Aravindha Sametha
-
మరోసారి త్రివిక్రమ్తో జూనియర్ ఎన్టీఆర్
మాటల మాంత్రికుడు, దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్.. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి హిట్ను సంపాదించిన విషయం తెలిసిందే. మాస్ ఫాలోయింగ్ ఉన్న తారక్కు ఈ సినిమా మరింత ఫాలోయింగ్ను తీసుకు వచ్చింది. అయితే ఈ వేసవిలో మరోసారి వీరు జతకడుతున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన హ్యట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యప్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తారక్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. -
వీరి గాత్రం.. వేసింది మంత్రం..
రంగమ్మ మంగమ్మ అంటూ మానసి.. శ్రోతలను ఫిదా చేశారు. దారి చూడు అంటూ పెంచల్ దాస్ దుమ్ము లేపారు. చూసి చూడంగానే నచ్చేశావే అని అనురాగ్ కులకర్ణి అంటే... వినీ వినంగానే ఎక్కేసిందే అంటూ శ్రోతలు వంతపాడారు. ఇంకేం ఇంకేం కావాలే అని సిద్శ్రీరామ్ అంటే.. ఇకపై ఈ పాటనే వింటామే అంటూ సంగీత ప్రియులు బదులిచ్చారు. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని మోహన భోగరాజు చెప్పగా.. అంతే శ్రద్దగా చెవులురిక్కించి విన్నారు ఆడియెన్స్. ఈ ఏడాది గాయనీగాయకులు తమ గాత్రాలతో చేసిన మ్యాజిక్ను ఓసారి చూద్దాం. రంగమ్మ మంగమ్మ.. అంటూ మానసి రంగస్థలం సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాష్టారే పరీక్ష రాస్తే నూటికి నూరు మార్కులు వచ్చినట్టు.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా.. మాస్ సూత్రాలను సరిగ్గా పాటిస్తూ.. సుకుమార్ తీసిన రంగస్థలం అంతా ఒక ఎత్తైతే.. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఈ చిత్రంలోని ప్రతీపాట ప్రేక్షకులను కట్టిపడేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రంగమ్మ మంగమ్మ పాట గురించే. ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. ఈ పాటలో సమంత అభినయం, డ్యాన్సులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఈ పాటపై సోషల్ మీడియాలో లెక్కలేని వీడియోలను రీక్రియేట్ చేసేశారు అభిమానులు. ఈ పాట జనాల్లోకి వెళ్లడానికి దేవీ అందించిన ట్యూన్ ఒక కారణమైతే.. మానసి గాత్రం మరో కారణం. ఈ పాటతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్ను సంపాదించేశారు గాయని మానసి. ఈ వీడియోసాంగ్ను ఇప్పటివరకు 129మిలియన్ల మంది వీక్షించారు. దారి చూపి దుమ్ము లేపిన దాస్.. ఈ ఏడాదిలో వచ్చిన పాటలన్నింటిలో మాస్ను ఊపేసిన పాట ఇది. నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా మిశ్రమ ఫలితాన్నిచ్చినా.. ఈ చిత్రంలోని ఈ పాట మాత్రం పాపులర్అయింది. ఎక్కడ ఎలాంటి ప్రొగ్రామ్స్ అయినా ఈ పాట ప్లే అవ్వాల్సిందే. చిందులు వేయాల్సిందే. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా.. రాయలసీమ రచయిత పెంచల్ దాస్ అందించిన గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ అయింది. ఆ గాత్రంలో ఉన్న మ్యాజిక్కే.. ఈ పాటను ఇంతలా వైరల్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో సాంగ్ను యూట్యూబ్లో 38మిలియన్ల మంది వీక్షించారు. వినీ వినంగానే నచ్చేసిందే... ఈ ఏడాది యూత్ను ఊపేసిన పాటల లిస్ట్లో మొదటి వరుసలో ఉండేది ఛలో సాంగ్. చూసి చూడంగానే అంటూ నాగశౌర్య రష్మిక మాయలో పడిపోతే.. ఈ పాటను వినీ వినంగానే నచ్చేసిందే అనేలా చేసేశారు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి. ఎక్కడ చూసిన ఈ పాటే కాలర్ట్యూన్.. రింగ్టోన్గా మారిపోయింది. ఈ పాటను 94మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఏడాదిలో అనురాగ్ అందరికీ గుర్తుండియో పాటలు పాడి శ్రోతలకు మరింత దగ్గరయ్యారు. మహానటి టైటిల్ సాంగ్.. ఆర్ఎక్స్ 100 పిల్లా రా వంటి సాంగ్లను పాడి అనురాగ్ కులకర్ణి ఫుల్ ఫేమస్ అయ్యారు. వీటిలో పిల్లా రా సాంగ్ను యూత్ను కట్టిపడేసింది. యూట్యూబ్లో ఈ సాంగ్ను 140మిలియన్ల మంది చూశారు. ఇంకేం ఇంకేం కావాలే.. ఇంకేం ఇంకేం కావాలే.. అని సిద్ శ్రీరామ్ అంటే ఈ ఏడాదికి ఇదే చాలే అని ప్రేక్షకుల బదులిచ్చారు. గీతగోవిందంలోని ఈ పాటే సినిమాపై హైప్ను క్రియేట్ చేసింది. ఒక్కపాట సినిమాపై అంత ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఈ పాటే ఓ ఉదహరణ. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు బలాన్నిచ్చింది. గోపి సుందర్ అందించిన బాణీకి, సిద్శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోయగా.. సంగీత ప్రియులను ఈ పాట ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భాషలతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులకు అందరికీ ఈ పాట ఎక్కేసింది. రికార్డు వ్యూస్లతో యూట్యూబ్లో ఈ పాట దూసుకెళ్తోంది. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని గంభీరంగా చెప్పిన మోహన.. అరవింద సమేత.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో సంగీతం ప్రధాన ప్రాత పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని రెడ్డమ్మ సాంగ్కు విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా ముగింపులో వచ్చే ఈ పాట.. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని వివరించగా.. ఆ గాత్రంలోని తెలియని ఆకర్షణకు అందరూ ముగ్దులయ్యారు. మోహన భోగరాజు ఈ పాటతో అందరికీ సుపరిచితురాలయ్యారు. పెంచల్ దాస్ తన రాయలసీమ యాసలో అందించిన సాహిత్యం ఈ పాటపై మరింత ప్రభావాన్ని చూపింది. ఇలా ఈ ఏడాది తమ గాత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువతరంగాలు.. వచ్చే ఏడాది కూడా తమ హవాను కొనసాగించాలని మరిన్ని మంచి పాటలను ఆలపించాలని ఆశిద్దాం. -
‘టాక్సీవాలా’కు మద్దతుగా..!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. ఎస్కేఎన్ నిర్మాతగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు ముందే లీకై యూనిట్ వర్గాలకు షాక్ ఇచ్చింది. నిర్మాతలు పైరసీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. దీంతో టాక్సీవాలాకు మద్దతుగా ఇండస్ట్రీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. యంగ్ హీరో నిఖిల్ పైరసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో మేసేజ్ను పోస్ట్ చేశారు. టాక్సీవాలా చిత్ర సినిమాటోగ్రాఫర్ మెసేజ్పై స్పందించిన నిఖిల్, ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా రిలీజ్ కు ముందే లీకైతే గుండె పగిలినంత బాధకలుగుతుంది. ఇటీవల ఎన్టీఆర్ అరవింద సమేత విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు టాక్సీవాలాకు జరిగింది. తరువాత నా సినిమాకు కూడా జరగొచ్చు అందుకే అందరూ పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు. శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న టాక్సీవాలా విజయం సాధించాలని చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశాడు. -
తమన్ సెంచరీ కొట్టేశాడు!
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ దూసుకుపోతున్నాడు. కొత్తదనం లోపిస్తుందని, కాపీ క్యాట్ అని థమన్ సంగీతంపై విమర్శలు వినిపిస్తున్నా.. మ్యూజిక్ డైరెక్టర్గా ఏమాత్రం జోరు తగ్గడం లేదు. తాజాగా ‘అరవింద సమేత’తో మరో హిట్ను కొట్టాడు. థమన్ సంగీతం గురించి చెపుతూ.. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్, త్రివిక్రమ్లు థమన్ను ఆకాశానికెత్తేశారు. సినిమా సక్సెస్ కావడంలో తమన్ అందించిన బ్యాగ్రౌండ్ కూడా కీలకపాత్ర పోషించిందని అందరూ ప్రశంసించారు. అయితే ఈ సినిమా తనకు వందో చిత్రమని థమన్ ట్వీట్ చేశాడు. తన వందో సినిమాగా అరవింద సమేత చేసినందుకు చాలా సంతోషంగా ఉందని థమన్ తెలిపాడు. Super Stoked on my #100th -#AravindaSametha Thnks for making me the #centurion !! Extremely blessed to have #blockbusteraravindhasametha as my 💯Th movie !! 🎥#Trivikram sir @tarak9999 @haarikahassine pic.twitter.com/7SK2SXS2To — thaman S (@MusicThaman) November 1, 2018 -
‘‘అరవింద సమేత వీర రాఘవ’ సక్సెస్మీట్
-
నాన్న హోదాలో బాబాయ్ : ఎన్టీఆర్
‘ఈ సమయంలో నాన్న ఉంటే బాగుండేదని... నాకు తెలిసి నాన్న ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తుంటారని, నాన్న లేకపోయినా నాన్న హోదాలో ఇక్కడకు వచ్చిన బాబాయ్ కు పాదాభివందనం చేస్తున్నాన’ని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు జూనియర్ ఎన్టీఆర్. అరవింద సమేత విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి పై విధంగా ఎన్టీఆర్ మాట్లాడాడు. ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయానికి మీ ఆశీస్సులు అందజేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమా విజయాన్ని అభిమానులతోనే కాకుండా బాబాయ్తో కూడా పంచుకోవాలనుకుంటున్నానని అందుకే బాబాయ్ను ముఖ్య అతిథిగా పిలిచామని అన్నాడు. ఈ వేడుకలో తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదని.. అభిమానులంతా బాబాయ్ మాటల కోసం ఎదురుచూస్తున్నారని అన్నాడు. జోహార్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ... జై హరికృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. -
‘అరవింద సమేత’లో సీమకు అవమానం
పంజగుట్ట: ఇటీవలే విడుదలైన అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని సన్నివేశాలు రాయలసీమను అవమానపరిచేలా ఉన్నాయని, వెంటనే ఆ సన్నివేశాలు తొలగించి చిత్ర దర్శకుడు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి డిమాండ్ చేసింది. రాయలసీమలో ఎంతో కరువు ఉందని, వేలమంది వలసలు వెళుతున్నారన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, దేశంలో అతితక్కువ వర్షాభావం ఇక్కడే ఉంది వీటిపై సినిమాలు తీయకుండా కేవలం ఫ్యాక్షన్ అంటేనే రాయలసీమ అని సినిమాల్లో చూపించి నేటితరం యువతకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో వివరించాలన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షులు కె.రవికుమార్, రాయలసీమ ఉద్యమ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఖానాపురం కృష్ణారెడ్డి, రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు సీమ క్రిష్ణ, రాయలసీమ యూత్ ఫ్రంట్ ప్రతినిధి జలం శ్రీనులు మాట్లాడుతూ .. సినిమాలో ఫ్యాక్షన్ మా డీఎన్ఏలో ఉంది, కొండారెడ్డి బురుజు, అనంతపురం టవర్ క్లాక్, కడప కోటిరెడ్డి సర్కిల్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలను ఉటంకిస్తూ తరిమి తరిమి నరుకుతానని హీరోచేత చెప్పించడం రాయలసీమ ప్రజలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ఫ్యాక్షన్ మా డీఎన్ఏలో ఉందని డైరెక్టర్కు ఎలా తెలుసు అని, అతను సీమప్రాంతానికి చెందినవాడా ..? ప్రశ్నించారు. ఎక్కడో బ్యాంకాక్లో కూర్చుని కథలు రాయడంకాదు, సీమకు వచ్చి ఇక్కడ స్థితిగతులు తెలుసుకుని సినిమాలు తీయాలని సూచించారు. యువకులు ఉన్నత చదువులు చదువుకుని వలసలు పోతున్నారని, సినిమాల ప్రభావం వల్ల కడప, కర్నూలు, అనంతపురం అంటేనే ఇతర నగరాల్లో రూంలు అద్దెకు కూడా ఇవ్వడంలేదని, కడప యూనివర్సిటీలో సీట్లు వస్తే చదువుకోవడానికి కూడా వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జబర్దస్త్షోలో కూడా రాయలసీమ మట్టి అని మట్టి తినిపించడం, రాయలసీమ నీరు తాగితే పౌరుషం వస్తుందంటూ మురికినీరు తాగించడం చేస్తున్నారని ఇప్పటికైనా సినిమాల్లో, షోలల్లో రాయలసీమను కించపరిచేలా చిత్రీకరించరాదని, ఇదే విషయమై ఫిలించాంబర్లో వినతిపత్రం ఇవ్వనున్నట్లు అప్పటికీ స్పందించపోతే రాయలసీమలో సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్ -
అరవింద సమేత : రెడ్డెమ్మ తల్లి కవర్ సాంగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఇటీవల విడుదలైన ఈ సినిమా తొలి వారాంతానికే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. పండుగ సీజన్ కావటంతో ముందు ముందు కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే సక్సెస్మీట్ను నిర్వహించిన ఆడియన్స్కు కృతజ్ఞతలు తెలిపిన అరవింద సమేత టీం. తాజాగా సినిమా క్లైమాక్స్లో వచ్చే రెడ్డమ్మ తల్లి పాట కవర్ వర్షన్ను రిలీజ్ చేసింది. ఈ పాటను ప్రముఖ రాయలసీమ జానపద గాయకుడు పెంచల్ దాస్ స్వయంగా రాసి పాడారు. -
అరవింద సమేత బోల్డ్ స్టోరీ : రామ్ చరణ్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రదర్శించాడంటూ మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. ‘జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోని బెస్ట్ పెర్ఫామెన్స్లో ఒకటిగా ఈ క్యారెక్టర్ నిలిచిపోతుంది. బోల్డ్ స్టోరి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్, పదునైన డైలాగ్స్ సూపర్బ్. జగ్గూ భాయి నటన, థమన్ సంగీతం ఈ సినిమా విజయానికి పిల్లర్లుగా నిలిచాయి. పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది’ అంటూ అరవింద సమేత టీంకు రామ్ చరణ్ అభినందనలు తెలియజేశాడు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా.. ‘నిజంగా అరవింద సమేత ఓ ఎమోషనల్ ట్రీట్’ అని ట్వీట్ చేస్తూ చెర్రీ పోస్టును షేర్ చేశారు. -
ఓవర్సీస్లో తెలుగు సినిమాల దూకుడు
తెలుగు సినిమాల స్టామినా పెరిగింది. వంద కోట్లు ఈజీగా కలెక్ట్ చేసేస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్కు హద్దులు ఉండేవి. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఆడేవి. వసూళ్లలో పెద్ద రికార్డులు కూడా క్రియేట్ చేసేవి కాదు. అయితే బాహుబలి సినిమాతో దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసింది. రాజమౌళి తన బాహుబలి సిరీస్లతో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్కు క్రేజ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు తెలుగు సినిమాలు రాష్ట్రాలు దాటి దేశాల హద్దులను చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. 2018లో టాలీవుడ్ బాక్సాఫీస్ కలకలలాడింది . ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్లో కూడా వసూళ్ల మోతను మోగించాయి. ఈ ఏడాదిలో రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి సినిమాలు టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు తాజాగా ‘అరవింద సమేత’ రికార్డుల వేటకు బయలుదేరింది. ఇప్పటికే వంద కోట్లను కలెక్ట్ చేసి వేగాన్ని పెంచుతోంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఆస్ట్రేలియా, అమెరికాల్లో వసూళ్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. హిందీ సినిమాల కంటే మన తెలుగు సినిమాలకే ఓవర్సీస్లో ఆదరణ ఎక్కువ ఉందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఇప్పటికే మన సినిమాలు జపాన్, చైనా దేశాల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు సినిమా ఇంకా తన పరిధిని పెంచుకుంటూ.. కథ, కథనాల్లో కొత్తదనాన్ని చూపిస్తూ.. మరింత ముందుకు దూసుకుపోవాలి. -
‘అరవింద సమేత వీర రాఘవ’ సక్సెస్ మీట్
-
ఈ విజయం ఎన్టీఆర్దే : త్రివిక్రమ్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లో వంద కోట్లకు పైగా గ్రాస్సాధించటంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా మీడియాతో మాట్లాడిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మహిళా రిజర్వేషన్లను మగాళ్లే ఆపుతున్నారు. తల్లి, భార్య, సోదరి కంటే ఎక్కువ ఎవరుంటారు. అందుకే నా చిత్రం ముగింపు మహిళలకు అధికారం ఇవ్వాలని చెప్పా. ఎన్టీఆర్ లాంటి బలమైన నటుడిని ప్రతి తరం చూడాలి. అరవింద సమేత భావోద్వేగాలతో కూడిన ప్రయాణం. ఒక పరాజయం, ఒక విషాధం తర్వాత వచ్చిన చిత్రం ఇది. ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ పేరును నిలబెట్టే వ్యక్తి కాదు... కొనసాగించే వ్యక్తి. తండ్రి మరణం విషాదాన్ని చూపించకుండా నలిగిపోయి పనిచేశారు. ఈ సినిమా విజయం ఎన్టీఆర్ దే’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ త్రివిక్రమ్ను ఆకాశానికి ఎత్తేశాడు. అరవింద సమేత పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ సినిమా అన్నారు. తామంత త్రివిక్రమ్ ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేశామన్న ఎన్టీఆర్, అరవింద సమేత లాంటి అద్భుత చిత్రాన్ని తనకు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క నటుణ్ని, సాంకేతిక నిపుణుడిని పేరు పేరునా అభినందించారు. -
ఎన్టీఆర్ అరుదైన రికార్డ్
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ అరుదైన రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవర్సీస్లో కూడా మంచి జోరు చూపిస్తున్న అరవింద సమేత ఇప్పటి వరకు దాదాపు 1.7 మిలియన్ డాలర్ల (12 కోట్ల 50 లక్షల) వసూళ్లు సాధించింది. అయితే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన హీరోలు గతంలో కూడా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ ఈ రికార్డ్ను వరుసగా నాలుగు సార్లు సాదించటం విశేషం. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ సినిమాలు కూడా 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా తాజాగా అరవింద సమేతతో మరోసారి అదే రికార్డ్ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం విశేషం. చదవండి : ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ రివ్యూ -
‘అరవింద సమేత వీరరాఘవ’ ప్రెస్మీట్
-
‘అరవింద’ ప్రీమియర్ షో కలెక్షన్లు అదుర్స్
మాటల మాంత్రికుడు కలానికి పదును పెట్టి మాటల తూటాలను పేల్చితే ఎలా ఉంటుందో.. యంగ్ టైగర్ తన నట విశ్వరూపాన్ని చూపితే ఎలా ఉంటుందో.. సరైన సినిమా పడితే కలెక్షన్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ ,ఎన్టీఆర్ కాంబినేషన్ల్లో రిలీజైన ‘అరవింద సమేత’ ఓవర్సీస్లో దూసుకెళ్తోంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్తో దూసుకెళ్లిన ఈ చిత్రం వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్లో ఒక్కరోజులోనే మిలియన్ డాలర్ల మార్క్ను చేరుకుంది. ఈ హవా చూస్తుంటే మూడు మిలియన్ల మార్క్ను కూడా అవలీలగా క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా వసూళ్లలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.. వేచి చూడాలి. జగపతి బాబు, నాగ బాబు, పూజా హెగ్డే, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతమందిచారు. #MillionDollarAravindhaSametha 🔥 pic.twitter.com/XeBEGsNNY9 — #RageOfTiger / Vainavi Hanvi Creations (@vainavihanvi) 12 October 2018 చదవండి : ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ రివ్యూ -
త్రివిక్రమ్ లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు : ఎన్టీఆర్
యంగ్టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అరవింద సమేత’. ఎన్నో అంచనాల నడుమ గురువారం విడుదలై. పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. చిత్రం సక్సెస్ కావడంతో యూనిట్ సభ్యులందరూ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విజయం సాధించడంపై ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి త్రివిక్రమ్ కారణం. ఆయనే లేకుండా ఇదంతా జరిగేది కాదు. ఆయన డెడికేషన్, ఫోకస్ మమ్మల్ని ముందుకు నడిపించింది. థ్యాంక్యూ సర్. ఈ చిత్రాన్ని భుజాలపై మోసిన యూనిట్ సభ్యులందరికి ధన్యవాదాలు. నాకు అతిపెద్ద బలమైన అభిమానులందరికి , మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. Overwhelmed by the response for #ASVR . Thank you for all the love. This success wouldn’t have been possible without #Trivikram garu, whose focus and determination drove us all. Thank you sir — Jr NTR (@tarak9999) October 11, 2018 Thank you Chinababu garu, @vamsi84 ,@hegdepooja,@IamJagguBhai, @MusicThaman ,Penchal Das,PS Vinod,Naveen Nooli,Ram- Lakshman masters & every member of team #ASVR, who’ve carried this film on their shoulders. — Jr NTR (@tarak9999) October 11, 2018 A big thanks to all my fans, who’ve been a source of great strength during this time. Thanks to members of the media and members of the film fraternity,for their support to #ASVR — Jr NTR (@tarak9999) October 11, 2018 -
తారక్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రివ్యూ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ రేపు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్లో తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా జగపతిబాబు, నాగబాబు, నవీన్ చంద్రలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్లో సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తున్న అరవింద సమేత వీర రాఘవపై ఉమైర్ సందు అనే వ్యక్తి రివ్యూ ఇచ్చేశాడు. దుబాయ్లో ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్గా చెప్పుకునే ఉమైర్ గతంలోనూ స్టార్ హీరోల చిత్రాలకు ముందే రోజే రివ్యూ ఇచ్చాడు. అయితే అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను ఇబ్బంది పెడుతోంది. గతంలో బాహుబలి ది బిగినింగ్ సినిమాకు దారుణమైన రివ్యూ ఇచ్చిన ఉమైర్.. తరువాత కాటమరాయుడు, అజ్ఞాతవాసి లాంటి సినిమాలకు సూపర్ హిట్ రివ్యూలు ఇచ్చాడు. ఇప్పుడు అరవింద సమేతను కూడా సూపర్ హిట్ అంటూ పొగిడేయటంతో రిజల్ట్ ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్. -
‘అప్పుడు ఎన్టీఆర్ కళ్లలో ఆనందాన్ని వర్ణించలేను’
యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘అరవింద సమేత’ ప్రమోషన్స్లో భాగంగా బిజీగా ఉన్నాడు. ఈ గురువారం రిలీజ్ కానున్న సినిమాకు ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిస్తూ.. బిజీగా ఉన్న ఎన్టీఆర్కు ప్రముఖ యాంకర్, నటి ఇచ్చిన బహుమతి ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్టు సదరు నటి సోషల్ మీడియాలో వెల్లడించింది. యాంకర్, నటి గాయత్రి భార్గవి తన తాత శంకర్ నారాయణ గీసిన నందమూరి హరికృష్ణ చిత్రపటాన్ని ఎన్టీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ చిత్రపటాన్ని చూసినప్పుడు ఎన్టీఆర్ కళ్లలో చూసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ చెప్పుకొచ్చిన గాయత్రి.. ‘అమ్మకు ఇస్తానండీ.. థ్యాంక్యూ’ అని ఎన్టీఆర్ అన్నాడని పోస్ట్ చేశారు. When the Pencils Sketch of an 80 years young Sri Sankar Narayana my grandfather reaches the hands of @tarak9999 . The joy in his eyes of young tiger cannot be mentioned in words. 'Ammaki istanau andi Thank you' were his words. @vamsikaka pic.twitter.com/w8tUFgbGjr — Gayatri Bhargavi (@GayatriBhargav1) October 9, 2018 -
బన్నీతో హ్యాట్రిక్ సినిమా..!
నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్ తిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ గ్యాప్లో బన్నీ తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ చిత్రాలను అంధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, నాగబాబు, రావూ రమేష్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే బన్నీ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్న్యూస్!
యంగ్టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న చిత్రం అరవింద సమేత. దసరా సెలవుల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం అదనపు షోలకు సంబంధించిన అనుమతిని ఇచ్చింది. ఇక సినిమా రిలీజైన తరువాత వారం రోజుల పాటు (అక్టోబర్ 11 నుండి 18వరకు) రోజుకు ఆరు షోలను ప్రదర్శించుకునే అవకాశాన్ని కలిపించింది. పండగ సీజన్ కావడం, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్పై ఉండే క్రేజ్.. వీటన్నంటిని దృష్ట్యా ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలె ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్ను పొందిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
త్రివిక్రమ సమేత వీరరాఘవ
-
‘అజ్ఞాతవాసి’పై స్పందించిన ఎన్టీఆర్
అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లోతెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసిపై స్పందించాడు. ‘అజ్ఞాతవాసి ప్రభావం అరవింద సమేతపై ఉంటుందని నేను భావించటం లేదు. ప్రతీ సినిమా ఓ సరికొత్త ప్రయాణం. నా కెరీర్లో కూడా ఫ్లాప్స్ వచ్చాయి. ఒక ఫ్లాప్ ప్రభావం ఆ తదుపరి చిత్రం మీద ఉంటుందని నేను నమ్మను. అరవింద సమేత పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ సినిమా’ అన్నాడు ఎన్టీఆర్. -
‘అరవింద సమేత వీర రాఘవ’ ఎన్టీఆర్ స్టిల్స్
-
‘వయొలెన్స్ నీ డీఎన్ఏలోనే ఉంది’
యంగ్ టైగర్ ఎన్టీఆర్- పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ఎన్టీఆర్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, మంగళవారం (అక్టోబర్ 2) రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను నోవాటెల్ హోటల్లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా థియరిటికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఫారిన్ బ్యాక్డ్రాప్లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల పరిచయంతో ట్రైలర్ మొదలౌతుంది. పూజా పేరు తెలుసుకోవాలనుకున్న ఎన్టీఆర్కు.. ‘పేరు మాత్రమే చాలా.. ఇంకా అడ్రస్ కూడా చెప్పాలా’అనే సమాధానమొస్తుంది. ఇక సమస్యను (ఫ్యాక్షనిజాన్ని) రూపుమాపడం ఒక్క అడుగు దూరంలోనే ఉందంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్తో ముగుస్తుంది. ‘వయొలెన్స్ నీ డీఎన్ఏలోనే ఉందంటూ’ సాగే త్రివిక్రమ్ మార్కు డైలాగులతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘ఫ్యాక్షనిజం అనే పదం విన్నావా.. అర్థం కాలేదు కదా’ అంటూ పూజా ఎన్టీఆర్ను అడగడం...ఆ వెంటనే ‘ఈడ మందిలేరా కత్తుల్లేవా అంటూ ఎన్టీఆర్ యాక్షన్ సీన్లో కనిపించడం చూస్తుంటే ఎన్టీఆర్ రెండు భిన్న కోణాలు గల పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతోంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది. -
‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న క్రేజీ చిత్రం ‘అరవింద సమేత’. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ లుక్స్, టీజర్, పాటలతో సినిమాపై భారీ హైప్ క్రియేటైంది. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే అభిమానులకు మరో తీపి కబురును చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను అక్టోబర్ 2న ఏర్పాటుచేసినట్లు మేకర్స్ ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకానుంది. -
‘అరవింద సమేత’ రిలీజ్ డేట్ ఫిక్స్!
యంగ్టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అరవింద సమేత’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ లుక్స్, పాటలతో సందడి చేస్తోన్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మొదటిసారి సినిమా రావడం, త్రివిక్రమ్ శైలికి భిన్నంగా ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, థమన్ సంగీతాన్ని అందించారు. -
‘అరవింద సమేత’ వర్కింగ్ స్టిల్స్
-
సరదా సరదాగా.. ఎన్టీఆర్-త్రివిక్రమ్!
యంగ్టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూట్ మార్చి తనశైలికి భిన్నంగా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలె విడుదల చేసిన పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. స్టైలీష్లుక్స్లో అదిరిపోయేలా ఉన్న ఎన్టీఆర్ను చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. తాజాగా చిత్రబృందం కొన్ని వర్కింగ్ స్టిల్స్ను విడుదల చేసింది. ఈ స్టిల్స్లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఎంతో సరదాగా ఉన్నట్టు కనిపిస్తోంది. చిత్రయూనిట్ మొత్తం జాలీగా ఈ షూటింగ్ను పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు నిరాశేనా..?
వరుస విజయాలతో సూపర్ ఫాంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తారక్ అభిమానులకు షాక్ ఇస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ చూసే అవకాశం అభిమానులకు లేదన్న ప్రచారం జరుగుతోంది. రిలీజ్కు మరింత సమయం లేకపోవటంతో విదేశాల్లో చిత్రీకరించాలనుకున్న ఓ పాటను తొలిగించినట్టుగా తెలుస్తోంది. దీంతో సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉండనున్నాయి. వాటిలో ఒకటి బ్యాక్గ్రౌండ్ సాంగ్, మరొకటి ఇటీవల రిలీజ్ అయిన రొమాటింక్ సాంగ్ కావటంతో వాటిలో ఎన్టీఆర్ డ్యాన్సులు చూసే అవకాశం లేదు. ఎన్టీఆర్ సోలో సాంగ్ ఫ్యాన్స్ను కాస్త అలరించినా మరో పాటు కూడా మెలోడీనే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో తారక్ డ్యాన్స్లు చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశే అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంత కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘అరవింద సమేత’ నుంచి సర్ప్రైజ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అరవింద సమేత’ . ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్తో అంచనాలను పెంచేసింది చిత్రయూనిట్. తాజాగా సినిమాకు సంబందించి ఓ సర్ప్రైజ్ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇటీవలె విడుదల చేసిన ‘అనగనగనగా’ లిరికల్ సాంగ్ వైరల్గా మారింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను నేరుగా మార్కెట్లోకి సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు, ఆ తరువాత సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక రేపు ( సెప్టెంబర్ 18) మరో సర్ప్రైజ్ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నారు. దసరా కానుకగా ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ టఫ్గా కనిపిస్తాడట కానీ..
అవును ఎన్టీఆర్ టఫ్గా కనిపిస్తాడట కానీ మాట వింటారని పూజా హెగ్డే అంటోంది. పూజా ఈ మాటలు అన్నది బయట కాదు సినిమాలో. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అరవింద సమేత’. ఎన్టీఆర్ లుక్, టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచీ అభిమానులు సినిమా విడుదల కోసం మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అనగనగనగా’ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మొదలయ్యే ముందు పూజా హెగ్డే ఎన్టీఆర్తో ‘టఫ్గా కనిపిస్తారు.. కానీ మాట వింటారు’ అని అంటారు. ఈ లిరికల్ వీడియో సాంగ్లో ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. తమన్ అందించిన సంగీతం, అర్మాన్ మాలిక్ గాత్రం, పూజ హెగ్డే అందం అన్నీ హైలెట్గా నిలిచాయి. అరవింద పాత్రను పోషిస్తున్న పూజా హెగ్డేను ప్రేమలో దించడానికి ఎన్టీఆర్ పాడుతున్న ఈ పాట, పడుతున్న పాట్లు ఈ పాటలో కనిపిస్తున్నాయి. మొత్తానికి మరో కొత్త ఎన్టీఆర్ను అభిమానులకు అందించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అందించేందుకు ప్లాన్చేస్తున్నారు. Hey guys here it is ♥️https://t.co/rJDYLTBjQt Very happy to share our #firstsingle #Anaganaganaga #lyricalvideo frm #Trivikram sir’s & @tarak9999 #AravindhaSamethaaudio sng by @ArmaanMalik22 Lyrics by the legend 🎵#sriseetharamasastrygaaru @ZeeMusicCompany @haarikahassine — thaman S (@MusicThaman) September 15, 2018 -
హిట్ డైరెక్టర్తో మరోసారి ఎన్టీఆర్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో సత్తా చాటడమే కాదు నటుడిగానూ ప్రతీ సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్కు సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. అక్టోబర్లో రిలీజ్ కానున్న ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నాడు తారక్. ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఆల్రెడీ ఓకే చెసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడట. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. సైరా షూటింగ్ పూర్తయిన వెంటనే చిరు, కొరటాల సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ సినిమా పూర్తయిన తరువాత కొరటాల, ఎన్టీఆర్ల కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లనుంది. అంటే ఈ సినిమా 2020లో గాని సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు. -
‘అరవింద సమేత’గా ఎన్టీఆర్ పోస్టర్ అదుర్స్!
భారీ అంచనాల నడుమ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరవింద సమేతకు లీకుల బాధలు ఎక్కువయ్యాయి. అయినా సరే చిత్ర బృందం మాత్రం షూటింగ్ను నిర్విరామంగా షూటింగ్ను చేస్తోంది. ఆగస్టు 15కు టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే నిజం కానుంది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నామని ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో.. రాజసం ఉట్టిపడేలా ఉన్న ఎన్టీఆర్ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. -
అరవింద సమేత టీజర్ ఎప్పుడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న సినిమా అరవింద సమేత. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్తోనే సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. జై లవకుశ లాంటి హిట్ తరువాత త్రివిక్రమ్తో చేస్తోన్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నుట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. మరి ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండుగే. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
కూల్గా కూర్చున్న మాటల మాంత్రికుడు!
అరవింద సమేత అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తోన్న మాటల మాంత్రికుడు ప్రస్తుతం కూల్గా కూర్చున్నాడు. అజ్ఞాతవాసి పరాజయం తరువాత ఎన్టీఆర్తో చేస్తున్న ఈ సినిమాపై త్రివిక్రమ్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ కూల్గా కూర్చున్న ఫోటోను తమన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఫోటోతో పాటు.. ‘ మనతో పని చేసే డైరెక్టర్ కూల్గా మనతో ఉంటే.. మంచి కూల్ ట్రాక్స్ వస్తాయి.. నాకు ఆయనతో ప్రతిరోజూ కూల్గానే ఉంటుంది.. పాటలు పూర్తికావొస్తున్నాయి’ అంటూ పోస్ట్ చేశాడు. When ur director is super cool at work !! Tat awesome feel u get to compose some super cool tracks !! ♥️ Every day with him is a new cool daY . #trivikram sir #AravindhaSametha #compositions nearing completion 💪🏼🎶 pic.twitter.com/RFlmNIteAE — thaman S (@MusicThaman) July 15, 2018 -
ఎన్టీఆర్ కూడా కాలేజ్కి వెళ్తున్నాడు..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఇప్పటీ వరకు జరిగిన షెడ్యూల్లో ఎక్కువగా యాక్షన్, ఫ్యామిలీ డ్రామాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్లో కొన్ని కాలేజ్ సీన్స్ కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా మరోసారి కాలేజ్ స్టూడెంట్గా మారిపోతున్నాడు. 2016లో రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ లోనూ ఎన్టీఆర్ స్టూడెంట్ గా కనిపించాడు. -
నో వయోలెన్స్
కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ యాక్షన్ మోడ్లో ఉన్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు సంబంధించి ఫైట్ సీన్స్ కోసమే ఈ సీరియస్ మోడ్. కానీ నెక్ట్స్ షెడ్యూల్లో నో వయలెన్స్ అట. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై యస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. నాగబాబు, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ ఇంకో వారం రోజుల పాటు సాగనుంది. నెక్ట్స్ షెడ్యూల్లో ఎన్టీఆర్, పూజా హెగ్డేలపై కొన్ని కాలేజ్ సీన్స్ తీయనున్నారని సమాచారం. ఆ తర్వాత సాంగ్స్, కొన్ని కీలక సన్నివేశాల కోసం పొల్లాచ్చి వెళ్లనుంది చిత్రబృందం. దసరా స్పెషల్గా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
‘అరవింద సమేత’ టీజర్ ఎప్పుడంటే?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యుల్లో యాక్షన్ సన్నివేశాలను ఓ రేంజ్లో చిత్రీకరించారని టాక్. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొంత భాగాన్ని షూట్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించిందని తెలుస్తోంది. అందుకోసం వరంగల్లోని భద్రకాళీ ఆలయ పరిసర ప్రాంతాల్ని పరిశీలిస్తున్నట్లు టాక్. చకచకా షూటింగ్ను పూర్తిచేసి దసరా కానుకగా సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్లుక్, మోషన్పోస్టర్స్కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. -
విలన్స్ బోన్స్ బ్రేక్ చేస్తున్న ఎన్టీఆర్..
బ్రేక్ తీసుకోకుండా విలన్స్ బోన్స్ బ్రేక్ చేస్తున్నారట ఎన్టీఆర్. కొత్త బుజ్జాయితో ఆడుకోకుండా.. విలన్స్ను రఫ్ ఆడిస్తున్నారట. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై యస్. రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో రాయలసీమ కుర్రాడిగా రాయలసీమ డైలాగ్స్ కూడా పలుకబోతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఓ ఫైట్ని షూట్ చేస్తోంది చిత్రబృందం. ఈ ఫైట్లోనే విలన్స్ని దుమ్ము దులిపేస్తున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. అందుకే బ్రేక్ లేకుండా ఫుల్ స్పీడ్తో షూటింగ్లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: పీయస్ వినోద్. -
‘అరవింద సమేత’పై మరో ఇంట్రస్టింగ్ న్యూస్!
జై లవ కుశ సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడి స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్లోకి మారిపోయాడు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న కోణాలున్నా పాత్రలో కనిపించనున్నాడట. క్లాస్గా కనిపించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా రాయసీయ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే మాస్ యాక్షన్ హీరోగా ఎన్టీఆర్ అలరించనున్నాడని తెలుస్తోంది. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధకృష్ణ నిర్మిస్తున్నారు. -
ఫ్యామిలీ కొంచెం పెద్దదైంది
ఎన్టీఆర్ ఇంట్లో సందడి నెలకొంది. ఇక మీదట ఇంట్లో మరో లిటిల్ టైగర్ సందడి చేయనున్నారు. గురువారం ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి బాబుకి జన్మనిచ్చారు. ఆ విషయాన్ని ట్వీటర్లో ‘‘కుటుంబం కొంచెం పెద్దదైంది. అబ్బాయి పుట్టాడు’’ అంటూ ఎన్టీఆర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆల్రెడీ ఈ దంపతులకు ఓ కుమారుడు (అభయ్) ఉన్న విషయం తెలిసిందే. ఇన్స్టాలో అదే ఫస్ట్ ఫొటో? ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లోకి బుధవారం అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్. మొదటి పోస్ట్గా తన లేటెస్ట్ సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ ఫొటోను అప్లోడ్ చేసినప్పటికీ కొద్దిసేపటికే దాన్ని తీసేశారు. అభిమానులకు సర్ప్రైజ్గా తన రెండో కుమారుణ్ని పరిచయం చేసే పోస్ట్గా ఈ ఫస్ట్ ఫొటోను అప్లోడ్ చేస్తారని సమాచారం. బుజ్జాయి కోసం బ్రేక్? యాక్చువల్లీ సెకండ్ బేబీ కోసం ఎన్టీఆర్ తన షెడ్యూల్ని మార్చుకున్నారట. బాబు పుట్టాక కొన్ని రోజుల పాటు షూటింగ్స్కు బ్రేక్ ఇచ్చి ఎక్కువ సమయాన్ని బాబుతోనే గడపాలనుకున్నారని సమా చారం. పొల్లాచ్చిలో జరగనున్న ‘అరవింద సమేత..’ చిత్రానికి ఓ పదిహేను ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత షూట్లో జాయిన్ కావాలని భావిస్తున్నారట ఎన్టీఆర్. -
రెండోసారి తండ్రైన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రయ్యాడు. తారక్, ప్రణతీ దంపతులకు ఈ రోజు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తారక సోదరుడు హీరో కల్యాణ్ రామ్ ఎన్టీఆర్కు విషెస్ తెలియజేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ దంపతులకు అభయ్ రామ్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్తో సరికొత్త లుక్లో దర్శనమివ్వనున్నాడు. The family grows bigger. It’s a BOY! — Jr NTR (@tarak9999) 14 June 2018 -
పొల్లాచ్చిలో పాటల సందడి
అరవింద సమేతంగా పొల్లాచ్చి వెళ్లిపోనున్నారట రాఘవ. ఎందుకు? క్లైమెట్ ఆహ్లాదకరంగా ఉందని డ్యూయెట్ పాడుకోడానికా? అంటే అవును అని సమాధానమిస్తోంది చిత్రబృందం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్పై యస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కేవలం ఆడిపాడటమే కాదట ఎన్టీఆర్, పూజా హెగ్డేపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా పొల్లాచ్చిలో చిత్రీకరించనున్నారు దర్శకుడు త్రివిక్రమ్. పొల్లాచ్చి షెడ్యూల్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 12న రిలీజ్ కానుంది. -
పొల్లాచ్చిలో ఎన్టీఆర్ ఆటా పాటా
జై లవ కుశ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ జూన్ 18 నుంచి పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్లతో పాటు కీలక నటీనటులు పాల్గొననున్నారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో ఒక పాటతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో భారీ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధకృష్ణ నిర్మిస్తున్నారు. -
రూమర్స్కు ఒక్క ఫొటోతో చెక్!
యంగ్టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యుల్ కూడా పూర్తైయినట్లు, త్వరలో రెండో షెడ్యల్లో పాల్గొంటాను అంటూ పూజా హెగ్డే ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఇదే షెడ్యూల్ కమెడియన్గా, హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్న శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే షెడ్యూల్ పాల్గొన్నాడు. అయితే శ్రీనివాస్ రెడ్డికి, ఎన్టీఆర్కు పడటం లేదని.. శ్రీనివాస్రెడ్డి షూటింగ్కు వచ్చినప్పటినుంచి ఎన్టీఆర్ మూడీగా ఉంటున్నారని వార్తలు వినిపించాయి. అయితే అదంతా గాసిప్ రాయుళ్ల పనే అని శ్రీనివాస్రెడ్డి ఒక్క పిక్తో తేల్చేశాడు. ‘మధురం.. మధురం.. ఈ సమయం’ అంటూ త్రివిక్రమ్, ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తున్న ‘జంబ లకిడి పంబ’ జూన్ 22న విడుదల కానుంది. Madhuram Madhuram eh Samayam 😍😍😍😍😍 pic.twitter.com/KhtriE839E — Srinivasareddy (@Actorysr) June 9, 2018 -
‘అరవింద’కు కాజల్ స్పెషల్ ఎఫెక్ట్..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ను, ఎన్టీఆర్ లుక్ను కూడా రివీల్చేసింది చిత్రబృందం. వీటికి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చస్తోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. జనతా గ్యారేజ్ సినిమా కోసం ఎన్టీఆర్, కాజల్ చేసిన ‘పక్కాలోకల్’ ఐటం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ అదే మ్యాజిక్ను రిపీట్ చేసేందుకు త్రివిక్రమ్ కూడా ఆసక్తిని చూపిస్తున్నాడట. ఇక ఇదే నిజమైతే... ఎన్టీఆర్, కాజల్ కలిసి మళ్లీ స్టెప్పులేస్తారన్నమాట. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోంది. రాయలసీయ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఎన్టీఆర్తో తెలుగమ్మాయి..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అరవింద సమేత’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎన్టీఆర్తో ఆడిపాడనున్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్గా పూజాను తీసుకోగా మరో హీరోయిన్ పాత్రకు తెలుగమ్మాయి ఈషా రెబ్బాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాగబాబు, జగపతి బాబులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. -
అండగా నిలిచారు, బిగ్ థ్యాంక్స్: ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్: నా కష్టసుఖాల్లో శాశ్వతంగా తోడున్నది ప్రేమ, మీ ఆదరణే అంటూ అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా వరుస ట్వీట్లు చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘నా 35 ఏళ్ల జీవితంలో 18 ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్నాను. ఇన్నేళ్ల నా కెరీర్లో కష్టసుఖాల్లో నాకు శాశ్వతంగా తోడున్నది, అండగా నిలిచింది ప్రేక్షకుల ప్రేమ, అదరణే. మీ రుణం తీర్చుకోగలుగుతానని భావించడం లేదు. అభిమానులకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘‘అరవింద సమేత.. వీర రాఘవ’ ఫస్ట్లుక్ను ఆధరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మీ ట్వీట్లు చదువుతుంటే చాలా గొప్పగా అనిపిస్తోంది. నా కొలిగ్స్కి, నా శ్రేయోభిలాషులు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ బిగ్ థ్యాంక్స్’అని మరో ట్వీట్లో రాసుకొచ్చారు తారక్. కాగా, నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘అరవింద సమేత..’ఫస్ట్లుక్ను విడుదల చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. నిన్న సిక్స్ ప్యాక్లో మాస్ లుక్ను విడుదల చేసిన మూవీ యూనిట్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆదివారం క్లాస్ లుక్లో పూజా హెగ్డేతో ఉన్న లుక్తో పాటు మోషన్ పోస్టర్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. In my life of 35 years, I’ve spent almost 18 years as an actor. And during every high & every low in these years, the one constant thing in my life has been the love & support given by you, my dear FANS. I don’t think I can every repay you. Thank you from the bottom of my heart🙏 — Jr NTR (@tarak9999) 20 May 2018 Thank you everyone for the overwhelming love shown towards #AravindhaSamethaFirstLook . It feels great to read all your tweets. Couldn’t have asked for more. Big Thanks to all my colleagues, well wishers and members of the Film Industry for the warm birthday wishes. — Jr NTR (@tarak9999) 20 May 2018 -
‘తారాజువ్వ’లా.. తారక్ సినీ కెరీర్!
అసలు పేరు ‘నందమూరి తారక రామరావు జూనియర్’...కానీ అభిమానులు మాత్రం ‘యంగ్ టైగర్’గా పిలుచుకుంటారు. మాస్ ఇమేజ్కు నిలువెత్తు నిదర్శనంలా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్.. 35వ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా శనివారం విడుదల చేసిన ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్కి మంచి స్పందన వస్తోంది. ఫస్లుక్లో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని, సిక్స్పాక్ బాడీతో పవర్ బ్యాంక్లా, మాస్ హీరోకు నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్నాడు. అయితే ఈ కొత్త లుక్ కోసం తారక్ ఎంతో శ్రమించాడు. ఎంతోమంది బాలీవుడ్ టాప్ హీరోలకు ఫిజికల్ ట్రైనర్గా పనిచేసిన లాయిడ్ స్టీవెన్స్ శిక్షణలో యంగ్టైగర్ రాటుదేలాడు. తారక్ ఫిజక్ గురించి మాట్లాడుకోవాలంటే యమదొంగకు ముందు...యమదొంగ తర్వాత అనే చెప్పాలి. ఎందుకంటే యమదొంగ ముందువరకూ ఈ హీరో దాదాపు 100 కేజీల బరువుతో ఉండేవాడు. ఆ తర్వాత 20 కేజీల బరువు తగ్గి చాలా స్టైలిష్గా తయారయ్యాడు. నేటితో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ హీరో సినీ జీవితాన్ని ఓ సారి చూద్దామా.... భారీ సినీ నేపథ్యం.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేనటువంటి భారీ సినీ నేపథ్యం ఎన్టీఆర్కు సొంతం. తాతగారి పేరు పెట్టుకుని యాక్టింగ్, డాన్స్తో దూసుకుపోతున్న ఈ హీరో ప్రేక్షకుల హృదయాల్లో ‘జూనియర్ ఎన్టీఆర్’గా స్థానం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే పరిశ్రమలోకి... బన్నీ, రామ్ చరణ్ కంటే ముందే పరిశ్రమకు వచ్చాడు తారక్. తొలిసారిగా 1996 ‘బాల రామాయణం’ చిత్రంలో రాముడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ ఐదేళ్లలోనే అంటే 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ‘ఆది’ సినిమా తారక్లోని మాస్ హీరోను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ యంగ్ టైగర్ కెరీర్ ఆశించినంత బాగా సాగలేదు. అల్లరి రాముడు, నాగ లాంటి రెండు డిజాస్టర్ల తరువాత ‘సింహాద్రి’ రూపంలో జక్కన్నే మరోసారి ఎన్టీఆర్కు భారీ విజయాన్ని ఇచ్చాడు. తరువాత అశోక్, సాంబ, నాగ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరోసారి గట్టెక్కించిన జక్కన్న... ఇలా ఆరేళ్లపాటు కొనసాగిన తారక్ సిని ప్రస్థానాన్ని ‘దర్శక ధీరుడు’ రాజమౌళి మరోసారి మలుపు తిప్పాడు. 2007లో రాజమౌళి తారక్తో ‘యమదొంగ’ సినిమాను తీసాడు. ఈ సినిమా కోసం జూనియర్ 20 కేజీల బరువు తగ్గి, కొత్త లుక్తో ఆకట్టుకోవడమే కాక నటనలో తాతకు తగ్గ మనవడిగా నిరుపించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ యమగోలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపితే.. తాతకు తగ్గ మనవడిగా జూనియర్ యమదొంగతో బాక్సాఫీస్ను కొల్లగొట్టాడు. ‘టెంపర్’ చూపించాడు.... యమదొంగ తర్వాత అదుర్స్, బృందావనం లాంటి సినిమాలతో ఘనవిజయాలు సాధించిన ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాతో మరోసారి సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకున్నాడు.. అవినీతి పోలీసు అధికారి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పూరీ, ఎన్టీఆర్లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఎన్టీఆర్ యాక్టింగ్, పూరి మార్క్ పంచ్ డైలాగ్లతో టెంపర్ మంచి విజయాన్ని అందుకుంది. జనతా గ్యారేజ్తో కొత్తగా... టెంపర్ తర్వాత సినిమాల ఎంపికలో తారక్లో చాలా మార్పు వచ్చింది. రొటిన్కు భిన్నంగా, కథాబలం ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇలా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాలతో వరుస విజయాలందుకున్నాడు తారక్. ప్రస్తుతం ఈ యంగ్టైగర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. -
ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్ : నిన్న మాస్.. ఈ రోజు క్లాస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును అభిమానులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో జూనియర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రయూనిట్ కూడా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులకు గిఫ్ట్ ఇచ్చింది. నిన్న(శనివారం) మాస్ యాక్షన్ లుక్లో ఉన్న ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫస్ట్ లుక్ను రిలీజ్చేసిన చిత్రయూనిట్ ఈ రోజు (ఆదివారం) క్లాస్ రొమాంటిక్లుక్లో ఉన్న ఎన్టీఆర్ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్తో పాటు హీరోయిన్ పూజ హెగ్డే లుక్ను కూడా ఈ మోషన్ పోస్టర్లో రివీల్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. -
‘అరవింద సమేత వీర రాఘవ’ మోషన్ పోస్టర్
-
ఎన్టీఆర్ ఫస్ట్ లుక్పై వర్మ కామెంట్
యంగ్టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదటిసారిగా వస్తున్న ఈ కాంబినేషన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తివిక్రమ్ గత సినిమా అజ్ఞాతవాసి నిరాశపరచడంతో తివిక్రమ్పై ఎన్టీఆర్ అభిమానులకు అనుమానాలు కలిగాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన సినిమా టైటిల్, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్తో ఆ అనుమానాలన్నింటిని పటాపంచలు చేసేసింది చిత్రయూనిట్. సిక్స్ ప్యాక్తో ఎన్టీఆర్, కత్తి పట్టుకుని ఉన్న ఈ పోస్టర్తో సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. అరవింద సమేత టైటిల్ కాగా, వీర రాఘవ అనేది ఉపశీర్షిక. టైటిల్ కూడా విభిన్నంగా ఉందంటూ సోషల్మీడియా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్పై వివాదాల వర్మ తనదైన శైలీలో కామెంట్ చేశారు. ‘ వావ్... తారక్ సెక్సీలుక్లో ఎన్నడూ లేనంత సెక్సీగా ఉన్నారు. ఎన్టీఆర్ సెక్సీ కంటే ఎక్కువ సెక్సీగా ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందించగా , హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. Wowwww @tarak9999 is looking sexier than sex ever looked and more sexier than sex never ever looked 🙏🙌💐 pic.twitter.com/nAZjCCs6zV — Ram Gopal Varma (@RGVzoomin) May 19, 2018 -
ఎన్టీఆర్-త్రివిక్రమ్.. ఫస్ట్లుక్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అరవింద సమేత.. అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. వీర రాఘవ ఉపశీర్షిక. చేతిలో కత్తి.. సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ను మేకర్లు వదిలారు. గతంలో హీరోల క్లాస్ మేకోవర్లతో ఫస్ట్ లుక్లను వదిలిన త్రివిక్రమ్.. ఈసారి ఎన్టీఆర్ కోసం యాక్షన్ పార్ట్తో ఫస్ట్ లుక్ వదలటం విశేషం. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 28వ చిత్రం కాగా, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా తన ట్విటర్లో పోస్టర్ను రిలీజ్ చేశారు. Presenting, అరవింద సమేత... #AravindhaSamethaFirstLook pic.twitter.com/9tHpB6WfDK — Jr NTR (@tarak9999) 19 May 2018