచ్ మార్క్ కంటే అధిక రాబడులను ఇచ్చింది. స్థిరమైన రాబడులు ఆశించే వారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ పథకాన్ని దీర్ఘకాలం ఇన్వెస్టింగ్ కోసం పరిశీలించొచ్చు. పనితీరు.. ఈ పథకం గడిచిన ఏడాది కాల పనితీరు ప్రామాణిక సూచీ కంటే మెరుగ్గా ఉంది. ఏడాది కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ పథకం నికరంగా నష్టాలనే ఇచ్చింది. మైనస్ 4.62శాతంగా ఉన్నాయి. 2018లో మార్కెట్ల పనితీరు నిరాశాజనకంగా ఉన్న విషయం గమనార్హం. కానీ, ఇదే కాలంలో ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా భావించే బీఎస్ఈ 500 రాబడులు కూడా మైనస్ 7.12 శాతంగా ఉండటం గమనార్హం. మూడేళ్ల కాలంలో అయితే, ఈ పథకంలో రాబడులు 13.27 శాతంగా ఉంటే, బీఎస్ఈ 500 రాబడులు 14.42 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో బీఎస్ఈ 500 రాబడులు 14.51 శాతం, పదేళ్ల కాలంలో 17.13 శాతంగా ఉండగా, ఈకాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ 16.51 శాతం, 18.45 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. దీర్ఘకాలంలో బీఎస్ఈ 500కు మించి రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే స్వల్ప కాలం కోసం కాకుండా ఐదేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం కోసం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. పెట్టుబడుల తీరు ఈ పథకం తన పెట్టుబడుల్లో దాదాపు 95 శాతం నుంచి 100 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అస్థిరతల సమయాల్లో నగదు నిల్వలు పెంచుకుంటుంది. 2015, 2016 సంవత్సరాల్లో బెంచ్ మార్క్లను మించి రాబడులను ఇవ్వగా, 2017లో మాత్రం వెనుకబడింది. సాఫ్ట్వేర్, హెల్త్కేర్ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులే ఇందుకు కారణం. ఆ ఏడాదిలో ఈ రెండు రంగాల స్టాక్స్ ర్యాలీ చేయలేదు. 2018 జనవరి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడం, ఈ స్టాక్స్ ర్యాలీ చేయడంతో ఈ పథకం ఎన్ఏవీ రికవరీ అయింది. బ్యాంకులు, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్కు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వీటిల్లో సుమారు 34 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఇంధన రంగ స్టాక్స్లో సుమారు 19 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలకు సుమారు 9 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించడాన్ని గమనించొచ్చు. అతుల్ పటేల్, శంకరన్ నరేన్ ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార పరంగా అధిక నాణ్యత, వృద్ధి అవకాశాలున్న స్టాక్స్ను ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం చేస్తుంటారు. ముఖ్యంగా ఈక్విటీల్లో భారీ రిస్క్ వద్దనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. -
ఐఎల్అండ్ఎఫ్ఎస్ పరిరక్షణకు చర్యలు..
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ విలువను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బోర్డు పేర్కొంది. వ్యవస్థాగతంగా కీలకమైన సంస్థను గట్టెక్కించే ప్రణాళిక రూపకల్పన కోసం తరచూ భేటీ కానున్నట్లు తెలిపింది. గురువారం తొలిసారిగా భేటీ అయిన కొత్త బోర్డు దాదాపు అయిదు గంటల పాటు కంపెనీ వ్యవహారాలపై చర్చించింది. గ్రూప్లో ఇన్వెస్ట్ చేసిన ఇతర వాటాదారులతో కూడా తగు సమయంలో భేటీ కానున్నట్లు సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ ఉదయ్ కొటక్.. విలేకరులకు తెలిపారు. గ్రూప్ ఆడిట్ కమిటీ చైర్మన్గా బోర్డు సభ్యుడు, ప్రముఖ ఆడిటర్ నందకిశోర్ ఎంపికయ్యారని చెప్పారు. దాదాపు రూ. 91,000 కోట్ల రుణ భారమున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలు కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతుండటం.. మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రంగంలోకి దిగి ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్నకు కొత్త బోర్డును నియమించింది. ఉదయ్ కొటక్ సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డులో సెబీ మాజీ చైర్మన్ జీఎన్ బాజ్పాయ్, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది, ఐఏఎస్ అధికారి మాలిని శంకర్, టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తదితరులు ఉన్నారు. మారుతీ చైర్మన్ పదవి నుంచి తప్పుకునేది లేదు: భార్గవ ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం నేపథ్యంలో తాను మారుతీ సుజుకీ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న వార్తలను ఆర్సీ భార్గవ ఖండించారు. చట్టప్రకారం తాను తప్పు చేసినట్లు రుజువైతే తప్ప తప్పుకోనక్కర్లేదని గతంలో ఐఎల్అండ్ఎఫ్ఎస్ డైరెక్టరుగా వ్యవహరించిన భార్గవ తెలిపారు. వడ్డీలు చెల్లించేందుకు తగినన్ని నిధులు లేవన్న అంశం మేనేజ్మెంట్కు మూడు నాలుగేళ్లుగా తెలుసన్నారు. బోర్డు సమావేశాల్లో పలు మార్లు ఇది చర్చకు వచ్చేదని, తగు పరిష్కార మార్గాలపై ప్రణాళికల రూపకల్పన కూడా జరిగేదని చెప్పారాయన. యాజమాన్య నిర్వహణ లోపాలు, నిర్లక్ష్య ధోరణుల ఆరోపణలతో 10 మంది మాజీ డైరెక్టర్లపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వేసిన పిటీషన్లో భార్గవ పేరు కూడా ఉంది. ఈ పది మందిని ఇతర కంపెనీల బోర్డుల్లో కొనసాగనివ్వబోరంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మార్కెట్పై సంక్షోభ ప్రభావం పెద్దగా పడదు: జైట్లీ ఐఎల్ఎఫ్ఎస్ సంస్థలో సంక్షోభాన్ని మొదట్లోనే నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కనుక ఇదేమంత తీవ్ర ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రూ.91,000 కోట్ల రుణాలను తీసుకుని, ఇటీవల పలు చెల్లింపుల్లో ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ విఫలం కావడంతో, బోర్డును ప్రభుత్వం సస్పెండ్ చేసి తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఐఎల్ఎఫ్ఎస్లో సంక్షోభం మార్కెట్లలో నిధుల సమస్యకు దారితీస్తుందన్న ఆందోళనలు తలెత్తడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్కోటక్ నేతృత్వంలో ఐఎల్ఎఫ్ఎస్కు కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ‘‘ఇది దేశ అంతర్గత అంశం. వేగంగా దీనికి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. కనుక ఏమంత తీవ్ర ప్రభావం ఉండదు’’అని జైట్లీ పేర్కొన్నారు. -
మాస్టర్ ఫండ్లో టెమసెక్ 2,750 కోట్ల పెట్టుబడులు
ముంబై: నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్)లో సింగపూర్కు చెందిన టెమసెక్ హోల్డింగ్స్... రూ.2,750 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. తమ మాస్టర్ ఫండ్లో టెమసెక్ ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్ఐఐఎఫ్ వెల్లడించింది. దీంతో తమ ఫండ్లో ఇన్వెస్టర్ల సంఖ్య ఏడుకు చేరనున్నట్లు ఎన్ఐఐఎఫ్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుజోయ్ బోస్ చెప్పారు. ఈ ఫండ్లో ఇప్పటికే భారత ప్రభుత్వం, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, హెచ్డీఎఫ్సీ గ్రూప్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్లు ఇన్వెస్ట్ చేశాయి. త్వరలో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్... కొత్త మౌలిక ప్రాజెక్ట్లు, ఇప్పటికే ప్రారంభమై, ఆగిపోయిన మౌలిక ప్రాజెక్ట్లకు నిధులందించేందుకు గాను ప్రభుత్వం ఎన్ఐఐఎఫ్ను 2015లో ఏర్పాటు చేసింది. ఎన్ఐఐఎఫ్లో కేంద్రానికి 49 శాతం చొప్పున వాటా ఉండగా, ఇతర వాటాలు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఉన్నాయి. ఎన్ఐఐఎఫ్ ఇప్పటికే రెండు ఫండ్స్–మాస్టర్ ఫండ్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ను నిర్వహిస్తోంది. మాస్టర్ ఫండ్ నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుండగా, ఇతర సంస్థలు నిర్వహించే ఫండ్స్లో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తోంది. తాజాగా 200 కోట్ల డాలర్ల నిధులతో మూడో ఫండ్–స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను ప్రారంభించే సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ మూడు ఫండ్ల ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని సుజోయ్బోస్ చెప్పారు. కాగా మౌలిక రంగ ఆస్తుల నిర్మాణానికి గాను దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థగా ఎన్ఐఐఎఫ్ త్వరతిగతిన అవతరిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. -
స్టార్టప్ వెంచర్ ఫండ్కు సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: స్టార్టప్ల్లో ఇన్వెస్ట్ చేసే వెంచర్ క్యాపిటల్ ఫండ్కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఇండియన్ స్టార్టప్ ఫ్యాక్టరీ సంస్థ తొలిగా ఐఎస్ఎఫ్ స్పెషల్ ఆపర్చునిటీ ఫండ్ పేరుతో ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను తెస్తోంది. ఈ రూ.200 కోట్ల ఈ ఫండ్.. స్టార్టప్ లు, ఎస్ఎమ్ఈ, ఎమ్ఎస్ఎమ్ఈల్లో ఇన్వెస్ట్ చేయనుంది. స్పష్టమైన వృద్ధి అవకాశాలున్న సంస్థల్లోనే ఇన్వెస్ట్ చేస్తామని ఈ ఫండ్ వ్యవస్థాపకులు, కపిల్ కౌల్ పేర్కొన్నారు. శాస్త్రీయ, వినూత్న విధానాల ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. -
ఈక్విటీల్లో స్థిరమైన రాబడుల కోసం
మిడ్క్యాప్ విభాగంలో మంచి రాబడులు ఆశిస్తూ అదే సమయంలో పెట్టుబడులకు భద్రత ఉండాలని భావించే వారు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ కూడా ఒకటి. కనీసం ఐదేళ్లు ఆ పై వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసేవారు ఎంపిక చేసుకునే మంచి పేరున్న పథకాల్లో ఇదీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పథకం ప్రారంభమై 25 ఏళ్లు అయింది. అప్పటి నుంచి చూసుకుంటే రాబడుల్లో మేటిగానే కొనసాగుతోంది. రాబడులు ఈ పథకం ప్రారంభమైన దగ్గర్నుంచీ సగటున ప్రతీ ఏటా 20% రాబడులను ఇచ్చిందంటే దీని పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకం రాబడులకు ప్రామాణిక సూచీ నిఫ్టీ 500. మూడేళ్ల కాలంలో ఈ పథకంలో రాబడులు సగటున ఏటా 11.4%గా ఉన్నాయి. బెంచ్ మార్క్ నిఫ్టీ 500 రాబడులు ఈ కాలంలో ఏటా 9.3 శాతమే. ఐదేళ్ల కాలంలో ఏటా సగటున ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ 24.1% రాబడులను ఇవ్వగా, బెంచ్ మార్క్ రాబడులు 14.9%గానే ఉన్నాయి. పదేళ్ల కాలంలో చూసుకున్నా ఈ పథకమే అగ్ర స్థాయిలో ఉంది. ఏటా సగటున 18.1% రాబడులను ఇవ్వగా... ఇదే కాలంలో నిఫ్టీ–500 రాబడులు ఏటా సగటున 10.6% కావడం గమనార్హం. భిన్న రంగాలు, ఆయా రంగాల్లో భిన్న స్టాక్స్ మధ్య పెట్టుబడులను వర్గీకరించడం ద్వారా రిస్క్ను తగ్గించడం ఈ పథకం నిర్వహణ పనితీరులో భాగం. ఇక లార్జ్క్యాప్ స్టాక్స్ను యాడ్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ, లార్జ్క్యాప్లో పెట్టుబడులను 15 శాతంలోపునకే పరిమితం చేస్తుంది. ఈ విధమైన వ్యూహాత్మక విధానాలతోనే మిడ్ క్యాప్ విభాగంలో రాబడులు, భద్రతా పరంగా ఈ పథకం మెరుగైన స్థాయిలో ఉంది. ఈ విభాగంలో నంబర్ 1 కాకపోయినప్పటికీ... కేటగిరీతో పోలిస్తే సగటు కంటే ఎక్కువే రాబడులను ఇస్తూ ముందుండటం గమనించాలి. గడిచిన పదేళ్ల కాలంలో ఎస్బీఐ మ్యాగ్నం మిడ్క్యాప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్క్యాప్, ఆదిత్య బిర్లా సన్లైఫ్ మిడ్క్యాప్ పథకాల కంటే పనితీరులో మెరుగ్గా ఉంది. పోర్ట్ఫోలియో, స్ట్రాటజీ స్టాక్స్ ఎంపికలోనూ ఫండ్ మేనేజర్లు జాగ్రత్తలు పాటిస్తుంటారు. విడిగా ఒక్కో స్టాక్లో పెట్టుబడులు 3–4% మించనీయరు. ఎంత ఉత్తమ కంపెనీ అయినా సరే 4% దాటకపోవడం గమనించాలి. అంటే రిస్క్, రాబడుల కోణంలోనే ఈ నియమాన్ని అమలు చేస్తున్నట్టు లెక్క. పోర్ట్ఫోలియోలో మొత్తం స్టాక్స్ 50–60 వరకు ఉంటాయి. మార్కెట్లు ర్యాలీ సమయాల్లో రాబడులను అందించే విషయంలో మంచి స్థితిలో ఉండటం, అదే సమయంలో మార్కెట్ కరెక్షన్లలో నష్టాలు పరిమితంగా ఉండటం ఈ పథకంలో గమనించొచ్చు. మార్కెట్ల అస్థిరత సమయాల్లో 7–9% వరకు నగదు నిల్వలను కొనసాగిస్తుంది. ఎక్కువగా బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్లో పెట్టుబడులను కలిగి ఉంది. గత ఏడాది కాలంలో ఆటో యాన్సిలరీ, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ రంగాల్లో ఎక్స్పోజర్ను పెంచుకుంది. ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి దిశగా సాగిపోతే ఈ రంగాలు ఎక్కువగా లబ్ధి పొందుతాయి. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లోనూ గత కొన్నేళ్లుగా పెట్టుబడులను పెంచుకుంటూ వస్తోంది. ఇక ఏడాది కాలంలో ఐటీ స్టాక్స్లో ఎక్స్పోజర్ను తగ్గించుకుంది. దీంతో ఈ కాలంలో ఐటీ స్టాక్స్ ర్యాలీ చేయడంతో ఆ అవకాశం కోల్పోయింది. -
తూర్పున ఏటా ఒక రిఫైనరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడం బ్రాండ్తో వంట నూనెల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్) ఇండియా... ఏటా ఒక కొత్త రిఫైనరీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఒక్కో కేంద్రానికి రూ.250 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం కంపెనీకి కృష్ణపట్నం, కాకినాడ వద్ద ప్లాంట్లున్నాయి. వీటి సామర్థ్యం నెలకు 1,500 టన్నులు. కాకినాడ వద్ద మరో యూనిట్ను నెలకు 1,100 టన్నుల కెపాసిటీతో రూ.240 కోట్లతో నెలకొల్పుతోంది. 2019లో ఇది ఉత్పత్తి ఆరంభిస్తుందని జీఈఎఫ్ ఎండీ ప్రదీప్ చౌదరి బుధవారం వెల్లడించారు. నూతన ప్యాకింగ్లో నూనెలను విడుదల చేసిన సందర్భంగా సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. నూతన మార్కెట్లలో పాగా.. కంపెనీ ప్రస్తుతం సన్ఫ్లవర్ నూనె అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. కర్ణాటకలో 4 శాతం వాటాతో పోటీపడుతోంది. చత్తీస్గఢ్, తమిళనాడులోనూ పాగా వేయాలన్నది ఆలోచన అని ప్రదీప్ చౌదరి తెలిపారు. ‘తమిళనాడుతో మొదలుపెట్టి తూర్పు భారత్లో విస్తరిస్తాం. మూడేళ్లలో తమిళనాడు, ఒరిస్సాలో రిఫైనరీలు ప్రారంభిస్తాం. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, బిహార్లో అడుగుపెడతాం. ప్రస్తుతమున్న ప్లాంట్ల వినియోగం 100 శాతానికి చేరింది. విక్రయాలు అధికం కావడంతో ఇతర రిఫైనరీల నుంచి నూనెలు కొనుగోలు చేస్తున్నాం. 2017–18లో రూ.4,000 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ఈ ఏడాది రూ.5,000 కోట్లు ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు. ఫ్రీడం బ్రాండ్లో సన్ఫ్లవర్, రైస్బ్రాన్, ఆవ, వేరుశనగ, నువ్వుల నూనెను కంపెనీ మార్కెట్ చేస్తోంది. కంపెనీ తాజాగా పెట్ బాటిళ్లలో వీటిని విడుదల చేసింది. సినీ నటి రెజీనా చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించింది. పౌచ్తో పోలిస్తే పెట్ బాటిల్ ధర రూ.2 అధికం. భారత్లో మాత్రమే కంపెనీలు పౌచ్లలో నూనెలను విక్రయిస్తున్నాయని జీఈఎఫ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి తెలిపారు. -
డెట్ ఫండా? ఈక్విటీ ఫండా? దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి?
నా వయస్సు 52 సంవత్సరాలు. నా ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) ఖాతా త్వరలో మెచ్యూర్ కానున్నది. రూ. 20 లక్షల వరకూ నగదు వస్తుంది. ఇప్పట్లో నాకు ఈ డబ్బులు అవసరం లేదు. పీపీఎఫ్ ఖాతా గడవును పొడిగించమంటారా ? లేక ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సలహా ఇవ్వండి. – ఆనందరావు, విశాఖపట్టణం మీరు ఈ పీపీఎఫ్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పీపీఎఫ్లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు మరింత అధికంగా రాబడులు వచ్చేవి. భవిష్యత్తులో పీపీఎఫ్ వడ్డీరేట్లు మరింతగా తగ్గుతాయి. అందుకని పీపీఎఫ్ ఖాతాను పొడిగించకపోవడమే మంచిది. మీకు ఐదు, అంతకు మించిన సంవత్సరాలకు ఈ డబ్బులు అవసరం లేకపోతే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి. అయితే స్వల్పకాలంలో మాత్రం మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానాన్ని అనుసరించండి. ఒకటి లేదా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్ను ఎంచుకోండి. మీ పీపీఎఫ్ మొత్తాన్ని మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని, ఈ మొత్తాలను ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా ? ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా ? దేనిని ఎంచుకోవాలి? – ప్రశాంతి, హైదరాబాద్ మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు? మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అనే అంశాలను ఆధారంగా ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి. డెట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్... ఇవి రెండూ వేర్వేరు ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం ఉద్దేశించినవి. సాధారణంగా స్వల్పకాలిక అవసరాల కోసం డెట్ ఫండ్స్ను, దీర్ఘకాలిక అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకుంటారు. ఉదాహరణకు ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, డెట్ ఫండ్స్ను ఎంచుకోవాలి. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లలను పెద్ద చదువులు చదివించడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, నిలకడైన రాబడులు వస్తాయి. కానీ వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. వీటిల్లో నష్టభయం తక్కువగా ఉంటుంది. రాబడులు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి స్వల్పకాలిక పెట్టుబడి అవసరాల కోసం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మరో వైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రాబడులు అధికంగా వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి స్వల్పకాలంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీ ఫండ్స్లో నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈక్విటీ మార్కెట్లో ఎదురయ్యే ఒడిదుడుకులను సిప్ల ద్వారా అధిగమించవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొనడమే కాకుండా, దీర్ఘకాలంలో మంచి రాబడులు కూడా పొందవచ్చు. మీరు మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా ఒకటి లేదా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్ను ఎంచుకోండి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ తమ కార్పస్లో 65 శాతాన్ని ఈక్విటీలోనూ, మిగిలిన దానిని డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో సిప్ విధానంలో రెండు, మూడేళ్లు ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయమై మీకు కొంత అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో రెండు, లేదా మూడు మంచి ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకొని, వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. మార్కెట్ బాగా పెరిగినా, లేదా బాగా పతనమైనా సిప్లను ఆపేయక, కొనసాగించండి. మీ జీతం పెరిగినప్పుడల్లా, సిప్ మొత్తాన్ని పెంచడం మరువకండి. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సురక్షితమేనా ? వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? – రవి, నెల్లూరు స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్పై తీవ్రంగానే ఉంటుంది. అందుకని స్మాల్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సురక్షితమైనవేనని చెప్పలేము. మార్కెట్ బాగా ఉన్నప్పుడు ఇవి మంచి రాబడులను ఇస్తాయి. మార్కెట్ పతనమైనప్పుడు భారీగా నష్టపోతాయి. ఈ స్మాల్క్యాప్ ఫండ్స్లో రిస్క్ అధికంగా ఉంటుంది. అధిక రిస్క్ ఉన్నట్లే, అధిక రాబడులూ వచ్చే అవకాశాలుంటాయి. మీరు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నా, రిస్క్ భరించడానికి సిద్ధంగా లేకున్నా ఈ ఫండ్స్కు దూరంగా ఉండటమే మంచిది. మీ వయస్సు 30 లోపు ఉండి, రిస్క్ భరించగలిగే సామర్థ్యం ఉందనుకుంటే, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఒక ఇన్వెస్టర్ తాను ఇన్వెస్ట్ చేసే మొత్తంలో 20–30 శాతం మాత్రమే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కు కేటాయించాలి. అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మిడ్క్యాప్లో మంచి ట్రాక్ రికార్డు
మిడ్ క్యాప్ విభాగం రిస్క్ అధికంగా ఉన్నా, దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చే సామర్థ్యం కలది. ఈ విభాగంలో కాస్తంత భద్రత, అదే సమ యంలో స్థిరమైన రాబడులను అందించే పథకాల్లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ కూడా ఒకటి. కనీసం ఐదేళ్లు, ఆపై కాల వ్యవధి కోసం, మెరుగైన రాబడులను ఆశించే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఈ పథకం ప్రారంభించి 25 ఏళ్లు అయింది. ఇప్పటికీ అప్పటి నుంచి చూసుకుంటే రాబడులు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. రాబడులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సగటున వార్షిక రాబడులు 20 శాతంగా ఉన్నాయి. ఎక్కువగా ఒకే స్టాక్, ఒకటే రంగంపై ఆధారపడకుండా, పెట్టుబడుల వికేంద్రీకరణ ద్వారా రిస్క్ను సాధ్యమైనంత వరకు తగ్గించడం ఈ పథకం పనితీరులో ఒకటిగా గమనించొచ్చు. ముఖ్యంగా రిస్క్ను తగ్గించేందుకు కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ను కూడా పోర్ట్ఫోలియోకు యాడ్ చేస్తుంటుంది. అదే సమయంలో, లార్జ్క్యాప్లో పెట్టుబడులను 15 శాతం మించనీయదు. మిడ్క్యాప్ విభాగంలో ఇన్వెస్ట్ చేసేవారికి ఓ మంచి ఎంపికగా, పనితీరు పరంగా మెరుగైన స్థానంలో ఉంది. నంబర్ 1 స్థానంలో లేకపోవచ్చు కానీ, మిడ్క్యాప్ విభాగం సగటు రాబడులకు మించిన పనితీరు ఈ పథకం సొంతం. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే ప్రామాణిక సూచీ నిఫ్టీ 500 కంటే ఈ పథకం పనితీరు ఎగువనే ఉంది. మూడేళ్ల కాలంలో బెంచ్ మార్క్ కంటే 2 శాతం, ఐదేళ్ల కాలంలో చూస్తే బెంచ్ మార్క్ కంటే 9 శాతం, పదేళ్ల కాలంలో 8 శాతం అధిక రాబడులను ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ అందించింది. గత పదేళ్ల కాలంలో ఈ పథకం పోటీ పథకాలైన ఎస్బీఐ మిడ్క్యాప్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్క్యాప్, ఆదిత్య బిర్లా సన్లైఫ్ మిడ్క్యాప్ కంటే పనితీరులో ముందుంది. పోర్ట్ఫోలియో విడిగా ఒక్కో స్టాక్లో పెట్టుబడులను 3–4 శాతం మించనీయకుండా ఫండ్ మేనేజర్లు జాగ్రత్త తీసుకుంటారు. పోర్ట్ఫోలియో 50–60 స్టాక్స్తో ఉండటాన్ని గమనించొచ్చు. మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం రాబడులు కూడా మెరుగ్గానే ఉండటం, అలాగే కరెక్షన్లో పతనాన్ని పరిమితం చేసే విధంగా పోర్ట్ఫోలియో విధానాన్ని కొనసాగిస్తోంది. మార్కెట్లలో ఆటుపోట్లు పెరిగితే 7–9 శాతం మేర నగదు, డెట్ విభాగంలో పెట్టుబడులను ఉంచేస్తుంది. ఎక్కువ పెట్టుబడులను బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్లో పెట్టడాన్ని గమనించొచ్చు. అయినప్పటికీ ఈ విభాగంలో నాణ్యమైన స్టాక్స్గా పేరొందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు, ఈక్విటాస్ హోల్డింగ్స్, సిటీ యూనియన్ బ్యాంకులనే ఎంచుకుంది. గడిచిన ఏడాది కాలంలో ఆటో యాన్సిలరీ, పారిశ్రామిక ఉత్పత్తుల రంగాలకు చెందిన కంపెనీల్లో ఎక్స్పోజర్ పెంచుకుంది. అలాగే, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లోనూ పెట్టబడులను పెంచుకుంది. కానీ, ఇదే సమయంలో ఐటీ స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకోవడం గమనార్హం. ఈ రంగంలో కొంత మందగమనమే దీనికి కారణం. -
హైదరాబాద్లో ఫ్రెంచ్ కంపెనీ పెట్టుబడులు
-
ఈక్విటీ హెచ్చుతగ్గులను ఎలా ఎదుర్కోవాలి?
నేను మరో పదేళ్లలో రిటైరవుతున్నాను. రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా ఉండటం కోసం ఇప్పటికే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేశాను. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ)ల్లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎన్సీడీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? – శ్రీనివాస్, విజయవాడ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్(ఎన్సీడీ)ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇవి స్థిరమైన ఆదాయాన్ని ఇస్తాయి. అయితే మీకు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ఉండవు. మీరు కొనుగోలు చేసిన ఎన్సీడీలను జారీ చేసిన కంపెనీ బాగా ఉన్నంత కాలం మీ సొమ్ముకు ఎలాంటి ఢోకా ఉండదు. మీరు ఒకటి లేదా రెండు కంపెనీల్లో పెద్ద మొత్తాల్లోనే ఎన్సీడీల్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అవి మెచ్యూరయ్యే సమయానికి ఆ కంపెనీల ఆర్థిక స్థితిగతులు బాగా లేకపోతే, మీకు ఇబ్బందులు తప్పవు. ఎన్సీడీలకు బదులుగా మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. పిల్లల పై చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎన్సీడీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే ఎన్సీడీల్లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. మొత్తం మీద రిటైర్మెంట్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్లో కనీసం మూడో వంతు ఈక్విటీలో ఉండాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చని మీరు తరచూ చెబుతుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువ కదా ! మరి ఈ ఒడిదుడుకుల ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఉండదా ? వాటిని ఎలా అధిగమించాలి. – మణిమాల, హైదరాబాద్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చనేది నిజం. అలాగే స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయన్న మాట కూడా నిజమే. ఈక్విటీ మార్కెట్తో సంబంధం ఉన్న ఏ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అయినా, చివరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై కూడా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు 2016లో సెన్సెక్స్ 2 శాతమే రాబడులనిచ్చింది. గత ఏడాది సెన్సెక్స్ రాబడి 28 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ రాబడి 4 శాతం వరకూ ఉంటుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్పై ఒడిదుడుకుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ ఒడిదుడుకుల సమస్యను రెండు రకాలుగా ఎదుర్కోవచ్చు. మొదటిది ఈక్విటీల్లో ఎప్పుడూ దీర్ఘకాలం దృష్ట్యానే ఇన్వెస్ట్ చేయాలి. స్వల్ప కాలిక రాబడుల కోసం ఎప్పుడూ ఈక్విటీలను ఎంచుకోకూడదు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే, స్వల్పకాలిక ఒడిదుడుకులను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. కనీసం ఐదేళ్లకు పైగా ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఈక్విటీని ఎంచుకోవాలి. ఇక రెండోది ఈక్విటీల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మార్కెట్ పెరిగినప్పుడు మీకు తక్కువ యూనిట్లు వచ్చినా, మార్కెట్ పతనమైనప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. నా మిత్రుల్లో ఇద్దరు, ముగ్గురు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉన్నారు. మొహమాటం కొద్దీ రెండు, మూడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవలసి వచ్చింది. ఇది కాకుండా మా ఆఫీస్వాళ్ల హెల్త్ పాలసీ కూడా ఉంది. సింగిల్ క్లెయిమ్ కోసం వీటన్నింటిని ఉపయోగించుకోవచ్చా? – వంశీధర్, విశాఖపట్టణం ఆర్థిక సంబంధిత అంశాల్లో ఎప్పుడూ మొహమాటానికి తావు ఇవ్వవద్దు. మొహమాటానికి పోతే అవసరం లేని పాలసీలు తీసుకోవలసి వస్తుంది. అనవసరంగా పాలసీ ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుంది. సింగిల్ క్లెయిమ్ కోసం రెండు పాలసీలను ఉపయోగించుకోవచ్చు. ఒక పాలసీ కవరేజ్ పూర్తయితేనే రెండో పాలసీని క్లెయిమ్ చేసుకునే అవకాశాలున్నాయి. సింగిల్ క్లెయిమ్ కోసం రెండు పాలసీలు ఉపయోగించుకోవాలని అనుకున్నారనుకోండి. ఒక్క పాలసీని మాత్రమే నగదు రహిత(క్యాష్లెస్) విధానంలో ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, మోకాలి చిప్ప రీప్లేస్మెంట్ కోసం మీకు రూ.2 లక్షలు అవసరమయ్యాయనుకుందాం. మీ ఆఫీస్ పాలసీ కవరేజ్ రూ. లక్షకు, మీరు తీసుకున్న ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 1 లక్ష ఉందనుకుందాం. మీరు ఈ రెండు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను వినియోగించుకోవచ్చు. మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, హాస్పిటల్ సిబ్బంది ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి క్యాష్లెస్ అప్రూవల్ కోసం మీ డాక్యుమెంట్లను పంపిస్తుంది. సదరు సంస్థ ఆమోదం తెలపగానే, మిగిలిన రూ. లక్ష చెల్లించమని మిమ్మల్ని ఆ హాస్పిటల్ అడుగుతుంది. మీరు ఆ మొత్తాన్నిచెల్లించి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యేటప్పుడు.. మొదటి బీమా సంస్థ రూ.లక్ష చెల్లించనట్లుగా సెటిల్మెంట్ లెటర్ను హాస్పిటల్కు పంపిస్తుంది. మీరు ఈ సెటిల్మెంట్ లెటర్ను హాస్పిటల్ నుంచి తీసుకొని మీరు చెల్లించిన రూ. లక్ష రికవరీ కోసం వేరే బీమా సంస్థకు పంపించాలి. ఈ సెటిల్మెంట్ లెటర్లో పాలసీ వివరాలు. మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎంత ఖర్చయింది, ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. . ఇలా అన్ని వివరాలు ఉంటాయి. మీరు చెల్లించిన రూ. లక్ష మొత్తాన్ని రెండో బీమా సంస్థ నుంచి రీయింబర్స్ పొందడానికి సాధారణంగా ఈ సెటిల్మెంట్ లెటర్ సరిపోతుంది. మీరు ఒకే సంస్థ నుంచి రెండు, మూడు పాలసీలు తీసుకున్నట్లయితే, క్యాష్లెస్ సౌకర్యం పొందడం చాలా సులభమవుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రిటైర్మెంట్కు ఎంత అవసరం?
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పదవీ విరమణ దశకు చేరుకునేవారే. ఆ తర్వాత జీవితం గురించి ప్లాన్ చేసుకునే వారు కొద్ది మందే కనిపిస్తారు. ఇక విశ్రాంత జీవిత అవసరాల పట్ల శద్ధ లేకపోవడం, ప్రస్తుత అవసరాలే ప్రాధాన్యంగా భావించే వారు చాలా మంది ఉన్నారు. కొందరిలో ఆసక్తి ఉన్నా, ఎంత మొత్తం కావాలన్న దానిపై సంశయం ఉండి ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత సాఫీ జీవనం కోసం జీవితంలో వివిధ దశల్లో ఏ మేరకు ఆదా చేయాలో నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేసే కథనం ఇది. రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి, జీవితంలో ఏ వయసులో ఎంత పొదుపు చేయాలి అన్నది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగానే ఉంటుంది. పలు రకాల వ్యయాలు, తమపై ఆధారపడిన వారి అవసరాలు, లక్ష్యాలు, ఇతర అవసరాలను ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తుల ఆర్థిక క్రమశిక్షణ అన్నది కూడా వేర్వేరుగానే ఉంటుందని తెలిసిందే. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి తన వేతనంలో రిటైర్మెంట్ జీవితం కోసం 5 శాతం కేటాయిస్తుంటే, ఆ తర్వాత పెరుగుతున్న వేతనం స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు పెంచాల్సిన అవసరం లేదని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ సెడగోపన్ సూచించారు. ముందుగానే సేవింగ్స్ ప్రారంభించినందున కాంపౌండింగ్ ప్రయోజనంతో మంచి నిధి సమకూరుతుందని వివరించారు. అదే తొలినాళ్లలో రిటైర్మెంట్ నిధి గురించి పట్టించుకోకుండా చాలా ఆలస్యంగా పొదుపు ప్రారంభిస్తే చాలా పెద్ద మొత్తంలో పొదుపు చేయాల్సి ఉంటుందన్నారు. చిన్న వయసులో ఉన్న వారి జీవన శైలి నేడు వినియోగమయంగా మారిపోయింది. దీంతో సేవింగ్స్ పట్ల వారిలో శ్రద్ధ తక్కువే. ఖరీదైన గ్యాడ్జెట్లు, రెస్టారెంట్ విందులు, ప్రతీ దానికీ రుణాలు ఇలా ఉంటోంది వారి తీరు. ఇక ఇల్లు కొనుగోలు, లేదా కారు కొనుగోలు లేదా పెళ్లిని వైభవంగా జరుపుకోవాలన్న ఆకాంక్షల కోసంఉద్యోగ తొలి దశలో ఎక్కువ ఖర్చు చేసే వారున్నారు. దీంతో రిటైర్మెంట్ ప్రణాళిక వారి ఎజెండాలో ఉండడం లేదు. అందుకే ఎంతన్న? సందేహాన్ని పక్కన పెట్టేసి వెంటనే వేతనంలో ఎంతో కొంత మొత్తాన్ని రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం ప్రారంభించాలని సురేష్ సెడగోపన్ సూచన. 25 ఏళ్ల వయసులో కనీసం 5 శాతం మేర రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం మొదలు పెట్టాలన్నది ఓ సూత్రం. అయితే, ఈ 5 శాతాన్ని పొదుపు చేయడం కంటే ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమైన అంశంగా సెడగోపన్ పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా చిన్న వయసులోనే మొదలు పెటాలి. కాంపౌండింగ్ పవర్తో రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంగా మారుతుందన్నది వాస్తవం. మధ్య వయసులో: ఈ వయసులో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. దీంతో బడ్జెట్పై ఒత్తిళ్లు పెరిగిపోతాయి. 35–45ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు మంచి జీవన శైలిని కొనసాగించాలన్న ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ తరహా ఆలోచనలు, అవసరాల ప్రాధాన్యతలకు ప్రాముఖ్యం ఇవ్వడంతో, రిటైర్మెంట్కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంటుంది. ఆదాయంలో 20 శాతం పొదుపుతో ప్రారంభించి, వారి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాన్ని 40–50 శాతానికి క్రమంగా పెంచుకోవడం ఉత్తమం. వ్యయాలకు తగిన ప్రణాళికలు... 35ఏళ్ల వయసులో ఉన్నవారు తమ రిటైర్మెంట్కు కనీసం 10 శాతం కేటాయించుకోవాలని సెడగోపన్ సూచించారు. 25 ఏళ్ల వయసులో 5 శాతంతో మొదలు పెట్టి 35 ఏళ్ల నాటికి 10 శాతానికి పెంచుకుంటే మంచిదని, ఈ పొదుపు శాతాన్ని కనీసం 50 ఏళ్ల వరకు అయిన కొనసాగించడం ద్వారా మంచి నిధిని సమకూర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈపీఎఫ్ చందాలను ఇందులోకి పరిగణనలోకి తీసుకోరాదని, అవి కాకుండానే ఈ మాత్రం రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవాలని సూచించారు. నిజానికి మధ్య వయసు నాటికి వేతనంలో గణనీయంగా పెరుగుదల ఉన్నప్పటికీ, ఆ వయసులో గృహ రుణం, పిల్లల విద్యా వ్యయాలు, బీమా ప్రీమియం చెల్లింపుల వంటి ఇతర అవసరాలు కూడా ఉంటాయి. అందుకే పెరిగే వేతనం స్థాయిలో రిటైర్మెంట్ కోసం పెంచుకోకపోయినా కనీసం 10 శాతమైన పక్కన పెట్టుకోవాలి. వేతనంలో రిటైర్మెంట్కు కేటాయింపులు పోను మిగిలిన మొత్తంలో 30 శాతాన్ని లక్ష్యాల కోసం పొదుపు చేసి, మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకోవాలి. పలు లక్ష్యాల కోసం ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకుని లార్జ్క్యాప్ లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని నిపుణుల సూచన. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అవసరాలు, లక్ష్యాలు ఉంటాయి. ఆ మేరకు వారివారి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు ప్రణాళి కలు రూపొందించుకోవాలి. వేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. ఇక రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారికి వారి పిల్లల విద్యా సంబంధిత బాధ్యతలు కూడా ముగిసిపోవడం లేదా ముగింపులో ఉండడం చూడొచ్చు. దీంతో రిటైర్మెంట్ కోసం కొంచెం ఎక్కువ కేటాయించుకోవచ్చు. ఇది కూడా వ్యక్తులను బట్టి వేర్వేరుగానే ఉంటుంది. 30 చివర్లో లేదా 40కు సమీపంలో పెళ్లయిన వారికి పిల్లల విద్యా బాధ్యతలు ఇంకా ముగిసిపోయి ఉండవు. కొందరిలో రిటైర్మెంట్ తర్వాత బాధ్యతలు కొనసాగొచ్చు. అందుకే 50 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ కోసం పొదుపును 15 శాతానికి పెంచుకోవాలని సెడగోపన్ సూచించారు. రిటైర్మెంట్ అయ్యే వరకు దీన్నే కొనసాగించాలన్నారు. దీనివల్ల మంచి నిధి సమకూరుతుంది. -
19న రెండో దశ భారత్ –22 ఈటీఎఫ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నెల 19న రెండో దశ భారత్– 22 ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ను (ఈటీఎఫ్) ప్రారంభిస్తోంది. ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.8,400 కోట్లు సమీకరించనుంది. ఈ నెల19న యాంకర్ ఇన్వెస్టర్లు, ఈ నెల 20న సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లు సబ్స్క్రైబ్ చేయవచ్చని, ఈ నెల 22 వరకూ ఈ ఈటీఎఫ్ ఫాలో ఆన్ ఆఫర్ కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో 2.5 శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొంది. ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా వచ్చే నిధుల్లో రూ.2,400 కోట్ల వరకూ అట్టిపెట్టుకునే (గ్రీన్ షూ ఆప్షన్) వెసులుబాటును కూడా వినియోగించుకోవాలని భావిస్తోంది. మొత్తం మీద ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.8,400 కోట్ల నిధులను సమీకరించే అవకాశం ఉంది. గత నవంబర్లో తొలిసారి... గత ఏడాది నవంబర్లో ప్రభుత్వం భారత్ –22 ఈటీఎఫ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఈటీఎఫ్లో ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీతో పాటు ప్రభుత్వ బ్యాంక్లు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి మొత్తంగా 22 సంస్థల షేర్లున్నాయి. ఓఎన్జీసీ, ఐఓసీ, ఎస్బీఐ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, గెయిల్, బీఓబీ, ఇండియన్ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఈటీఎఫ్కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. రూ.32,000 కోట్ల వరకూ బిడ్లు వచ్చినా, ప్రభుత్వం రూ.14,500 కోట్ల బిడ్లనే స్వీకరించింది. -
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలే లక్ష్యం
పశ్చిమగోదావరి ,పెనుమంట్ర: తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అనుకూల పరిస్థితులను రైతులకు అందించే లక్ష్యంతోనే పరిశోధనలు సాగుతున్నాయని గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టరు వల్లభనేని దామోదరనాయుడు అన్నారు. మార్టేరులోని వ్యవసాయ వరి పరిశోధనాస్థానంలో మూడు రోజుల పాటు జరగనున్న వ్యవసాయ తెగుళ్ల విభాగం శాస్త్రవేత్తల సాంకేతిక అధ్యయన, విశ్లేషణ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తరం తెగుళ్లతో పాటు మారుతున్న వాతావరణ నేపథ్యంలో సోకుతున్న తెగుళ్లపైనా విస్తృత పరిశోధనలు సాగుతున్నాయని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో తిరుపతి, అనకాపల్లి, గుంటూరులలో శాస్త్రవేత్తల సాంకేతిక విశ్లేషణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రధానంగా విత్తు స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మొలక దశ నుంచి పంట చేతికందే దశ వరకు కూడా తెగుళ్లు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు. అందుకనే రైతు పొలాల్లోనే నాణ్యమైన విత్తనాల తయారీని తాము ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మార్టేరు పరిశోధనాస్థానం అధిపతి పాటూరి మునిరత్నం మాట్లాడుతూ యాంత్రీకరణ ద్వారా కూడా తెగుళ్లను అరికట్టే నూతన విధానాలను ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పరిశోధనా సంచాలకులు ఎన్వీ నాయుడు, తెగుళ్ల నివారణా విభాగం సంచాలకులు సీపీడీ రాజన్, బోధనా సంచాలకులు డాక్టరు జె. కృష్ణప్రసాద్, పాలకమండలి సభ్యులు డాక్టరు గుబ్బల వెంకట నాగే«శ్వరరావు, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త మురళీధర్, మానుకొండ శ్రీనివాసరావు మాట్లాడారు. 13 జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వరి, ఉద్యాన పంటల్లో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తొలిరోజు చర్చించారు. రూ.100 కోట్లతో నూతన భవన సముదాయం గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పలు మౌలిక సదుపాయల కల్పనకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోందని విశ్వవిద్యాలయం ఉపకులపతి వి. దామోదర నాయుడు తెలిపారు. మార్టేరులో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ గుంటూరులో రూ.100 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం చేపట్టామన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్న వివిధ స్థాయి శాస్త్రవేత్తల పోస్టుల నియామకం దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. మార్టేరులోని వ్యవసాయ పరిశోధనా స్థానంలోనూ రూ.కోటితో కొత్త భవన నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా రూ.45 లక్షలతో మంచినీటి ట్యాంకు, రూ.21 లక్షలతో నిడదవోలు–నరసాపురం ప్రధాన కాల్వపై కాలిబాట వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. -
అలాగైతే ఫ్లెక్సీ ఆర్డీ నయం!
సాక్షి, బిజినెస్ విభాగం : రిస్క్ లేకుండా... క్రమబద్ధంగా నెలవారీ పెట్టుబడులు పెట్టేవారికి బ్యాంకు రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అనువైనదేనని చెప్పాలి. ఇందులోనూ ఫ్లెక్సిబుల్ రికరింగ్ డిపాజిట్లంటూ ప్రత్యేకంగా ఉన్నాయి. సాధారణ ఆర్డీలయితే ప్రతి నెలా నిర్ణీత మొత్తం, నిర్ణీత కాల వ్యవధి వరకు ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పించేవి. నెలవారీ పెట్టుబడుల మొత్తం స్థిరంగా ఉంటుంది. అదే ఫ్లెక్సిబుల్ ఆర్డీలయితే, అదనంగా చేతికి ఆదాయం వచ్చినప్పుడల్లా ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తాయి. దీనివల్ల అధిక రాబడులు అందుకునేందుకు వీలుంటుంది. ఉన్నంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు... ఇది డెట్ సాధనం. పైగా వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. రిస్క్ తీసుకోలేని వారికి, ముఖ్యంగా తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారికి అనువుగా ఉంటుంది. దాదాపు అన్ని ప్రభుత్వ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులు ఫ్లెక్సిబుల్ ఆర్డీలను అందిస్తున్నాయి. వీటిలో ఎస్బీఐ, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకు ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ ఆర్డీ ఖాతా తెరిచే సమయంలో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో పేర్కొనాలి. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాల్సిన కనీస మొత్తం ఇది. బేసిక్ మొత్తం ఎంతన్నది బ్యాంకులను బట్టి మారిపోవచ్చు. ఇండియన్ బ్యాంకులో అయితే రూ.25 నుంచి మొదలవుతుంది. అదే కరూర్ వైశ్యా బ్యాంకు అయితే రూ.1,000గా ఉంది. ఎస్బీఐలో రూ.500 ఉంది. బేసిక్ ఎంతన్నది నిర్ణయించిన తర్వాత ఫెక్సీ స్టెప్ అప్ మొత్తాన్ని ఎంచుకోవాలి. సాధారణంగా ఇది బేసిక్ మొత్తానికి కొన్ని రెట్లుగా ఉంటుంది. ఉదాహరణకు బేసిక్ రూ.500గా ఉంటే అదనంగా రూ.500 చొప్పున కొన్ని రెట్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అధిక ఆదాయం వచ్చిప్పుడు స్టెప్ అప్ రూపంలో ఆర్డీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బేసిక్ మొత్తానికి కనీసం 5 నుంచి 10 రెట్ల వరకు స్టెప్అప్ వాయిదాగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. వార్షికంగా బోనస్ అందుకున్నప్పుడు, ఇతర ప్రోత్సాహకాలు, డివిడెండ్ ఆదాయం లభించినప్పుడు ఇలా ఆర్డీలోకి మళ్లించుకోవచ్చు. పదేళ్ల వరకు ఆర్డీని కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. రుణ సదుపాయం, చార్జీలు ఫ్లెక్సిబుల్ ఆర్డీలో చేసే డిపాజిట్లపై రుణ సదుపాయం పొందే వెసులుబాటు ఉంది. డిపాజిట్ మొత్తంలో 75 నుంచి 90 శాతం వరకు రుణాన్ని తీసుకోవచ్చు. ముందస్తుగా ఖాతాను క్లోజ్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. వాస్తవ వడ్డీ రేటుకు అర శాతం పెనాల్టీగా కోసేసి మిగిలిన మొత్తాన్ని వెనక్కిస్తారు. అలాగే, వరుసగా మూడు, నాలుగు నెలల పాటు బేసిక్ వాయిదాలు డిపాజిట్ చేయకపోతే బ్యాంకులు ఫ్లెక్సీ ఆర్డీని క్లోజ్ చేసి సేవింగ్స్ బ్యాంకు ఖాతా వడ్డీ రేట్లనే చెల్లిస్తున్నాయి. కనుక వాయిదా మిస్ కాకుండా చూసుకోవడం అవసరం. కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా బేసిక్ మొత్తం చెల్లించే సామర్థ్యానికి అనుగుణంగానే ఉండాలి. శ్లాబును బట్టే పన్ను వర్తింపు... 5–20 శాతం పన్ను పరిధిలో ఉండే, రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లకు ఫ్లెక్సీ ఆర్డీ చక్కగా సరిపోతుంది. ఫ్లెక్సీ ఆర్డీపై లభించే వడ్డీపై ఆదాయపన్ను ఏ శ్లాబులో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.10,000ను మించితే 10 శాతం టీడీఎస్ను బ్యాంకులు మినహాయించుకుంటాయి. ఒకవేళ పన్ను పరిధిలో ఆదాయం లేనివారు ఫామ్ 15జీ/15హెచ్ను బ్యాంకుకు ఇవ్వడం ద్వారా టీడీఎస్ను తప్పించుకోవచ్చు. వడ్డీ రేట్లు పెరిగే ఛాన్సుంది... ఫ్లెక్సిబుల్ రికరింగ్ డిపాజిట్కు సైతం సాధారణ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లే అమలవుతాయి. ఉదాహరణకు ఆర్డీని ఐదేళ్ల కోసం ఎంచుకున్నారనుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్పై ఐదేళ్ల కాల వ్యవధికి ఎంత వడ్డీ రేటు అయితే ఉందో అదే ఫెక్సీబుల్ ఆర్డీకి కూడా వర్తిస్తుంది. అయితే, స్టెప్ అప్ డిపాజిట్లపై (వీలును బట్టి బేసిక్ మొత్తానికి అదనంగా చేసే డిపాజిట్) వడ్డీ రేటు భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది ఎలా అంటే ఐదేళ్ల ఫ్లెక్సిబుల్ ఆర్డీ ప్రారంభించిన తర్వాత మొదటి నెలలో బేసిక్ రూ.2,000కు అదనంగా మరో రూ.2,000ను స్టెప్ అప్గా ఇన్వెస్ట్ చేశారనుకోండి. స్టెప్అప్ మొత్తం ఇన్వెస్ట్ చేసిన తేదీ నుంచి ఫ్లెక్సిబుల్ ఆర్డీ కాల వ్యవధి ఎంత కాలం మిగిలి ఉందనేది చూడాలి. ఈ ఉదాహరణలో మొదటి నెలలోనే ఇన్వెస్ట్ చేశారు కనుక 4 ఏళ్ల 11 నెలలకు ఎంత వడ్డీ రేటు ఉందో ఆ స్టెప్ అప్ మొత్తంపై అంతే లభిస్తుంది. అదే ఒక ఏడాది తర్వాత రూ.2,000ను స్టెప్ అప్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇంకా నాలుగేళ్లపాటు ఆ వాయిదాను ఆర్డీలో ఉంచుతారు గనుక నాలుగేళ్లకు అమల్లో ఉన్న వడ్డీ రేటు వర్తిస్తుంది. బేసిక్ మొత్తానికి ఆర్డీ ప్రారంభించినప్పుడు అమల్లో ఉన్న వడ్డీ రేటే పూర్తి కాల వ్యవధి వరకు కొనసాగుతుంది. ఫ్లెక్సిబుల్ ఆర్డీలో మరో ప్రయోజనం ఉంది. సాధారణ ఆర్డీలో 7 శాతం వడ్డీ రేటు ఉందంటే కాల వ్యవధి ముగిసే వరకు అందులో మార్పు ఉండదు. దీనికి బదులు ఫ్లెక్సిబుల్ ఆర్డీ ప్రారంభించి, మధ్యలో వీలైనంత అదనంగా ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. వడ్డీ రేట్లు పెరిగే ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి దిగొచ్చినందున ఇక ముందు పెరిగినప్పుడు ఆ మేరకు ప్రయోజనం పొందొచ్చు. -
బంగారం కూడా పెట్టుబడే!!
అమ్మాయిల చిన్న వయసు నుంచే వారి వివాహ అవసరాల కోసం తల్లిదండ్రులు అప్పుడప్పుడు బంగారు ఆభరణాలు కొంటుంటారు. పెళ్లి సమయంలో ఒకేసారి అంత సమకూర్చుకోలేమనుకునే వారు ఇలా చేస్తుంటారు. అయితే, బంగారం కోసమని ఆభరణాలు కొనడం అధిక వ్యయాలతో కూడినదే. ఎందుకంటే ఆమె పెద్దయ్యాక ఆ ఆభరణాలు నచ్చకపోతే వాటిని మార్చి కొత్తవి తీసుకోవడం వల్ల కొంత నష్టపోవాల్సి ఉంటుంది. 10 శాతం వరకూ తరుగు తీసేస్తారు. కొత్త ఆభరణాలు కొనేటపుడూ 10–15 శాతం వరకు తయారీ వృ«థా పేరిట తీసేస్తారు. కనుక అమ్మాయి భవిష్యత్తు అవసరాల కోసం బంగారం కావాలనుకుంటే అందుకు సార్వభౌమ బంగారం బాండ్లు అనువైనవి. కేంద్రం అందిస్తున్న బాండ్లు ఇవి. బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నుంచి కొనొచ్చు. పెట్టుబడి మొత్తానికి ఎన్ని గ్రాముల బంగారం వస్తుందో ఆ మేరకు బాండ్లను జారీ చేస్తారు. బంగారం మార్కెట్ రేటు ఆధారంగానే ఈ బాండ్ల విలువ పెరగడం, తరగడం జరుగుతుంది. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ముందుగా వైదొలగవచ్చు. అయితే, బాండ్లు జారీ అయిన 15 రోజుల తర్వాత అవి స్టాక్ ఎక్సే్చంజ్లలో లిస్ట్ అవుతాయి. దాంతో ఎప్పుడు అవసరమైనా వాటిని విక్రయించుకోవచ్చు. ఆభరణాలకు ఉన్నట్టు తయారీ చార్జీలు, తరుగు వంటి చిల్లులు ఇందులో ఉండవు. బాండ్ల రూపంలో ఉండడం వల్ల భద్రత సమస్య కూడా ఉండదు. ఇందులో ఉన్న మరో ఆకర్షణీయత ఏటా 2.5 శాతం వడ్డీని బాండ్ హోల్డర్లకు చెల్లించడం. బాండ్ కాల వ్యవధిలో ఒకవేళ బంగారం రేటు పెరిగితే ఆ మేరకు విలువ పెరుగుతుంది. ఏటా లభించే 2.5 శాతం వడ్డీ అదనం. ఈ లెక్కన చూస్తే భౌతిక బంగారం కంటే సౌర్వభౌమ బంగారం బాండ్లే లాభదాయకం. -
అనుకోని అవసరం.. ఇలా దాటేద్దాం!!
వినయ్ వయసు 42 ఏళ్లు. సొంతింటికి తరవాత ప్లాన్ చేద్దాంలే అని ఊరుకున్నాడు. కానీ ఓ రోజు చక్కని ఇల్లు చాలా తక్కువ ధరకు అమ్మకానికి వచ్చినట్టు స్నేహితుల ద్వారా తెలిసింది. కొనేందుకు డబ్బులు రెడీగా లేవు. అయితే, ఈక్విటీలు ఇతర సాధనాల్లో అతడు క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంటిని తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు అందులో ఏవి అమ్మేయాలా? అన్నది అతడి సందేహం. రఘురామ్ వేసవి ఎండల్ని తట్టుకోలేక రూ.38,000 ధరకు ఏసీ కొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ, దీనికి ముందు నుంచి ప్రణాళిక వేసుకోలేదు. అప్పటికప్పుడు వచ్చిన అవసరం. ఏం చేయాలి..? ఇక్కడ రెండు వ్యవహారాల్లోనూ గమనించాల్సిన విషయం ఒకటుంది. వేటికవి భిన్నమే. కానీ రెండూ రెగ్యులర్ బడ్జెట్కు మించిన అవసరాలు. చాలామందికి నెలవారీ బడ్జెట్పై ఒక అంచనా... ఒక ప్రణాళిక ఉంటాయి. మరి ఇలాంటి ఊహించని అవసరాలు వచ్చిపడితే..? నిజానికి వీటిని తీర్చుకోవటానికి పలు మార్గాలున్నాయి. నెలవారీ వాయిదాలు చెల్లించగలిగితే రుణం తీసుకుని సొంతం చేసుకోవచ్చు. వడ్డీ చెల్లించడం ఇష్టం లేకపోతే తమ పెట్టుబడి సాధనాల్లో కొన్నింటిని విక్రయించొచ్చు. ఒకవేళ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలన్నదే నిర్ణయమైతే స్వల్పకాలిక అవసరాల కోసం చేస్తున్న వాటిని పరిశీలించాలనేది నిపుణుల మాట. ఓ లక్ష్యం కోసం, దీర్ఘకాలిక దృష్టితో చేస్తున్న పెట్టుబడులు మొదటి చాయిస్ కాకూడదని ఫిన్కార్ట్ వ్యవస్థాపకుడు తన్వీర్ ఆలమ్ సూచించారు. చాలకపోతే అప్పుడు మరింత ముందుకు బ్యాంకు ఖాతాల్లోని మిగులు బ్యాలెన్స్, అత్యవసర నిధితోనూ తీరనంత పెద్ద అవసరాలయితే అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాల్సి ఉంటుంది. అవే మీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, షేర్లు. వీటిని విక్రయించేసి అవసరాలు తీర్చుకోవడం సరైనదే. మీకు లార్జ్ పోర్ట్ఫోలియో ఉంటే అందులో అవసరమైనంత వెనక్కి తీసుకోవచ్చు. ఉదాహరణకు రూ.5,00,000 అవసరమైందనుకోండి. నిస్సం కోచంగా షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ విక్రయించడం ద్వారా అవసరాలు అధిగమించొచ్చు. అయితే ఫండ్స్ పెట్టుబడులను ఉపసంహరించుకునే ముందు అవి ఏడాదిలోపు పెట్టుబడులయితే వాటిపై ఎగ్జిట్లోడ్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే పన్ను పరమైన అంశాలు. ఏడాది దాటిన పెట్టుబడులు అయితే పన్ను భారం కాస్తంత తగ్గుతుంది. ఇది కూడా సందర్భాన్ని బట్టే ఉంటుంది. ఉదాహరణకు వినయ్ చౌకగా వస్తున్న ఇల్లు కొనాలనుకుంటున్నాడు. అతడి విషయానికొస్తే ఎగ్జిట్లోడ్, పన్ను వంటి అంశాలను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే అతడు కొంటున్నది చౌకగా. అలాగే, వినయ్ విషయంలో జీవిత బీమా పాలసీలు కూడా అక్కరకు వస్తాయి. ప్రాపర్టీపై బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీల నుంచి రుణం తీసుకోవచ్చు. జీవిత బీమా ఎండోమెంట్ పాలసీపై రుణం సులభంగానే లభిస్తుంది. పాలసీకి సరెండర్ వ్యాల్యూ అని ఉంటుంది. దీని ఆధారంగా ఎంత రుణం లభిస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ రుణాలపై సాధారణంగా 10% వడ్డీ ఉంటుంది. ఒకవేళ ఎల్ఐసీ నుంచే రుణం తీసుకుంటే వడ్డీ 9 శాతమే. పాలసీపై రుణం తీసుకునేట్టు అయితే దానిపై హక్కులను ఎల్ఐసీకి బదలాయిస్తున్నట్టు ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, పాలసీని రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాదని సూచిస్తున్నారు నిపుణులు. ఎండోమెంట్ పాలసీని సాధారణంగా ఏదో ఒక దీర్ఘకాలిక లక్ష్యం కోసం తీసుకుని ఉంటారు. మధ్యలో వచ్చే ఆకస్మిక అవసరాల కోసం పాలసీని రద్దు చేయడం ద్వారా వాటిని కోల్పోవాల్సి వస్తుంది. దీనికి బదులు పాలసీపై రుణం పొందడం మంచి ఆలోచన. ఇక హెచ్డీఎఫ్సీ ప్రాపర్టీ విలువలో 60 శాతాన్ని రుణంగా ఇస్తోంది. వడ్డీ రేటు 9.7 శాతం నుంచి 10.5 శాతం మధ్య ఉంది. ముందు ఏది ఎంచుకోవాలి...? అవసరం రాగానే ఎవరైనా ముందు చూడాల్సింది బ్యాంకు ఖాతా బ్యాలెన్స్వైపే. ఎందుకంటే బ్యాంకులు ఖాతాల్లోని బ్యాలెన్స్పై ఇచ్చే వడ్డీ రేటు ద్రవ్యోల్బణ తరుగు స్థాయిలోనే ఉంటుంది. ఒక్కోసారి అంతకంటే తక్కువే. కనుక ఏ మాత్రం రాబడి లేని బ్యాంకు ఖాతాల్లోని నిల్వలను తొలుత వినియోగించుకోవటం మంచిది. నెలవారీ బడ్జెట్ అవసరాల కోసం ఉద్దేశించినవి కాకుండా ఖాతాల్లోని మిగులు నిల్వలకే ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత చూడాల్సింది అత్యవసర నిధి వైపు. సాధారణంగా ఇది ఉద్యోగం కోల్పోతే తిరిగి మరో ఉద్యోగం సంపాదించుకునే వరకు కుటుంబ పోషణ కోసం ఉద్దేశించినది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న అవసరాల కోసం వినియోగించుకోవడం సరైదనే. పై ఉదాహరణలో రఘురామ్ ఏసీ కొనుగోలుకు అత్యవసర నిధి వైపు చూడొచ్చు. ప్రణాళిక పరిధిలో లేకుండా వచ్చే అవసరాలకు అత్యవసర నిధి తొలి ఆప్షన్గా చూడొచ్చని ‘లాడర్7.కామ్’ వ్యవస్థాపకుడు సురేష్ సెడగోపన్ చెప్పారు. అత్యవసర నిధి అన్నది సాధారణంగా ఓ వ్యక్తి మూడు నుంచి ఆరు నెలల కుటుంబ అవసరాలను తీర్చేంత ఉండాలి. అయితే, ఉద్యోగం కోల్పోయే రిస్క్ ఎక్కువగా ఉండేవారు (ఉద్యోగ భద్రత లేమి), ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండేవారు కనీసం తొమ్మిది నెలల నుంచి ఏడాది పాటు అవసరాలను తీర్చేంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఈ నిధిని ఆకస్మికంగా ఎదురయ్యే అవసరాలకు వినియోగించుకోవచ్చు. దీనివల్ల అప్పులు చేసి వడ్డీలు కట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అత్యవసర నిధిని ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునేందుకు వీలుగా లిక్విడ్ లేదా షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రాబడులు కూడా అందుకోవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసే ముందు ఎగ్జిట్ చార్జీలు, పన్ను పరమైన నిబంధనలు, పథకం పనితీరును చూడటం మర్చిపోవద్దు. -
ఎంబైబ్లో వాటా కొన్న రిలయన్స్
న్యూఢిల్లీ: ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సేవల సంస్థ ఇండియావిడ్యువల్ లెర్నింగ్ (ఎంబైబ్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 73 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. వచ్చే మూడేళ్లలో సుమారు 180 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,175 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు గురువారం ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. దీని ప్రకారం ఇండియావిడ్యువల్ లెర్నింగ్లో 34.33 లక్షల షేర్లను కొనుగోలు చేస్తామని, ఇది ఎంబైబ్లో సుమారు 73 శాతం వాటాకు సరిసమానమని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. రెండు నెలల్లో ఈ ఒప్పందం పూర్తి కాగలదని అంచనా. టెక్నాలజీ సహాయంతో దేశీయంగా విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డీల్ తోడ్పడగలదని ఆశిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలియజేశారు. భారత్లో 19 లక్షల పాఠశాలలు, 58,000 విశ్వవిద్యాలయాల్లో టెక్నాలజీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 2012 ఆగస్టులో ప్రారంభమైన ఎంబైబ్ ప్రస్తుతం 60 విద్యా సంస్థలకు సేవలందిస్తోంది. రిలయన్స్ నుంచి వచ్చే పెట్టుబడులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించుకోనుంది. రూ.3,250 కోట్ల సమీకరణ: జియో జపాన్ బ్యాంకుల నుంచి దాదాపు 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,250 కోట్లు) సమీకరించేందుకు రిలయన్స్ జియో కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎంయూఎఫ్జీ (గతంలో ది బ్యాంక్ ఆఫ్ టోక్యో–మిత్సుబిషి యూఎఫ్జే), మిజుహో బ్యాంక్, సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్లతో జియో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పన్ను ఆదా చేసే పథకం
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. గతేడాది పన్ను ఆదా కోసం హడావుడిగా ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేసిన వారు... ఈ సారి అలా చేయకుండా తమకు అనుకూలమైన పన్ను ఆదా పథకాలపై ప్రారంభంలోనే దృష్టి సారించడం మంచిది. ముఖ్యంగా ఆదాయపన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అర్హత కలిగిన సాధనాల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకం (ఈఎల్ఎస్ఎస్) కూడా ఒకటి. ఈ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలు ఇన్వెస్టర్ల ఎంపికను కష్టతరం చేస్తాయి. కనుక పనితీరు ఆధారంగా పరిశీలించతగిన పథకాల్లో ఎల్ అండ్ టీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఒకటి. ఒకవైపు పన్ను ఆదా, మరోవైపు చక్కని రాబడులకు ఇందులో అవకాశం ఉంటుందని భావించొచ్చు. రాబడులెలా ఉన్నాయంటే... గడిచిన ఏడాది, మూడేళ్ల కాలంలో చూసుకుంటే ఈఎల్ఎస్ఎస్ విభాగంలో ఎల్ అండ్ టీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఒకానొక మెరుగైన పథకంగా ఉంది. అయితే, 2014 నాటి ర్యాలీలో ఈ పథకం పనితీరు మిగిలిన పథకాలతో వెనుకబడినా, బెంచ్ మార్క్ కంటే ఎక్కువే రాబడులు ఇచ్చింది. ఇక గడిచిన రెండు సంవత్సరాల్లో ఈఎల్ఎస్ఎస్ విభాగంలో దీని పనితీరు అత్యుత్తమంగా ఉంది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. నెలవారీగా సిప్ లేదా ఏక మొత్తంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గడిచిన ఏడాదిలో 17.68 శాతం, మూడేళ్లలో 12.75 శాతం, ఐదేళ్లలో 19.56 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. పదేళ్ల కాలంలో రాబడులు వార్షికంగా 14.6 శాతం చొప్పున ఉన్నాయి. బెంచ్మార్క్ బీఎస్ఈ 200 రాబడులతో పోలిస్తే 5–6 శాతం అధికంగానే లాభాల్ని ఇస్తోంది. ఏడాది, మూడేళ్లలో యాక్సిస్ లాంగ్టర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ పథకాల కంటే మెరుగైన రాబడులనే అందించింది. 2008, 2011 మార్కెట్ పతనాల సమయంలో మిగిలిన ఈఎల్ఎస్ఎస్ పథకాల కంటే, బెంచ్ మార్క్ కంటే ఈ పథకం పెట్టుబడులు విలువ తక్కువగా క్షీణించడం గమనార్హం. గడిచిన ఐదేళ్ల కాలంలో బెంచ్ మార్క్తో పోలిస్తే 83 శాతం సమయాల్లో ఈ పథకమే రాణించింది. పెట్టుబడుల్లో వైవిధ్యం ఈ పథకం పెట్టుబడుల్లో చక్కని వైవిధ్యం ఉండడం ఇన్వెస్టర్ల కోణంలో సానుకూలం. పోర్ట్ఫోలియోలో 71 శాతం స్టాక్స్ ఉంటే, ఇవి 26 రంగాలకు చెందినవి కావడం పెట్టుబడుల వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఇక రిస్క్ ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకోవడం గమనించాల్సిన అంశం. దీనివల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ఈ రంగాలకు ప్రాధాన్యం బ్యాంకింగ్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. 2014లో బ్యాంకింగ్ రంగానికి 25 శాతం కేటాయింపులు చేయగా, ప్రస్తు్తతం అది 16.3 శాతానికి దిగొచ్చింది. గడిచిన ఏడాది కాలంలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో పెట్టుబడులను తగ్గించుకుంది. మైనింగ్, పెస్టిసైడ్ స్టాక్స్ నుంచి వైదొలిగింది. టెలికం, నాన్ ఫర్నెస్ మెటల్ స్టాక్స్ పోర్ట్ ఫోలియోలో వచ్చి చేరాయి. లార్జ్క్యాప్లో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎల్అండ్టీ ఉండటం స్థిరమైన రాబడులకు తోడ్పడుతోంది. ఇటీవలి కాలంలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్, జీఐసీ ఆఫ్ ఇండియా, సన్టీవీ నెట్వర్క్లో పెట్టుబడులు పెట్టింది. టాప్హోల్డింగ్స్ స్టాక్ పేరు కేటాయింపుల శాతం హెచ్డీఎఫ్సీ 4.15 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3.96 గ్రాఫైట్ ఇండియా 3.76 ఎల్అండ్టీ 3.06 ఐటీసీ 2.74 ఐసీఐసీఐ బ్యాంకు 2.70 యాక్సిస్ బ్యాంకు 2.69 ఫ్యూచర్ లైఫ్స్టయిల్ 2.53 టీసీఎస్ 2.51 కోటక్ బ్యాంకు 2.35 -
సమయం లేదు మిత్రమా... ఐదు రోజులే..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి నిండా నాలుగైదు రోజులే ఉంది. మార్చి 31తో ముగిసిపోతోంది. ఆదాయపన్ను జీవులు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు అవకాశం పొందాలంటే అర్హత కలిగిన సాధనాల్లో ఆ మేరకు ఇన్వెస్ట్ చేయాలి. బీమా, పీపీఎఫ్, ఎన్పీఎస్, ఈఎల్ఎస్ఎస్ ఇలా ఎన్నో సాధనాలున్నాయి. ఇప్పటికే మీరు చేసిన పెట్టుబడులు ఆ మేరకు ఉంటే ఫర్వాలేదు. లేదంటే పన్ను ఆదా కోసం బాగా ప్రాచుర్యంలో ఉన్న వాటిలో అనుకూలమైనవి ఎంచుకోవచ్చు. అందుకు పరిశీలించాల్సినవి ఇవే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈఎల్ఎస్ఎస్... ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) అన్నది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం. సెక్షన్ 80సీ కింద వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉంది. ఇవి మూడేళ్ల లాకిన్ పీరియడ్తో ఉంటాయి. అప్పటి వరకు విక్రయించేందుకు అవకాశం ఉండదు. వీటిలో గ్రోత్, డివిడెండ్ ఆప్షన్లలో నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. పూర్తిగా ఈక్విటీ మార్కెట్ ఆధారిత పథకాలు కనుక వీటిలో పెట్టుబడులపై రాబడులు ఎంతొస్తాయన్నది చెప్పడం కచ్చితంగా సాధ్యం కాదు. అయితే, గడిచిన ఐదేళ్లలో ఈఎల్ఎస్ఎస్ పథకాల సగటు రాబడులు వార్షికంగా 18.5 శాతం ఉన్నాయని గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. రిస్క్ భరించే ఇన్వెస్టర్లకు అధిక రాబడుల పరంగా ఇవి అనువైనవి. ఆర్థిక సలహాదారులు సైతం ఇతర పథకాల కంటే పన్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాలనే ఎక్కువగా సూచిస్తుంటారు. ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ లాకిన్ పీరియడ్ తక్కువగా ఉండటం ఆకర్షణీయ అంశం. ఇక ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో సిప్ మోడ్ ఎంచుకోవడం ద్వారా సగటున అదనపు రాబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)... ఈ పింఛను పథకంలో ఎవరైనా చేరొచ్చు. సెక్షన్ 80సీ కింద వార్షికంగా రూ.1.50 లక్షలకు పన్ను మినహాయింపునకు ఇందులో ప్రయోజం పొందొచ్చు. అలాగే, మరో రూ.50,000 వరకు ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీసీడీ కింద కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. దీంతో మొత్తం రూ.2 లక్షలపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కాకపోతే సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి దాటి చేసే పెట్టుబడులపైనే సెక్షన్ 80సీసీడీ కింద రూ.50,000కు ఎన్పీఎస్లో పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఉదాహరణకు సెక్షన్ 80సీ కింద మీరు ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎన్పీఎస్లో రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేసినట్టయితే, మరో రూ.50,000లను ఎన్పీఎస్లో పెట్టుబడి పెట్టి దానిపైనా పన్ను ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎన్పీఎస్ పథకంలో 60 ఏళ్లు కాల వ్యవధి. ఆ తర్వాత పథకం నుంచి వైదొలగొచ్చు. అప్పటి కార్పస్లో 60 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడుల ఉపసంహరణలో 40 శాతంపైనే పన్ను మినహాయింపు. మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 60 శాతాన్ని యాన్యుటీలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ఉండదు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో డెట్, ఈక్విటీతో కూడిన పెట్టుబడి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఎందులో చూసినా రాబడులు 9–12 శాతం మధ్య ఉన్నాయి. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్).. ప్రభుత్వ హామీతో కూడిన పథకం. పెట్టుబడులపై పన్ను ఆదా, రాబడులకూ పన్ను మినహాయింపు ఉంది. పన్ను రహిత అధిక రాబడులను అందించే డెట్ పథకం. స్థిరాదాయ పన్ను రహిత సాధనం. పీపీఎఫ్లో వార్షికంగా చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్తో పీపీఎఫ్ పథకాన్నీ కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టడం, ఎప్పటికప్పుడు మార్కెట్ రేట్లకు అనుగుణంగా త్రైమాసికంవారీగా వడ్డీ రేట్లను సమీక్షిస్తుండటం చిన్న ప్రతికూలత. అయితే, పీపీఎఫ్లో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణలపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉండటంతో పన్ను ఆదాతో కూడిన మెరుగైన రాబడులకు ఇది ఇప్పటికీ మెరుగైన సాధనమేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం ఇందులో 7.9% వడ్డీ రేటు అమల్లో ఉంది. సుకన్య సమృద్ధి యోజన.. ఒకరిద్దరు కుమార్తెలున్నవారు వారి వయసు గనక 10 ఏళ్లలోపు ఉంటే ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈక్విటీతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వ పథకమిది. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కాంపౌండింగ్ ప్రయోజనంతో కుమార్తె ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలో ఏటా కనీసం రూ.1,000, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏడాదిలో ఎన్నిసార్లయినా ఈ పరిమితికి లోబడి డిపాజిట్లు చేయొచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు చిన్నారుల పేరిటే ఖాతాలు తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచాక 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. గరిష్టంగా ఖాతా తెరిచాక 21 ఏళ్ల పాటు లేదా అమ్మాయికి 18 ఏళ్లు నిండి వివాహం అయ్యేంత వరకు ఖాతా మనుగడలో ఉంటుంది. 18 ఏళ్లు నిండినా లేక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినా ఆ అవసరాల కోసం అప్పటి ఖాతా విలువలో 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అర్హత అవుతుంది. ఈ పథకంలో ప్రస్తుతం 8.1 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. మిగిలిన పన్ను ఆదా పథకాలతో పోలిస్తే ఎక్కువే. ప్రతీ త్రైమాసికానికీ ఈ పథకంపై వడ్డీరేటును కేంద్రం సమీక్షిస్తుంటుంది. ఏటా రూ.1.5 లక్షల పెట్టుబడులకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. పెట్టుబడులపై వచ్చే వడ్డీకి, కాల వ్యవధి తీరాక చేతికందే మొత్తానికి కూడా పన్ను లేదు. పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు... బ్యాంకులో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే అన్ని రకాల డిపాజిట్లకు ఈ ప్రయోజనం లేదు. కేవలం పన్ను ఆదాతో కూడిన ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపైనే ఈ అవకాశం. వీటికి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆలోపు విత్డ్రా చేసుకునేందుకు వీలుండదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ డిపాజిట్లను అందిస్తున్నాయి. వడ్డీ రేటు 6.5–7 శాతం వరకు లభిస్తోంది. పోస్టాఫీసుల ద్వారా కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బీమా పథకాలు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రకాల జీవిత బీమా పథకాలకు చేసే ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు అమల్లో ఉంది. యులిప్లు, టర్మ్ ప్లాన్లు, సంప్రదాయ బీమా పథకాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. బీమా పథకాల్లో చేసే పెట్టుబడులపై, జీవించి ఉంటే అందుకునే రాబడులు, అలాగే మరణ పరిహారంపైనా పన్ను లేదు. -
విశ్రాంత జీవనానికి.. ఈ ఫండ్లు బెటర్..!
ఈ ఏడాది ఆదాయపు పన్ను గడువు ముగియటానికి ఇంకా 20 రోజులే మిగిలి ఉంది. అంటే మార్చి 31 రావటానికి నిండా మూడు వారాలు కూడా లేదు. పన్ను భారం ఎక్కువవుతోందనుకునే వారు చివర్లో మినహాయింపుల కోసం కొన్ని పెట్టుబడులు పెట్టడం మామూలే. ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా... వారు చివరి క్షణాల్లోనే ఏదో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సరే!! ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా... అది సెక్షన్ 80సీ పరిధిలోకి వచ్చేదైతేనే పన్ను మినహాయింపు లభిస్తుందనేది మనకు తెలియంది కాదు. బ్యాంకులు జారీ చేసే ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పీపీఎఫ్ డెట్ విభాగంలోనివి. ఈక్విటీ వైపు చూస్తే ముందు కనిపించేది ఈఎల్ఎస్ఎస్లే. మ్యూచువల్ ఫండ్స్ అందించే రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్స్లో పెట్టుబడులు సైతం òసెక్షన్ 80సీ కింద ప్రయోజనానికి అర్హత కలిగినవే. పన్ను ఆదాతో పాటు రిటైర్మెంట్ అవసరాల కోసం నిధి సమకూర్చుకునేందుకు ఇవి ఉపకరిస్తాయి. విశ్రాంత జీవనంలో ఇబ్బందులు పడకూడదని భావించే వారు ఏ వయసు వారైనా... ఈ పథకాల వైపు చూస్తే మంచిది. రిటైర్మెంట్ ఫండ్స్.. ఒక్కొక్కరికి ఒకటి ఈ ఫండ్స్ సాధారణంగా రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఉద్దేశించినవి. వీటిలో వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే అవి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులోకి వస్తాయి. అంతకు మించి పెట్టుబడి పెట్టినా మినహాయింపు లభించేది రూ.1.5 లక్షలకే అని గుర్తుంచుకోవాలి. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రియేషన్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ ఇన్కమ్ జనరేషన్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్ ఇవన్నీ రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు, పన్ను మినహాయింపునుకు అర్హత కలిగిన పథకాలే. ఇన్వెస్టర్ల వయసు, రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. యువ ఇన్వెస్టర్లయితే.. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రిచేషన్ పథకాలు కాస్తంత దూకుడుగా పెట్టుబడులు పెడుతుంటాయి. అంటే అధిక రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను ఇచ్చే తరహాలో పనిచేస్తాయి. సేకరించిన నిధుల్లో 85 శాతానికిపైగా ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రిటైర్మెంట్కు సుదీర్ఘ సమయం కలిగిన యువ ఇన్వెస్టర్లకు ఈ పథకాలు అనువుగా ఉంటాయి. రిటైర్మెంట్కు దగ్గరలో ఉంటే... ఇక హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ ఇన్కమ్ జనరేషన్ పథకాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. అంటే, పెట్టుబడుల విలువను కాపాడేందుకు తక్కువ రిస్క్ ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్క్ ఉండే ఈక్విటీల్లో కేవలం 20– 25 శాతాన్నే ఇన్వెస్ట్ చేస్తాయి. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారికి ఇవి అనువైనవి. రిస్క్ వద్దనుకునే మధ్య వయస్కులూ వీటిని ఎంచుకోవచ్చు. మధ్యస్థంగా రిస్క్ భరించగలిగితే... హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అయితే ఈక్విటీల్లో 65–70 శాతం ఇన్వెస్ట్ చేస్తాయి. ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్ పథకాలు ఈక్విటీలకు 40 శాతం కేటాయింపులు చేస్తుంటాయి. మిగిలిన నిధుల్ని బాండ్లలో పెడతాయి. మధ్యస్థంగా రిస్క్ భరించే వారు వీటిని పరిశీలించొచ్చు. ఫ్రాంక్లిన్, యూటీఐ.... సుదీర్ఘ చరిత్ర ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకాలు చక్కని పనితీరు చూపించాయి. గత పది సంవత్సరాల కాలంలో వార్షికంగా 8.7 నుంచి 9.4 శాతం వరకు రాబడులిచ్చాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ పథకాలకు సుదీర్ఘ చరిత్ర లేదు. ఈ మధ్యే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ప్రారంభం నుంచి చూస్తే చెప్పుకోతగ్గ రాబడులనే ఇచ్చాయి. మార్కెట్లు బుల్ ర్యాలీలో ఉండడంతో గడిచిన ఏడాది కాలంలో హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రియేషన్ 34 శాతం చొప్పున లాభపడ్డాయి. లాకిన్ పీరియడ్... మూడు లేదా ఐదేళ్లు! ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకాల (ఈఎల్ఎస్ఎస్) మాదిరే రిటైర్మెంట్ ఫండ్స్లోనూ మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఇది పథకాలను బట్టి మారిపోవచ్చు. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించిన రిటైర్మెంట్ ఫండ్స్కు లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ప్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్లో మూడు ఆర్థిక సంవత్సరాలు లాకిన్ పీరియడ్గా అమల్లో ఉంది. సెబీ ఇటీవల మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణలో మార్పులు చేయడంతో ఈ పథకాల్లోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రిటైర్మెంట్ ఫండ్స్ అన్నవి దీర్ఘకాలిక లక్ష్యానికి ఉద్దేశించినవి. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేరడానికి ఇవి దోహదపడతాయి. మధ్యలో ఉపసంహరిస్తే ఎగ్జిట్ లోడ్... మధ్యలో కీలకమైన అవసరాలు ఏర్పడితే ఈ ఫండ్స్ నుంచి పెట్టుబడుల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కానీ, ముందుగా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటాన్ని తగ్గించేందుకు కంపెనీలు ఎగ్జిట్ లోడ్ విధిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఫండ్స్ లాకిన్ పీరియడ్ ముగిసి, 60 ఏళ్లు రాకముందే పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే విలువలో ఒక శాతాన్ని ఎగ్జిట్ లోడ్గా వసూలు చేస్తున్నాయి. ఇక పన్ను అంశాలనూ చూడాలి. ఈక్వీటీ తరహా పథకాలను (అంటే మొత్తం నిధుల్లో 65 శాతం కంటే ఎక్కువ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి) ఏడాది తర్వాత విక్రయిస్తే వాటిపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పడుతుంది. అదే డెట్ పథకాల్లో అయితే మూడేళ్ల తర్వాత విక్రయిస్తే 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్లో లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంది కనుక డెట్ ఫండ్స్ను ఆ తర్వాత విక్రయిస్తే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి మిగిలిన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాలు ప్రధానంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి. అదే, రిటైర్మెంట్ ఫండ్స్ అయితే డెట్లో ఇన్వెస్ట్ చేసేవీ ఉంటాయి. రిటైర్మెంట్ ఫండ్స్ను ఎన్పీఎస్, ఇతర పథకాలతో కలసి పెట్టుబడులకు పరిశీలించొచ్చు. -
రిటైరయ్యాక కూడా పెట్టుబడి!
మనలో చాలా మంది రిటైర్మెంట్ గురించి వయసులో ఉన్నపుడు పెద్దగా ఆలోచించరు. అదంతా రిటైరయ్యాక చూసుకుందాంలే... అనుకుంటారు. కాకపోతే... రిటైర్మెంట్ గురించి రిటైరయ్యాక ఎలా ఆలోచిస్తామనే చిన్న లాజిక్ అప్పట్లో అర్థం కాదు. అది అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. అప్పుడు తీరిగ్గా విచారించినా చేసేదేమీ ఉండదు. గణాంకాలను బట్టి చూసినా... ప్రభుత్వరంగంలోని వారు కాకుండా ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారిలో రిటైర్మెంట్ గురించి ప్రణాళిక వేసుకునే వారు చాలా తక్కువ. తీరా రిటైర్మెంట్కు వచ్చిన తర్వాత... చేతిలో ఉన్న ఆ కాసింత డబ్బును నెలవారీ ఆదాయం కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న సందేహంలో పడిపోతారు. నిజానికి రిటైర్మెంట్ అనేది 35–40 ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత వచ్చే దశ. ఉద్యోగం చేస్తున్నంత కాలం నెలనెలా వేతనం బ్యాంకు ఖాతాలో పడిపోతూ అన్ని అవసరాలనూ తీర్చేస్తుంది. తీరా ఉద్యోగ కాలం ముగిశాక ఆదాయం ఒక్కసారిగా ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి!!. ఏదో తెలియని ఆందోళన ఎదురవుతుంది. అందుకే తగినంత నిధిని ముందు నుంచే ఏర్పాటు చేసుకోవాలి. ఇది రిటైర్మెంట్ తరువాతి జీవనానికి తగినంత ఆదాయాన్నిచ్చేదిలా ఉండాలి. దానికోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియజేసే కథనమే ఇది... సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : దాదాపు మనమంతా గమనించాల్సిందొకటుంది. అది... పొదుపు వేరు; ఇన్వెస్ట్మెంట్ వేరు. రిటైరయ్యాక ఆదాయం కావాలంటే ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇన్వెస్ట్ చేయకుండా పొదుపు చేసిన దాన్నుంచి ఖర్చు చేస్తూ వెళితే ఉన్నదంతా కరిగిపోతుంది. పెద్ద వయసులో ఈ పరిస్థితి ఊహించజాలం. చిన్న వయసులో ఉన్న వారైతే రిస్క్ భయం లేకుండా ఇన్వెస్ట్ చేయగలరు. రిస్క్ను భరించే సామర్థ్యం వారికి ఎక్కువ. అదే 30–40 ఏళ్ల వయసులో ఉన్న వారైతే కాస్తంత భద్రతతో కూడిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిటైరయ్యాక తమ దగ్గరున్న నిధి నుంచే ఆదాయం రాబట్టుకోవాలి కనుక వారు చేసే పెట్టుబడులు భిన్నంగా ఉండాలి. స్థిర ఆదాయాన్నిచ్చేలా ఉండాలి. ముఖ్యంగా రిటైర్మెంట్కు మూడేళ్ల ముందే కార్పస్ ఎంతుందన్నది సమీక్షించుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు చాలదనుకుంటే రిటైర్మెంట్ను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఇన్వెస్ట్ చేయడం ఎలా? రిటైరయ్యాక చాలా మందికి ఎదురయ్యే ప్రశ్నే ఇది. వేతన జీవులు తాము సర్వీసులో ఉన్నంత సేపూ కంపెనీకి సేవలందించి ఉంటారు. అందరికీ ఇన్వెస్ట్మెంట్పై అవగాహన ఉండదు. దీంతో ఇన్వెస్ట్మెంట్లో పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంటుంది. రిటైరయ్యాక సంప్రదాయ సాధనాల్లో చేసే ఇన్వెస్ట్మెంట్పై రాబడులు 7 శాతాన్ని మించవు. అధిక రాబడులు రావాలంటే రిస్క్ అధికంగా ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ దశలో అధిక రిస్క్ తీసుకోలేరు. అందుకే ఇది డెట్, ఈక్విటీల కలబోతగా ఉండాలి. అధిక శాతం డెట్లో ఇన్వెస్ట్ చేసి, కొంత మేర ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే... రాబడులు 7 శాతం కంటే ఎక్కువే వస్తాయి. అలాగే, రిటైర్మెంట్ నిధిని ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా ఆదాయం తీసుకునేలా ఉండకూడదు. ఏడాది అవసరాలకు సరిపడేలా రిడెంప్షన్ ఉండాలి. ప్రతి నెలా ఎంతో కొంత వెనక్కి తీసుకోవడం వల్ల కార్పస్ తగ్గిపోతుంది. తక్కువ రిస్క్, స్థిరమైన ఆదాయం, కార్పస్ వృద్ధి చెందేలా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను రూపొందించుకోవాలి. నెలవారీ బడ్జెట్ తప్పనిసరి... రిటైర్మెంట్ నిధిని పెట్టుబడులకు మళ్లించే ముందే నెలవారీ బడ్జెట్ను ఖరారు చేసుకోవాలి. రోజువారీ అవసరాల కోసం ప్రతినెలా ఎంత కావాలో తేల్చుకోవాలి. కిరాణా, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐలు, వినోదం, ఆహారం, వైద్యం ఇలా అన్ని అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని రెండు భాగాలు చేయాలి. అవసరమైనవి, అవసరం లేనివి. నిధి రెండు భాగాలు చేయాలి... మొత్తం రిటైర్మెంట్ నిధిని రెండు భాగాలు చేయాలి. ఒక భాగాన్ని స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. దీనిపై వచ్చే ఆదాయం మీ నెలవారీ అవసరాలను తీర్చే స్థాయిలో ఉండాలి. స్థిరాదాయాన్నిచ్చే పథకాలైన పెన్షన్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం దీనికి అనువైనవని చెప్పొచ్చు. రెండో భాగాన్ని రిస్క్ ఉన్నప్పటికీ అధిక రాబడులను ఇచ్చే ఫండ్స్, ఈక్విటీ వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడుల పోర్ట్ఫోలియో రిటైరయిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ 100 శాతం నిధుల్ని తీసుకెళ్లి ఈక్విటీలో పెట్టకూడదు. అధిక భాగం డెట్లోనే ఉంచాలి. ఈక్విటీలకు కేటాయించేది స్వల్పంగానే ఉండాలి. సగటున ఈక్విటీ ఫండ్స్లో 30 శాతం మించి పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. డబ్బు ఎంతున్నా దాని విలువను ద్రవ్యోల్బణం కొద్ది కొద్దిగా హరించేస్తుంది. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాలను ఎంపిక చేసుకోవాలి. అలాగని అధిక రాబడుల కోసం దీర్ఘకాలం పాటు లాకిన్లో ఉండే సాధనాలు రిటైర్ అయిన వారికి సూచనీయం కావు. ఎందుకంటే వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ డబ్బుల్ని వెనక్కి తీసుకునేలా (లిక్విడిటీ) ఉండాలి. అందుకే ఎందులో ఇన్వెస్ట్ చేసినా ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయవచ్చు... ఉదాహరణకు ఓ రిటైర్ అయిన వ్యక్తి దగ్గర రూ.50 లక్షలు ఉన్నాయనుకోండి. నెలవారీ బడ్జెట్ రూ.28,000–32,000. సదరు వ్యక్తి ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే... ముందు ఈ నిధి నుంచి కొంత మేర పక్కన పెట్టాలి. ♦ అత్యవసర నిధి = నెలకు రూ.32,000 చొప్పున ఆరు నెలల కోసం = రూ.1,92,000 ♦ ఏడాది అవసరాలకు అయ్యే వ్యయాలు = రూ.32,000 చొప్పున 12 నెలలకు = రూ.3,84,000 ♦ ఈ రెండూ కలిపి మొత్తం రూ.5,76,000. ఇప్పుడు అత్యవసర నిధి రూ.1,92,000ను ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయాలి. ఏడాది అవసరాల కోసం ఉద్దేశించిన రూ.3,84,000ను తీసుకెళ్లి అధిక వడ్డీరేటునిచ్చే బ్యాంకు ఖాతాలో ఉంచాలి. ప్రైవేటు రంగ బ్యాంకులు కొన్ని 6% వడ్డీని ఇస్తున్నాయి. ఈ రెండూ మినహాయించగా రిటైర్మెంట్ కార్పస్ రూ.44,24,000 ఉంటుంది. దీన్ని రెండు భాగాలు చేయాలి. ♦ 70 శాతం డెట్ విభాగంలో పెట్టుబడులకు = రూ.31,00,000 ♦ 30 శాతం ఈక్విటీలో పెట్టుబడుల కోసం = రూ.13,24,000 ♦ 70 శాతం నిధుల్ని (రూ.31,00,000) మ్యూచువల్ ఫండ్స్ అందించే మంత్లీ ఇన్కమ్ ప్లాన్లలో (ఎంఐపీ) ఇన్వెస్ట్ చేయాలి. వీటి రాబడులు వార్షికంగా 11 శాతం స్థాయిలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు 80 శాతం నిధుల్ని డెట్లోనూ, 15 శాతం నిధుల్ని ఈక్విటీలోనూ, 5 శాతం నిధుల్ని ఇతర విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. రూ.31,00,000పైన సగటున 11 శాతం రాబడి అంచనా వేసి చూస్తే నెలవారీగా వచ్చే ఆదాయం రూ.28,416 అవుతుంది. దీంతో నెలవారీ అవసరాలు తీరిపోతాయి. 30 శాతం నిధుల్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఐదేళ్ల కాలం కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఇవి వార్షికంగా సగటున 16 శాతం రాబడులను ఇవ్వగలవు. ఆ విధంగా చూస్తే ఇది అదనపు ఆదాయం తెచ్చిపెడుతుంది. ద్రవ్యోల్బణ ప్రభావం రిటైర్మెంట్ కార్పస్పై పడకుండా ఈ పోర్ట్ఫోలియో సాయపడుతుంది. ఐదారేళ్లకు పెట్టుబడులు రెట్టింపవుతాయి. -
కెనడాలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు
ముంబై: దేశీ కంపెనీలు కెనడాలో దాదాపు బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నాయి. తద్వారా 5 వేల ఉద్యోగాలు కల్పించనున్నాయి. భారత పర్యటనలో భాగంగా మంగళవారం దేశీ కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ అయిన అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఈ విషయాలు వెల్లడించారు. భారత కార్పొరేట్లు తమ దేశంలో దాదాపు 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపినట్లు ఆయన తెలియజేశారు. సహజవనరులు మొదలుకుని ఐటీ, ఫార్మా తదితర అంశాలన్నింటిలోనూ ఇరు దేశాల మధ్య పటిష్టమైన సంబంధాలు ఉన్నాయని కెనడా– ఇండియా బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ట్రూడూ తెలిపారు. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పారిఖ్, పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ చీఫ్ సైరస్ మిస్త్రీ తదితరులతో ఆయన భేటీ అయ్యారు. అటు ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్, పిరమాల్ గ్రూప్ చీఫ్ స్వాతి పిరమాల్ తదితర మహిళా కార్పొరేట్ దిగ్గజాలతో సుమారు గంటన్నర పాటు రౌండ్టేబుల్ సమావేశంలో ట్రూడూ పాల్గొన్నారు. -
పొదుపు కొంచెం– నిధి ఘనం
కొన్ని చుక్కల నీరు కలిస్తేనే ఒక బిందెడు అవుతాయి. కొన్ని బిందెలు కలిస్తేనే కోనేరు నీళ్లవుతాయి. కొన్ని కోనేర్లు కలిస్తే నదిని మరిపిస్తాయి. ఇదంతా ఎందుకంటే... పెద్ద నిధి సమకూరటానికి కావాల్సింది చిల్లర మొత్తాలే. చిన్నచిన్న పొదుపులే. ఎందుకంటే చాలామంది నెలవారీ సంపాదనలో మిగిలేది కొంచెమే కదా అని దాన్ని పొదుపు చేయటానికి వెనకాడతారు. అసలు వాటిని పెట్టుబడుల్లోకి మళ్లించటం గురించి ఆలోచించనే ఆలోచించరు. కానీ, ఆ కొద్ది మొత్తాలు కలిపితేనే పెద్ద నిధి అవుతుందన్న ఆలోచన ఎంత మందికి వస్తుంది? బడ్జెట్ చిన్నదే అయినా... క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే చక్కని కార్పస్ను సమకూర్చుకోవచ్చనేది నిపుణుల సూచన. జీవితంలో కీలక లక్ష్యాలను సాకారం చేసుకుని, విజయ తీరాలకు చేరుకోవాలంటే అందుకు డబ్బే ప్రధానంగా కావాలి. ఈ నేపథ్యంలో లక్ష్యాలు సాధించడానికి కావాల్సిన నిధిని సమకూర్చుకునేందుకు వీలైనంత పొదుపు చేయటం తప్పనిసరి. మిగిలేది కొంతే అయినా, బడ్జెట్ చిన్నదే అయినా పొదుపు, పెట్టుబడుల విషయంలో తీసుకోవాల్సిన, అనుసరించాల్సిన వ్యూహాలేంటనేవి తెలియజేసేదే ఈ కథనం... ఉన్నదాంతోనే తొలి అడుగు.. ‘‘లక్ష్యాలను ప్రాధాన్యం మేరకు నిర్ణయించుకుని, అనవసర ఖర్చులకు కళ్లెం వేసుకోవాలి. కొన్ని లక్ష్యాలు మరీ గాల్లో మేడలు కట్టేలా ఉండకూడదు. విచక్షణా రహిత ఖర్చులను తగ్గించుకోవాలి’’ అనేది ‘లాడర్ 7 ఫైనాన్షియల్ సర్వీసెస్’ వ్యవస్థాపకుడు సురేశ్ సెడగోపన్ సూచన. ఉదాహరణకు చిన్న వయసులోనే ఇంటిని కొనుగోలు చేస్తే ఇతర కీలక లక్ష్యాల కోసం మదుపు చేసేందుకు ఇన్వెస్టర్ల వద్ద మిగిలేదేమీ ఉండదు. కనుక కొన్నాళ్లు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకుని అద్దె ఇంట్లో ఉండడం తెలివైన నిర్ణయం అవుతుంది. పెట్టుబడులను చిన్న వయసులోనే మొదలు పెట్టడం అన్నది లక్ష్య సాధనకు తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది కూడా కీలకమే. ఉదాహరణకు మీ పిల్లల ఉన్నత విద్య కోసం ఓ పెద్ద నిధిని 15 ఏళ్లలో సాధించాలన్న లక్ష్యంతో ఉన్నారనుకోండి. ప్రస్తుతం రూ.14 లక్షలు ఉండే కోర్స్ను 15 ఏళ్ల తర్వాత చెప్పించాలనుకుంటే అప్పటికి విద్యా ద్రవ్యోల్బణాన్ని కూడా కలుపుకుంటే దాదాపు రూ.33.55 లక్షలు అవసరం అవుతుంది. మరి ఈ లెక్కన 15 ఏళ్ల తర్వాత మీ లక్ష్యానికి అవసరమైన నిధి సమకూర్చుకునేందుకు వార్షికంగా కనీసం 12 శాతం రాబడులను ఇచ్చే సాధనంలో ప్రతి నెలా రూ.7,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ప్రారంభంలో ఇంత మొత్తం పెట్టుబడులు కేటాయించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెట్టుబడికి కొద్ది మొత్తమే ఉండొచ్చు. అయినా ఫర్వాలేదు. రూ.7,500తోనే పెట్టుబడులు ప్రారంభించాలన్న కఠిన సూత్రమేమీ లేదు. మీ దగ్గర ఉన్నంత, సాధ్యమైనంత మేర పొదుపు చేస్తూ వెళ్లడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. వీలైనప్పుడు అదనపు పెట్టుబడులు ప్రారంభంలో కాకపోతే ఆ తర్వాత అయినా పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, ఆర్జన మెరుగైనప్పుడు ఒకేసారిగా లేదా క్రమానుగతంగా పెట్టుబడులను పెంచుకోవాలి. ఆదాయ వృద్ధి అనేది ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండకపోవచ్చు. ఏటేటా ఇందులో మార్పు ఉండొచ్చు. అయినప్పటికీ దానికి అనుగుణంగా పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లాలి. ఏ దశలోనూ లక్ష్యం కోసం చేస్తున్న పెట్టుబడుల పట్ల కట్టుబాటు విడవకూడదు. క్రమశిక్షణ ముఖ్యం. పెట్టుబడులను కొనసాగిస్తూ, వీలున్నప్పుడల్లా వాటిని పెంచుకుంటూ పోవడం క్లిష్టమైనదే అయినా దాన్ని అనుసరించేందుకే ప్రయత్నించాలి. నిర్ణీత లక్ష్యం సమీపించిన సమయానికి అవసరానికంటే తక్కువ నిధి సమకూరినా ఫర్వాలేదు. ఎందుకంటే కొద్ది మొత్తమే ఉంది కదా అనుకుని పెట్టుబడులు పెట్టకుండా ఉండడం, వాయిదా వేయడం కంటే ఉన్నంత ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లిన వారే మెరుగైన స్థితిలో ఉంటారు. ఉదాహరణకు 15 ఏళ్ల కాలానికి రూ.33.55 లక్షల కోసం ప్రతీ నెలా రూ.7,500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటే, ఓ ఐదేళ్లు జాప్యం చేశారనుకోండి. అప్పుడు మిగిలిన పదేళ్లలోనే ఆ నిధి సమకూరేందుకు వీలుగా ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం రూ.15,993కు పెరిగిపోతుంది. ‘‘ఏ లక్ష్యం కోసమైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనసులో దాన్ని కష్టమైనదన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఇది ఎక్కువ సందర్భాల్లో తగినంత కార్పస్ను సమకూర్చుకోకుండా అడ్డుపడుతుంది’’ అని సెడగోపన్ వ్యాఖ్యానించారు. పన్ను ఆదా కోణంలో కాదు... తక్కువ ఆదాయం కలిగిన వారు పన్ను ఆదా కోణంలో మాత్రమే ఇన్వెస్ట్ చేయకూడదన్నది నిపుణుల సూచన. పన్ను ఆదా కోణంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సరైన సాధనాలను ఎంచుకోలేరని ఫిన్కార్ట్ ఎండీ తన్వీర్ ఆలమ్ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు పన్ను ఆదా చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్) దీర్ఘకాలంలో సంపద సృష్టికి మంచి ఆప్షన్. కానీ చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగించరు. పన్ను ఆదా ఈక్విటీ పథకాల్లో మూడేళ్ల లాకిన్ పీరియడ్ అయిపోగానే పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటుంటారు. దీని వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం కోల్పోతారు. దీర్ఘకాలం పాటు కొనసాగిస్తేనే సానుకూల రాబడులకు అవకాశం ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్ సిప్ మార్గం మెరుగైనది. ఇవి కనీసం రూ.500 నుంచి కూడా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ స్టెప్ అప్ ఫీచర్ను వినియోగించుకోవచ్చు. దీనివల్ల నిర్ణీత కాలానికోసారి పెట్టుబడుల మొత్తం పెరుగుతుంటుంది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్ను ఎంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో రాబడులు అధికంగా పొందొచ్చు. కాకపోతే డైరెక్ట్ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు సొంతంగా ఎంచుకునేవి. కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండడం వల్ల దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సమకూరుతుంది. -
ఫండ్స్లో.. ఇన్వెస్ట్ చేస్తున్నారా..?
స్టాక్ మార్కెట్ల ర్యాలీ కారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. డెట్ ఫండ్స్కూ ఆదరణ పెరుగుతూ వస్తోంది. అయితే, పెట్టుబడులు పెట్టేయడంతోనే బాధ్యత అయిపోయిందనుకోవడం సరికాదు. ఓ ఇన్వెస్టర్గా చట్టపరంగా మీకుండే హక్కులు, బాధ్యతల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రతీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలపై అందిస్తున్న ప్రాఫిట్ కథనం ఇది. కేవైసీ కాంప్లియంట్ ప్రతీ ఇన్వెస్టర్ కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలను పూర్తి చేయడం తప్పనిసరి. నల్లధనానికి చెక్ పెట్టడం, చట్టవిరుద్ధమైన నిధులు ఫండ్స్లోకి రాకుండా అడ్డుకోవడమే ఈ నిబంధనల ఉద్దేశ్యం. కేవైసీ కింద ఇన్వెస్టర్ గుర్తింపునకు సంబంధించి చెల్లుబాటయ్యే ఓ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, చిరునామా ధ్రువీకరణ, ఓ పాస్పోర్ట్ సైజు ఫొటో కూడా ఇవ్వాలి. గుర్తింపు, చిరునామా ధ్రువీకరణకు పాస్పోర్ట్, పాన్, వోటర్ ఐడీ చెల్లుబాటవుతాయి. పైగా ఆధార్ను ఇతర అన్ని కేవైసీ పత్రాలతో అనుసంధానం చేయాలి. ఏ ఇన్వెస్టర్ అయినా గానీ కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల వద్ద తమ కేవైసీ వివరాలను అప్డేట్ చేయించుకుంటే, ఆతర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని పెట్టుబడుల్లోనూ ఆ మేరకు ఆటోమేటిక్గా మార్పులు జరిగిపోతాయి. వ్యక్తిగత సమాచారం ప్రతీ ఇన్వెస్టర్ కూడా తనకు సంబంధించి సంప్రదింపులకు వీలుగా చిరునామా, కాంటాక్టు నంబర్లు, ఈమెయిల్ ఐడీ, పాన్, ఒక బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి. అంతేకాదు, వీటిలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఆ సమాచారాన్ని వెంటనే ఆయా ఫండ్ సంస్థలకు తెలియజేయడం ప్రతీ ఇన్వెస్టర్ బాధ్యతే. బ్యాంకు ఖాతాకు సంబంధించి ఐఎఫ్ఎస్సీ నంబర్, 9 అంకెల ఎంఐసీఆర్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. మోసాల నివారణకు వీలుగా ఈ కీలక సమాచారం ఫండ్స్ సంస్థలకు తెలియజేయడం అవసరం. నామినేషన్ ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ప్రతీ ఇన్వెస్టర్ కనీసం నామినీగా ఒక్కరి పేరును అయినా సూచించాలి. లేదంటే ఎవరినీ నామినీగా నియమించడం ఇష్టం లేదని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్గా ఏదైనా జరిగితే నామినేషన్ అక్కరకు వస్తుంది. పరిశీలిస్తూ ఉండాలి... తాము పెట్టుబడి పెట్టిన పథకాల పనితీరు ఎలా ఉన్నదీ అప్పడప్పుడూ పరిశీలిస్తూ ఉండడం అవసరం. ఇందుకు సంబంధించి ఆయా ఫండ్ పథకాల ఎన్ఏవీ చూస్తే తెలిసిపోతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే రోజువారీ, ప్రతీ వారం రాబడులు ఎలా ఉన్నదీ చూసుకోవాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా నెలకోసారి రాబడులను సమీక్షిస్తూ వెళితే సరిపోతుంది. మరీ తరచుగా కాకపోయినా మధ్య మధ్యలో ఆయా పథకాల పనితీరు ఎలా ఉన్నదీ గమనించడం అవసరమే. దీనివల్ల మార్కెట్ల పని తీరుకు అనుగుణంగా ఆయా పథకాల పనితీరు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. అవసరమైతే పెట్టుబడుల్లో మార్పులు కూడా చేసుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ప్రతీ ఇన్వెస్టర్ గుర్తుంచుకోవాలి. కుటుంబ భవిష్యత్తు అవసరాలు, కీలకమైన ఆర్థిక లక్ష్యాలు, ఇందులో స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక అవసరాలు ఏవి, ఇందుకోసం ఎంచుకోవాల్సిన సాధనాలు, అస్సెట్ అలోకేషన్ తదితర వివరాలతో ప్రణాళిక ఉండాలి. అలాగే, ఆదాయం, ఖర్చులు, ఎంత మేర పెట్టుబడులకు కేటాయించాలి, ఇందుకోసం అందుబాటులో ఉన్న వనరులు ఇలా అన్ని వివరాలు సమగ్రంగా ఉండాలి. అలాగే, అత్యవసరాల్లో ఆదుకునే నిధి కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, సరిపడా జీవిత బీమా కవరేజీ కూడా తీసుకోవాలి. వీటిని క్రమానుగతంగా సమీక్షిస్తూ అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడం కూడా అవసరమే. ఆధార్, ఫ్యాక్టా ప్రతీ వ్యక్తి తమ పేరిట ఉన్న అన్ని రకాల పెట్టుబడులకు ఆధార్ నంబర్తో ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది కేంద్ర సర్కారు. అలాగే, విదేశీ పన్ను చట్టం (ఫ్యాక్టా) నిబంధనలనూ అనుసరించాల్సి ఉంటుంది. -
కొత్త ఏడాది... కాస్తమారాలి
(సాక్షి, బిజినెస్ విభాగం) : ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినవారందరికీ 2017వ సంవత్సరం మంచి రాబడులను పంచి పెట్టింది. రెరా చట్టం వచ్చినా రియల్ ఎస్టేట్ రంగం పెద్దగా పుంజుకున్నది లేదు. బినామీ ఆస్తుల చట్టం, జీఎస్టీ వంటి ప్రతిబంధకాలూ ఎదురయ్యాయి. రియల్టీ విషయంలో నూతన సంవత్సరం భిన్నంగా ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. ఇక డెట్ మార్కెట్... అంటే బాండ్లలోను, డెట్ ఫండ్స్లోను పెట్టుబడులు పెట్టాలంటే వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా లేవు. బంగారమైతే పెద్దగా పెరగకపోయినా స్థిరంగా కొనసాగుతోంది. దీని కదలికలు ఇక ముందూ ఇదే తీరులో ఉంటాయన్న అంచనాలున్నాయి. మరి 2018లో మంచి రాబడులు రావాలంటే ఏం చేయాలి? ఏ సాధనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? పెట్టుబడుల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇదే విషయమై పలువురు నిపుణులతో ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ విభాగం ప్రతినిధులు మాట్లాడారు. వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... రీ బ్యాలెన్స్ తప్పనిసరి... 2017లో మార్కెట్ల ర్యాలీతో ఈక్విటీ పెట్టుబడుల విలువ పుంజుకుని ఉంటుంది. కనుక పెరిగిన విలువకు తగినట్టు ఆ పెట్టుబడులను ఇప్పుడే రీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరముంది. అయితే, మార్కెట్లు బులిష్గా ఉన్న ఈ తరుణంలో ఈక్విటీలో పెట్టుబడులను తగ్గించుకోవటం అన్నది ప్రతికూలంగానే అనిపించొచ్చు. అయితే, ప్రతి ఇన్వెస్టర్కు ఫలానా సాధనంలో ఇంత శాతం పెట్టుబడులు పెట్టాలన్న (అస్సెట్ అలోకేషన్) ప్లాన్ ఒకటి ఉంటుంది. ఉదాహరణకు మిగులు నిధుల్లో 25 శాతం ఈక్విటీ, 25 శాతం డెట్, 25 శాతం బంగారం, 25 శాతం రియల్టీ అనుకుని ఉండొచ్చు. ‘‘ఈ పెట్టుబడుల విలువ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కనుక విలువకు తగినట్టు మార్పులు చేసుకోవడం అన్నది తెలివైన చర్య. పెట్టుబడులను క్రమానుగతంగా సమీక్షించుకుంటూ, అవసరమైతే నిర్ణీత శాతం మేర పోర్ట్ఫోలియోలో మార్పులు చేసుకోవాలి’’ అని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా సూచించారు. మిడ్, స్మాల్ క్యాప్స్లో పెట్టుబడులు 2017లో సెన్సెక్స్ 28 శాతం పెరిగింది. కానీ, స్మాల్, మిడ్క్యాప్ సూచీలు ఇంకా ఎక్కువే రాబడులు ఇచ్చాయి. నిపుణుల సూచన ఏమంటే అధిక విలువలకు చేరిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ప్రస్తుత స్థాయిలో వాటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు. ఎందుకంటే బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ పీఈ 46.7 రెట్లయితే... స్మాల్క్యాప్ సూచీ పీఈ ఏకంగా 114.5 రెట్లకు చేరింది. మిడ్, స్మాల్ క్యాప్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యేకంగా ఆరంభమైన పలు మ్యూచువల్ ఫండ్ పథకాలు స్టాక్స్ అధిక వ్యాల్యూషన్ల నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులను తీసుకోవడం తాత్కాలికంగా నిలిపివేశాయి. రిస్క్ కొద్దీ రాబడుల దృష్ట్యా ప్రస్తుతానికి లార్జ్క్యాప్ ఫండ్స్ అన్నవి తగిన ఎంపిక అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో, ఈడీ శంకరన్ నరేన్ అభిప్రాయపడ్డారు. షార్ట్టర్మ్ డెట్ పథకాలు చూడొచ్చు 2017లో డెట్ఫండ్స్ రాబడులు చిన్నబోయాయి. అంతకుముందు ఒకటి రెండు సంవత్సరాల కాలంలో ఇవి రెండంకెల స్థాయిలో రాబడులనిచ్చాయి. దీంతో గత సంవత్సరం రాబడులు నిరాశపరిచినట్లే భావించాల్సి ఉంటుంది. చమురు ధరలు పెరగడం, ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడంపై ఉన్న ఆందోళనలు బాండ్ మార్కెట్కు ప్రతికూలంగా మారాయి. అయితే, ఇన్వెస్టర్లు స్వల్పకాలిక డెట్ ఫండ్స్ను ఎంచుకోవచ్చని, వీటిలో అంత అస్థిరతలు ఉండవని, స్థిరమైన రాబడులు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. పన్ను రహిత రాబడుల కోసం... స్టాక్స్లో పెట్టుబడి పెట్టిన వారికి మార్కెట్ల ర్యాలీ కారణంగా మంచి రాబడులొచ్చి ఉంటాయి. దీంతో లాభాల స్వీకరణకు ఇది సరైన సమయమనేది నిపుణుల సూచన. స్టాక్స్ను విక్రయించేసి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రయోజనాలను పొందాలని, తిరిగి అవే స్టాక్స్ను కొనుగోలు చేసుకోవాలని పేర్కొంటున్నారు. తాజాగా కొనుగోలు చేసిన ధర నుంచి స్టాక్స్ ధరలు ఒకవేళ పడిపోతే స్వల్పకాలిక నష్టాలను బుక్ చేసుకోవచ్చని, ఈ నష్టాలను ఇతర క్యాపిటల్ గెయిన్స్తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సర్దుబాటు చేసుకోవచ్చని లేదా ఎనిమిది ఆర్థిక సంవత్సరాల వరకు వాటిని పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్ అతి తక్కువ చార్జీలతో కూడిన ఎన్పీఎస్ పథకం... దేశీయ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్న రిటైర్మెంట్ పథకాల్లో అత్యంత చౌకయినదని చెప్పొచ్చు. ప్రత్యేక అవసరాల్లో పాక్షిక ఉపసంహరణలు, రిటైర్ అయిన తర్వాత కూడా పెట్టుబడులు పదేళ్ల వరకు కొనసాగించుకునే అవకాశం... ఇవన్నీ ఎన్పీఎస్ ఇన్వెస్టర్లకు పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఎన్పీఎస్ ఖాతాను ఇప్పుడు చాలా సులభంగా ఆన్లైన్ విధానంలోనే ప్రారంభించుకోవచ్చు. ఆధార్కు బ్యాంకు ఖాతా, పాన్ లింక్ అనుసంధానమై ఉంటే ఎన్పీఎస్ ఖాతాను ఆన్లైన్లో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రారంభించుకోవచ్చు. ఇంటి రుణం ముందే తీర్చేస్తే సరి ఇల్లు అద్దెకు ఇవ్వకపోయినట్టయితే ఆ ఇంటి కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీకి పూర్తిగా పన్ను మినహాయింపు ఉండేది. అధిక నికర విలువ కలిగిన ఇన్వెస్టర్లు తమ పన్ను భారం తగ్గించుకునేందుకు ఈ నిబంధనను ఉపయోగించుకునే వారు. కోటి రూపాయల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 8.75 శాతం వడ్డీ రేటుకు తీసుకుని ఉంటే రూ.8.67 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అవకాశం లభిస్తుంది. దీంతో రుణం తీసుకున్న వారిపై పన్ను భారం మొదటి సంవత్సరం రూ.2.5 లక్షల మేర తగ్గుతుంది. అయితే, గత బడ్జెట్లో పన్ను మినహాయింపును రూ.2 లక్షలకు పరిమితం చేశారు. కనుక ఇంతకంటే ఎక్కువ మొత్తంలో పన్ను ప్రయోజనం ఉండదు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్లో పెట్టే కంటే ఇంటి రుణం తీర్చేందుకు అదనంగా కేటాయించుకోవడం నయం. అనారోగ్యానికి కవరేజీ ఉండాలి మీరు తీసుకున్న వైద్య బీమా పాలసీ అన్ని రకాల రిస్క్లను కవర్ చేస్తుందనుకుంటున్నారా..? ఒక్కసారి పరిశీలించుకోండి. ఎందుకంటే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడితే హాస్పిటల్లో చేరి 30 రోజులకు పైగా చికిత్స తీసుకోవాల్సిన సందర్భమే వస్తే అప్పుడు సాధారణ బీమా పాలసీలు అక్కరకు రావు. ఎందుకంటే ఈ పాలసీల్లో కవరేజీ పరిమితంగా ఉండడమే కాకుండా, హాస్పిటల్లో గరిష్టంగా 30రోజులకే కవరేజీ లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ వ్యయాలు ఏటేటా భారీగా పెరిగిపోతున్నాయి. కనుక బేసిక్ ప్లాన్కు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా ఉండాలని సూచిస్తున్నారు హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ ముకేశ్కుమార్. జీవిత బీమా లేదా వైద్య బీమాకు రైడర్గానూ లేదా స్టాండలోన్గా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ప్లాన్ను తీసుకునే వెసులుబాటు ఉంది. గోల్డ్ ఫండ్స్ వద్దు బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ను (ఈటీఎఫ్) బంగారంలో పెట్టుబడులకు అనువైన సాధనంగా గతంలో పరిగణించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి తల్లకిందులయింది. వీటి కంటే సార్వభౌమ బంగారం బాండ్లు అధిక రాబడులనిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లు వార్షికంగా 1 శాతాన్ని ఎక్స్పెన్స్ రేషియోగా వసూలు చేస్తున్నాయి. అదే బంగారం బాండ్లు ఎక్స్పెన్స్ ఛార్జీలవంటివేమీ లేకుండా... వార్షికంగా అవే 2.5 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఇక బంగారం ధర పెరుగుదల ప్రయోజనం ఎలాగూ లభిస్తుంది. దీంతో బంగారం ఈటీఎఫ్ల కంటే బంగారం బాండ్లు వార్షికంగా 3.5 శాతం అధికంగా రాబడులను ఇస్తున్నట్టు లెక్క. వీటిల్లో ఇన్వెస్ట్ చేయొద్దు ఇటీవల బిట్కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల్లో చోటు చేసుకున్న పతనం ఇన్వెస్టర్లకు ఓ మేల్కొలుపుగా నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు బిట్కాయిన్కు దూరంగా ఉండాలని, వారికి ఏ ధరలో కొనాలి, ఎక్కడ విక్రయించాలో తెలియకపోవడం పెద్ద రిస్క్ అని కోటక్ మహింద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ నీలేష్ షా చెప్పారు. అద్దెకు తీసుకుంటే పోలే... ఇటీవల కాలంలో ఇంటికి కావాల్సిన ఉత్పత్తులు అద్దెకు తీసుకునే ధోరణి పెరుగుతోంది. ఇది ఖర్చు పరంగా సౌకర్యమైనది. ఎందుకంటే ఒకే నగరం, పట్టణం పరిధిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం సాధారణం అయిపోతోంది. ముఖ్యంగా యువ నిపుణులకు ఇది ఎక్కువగా అనుభవం. దీంతో ఫర్నిచర్ను అద్దెకు తీసుకుంటున్న వారున్నారు. ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను అద్దెకు తీసుకునేందుకు నెలకు రూ.10 వేల బడ్జెట్ చాలు. అద్దెకు తీసుకుంటే అందులోనే ఉచితంగా డెలివరీ చేస్తారు. వేరే ప్రాంతానికి మారినా ఉచితంగానే రవాణా చేస్తారు. శుభ్రం చేయడం, నిర్వహణ కూడా అద్దెకు ఇచ్చిన సంస్థల పనే. -
పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
మన దేశంలో సామాన్యుల దగ్గరి నుంచి ధనవంతుల వరకు బాగా పరిచయమైన పెట్టుబడి సాధనం ప్రభుత్వ భవిష్య నిధి (పీపీఎఫ్). ఇందులో చేసే పెట్టుబడులు, దానిపై వచ్చే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపులు ఉండటమే దీనికి కారణం. అయితే, పీపీఎఫ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందామా మరి!! కాలవ్యవధి 15 ఏళ్ల పైనే.. పీపీఎఫ్ 15 ఏళ్ల లాకిన్ పీరియడ్తో ఉంటుంది. దీని ప్రకారం మెచ్యూరిటీ 15 ఏళ్లకు పూర్తి కావాలి. అయితే, కాల వ్యవధిని లెక్కించేది ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి కాదు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల వ్యవధిని పరిగణిస్తారు. ఏ తేదీ, ఏ నెలలో మొదలుపెట్టారన్నది ముఖ్యంకాదు. ఉదాహరణకు 2017 జూలై 1న ఖాతా ప్రారంభించారనుకోండి. దాన్ని 2018 మార్చి 31గా లెక్కిస్తారు. అప్పటి నుంచి 15 ఏళ్ల వ్యవధికి పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో కాల వ్యవధి 2032 ఏప్రిల్ 1తో ముగుస్తుంది. పొడిగించుకోవచ్చు... పీపీఎఫ్ ఖాతా కాలవ్యవధి 15 ఏళ్లే అయినప్పటికీ, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు పొడిగించుకోవచ్చు. ఖాతాలో పెట్టుబడులపై అప్పటి వడ్డీ రేటు అమలవుతుంది. పొడిగించుకోవాలని అనుకుంటే 15 ఏళ్లు ముగిసిన తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పొడిగించిన కాలానికి జమలు చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు అవసరమైతే ఏడాదికోసారి బ్యాలెన్స్లో 60 శాతం మించకుండా వెనక్కి తీసుకోవచ్చు. బదిలీ చేసుకోవచ్చు కూడా... పీపీఎఫ్ ఖాతాను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు. ఒక తపాలా కార్యాలయం నుంచి మరో తపాలా కార్యాలయానికి లేదా తపాలా కార్యాలయం నుంచి బ్యాంకుకు మార్చుకునేందుకు అవకాశం ఉంది. అలాగే, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు కూడా బదిలీ చేసుకోవచ్చు. నామినేషన్ ఖాతాకు నామినేషన్ సదుపాయం ఉంది. ఓ వ్యక్తి తన ఖాతాకు అవసరమైతే మైనర్ను కూడా నామినీగా అపాయింట్ చేసుకోవచ్చు. అయితే, మైనర్ తరఫున తెరిచిన ఖాతాకు నామినేషన్ సౌకర్యం లేదు. ఖాతా తెరవటానికి అర్హులెవరు? దేశంలో నివసిస్తున్న వారే పీపీఎఫ్ ఖాతాను తెరిచేందుకు అవకాశం ఉంది. జాయింట్ పీపీఎఫ్ ఖాతాకు అవకాశం లేదు. అయితే, సంరక్షకుడితో కలసి మైనర్లు ఖాతాను ప్రారంభించొచ్చు. సంరక్షకులనే వారు తల్లి లేదా తండ్రి లేదా కోర్టు నియమించిన వేరొకరైనా కావచ్చు. తల్లిదండ్రులు మరణించిన సందర్భాల్లో తప్పిస్తే తాత, బామ్మలు మనవడు లేదా మనవరాలి పేరిట పీపీఎఫ్ ఖాతా తెరవడానికి అవకాశం లేదు. ఒకరు తన పేరిట ఒక ఖాతాను మించి ప్రారంభించేందుకు నిబంధనలు అనుమతించవు. అయితే మైనర్ పేరిట తెరిచిన ఖాతాను వేరేగా పరిగణిస్తారు. ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), హిందూ ఉమ్మడి కుటుంబాలు (హెచ్యూఎఫ్) లేదా వ్యక్తులకు సంబంధించిన సంస్థ (బీఓఐ)లు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం లేదు. ఇటీవలే కేంద్రం పీపీఎఫ్కు సంబంధించి ఎన్ఆర్ఐల విషయంలో ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తులు ఎవరైనా పీపీఎఫ్ ఖాతా తెరిచి, ఆ తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడితే (ఎన్ఆర్ఐగా మారితే) వారి పీపీఎఫ్ ఖాతా మూసివేతకు గురవుతుంది. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్పై కేవలం సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు మాత్రమే చెల్లిస్తారు. అంటే 7.8 శాతం వడ్డీ రేటు వర్తించదు. నగదు అవసరమైతే... పెట్టుబడి ప్రారంభించిన తర్వాత 15 ఏళ్ల వ్యవధి తీరకుండానే డబ్బుతో పని పడిందనుకోండి. పెట్టుబడుల్లో కొంత వెనక్కి తీసుకోవచ్చు. లేదా రుణం కూడా తీసుకోవచ్చు. రుణంపై పీపీఎఫ్ వడ్డీ రేటు కంటే 2% అదనంగా వసూలు చేస్తారు. పీపీఎఫ్ ఖాతా జమలపై రుణం తీసుకుంటే దాన్ని తీర్చిన తర్వాతే మరోసారి రుణం పొందేం దుకు వీలుంటుంది. మూడో ఏట చివరి నుంచి ఏడవ సంవత్సరంలోపే రుణానికి అవకాశం. ఆ తర్వాత నుంచి పెట్టుబడిలో కొంత వెనక్కి తీసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఏడాదికి ఒక్కసారే ఈ అవకాశం. ఒకవేళ చందాలు జమలేక ఖాతా ఇనాక్టివ్గా మారిపోతే రుణాలు పొందడానికి, ఖాతా లో ఉన్న బ్యాలన్స్ను వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. కనీస చందాలతోపాటు జరిమానాలు చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకున్న తర్వాతే ఆ అవకాశం లభిస్తుంది. వడ్డీ లెక్కించేది ఇలా... పీపీఎఫ్లో పెట్టుబడులపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి 7.8 శాతం వడ్డీరేటు అమలవుతోంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసేవారు 5వ తేదీలోపు ఇన్వెస్ట్ చేస్తేనే ఆ చందాకు ఆ నెలకు సంబంధించిన వడ్డీ లభిస్తుంది. చెక్కు ఇచ్చినా గానీ 5వ తేదీలోపు డ్రా అయి వెళ్లేలా చూసుకోవాలి. పీపీఎఫ్ ఖాతాలోని నగదు బ్యాలెన్స్ ప్రతి నెలా 5వ తేదీన ఎంతయితే ఉంటుందో... దాన్నే వడ్డీకి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వార్షికంగా ఒక్కసారే ఇన్వెస్ట్ చేస్తుంటే ఏప్రిల్ 5వ తేదీలోపు డిపాజిట్ చేయడం ప్రయోజనం. ఏటా మార్చి 31నే వడ్డీ ఖాతాలో జమ చేసినప్పటికీ ప్రతీ నెలా 5వ తేదీ నాటికి ఉన్న బ్యాలెన్స్ను పరిగణనలోకి తీసుకుని లెక్కించడం జరుగుతుంది. వార్షికంగా గరిష్ట పరిమితి దాటి ఎంత మొత్తం జమ చేసినా దానిపై వడ్డీ రాదు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల జమలపైనే వడ్డీ లభిస్తుంది. వార్షికంగా కనీసం రూ.500 జమ చేయకపోతే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు పీపీఎఫ్ ఖాతా ఇనాక్టివ్గా మారిపోతుంది. తిరిగి ఆ ఖాతాను యాక్టివ్గా మార్చుకోవాలంటే అప్పటి వరకు బకాయి పడిన ప్రతి సంవత్సరానికి కనీస చందా రూ.500తోపాటు పెనాల్టీ రూ.50 (ఏటా) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కనీసం రూ.500;గరిష్ఠం రూ.1.5 లక్షలు పీపీఎఫ్లో ఎంత పడితే అంత డిపాజిట్ చేయటానికి వీల్లేదు. దీనికంటూ నిబంధనలున్నాయి. పీపీఎఫ్లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేయొచ్చు. తన పేరిట గానీ, తన పిల్లల పేరిట గానీ పీపీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకు మించడానికి వీల్లేదు. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో 12 సార్లే డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏక మొత్తంలోనూ డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే 12 సార్లకు మించి చేయడానికి మాత్రం వీలుండదు. లాకిన్ పీరియడ్ డిపాజిట్ ప్రారంభించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి ప్రారంభమవుతుంది కనుక వార్షిక చందాలైతే 16 సార్లు చేయాల్సి ఉంటుంది. నెలవారీ చందాలైతే గరిష్ఠంగా 192 సార్లు డిపాజిట్ చేయవచ్చు. ముందస్తుగాచఖాతా ముగిస్తే..! కొన్ని ప్రత్యేక కేసుల్లో పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా క్లోజ్ చేసేందుకు అనుమతి ఉంటుంది. దీనికి సైతం కనీసం ఐదేళ్ల కాల వ్యవధి ముగిసి ఉండాలి. నిజానికి పీపీఎఫ్ ఖాతాలో చేసే పెట్టుబడులు, దానిపై రాబడులకు పన్ను మినహాయింపు ఉందని చెప్పుకున్నాం కదా. అయితే, 15 ఏళ్ల కాల వ్యవధి తీరకుండానే వెనక్కి తీసుకుంటే ఆ మొత్తంపై పన్ను పడుతుంది. వార్షిక ఆదాయ రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ నిధిపై సంపద పన్ను వర్తించదు. ఏ కోర్టూయ జప్తు చేయలేదు పీపీఎఫ్ ఖాతాదారుడు ఎవరికైనా, ఏ సంస్థకైనా బకాయి పడితే అతడి ఖాతాను జప్తు చేసేందుకు చట్టం అనుమతించదు. దీంతో పీపీఎఫ్ ఖాతాలో ప్రతి రూపాయి ఆ వ్యక్తికే చెందుతుంది. లేదంటే అతడి కుటుంబ సభ్యులకు దానిపై హక్కు లభిస్తుంది. -
షావోమి నెక్ట్స్ ప్లాన్స్ ఏంటంటే..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షావోమి మేకర్, చైనా దిగ్గజం షావోమి ఇండియాలో పెట్టుబడులపై దృష్టిపెట్టింది. ఇప్పటికే స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో రాకెట్లా దూసుకుపోతున్న షావోమి 100 స్టార్ట్అప్లు: 100కోట్ల డాలర్ల పెట్టుబడులంటూ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే అయిదు సంవ్సరాల్లో స్టార్ట్అప్ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తోంది. ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ వాడకాన్ని బాగా విస్తరించే కంపెనీల్లో ఈ పెట్టుబడులను పెట్టనుంది. తద్వారా స్మార్ట్ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవాలని యోచిస్తోంది. అంతేకాదు శాంసంగ్, వివో, ఒప్పో లాంటి ప్రత్యర్థులకు షాక్ ఇవ్వనుంది. వీటి కంటే భిన్నమైన, మెరుగైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్, ఇతర సేవలను అందిస్తూ స్టార్ట్ఫోన్ యూజర్లను ఆకర్షించనుంది. స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఎకో సిస్టంను సృష్టించేందుకు దాదాపు 100 కంపెనీల్లో బిలియన్ డాలర్ల (100కోట్ల డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నామని కంపెనీ ప్రకటించింది చైనాలో, గత నాలుగు సంవత్సరాలలో తాము 300 కంపెనీల్లో 4 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టామని.. ఈ నేపథ్యంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో భారత్లో 100 కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టబోతున్నామని షావోమి చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జూన్ వెల్లడించారు. చైనాలో బాగా విజయవంతమైన ఎకోసిస్టం నమూనాను భారత్లో ప్రతిబింబించనున్నామన్నారు. కొన్నికీలకమైన అంశాల్లో మాత్రమే తాము దృష్టిపెట్టి, మిగతావాటిని భాగస్వాములకు విడిచిపెట్టడం షావోమి బిజినెస్ మోడల్ అని లీ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ వాడకాన్ని ప్రోత్సహించే కంపెనీలపై తాము ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. అవి మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్తో సంబంధం ఉన్నంత కాలం ఆయా కంపెనీల్లో మైనారిటీ వాటాలను కొనుగోలు చేస్తామని లీ చెప్పారు -
ఆంధ్రప్రదేశ్లో ‘వీర’ బస్ యూనిట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్ బాడీ బిల్డింగ్ కంపెనీ వీర వాహన ఉద్యోగ్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుడిపల్లి వద్ద 120 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతోంది. ఏపీఐఐసీ నుంచి కంపెనీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. చెల్లింపులు పూర్తయ్యాయని, అధికారికంగా స్థలం చేతిలోకి రాగానే నిర్మాణం ప్రారంభిస్తామని వీర వాహన ఉద్యోగ్ ఎండీ కె.శ్రీనివాస్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. 18 నెలల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెడతామన్నారు. కంపెనీకి ఇప్పటికే బెంగళూరులో యూనిట్ ఉంది. వీర బ్రాండ్తో స్లీపర్, లగ్జరీ కోచ్లు, స్కూల్, సిటీ బస్లను రూపొందిస్తోంది. రెండు దశల్లో పెట్టుబడి..: అనంతపురం ప్లాంటుకు తొలి దశలో రూ.350 కోట్లు పెట్టుబడి పెడతారు. ఏటా 8,000 పెద్ద బస్లను రూపొందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంజన్, గేర్బాక్స్, యాక్సిల్ను ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేసి, చాసిస్తోసహా మిగిలిన భాగాలన్నీ ప్లాంటులోనే తయారు చేస్తారు. రెండో దశలో రూ.300 కోట్ల దాకా పెట్టుబడికి అవకాశం ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘రెండో దశలో ఏటా 15–18 వేల చిన్న బస్ల తయారీకి ప్రణాళిక చేస్తున్నాం. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 4వేల మందికి ఉపాధి లభిస్తుంది. 25 వరకూ అనుబంధ పరిశ్రమలు వస్తాయి’’ అని వివరించారు. ఎలక్ట్రిక్ బస్లు సైతం..: కంపెనీ ఎలక్ట్రిక్ బస్ల విభాగంలోకీ ప్రవేశిస్తోంది. ప్రోటోటైప్ తయారీలో ప్రస్తుతం నిమగ్నమైంది. ఆరు నెలల్లో ప్రోటోటైప్ సిద్ధం కానుంది. అనుమతులు రాగానే ఎలక్ట్రిక్ బస్ల తయారీ ప్రారంభిస్తారు. దేశంలో పలు రోడ్డు రవాణా సంస్థలు ఇపుడిపుడే ఈ బస్లను ప్రోత్సహిస్తున్నాయి. టార్మాక్ కోచ్ల తయారీలోకి కంపెనీ ఇప్పటికే అడుగుపెట్టింది కూడా. ఎయిర్పోర్టుల్లో ఈ కోచ్లే పరుగెడుతున్నాయి. ఇక బెంగళూరు ప్లాంటు వార్షిక సామర్థ్యం 1,000 యూనిట్లు. ఇక్కడ 800 మంది పనిచేస్తున్నారు. వీర వాహన ఉద్యోగ్ ఇప్పటి వరకు ఈ యూనిట్కు రూ.30 కోట్లు ఖర్చు చేసింది. 10,000లకుపైగా బస్లను ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్లకు సరఫరా చేసింది. -
ఓలా చేతికి 1.1 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: సుమారు 2 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణలో భాగంగా ట్యాక్సీ సేవల సంస్థ ఓలా తాజాగా టెన్సెంట్ హోల్డింగ్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 1.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7,150 కోట్లు) సమీకరించింది. మరో బిలియన్ డాలర్ల కోసం కొనసాగుతున్న చర్చలు తుది దశలో ఉన్నట్లు ఓలా మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ వెల్లడించింది. అయితే, ఎంత వేల్యుయేషన్స్పై నిధులు సమీకరించినదీ వెల్లడించలేదు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్బ్యాంక్తో పాటు అమెరికాకు చెందిన మరికొందరు ఇన్వెస్టర్లు తాజా రౌండ్లో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. గడిచిన 4–6 నెలల్లో విడతలవారీగా 1.1 బిలియన్ డాలర్లు ఓలా అందుకున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరి కొన్ని వారాల్లో మిగతా 1 బిలియన్ డాలర్ల ఫండింగ్ చర్చలు కూడా పూర్తి కావొచ్చని వివరించాయి. -
ఏ ఫండ్స్లో ఎంతెంత పెట్టుబడులు?
నేను హెచ్డీఎఫ్సీ యూనిట్ లింక్డ్ పెన్షన్ప్లాన్లో 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? –రాజ్, విశాఖపట్టణం ఇన్వెస్ట్మెంట్ కోసం యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్పీపీ)లను ఎంచుకోవడం ఎప్పుడూ సరైన నిర్ణయం కాదు. ఈ తరహా ప్లాన్లు ఖరీదైనవి. పైగా ఇవి తగిన రాబడులనివ్వలేవు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలతో పాటు ప్రీమియమ్ అలకేషన్ చార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు, మోరాలిటీ చార్జీలు, తదితర చార్జీల వ్యయం అధికంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడూ బీమా కలగలసిన ప్లాన్లను ఎంచుకోకూడదు. బీమా అవసరాల కోసం పూర్తిగా టర్మ్ ప్లాన్ను తీసుకోవాలి. తక్కువ ప్రీమియమ్తో ఎక్కువ బీమా కవరేజ్ పొందవచ్చు. ఇక అధిక రాబడుల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. అందుకని మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీ ఫండ్ ఇటీవల కాలంలో మంచి పనితీరు కనబరచడం లేదు. అందుకని ఈ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కి తీసుకొని, మరో మల్టీక్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? –కిరణ్ కుమార్, ఈ మెయిల్ ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీ ఫండ్ ట్రాక్ రికార్డ్ బావుంది. ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. గతంలో ఈ ఫండ్ పనితీరు బాగా ఉండటంతో పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. ఈ పెట్టుబడుల భారం కారణంగా రాబడులు తగ్గాయి. అయినప్పటికీ, ఇప్పటికీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు. అత్యున్నత నాణ్యత గల పోర్ట్ఫోలియో ఈ ఫండ్కు ఉంది. ఈ ఫండ్ మేనేజర్ కూడా మంచి సమర్థత గలవ్యక్తే. మార్కెట్ పెరుగుతున్న దశలో ఈ ఫండ్ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మంచి పనితీరును కనబరిచేలా ఈ ఫండ్ పోర్ట్ఫోలియోను ఈ ఫండ్ మేనేజర్ రూపొందించారు. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పెట్టుబడి నిర్ణయాలు ఎప్పుడూ స్వల్పకాల పనితీరును బట్టి ఉండకూడదు. దీర్ఘకాల పనితీరును బట్టే నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ఏడాది పనితీరును పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదు. కనీసం మూడేళ్ల ట్రాక్ రికార్డ్ను మదింపు చేసి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీ ఫండ్ ట్రాక్ రికార్డ్ బాగా ఉంది. కాబట్టి ఈ ఫండ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కి తీసుకొని వేరే ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలన్న మీ నిర్ణయాన్ని మార్చుకోవడమే ఉత్తమం. నేను సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. మంచి ఆదాయమే వస్తోంది. గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే నా పోర్ట్ఫోలియోలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎంతెంత స్థాయిల్లో పెట్టుబడులు పెట్టాలి. వివరించండి. –రమేశ్, హైదరాబాద్ ఈ తరహా ఫండ్స్లో ఇంత స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని సాధారణ నియమమేమీ లేదు. అయితే ఒక ఇన్వెస్టర్ తన ఇన్వెస్ట్మెంట్స్లో 65–70 శాతం వరకూ లార్జ్క్యాప్ ఫండ్స్లోనూ, 20 శాతం మిడ్ క్యాప్ ఫండ్స్లోనూ, 10–15 శాతం స్మాల్ క్యాప్ ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తే, ఆ పోర్ట్ఫోలియో సమతూకంగా ఉంటుందని నిపుణులంటారు. ఇదే స్థాయిలో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలని లేదు. కొంచెం అటూ, ఇటూగా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే లిక్విడిటీ అధికంగా ఉండే లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా లిక్విడిటీ సమస్యలు ఉండవు. మార్కెట్ పతన బాటలో ఉన్నప్పుడు స్మాల్క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ యూనిట్లను విక్రయించుకోవడం కొంచెం సమస్యాత్మకమైన పనే. అందుకని మీ పోర్ట్ఫోలియోలో అధిక భాగం లార్జ్క్యాప్ ఫండ్స్ ఉండేలా చూసుకోవడం మంచిది. నా వయస్సు 30 సంవత్సరాలు. నాకు ఇటీవలనే వివాహమైంది. నా భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. సొంత ఇల్లు సమకూర్చుకోవాలనేది మా లక్ష్యం. ఇరువురం కలసి రూ.30,000 వరకూ పొదుపు చేయగలం. స్టాక్ మార్కెట్లో మంచి రాబడులు వస్తాయి కానీ, వాటిపై నాకు అవగాహన తక్కువ. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇప్పటివరకూ ఇన్వెస్ట్ చేసింది లేదు. మా సొంత ఇంటి లక్ష్యం త్వరగా సాకారం కావడానికి తగిన సూచనలు ఇవ్వండి. –వీరేందర్, హైదరాబాద్ రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం, పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం... వంటి దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమైన మార్గం. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్రవ్యోల్బ ణాన్ని తట్టుకునే రాబడులనిస్తాయి. మీరు మ్యూచువల్ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కు కొత్త కాబట్టి. ముందుగా బ్యాలన్స్డ్ ఫండ్స్లో 1–2 సంవత్సరాలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్పై తగిన అవగాహన వచ్చిన తర్వాత డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకొని, ఆ ఫండ్స్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇక బీమా అవసరాల కోసం టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
జార్ఖండ్లో పెట్టుబడులు పెట్టండి-రతన్ టాటా
జార్ఖండ్ లోపెట్టుబడులు పెట్టాల్సిందిగా తోటి పారిశ్రామిక వేత్తలకు టాటా గ్రూపు అధినేత పిలుపునిచ్చారు. జంషెడ్ పూర్ లోని వ్యాపార ప్రారంభ రోజుల గుర్తుచేసుకున్న టాటా గ్రూప్ మూలపురుషుడు రతన్ టాటా జార్ఖండ్ రాష్ట్రంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ పొటెన్షియాలిటీని అందిపుచ్చుకోవాలని దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ 'సమ్మిట్ 2017 లో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా వద్ద మాట్లాడుతూ దేశంలో వ్యాపారానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో న్యూ ఇండియాగాఅవతరించబోతోందన్నారు. అయితే కేవలం పారిశ్రామికంగా అభివృద్ది చెందిన ప్రాంతాలపైనే దృష్టిపెడితే సరిపోదని, ఈ ప్రగతిని మరింత విస్తరించాల్సినఅవసరం ఉందన్నారు. ఖనిజ సంపదలతో అలరారుతున్న సహజ సౌందర్యంతో విలసిల్లే ప్రదేశం జార్ఖండ్ లో పెట్టుబడులపై దృష్టిపెట్టాలని టాటా చెప్పారు. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిందనీ ఆ దిశగా పురోగమిస్తూ ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలుస్తోందని చెప్పారు. ఈ క్రమంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం చాలా లాభదాయకన్నారు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటూ తన సమకాలీన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కోరారు. కాగా భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు కార్పొరేట్ గ్రూప్ టాటా గ్రూప్ . ప్రపంచంలోని బాగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలలో ఒకటిగా గుర్తించబడిన టాటా స్టీల్ ప్రస్తానం జంషెడ్ పూర్ లో మొదలైన సంగతి తెలిసిందే. -
10శాతం పెట్టుబడులకు విదేశీ బ్యాంకులకు అనుమతి
ముంబై : స్థానిక ప్రైవేట్ రుణదాతలకు, లైఫ్ ఇన్సూరెన్సె కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల్లో 10శాతం పెట్టుబడి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. మూలధనాన్ని, ఈ రంగంలో స్థిరీకరణను ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త పాలసీలను సెంట్రల్ బ్యాంకు గురువారం ప్రకటించింది. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకుల్లో 10శాతం వాటాను వ్యక్తులు, సంస్థలు పొందేలా అనుమతినిచ్చింది. నాన్ రెగ్యూలేటెడ్, నాన్ డైవర్సిఫైడ్, లిస్ట్ కాని ఫైనాన్సియల్ సంస్థలు 15శాతం వాటాను పొందేలా.. రెగ్యులేటెడ్, డైవర్సిఫైడ్, లిస్ట్ అయిన సంస్థలు 40శాతం వాటాను పొందేలా రిజర్వు బ్యాంకు ఈ కొత్త పాలసీను తీసుకొచ్చింది. ఆర్బీఐ తీసుకున్న ఈ కొత్త పాలసీల వల్ల బ్యాంకింగ్ రంగంలో స్థిరీకరణ వస్తుందని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ పార్టనర్ కల్సేష్ మెహతా తెలిపారు. 2013లో కొత్త బ్యాంకు లైసెన్సులు జారీ వెలుగులోకి వచ్చినప్పటీ నుంచి ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో షేర్ హోల్డింగ్ మార్గదర్శకాలను పునఃసమీక్షిస్తున్నామని ఆర్బీఐ చెప్పింది. బేసల్-3 నిబంధనల అమలు మేరకు రుణదాతలకు అవసరమైనంత అదనపు మూలధనం అందించడానికి తోడ్పడుతున్నామని పేర్కొంది. ఒకవేళ బోర్డు అనుమతులు లభిస్తే, ఎలాంటి రెగ్యులేటరీ అభిప్రాయం అవసరం లేకుండానే పెట్టుబడిదారులు బ్యాంకుల్లో ఎక్కువ వాటా కలిగి ఉండేలా చేస్తామని చెప్పింది. -
కెరీర్ ప్రారంభంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్.. రవి వయసు 23 ఏళ్లు. కొత్తగా ఉద్యోగంలో చేరాడు. వచ్చే సంపాదనలో కొంత పొదుపు చేయాలనుకున్నాడు. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో అతనికి తన చిన్ననాటి స్నేహితుడు ఖలీద్ తారసపడ్డాడు. రవి తన సందేహాలను ఖలీద్కు చెప్పాడు. ఖలీద్ అతనికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అవేంటో చూద్దాం... * ముందు ఎంత మొత్తంలో రిస్క్ భరించగలమో అంచనా వేసుకోవాలి. సాధారణంగా యుక్త వయసులోని వారు ఎక్కువ రిస్క్ను భరించగలరు. * రిస్క్ను భరించగలిగినప్పుడు.. దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికను తయారు చేసుకోవాలి. * ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలో ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు ప్రాధాన్యమివ్వాలి. వీటితోపాటు కమోడిటీ మార్కెట్లో (బంగారం) కొంత ఇన్వెస్ట్ చేయాలి. * మనం సేవింగ్ చేయాలనుకుంటున్న మొత్తంలో 70-75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకుగానూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసుకోవాలి. ఇది లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఓరియెంటెడ్గా ఉండాలి. * ఇక 25-20 శాతం మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఆదాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకు లిక్విడిటీ, స్థిరత్వం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. * పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం ఇకచివరగా మిగిలిన మొత్తాన్ని బంగారంలో పెట్టుబడిగా పెట్టాలి. చాలా మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఫండ్స్ను ఆఫర్ చేస్తున్నాయి. * ఇన్వెస్ట్మెంట్లను రెగ్యులర్గా చేయాలి. సిప్ పద్ధతిని అనుసరించడం ఉత్తమం. -
మధ్యలో పీపీఎఫ్ ఖాతా ఆపేయవచ్చా..?
నేనొక సంస్థ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇన్వెస్ట్మెంట్స్ను ఏడాది గడవక ముందే వేరే సంస్థ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి మారిస్తే ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? ఎలాంటి పన్నుపోటు లేకుండా ఉండాలంటే ఎంత కాలం తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్స్ను బదిలీ చేయాలి? - రామాచారి, విశాఖపట్టణం పన్ను అంశాల పరంగా చూస్తే, ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్స్ను బదిలీ చేయడం అంటే...ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించి, కొత్తగా మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లను కొనుగోలు చేయడంగా పరిగణిస్తారు. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి, దాని నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఏడాదిలోపు మరో మ్యూచువల్ ఫండ్లోకి బదిలీ చేస్తే మీరు 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది దాటిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్పై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉండదు. పన్ను పోటు లేకుండా ఉండాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ను ఏడాది తర్వాత బదిలీ చేయాలి. ఇక లిక్విడ్ ఫండ్స్ విషయానికొస్తే, లిక్విడ్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ను మూడేళ్లలోపు వేరే ఫండ్లోకి మళ్లిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బదిలీపై వచ్చిన లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ బదిలీ విషయంలో ఎగ్జిట్ లోడ్ విషయాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. జీవన్ సరళ్ పాలసీ సరెండర్ చేద్దామనుకుంటున్నాను. ఈ పాలసీ సరెండర్పై నేనేమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - రమణ, నెల్లూరు మీరు పాలసీ తీసుకొని ఎన్ని సంవత్సరాలయింది, మీరు తీసుకున్న బీమా కవర్, మీరు చెల్లించిన ప్రీమియమ్ తదితర అంశాలను బట్టి పన్నుల విధింపు ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనే జీవన్ సరళ్ బీమా పాలసీ సరెండర్పై పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2012 మార్చి 31కి ముందు తీసుకున్న పాలసీలైతే, మీరు తీసుకున్న బీమా మొత్తం ,మీరు చెల్లించే వార్షిక ప్రీమియమ్నకు ఐదు రెట్ల కంటే అధికంగా ఉన్నప్పుడు. మీరు 2012 ఏప్రిల్ తర్వాత పాలసీలు తీసుకుంటే, మీరు తీసుకున్న బీమా మొత్తం మీరు చెల్లించే వార్షిక ప్రీమియమ్నకు పదిరెట్లు కంటే అధికంగా ఉన్నప్పుడు. ఈ రెండు సందర్భాల్లో మాత్రం మీకు పన్ను మినహాయింపులు లభిస్తాయి, ఇలా కాని పక్షంలో ఎల్ఐసీ జీవన్ సరళ్ లాంటి ఎండోమెంట్ పాలసీలను సరెండర్ చేసినప్పుడు వచ్చిన సరెండర్ విలువను మీ ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నా కొడుకు ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అతని నెల జీతం రూ.11,000. తన వైద్య బీమా ప్రీమియాన్ని నేనే చెల్లిస్తున్నాను. ఈ చెల్లించే ప్రీమియమ్పై పన్ను మినహాయింపు పొందవచ్చా? - క్రాంతి, గుంటూరు 18 సంవత్సరాలు దాటిన పిల్లలు, ఉద్యోగస్తులైతే, వారికి చెల్లించే ప్రీమియమ్లకు మీరు పన్ను మినహాయింపు పొందలేరు. మీకు, మీ జీవిత భాగస్వామికి, మీపై ఆధారపడిన పిల్లలకు చెల్లించే వైద్య బీమా ప్రీమియమ్లకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డి ప్రకారం రూ.25 వేల వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. నేను 2012, జూలై నుంచి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఖాతాలో ఇప్పటిదాకా జమ అయిన మొత్తం రూ. లక్షకు పైగా ఉంది. దీని కంటే పన్ను ఆదా చేసే స్కీమ్లు ఉండటంతో ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేయడం ఆపేద్దామనుకుంటున్నాను. ఈ ఖాతాను ఆపేయడం ఎలా? ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నేను ఎప్పుడు తీసుకోవచ్చు? - జ్యోతి, కాకినాడ పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాను మధ్యలో ఆపేయడానికి లేదు. ఈ ఖాతాను ప్రారంభించి పదిహేను ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేయని పక్షంలో ప్రతీ ఏడాది రూ.50 చొప్పున ఈ ఖాతా మెచ్యుర్ అయ్యేంత వరకూ జరిమానా విధిస్తారు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి ఆరేళ్లు దాటితే పాక్షికంగా కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. - ధీరేంద్ర కుమార్, సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్ -
దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్స్కు ఎన్పీఎస్ ఓకేనా?
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో పన్ను ప్రయోజనం పొందవచ్చా? నాకు ఇటీవలే కూతురు పుట్టింది. తన ఉన్నత విద్య నిమిత్తం ఇప్పటి నుంచే పొదుపు చేయాలనుకుంటున్నాను. అంటే 20 ఏళ్ల పాటు పొదుపు చేస్తాను. ఈ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలా లేక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలా? దేన్ని ఎంచుకుంటే నాకు పన్ను ప్రయోజనాలతో పాటు, అధిక రాబడులు వస్తాయి? - సాయి లీల, రాజమండ్రి నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేసి, 2016-17 ఆర్థిక సంవత్సరానికి సెక్షన్ 80సీసీడీ(వన్బి) కింద రూ.50,000 వరకూ అదనపు పన్ను మినహాయింపులు పొందవచ్చు. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాలి, అదీ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన పథకంలో అంటే ఎన్పీఎస్ను ఎంచుకోవచ్చు. మీరు అరవై ఏళ్లు వచ్చేవరకూ ఈ ఇన్వెస్ట్మెంట్స్ను హోల్డ్ చేయాల్సి ఉంటుంది. మీరు అరవై ఏళ్లు వచ్చి, రిటైరైన తర్వాత ఈ మొత్తం కార్పస్లో 40 శాతంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్ననుసరించి మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక అరవై ఏళ్లకు ముందే డబ్బులను విత్డ్రా చేయాలనుకుంటే, మీ కార్పస్లో కనీసం 80 శాతం మొత్తాన్ని యాన్యుటీని కొనుగోలుకు ఉపయోగించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్నుస్లాబ్ననుసరించి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం(కూతురి ఉన్నత విద్య) కోసమైతే, ఇన్వెస్ట్మెంట్స్ మీరే స్వయంగా చూసుకోగలిగితే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ను ఎంచుకోండి. ఈ స్కీమ్స్కు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మూడేళ్ల తర్వాత వీటిని ఖచ్చితంగా విక్రయించాల్సిన అవసరం లేదు. ఈఎల్ఎస్ఎస్లు తమ మొత్తం కార్పస్ను ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీకు మంచి రాబడులు వస్తాయి. అదే ఎన్పీఎస్లో అయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేది 50 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఏడాది కాలం తర్వాత విక్రయించే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్పై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేనందున ఈఎల్ఎస్ఎస్పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకని దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఎన్పీఎస్ కంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ బెటర్. పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అధిక రాబడులూ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్ల కంటే డెరైక్ట్ ప్లాన్లకు ఉండే ప్రయోజనాలు, ప్రతికూలతలను వివరించండి ? - క్రిష్టోఫర్, నెల్లూరు డెరైక్ట్ ప్లాన్ల వల్ల మీకు కమీషన్లు, మార్కెటింగ్ సంబంధిత వ్యయాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇది ఎంత చిన్నమొత్తమైనా సరే దీర్ఘకాలం ఇన్వెస్ట్మెంట్ కారణంగా మీకు మంచి రాబడులు వస్తాయి. డెరైక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లభించే అతి పెద్ద ప్రయోజనం ఇది. ఇక డెరైక్ట్ ప్లాన్లకు సంబంధించి ఉన్న అతి పెద్ద ప్రతికూలాంశం ... మీ పెట్టుబడి నిర్ణయాలన్నింటిని మీరే స్వంతంగా తీసుకోవలసి రావడం. మీరు డెరైక్ట్ ప్లాన్ను మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేస్తారు కాబట్టి. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సలహాలు మీకు అందుబాటులో ఉండవు. మీరే సొంతంగా రీసెర్చ్ చేసి. నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే డెరైక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి. నా వయస్సు 65 సంవత్సరాలు. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను తీసుకోవాలనుకుంటున్నాను. రెలిగేర్, స్టార్, టాటా ఏఐజీ, అపోలో మ్యూనిక్ వంటి కంపెనీలవి షార్ట్లిస్ట్ చేశాను. వీటిల్లో దేనిని ఎంచుకోవాలో సూచిస్తారా? - కిరణ్, వరంగల్ మీరు తీసుకునే హెల్త్ పాలసీ.. తగినంత కవరేజ్ ఇచ్చేదిగానూ, మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్ మీ బడ్జెట్కు తగినట్లుగానూ ఉండాలి. బీమా తీసుకునే వ్యక్తికి ఇంతకు ముందే ఏవైనా రుగ్మతలు ఉంటే వాటికి సంబంధించిన కవరేజ్ క్లాజ్ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇంతకు ముందే ఉన్న జబ్బులకు సంబంధించి కవరేజ్ పీరియడ్ ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉంటుంది. ఈ పీరియడ్ రెండు నుంచి నాలుగేళ్లుగా ఉంటుంది. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వండి. పాలసీ తీసుకున్న 30 రోజుల్లోపే మీరు చికిత్స తీసుకుంటే ఈ చికిత్సకయ్యే ఖర్చులు చాలా హెల్త్ పాలసీల్లో రీయింబర్స్ కావు. చాలా బీమా కంపెనీలు నగదు రహిత(క్యాష్లెస్), రీయింబర్స్మెంట్ ఫీచర్లున్న పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. నగదు రహిత సౌకర్యాన్నే ఎంచుకుంటే మంచిది. రీయింబర్స్మెంట్ ఫీచరున్న పాలసీలో అయితే మీ చికిత్సకయ్యే ఖర్చులు మీరు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులు సమకూర్చుకోవడం కొంచెం శ్రమతో కూడుకున్న పనే. మరోవైపు రీయింబర్స్మెంట్ కోసం చాలా డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నగదు రహిత సౌకర్యం తీసుకుంటే మీ నగరంలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ను చెక్ చేసుకోవాలి. సదరు బీమా సంస్థ వెబ్సైట్లో మీరు తీసుకోవాలనుకుంటున్న ప్లాన్ బ్రోచర్ను క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. ఇక వివిధ సంస్థల పాలసీల వివరాలు చూద్దాం... స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే,.. ఈ పాలసీలో ఇంతకు ముందే ఉన్న జబ్బుల కవరేజ్ రెండో ఏట నుంచి లభిస్తుంది. 61-75 ఏళ్ల ఏజ్గ్రూప్ వారికి రూ.5 లక్షల బీమాకు ప్రీమియం రూ.20,610గా ఉంది. ఇక రెలిగేర్ సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇంతకు ముందే ఉన్న జబ్బులకు కవరేజ్ నాలుగో ఏడాది నుంచి లభిస్తుంది. రూ. 5 లక్షల హెల్త్ పాలసీకి ప్రీమియం 61-65 ఏళ్ల వయస్సుకు రూ.16,898-రూ.23,466 వరకూ ఉంటుంది. అపోలో మ్యూనిక్ ఆప్టిమా సీనియర్ పాలసీలోనూ ఇంతకు ముందే ఉన్న జబ్బుల కవరేజ్ 4వ ఏడాది నుంచి లభిస్తుంది. రూ. 5 లక్షల బీమాకు ప్రీమియమ్లు 61-65 ఏళ్లకు రూ.18,137గానూ, 66-70 ఏళ్ల వయస్సుకు రూ. 29,254గానూ, 71-75 ఏళ్ల వయస్సుకు రూ.38,136గానూ ఉన్నాయి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
స్నాప్బిజ్లో రతన్ టాటా పెట్టుబడులు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా స్టార్టప్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఆయన తాజాగా బెంగళూరుకు చెందిన రిటైల్ టెక్నాలజీ స్టార్టప్ స్నాప్బిజ్లో పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టిన వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఏడాది స్టార్టప్లో ఆయనకు ఇది 8వ పెట్టుబడి. మొత్తం మీద ఆయన ఇప్పటిదాకా 20 స్టార్టప్ల్లో ఇన్వెస్ట్ చేశారు. రతన్ టాటా తమ సంస్థలో ఇన్వెస్ట్ చేయడం అతి పెద్ద ప్రోత్సాహమని స్నాప్బిజ్ సంస్థ పేర్కొంది. భారత కిరాణ దుకాణాల్లో డిజిటల్ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తామని కంపెనీ సీఈఓ ప్రేమ్ కుమార్ తెలిపారు. -
ఇరవైల నుంచే ఇన్వెస్ట్మెంట్..
ఏదైనా సరే వాయిదా వేస్తూ వెళ్లకుండా తక్షణం మొదలుపెడితేనే లాభం ఉంటుంది. పెట్టుబడుల విషయంలోనూ అంతే. ఎంత ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే అంత అధికంగా ప్రయోజనాలు పొందడానికి వీలవుతుంది. దీనికి సంబంధించి మరింత అవగాహన కోసం... రిటైరయ్యే నాటికి నిర్దిష్టమైన రాబడి లేదా వడ్డీని అందించేలా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు మూడు విధానాలున్నాయి. మొదటిదేంటంటే.. అత్యధిక రాబడులిచ్చే సాధనాన్ని ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం. రెండోది... ప్రతి నెలా కట్టే వాయిదాలు లేదా పెట్టుబడులను కొంత పెంచుకుంటూ పోవడం. ఇక మూడోది... ఇన్వెస్ట్మెంట్ వ్యవధిని (సంవత్సరాలు) మరింతగా పెంచుకోవడం. ముందుగా మొదటిదాన్ని పరిశీలిద్దాం. అత్యధిక రాబడులిచ్చే సాధనాన్ని ఎంచుకుంటే రిస్కు లు కూడా అలాగే ఉంటాయన్నది బండ గుర్తు లాంటిది. ఉదాహరణకు పన్నుల అనంతరం 6-8 శాతం దాకా రాబడినిచ్చే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్లు, ఎన్ఎస్సీలు వంటి వాటితో పోలిస్తే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా అత్యధిక రాబడులూ అందించవచ్చు. కొద్ది నెలలు లేదా సంవ త్సరాల్లోనే కొన్ని షేర్లు అమాంతం పెరిగిపోతుంటాయి. తక్కువ ధరలో కొనుక్కుని అత్యధిక రేటులో వీటిని అమ్ముకోగలిగితే లాభమే. కానీ ఇది చెప్పినంత తేలిక కాదు. నష్టాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి. ఒకవేళ లాభాలొచ్చినా.. తద్వారా వచ్చిన డబ్బును మళ్లీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నదీ ప్రశ్నార్థకమే. రిటైర్మెంటు కోసం ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇటువంటి అనిశ్చితి లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఇక రెండో ప్రత్యామ్నాయం విషయానికొస్తే.. ఇది కాస్త మెరుగైనదే. వీలైనప్పుడల్లా సాధ్యమైనంత ఎక్కువగా పొదుపు చేయండి. అయితే, ప్రతిసారీ బోలెడంత పొదుపు చేసేంత గా మన దగ్గర డబ్బుండే అవకాశాలు కూడా తక్కువే. ఒకవేళ కొండొకచో మిగిలినా ఎప్పుడో రిటైర్మెంటు కోసం ఇప్పటి నుంచే సరదాలన్నీ ఎందుకు త్యాగం చేయాలనుకుంటూ వాటిని ఖర్చు చేసేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇక మిగిలినది మూడో విధానం. అదేంటంటే సాధ్యమైనంత ముందుగా ఇన్వెస్ట్మెంటు మొదలుపెట్టడం. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే... సుదీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం వల్ల అసలుపై మరింత అధిక వడ్డీ వస్తుంది. అంతే కాదు ఏటా వడ్డీకి వడ్డీ కూడా తోడు కావడంతో ఇంకాస్త అధికంగా వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెడితే అంత ఎక్కువ మొత్తాన్ని ఆఖర్లో అందుకోవచ్చు. ఈ విధానం వల్ల భారీ మొత్తం కూడబెట్టుకోవాలన్న ఆందోళనతో అధిక రాబడులిచ్చే సాధనాలను వెతుక్కుంటూ చిన్న సరదాలనూ త్యాగం చేయాల్సిన అవసరం ఉండదు. ముందు నుంచే సురక్షితమైన సాధనాన్ని ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే కాంపౌండింగ్ ప్రయోజనాల లాభం ఎక్కువగా పొందవచ్చు. ముందుగా అంటే.. ఎంత ముందుగా .. సాధ్యమైనంత ముందుగా ఇన్వెస్ట్ చేయాలంటే... అసలు మొదలు ఎక్కడ అనే సందేహం ఉత్పన్నమవుతుంటుంది. సాధారణంగా భారతీయులు సగటున ఇరవైలలో ఉన్నప్పుడు ఆదాయాలను ఆర్జించడం మొదలుపెడతారు. ప్రస్తుతం చాలా మంది అధిక జీతభత్యాలే అందుకుంటున్నారు. అయితే, ఆరోగ్యం వెన్నంటే ఉండే ఈ వయసులో రిటైర్మెంట్ ప్రణాళికలకు ఎక్కువ మంది పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. తీరా ముప్పైల్లోకి వచ్చేసరికి మనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. దానికి తగ్గట్లుగానే బాధ్యతలూ పెరుగుతాయి. ఆదాయం పెరిగినా గతంలో మాదిరి పెరుగుదల ఉండకపోవచ్చు. అలాగే నలభైలలోకి వచ్చేటప్పటికీ రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏమిటనే ఆలోచన మొదలవుతుంది. సరే! పెట్టుబడులు మొదలెడదామనుకుంటే రిటైర్మెంట్కి కేవలం ఇరవైఏళ్లే మిగిలి ఉంటుంది. ఏం చేద్దామనుకున్నా అప్పుడే చేయాలి. ఈ లోగా ఆరోగ్యానికీ, ఆదాయానికీ రిస్కులు ఎదురవుతూ ఉంటాయి. దీంతో సీరియస్గా పొదుపు చేద్దామనుకున్నా కుదరకపోవచ్చు. కాబట్టి సాధ్యమైనంతగా ఇరవైలలోనే ఇన్వెస్ట్మెంట్ మొదలుపెడితే శ్రేయస్కరం. అంతేనా... నిత్యం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ నిత్యావసరాల ధరలు.. మిగతా వాటి రేట్లు తగ్గిన పక్షంలో మీ ఖర్చులూ తగ్గుతాయి కదా!!. దీంతో మీ దగ్గర మరికాస్త ఎక్కువ మొత్తం మిగులుతుంది. అనుకున్న సమయం కంటే ముందే రిటైర్ కావొచ్చు కూడా. అయితే, ధరలు తగ్గే తరుణంలో భవిష్యత్లో మీకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచుకోవడానికి నిధులను సద్వినియోగం చేసుకుంటే మంచిది. మున్ముందు అవే ఉపయోగపడతాయి. ఏదైతేనేం.. ఆర్జన మొదలైన రోజు నుంచే కొంత భాగాన్ని దాచిపెట్టడం కూడా ప్రారంభిస్తే.. రిటైరయ్యే సరికి పెద్ద మొత్తాన్నే జమచేసుకోవచ్చు. - ఆనంద్ జేమ్స్ టెక్నికల్ రీసెర్చ్ డెస్క్ కో-హెడ్, జియోజిత్ బీఎన్పీ పారిబా -
బడ్జెట్ వస్తోంది... వీటి సంగతేంటి?
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెలాఖరులో కొత్త బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏమైనా మార్పులుంటే అవన్నీ కూడా 2016-17వ ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. ఏ మార్పులు వస్తున్నాయో బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా మనకు ముందే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు చేయవలసిన కొన్ని పనులు ఈ రోజు ట్యాక్స్ కాలమ్లో... * సెక్షన్ 80(సీ) కింద అర్హత ఉన్న సేవింగ్స్, పెట్టుబడులు తదితర వాటి మీద గరిష్ట పరిమితి రూ.1,50,000. ఈ రోజు వరకు ఎంత ఇన్వెస్ట్ చేశారో లెక్కించండి. ఇంకా అవకాశం ఉంటే వెంటనే రంగంలోకి దిగండి. * మెడిక్లెయిమ్కి వాయిదాలు చెల్లించండి. * ఇంటి రుణం మీద అసలు, వడ్డీ చెల్లించకపోతే వెంటనే చెల్లించండి. * అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు సెప్టెంబర్ నుంచే మొదలవుతాయి. మార్చి 15 చివరి తేదీ. అవకాశం ఉంటే త్వరగా చెల్లించండి. చివరి క్షణం వరకు నిరీక్షణ వద్దు. * టీడీఎస్ వివరాలు తెలుసుకోండి. డిడక్టర్తో మాట్లాడండి. యజమానిని సంప్రదించండి. బ్యాంక ర్లు వారి పని ఒత్తిడి వల్ల మన పని చేయకపోవచ్చు. మీరే వారిని కలిసి టీడీఎస్ సమస్యను పరిష్కరించుకోండి. * మీ కేసులో టీడీఎస్ జరిగినప్పటికీ.. ఆ మొత్తంలో పూర్తి పన్ను భారం చెల్లించలేం. ఉదాహరణగా బ్యాంకర్లు కేవలం 10 శాతం చెల్లిస్తారు. మీ ఆదాయం 30 శాతం శ్లాబ్లో ఉందనుకోండి. మీరింకా 20 శాతం చెల్లించాలి. దీన్ని అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా చెల్లించాలి. చాలా మంది టీడీఎస్ అయిపోయింది కాదా.. ఇక అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇది పొరపాటు. ఇటువంటివి ఇప్పుడే చూసుకోండి. * మీకున్న అన్ని బ్యాంకు అకౌంట్లలో బ్యాంకర్లు సంవత్సరంలో రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వడ్డీని క్రెడిట్ చేస్తారు. ఇటువంటి మొత్తం 10 వేల రూపాయలు దాటితే పన్ను భారం పడుతుంది. అటువంటి సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోండి. * బ్యాంకు అకౌంట్లలో ప్రతి క్రెడిట్కి, ప్రతి డెబిట్కు వివరణ రాసుకోండి. * మార్చి 15 తర్వాత ఊహించని విధంగా ఆదాయం వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని పన్నుభారం లెక్కించండి. * కొన్ని విషయాలను మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపాదనల వల్ల బేసిక్ లిమిట్ , శ్లాబ్ మారవచ్చు. మినహాయింపుల పరిమితి పెరగొచ్చు. ఈ ప్రభావం పన్ను మీద పడుతుంది. * అందుకే బడ్జెట్ ప్రతిపాదనలు తెలియగానే పన్ను భారం గురించి వృత్తి నిపుణులను సంప్రదించండి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
డీమ్యాట్ ఖాతా కావాలా?
డీ మ్యాట్ అంటే... కొనుక్కున్న షేర్లను దాచుకునే ఒక ఎలక్ట్రానిక్ ఖాతా. అయితే దీన్లో షేర్లను కొని దాచిపెట్టుకోవాలన్నా... ఇందులో ఉన్న షేర్లను విక్రయించాలన్నా... అందుకు ట్రేడింగ్ ఖాతా కావాలి. క్రయవిక్రయాలకు డబ్బులుండాలి కనక ఈ ట్రేడింగ్ ఖాతాలోకి డబ్బులు వెయ్యాలన్నా, తియ్యాలన్నా ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలి. ఈ సేవలు మూడు విధాలుగా పొందవచ్చు. 1. కొన్ని బ్యాంకులు సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలన్నిటినీ కలిపి ఇచ్చే 3 ఇన్ 1 స్టాక్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్లకు సంబంధించి రీసెర్చ్ రిపోర్టులివ్వటంతో పాటు ఏ షేర్లను కొనాలి? వేటిని విక్రయించాలి? వంటి సూచనలు కూడా ఇస్తుంటాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎస్బీఐ వంటి బ్యాంకులతో పాటు కోటక్ సెక్యూరిటీస్ వంటి ఆర్థిక సంస్థలూ ఈ 3 ఇన్ 1 సేవలందిస్తున్నాయి. 2. ఇక రెండో తరహా స్టాక్ బ్రోకర్ల విషయానికొస్తే... ఇవి కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్స్ను మాత్రమే అందిస్తాయి. వీటికి మనకు ఖాతా ఉన్న బ్యాంకు తాలూకు సేవింగ్స్ అకౌంట్ను జత చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ట్రేడింగ్ ఖాతాలోకి నగదు వేయటం, అందులోంచి నగదు తీసుకోవటం వంటివి కాస్తంత ఆలస్యమవుతాయి. ఇండియా ఇన్ఫోలైన్, ఏంజెల్, షేర్ఖాన్, వెంచురా వంటి పలు సంస్థల్ని ఈ తరహావిగా చెప్పొచ్చు. 3. ఈ మధ్యకాలంలోనే మూడో రకం బ్రోకరేజ్ సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇవి చిన్న ఇన్వెస్టర్లను, చిన్న ట్రేడర్లను దృష్టిలో పెట్టుకుని... లావాదేవీలతో సంబంధం లేకుండా స్థిరమైన ఫీజులు లేదా చాలా తక్కువ చార్జీలతో సేవలందిస్తున్నాయి. అందుకే వీటిని డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలుగా పేర్కొంటున్నారు. మూడింట్లో ఏది ఉత్తమం? ఈ మూడింట్లో ఏది ఉత్తమమనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. కానీ అదంతా మీరు నిర్వహించే లావాదేవీలు, ఇన్వెస్ట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దీర్ఘకాలిక దృష్టితో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారైతే ఏ బ్రోకరేజ్ సంస్థను ఎంచుకోవాలన్న విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్లు ఎదురు చూస్తారు. ఏడాదిలో 30 నుంచి 40 లావాదేవీలకు మించవు. ఇలాంటి వారు ఫీజులు, చార్జీల గురించి ఆలోచించాల్సిన పని లేదు. వీరు చక్కని సర్వీసులు అందించే 3 ఇన్ 1 బ్రోకర్ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే కొనాలనుకున్న వెంటనే కొనుగోలు చేయొచ్చు. పెపైచ్చు విక్రయించిన వెంటనే డబ్బులు ఖాతాలోకి వస్తాయి. బ్యాంకుల్లోనే కనక డబ్బుకు భద్రత కూడా ఉంటుంది. అటు ఇన్వెస్ట్ చేస్తూ ఇటు ట్రేడింగ్ కూడా చేసేవారైతే... రెండు బ్రోకింగ్ అకౌంట్స్ను తీసుకోవటం మంచిదన్నది నిపుణుల సలహా. ఒకటి ఇన్వెస్ట్మెంట్ కోసమైతే మరొకటి ట్రేడింగ్ కోసం. అలా కాకుండా కేవలం ఇంట్రాడే ఎఫ్ అండ్ వో ట్రేడింగ్ మాత్రమే చేసేవారైతే డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలకేసి చూడొచ్చు. ఇవన్నీ కాకపోతే చెల్లించే వార్షిక ఫీజులు ఆధారంగా కూడా బ్రోకింగ్ సంస్థలకు రేటింగ్ ఇవ్వవచ్చు. ఇందుకోసం చాలామంది ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. ఏడాదిలో చెల్లించే చార్జీలు రూ. 3,000 మించకపోతే మరో ఆలోచనేదీ లేకుండా ఆ బ్రోకింగ్ సంస్థలో కొనసాగవచ్చు. అదే చెల్లించే ఫీజులు రూ. 3,000 నుంచి రూ. 6,000 మధ్యలో ఉంటే అందులో ఎఫ్ అండ్ వో లావాదేవీల సంఖ్య ఎక్కువగా ఉంటే అప్పుడు రెండో బ్రోకింగ్ సంస్థ కేసి చూడండి. ఇక రూ.6,000 పైన చెల్లిస్తుంటే తప్పకుండా డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ తలుపు తట్టండి. ట్రేడింగ్, డీమ్యాట్ మాత్రమే అయితే..! త్రీ ఇన్ ఒన్ సేవలందించే బ్యాంకులతో పోలిస్తే కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ సేవలందించే బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు చాలా తక్కువే. ఎందుకంటే వీటిలో సేవింగ్స్ ఖాతాలోంచి అప్పటికప్పుడు డబ్బులు వేయటం, ఆ ఖాతాలోకి విత్డ్రా చేసుకోవటం ఉండదు. అయితే ఒకేసారి ఏక మొత్తంలో నగదు కేటాయించి, భారీగా ట్రేడింగ్ చేసేవారికి ఛార్జీల భారం తగ్గుతుంది కనక ఇవి మంచివనే చెప్పొచ్చు. దాదాపు ప్రతి బ్రోకింగ్ సంస్థా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను (సాఫ్ట్వేర్) అందిస్తుంది కనక లావాదేవీలు నెమ్మదిగా జరగటం వంటి ఇబ్బందులేవీ ఉండవు. కొన్ని ప్రధాన సంస్థల బ్రోకింగ్ సంస్థల ఛార్జీలు.. డిస్కౌంట్ బ్రోకింగ్... పూర్తి స్థాయి సేవలందించే బ్రోకింగ్ సంస్థను ఎంచుకుంటే ట్రేడింగ్లో వచ్చే లాభాల్లో అత్యధికం వాటి జేబుల్లోకే పోతాయి. ఒకపక్క ట్రేడింగ్ లాట్ సైజులు పెరిగి ప్రీమియంలు పెరిగిపోతే... మరో పక్క వచ్చిన స్వల్ప లాభాలు బ్రోకింగ్ సంస్థలకు కట్టడానికే సరిపోవడం లేదన్నది ట్రేడర్ల మాట. అందుకే వీరు డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలవైపు చూస్తున్నారు. ఇవి సాధ్యమైనంత వరకు తక్కువ లేదా స్థిరమైన రేట్లకే ఎన్ని లావాదేవీలైనా నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తాయి. జీరోదా, ఆర్కేఎస్వీ, ఇండియన్ ట్రేడింగ్ లీగ్, ట్రేడ్జిని వంటివి ఈ రంగంలోని ప్రధాన సంస్థలు. వీటిలో చాలా సంస్థలు అకౌంట్ ఓపెనింగ్కి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. వీటిల్లో ఉండే ప్రధానమైన లోపం... లో బ్యాండ్విడ్త్. దీనివల్ల మార్కెట్లు బాగా పెరిగిన, లేదా పడిన సమయాల్లో పొజిషన్లను వదిలించుకోవడం కష్టమవుతుంది. మిగిలిన పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలతో పోలిస్తే కస్టమర్ సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వివిధ సంస్థల ఛార్జీలివీ... తక్కువ చార్జీలకే సేవలందిస్తున్న సంస్థలు డిస్కౌంట్ బ్రోకరేజీలుగా రంగంలోకి త్రీ ఇన్ వన్ సేవలకు చార్జీలూ ఎక్కువే ట్రేడింగ్ చేసేవారికి కొన్ని బెటర్; ఇన్వెస్టర్లకైతే ఇంకొన్ని మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర్నుంచి ముగిసే వరకు ఏదో ఒక షేరు కొనటమో... అమ్మటమో చేస్తూనే ఉంటాడు సుబ్బు. రూపాయి, బంగారం, ఇతర కమోడిటీలు... ఇలా దేన్నీ వదలడు. అన్నిట్లోనూ ట్రేడింగ్ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మార్కెట్లు కదులుతున్న పరిమిత శ్రేణిని కూడా ట్రేడింగ్కు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ఈ భారీ ఒడిదుడుకులను క్యాష్ చేసుకుంటూ లాభం జేబులో వేసుకుంటున్నాడు. కానీ తీరా బ్యాంక్ బ్యాలెన్స్లో చూస్తే... ఆ స్థాయి లాభాలు కనిపించడం లేదు. దీనికి కారణమేంటో తెలుసా..? వస్తున్న లాభాలన్నీ బ్రోకరేజ్ చార్జీలు చెల్లించడానికే సరిపోతున్నాయి. ఒక్క సుబ్బు మాత్రమే కాదు. రోజూ భారీగా ట్రేడింగ్ చేసే వారిలో చాలా మంది పరిస్థితి ఇదే. అందుకే ఇలాంటి వారిని ఆకర్షించడానికిపుడు అనేక డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలు పుట్టుకొచ్చాయి. అసలీ డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలంటే ఏంటి? వీటిలో ఉండే లాభనష్టాలేంటి? ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో ఎవరికి ఎలాంటి బ్రోకింగ్ సంస్థలు బాగుంటాయి? ఎవరి దగ్గర డీమ్యాట్ ఖాతా తెరిస్తే బెటర్? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... ఫీజులు పరిశీలించుకోండి... కొన్ని ప్రధాన బ్రోకింగ్ సంస్థల ఫీజులు, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఆయా బ్రోకరేజ్ సంస్థలు వసూలు చేసే సగటు చార్జీలు. ఖాతాదారులు నిర్వహించే లావాదేవీల స్థాయిని బట్టి ఇవి మారిపోతుంటాయి కూడా. వీటిల్లో లాభనష్టాలివీ... పై బ్యాంకులకు సంబంధించిన ఖాతాల్లో ట్రేడింగ్ చేసేవారిని సంప్రదించినపుడు వివిధ రకాల వ్యాఖ్యలు వినిపించాయి. ఐసీఐసీఐ వరకూ చూస్తే సాఫీగా ట్రేడింగ్ చేసుకునే ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు కూడా ఇది సరైన ప్లాట్ఫామ్గానే చెప్పాలి. ఎందుకంటే సైట్నే విగేషన్, నగదు లావాదేవీల వేగం వంటివన్నీ దీన్లో బాగుంటాయి. కాకపోతే ఛార్జీలు మాత్రం కాస్త ఎక్కువ. పెపైచ్చు ట్రేడింగ్ చేసేవారు మొత్తం సొమ్మును ట్రేడింగ్కు కేటాయించి, సేవింగ్స్ ఖాతాలో కనీస నగదు నిల్వలుంచని పక్షంలో వారికి ఛార్జీల బాదుడు మామూలుగా ఉండదు. ట్రేడింగ్లో సంపాదించేదంతా ఈ ఖర్చులకే పోతుందని వాపోయిన వారూ ఉన్నారు. హెచ్డీఎఫ్సీది కూడా ఇదే గొడవ. సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వలు ఉంచాల్సిన అవసరం దీన్లోనూ ఉంది. కోటక్ సెక్యూరిటీస్ది మామూలుగానే మిగతా వాటితో పోలిస్తే కాస్త ఎక్కువ ఛార్జీల వ్యవహారం. యాక్సిస్ బ్యాంకుకు సంబంధించి ఛార్జీలు కాస్త తక్కువే అయినా... ఇది ట్రేడింగ్ చేసేవారికి ఎంతమాత్రం పనికిరాదు. ఎందుకంటే దీన్ని యాక్సిస్ చేసుకోవటమే చాలా స్లో కనక... ఒకసారి షేర్లు కొన్ని కొన్నాళ్ల పాటు వదిలేసేవారికైతే మంచిదనే చెప్పొచ్చు. ఎస్బీఐ కూడా ఇలాంటి సేవలందిస్తున్నా... యాక్సిస్ మాదిరే ట్రేడింగ్ చేసేవారికి చాలా ఇబ్బందని చెప్పొచ్చు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
నెలకు రూ.15,000 పెన్షన్ కావాలంటే..?
గత కొంత కాలం నుంచి యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఫండ్కు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా ? లేకుంటే ఫండ్ నుంచి వైదొలగమంటారా? తగిన సూచనలివ్వండి? - దేవేందర్, గుంటూరు యాక్సిస్ లాంగ్టర్మ్ ఫండ్ వంటి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్కు తప్పనిసరిగా లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఇన్వెస్టర్లు ఈ ఫండ్ నుంచి తప్పనిసరిగా వైదొలగాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీకు అవసరం లేనంత కాలం, ఈ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నంత కాలం మీరు ఫండ్లో ఎలాంటి అనుమానాలు లేకుండా కొనసాగవచ్చు. ఐదేళ్ల తర్వాత నాకు నెలకు రూ.15,000 పెన్షన్ కావాలి. ఈ పెన్షన్ కనీసం పదేళ్ల పాటు అందాలి. ఇలా పొందాలంటే నేను ఏ స్కీమ్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? - సత్యనారాయణ, విజయవాడ మీకు నెలకు రూ.15,000 పెన్షన్ కావాలంటే రూ.20 లక్షల నిధిని ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంక్ డిపాజిట్లు, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ట్యాక్స్-ఫ్రీ బాండ్లు వంటివి సురక్షితమైన, భద్రమైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలు. ఇవి అధిక రాబడులను ఇవ్వలేవు. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ మాత్రం ఏడాదికి 9.3 శాతం రాబడిని ఇస్తుంది. మిగిలినవి ఏడాదికి 7.5 శాతం వరకూ రాబడులను ఇస్తాయి. ఇక మీరు ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఒకటి లేదా రెండు బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోండి. వీటిల్లో నెలకు రూ.24,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఈ బ్యాలెన్సెడ్ ఫండ్స్ కనీసం ఏడాదికి 12 శాతం రాబడులను ఇస్తాయని అంచనాలతో మీకు మీరు కోరుకున్న పెన్షన్ నెలవారీ పొందగలరు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ను ఎంచుకోవచ్చు. కెనరా రెబెకొ బ్యాలెన్స్డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్డ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా ప్రుడెన్షియల్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ బ్యాలెన్స్డ్ ఫండ్, టాటా బ్యాలెన్స్డ్ ఫండ్ మొదలైనవి. మూడేళ్ల క్రితం ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.68,000 చొప్పున ఇప్పటికే మూడేళ్ల ప్రీమియం చెల్లించాను. ఈ పాలసీ టర్మ్ పదేళ్లు. సమ్ అస్యూర్డ్ రూ.10 లక్షలు. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? కొనసాగమంటారా? ఒకవేళ సరెండర్ చేస్తే నాకు ఎల్ఐసీ నుంచి ఎంత వస్తుంది? ఈ సరెండర్ డబ్బులను ఎలా ఇన్వెస్ట్ చేయాలి? - సతీష్, హైదరాబాద్ ఎల్ఐసీ జీవన్ఆనంద్ అనేది ఎండోమెంట్ ఎష్యూరెన్స్, హోల్ లైఫ్ ప్లాన్ల సమ్మేళనంగా రూపొందిన పాలసీ. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బీమా మొత్తం నామినీకి వస్తుంది. లేకుంటే పాలసీ టర్మ్ పూర్తయితే మెచ్యూరిటీ ప్రయోజనాలు పాలసీ తీసుకున్న వ్యక్తికి లభిస్తాయి. టర్మ్ పూర్తయిన తర్వాత పాలసీదారుడు మరణిస్తే, నామినీకి డెత్ బెనిఫిట్స్ లభిస్తాయి. వ్యయాల వివరాలను ఈ పాలసీ వెల్లడించడం లేదు. మూడేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేయాలనుకుంటే, మీరు చెల్లించిన అన్ని ప్రీమియమ్ల (మొదటి ప్రీమియం మినహాయించి) మొత్తంలో 30 శాతం గ్యారంటీడ్ సరెండర్ వాల్యూగా చెల్లిస్తారు. మీ కేసులో సరెండర్ విలువ రూ.40,800గా వస్తుంది. ఎల్ఐసీ సంస్థ ప్రత్యేకమైన సరెండర్ విలువను చెల్లించవచ్చు. ఈ పాలసీని సరెండర్ చేసిన తర్వాత వచ్చిన మొత్తాలను మొదట్లో బ్యాలెన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందగలరు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో ఏ కేటగిరి డెట్ ఫండ్స్(బాండ్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్)లో ఇన్వెస్ట్ చేయాలి? - జాన్సన్, సికింద్రాబాద్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వంటి సంఘటనల ఆధారంగా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కాలాన్ని పరిగణనలోకి తీసుకొని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని రోజులు, ఒక వారానికి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, లిక్విడ్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. కొన్ని నెలలు లేదా ఏడాది పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.. మూడు నుంచి ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైనమిక్ బాండ్ ఫండ్లను ఎంచుకోండి. -
‘సిప్’ ప్రారంభించడం ఎలా...?
నేను ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) విధానంలో 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సిప్ విధానాన్ని ఎలా ప్రారంభించాలి? మంచి ప్లాన్ను ఎలా ఎంచుకోవాలి? - సైరాబాను, హైదరాబాద్ మీరు సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్లో 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ను మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం పరిశీలించవచ్చు. తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ-ఓరియంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. ఈక్విటీ, డెట్ల సమ్మేళనంగా ఈ స్కీమ్స్ను రూపొందిస్తారు. అందుకని ఇవి ఈక్విటీ స్కీమ్స్ కంటే తక్కువ ఒడిదుడుకులమయంగా ఉంటాయి. మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇక సిప్ను ప్రారంభించడం చాలా సులువైన విషయం. మీరు చేయాల్సిందల్లా మ్యూచువల్ ఫండ్ స్కీమ్కు దరఖాస్తు చేసేటప్పుడు సిప్ ఆప్షన్పై టిక్ చేయండి. ఇక మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచిప్రతి నెలా నిర్ణీత మొత్తం ఆ స్కీమ్లోకి డెబిట్ అయ్యేలా బ్యాంక్కు ఆదేశాలు ఇస్తే సరి. సిప్ ప్రారంభమవుతుంది. నేను ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ పెర్ఫామర్ యులిప్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.85,000 చొప్పున ఇప్పటికే మూడు వార్షిక ప్రీమియమ్లు చెల్లించాను. నేను చెల్లించిన ప్రీమియమ్ల విలువ రూ.2.55 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం ఈ ఫండ్ విలువ రూ.2.94 లక్షలుగా ఉంది. ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేదు. లాకిన్ పీరియడ్ పూర్తయిన వెంటనే ఈ పాలసీని సరెండర్ చేద్దామనుకుంటున్నాను. అందుకని ఎలాంటి ప్రీమియమ్లు చెల్లించాలనుకోవడం లేదు. నేను చెల్లించిన ప్రీమియమ్లన్నింటికీ, సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందాను. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా? ఒక వేళ ఈ పాలసీని సరెండర్ చేస్తే నాపై పన్ను భారం అధికంగా ఉంటుందా? - సూర్య శేఖర్, విశాఖపట్టణం యులిప్లకు సాధారణంగా లాన్ ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. ఈ లాకిన్ పీరియడ్(ఐదేళ్లకు) ముందే ఈ పాలసీని సరెండర్ చేస్తే, ఇంతకు ముందు మీరు పొందిన పన్ను మినహాయింపులన్నింటినీ మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీ సరెండర్ విలువపై టీడీఎస్ కోత వేస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ను, బీమా అవసరాలను వేర్వేరుగా చూడండి. బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్న టర్మ్ ప్లాన్ తీసుకోండి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(ఎస్ఐపీ-సిప్) అంటే ఏమిటి ? రోజువారీ, వారం వారీ, నెలవారీ- ఏ సిప్ను అనుసరిస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయి? - జార్జ్, గుంటూరు నిర్ణీత కాలానికి నిర్ణీత మొత్తంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)గా వ్యవహరిస్తారు. ఈ సిప్ విధానం వల్ల మార్కెట్ ఒడిదుడుకులను అధిగమించవచ్చు. దీర్ఘకాలంలో గరిష్ట రాబడులను పొందవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం రూ. 2 లక్షల రేంజ్లో ఉంటే నెలవారీ సిప్ను ఎంచుకుంటే సముచితంగా ఉంటుంది. రోజువారీ, వారం వారీ సిప్ను అనుసరిస్తే ఒక నెలలో లావాదేవీలు అధికంగా ఉండి, ఇన్వెస్ట్మెంట్స్ మదింపు, గణన చాలా గందరగోళంగా ఉం టుంది. మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా కష్టసాధ్యమైన పనే. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటేనే రోజువారీ, వారం వారీ సిప్ విధానాన్ని అనుసరించాలి. అయితే దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, రోజువారీ అయినా, వారం వారీ అయినా, నెలవారీ- ఏ సిప్ విధానాన్ని అనుసరించినా, రాబడుల్లో చెప్పుకోదగ్గ తేడా ఉండదని చెప్పొచ్చు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈపీఎఫ్వో ఈటీఎఫ్ పెట్టుబడులు రూ.2,322 కోట్లు
న్యూఢిల్లీ: ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్’ (ఈపీఎఫ్వో) ఈఏడాది అక్టోబర్ నాటికి రూ.2,322 కోట్లను ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసింది. ఈపీఎఫ్వో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్లను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈపీఎఫ్వో ఆగస్ట్-అక్టోబర్ మధ్య కాలంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రూ.2,322 కోట్లను క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టింది. సెన్సెక్స్ షేర్లలో రూ.588 కోట్లను, నిఫ్టీ షేర్లలో రూ.1,734 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. -
త్వరిత పొదుపుతో లక్ష్య సాధన
పిల్లల్ని సమాజంలో ఎవరికీ తక్కువ కాకుండా పెంచడానికి తాపత్రయపడతాం. ఉన్నత చదువులు చదివించాలని కలలు కంటాం. ఇలా చేయాలంటే దానికి చాలా మొత్తంలో డబ్బులు అవసరమౌతాయి. ఈ విషయం మీద అవగాహన వున్నపుడు మనం పిల్లల భవిష్యత్తు కోసం ఎంత వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్చేయడం ప్రారంభిస్తాం. నానాటికీ పెరుగుతున్న చదువుల వ్యయాలు... నా చిన్నప్పుడు ఒక పెన్సిల్ ధర రూపాయి ఉంటే ఇప్పుడు అదే పెన్సిల్ ధర ఐదు రూపాయలుగా ఉంది. అలాగే పిల్లలు ఎదుగుతున్నకొద్దీ చదువుల ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో చదువుల ఖర్చు పెరుగుతూ వస్తోంది. మెడికల్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు చేయాలంటే ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్లో 2005-07లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే రూ.3.16 లక్షలు ఖర్చవుతే, ఇప్పుడు అదే ప్రోగ్రామ్ చేయాలంటే రూ. 18.5 లక్షలు అవుతోంది. అంటే ఆ ప్రోగ్రామ్ చేయడానికి అయ్యే ఖర్చు పదేళ్లలో ఆరు రెట్లు పెరిగింది. చదువుల ఖర్చు వచ్చే రోజుల్లో కూడా పెరుగుతూనే ఉంటుంది. వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఏదైనా ఒక కోర్సు చేయడానికి రూ. 15 లక్షలు ఖర్చు అవుతుంటే.. అదే కోర్సు చేయడానికి 18 ఏళ్ల తర్వాత రూ.43 లక్షలు కావాల్సిన పరిస్థితి రావచ్చు. సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే విద్యారంగంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. మీరు విద్యా రుణం తీసుకుంటే మేలేకానీ అది మీ అవసరాలన్నింటినీ కవర్ చేస్తే బాగుంటుంది. అలాగే పెద్ద మొత్తంలో లోన్ పేమెంట్ కట్టడం కూడా కొన్ని సార్లు కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలు పుట్టిన దగ్గరి నుంచి వారి చదువు కోసం సేవింగ్ చేయడం ప్రారంభిస్తే చాలా మంచిది. అప్పుడే పెరుగుతున్న ఖర్చులను భరించగలుగుతాం. పెళ్లి ఖర్చు సంగతేంటి? మీరు మీ పిల్లలకు ఘనంగా పెళ్లి చేయాలని అనుకుంటే మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇప్పుడు పెళ్లి చేయడానికి రూ.20 లక్షలు ఖర్చయితే అదే 18 ఏళ్ల తర్వాత పెళ్లి చేయాలంటే రూ.57 లక్షలు (వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటే) కావాలి. కాబట్టి త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే త్వరపడాలి.. మీ పిల్లల చదువుకు, పెళ్లికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమౌతాయి. దీని కోసం మీరు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మీకు ఐదేళ్లలో రూ. 40 లక్షలు కావాలంటే మీరు వార్షికంగా 10 శాతం రాబడినిచ్చే సాధనాల్లో ఇప్పుడు రూ.25 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే 10 శాతం రాబడితో మీరు 18 ఏళ్లలో రూ.40 లక్షలు పొందాలంటే నెలకు రూ.6,700 ఇన్వెస్ట్ చేస్తూ రావాలి. ఈ విధంగా నెలకు రూ.6,700 ఇన్వెస్ట్ చేస్తే మీరు పదేళ్ల తర్వాత రూ.13.72 లక్షలు పొందుతారు. తర్వాతి 8 ఏళ్లల్లో కూడా అదేతరహా పొదుపు కొనసాగిస్తే ఈ మొత్తం రూ.40.23 లక్షలు అవుతుంది. - అనీశ్ ఖన్నా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్,ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ -
తెలంగాణలో పెట్టుబడులు కోరనున్న కేసీఆర్
-
ఏడేళ్ల గరిష్ట స్థాయికి ఫండ్స్ ఈక్విటీ పెట్టుబడులు
సానుకూల సెంటిమెంట్ కారణం... న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఈ ఏడాది ఏప్రిల్లో రూ.7,600 కోట్లు ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. ఏడేళ్ల కాలంలో ఇదే గరిష్ట నికర పెట్టుబడికావడం విశేషం. ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మెరుగుపడుతుండడం, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతుండడం.. వీటన్నింటి ఫలితంగా సానుకూలంగా మారుతున్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ, సెబీ వెల్లడించిన గణాంకాల ప్రకారం... గత నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థల నికర పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో రూ.7,618 కోట్లుగా ఉన్నాయి. 2008, జనవరి తర్వాత ఇదే అత్యధిక మొత్తం. ఆ నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థల నికర పెట్టుబడులు రూ.7,703 కోట్లుగా ఉన్నాయి. కాగా గత ఏడాది ఏప్రిల్లో స్టాక్ మార్కెట్ నుంచి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రూ.2,698 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నాయి. ఇదే జోరూ ఈ ఆర్థిక సంవత్సరం కూడా... ఇక గత నెలలో డెట్మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ సంస్థల నికర పెట్టుబడులు రూ.28,650 కోట్లకు చేరాయి. గత ఏడాది కాలంగా ఈక్విటీ మార్కెట్పై మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఆసక్తి పెంచుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆరేళ్లలో ఇదే తొలి నికర పెట్టుబడులు పెట్టిన ఏడాది కావడం విశేషం. ఈక్విటీ మార్కెట్లో ఈ భారీ పెట్టుబడుల కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఈక్విటీ, డెట్ మార్కెట్లలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇదే విధంగా జోరుగానే ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. -
ఫండ్ డివిడెండులో పన్ను కోత ఉంటుందా?
నేను సుందరం గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే ఈ ఫండ్ ఒక్కో యూనిట్కు రూ.1 డివిడెండ్ను ప్రకటించింది. ఆ ప్రకారం నాకు రూ.1,042 డివిడెండ్ లభించాలి. కానీ నాకు రూ.756.45 డివిడెండ్ మాత్రమే వచ్చింది. ఈ విషయమై సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థను సంప్రదించాను. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) పోగా మిగిలిన మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించామని ఆ సంస్థ వెల్లడించింది. నేను చాలా సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ల్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాను. ఎలాంటి మినహాయింపులు లేకుండా పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు నాకు డివిడెండ్లు చెల్లించేవి. డీడీటీ కోత నాకు ఇదే మొదటిసారి. ఇప్పుడు నేను ఏం చేయాలి? - సాదిక్ ఆలీ, నిజామాబాద్ సుందరం గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్ సంస్థ చేసినది సరైనదే. ఈక్విటీ యేతర మ్యూచువల్ ఫండ్లు డివిడెండ్లు చెల్లిస్తే, వీటిపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) తప్పనిసరి. అయితే ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్స్ డివిడెండ్లపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీరు ఇన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకూ మీకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) పడలేదంటే మీ పోర్ట్ఫోలియోలో ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉండి ఉండాలి. మొదటిసారిగా ఈక్విటీయేతర ఫండ్లో ఇన్వెస్ట్ చేసుంటారు. దీంతో డీడీటీ మీకు కొత్తగా అనిపిస్తుంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్ డీడీటీ మదింపు గత ఏడాది బడ్జెట్ నుంచి మారింది. గతంలో ఏదైనా సంస్థ రూ.100 డివిడెండ్ను ప్రకటిస్తే, రూ.128.3 డివిడెండ్ చెల్లింపుల కోసం కేటాయించేది. రూ.100 ఇన్వెస్టర్కు, రూ.28.3 పన్నులుగా చెల్లించేది. ఇలా కాకుండా స్థూల డివిడెండ్ మొత్తంపై డీడీటీని చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీని ప్రకారం ఏదైనా డివిడెండ్ సంస్థ రూ.100 డివిడెండ్ను ప్రకటిస్తే, దానిపై 28.33 శాతం డీడీటీని ప్రభుత్వానికి, మిగిలిన దానిని ఇన్వెస్టర్కు మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెల్లిస్తున్నాయి. నా వయస్సు 38 సంవత్సరాలు. వారం క్రితం ఈక్విటీ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తమే రిడీమ్ చేశాను. మరో మూడు నెలల తర్వాత కానీ వీటి అవసరం నాకు ఉండదు. అప్పటి వరకూ ఈ పెద్ద మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారా? లేక డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమంటారా ? డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అలా అయిన పక్షంలో కొన్ని ఉత్తమమైన డెట్ మ్యూచువల్ ఫండ్స్ను సూచించండి. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. - పవన్, సికింద్రాబాద్ కార్పొరేట్ బాండ్లు, గిల్ట్ల్లో స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేసే షార్ట్ టెర్మ్ డెట్ ఫండ్స్ను ఎంచుకోండి. పన్ను ప్రయోజనాల విషయానికొస్తే ఫిక్స్డ్ డిపాజిట్లకు, డెట్ ఫండ్స్కు తేడా ఏమీ లేదు. వీటిపై వచ్చే రాబడులను మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ శ్లాబ్ననుసరించి పన్ను విధిస్తారు. పన్ను విషయాల్లో కాకుండా కొన్ని విషయాల్లో డెట్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకంటే మెరుగైనవి. డెట్ ఫండ్స్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకోవచ్చు. ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. అదే ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికొస్తే, వాటిని మధ్యలో ఉపసంహరించుకుంటే కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని డెట్ ఫండ్స్ 7.5 శాతం నుంచి 10 శాతం రేంజ్లో రాబడులు ఇస్తాయి. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి పరిశీలించదగ్గ కొన్ని షార్ట్ టెర్మ్ డెట్ ఫండ్స్- పీర్లెస్ షార్ట్టెర్మ్, సుందరం సెలెక్ట్ షార్ట్టెర్మ్ డెట్ అసెట్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్ట్రా షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్, టారస్ ఆల్ట్రా షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్కమ్ ఫండ్లు. నేను ఇటీవలనే ఎస్బీఐ ఎఫ్ఎంసీజీ ఫండ్లో రూ.లక్ష వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇది మంచి నిర్ణయమేనా? -మేఘమాల, విజయవాడ ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ఇతర రంగాలు ఏమంత మంచి పనితీరు కనబరచకపోయినప్పటికీ, ఎఫ్ఎంసీజీ రంగం మాత్రం మంచి వృద్ధినే సాధించింది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో ఎంత మంచి రాబడి ఇస్తున్న మ్యూచువల్ ఫండ్లోనైనా ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఏదైనా ప్రత్యేక రంగానికి చెందిన ఫండ్ అయితే అది అసలు మంచి నిర్ణయమే కాదు. అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేది వివిధీకరణ ప్రయోజనాలు పొందడానికే. అందుకని మీ పెట్టుబడులను కనీసం మూడు విభిన్నమైన మ్యూచువల్ ఫండ్స్కు విస్తరించండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని(సిప్) అనుసరిస్తే మంచి ప్రయోజనాలు పొందగలరు. -
పాల వ్యాపారంలోకి మహీంద్రా గ్రూప్
రూ. 750 కోట్లతో బ్రాండ్ కొనుగోలు యోచన ముంబై: కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్లో భాగమైన మహీంద్రా అగ్రి బిజినెస్... పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగా ఏదైనా ప్రముఖ బ్రాండ్ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికోసం రూ. 150-750 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని మహీంద్రా అగ్రిబిజినెస్ వర్గాలు తెలిపాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ బుధవారం నిర్వహించిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వివరించాయి. ప్రీమియం ఉత్పత్తులపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వ్యవసాయ పరికరాల తయారీలో పెద్ద సంస్థల్లో ఒకటి కావడంతో పాటు అగ్రి బిజినెస్లోనూ గణనీయంగా కార్యకలాపాలు ఉన్నందున డెయిరీ విభాగంలోకి కూడా ప్రవేశించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్లో భాగమైన మహీంద్రా శుభ్లాభ్ సర్వీసెస్ సంస్థ మహారాష్ట్రలో రైతులతో కలిసి కాంట్రాక్ట్ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆయన వివరించారు. ఈ సంస్థ అత్యధికంగా ద్రాక్షలు ఎగుమతి చేస్తోందని, రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాలు కూడా అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం దేశీ డెయిరీ పరిశ్రమ రూ. 3 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఇందులో దాదాపు 80 శాతం మార్కెట్ అసంఘటితంగానే ఉంది. -
ఆదాయపు పన్ను మినహాయింపునకు ఆఖరి అవకాశాలు!
మార్చి వచ్చేస్తోంది. వచ్చేనెల 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. నిజానికి ఆదాయపు పన్ను కాస్త తగ్గించుకోవాలన్నా... దానికి తగ్గట్టు ఆదా చెయ్యాలన్నా ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే చెయ్యాలి. నెలజీతంపై ఆధారపడిన ఉద్యోగులైనా, నికర ఆదాయంపై ఆధారపడే వృత్తి నిపుణులైనా అప్పటికప్పుడు డబ్బులు తేవాలంటే కష్టం కనక ఏడాది ఆరంభం నుంచే ప్లానింగ్ చేయాలి. ఏ నిపుణుడు చేసే సూచనైనా ఇదే. ‘సాక్షి’ ప్రాఫిట్ పేజీని రెగ్యులర్గా చూసేవారికి సెక్షన్ 80సీ కింద ఈ ఏడాది రూ.1.5 లక్షల వరకు మినహాయింపు చూపించవచ్చన్న విషయంతో పాటు ఏ సెక్షన్ కింద ఎంత పన్ను మినహాయింపు లభిస్తుందనేది కూడా సవివరంగా తెలుసు. అయితే కొందరు మాత్రం ‘తరవాత చూద్దాంలే’ అనే వైఖరితో ఏడాది చివరిదాకా ఎలాంటి ప్లానింగూ చెయ్యరు. మరి అలాంటి వాళ్ల సంగతేంటి? వాళ్లకు ఆఖరి క్షణంలో పన్ను భారం తగ్గించుకునే మార్గాలేమైనా ఉన్నాయా? ఉంటే ఆ మార్గాలేంటి? ఇదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు ⇒ వడ్డీ కూడా 8.5 నుంచి 9.2 శాతం వరకూ గిట్టుబాటు ⇒ ఈఎల్ఎస్ఎస్ మినహా అన్నిటికీ రిస్క్ తక్కువే ⇒ మార్కెట్లు బాగున్నపుడు ఈఎల్ఎస్ఎస్పై అధిక రాబడి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కేంద్ర ప్రభుత్వ మద్దతున్న ఈ పథకాన్ని 1968లో ప్రవేశపెట్టారు. ఏ వయసు వారైనా దగ్గర్లోని బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ ఖాతా తెరవవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒక ఖాతా మాత్రమే ఉండాలి. గరిష్టంగా ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలకు మించి డిపాజిట్ చెయ్యకూడదు. ఇలా చేసిన మొత్తంపై పన్ను మినహాయింపూ ఉండదు. వడ్డీ కూడా రాదు. ఏటా మార్చి 31నాటికి ఉండే మొత్తంపై వడ్డీ లెక్కించి చెల్లిస్తారు. 15 ఏళ్ల వ్యవధి తరవాత కూడా కొనసాగించాలనుకుంటే ఐదేళ్ల చొప్పున పెంచుకోవచ్చు. దీనిపై రుణాలు తీసుకోవచ్చు. ఆరేళ్ల తరవాత కొంత మొత్తాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏటా డిపాజిట్ చేయటం తప్పనిసరి. ఏ ఏడాదైనా కనీస మొత్తం డిపాజిట్ చెయ్యని పక్షంలో ఖాతాను డీ-యాక్టివేట్ చేస్తారు. మళ్లీ యాక్టివేట్ చేయాలనుకుంటే ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. మామూలు పీఎఫ్ లేనివారికి రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో నిధిని అందుకోవటానికి ఇది బాగా పనికొస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వ మద్దతున్న ఈ సేవింగ్స్ సర్టిఫికెట్లను దగ్గర్లోని ఏ పోస్టాఫీసులోనైనా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్లు, పదేళ్ల వ్యవధికి లభిస్తాయి. మనం కొనేటపుడే ఆ సర్టిఫికెట్ తాలూకు మెచ్యూరిటీ విలువ దానిపై ఉంటుంది. ఉదాహరణకు సర్టిఫికెట్ విలువ రూ.1000 ఉందనుకుంటే దానికన్నా తక్కువ మొత్తానికే (వ్యవధిని బట్టి) దాన్ని విక్రయిస్తారు. మెచ్యూరిటీ గడువు తీరాక రూ.1000 చెల్లిస్తారన్న మాట. దీనిపై కూడా రుణాలు లభిస్తాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశ నిర్మాణానికి నిధులు అవసరం గనక 1950లలో కేంద్ర ప్రభుత్వం వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నిజానికి ఐదేళ్లు గానీ, పదేళ్లుగానీ వరసగా ఈ సర్టిఫికెట్లు కొనుగోలు చేస్తూ వెళ్లినవారు ఆ వ్యవధి తరవాత... ఆ వచ్చే సొమ్మునే మళ్లీ రీ-ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయపు పన్ను మినహాయింపుల్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రూ.లక్ష చొప్పున వరసగా ఐదేళ్లు ఇన్వెస్ట్ చేసినవారు... ఆరో ఏడాది నుంచి వచ్చే మెచ్యూరిటీ సొమ్మునే తిరిగి సర్టిఫికెట్లపై పెట్టుబడిగా పెట్టొచ్చన్న మాట. అలా చేస్తే కొత్తగా పన్ను ఆదా కోసం వేరే డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉండదు. పెపైచ్చు మెచ్యూర్ అయినప్పుడల్లా చేతికీ కొంత సొమ్ము వస్తుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కేంద్రం 2004లో ఆరంభించిన ఈ పథకాన్ని దగ్గర్లోని పోస్టాఫీసులో గానీ, జాతీయ బ్యాంకుల్లో గానీ ఆరంభించవచ్చు. 60 ఏళ్లు దాటిన వారెవరైనా ఈ పథకానికి అర్హులే. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినవారు 55 ఏళ్లకే దీన్ని ఆరంభించవచ్చు. రక్షణ రంగ ఉద్యోగులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా ఆరంభించే అవకాశం ఉంది. దీనికి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉన్నా... స్వల్ప పెనాల్టీతో ఏడాది తరవాత క్లోజ్ చేసే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి దీనిపై వడ్డీ రేటును సవరించారు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏ షెడ్యూల్డ్ బ్యాంకులోనైనా... ఎక్కడైనా ఐదేళ్ల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే పన్ను రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుతం వివిధ బ్యాంకులు 8.5 శాతం నుంచి 9 శాతం దాకా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకును బట్టి ఈ వడ్డీ మారుతుంది. ఈ వడ్డీ మూడు నెలలకోసారి కాంపౌండింగ్ అవుతుంది. ఈ లెక్కన ఉదాహరణకు రూ.లక్ష గనక డిపాజిట్ చేస్తే 8.5% వడ్డీ రేటుతో ఐదేళ్ల తరవాత రూ.1.52 లక్షలవుతుంది. అదే 8.75 వడ్డీ శాతం దగ్గరైతే మరో రూ.1.54 లక్షలవుతుంది. 9 శాతమైతే మరో 2వేలు అదనంగా వస్తుంది. అయితే ఐదేళ్ల కాలానికి 8.4 వడ్డీ శాతంతో పోస్టాఫీసు ఆఫర్ చేస్తున్న టైమ్ డిపాజిట్ పథకం కూడా ఈ కోవలోకే వస్తుంది. వీటిని గడువు తీరకముందే ప్రీక్లోజర్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అలా చేస్తే పన్ను ప్రయోజనాలను, కొంత వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ మ్యూచ్వల్ ఫండ్లు ఆఫర్ చేసే ఈ పథకాలన్నీ ఓపెన్ ఎండెడ్వే. అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పథకంలో చేరొచ్చన్న మాట. వీటిలో మనం పెట్టే పెట్టుబడుల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు గనక మనకు వచ్చే రాబడులు కూడా మార్కెట్లు బావుంటేనే బాగుంటాయి. ఇవి కూడా డైవర్సిఫైడ్ ఫండ్ల లాంటివే. అంటే ఏదో ఒక రంగానికో, ఒక ఇండెక్స్కో పరిమితం కాకుండా ఫండ్ మేనేజర్ సూచించిన స్టాక్స్లో పెట్టుబడి పెడతారన్న మాట. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టినా గరిష్టంగా రూ.లక్ష వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది. పెపైచ్చు వీటిపై రుణాలు రావు. మూడేళ్లకు ముందు ఎగ్జిట్ కావటం కూడా కుదరదు. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి పెట్టేవారు ఎలాంటి ఫండ్లను ఎంచుకోవాలనే విషయమై నిపుణులు కొన్ని సూచనలు చేస్తుంటారు. అవి... ⇒ ఏజెంట్ దేన్లో చెబితే దాన్లో ఇన్వెస్ట్ చేయకుండా ట్రాక్ రికార్డు బాగున్న ఫండ్లను చూసుకోవాలి. వాటి మూడేళ్ల ట్రాక్ రికార్డును చూసి... టాప్-3 ఫండ్లలో నచ్చినదాన్ని ఎంచుకుంటే మంచిది. అయితే గతంలో ఉన్న పనితీరు భవిష్యత్తులోనూ ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదండోయ్!! అయినా సరే ఇదే ఉత్తమ మార్గం. ⇒ మూడేళ్ల కన్నా తక్కువ ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్ల జోలికి వెళ్లకపోవటమే బెటర్. ⇒ రూ.300 కోట్ల కన్నా తక్కువ ఆస్తులున్న ఫండ్లను కూడా వదిలిపెట్టడమే మంచిది. ఆయా ఫండ్ల ఫ్యాక్ట్ షీట్ చూస్తే దాని ఆస్తులెంత ఉన్నాయనేది తెలుస్తుంది. -
వైజాగ్ లారస్ ల్యాబ్స్లో వార్బర్గ్ పింకస్ పెట్టుబడి
రూ. 550 కోట్లతో మైనారిటీ వాటా ముంబై: విశాఖపట్టణం కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఐ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్లో గ్లోబల్ పీఈ సంస్థ వార్బర్గ్ పింకస్ సుమారు రూ. 550 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తద్వారా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఫిడిలిటీగ్రోత్ పార్ట్నర్స్, ఫిడిలిటీ బయోసెన్సైస్ జాబితాలోకి చేరింది. ఈ రెండు కంపెనీలూ 2012లో లారస్ ల్యాబ్స్లో ఇన్వెస్ట్ చేశాయి. కాగా, వార్బర్గ్ పెట్టుబడి విషయాన్ని లారస్ పేర్కొన్నప్పటికీ ఎంత వాటాను కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు. కంపెనీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రెడియంట్స్(ఏపీఐలు)ను అభివృద్ధి చేయడంతోపాటు, తయారు చేస్తుంది. యాంటీరిట్రోవైరల్(ఏఆర్వీ), కేన్సర్(అంకాలజీ), గుండె సంబంధిత జబ్బులు(కార్డియోవాస్కులర్), చక్కెర వ్యాధి చికిత్స(యాంటీ డయాబెటిక్) తదితర విభాగాల ఏపీఐలను లారస్ తయారు చేస్తోంది. వీటితోపాటు న్యూట్రాస్యూటికల్స్ తదితరాలను సైతం తయారు చేస్తుంది. వీటిని దేశ, విదేశీ జనరిక్ ఫార్మా దిగ్గజాలకు అందిస్తుంది. ఏపీఐలకు తోడు వేగంగా వృద్ధి చెందుతున్న కాంట్రాక్ట్ తయారీ బిజినెస్లోనూ కంపెనీకి ప్రవేశముంది. 2008లో కార్యకలాపాలు షురూ కంపెనీ 2008లో పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను మొదలుపెట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14) ముగిసేసరికి రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. వృద్ధి బాటలో ఉన్న ప్రస్తుత దశలో వార్బర్గ్తో జతకట్టడం సంతోషదాయకమని కంపెనీ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చవా పేర్కొన్నారు. చౌక ధరల్లో ఉత్పత్తులు, సర్వీసులను అందించేందుకు వీలుగా కొత్తదనం, తయారీ నైపుణ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. తద్వారా కొత్త విభాగాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. వార్బర్గ్కున్న డొమైన్ నైపుణ్యం, గ్లోబల్ నెట్వర్క్లను వినియోగించుకోవడం ద్వారా కొత్త మార్కెట్లలో ప్రవేశిస్తామని, కస్టమర్లను పెంచుకుంటామని చెప్పారు. కొత్తదనం, పటిష్ట నిర్వహణ వంటి అంశాల ద్వారా లారస్ అభివృద్ధికి కృషి చేస్తున్న యాజమాన్యంపట్ల ఆసక్తిగా ఉన్నామని వార్బర్గ్ పింకస్ ఇండియా ఎండీ నితిన్ మల్హన్ వ్యాఖ్యానించారు.