academy
-
రవీంద్ర నాట్య మందిర్ పునఃప్రారంభం
ముంబై: కళాకారులు, రంగస్థలనటులకు ప్రీతిపాత్రమైన రవీంద్ర నాట్య మందిర్ ఆడిటోరియం, పీఎల్ దేశ్పాండే మహారాష్ట్ర కళా అకాడమీ తిరిగి ప్రారంభం కానున్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తైన నేపథ్యంలో ఫిబ్రవరి 28న జరిగే పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్లు హాజరుకానున్నారని ఈ సందర్భంగా అకాడమీ కొత్త చిహ్నం ఆవిష్కరణ కూడా జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ‘రీఓపెన్’ఆర్ట్స్’ కమ్యూనిటీకి కొత్త ఉదయం– మంత్రి ఆశిష్ షెలార్ ఈ సందర్భంగా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న థియేటర్, ఆర్ట్స్ కమ్యూనిటీకి ఈ కార్యక్రమం ‘కొత్త ఉదయాన్ని‘ తెస్తుందని అన్నారు. అకాడమీతో తరతరాలుగా కళాకారులను, వారిలోని ప్రతిభకు మెరుగులద్దుతూనే ఉన్నామని , దీన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పునరుద్ధరించిన రవీంద్ర నాట్య మందిర్లో అధునాతన సౌండ్ సిస్టమ్స్, రిఫైన్డ్ ఇంటీరియర్స్, రెండు చిన్న థియేటర్లు, ఐదు ఎగ్జిబిషన్ హాళ్లు, ఆరి్టస్టుల కోసం 15 రిహార్సల్ రూమ్లు, గ్రాండ్ ఓపెన్–ఎయిర్ స్టేజ్, వర్చువల్ చిత్రీకరణ, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ కోసం స్టూడియోలు ఏర్పాటు చేశామని ఉన్నాయని మంత్రి తెలిపారు. అకాడమీలో త్వరలో వివిధ కళారూపాలకు సంబంధించి 20 సరి్టఫికెట్, డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
ఉర్దూ అకాడమీలో అంతులేని అక్రమాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీకి కేటాయించిన రూ.కోట్లాది రూపాయలను ఇష్టానుసారం కొల్లగొట్టేశారు. అప్పట్లో ఉర్దూ అకాడమీకి కేటాయించిన దాదాపు రూ.30కోట్లలో ఎంత సద్వినియోగం అయ్యాయి? ఎంత అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి? అనే కోణాల్లో దృష్టిసారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముస్లిం సమాజం కోరుతోంది.విజయవాడలో ఆఫీస్... కర్నూలులో బ్యాంక్ అకౌంట్ విజయవాడలో ఏపీ ఉర్దూ అకాడమీ రాష్ట్ర కార్యాలయం ఉంది. అయితే కర్నూలులోని ఎన్ఆర్ పేట కెనరా బ్యాంకు బ్రాంచిలో ఏపీ ఉర్దూ అకాడమీ పేరుతో అకౌంట్ (33941010001054)ను తెరిచి అక్రమాలకు పాల్పడ్డారు. ఉర్దూ అకాడమీ ఉన్నత ఉద్యోగులు రకరకాల కార్యక్రమాల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. ముస్లింలు లేని చోట కూడా ఉర్దూ భాషాభివృద్ధి సాకుతో ముసాయిరా(కవి సమ్మేళనం) నిర్వహించినట్టు చెబుతూ నిధులు స్వాహా చేశారు.రూ.3.15 కోట్ల స్కామ్పై కమిషనర్ ఆరా..తెలంగాణ ఉర్దూ అకాడమీకి రూ.3.15 కోట్లను ఏపీ ఉర్దూ అకాడమీ నుంచి అప్పు ఇచ్చినట్లు ఆడిట్ రిపోర్ట్లో వెలుగు చూసిన వ్యవహారంపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ ఇటీవల ఆరా తీశారు. తన కార్యాలయానికి పలువురు సిబ్బందిని పిలిచి ఈ విషయంపై వివరాలు తెలుసుకున్నారు. ఆ నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి అప్పట్లో రికార్డులు సైతం తారుమారు చేశారని, ఆధారాలు ధ్వంసం చేశారని పలువురు ఉద్యోగులు చెప్పినట్లు తెలిసింది. నిధుల మళ్లింపు కేసులో గతంలోనే ఇద్దరి అరెస్టుతెలంగాణ ఉర్దూ అకాడమీకి 2016–17లో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ అప్పు ఇచ్చినట్లు చూపించి రూ.3.15కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్లు ఏపీ లోకాయుక్త ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాజాగా కూటమి ప్రభుత్వం విచారణకు కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు 2018–19లో ఉర్దూ అకాడమీకి చెందిన దాదాపు రూ.4కోట్లను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన వ్యవహారంపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే సీఐడీ 2021లో ఐపీసీ సెక్షన్ 420, 409 రెడ్విత్120(బి) కింద కేసు నమోదు చేసింది. అప్పటి ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్వలీ (ప్రస్తుతం రిటైర్డ్), సూపరింటెండెంట్ జాఫర్ (ప్రస్తుతం తెలంగాణ ఉర్దూ అకాడమీలో పని చేస్తున్నారు)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించారు. అనంతరం వారు బెయిల్ పొందారు.67 మంది వ్యక్తిగత ఖాతాలకు నిధుల మళ్లింపు ఏపీ ఉర్దూ అకాడమీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కొందరు ఉన్నతాధికారులు అడ్డగోలుగా తమ బంధువులు, అనుయాయుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులు మళ్లించి, ఆ తర్వాత వారి నుంచి తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇలా 2019 ఎన్నికల ముందు హడావుడిగా రూ.3,92,21,500లను ఏకంగా 67 మంది వ్యక్తిగత ఖాతాలకు జమ చేశారు. ఆ డబ్బులను వారి నుంచి తిరిగి తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. వారిలో ప్రధానంగా ఉన్నతాధికారులుగా పనిచేసిన షాహిదుల్లా బేగ్ ఖాతాకు రూ.2.2కోట్లు, సోహెల్ పాషా ఖాతాకు రూ.15లక్షలు, బీఎస్కే సైదా–పి.ఇస్మాయల్ల ఖాతాలకు రూ.3,77,700, షేక్ జాఫర్ బంధువులు, స్నేహితుల ఖాతాలకు రూ.95,22,906 మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. -
భారత్లో మొట్టమొదటి ఎయిర్బీఎన్బీ అకాడమీ: ఎక్కడంటే..
గ్లోబల్ హోమ్స్టే అండ్ హోటల్ అగ్రిగేటర్ 'ఎయిర్బీఎన్బీ'.. గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ సహకారంతో.. గోవాలో భారతదేశపు మొట్టమొదటి ఎయిర్బీఎన్బీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అకాడమీని ప్రారంభించింది. హోమ్స్టే టూరిజాన్ని ప్రోత్సహించడానికి.. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని హాస్పిటాలిటీ వ్యాపారవేత్తలలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి కంపెనీ గోవాలోని పర్యాటక శాఖ (DoT) మధ్య ఉన్న అవగాహన ఒప్పందం (MOU)లో భాగంగా ఈ అకాడమీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే, ఎయిర్బీఎన్బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్ప్రీత్ బజాజ్ పాల్గొన్నారు.కొత్త అకాడమీ ద్వారా.. వ్యక్తులను కంపెనీ హోస్ట్ చేసే ప్రపంచానికి పరిచయం చేయడమే ఎయిర్బీఎన్బీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీనికోసం కంపెనీ ఇంటరాక్టివ్ వర్క్షాప్ల ద్వారా 25 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఉత్తర గోవా నుంచి పాల్గొనేవారి కోసం మిరామార్ రెసిడెన్సీలో మొదటి రౌండ్ వర్క్షాప్లు జరిగాయి. దక్షిణ గోవా నుంచి మరో 25 మంది ట్రైనీలను లక్ష్యంగా చేసుకుని మడ్గావ్లో తదుపరి రౌండ్ శిక్షణలు నిర్వహించనున్నారు.ఎయిర్బీఎన్బీ అకాడమీ ప్రారంభం సందర్భంగా పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే మాట్లాడుతూ.. గోవా సంస్కృతిని సంరక్షించడం ద్వారా పునరుత్పాదక పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో హోమ్స్టే విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ ఒప్పందం గ్రామీణ గోవాకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.ఎయిర్బీఎన్బీతో అవగాహన ఒప్పందం.. ఎంటర్ప్రెన్యూర్షిప్ అకాడమీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పిస్తూనే.. గోవా తన ప్రత్యేక సాంస్కృతిక, సహజ ఆస్తులను ఉపయోగించుకోవడానికి ఈ చొరవ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం గోవా విభిన్నమైన, ప్రామాణికమైన అనుభవాలను ప్రదర్శించడానికి సహాయం చేస్తుందని పేర్కొన్నారు. -
రిలయన్స్ స్కిల్లింగ్ అకాడమీ ప్రారంభం
దేశంలో జాబ్ మార్కెట్కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీని ప్రారంభించింది. స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, విద్యా శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ అకాడమీని ప్రారంభించారు.నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) సహకారంతో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ కొత్త చొరవను ఆవిష్కరించారు. స్కిల్ బిల్డింగ్, పర్సనలైజ్డ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అందించే ఫ్యూచర్ రెడీ కోర్సులను స్కిల్లింగ్ అకాడమీ అందిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. పరిశ్రమల అనుసంధానంతో కెరీర్ డెవలప్మెంట్కు తోడ్పాటునందిస్తుందని పేర్కొంది.నైపుణ్యాలను నేర్పించడం, పెంపొందించడం ద్వారా వచ్చే సంవత్సరంలో 6 లక్షల మంది భారతీయ యువతకు సాధికారత కల్పించడం అకాడమీ లక్ష్యమని వెల్లడించింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ తన కోర్సుల పరిధిని విస్తరిస్తుందని, స్కిల్ ఇండియా మిషన్కు మద్దతునిస్తుందని వివరించింది. -
ఒళ్లో పేలిన ఫోను.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలిన ఉదంతం వెలుగు చూసింది. స్థానిక కోచింగ్ సెంటర్లో క్లాసులు జరుగుతుండగా ఒక విద్యార్థిని ఒళ్లోవున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తరగతిలో కలకలం చెలరేగింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ విద్యార్థిని మొబైల్ ఫోనును బయటకు విసిరేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హమీర్పూర్ ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ఉంది. ఇక్కడ దాదాపు 40 మంది చదువుకుంటున్నారు. క్లాసులో తరగతి జరుగుతుండగా ఓ విద్యార్థిని దగ్గరున్న ఫోనులో నుంచి మంటలు చెలరేగాయి దీంతో ఆమె భయంతో ఆ మొబైల్ ఫోనును మెయిన్ రోడ్డు వైపునకు విసిరేసింది. ఆ ఫోను అక్కడున్న సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. దీంతో సైన్ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోయింది. అనంతరం స్థానికులు అప్రమత్తమై ఆ మంటలపై బకెట్లతో నీళ్లు పోసి, ఆర్పివేశారు. భవనం మొదటి అంతస్థులో ఈ ఘటన జరిగింది. అక్కడికి సమీపంలోనే దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోడ్డుపైనో, తరగతి గదిలోనో ఆ మొబైల్ ఫోన్ పేలి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. -
రెడీ టు బడి
డిజిటల్ స్టార్ కావడం అనేది అదృష్టం కాదు. అవకాశం.ఆ అవకాశం చేతికి అందాలంటే ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనేది బాగా తెలిసి ఉండాలి.చాలామందిలో ఈ అవగాహన లోపించి ‘ఆరంభ శూరత్వం’ ప్రదర్శిస్తున్నారు.‘ఇది మనకు వర్కవుట్ అయ్యేలా లేదు’ అని రథాన్ని వెనక్కి మళ్లిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని కలలు కనే యువతరం కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’లాంటి నయా స్కూల్స్ వస్తున్నాయి. ‘కంటెంట్ కోచ్’లాంటి నయా గురువులు వస్తున్నారు.కెమెరా యాంగిల్స్ నుంచి ‘ఏ టైమ్లో వీడియోను రోస్ట్ చేయాలి?’ ‘బ్రాండ్లతో ఎలా కొలాబరేట్ కావాలి... లాంటి సమస్త విషయాలను నేర్చుకుంటున్నారు... దిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కడలికి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలనేది కోరిక. పబ్లిక్ స్పీకింగ్, బ్లాగింగ్పై పట్టు సాధించడానికి షార్ట్ కమ్యూనికేషన్ కోర్సులో చేరింది. డిజిటల్ స్టార్డమ్ ప్రభావంతో, తాము కూడా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ కోసం బడి బాట పడుతున్న అనేకానేక మందిలో కడలి ఒకరు. 2022తో పోల్చితే మన దేశంలో 2024లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య బాగా పెరిగిందని చెబుతోంది ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఫర్మ్ జెమ్ఫో. ‘ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే చాలు, ఆడియో అండ్ వీడియో కాప్చరింగ్ తెలిసి ఉంటే చాలు కంటెంట్ క్రియేటర్గా రాణించవచ్చు అని అనుకోవడానికి లేదు. నేర్చుకోవడానికి చాలా ఉంది’ అంటున్నాడు కంటెంట్ కోచ్, బ్రాండ్ కన్సల్టంట్ మనీష్ ΄ాండే. మనీష్లాంటి కంటెంట్ కోచ్ల ద్వారా సాంకేతిక విషయాలపై నైపుణ్యంతో ΄ాటు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఎలాంటి వీడియోలు ఆదరణ పోందుతున్నాయో తెలుసుకుంటున్నారు ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లు. డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్లూయెన్సర్లు కావాలనుకునేవారి కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’ పేరుతో ఫస్ట్ స్కూలు ఏర్పాటయింది. ‘కంటెంట్ను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? పర్సనల్ గ్రూమింగ్, వార్డ్రోబ్ మేనేజ్మెంట్, బాడీ లాంగ్వేజ్...ఇలా వెరైటీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాం. మంచి స్పందన ఉంది’ అని చెబుతున్నారు ‘స్పియర్క్రాఫ్ట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌమ్యబాత్రసేన్ గు΄్తా.మరోవైపు మైక్రో అండ్ నానో న్ఫ్లూయెన్సర్లు కంటెంట్ కోచ్లకు బిగ్గెస్ట్ క్లయింట్స్గా ఉన్నారు. కన్సల్టేషన్ కోసం తన దగ్గరకు వస్తున్న వారిలో చిన్న వ్యా΄ారాలు చేస్తున్నవారు, నెయిల్ ఆర్టిస్ట్లు, స్కిన్కేర్ క్రియేటర్లు... ఇలా అన్ని రకాల వారు ఉన్నారని హైదరాబాద్కు చెందిన కంటెంట్ కోచ్ ఇషిక పన్సారీ చెబుతోంది. ‘ఆరు నెలల వ్యవధిలో 600 మందికి శిక్షణ ఇచ్చాను’ అని చెబుతుంది ఇషిక. సెషన్లో భాగంగా కంటెంట్ ఐడియాలు ఇస్తుంది. ‘బార్టర్ డీల్స్ నుంచి బ్రాండ్ కొలాబ్రేషన్స్, యాడ్–జెనరేటెడ్ రెవెన్యూ వరకు కంటెంట్ క్రియేషన్ స్పేస్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయిన్పటికీ ‘డబ్బు’ అనేది చివరి అంశం. డబ్బు సం΄ాదించడానికి ఓపిక, స్థిరత్వం ఉండాలి’ అంటాడు కంటెంట్ కోచ్ మనీష్ ΄పాండే. ఇరవై రెండు సంవత్సరాల దామినీ చౌదురీ ఫుడ్, ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా రాణించాలనుకుంటుంది. ‘ఇటీవలే పర్సనల్ స్టైలింగ్, ఇమేజ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాను. నాకు 7,000 ఫాలోవర్స్ ఉన్నారు’ అంటున్న దామిని శిక్షణ ద్వారా ఓవరాల్ ప్రెజెంటేషన్, అ్ర΄ోచ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంది. ‘ఆడియెన్స్తో కనెక్ట్ అయ్యే స్పార్క్ అనేది ఏ కొద్దిమందికో పరిమితమైనది కాదు’ అంటున్న కంటెంట్ కోచ్లు బ్రాండ్తో ఎలా కొలాబరేట్ కావాలి. ఎలా నెగోషియేట్ చేయాలి, కంటెంట్ను ఎలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి, బెటర్ కెమెరా యాంగిల్ ఎలా ఉపయోగించాలి... మొదలైన టెక్నికల్ యాస్పెక్ట్స్ను సులభంగా తెలియజేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ కోర్సుల కోసం చాలామంది స్కిల్స్ షేర్, ఉడెమీలాంటి ఆన్లైన్ లెర్నింగ్ ΄్లాట్ఫామ్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వీడియో రోస్ట్ చేయడానికి రోజులో మంచి టైమ్ ఏమిటి? ఎలాంటి పరికరాలు కావాలి? ఎలాంటి లైటింగ్ బాగా ఉపయోగపడుతుంది... లాంటి విషయాలను నేర్చుకుంటున్నారు. కొండంత అండ... మన దేశంలోని టాప్ డిజిటల్ స్టార్స్లో 27 సంవత్సరాల బృంద శర్మ ఒకరు. డిజిటల్ స్టార్ కావాలని, అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కొండలు, గుట్టలు అంటే ఆమెకు ఇష్టం. వాటిని వెదుక్కుంటూ వెళ్లడం అంటే ఇష్టం. దుబాయ్లో చేసే 9–5 ఉద్యోగం కంటే కొండల గుండెల చప్పుడు వినడం అంటేనే ఆమెకు ఇష్టం. ఎన్నో దేశాలలో ఎన్నో పర్వతాలకు సంబంధించిన ఆసక్తికరమైన చరిత్రను ఇన్స్టాగ్రామ్ వేదికగా లోకంతో పంచుకునేది. ఆ తరువాత ట్రావెలింగ్కు సంబంధించిన వీడియోలతో ఫుల్–టైమ్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ప్రకృతిపై ప్రేమ, ప్రయాణం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అన్నట్లుగా ఉండేది బృంద. అయితే అనునయ్సూద్ అనే ఫ్రెండ్ సలహాతో ఇన్స్టాగ్రామ్ మిషన్ ్ర΄ారంభించింది. తన వీడియోలను వైరల్ చేయాలని, కావాలనీ... బృంద ఎప్పుడూ అనుకోలేదు. అయితే కంటెంట్లో ఉన్న సత్తాతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. బృందశర్మను డిజిటల్ స్టార్ను చేశాయి. ప్రేక్షక లోకమే ΄పాఠశాల సీఏ పరీక్షలు పూర్తయిన తరువాత ఫైనాన్స్ర్΄÷ఫెషన్లోకి వచ్చింది ట్వింకిల్ జైన్. ఫైనాల్సియల్ లిటరసీని దృష్టిలో పెట్టుకొని 2021 నుంచి సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ‘బిజినెస్ అండ్ ఫైనాన్స్కు సంబంధించిన వీడియోలు ఎవరు చూస్తారు?’ అని అనుకొని ఉంటే 26 సంవత్సరాల వయసులోనే టాప్ డిజిటల్ స్టార్స్ జాబితాలో ట్వింకిల్ పేరు ఉండేది కాదు. తెలిసో తెలియకో జటిలమైన విషయాలను మరింత జటిలంగా చెబుతూ శ్రోతలను భయభ్రాంతులకు గురి చేస్తారు కొందరు. మరి కొందరు మాత్రం ఎంత జటిలమైన విషయాన్ని అయినా ‘ఓస్ ఇంతేనా’ అన్నట్లుగా సులభంగా అర్థమయ్యేలా చెబుతారు. ట్వింకిల్ జైన్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ప్రేక్షక లోకమే ఆమె ΄ాఠశాల. వారి నుంచే విలువైన ΄ాఠాలను నేర్చుకుంది. -
ప్రపంచ స్థాయికి ‘నాసిన్’ కీర్తి
సాక్షి, పుట్టపర్తి: అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రపంచస్థాయి సంస్థ ‘నాసిన్’ అకాడమీని నెలకొల్పినందుకు ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) అకాడమీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ప్రధానితో కలసి పాల్గొన్నారు. ‘నాసిన్’ను తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం చేయడమే కాకుండా పట్టుబట్టి సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు సందర్భాలలో ఇక్కడికి రావడం మన కళ్లెదుటే కనిపించిన వాస్తవమన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ మన రాష్ట్రం పేరు, కీర్తి ప్రతిష్టలను దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్నింటిని అనుసంధానించే గొప్ప సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు. -
ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు: సీఎం జగన్
-
క్షిపణుల డిజైన్లో స్టార్టప్లను భాగస్వాములను చేయాలి
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్ఎస్ కళింగ బేస్లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. -
అమీర్పేట్లో అవాన్య నెయిల్ అకాడమీ.. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ సందడి (ఫోటోలు)
-
ఏపీ జ్యూడిషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ చంద్రచూడ్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. మంగళగిరి మండలం ఖాజాలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అనంతరం సీజేఐ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగింది. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. న్యాయవాదులు నల్లకోటు ధరించి తిరగడం చూస్తుంటాం. అందులోని తెలుపు, నలుపు రంగులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణగా పరిగణిస్తారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలి. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలి. న్యాయవ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరం. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. జడ్జిలకు సొంత సామర్ధ్యాలపై విశ్వాసం ఉండాలి. ముఖ్యమైన కేసుల్లో త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే తీర్పుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. -
కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ లేదు. దీంతో రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సిఫారసులు పంపింది. ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్ పేరు మీద జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీలో ఉన్న సిబ్బందిలో 58.32 శాతం మించకుండా సిబ్బందిని మంజూరు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వివరాలతో తగిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామంది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను కోరింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే అక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
సాగర గర్భంలో పర్యాటకం
విశాఖ తీరం పర్యాటకులకు వినూత్న అనుభూతులను అందిస్తోంది. సాగరగర్భంలోని అనంత సంపద అందాల మధ్య ఈత కొట్టిస్తోంది. సాహసాలు చేసే యువతకు స్కూబా డైవింగ్ (సముద్ర లోతుల్లో ఈత)లో దేశంలోనే అగ్రశ్రేణి ప్రాంతంగా నిలుస్తోంది. ఇప్పటికే రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్తో అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం విశాఖ కేంద్రంగానే స్కూబా డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. – సాక్షి, అమరావతి ఎన్నెన్నో డైవింగ్ స్పాట్లు విశాఖ సముద్ర జలాల లోతుల్లో ఈదుతూ స్పష్టంగా చూడగలిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవే పర్యాటకులను స్కూబా డైవింగ్ వైపు ఆకర్షిస్తున్నాయి. పూడిమడక బీచ్లో 3 స్పాట్స్, రుషికొండలో 2, మంగమారిపేటలో 3, భీమిలిలో సైతం సాగర అడుగు భాగంలోని అరుదైన మత్స్య, వృక్ష, జంతు సంపదతో డైవింగ్కు అనుకూలంగా ఉండే ప్రాంతాలను స్థానిక స్కూబా డైవర్లే కనుగొనడం విశేషం. అరుదైన చింతపల్లి.. ప్రభుత్వం విజయనగరం జిల్లా తీర ప్రాంత గ్రామమైన చింతపల్లిలో స్కూబా డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇక్కడి సముద్ర జలాలు మాల్దీవులు, అండమాన్ పరిస్థితులను పోలి ఉండటంతో పాటు అడుగున ఓడ శిథిలాలు, చిన్నచిన్న పర్వతాలు, జంతుజాలం ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డు నుంచి 10 కిలో మీటర్ల లోపలికి వెళ్లితే 5 స్పాట్ల్లో సముద్రగర్భ అందాలను చూడవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా.. పర్యాటకులతో సరదాగా స్కూబా డైవింగ్ చేయించడంతో పాటు అకాడమీ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్నారు. తద్వారా ప్రపంచ సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్ చేసేందుకు అర్హత లభిస్తుంది. ఇందులో ఓపెన్ వాటర్, అడ్వాన్స్ ఓపెన్ వాటర్ విభాగాల్లో డైÐŒ లు చేయాల్సి ఉంటుంది. వీరికి శిక్షణలో భాగంగా తొలుత స్విమ్మింగ్ పూల్ (నిశ్చల జలాల్లో) మెలకువలు నేర్పిస్తారు. సముద్రం అడుగు భాగంలోని వాతావరణ పరిస్థితులను బోధిస్తారు. రెండు రోజుల నుంచి వారం పాటు సాగే ఈ కోర్సుల్లో చేరేవారికి కచ్చితంగా ఈత వచ్చి ఉండాలి. ఒక్కో కోర్సుకు సుమారు రూ. 25 వేల వరకు ఫీజు ఉంటుంది. దేశంలో గోవా, నేత్రాని ద్వీపం (గోవా సమీపంలోని కర్ణాటక తీరంలో), పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ దీవుల్లో మాత్రమే డైవింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్కూబా డైవింగ్ను సాహస క్రీడగా పేర్కొంటూ అందులో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం టెన్జింగ్ నార్గే అవార్డును సైతం అందిస్తోంది. దీనిని అర్జున అవార్డుతో సమానంగా గుర్తిస్తారు. రెండు విధాలుగా.. విశాఖలో పర్యాటకులకు రెండు రకాల స్కూబా డైవింగ్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి డైవింగ్ మాస్టర్ ప్రత్యేక సూచనలిస్తూ ఒడ్డు నుంచి ఈదుకుంటూ 500 మీటర్ల వరకు సముద్ర జలాల్లోకి తీసుకెళ్తారు. మరో విధానంలో బోటుపై 1.5కిలో మీటర్ల సముద్రం లోనికి తీసుకెళ్లి డైవింగ్ చేయిస్తారు. రెండింటిలోనూ 8–11 మీటర్ల లోతు వరకే పర్యాటకులను అనుమతిస్తారు. ఇందు కోసం రూ.2,500 నుంచి రూ.4వేలకు పైగా ఫీజు వసూలు చేస్తారు. పర్యాటకులు సాహసం చేసే సమయంలో వీడియోను చిత్రీకరించి అందిస్తారు. ప్రశాంత జలాల్లోనే.. ఉదయం పూట సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అలల ఉధృతి తక్కువగా ఉండటంతో పాటు సాగర గర్భంలో పరిస్థితులు నెమ్మదిగా ఉంటాయి. అందుకే ఉదయం పూటనే స్కూబా డైవింగ్ను చేయిస్తున్నాం. సాయంత్రం అయితే సముద్రం పోటు ఎక్కువగా ఉండి.. డైవర్లకు విజిబులిటీ తక్కువ అవుతుంది. గతంతో పోలిస్తే పర్యాటకులు సంఖ్య పెరుగుతోంది. స్కూబా డైవింగ్కు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉంటే ఎవరైనా చేయవచ్చు. మనకు చింతపల్లి అంతర్జాతీయ స్థాయి స్కూబా డైవింగ్ కేంద్రంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వంతో కలిసి అక్కడ అక్టోబర్ నుంచి అకాడమీ సేవలను ప్రారంభించనున్నాం. – బలరామ్నాయుడు, లైవ్ ఇన్ అడ్వెంచర్స్, విశాఖపట్నం -
జైభీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్' ఛానెల్లో
Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel: మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్లో అదరగొడుతుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల సూర్య నటించిన చిత్రం 'జైభీమ్'. సినిమా అంటే మూడు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్తో ప్రేమాయణం, ఐటెం సాంగ్లు కాదని నిరూపించి, సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సత్తా చాటింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా ఐఎండీబీ రేటింగ్స్లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ 'ది షాషాంక్ రిడంప్షన్' చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు. అలాగే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామా కథాశంతో తెరకెక్కిన 'జైభీమ్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్ను ఉంచటం ఇదే మొదటిసారి. కాగా అకాడమీ యూట్యూబ్ ఛానెల్లో జైభీమ్ సినిమా వీడియో ఉండటంపై చిత్రబృందంతోపాటు అభిమానులు సంతోషపడుతున్నారు. 'జైభీమ్' ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'జస్టిస్ చంద్రు' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? #Suriya's #JaiBhim scenes uploaded to #Oscars Official YouTube channel.👍👏@Suriya_offl ➡️ https://t.co/AXQwY2av72 pic.twitter.com/QmgFrz827n — Suresh Kondi (@SureshKondi_) January 18, 2022 • #JaiBhim is now the only Tamil Movie to be shown in The Academy #Oscars YouTube channel 🔥💯 Ever Proudful @Suriya_offl na 😇❤️ pic.twitter.com/3JhxVZhX1q — CHENTHUR (@ck__tweetz) January 18, 2022 #JaiBhim getting bigger and bigger 🔥 First Tamil movie scenes to shown in #Oscars utube ❤@Suriya_offl #EtharkkumThunindhavan#VaadiVaasal pic.twitter.com/qJcs0TsIQd — Mass Syed 💥 (@SuriyaFanstren4) January 18, 2022 -
తిరుపతిలో ఏపీ సర్వే ట్రైనింగ్ అకాడమీ
సాక్షి, అమరావతి: ఏపీ సర్వే శిక్షణ అకాడమీ తిరుపతిలో ఏర్పాటు కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా తిరుపతి మండలం చెన్నయ్యగుంట గ్రామ పరిధిలో 41.19 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం ఈ అకాడమీ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో తాత్కాలికంగా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలోని 200 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత అది తెలంగాణ ఆధీనంలోకి వెళ్లింది. రాష్ట్రంలో సర్వే శిక్షణ అవసరాల కోసం అకాడమీ లేకపోవడంతో 2017లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ట్రెయినింగ్ సెంటర్లో లీజు ప్రాతిపదికన సర్వే అకాడమీని ఏర్పాటు చేశారు. అది కేవలం 2.90 ఎకరాల్లో మాత్రమే ఉంది. తాత్కాలిక కేంద్రంలో సరిపడా వసతులు లేకుండానే అకాడమీ నడుస్తున్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ వెంటనే శాశ్వత అకాడమీకి తిరుపతిలో భూమి కేటాయించారు. ఈ భూముల్లో త్వరలో కొత్త అకాడమీని ఏర్పాటుచేసేందుకు సర్వే శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. తరగతి గదులు, హాస్టల్, పరిపాలనా భవనం, క్యాంటీన్ ఇతర సౌకర్యాల కోసం భవనాలను నిర్మించాల్సి వుంది. అందరికీ ఇక్కడే శిక్షణ కొత్తగా సర్వీసులోకి వచ్చిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లకు భూముల సర్వేపై ఇక్కడే శిక్షణనిస్తారు. ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్లు, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు, జ్యుడీషియల్ అధికారులు, ఇతర సర్వే ఉద్యోగులకూ సర్వేపై శిక్షణ ఇస్తారు. కొత్తగా సర్వీసులోకి వచ్చిన వారికి ఇండక్షన్ ట్రెయినింగ్లు, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకు రిఫ్రెషర్ ట్రెయినింగ్లు, కొన్ని ప్రత్యేక శిక్షణలతోపాటు అడ్వాన్స్డ్ సర్వే టెక్నాలజీ ట్రెయినింగ్లనూ ఇక్కడ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందికి పెద్దఎత్తున శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అకాడమీకి ముఖ్యమంత్రి తిరుపతిలో భూములు కేటాయించినట్లు సర్వే శాఖ అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత 11,187 మంది సర్వేయర్లకు అకాడమీ 50కిపైగా శిక్షణలు ఇచ్చింది. -
‘రజా అకాడమీ’ని నిషేధించాలి
నాగపూర్/పుణే: మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లో హింసాకాండ చోటుచేసుకోవడంపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో జరిగిన మత కలహాలను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను వీహెచ్పీ జనరల్ సెక్రెటరీ మిలింద్ పరాండే ఆదివారం ఖండించారు. అల్లర్లకు కారణమైన ‘రజా అకాడమీ’ అనే ఇస్లామిక్ సంఘాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లరి మూకలపై తాము పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశామని అన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒకవేళ పోలీసులు స్పందించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో త్వరలో గవర్నర్ భగత్సింగ్ కోషియారీని కలుస్తామన్నారు. అల్లర్లలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించా లని మహారాష్ట్ర సర్కార్కి మిలింద్ పరాండే విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపైనా ఆయన మాట్లాడారు. భారత్ 2014లో సాంస్కృతిక స్వాతంత్య్రం పొందిందని చెప్పారు. -
తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి?
అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వస్తున్న విమర్శలపై ఆదివారం ఏపీ తెలుగు-సంస్కృత అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి? అని ఆమె ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా.. విస్తరించడం వల్ల నష్టం ఏంటో విమర్శకులు వివరించాలి అని ఆమె నిలదీశారు.తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించాలని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని సవినియంగా మనవి చేస్తున్నానన్నారు. -
బైజూస్ మెగా డీల్ @7,300 కోట్లు
ముంబై: దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ తాజాగా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 1 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 7300 కోట్లు) చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి దేశీయంగా అతిపెద్ద ఎడ్యుటెక్ డీల్స్లో ఒకటిగా ఇది నిలవనున్నట్లు అభిప్రాయపడ్డాయి. కోవిడ్–19 నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకు డిమాండ్ మరింత పెరగడంతో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బైజూస్ ఇటీవల నిధుల సమీకరణ చేపట్టిన విషయం విదితమే. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ సంస్థతోపాటు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, బాండ్ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంది. దీంతో బైజూస్ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఇంజినీరింగ్, మెడికల్ విద్యా శిక్షణలో పట్టున్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్కు దేశవ్యాప్తంగా 200 శిక్షణా కేంద్రాలున్నాయి. బైజూస్తో డీల్లో భాగంగా ఆకాష్లో కంపెనీ వ్యవస్థాపకులు చౌధరీ కుటుంబ సభ్యులు వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఆకాష్లోగల 37.5 శాతం వాటాకుగాను బైజూస్లో కొంత వాటాను బ్లాక్స్టోన్ గ్రూప్ పొందే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. జేఈఈ ప్రిపరేషన్కు ‘అమెజాన్ అకాడమీ’ అమెజాన్ ఇండియా ‘అమెజాన్ అకాడమీ’ పేరిట జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ప్రిపరేషన్ కోసం విద్యార్థులకు అవసరమైన ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. గూగుల్ప్లే స్టోర్లో బీటా వర్షన్ యాప్ ఉచితంగా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బైజూస్, అన్అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ఇండియా (ఎడ్యుకేషన్) డైరెక్టర్ అమోల్ గుర్వారా తెలిపారు. జేఈఈతో పాటు బీఐటీఎస్ఏటీ, వీఐటీఈఈఈ, ఎస్ఆర్ఎంజేఈఈఈ, ఎంఈటీ పరీక్షల విద్యార్థులకు కూడా నాణ్యమైన కంటెంట్ అందుబాటులో ఉందని తెలిపారు. చదవండి: ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం! మొబైల్ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ ఆఫర్ -
గగన్ అకాడమీలోకి వరద నీరు
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒలింపిక్ మెడలిస్ట్, షూటర్ గగన్ నారంగ్ ‘గన్ ఫర్ గ్లోరీ (జీఎఫ్జీ) అకాడమీ’లోకి వరద నీరు వచ్చి చేరింది. సికింద్రాబాద్లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న తన షూటింగ్ రేంజ్లోకి వరద నీరు చేరడంతో దాదాపు రూ. 1.3 కోట్లు విలువైన షూటింగ్ సామగ్రి పాడైనట్లు నారంగ్ గురువారం వెల్లడించాడు. ‘ 24 గంటల్లో అంతా నాశనమైంది. భారీ వరద మా షూటింగ్ రేంజ్ను ముంచెత్తింది. కొత్తగా తెచ్చిన 80 రైఫిల్స్, పిస్టల్స్తో పాటు ఇతర సామగ్రిని పూర్తిగా పాడు చేసింది. జీఎఫ్జీ సిబ్బంది 9 ఏళ్ల కష్టం వరద నీటిలో కొట్టుకుపోయింది’ అని ఆవేదనతో నారంగ్ పోస్ట్ చేశాడు. ఇప్పటికే కరోనా వల్ల ఏర్పడిన నష్టం చాలదన్నట్లు... తాజా వరదలు జీఎఫ్జీని ఆర్థికంగా దెబ్బ తీశాయని నారంగ్ వ్యాఖ్యానించాడు. జీఎఫ్జీని ప్రపంచస్థాయి షూటింగ్ అకాడమీగా మార్చేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడ్డామని, ఇకపై అకాడమీని మునపటిలా మార్చడానికి వీలవుతుందో లేదో చెప్పడం కష్టమని పేర్కొన్నాడు. -
తెలంగాణలో వెయిట్లిఫ్టింగ్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ క్రీడల్లో పతకం అందించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చరిత్రలో నిలిచిపోయింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 సిడ్నీ ఒలింపిక్స్లో మల్లేశ్వరి మహిళల వెయిట్లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆమెతో టీ–స్పోర్ట్స్ చైర్మన్, జాతీయ హ్యాండ్బాల్ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్ రావు వెబీనార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సహకారమిస్తే హైదరాబాద్ కేంద్రంగా వెయిట్లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తానని, తెలుగు రాష్ట్రాల క్రీడాకారుల అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రతిభావంతులైన ఎంతోమంది యువ వెయిట్లిఫ్టర్లు ఉన్నారని... అయితే వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అకాడమీ లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదని టీ–స్పోర్ట్స్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. మల్లేశ్వరి ఫౌండేషన్తో కలిసి తెలంగాణ లిఫ్టర్లకు చేయూత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మల్లేశ్వరి హైదరాబాద్కు రావాలని ఈ వెబీనార్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో సీఎం కేసీఆర్ను కలిసి రాష్ట్రంలో వెయిట్లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాట్లపై చర్చిద్దామని ఆయన అన్నారు. -
తిరుపతికి మరో మణిహారం
ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ రాష్ట్రంలో ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా తెలుగు సంస్కృత అకాడమీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సాక్షి, తిరుపతి: ఏపీ, తెలంగాణాల అధికార భాష తెలుగు. సుమారు 9 కోట్ల మందికి తెలుగు మాతృభాషగా ఉంది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి, తెలుగు భాషలో పాఠ్యాంశాల తయారీ, ప్రచురణ, తెలుగు సాహిత్యంపట్ల అవగాహన పెంచి ప్రొత్సహించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా అనేక పాఠ్యపుస్తకాలను ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. అలాగే వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో సదస్సులు, సెమినార్లు నిర్వహించేవారు. ఈ అకాడమీ ద్వారా డిగ్రీ స్థాయి వరకు అనేక ప్రామాణిక పుస్తకాలు తీసుకొచ్చారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలుగు అకాడమీ ఇంకా విడిపోలేదు. రెండు రాష్ట్రాలకు సంయుక్తంగా ఉంది. సుమారు 400 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఏపీలో 58 శాతం నిధులు రావాల్సి ఉంది. 2014–2019 వరకు అధికారంలో కొనసాగిన టీడీపీ ప్రభుత్వం దీని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు అకాడవీుకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకున్నారు. లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్మ న్గా నియమించారు. ప్రభుత్వం తెలుగు భాష, సంస్కృతిని అకాడమీతో కలిపి తెలుగు సంస్కృత అకాడమీ పేరిట రాష్ట్రస్థాయి సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేయాలని గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు ర్యాంకులు ఇలా.. ఇప్పటికే ప్రాంతీయ కేంద్రం తెలుగు అకాడవీుకి ఏపీలో 5 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. తిరుపతి, అనంతపురం, గుంటూరు, విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తిరుపతిలో కోర్టు ఎదురుగా ఉన్న కోదండరామ హైసూ్కల్లో ప్రాంతీయ కేంద్రం పని చేస్తుంది. తిరునగరికి మరో కలికితురాయి.. తిరుపతిలో ఎస్వీయూ, మహిళావర్సిటీ, వేదిక్, వెటర్నరీ, సంస్కృత వర్సిటీ, ఐఐటీ, ఐసర్ తదితర విద్యాసంస్థలు ఉన్నాయి. అలాగే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు పరిరక్షణ సమితి, తెలుగు భాషా వికాస వేదిక తదితర సంస్థలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పని చేస్తున్నాయి. తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతరకు రాష్ట్రంలో ఎంతో గుర్తింపు ఉంది. అలాంటి తిరుపతి నగరంలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు పట్ల తెలుగు భాష ప్రేమికులు, సాహితివేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంచి నిర్ణయం తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తిరుపతి లో తెలుగుసంస్కృత అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయం. రాయలసీమ ప్రాంతంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో గుర్తింపు లభిస్తుంది. – జే ప్రతాప్ రెడ్డి, ప్రొఫెసర్, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ తెలుగు భాష, సంస్కృతికి మేలు తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పా టు చేయడం వల్ల తెలుగుభాష, సంస్కృతికి మే లు చేకూరుతుంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఆధ్యాత్మికతకు సంస్కృతి, భాష తోడైతే తెలుగు సంస్కృతి, భాషకు ఉన్నత స్థితి లభిస్తుంది. తెలుగు ప్రజలకు గుర్తింపు దక్కుతాయి. – డాక్టర్ గెంజి అరుణ, అసోసియేట్ ప్రొఫెసర్, భాషోత్పత్తి శాస్త్రం, ఎస్వీయూ -
చెన్నైలో సింధు పేరుతో అకాడమీ
చెన్నై: ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరుతో చెన్నైలో అకాడమీ నిర్మా ణమవుతోంది. ‘హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్’ ఆధ్వర్యంలో చెన్నై శివారులో ఈ అకాడమీని నిర్మిస్తున్నారు. బుధవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి తెలుగుతేజం సింధు స్వయంగా హాజరై పునాదిరాయి వేసింది. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనేది ధ్యానం నేర్పించే సంస్థ. కమలేశ్ పటేల్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో ఆమె ధ్యానం నేర్చుకున్నారు. మొత్తం 8 కోర్టులతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ అకాడమీని 18 నుంచి 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిసింది. జిమ్, ఫిజియో సెంటర్లు అందుబాటులో ఉంచుతారు. 1000 మంది ప్రేక్షకులు సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు చేయనున్నారు. -
విద్యార్థి ఆత్మహత్య: శ్రీసాయి డిఫెన్స్ అకాడమీపై దాడి
-
15 ఎకరాల్లో అడ్వొకేట్స్ అకాడమీ
కమాన్చౌరస్తా (కరీంనగర్): హైదరాబాద్ సమీపంలోని షామీర్పేట, నల్సార్ లా యూనివర్సిటీ సమీపంలో 15 ఎకరాల్లో అడ్వొకేట్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. కరీంనగర్ కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు మినీగార్డెన్, ఈ–ఫైలింగ్ కోర్టు విభాగాలను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ పి.నవీన్రావుతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ మాట్లాడారు. జనవరిలోగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్లు కూడా న్యాయవాదుల కోసం వర్క్షాప్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరీంనగర్ పోర్ట్ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరాం మాట్లాడుతూ కోర్టులు సరైన సమయంలో తీర్పులు ఇవ్వకపోవడంతోనే ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. మరో న్యాయమూర్తి పి.నవీన్రావు మాట్లాడుతూ కోర్టులో అధునాతన మార్పులు ఆనందకరమని, త్వరలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నంది మేడారం పంప్హౌస్ సందర్శన ధర్మారం: రైతులకు ఎల్లకాలం సాగునీరు అందేలా కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం సంతోషకరమని జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద నిర్మించిన పంప్హౌస్ను శనివారం న్యాయమూర్తులు కోదండరాం, నవీన్రావు, కరీంనగర్ జిల్లా జడ్జి అనుపమా చక్రవర్తితో కలసి సందర్శించారు. పంప్హౌస్లోని సర్జిఫూల్, మోటార్లు, విద్యుత్తు సబ్స్టేషన్లను పరిశీలించారు. ప్రాజెక్టు గురించి ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్ వివరించారు. అనంతరం మేడారంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. త్రికుటాలయం, నంది ఆలయాలను సందర్శించారు. న్యాయమూర్తి నవీన్రావు నివాసానికి వెళ్లి కాసేపు గడిపారు. -
పైలెట్ల కార్ఖానా
-
గోపీచంద్ అకాడమీలో మరో శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్లో క్రీడాకారుల కోసం మరో శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ఆవరణలో అదనంగా ఆరు ఎయిర్ కండిషన్డ్ కోర్టుల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల కాలంలో రూ. 30 కోట్ల నుంచి రూ. 35 కోట్లు వెచ్చించి ఈ శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా తెలిపారు. ఈ కేంద్రంలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ను కూడా నెలకొల్పుతామని, కోచ్లకు శిక్షణ కా ర్యక్రమాలు ఉంటాయని అన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సౌకర్యాలు లభిస్తే భారత ఆటగాళ్లు మున్ముందు మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తారు. అంతర్జాతీయ మ్యాచ్లను ఎయిర్ కండిషన్డ్ కోర్టులలో నిర్వహిస్తారు. అకాడమీలో ఎయిర్ కండిషన్డ్ కోర్టులు ఉండాలని కోరుకున్నాం. త్వరలోనే వీటి నిర్మాణ పనులు మొదలవుతాయి. ఇందులో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తారు’ అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. -
సచిన్–మిడిలెసెక్స్ అకాడమీ
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్కు చెందిన మిడిలెసెక్స్తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ’ (టీఎంజీఏ) పేరుతో త్వరలోనే నార్త్వుడ్ (ఇంగ్లండ్)లో తొలిదశ శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. నార్త్వుడ్లోని ప్రఖ్యాత మర్చంట్ టేలర్స్ స్కూల్ క్యాంపస్లో వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు క్యాంప్ జరుగనుంది. ఆ తర్వాత ముంబై, లండన్లలోనూ శిబిరాలను నిర్వహించనున్నారు. 9 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు విశేష అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించడమే ఈ శిబిరాల లక్ష్యం. ఇందులో సచిన్ కోచ్గా పరకాయ ప్రవేశం చేయనున్నాడు. ‘మిడిలెసెక్స్తో జతకట్టడం ఆనందంగా ఉంది. ఇక్కడ కేవలం క్రికెటర్లను తయారు చేయడమే కాదు, ఉన్నతమైన పౌరుల్ని అందించడమే మా లక్ష్యం’ అని సచిన్ అన్నాడు. -
‘మనందరిపై బాధ్యత ఉంది’
సాక్షి, చేబ్రోలు: ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో వెయిట్లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చెప్పారు. 2024లో జరిగే ఒలింపిక్స్లో తమ అకాడమీ క్రీడాకారులు తప్పక ఒలింపిక్ పతకం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగిన విజ్ఞాన్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. హరియాణాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నామని.. శ్రీకాకుళం జిల్లాలోనూ అకాడమీ స్థాపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. యువతరం ఆలోచనలు, ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం బాగుందన్నారు. కానీ నిధులను వినియోగించే విషయంలో ఇప్పటికీ సమస్యలున్నాయన్నారు. ప్రతిభావంతులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం ఉండటం లేదన్నారు. వెయిట్లిఫ్టింగ్ శిక్షణ ఇచ్చేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన 49 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుకొచ్చి వారికి ఉచితంగా చదువులు చెప్పగలిగితే.. తాము వారిని అత్యుత్తమ వెయిట్ లిఫ్టర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. -
దుబాయ్లో అశ్విన్ అకాడమీ
చెన్నై: సీనియర్ సహచరుడు ధోని బాటలోనే భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా దుబాయ్లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయనున్నాడు. జనరేషన్ నెక్ట్స్ పేరుతో నిర్వహించే ఈ అకాడమీలో చిన్నారులకు శిక్షణ ఇస్తారు. ఇదే పేరుతో అశ్విన్కు చెన్నైలో ఇప్పటికే సొంత అకాడమీ ఉంది. అకాడమీ కోసం కోచింగ్కు సంబంధించిన ప్రత్యేక ప్రోగ్రామ్ను అశ్విన్ స్వయంగా రూపొందించడం విశేషం. ఈ నెల చివర్లో అకాడమీ ప్రారంభమవుతుంది. దీనికి డైరెక్టర్గా మాజీ క్రికెటర్, కెన్యా క్రికెట్ సీఈఓ కోబస్ ఒలివర్ను అశ్విన్ నియమించాడు. -
చల్..చలో..చలో..!
అకాడమీలో శిక్షణకు క్రీడాకారుల ఎంపిక భానుగుడి(కాకినాడ): శాప్ ఆధ్వర్యంలో నాణ్యమైన క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ,అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో మెరిసేలా అకాడమీలలో కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లాలోనే నిష్ణాతులైన కోచ్లతో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా 13 జిల్లాలో పలు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులనుంచి శనివారం దరఖాస్తులు స్వీకరించి, నైపుణ్యాలను పరిశీలించారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్ లకు సంబంధించి రాష్ట్రస్థాయిలో 96మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకోగా వారికి శరీరధారుడ్య పరీక్షలు నిర్వహించారు. అథ్లెటిక్స్కు 31 మంది, జూడోకు 27, జిమ్నాస్టిక్స్కు–7, వెయిట్ లిప్టింగ్కు 31 మంది క్రీడాకారులు హాజరయ్యారని డీఎస్డీవో సయ్యద్ సాహెబ్ తెలిపారు. వీరందరికీ పలు పరీక్షలు నిర్వహించి ప్రతీ క్రీడకు 20 మంది చొప్పున క్రీడకారులను ఎంపిక చేస్తామన్నారు. ప్రతీ ఈవెంట్కు సంబంధించి నైపుణ్య పరీక్షలు నిర్వహించి క్రీడాకారుల ఎంపికలుంటాయన్నారు. ఎంపికలను శాప్ అడిషనల్ డైరక్టర్ ఎస్వీ రమణ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలిపారు. నేడు సత్తిగీత, ఎన్.లక్ష్మి హాజరు నేడు జరిగే ఎంపికలకు అంతర్జాతీయ అథ్లెట్ సత్తిగీత, వెయిట్లిఫ్టర్ ఎన్.లక్ష్మిలు హాజరు కానున్నారు. వీరితో విద్యార్థినులకు మోటివేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఎస్డీవో తెలిపారు.రాష్ట్ర ఒలింపిక్ అసోషియేషన్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామ్, జిమ్నాస్టిక్స్ ప్రెసిడెంట్ రామరాజు, జూడో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెకంట్,బాబులు ఎంపికలు నిర్వహించారు. -
అకాడమీ కోసం స్థలాన్ని పరిశీలించిన లక్ష్మణ్
హైదరాబాద్: క్రికెట్ అకాడమీ నిర్మాణం కోసం భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురువారం కుత్బుల్లాపూర్లో పర్యటించారు. బహదూర్పల్లి గ్రామ సర్వే నెంబరు 239, 240లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి అకాడమీ కోసం లక్ష్మణ్ దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బహదూర్పల్లిలో అప్పట్లో రాజీవ్ స్వగృహ కోసం 40 ఎకరాలు కేటాయించగా ఇప్పుడు ఆ భూమి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అకాడమీకి ఆ ప్రదేశం అనువుగా ఉంటుందని భావించిన లక్ష్మణ్ స్థానిక రెవెన్యూ అధికారులు సదానంద్, రేణుకాదేవి, శ్రీశైలంలతో కలిసి పరిశీలించారు. -
కృషి, పట్టుదలతో ఐఏఎస్ సాధ్యమే
దూరదర్శన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పద్మనాభరావు తొర్రేడులో కృష్ణ ప్రదీప్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్ : ఐఏఎస్ చదవాలంటే కేవలం ఐఏఎస్, ఐపీఎస్, ధనికుల పిల్లలకు మాత్రమేనని అపోహలలో ఉన్నారని, కాని కృషి, పట్టుదలతో చదివితే ఎవరైనా సివిల్స్లో ర్యాంకు సాధించవచ్చని దూరదర్శన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పద్మనాభరావు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్కు చెందిన కృష్ణ ప్రదీప్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ నాలుగో బ్రాంచిని తొర్రేడు గ్రామంలో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటిసారిగా ఇంటర్, డిగ్రీ నుంచే సివిల్స్ శిక్షణ ప్రారంభించారు. అకాడమీ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డాక్టర్ పద్మనాభరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణ సాధారణ కుటుంబం నుంచి వచ్చాడని, అతను సివిల్స్లో మూడో ర్యాంకు సాధించాడన్నారు. 2016 సివిల్స్కు 11 లక్షల మంది దరఖాస్తు చేస్తే 4.5 లక్షలు మంది పరీక్ష రాశారని, అందులో 15 వేల మంది మెయిన్స్కు అర్హత సాధించారన్నారు. ఇంటర్వ్యూలకు మూడు వేల మంది అర్హత సాధించగా, 1099 మంది సివిల్స్కు సెలక్ట్ అయ్యారని పద్మనాభం తెలిపారు. సివిల్స్లో ర్యాంకులు ఆధారంగా ఐఏస్తో పాటు, ఐపీఎస్, ఐఆర్ఎస్ తదితర 24 గ్రూపులలో ఉద్యోగాలు సాధించ వచ్చన్నారు. సివిల్స్లో శిక్షణ పొందిన వారు గ్రూప్–1, గ్రూప్–2, బ్యాంకు పరీక్షలలోను విజయం సాధించవచ్చన్నారు. కృష్ణప్రదీప్స్అకాడమిలో ఇంటర్, డిగ్రీ నుంచి సివిల్స్కు శిక్షణ పొందడం వల్ల 22 ఏళ్లకే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించవచ్చన్నారు. ఆ వయస్సులో సివిల్స్ ఎంపిక కావడం వల్ల కేబినెట్ సెక్రటరీ హోదా వరకు పనిచేసే అవకాశం వస్తుందని పద్మనాభరావు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ రిటైర్డు డిప్యూటీ డైరెక్టరు ఏవీవీడీఎం ప్రసాద్ మాట్లాడుతూ సివిల్స్లో మూడవర్యాంకు సాధించిన గోపాలకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్ధులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ మాట్లాడుతూ సోషల్, సైన్స్ చదవడం ద్వారా సివిల్స్తో పాటు, అంతర్జాతీయ, నాన్ గవర్నమెంటు సర్వీసులలో ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతి విద్యార్థి చదవుతోపాటు రైటింగ్ స్కిల్స్ మెరుగు పర్చుకోవాలని సూచించారు. ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమి డైరెక్టర్ కృష్ణప్రదీప్ మాట్లాడుతూ 2003 నుంచి హైదరాబాద్లో ఐఏఎస్ అకాడమీని స్థాపించామని, అప్పటి నుంచి ప్రతి ఏడాది సుమారు 50 మంది సివిల్స్లో ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. మొదటి ప్రయత్నంలోనే విద్యార్థులు సివిల్స్లో ర్యాంకు సాధించాలన్న ఉద్ధేశ్యంతోనే ఇంటర్, డిగ్రీతో సివిల్స్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్ ఆచారి, «సీఈవో ధరణి, అకడమిక్ డైరెక్టర్ ఎస్వీ నారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చర్చావేదికలతో విలువలు పెంచండి
–పాత్రికేయులకు ప్రెస్ అకాడమీ చైర్మన్ దీక్షితులు సూచన - రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ సందర్శన రాజమహేంద్రవరం సిటీ : నేటి కాలంలో రోజురోజుకూ రాజకీయాల్లో, మీడియాలో విలువలు తగ్గిపోతున్నాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అన్నారు. తరిగిపోతున్న విలువలను పెంచేందుకు చర్చావేదికల ద్వారా పాత్రికేయులు పూనుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం ది రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్ను సందర్శించిన ఆయన పాలక వర్గం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. 50 సంవత్సరాలు పైబడిన పాత్రికేయులకు పింఛను పంపిణీ, పాత్రికేయులతో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం వైద్యశిబిరాల నిర్వహణను కొనియాడారు. రాజకీయాలు, మీడియా ప్రజల కోసమనే రీతిలో విలువలను పెంపొందించాలన్నారు. ప్రెస్క్లబ్లో క్లబ్ అనే పదాన్ని తొలగించి వేరే పదాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పాత్రికేయుల వృత్తి నైపుణ్యం పెంచేందుకు గ్రంథాలయం అవసరమన్నారు. దాని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అకాడమీ ద్వారా గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించాలని క్లబ్ అధ్యక్షుడు కోరారు. దీక్షితుల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, డీపీఆర్ఓ ఫ్రాన్సిస్, ప్రెస్క్లబ్ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టుల వృత్తినైపుణ్యాల పెంపునకు కృషి చేయాలి -ప్రెస్ అకాడమీ చైర్మన్కు ‘తూర్పు’జాప్ సూచన రాజమహేంద్రవరం సిటీ : మారుతున్న కాలమాన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జర్నలిస్టుల వృత్తి శిక్షణ నైపుణ్యాల పెంపుదలకు ప్రెస్ అకాడమీ కృషి చేయాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) తూర్పుగోదావరి జిల్లా శాఖ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులుకు సూచించింది. గతంలో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించేవారని, కొంతకాలంగా అవి నిలిచిపోయాయన్నారు. బుధవారం రాజమహేంద్రవరం వచ్చిన దీక్షితులును జాప్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పీఎస్ఎం కృష్ణంరాజు, జిల్లా అధ్యక్షుడు ఎస్.ధర్మరాజు తదితరుల బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా జాప్ 25 ఏళ్ల లోగోను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఆదరణ పెరిగిన నేపథ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. యానాం పాండిచ్చేరి పరిధిలోనిదైనా అక్కడి విలేకరులు మన రాష్ట్రానికి చెందిన వార్తలు రాస్తుంటారన్నారు. అలాగే తెలంగాణ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన 4 మండలాల పరిధిలోని జర్నలిస్టులకు కూడా శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రెస్క్లబ్లకు అవసరమైన పుస్తకాలను ప్రెస్ అకాడమీ నుంచి అందజేయాలన్నారు. జిల్లాల వారీగా ప్రెస్ అకాడమీ నిర్వహించే కార్యక్రమాలకు తమ వంతు సహకరిస్తామన్నారు. -
ఛాంపియన్స్ అకాడమి
-
ఎన్సీసీతో నాయకత్వ లక్షణాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఎన్సీసీ అంటే దేశభక్తితో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడమని ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్నల్ బి. హరికృష్ణ నాయుడు పేర్కొన్నారు. రింగ్రోడ్డులోని భాష్యం బ్లూమ్స్ సెకండరీ క్యాంపస్లో ఎన్సీసీ అకాడమీని ప్రారంభించారు. ఎన్సీసీ యూనిట్ 25 (ఏ) బెటాలియన్ కల్నల్, గ్రూప్ కమాండర్ బి. హరికృష్ణ నాయుడు, కమాండింగ్ అధికారి సునీల్ యాదవ్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ఎన్సీసీ కేడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా అమర జవానులకు నివాళిగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా హరికృష్ణ నాయుడు మాట్లాడుతూ ఎన్సీసీ అంటే సర్టిఫికెట్ పొందడమే కాదని, దేశభక్తి, మంచి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలు, లౌకిక వాదం, సేవా దృక్పథం, దేశం కోసం పాటు పడే మంచి పౌరులుగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా 2016–17 హెడ్ బాయ్స్, హెడ్ గర్్ల్స కెప్టెన్స్, హౌస్ కెప్టన్స్ కల్నల్ చేతుల మీదుగా షోల్డర్, చెస్ట్ బ్యాడ్జెస్ గౌరవాన్ని అందుకుని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సిద్ధార్థ అకాడమీ ఎదుట విద్యార్థుల ధర్నా
విజయవాడ: ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్కు సభకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ.. సిద్ధార్థ అకాడమీ ఎదుట గురువారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. దేశద్రోహానికి పాల్పడ్డ వ్యక్తికి సభను నిర్వహించడానికి అనుమతిచ్చి కాలేజీ ప్రతిష్టను మంటగలుపుతున్నారంటూ ఇంఛార్జ్ రమేష్పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్హయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీ వ్యతిరేక శక్తులను కాలేజీలోకి అడుగుపెట్టనివ్వబోం అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
ఆడుకుందాం...రండి!
నగర శివారులోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో గురువారం టెన్సిస్ స్టార్లు... సినీ తారలు సందడి చేశారు. క్రీడాకారులు పేస్, భూపతి, నవ్రతిలోవా, సానియా మీర్జాలు ఎగ్జిబిషన్ మ్యాచ్లో తలపడ్డారు. బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, సినీ నటులు వెంకటేష్, రానా, తదితరులు తిలకించారు. -
పోలీస్ అకాడమీలో ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్
-
గుజరాత్లో గోపీచంద్ అకాడమీ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన అకాడమీ ద్వారా శిక్షణా కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో గుజరాత్లో మరో అకాడమీని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఇది వడోదరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ తరహాలో అత్యుత్తమ సౌకర్యాలతో ఈ అకాడమీ నెలకొల్పాలని గోపి భావిస్తున్నారు. ఇదే తరహాలో రాజస్థాన్లో కూడా అకాడమీ ఏర్పాటు చేయాలని ఏథెన్స్ ఒలింపిక్స్ రజత పతక విజేత, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ , గోపీచంద్కు విజ్ఞప్తి చేశారు. ‘అందుబాటులో ఉన్న ప్రతిభను తీర్చి దిద్దితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. రాజస్థాన్ బ్యాడ్మింటన్ సంఘం కూడా అకాడమీ ఏర్పాటు చేయమని కోరింది. అనంతరం రాథోడ్తో చర్చించాక ప్రతిపాదలను సిద్ధం చేశాం. త్వరలో దేశంలో మరికొన్ని చోట్ల అకాడమీలు నెలకొల్పాలనే ఆలోచన ఉంది.’ అని గోపీచంద్ వెల్లడించారు. -
‘టాప్ 100’లో ఐఐటీ గువాహటి
లండన్: ప్రతిష్టాత్మక గువాహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ గువాహటి) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా వంద అత్యుత్తమ విద్యాసంస్థల్లో స్థానం సంపాదించింది. ఈ జాబితాలో తొలిసారిగా చోటు సంపాదించిన ఏకైక భారతీయ విద్యాసంస్థ ఇదే. ‘50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 100 సంస్థల-2014’ జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మేగజీన్ విడుదల చేసింది. ఇందులో ఐఐటీ గువాహటి.. 87వ ర్యాంకును పోర్చుగల్కు చెందిన లిస్బన్ వర్సిటీ, ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీతో కలిపి పంచుకుంది. ఇక దక్షిణ కొరియాకు చెందిన పొహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వరుసగా మూడో ఏడాది కూడా ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. -
‘కార్పొరేట్’ ఢమాల్
సాక్షి, నెల్లూరు: ఒకప్పుడు విద్యాసంస్థలకు నెల్లూరు పెట్టింది పేరు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి చదువుకునేవారు. కాలక్రమంలో ఆ ప్రాభవం తగ్గినా పాతవాసనతో జిల్లాలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు కళాశాలలను నిర్వహిస్తున్నాయి. గతంలో ఇవీ ఒక వెలుగు వెలిగాయి. క్రమేణా వీటిలోని విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రచార ఆర్భాటం తప్ప ఆశించిన స్థాయిలో విద్యాప్రమాణాలు లేకపోవడంతో నాణ్యమైన విద్య అందిస్తున్న చిన్నచిన్న విద్యాసంస్థలవైపే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఇది కార్పొరేట్ విద్యాసంస్థలపై తీవ్రప్రభావం చూపుతోంది. విద్యార్థుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. నెల్లూరు శివారులోని ఓ కళాశాలలో గత విద్యాసంవత్సరంలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు 700 మంది, జూనియర్ ఇంటర్ విద్యార్థులు 600 మంది ఉన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సీనియర్ ఇంటర్కు వచ్చిన 600 మంది విద్యార్థుల్లో కొందరు వివిధ కారణాలు చూపుతూ టీసీలు తీసుకుని ఇతర కళాశాలల్లో చేరిపోయారు. ఈ ఏడాది జూనియర్ ఇంటర్లో కేవలం 190 మంది చేరడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. బిజినెస్ పడిపోతుండటంతో ధనార్జనే ధ్యేయంగా కళాశాలలు నిర్వహిస్తున్న సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫీజు డిస్కౌంట్ అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఇప్పటి నుంచే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మభ్యపెట్టే పనిలో పడ్డాయి. డబ్బే ప్రధానం విద్యాసంవత్సరం ప్రారంభంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఏజెంట్లు వివిధ ఆఫర్ల పేరుతో విద్యార్థుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వారి మాటలు వినిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా కళాశాలల్లో చేరుస్తారు. అక్కడి నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ప్రతి అంశాన్ని డబ్బుతో ముడిపెడతారు. దుస్తులను విద్యార్థులే ఉతుక్కున్నా ధోబీ చార్జీలంటూ ఏడాదికి రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తారు. పరీక్ష ఫీజులను ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే రెండు, మూడు రెట్లు అదనంగా గుంజుతారు. ప్రాక్టికల్స్లో మార్కుల కోసమంటూ మరో బాదుడు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లే వాహనాల ఖర్చు అదనం. వీటితో పాటు పుస్తకాలు, మెటీరియల్స్ అంటూ తరచూ ఫీజుల మోత మోగిస్తారు. విద్యార్థి ఏదైనా సందర్భంలో ఇంటికి వెళ్లి వస్తే ఫీజు కడితేకానీ లోనికి అనుమతించరు. తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా వెళ్లి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను బతిమిలాడినా దురుసుగా వ్యవహరిస్తారు. ఇంత వసూలు చేస్తున్నా విద్యార్థులకు నాణ్యమైన తిండి పెడుతున్నారా అంటే అదీ లేదు. ఆ రోజు మార్కెట్లో ఏ కూరగాయలు చౌకగా దొరికితే వాటిని వండి వడ్డిస్తారు. ఒక్కోసారి భోజనంలో పురుగులు సైతం దర్శనమిస్తుంటాయి. క్యాంటీన్లో ఏదేని ఆహారం కొనుగోలు చేయాలన్నా ప్రతిదీ డబుల్ రేటే. ఇక వసతులు కూడా అంతంతమాత్రమే. ఐదుగురు సరిపోయే గదిలో 8 నుంచి 10 మంది విద్యార్థులను ఇరికిస్తారు. వేలాది రూపాయల ఫీజు చెల్లిస్తున్నా అనుభవం లేని అధ్యాపకులతోనే క్లాసులు నెట్టుకొస్తున్నారు. అనుభవజ్ఞులకు భారీగా జీతాలు చెల్లించాల్సి ఉండటంతో వ్యాపార దక్ఫథంతో ఆలోచిస్తున్న యాజమాన్యాలు తక్కువ జీతాలకు వచ్చేవారితోనే మమ అనిపిస్తున్నారు. వీటన్నింటిని కప్పిపుచ్చుకునేందుకు వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు స్టడీఅవర్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఎక్కువ శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానికంగా నాణ్యమైన విద్య అందించే కళాశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లోకి ఏజెంట్లు విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఓ కార్పొరేట్ విద్యాసంస్థ యాజమాన్యం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. గతంలో జూనియర్ ఇంటర్కు (రెసిడెన్షియల్) రూ.45 వేలు వరకు వసూలు చేస్తున్న ఆ సంస్థ ఇప్పుడు రిజర్వ్ చేసుకుంటే రూ.30 వేలేనంటూ ప్రచారం మొదలుపెట్టింది. ప్రస్తుతం తమ కళాశాలలో ఉంటున్న విద్యార్థులకు ఆ ఆఫర్లను వివరిస్తున్నారు. మీకు తెలిసిన వారిని చేర్పించమంటూ ఒత్తిడితెస్తున్నారు. మరోవైపు ఆయా విద్యాసంస్థల కమీషన్ ఏజెంట్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేశారు. ఒక విద్యార్థిని చేర్పిస్తే రూ. 2 వేలు నుంచి రూ.3 వేలు కమీషన్ ఇస్తామంటూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల చుట్టూ తిరుగుతున్నారు. విద్యాప్రమాణాలు, ఇతర సదుపాయాలను మెరుగుపరచడంలో శ్రద్ధపెట్టడం విస్మరించిన కళాశాలలు ఆఫర్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.