annamayya
-
భక్తులపై ఏనుగులు దాడి .. ముగ్గుర్ని తొక్కి..!
-
యాసిడ్ దాడి నిందితుడు గణేష్ ఎక్కడ?
అన్నమయ్య, సాక్షి: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో నాశనం చేయాలని చూసిన నిందితుడు గణేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు!. నేరం జరిగిన కాసేపటికే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. ఆ వెంటనే మాట మార్చేశారు. దీంతో.. ఈ కేసులో పోలీసుల అలసత్వంతో పాటు, రాజకీయ నేతల జోక్యం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి.మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల ముచ్చుమర్రి బాలిక కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదు. వీటికి తోడు ఉన్మాద ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నా.. కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.తాజాగా.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పరిధిలోని ప్యారంపల్లెలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై.. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని గ్రామానికి చెందిన గౌతమిగా గుర్తించగా.. నిందితుడు అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్గా పోలీసులు ప్రకటించారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోపే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. తర్వాత అతని జాడ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు.. అతను పరారీలో ఉన్నాడని, గాలింపు కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు ప్రకటించారు. దీంతో బాధితురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా.. నిందితుడు గణేష్ తండ్రి సుంకారపు మురళి టీడీపీ నేత. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్బాషాకు ప్రధాన అనుచరుడు. అంతేకాదు.. కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా సన్నిహితుడే. దీంతో నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని బాధితురాలి బంధువులు నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఈ కేసులో న్యాయం జరిపిస్తామని హామీ ఇస్తున్నా.. ఇంత వరకు కేసులో ఎలాంటి పురోగతి చోటు చేసుకోలేదు. ఉన్మాది దాడి ఇలా..యువతి డిగ్రీ వరకు చదువుకుని మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. పట్టణంలోని అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురిచేసేవాడు. యువతికి ఈనెల 7న బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గణేశ్.. శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఆమె వద్దకు వెళ్లి ముఖంపై యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టు పక్కలవాళ్లు వచ్చారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు యువతిని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి వల్ల బాధితురాలి ముఖంపై గాయాలయ్యాయి. దీంతో బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో కొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. -
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్
తెలుగు సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి నెల తెలుగు లలిత కళా వేదిక ద్వారా అంతర్జాల వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనంపై నాట్స్ వెబినార్ నిర్వహించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు పారుపల్లి శ్రీరంగనాథ్ ఈ వెబినార్కు విచ్చేశారు. తిరుమలేశుడి గోవింద నామాలతో ప్రతి తెలుగు ఇంటికి ఆయన గాత్రం సుపరిచితమైంది. గోవింద నామాలతో పాటు ఆ వెంకటేశ్వరుడి అనేక భక్తిగీతాలను ఆయన ఆలపించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దేవాలయంలో ఆయన పాడిన భక్తి పాటలు మారుమ్రోగుతుంటాయి. భక్తి గీతాల ఆలాపనకు చిరునామాగా మారిన పారుపల్లి శ్రీరంగనాథ్ నాట్స్ వెబినార్లో పాలుపంచుకోవడాన్ని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రశంసించారు. గోవింద నామాలు పాడే అవకాశం ఎలా వచ్చింది.? తిరుమల దేవస్థానం ఆస్థాన గాయకుడిగా ఎలా స్థానం లభించింది ఇలాంటి అంశాలను శ్రీ రంగనాథ్ వివరించారు. గోవింద నామాలు పాడి వినిపించారు. ఆ తిరుమలేశుడికి అత్యంత ఇష్టమైన అన్నమయ్య సంకీర్తనలు పాడటంతో పాటు వాటి అర్థాలను కూడా ఆయన వివరించారు. తాను స్వరపరిచిన భక్తిగీతాలు, ఆధ్యాత్మిక రంగంలో భక్తులను భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లేందుకు భక్తిపాటల ద్వారా చేస్తున్న కృషిని రంగనాథ్ ఈ వెబినార్ ద్వారా అందరికి తెలిపారు. అలాగే అన్నమయ్య సంకీర్తనల పరమార్థం గురించి, వెబినార్లో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి( మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల అనుసంధానకర్తగా వ్యవహరించారు. లలిత కళా వేదిక సభ్యుడు గిరి కంభమ్మెట్టు, నేషనల్ కోఆర్డినేటర్ (విమెన్ ఎంపవర్మెంట్) రాజలక్ష్మి చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి, పలువురు నాట్స్ సభ్యులు, తెలుగువారు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం) -
అన్నమయ్య ‘టీడీపీ’ అతిథి గృహం!
రాజంపేట : అధికార దుర్వినియోగం అంటే ఇదేనేమో..ఏకంగా రాజంపేట పట్ట నడిబొడ్డులో ఉన్న అన్నమయ్య అతిథి గృహం కాస్త తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్నమయ్య అతిథి గృహం రోడ్లు, భవనాల శాఖ నిర్వహిస్తోంది. ఎన్నికలకు ముందు ఐఏఎస్ అధికారులు వస్తారనే ఉద్దేశ్యంతో కలెక్టర్ ప్రత్యేక నిధులు వెచ్చించి అతిథి గృహం తీర్చిదిద్దారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ టీడీపీ నియోజకవర్గనేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఈ అతిధి భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఆయన నేరుగా తన వాహనంలో ఆర్అండ్బీ అతిథి గృహం చేరుకోగా, వెనువెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరారు. ఇంకేముంది ఏకంగా.. సమావేశాలు, మంతనాలు కొనసాగించారు. ప్రోటోకాల్ పరంగా కూడా ఆర్అండ్బీ గదిని కేటాయించే వీలులేదు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రితోపాటు ప్రజాప్రతినిధులకు కోరిన మేరకే గదిని కేటాయిస్తారు. అయితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఆర్అండ్బీ అధికారులు సుగవాసికి గదిని ఏ విధంగా అనుమతించారో తెలియడంలేదని స్థానికులు పెదవివిరిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారులు కూడా వచ్చి బొకేలు, సన్మానాలు చేసి పోవడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.కారు ఢీకొని ఒకరు మృతికురబలకోట : మండలంలోని కంటేవారిపల్లె వద్ద బుధవారం రాత్రి మోటార్ సైకిల్ను కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..వినాయక చవితి విగ్రహాల కొనుగోలుకు తంబళ్లపల్లె మండలం కొటాలకు చెందిన నాని(22) మరొకరితో కలిసి మోటార్ సైకిల్పై బుధవారం రాత్రి కంటేవారిపల్లెకు వచ్చారు. విగ్రహాలను చూసిన అనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో బి.కొత్తకోట వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో నాని అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు రఘునాయక్ (21) పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కృష్ణా జట్టు ఘనవిజయంకడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్–19 అంతర్ జిల్లాల మల్టీ డేస్ క్రికెట్ టోర్నమెంట్లో కృష్ణా జట్టు విజయం సాధించగా, నెల్లూరు–కడప, చిత్తూరు–పశ్చిమగోదావరి మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానంలో నిర్వహించిన మ్యాచ్లో 122 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కృష్ణా జట్టు 57.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 179 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జట్టులో నిఖిల్ 62, ధనుష్ 56 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు 36.5 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో థామస్ రామ్ 39, రోహిత్ కుమార్ 33 పరుగులు చేశారు. కృష్ణా బౌలర్ రాజేష్ 7 వికెట్లు తీయగా, సాయిప్రకాష్ 2 వికెట్లు తీశాడు. దీంతో కృష్ణా జట్టు 122 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో కృష్ణా జట్టు 219 పరుగులు చేయగా, శ్రీకాకుళం జట్టు 137 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.నెల్లూరు, కడప మ్యాచ్ డ్రా..కేఓఆర్ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్లో 334 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన నెల్లూరు జట్టు 98 ఓవర్లలో 415 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని మన్విత్రెడ్డి 193 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కడప బౌలర్లు ధీరజ్ 3, ఆర్ధిత్రెడ్డి 2, నాగకుల్లాయప్ప 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 42 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. జట్టులోని గురుచరణ్ 45, సాయిచేతన్ 54 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్ మోహన్ 2, భార్గవ్ మహేష్ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. -
కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా సుమతి..
అన్నమయ్య: కానిస్టేబుల్గా పని చేస్తున్న ఓ మహిళా సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) ఉద్యోగానికి ఎంపికై ప్రశంసలందుకుంటున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు. మదనపల్లె మండలం ఇసుకనూతపల్లెకు చెందిన వేణుగోపాల్, భాగ్యమ్మ దంపతుల కుమార్తె బరినేపల్లె సుమతి(డబ్ల్యూపీసీ1651) మహిళా పోలీస్ కానిస్టేబుల్గా నిమ్మనపల్లె పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎస్ఐ ఎంపిక పరీక్ష తుది ఫలితాల్లో ఆమె ఉద్యోగం సాధించారు. తండ్రి వేణుగోపాల్ కౌలు రైతు కాగా, తల్లి భాగ్యమ్మ పాడిఆవులు పోషించుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా మొదటి కుమార్తె అమరావతికి వివాహం అయింది. కుమారుడు రవికుమార్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. చివరి సంతానమైన సుమతి ప్రాథమిక విద్యాభ్యాసం ఇసుకనూతిపల్లె ఎంపీయూపీ స్కూల్లో నూ, ఉన్నతవిద్య మదనపల్లె జెడ్పీ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియెట్ విశ్వసాధన కా లేజ్లో, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో 2017 లో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో విడుదలైన పోలీస్కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికై అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి డీపీఓ కార్యాలయంలోనూ, నిమ్మనపల్లె పోలీస్స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా పని చేశారు. 2022 డిసెంబర్లో విడుదలైన ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా రెండో ప్రయత్నంలో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. తన లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ రాజ్కమల్, పోలీసు ఉన్నతాధికారులు సహాయ సహకారాలతోపాటు ప్రోత్సాహం అందించారని సుమతి తెలిపారు. ఎస్ఐ ఉద్యోగం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. -
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంత్యుత్సవం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో శనివారం అన్నమయ్య 615వ జయంత్యుత్సవం వైభవంగా జరిగింది. గోవిందనామ సంకీర్తనలతో మిల్పిటాస్ నగరం మారుమోగింది. ఈ సందర్భగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకులు గరిమెళ్ళ అనీల్ కుమార్, గాయత్రి అవ్వారి, పద్మిని సరిపల్లె, సుధా దూసిల నేతృత్వంలో రమేష్ శ్రీనివాసన్, వారి శిష్య బృందం మృదంగ వాద్య సహకారంతో జరిగిన గోష్టిగానం భక్తులను పరవశింపచేసింది. వీరి గానం సాగుతుండగా చిత్ర కళాకారుడు కూచి సద్యోజాతంగా వేసిన చిత్రం ఆశ్చర్యానందాలను కలిగించింది. అనంతరం సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు చిత్రాకారుడు కూచిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత 20 సంవత్సారాలుగా అన్నమయ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సాయంత్రం జరిగిన సంగీత కచ్చేరిలో వీణ విద్వాంసులు ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, వారి కుమార్తె పద్మిని పసుమర్తి తమ వీణా నాదాలతో ఆకట్టుకున్నారు. వీరికి కలైమామణి రమేష్ శ్రీనివాసన్ మృదంగ సహకారం అందించారు. తరువాత జయప్రద రామమూర్తి వాయులీన గానంతో అలరించారు. వారికి అనూరాధ శ్రీధర్ వయలిన్, శ్రీరామ్ బ్రహ్మానందం మృదంగ సహకారాన్ని అందించారు. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సాంస్కృతిక కార్యవర్గ బృందం కళాకారులను సత్కరించారు. చివరిగా గరిమెళ్ళ అనీల కుమార్ గారి గాత్రంతో స్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. అనంతరం అందరికీ భోజన ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు వంశీ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం, జయంతి కోట్ని, శాంతి కొండ, ఉష మాడభూషి, మమత కూచిభొట్ల, విజయసారథి మాడభూషి, యేడిది శర్మలకు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలియజేశారు. -
మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు..!
మదనపల్లె : మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలతో శుక్రవారం ఘర్షణకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన వెంకటేష్ భార్య లోకేశ్వరి మూడు నెలల కిందట జిల్లా ఆస్పత్రిలో మొదటి కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఐదు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కసారిగా ఊపిరాడకపోగా పరిస్థితి విషమంగా మారడంతో ఇంజెక్షన్ చేశారు. అయినా ఎలాంటి మార్పు రాకపోగా, మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇక్కడి వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలతో బాధి తులు ఘర్షణకు దిగారు. చికిత్సలో తమ తప్పు లేదని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో.. చేసేదిలేక విషణ్ణవదనంతో బిడ్డను తీసుకుని ఇంటికెళ్లిపోయారు. -
టమాట..ఇక లాభాల బాట
మదనపల్లె : టమాటా పంటను రైతులు లాటరీ పంటగా పిలుస్తుంటారు. ఒక సీజన్లో ధర ఆకాశాన్నంటితే.. మరో సీజన్లో నేల చూపులు చూడటం, పెట్టుబడులు అధికమై గిట్టుబాటు ధర రాలేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేయడం, పంటను పశువులకు మేతగా వదిలేయడం గతంలో జరిగేది. ఇకపై అలాంటి కష్టాలు ఉండవు. మార్కెట్లో ధరలు తగ్గినా..రైతుకు కనీస గిట్టుబాటు ధర లభించేలా, సాధారణ సాగుకంటే అధిక దిగుబడులు వచ్చేలా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ టమాటా రకాలను పండించేలా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అన్నమయ్య జిల్లాలో ప్రయోగాత్మకంగా నిమ్మనపల్లె, మదనపల్లె మండలాల్లో రబీ సీజన్లో రైతులతో సాగుచేయించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కోలార్, సీడ్ కాయగా రైతులు పిలుచుకునే ప్రాసెసింగ్ టమాటా రకాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రత్యేక కథనం.. అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా సాగయ్యే ఉద్యాన పంటల్లో టమాటా ఒకటి. జిల్లాలో సాధారణ పరిస్థితుల్లో రబీ సీజన్కు 12,500 ఎకరాలు టమాటా సాగవుతుంటే ప్రస్తుతం 3,950 ఎకరాల్లో సాగుచేశారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్ 10 వరకు టమాటా విరివిగా సాగుచేస్తారు. సంబేపల్లె, సుండుపల్లె, చిన్నమండ్యం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలోనూ, గుర్రంకొండ, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అధికంగా సాగు చేస్తారు. బి.కొత్తకోట, ములకలచెరువు, పీటీఎం మండలాలు జిల్లాలోనే టమాటా అత్యధికంగా సాగుచేసే ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో రైతుకు అండగా నిలిచేందుకు, కనీస గిట్టుబాటు ధర పొందేందుకు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్(ఏపీఐఎల్ఐపీ) ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రాసెసింగ్కు అనువైన టమాటా రకాలపై రైతులకు అవగాహన కల్పించాలని, మదనపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో ప్రయోగాత్మకంగా సాగుచేసేందుకు సంకల్పించింది. ప్రాసెసింగ్ టమాటా రకాలు కర్ణాటకలోని కోలార్, చింతామణి జిల్లాల్లో అక్కడి రైతులు అధికంగా సాగుచేస్తున్నారు. ఈ రకంలో విత్తనాలు తక్కువగా, కండశాతం ఎక్కువగా ఉండటం వల్ల జ్యూస్, సాస్ తయారీకి అనుకూలంగా ఉంటాయి. సాధారణ వాడకానికి ఉపయోగపడుతాయి. దీనిని అక్కడి రైతులు వాడుకభాషలో కోలార్ కాయ, సీడ్కాయ, జ్యూస్కాయగా పిలుస్తుంటారు. సాధారణ టమాటా రకాలతో పోలిస్తే దాదాపు 25శాతం అధిక దిగుబడులు, ఎక్కువ కాలం మన్నిక, మంచి రంగు, సైజు దీని ప్రత్యేకత. ప్రయోగాత్మకంగా సాగు.. మదనపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో ప్రాసెసింగ్ టమాటా ప్రయోగాత్మక సాగుకు ఉద్యానశాఖ అధికారులు 185 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుంటే 65 ఎకరాల్లో సాగుచేసేందుకు రైతులు ముందుకొచ్చారు. ఈ రకం సాగుచేసినందుకు రైతుకు పెట్టుబడి రాయితీగా ఒక ఎకరాకు రూ.21,400 సబ్సిడీ ఇస్తారు. కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రాసెసింగ్ రకాలైన సింజంటా–6242, అన్సోల్, జివెల్ రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఒక మొక్క విలువ రూ.1.25పైసలు అయితే ప్రభుత్వ సబ్సిడీ రూ.1 పోనూ 0.25 పైసలకు సరఫరా చేస్తున్నారు.మల్చింగ్ పేపర్కు రూ.6,400, ఐపీఎం కింద ఎకరాకు రూ.2,000, కాయలు వచ్చాక మార్కెట్కు తరలించేందుకు వీలుగా ఒకొక్కటి రూ.120 చొప్పున ఎకరాకు 40 ప్లాస్టిక్ క్రేట్ల వరకు రాయితీపై అందిస్తున్నారు. ఒక ఎకరాకు 8,000 మొక్కలు అవసరమవుతాయి. వీటిలో జివెల్ రకానికి అధికంగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ రకాలను కోలార్, చింతామణి మార్కెట్లలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అక్కడికి తరలించేందుకు వీలుగా ప్లాస్టిక్ క్రేట్లను రైతులకు రాయితీపై అందిస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. రైతుకు గిట్టుబాటు ధర .. టమాటాను సాగుచేసిన రైతు నష్టపోకూడదని, మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నా గిట్టుబాటు ధర పొందాలనే ఉద్దేశంతో ప్రాసెసింగ్ రకాలను ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడు ప్రాసెసింగ్ టమాటాను కనీసధర రూ.4–6 కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడి నష్టపోకుండా కొద్దిపాటి లాభాలతోనైనా రైతు ఊరటచెందే వీలుంటుంది. ఫిబ్రవరి 25 నుంచి నిమ్మనపల్లె, మదనపల్లె మండలంలో రైతులకు నారు సరఫరా చేస్తున్నాం. – ఈశ్వర్ప్రసాద్రెడ్డి, ఉద్యానశాఖ అధికారి, మదనపల్లె దిగుబడులు అధికంగా వస్తాయి.. ప్రాసెసింగ్ టమాటా రకాలు సాధారణ పంటతో పోలిస్తే అధిక దిగుబడులు వస్తాయి. గత ఏడాది సీజన్లో వీటిని ప్రత్యేకంగా కోలార్ నుంచి తెప్పించి ఎకరా భూమిలో సాగుచేశాను. రూ.2లక్షల వరకు పెట్టుబడి ఖర్చు వచ్చింది. సుమారు 2,500 బాక్స్ల(ఒకొక్కటి 30కిలోలు) కాయ వచ్చింది. కోలార్ మార్కెట్కు తీసుకెళితే కిలో రూ.25 నుంచి 45 వరకు ధర పలికింది. పెట్టిన పెట్టుబడికి మూడురెట్లకు పైగా ఆదాయాన్ని పొందగలిగాను. ప్రస్తుతం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రాయితీపై సాగుచేసేందుకు ప్రోత్సాహకాలు అందించడం సంతోషంగా ఉంది. – సుధాకర్రెడ్డి, మన్యంవారిపల్లె, నిమ్మనపల్లె మండలం -
పరిహారం.. దరహాసం
జమ్మలమడుగు: ఉక్కు నగరానికి బీజం పడింది. 16 ఏళ్ల నాటి కల సాకారం దిశగా అడుగులు పడ్డాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ స్టీల్స్ గ్రూప్ సారథ్యంలో ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిందాల్ కంపెనీ ఎండీ సజ్జన్ జిందాల్ చేతుల మీదుగా స్టీల్ప్లాంట్ పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. భూములు కొల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ జరిగింది. దీంతో భూనిర్వాసితుల మోములో ధరహాసం తొణికిసలాడుతోంది. ఇప్పటికే రెండు ఎకరాల భూములు కొల్పోయిన రైతులకు పరిహారం అందించారు. ఎకరా భూమి కొల్పోయిన రైతుల ఖాతాల్లో సైతం డబ్బులు జమ అయ్యాయి. స్టీల్ ప్లాంట్ కోసం పూర్తిగా భూములు కొల్పోయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. 2019 డిసెంబర్లో శంకుస్థాపన.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన ఆరునెలల్లోనే జమ్మలమడుగు మండలం కన్యతీర్థం వద్ద 2019 డిసెంబర్ 23 వతేదీన శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. వెంటనే 3148 ఎకరాలు, మరో 409 ఎకరాల డీకేటీ భూమిని కేటాయించారు. వైఎస్సార్స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం డీకేటీ భూములు కొల్పోయిన 178 మంది రైతుల వద్ద నుంచి 391.44 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరాకు 7.5 లక్షల వంతున 29కోట్ల 35 లక్షల రూ.80వేలు రైతుల ఖాతాల్లో గతేడాది సెప్టెంబర్లోనే జమ చేశారు.దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. కేబినెట్ సబ్కమిటీ ఆమోదంతో మరి కొందరికి... మండలంలోని రైతులకు 7వ అసైన్డ్ కమిటీలో భూములు కేటాయించారు. అయితే వారికి ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. తమకు కూడా పరిహారం ఇప్పించాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే మూలె సుధీర్రెడ్డిల వద్ద మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో లబ్ధిదారులకు సైతం పరిహారం అందించేందుకు కెబినెట్ సబ్ కమిటీ అమోదం తెలిపింది. పట్టాలు లేకపోవడంతో వారికి 50శాతంతో పరిహారం అందించాలని నిర్ణయించింది. ప్రతి రైతుకు 3.75లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 7వ విడతలో 379 మంది రైతులకు 3.75 లక్షల వంతున రూ. 14కోట్ల,56లక్షల 46వేల పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే 250 మందికిపైగా ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో 3.75 లక్షల వంతున డబ్బులు జమ అయ్యాయి. -
నామినేషన్ వేసి టీడీపీ నాయకులు నవ్వుల పాలయ్యారు
కడప సిటీ : టీడీపీ నాయకులు కొంతమంది స్వతంత్య్ర అభ్యర్థితో నామినేషన్ వేయించి నవ్వుల పాలయ్యారని స్థానిక సంస్థల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం జమ్మలమడుగు వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే తమ పార్టీపై పోటీ చేయాలని, స్వతంత్య్ర అభ్యర్థితో నామినేషన్ దాఖలు చేయించి అమాయక ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడుచుకుపోయిందని తెలిపారు. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా నామినేషన్ వేయించి నవ్వుల పాలయ్యారన్నారు. టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి దొంగ సంతకాలు పెట్టించారని, ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ విలువలతో కూడిన టీడీపీని స్థాపిస్తే, చంద్రబాబు పార్టీని భ్రష్టు పట్టించారన్నారు. గతంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను టీడీపీలోకి తీసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని వదిలాక ఆ మాజీమంత్రి నామరూపాల్లేకుండా పోయారని విమర్శించారు. ధైర్యంగా నామినేషన్ వేసే పరిస్థితి టీడీపీకి లేదని, దొంగ సంతకాలతో రూఢీ అయిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తన తండ్రి వైఎస్సార్ ఆశయాల సాధన కోసం వ్యతిరేకించి పది సంవత్సరాలపాటు ప్రజల మధ్యనే గడిపారన్నారు. తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు సాధించుకుని రికార్డు సృష్టించారని అన్నారు. అన్ని రంగాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంతకంటే భారీ మెజార్టీ వస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని లోకేష్ ప్యాలెస్ పిల్లి అని పదేపదే మాట్లాడే అర్హత లేదని తెలిపారు. పాదయాత్రకు జనం లేకపోవడంతో డీలా పడి ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని అన్నారు. పులిపులిగా, పిల్లి పిల్లిగానే ఉంటుందని గుర్తించుకోవాలన్నారు. తమకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దాం
రాయచోటి: ఎమ్మెల్యే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని పోలీస్, సెక్టోరల్ అధికారులకు కలెక్టర్ గిరీషా పీఎస్ సూచించారు.శుక్రవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజుతో కలిసి పోలీస్, సెక్టోరియల్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్, సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించాలన్నారు. ఓటర్లపై అధికంగా ప్రభావం చూపే సమస్యాత్మక ప్రాంతాలను పోలీసుల సహకారంతో గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. ఎన్నికల విధుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పటిష్టమైన బందోబస్తు: జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు.పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్ఓ సత్యనారాయణ, ఆర్డీఓలు, డీఎస్పీలు, పోలీస్, సెక్టోరియల్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పకడ్బందీగా అమలుపరిచి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఫ్యామిలీ డాక్టర్, అనీమియా తదితర అంశాలపై మెడికల్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటి ముంగిటే వైద్యసేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలుచేస్తోందని కలెక్టర్ అన్నారు. డాక్టర్లు ఇంటి దగ్గరకు వెళ్లి రోగులకు వైద్యసేవలు అందిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలు అనీమియా బారినపడకుండా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కంటి వెలుగు స్క్రీనింగ్ పక్కాగా జరగాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరీషా పీఎస్ -
వైభవం..పార్వేట ఉత్సవం
రాయచోటిటౌన్ : రాయచోటి శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు అశ్వవాహనంపై పారువేటకు వెళ్లారు. శుక్రవారం ఆలయ పాలక మండలి అధ్యక్షులు పోలంరెడ్డి విజయ, ఈవో డీవీ రమణారెడ్డి, మున్సిపల్ వైఎస్ చైర్మన్ పోలంరెడ్డి దశరథరామిరెడ్డిల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంలో కొలువుదీర్చారు. పారువేటలో భాగంగా స్వామి వారు ఆలయ మాడవీధులలో ఊరేగారు. రవిహాల్ వెనుక భాగాన ఉన్న నాలుగు కాళ్ల మండపం వద్ద సంప్రదాయంగా కుందేలు విడిచి స్వామి వారు వేటాడినట్లుగా సంప్రదాయాన్ని పూర్తి చేస్తారు. పార్వేట ఉత్సవానికి స్థానిక భక్తులు, కన్నడ భక్తులు తరలి వచ్చారు. అంతకు ముందు ఆలయంలో వేదపండితులు రాచరాయ యోగీ స్వామి, కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి ఆధ్వర్యంలోమహా సరస్వతీ పూజ నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. -
షోలాపూర్–తిరుపతి రైళ్ల గడువు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్: షోలాపూర్–తిరుపతి–షోలాపూర్ (01437/38) స్పెషల్ వీక్లీ ఎక్స్ప్రెస్ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించామని చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ ఉమర్బాష తెలిపారు. ఈ రైలు ఈనెల 17వ తేదీ వరకు రాకపోకలకు గడువు ముగిసిందని, ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గడువును పొడిగించారని తెలిపారు. షోలాపూర్ జంక్షన్లో గురువారం రాత్రి 9.40 గంటలకు బయలుదేరి శుక్రవారం చేరుకుని, అదేరోజు రాత్రి 9.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా షోలాపూర్కు చేరుతుందని వివరించారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ ఆర్ఐవో రమణరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది కూడా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నాన్ జంబ్లింగ్ విధానంలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు రెండు దశల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగుతాయన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14,541 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారన్నారు. ఇందులో ఎంపీసీకి సంబంధించి 9648 మంది, బైపీసీకి సంబంధించి 4893 మంది రాయనున్నారన్నారు. ఇందుకోసం ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 101 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగుతాయని చెప్పారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రాక్టికల్స్ మొదటి విడత ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు, రెండో విడత మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు సెలవు దినాల్లో కూడా జరుగుతాయన్నారు. ఆర్ఐవో కార్యాలయంలో కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేశామన్నారు. సమస్యలుంటే 08562 244171 నంబర్కు ఫోన్ చేయాలని ఆర్ఐవో తెలిపారు. -
ఎన్నికల పరిశీలకుడికి ఘనస్వాగతం
రాయచోటి: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ కాటమనేనికి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్లో ఘనస్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం రాయచోటికి చేరుకున్న ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరీషా పీఎస్ పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్ఓ సత్యనారాయణ ఎన్నికల పరిశీలకుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో ఎన్నికల వ్రవర్తన నియమావళి అమలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు భాస్కర్ కాటమనేని జిల్లా అధికారులకు సూచించారు. -
ఎంత పని చేశావ్.. అమ్మా!
ప్రొద్దుటూరు క్రైం: వారిది చిన్న కుటుంబం.. భార్యా భర్తలు పని చేసుకొని జీవనం సాగించేవారు. ఏడాది వయస్సు గల పాపతో వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సంతోషాలకు నిలయమైన ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కుమార్తెను చంకనెత్తుకున్న ఆ తల్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని మోడంపల్లెలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. నాసిర్ మైదుకూరు రోడ్డులోని ఒక సూపర్మార్కెట్లో పని చేస్తున్నాడు. అతనికి రెండేళ్ల క్రితం అనంతపురానికి చెందిన ఆయిషాతో వివాహం అయింది. వారికి 13 నెలల అలీషా అనే కుమార్తె ఉంది. పెళ్లి అయిన నాటి నుంచి భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేవారు. ఈ క్రమంలో గురువారం రాత్రి నసీర్ సూపర్మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాడు. భోజనం తిన్న తర్వాత భార్యాభర్తలు పడుకున్నారు. కొంత సేపటి తర్వాత ఆయిషా తన కుమార్తెను ఎత్తుకొని మొదటి అంతస్తునున్న గదిలోకి వెళ్లింది. అక్కడే ఉన్న కిరోసిన్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి మంటలు రావడంతో భర్త గట్టిగా కేకలు వేశాడు. స్థానికుల సహకారంతో భార్యా, కుమార్తెలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యుడు వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. అయితే కొద్ది సేపటి తర్వాత ఆలీషా (13 నెలలు) మృతి చెందింది. ఆయిషా శరీరం కూడా పూర్తిగా కాలిపోయింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటన జరిగిన వెంటనే భర్త నాసిర్ను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై అతన్ని ప్రశ్నించారు. తన భార్య ఎందుకు ఇలా చేసిందో తెలియదని చెబుతున్నాడు. తమకు ఎలాంటి సమస్యలు లేవని, గొడవలు కూడా తమ మధ్య ఉండేవి కావని అతను పోలీసులకు తెలిపాడు. కాగా పోలీసులు నాసిర్ నివాసం ఉంటున్న మోడంపల్లెకు వెళ్లి విచారించారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారని చెప్పారు. నాసిర్ను చాలా ఏళ్ల చూస్తున్నామని, మంచివ్యక్తి అని వారు పోలీసులతో అన్నారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయిషా తన భర్త దేవుడు లాంటి వాడని పోలీసులకు తెలిపింది. తనను ఏమీ అనొద్దని, అతను మంచివాడని చెప్పింది. అనంతపురంలో ఉన్న ఆయిషా తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన ఎందుకు జరిగిందో అర్థం కాక పోలీసులు సతమతమవుతున్నారు. టూ టౌన్ సీఐ ఇబ్రహీం శుక్రవారం ఉదయం రిమ్స్కు వెళ్లి పరిశీలించారు. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
రైల్వేకోడూరు : నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఫ్ఆర్వో రఘునాథ్రెడ్డి వివరాలు వెల్లడించారు. గాదెల సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని చూసి కొందరు ఎర్రచందనం దుంగలను వదిలేసి, పరారయ్యారు. అక్కడున్న 6 ఎర్రచందనం దుంగలను అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్ఆర్వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్వో మహేష్కుమార్, ఎఫ్బీవో దేవేంద్రరెడ్డి, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్పత్రి వద్ద బాధితుల ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కుమారుడిని చూడకనే కన్నుమూసింది. మహిళా పోలీసు స్వర్ణకుమారి (33) ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించి కొద్ది సేపటి తర్వాత మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులు, ఆస్పత్రి వర్గాలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన బాబు చేనేత పని చేసుకొని జీవనం సాగించేవాడు. ఆయన భార్య స్వర్ణకుమారికి 2019లో కొండాపురం మండలంలోని చౌటపల్లె సచివాలయంలో మహిళా పోలీసుగా ఉద్యోగం వచ్చింది. దీంతో వారు కొండాపురం మండలానికి కాపురం మార్చారు. వారికి మొదటి కాన్పులో మగబిడ్డ జన్మించాడు. రెండో కాన్పు కోసం గురువారం ప్రొద్దుటూరులోని కాత్యా నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు. డాక్టర్ సిజేరియన్ చేశాడు. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ తర్వాత ఆమెకు అధిక రక్తస్రావం జరిగింది. ముగ్గురు వైద్యులు కలిసి చికిత్స చేయడంతో రక్తస్రావం ఆగింది. కొద్ది సేపటి తర్వాత రెండో సారి బ్లీడింగ్(రక్తస్రావం) కావడంతో ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. రెండు ఆపరేషన్ల కోసం సుమారు ఏడు యూనిట్ల రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. మూడో సారి రక్తస్రావమైతే ప్రమాదకరమని భావించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లాలని సూచించారు. గురువారం రాత్రి బెంగళూరుకు వెళ్తున్న సమయంలో పులివెందుల సమీపంలోకి వెళ్లగానే మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్లో ఉంటున్న తమ బంధువుల ఇంటికి తీసుకొచ్చారు. స్వర్ణకుమారి బంధువులు శుక్రవారం ఉదయం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆరోపించారు. విషయం తెలియడంతో వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మా నిర్లక్ష్యం లేదు స్వర్ణకుమారి ఏడవ నెల వరకు వేరే ఆస్పత్రిలో చూపించుకున్నట్లు డాక్టర్ కాత్యా తెలిపారు. ఎనిమిదవ నెలలో తమ ఆస్పత్రికి వచ్చిన ఆమెను పరీక్షించగా మాయ కిందికి ఉండటంతో రిస్క్ ఎ క్కువగా ఉంటుందని ముందే తెలిపామన్నారు. సిజేరియన్ చేసిన తర్వాత అధిక రక్తస్రావం కా వడంతో, రెండో సారి ముగ్గురు వైద్యులు ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించామన్నారు. మూ డోసారి బ్లీడింగ్ అయితే ప్రమాదకరమని భావించి ముందు జాగ్రత్తగా బెంగళూరుకు వెళ్లాలని సూచించామని తెలిపారు. అక్కడికి వెళ్తున్న సమ యంలో మార్గంమధ్యలో గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకునే ఆపరేషన్ చేశామని వివరించారు. -
మామిడి తోట దగ్ధం
సంబేపల్లె : మండలంలోని గురిగింజకుంట పంచాయతీ దిన్నెపల్లెకు చెందిన నారాయణరెడ్డి అనే రైతు మామిడి తోట దగ్ధమైంది. నారాయణరెడ్డి సర్వే నంబర్ 448–2లో 5 ఎకరాల్లో మామిడి తోట సాగు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి తోటకు నిప్పంటించారు. ఎకరాన్నరలోని 85 మామిడి చెట్లు, 20 టేకు చెట్లు, డ్రిప్ వైరు 30 కట్టలు కాలిపోయాయి. బాధితుడు శుక్రవారం సంబేపల్లె పోలీసులు, రెవెన్యూ సి బ్బందికి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నష్టం అంచనా వేస్తున్నట్లు వారు తెలిపారు. కొండకు ఆకతాయిలు నిప్పు సిద్దవటం : సిద్దవటం రేంజ్లోని మద్దూరు, సిద్దవటం బీట్ల పరిసర ప్రాంతాల్లో కొండకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. చెట్లు, వన్య ప్రాణులు చనిపోకుండా కాపాడే యత్నం చేశారు. శుక్రవారం రాత్రి వరకు మంటలు కొనసాగాయి. శనివారం కూడా వెళ్తామని రేంజర్ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ కె.ఓబులేస్, బీటు, అసిస్టెంటు బీటు అధికారులు, ప్రొటెక్షన్ వాచర్లు, బేస్క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. కంచెకు నిప్పు.. ఓబులవారిపల్లె : మండల పరిధి గాడివారిపల్లె సమీపంలోని తోట కంచెకు నిప్పు అంటుకోవడంతో 7 ఎకరాల్లో అరటి, మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. గురువారం సాయంత్రం కంచెకు ఎవరో నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి తోటలకు వ్యాపించాయి. గ్రామంలోని వీసీ వెంకటసుబ్బారెడ్డికి చెందిన 3.5 ఎకరాలు, వీసీ రామసుబ్బారెడ్డికి చెందిన 3.5 ఎకరాలు, ముక్కా యల్లారెడ్డి నాగమణెమ్మకు చెందిన 1.54 ఎకరాల్లో తోటలు కాలిపోయాయి. దాదాపు వెయ్యి అరటి, యాబై మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె : వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దమండ్యం మండలం బండమీదపల్లెకు చెందిన మల్లికార్జున(38), రమణమ్మ(33) దంపతులు శుక్రవారం సొంత పనులపై ద్విచక్ర వాహనంలో పెద్దమండ్యంకు వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా దారిలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పీటీఎం మండలం కాట్నగల్లుకు చెందిన చెన్నకేశవులు(50) ప్యాసింజర్ ఆటోలో మదనపల్లెకు వస్తూ, దారిలో పట్టుతప్పి కిందపడ్డాడు. ఆయన తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాల వాహనం పెద్దమండ్యం: ద్విచక్ర వాహనాన్ని పాల వాహనం ఢీకొనడంతో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన పెద్దమండ్యం మండలంలో జరిగింది. పాపేపల్లి పంచాయతీ వెలిగింటివారిపల్లెకు చెందిన ఓ.అక్కులప్ప(52), ఎం.వెంకటయ్య(60), ఆర్.వెంకటరమణ(50) భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పనుల అనంతరం ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంలో పాపేపల్లెకు బయలుదేరారు. మార్గంమధ్యలో పెద్దమండ్యం పోలీస్స్టేషన్ వద్ద ఎదురుగా వచ్చిన జెర్సీ ప్రైవేట్ డెయిరీ పాల వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో అక్కులప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. -
దేవదాయ భూముల లెక్క పక్కాగా ఉండాలి
కడప కల్చరల్ : జిల్లాలోని దేవదాయ భూముల విషయంలో సర్వే లెక్కలు పక్కాగా ఉండాలని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సి.శంకర్బాలాజీ అన్నారు. శుక్రవారం కడపలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన తనిఖీ అధికారులు, మండల కార్యనిర్వహణాధికారులు, కో ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 36 మండలాల్లో దేవదాయశాఖ భూములు సుమారు 14,596.53 ఎకరాలు ఉన్నాయన్నారు. భూ సర్వేలో భాగంగా మండల కార్యనిర్వాహణ అధికారులు, మండల కో ఆర్డినేటర్లు దేవాలయాలకు సంబంధించిన అన్ని భూముల వివరాలు సంబంధిత మండల తహసీల్దార్కు ఫారం–ఏ ద్వారా అందజేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దేవదాయశాఖకు సంబంధించిన భూముల విషయంలో అన్ని మండలాల తహసీల్దార్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కనుక జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యనిర్వాహణ అధికారులు సంబంధిత మండల తహసీల్దార్లకు ఫారం–ఏ రూపంలో జిల్లాలోని దేవదాయశాఖకు చెందిన అన్ని భూములు, తగిన రికార్డులు అందజేయాలన్నారు. -
వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!
అదిగో అల్లదిగో.. అంటూ శ్రీవారిని స్మరిస్తూ.. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితాపితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట అది. ఇది వెయ్యేళ్ల కిందటి మాట. ఆహ్లాదరకమైన దట్టమైన అటవీమార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆ రోజుల్లో పూర్వీకులు వేలసంఖ్యలో వెళ్లేవారు. అన్నమయ్య వారసులు సైతం ఈ మార్గంలో కొండకు నడిచివెళ్లారు. టీటీడీ అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి నడుం బిగించి భక్తులను ఆనందపరవశులను చేస్తోంది. రాజంపేట: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32వేల కీర్తనలను రాసి ఆలపించి, మహాభక్తునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో వెళ్లడం మహాభాగ్యంగా శ్రీవారిభక్తులు భావిస్తున్నారు. ఆ కాలిబాటలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి.. గతంలో అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్రెడ్డి దివంగత సీఎం వైఎస్రాజశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. అప్పట్లో వైఎస్సార్ స్పందించి టీటీడీకి ఈ కాలిబాటను పరిశీలించాలని ఆదేశాలు కూడా జారీచేశారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి అమోదం తెలిపింది. ఆ దిశగా చర్యలు చేపట్టడంలో టీటీడీ నిమగ్నమైంది. 18న ఆకేపాటి అన్నమయ్య కాలిబాటలో.. ఈనెల 18న శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి 20వసారి వేలాదిమందితో అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను చేపట్టి ఏడుకొండలకు చేరుకోనున్నారు. ఈయనతో పాటు అనేకమంది గోవిందమాలలు ధరించి అన్నమయ్య కాలిబాటలో వెళ్లనున్నారు. ఉదయం ఆకేపాటి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కాలిబాట స్వరూపం.. ► మామండూరు–బాలపల్లె మధ్య స్వామిపాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కొండకు చేరుకుంటుంది. ► అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది. ► సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. ► పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాలిబాటకు వెయ్యేళ్లు... రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన కాలిబాట నేడు శిథిలమైంది. వెయ్యేళ్ల క్రితం ఉన్న రహదారి అభివృద్ధికి టీటీడీ దృష్టి సారించింది. ఈ బాట ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచి భక్తులు గోవిందనామస్మరణాలు చేసుకుంటూ శ్రీవారిసన్నిధికి చేరుకుంటూనే ఉన్నారు. ఉత్తర, దక్షిణ భారతీయులకు అనుకూలం... పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధికసంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. అయితే తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు పరిపాటిగా మారింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే నేరుగా అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నిధికి చేరుకోగలరు. స్వామి సన్నిధికి చేరుకునే పుణ్యపవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం పెరుగుతోంది. కాలిబాటలో శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం.. పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఇప్పటికే అనేకమంది భక్తులు గోవిందమాల ధరించి ఆ మార్గంలో కొండకు చేరుకుంటున్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ ముందుకు రావడం శుభపరిణామం. జడ్పీచైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి కాలిబాటలో వేలాదిమంది భక్తులతో కొండకు 20వ సారి వెళుతున్నారు. – చొప్పా ఎల్లారెడ్డి, వైస్చైర్మన్, ఎఐటీఎస్, రాజంపేట అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి ఆకేపాటి కృషి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి ఎంతగానో కృషిచేసారు. దివంగత సీఎం, ప్రస్తుతం సీఎం, టీటీడీ చైర్మన్ దృష్టికి కాలిబాట అంశం అనేకసార్లు తీసుకెళ్లారు. ఫలితంగా ఇప్పుడు అన్నమయ్య కాలిబాట అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేసింది. అన్నమయ్య కాలిబాటలో వెళ్లే భక్తులకు వైద్య ఆరోగ్యశాఖ కూడా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉంటారు. – పిల్లిపిచ్చయ్య, అధ్యక్షుడు, రాజంపేట తాలుకా పెన్షనర్ల సంఘం -
సింగర్ శ్రావణి భార్గవి ఆడియో లీక్
-
అన్నమయ్య శతగళార్చన
సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో ఐదవ అన్నమయ్య శతగళార్చన మొదటి రోజు కార్యక్రమం సింగపూర్లో సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియం నుంచి యూట్యూబ్ లైవ్ ద్వారా ఘనంగా నిర్వహించారు. మూడుగంటలపాటు నిర్వహించబడిన ఈ ప్రత్యక్ష ప్రసారానికి యూట్యూబ్ ద్వారా 2000కి పైగా వీక్షణలు వచ్చాయని నిర్వాహకులు తెలియజేశారు. 2022 మే 22 అన్నమయ్య జయంతిన మొదలైన ఈ సాంస్కృతిక కార్యక్రమము, సప్తగిరి సంకీర్తనలు మరియు పిల్లలు పాడిన అన్నమయ్య కీర్తనలతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ అలరించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలనుండి ఎందరో పిల్లలు పెద్దలు 108కి పైగా పంపిన కీర్తనలను ఈ కార్యక్రమం ద్వారా వారం రోజులపాటు యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ లో ఉంటున్న గాయకులు సప్తగిరి సంకీర్తనలను ఆలాపించారు. చిన్నారి ప్రవాసభారతీయులు డెబ్బై మంది పదిహేడు పాటలను అందించారు. కాపవరపు విద్యాధరి, శేషుకుమారి యడవల్లి , షర్మిల, శ్రీదేవి నాగేళ్ల తదితర సంగీత గురువులు పిల్లలకు తర్ఫీదునిచ్చారు. ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, అనంత్ బొమ్మకంటి, సురేష్ కుమార్ ఆకునూరి వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు. చదవండి: సింగపూర్లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు -
ఆహారం మిగిలిందా... మాకివ్వండి
సాక్షి,మదనపల్లె సిటీ: శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి.. మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నారు మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. పేదల ఆకలిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. ’ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే.. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. ఈ కేంద్రాన్ని గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వాలో అమరులైన జవానుల జ్ఞాపకార్థం హెల్పింగ్మైండ్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వాతాతలు, దివ్యాంగులు, అనాథల కడుపులు నింపుతున్నాయి. సంస్థ సభ్యులు ప్రతి రోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తారు. ప్రధానంగా ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి ఇందులో ఆహారపొట్లాలను పెడుతున్నారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్ల్లో భద్రపరచడం, పేదలకు అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రం ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ సహకారం అందిస్తున్నారు పేదలకు గుప్పెడు అన్నం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేశాం. అందరూ సహకరిస్తున్నారు.మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రానికి అందజేయాలి. –అబూబకర్సిద్దిక్, హెల్పింగ్మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె -
పుట్టినరోజు వేడుక ఆనందం..కాసేపటికే అంతులేని విషాదం
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆనందం క్షణాల్లో ఆవిరైంది. కన్నబిడ్డలతో కలిసి బయలుదేరిన తల్లి, ఇద్దరు బిడ్డలు, సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలిగొన్న సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాక్షి, మదనపల్లె టౌన్: తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం తానామిట్ట వద్ద బైకును లారీ ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. తంబళ్లపల్లె మండలం ఎద్దురరిపళ్లెకి చెందిన ఆటో డ్రైవర్ షంషీర్ భార్య హాజిరా(25), కుమార్తె జోయా(10), కొడుకు జునేద్(07)లతో కలిసి మదనపల్లె పట్టణం కరవంకలో ఉన్న అక్క రీమా కూతురు పుట్టిన రోజు వేడుకలకు సో మవారం వచ్చింది. సాయంత్రం వరకు పుట్టిన రోజు వేడుకల్లో ఆనందంగా గడిపారు. హాజిరా తమ్ముడు ఖా దర్బాషా(19), తన బైకులో అక్క, పిల్లలను తీసుకుని ఎద్దులవారిపల్లెకు వెళ్తుండగా మార్గమధ్యంలో కురబలకోట మండలం ముదివేడు అంగళ్లు తానామిట్ట వద్ద ఎ దురుగా వచ్చిన లారీ బైకును ఢీకొని దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఖాదర్బాషా, జోయా, జునేద్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన హాజిరాను 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లె జి ల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతుల కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వారి రోదన ప్రతి చూపరులను కలచి వేసింది. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఎద్దులవారిపల్లెలో విషాద ఛాయలు ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో ఏ పూటకు ఆపూట ఆనందంగా జీవనం సాగిస్తున్న షంషీర్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీఐ అశోక్కుమార్, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే -
సచివాలయ సేవలు దేశానికే ఆదర్శం
సాక్షి,ఒంటిమిట్ట: రాష్ట్రంలో సచివాలయాల సేవలు దేశానికే ఆదర్శమని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని భారత ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, ఆకాంక్ష జిల్లాల కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన...ఆదివారం జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్ వర్మతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సచివాలయ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను కలెక్టర్, జేసీలు ఆయనకు వివరించారు. గ్రామ సచివాలయ భవనంలో ప్రదర్శించిన ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2021–2022 సంక్షేమ క్యాలెండర్లను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయ బోర్డు సలహా మండలి సభ్యులు ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జెడ్పీసీఈవో సుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, కడప తహసీల్దార్ శివరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక మున్సిపల్, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నమయ్య సంకీర్తనలో పులకించిన సప్తగిరులు
-
అన్నమయ్య జిల్లాపై పచ్చ పాలిట్రిక్స్
టీడీపీ నాయకులు ఆ పార్టీ అధినేత కంటే రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. ఆయన రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రసిద్ధి చెందితే వీరు ప్రాంతానికో పాత్ర వేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. అక్కడో మాట.. ఇక్కడో మాట.. పూటకో మాట.. మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటుపై పాలి‘ట్రిక్స్’ చేస్తున్నారు. వీరి వ్యవహారం ఇపుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మదనపల్లె కేంద్రంగా జిల్లా కావాలని, రాజంపేట కేంద్రంగా ఉండాలని, రాయచోటి ఎంపిక సరైనదంటూ ఆయా ప్రాంతాల్లో పాలిట్రిక్స్ చేస్తున్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. రాజంపేట: అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన సౌలభ్యత.. భౌగోళిక పరిస్ధితులు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే అజెండాగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించింది. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండేలా శాస్త్రీయ అధ్యయనాలతో పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో రాజంపేట లోక్సభ పరిధిలో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లతో పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల పేరిట జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో విషం కక్కుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రజలను రెచ్చగొట్టేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరు..ఎలా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనపై రాజంపేట పార్లమెంటరీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి తదితర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ ప్రకటనపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని రాజంపేట టీడీపీ ఇన్చార్జి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు అండ్ కో ఉద్యమం ముసుగేసుకొని రాజకీయచలి కాచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అలాగే మదనపల్లెలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నానాయాగీ చేస్తున్నారు. మరోవైపు నల్లారి కిషోర్కుమార్రెడ్డి కూడా జిల్లాల పునర్విభజనపై టీడీపీ ట్రిపుల్ యాక్షన్ ఎపిసోడ్లో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఒక నిర్ణయమంటూ లేకుండా, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వీరు వ్యవహరించడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ఒక్కో చోట.. ఒక్కో మాట.. రాజకీయ పార్టీలు కీలక విషయాలకు సంబంధించి ఒక స్టాండ్ తీసుకుంటారు. ఆ పార్టీ నిర్ణయం మేరకు శ్రేణులు కట్టుబడతాయి. కానీ చంద్రబాబు సంగతి అలా కాదు. ఆయన ఒకే విషయంపై పలు రకాలుగా స్టాండ్ తీసుకుంటారు. రాజకీయలబ్ధి కోసం ఎలాంటి ప్రకటనలకైనా తెగబడిపోతారు. బాబుస్ఫూర్తితో ఆయనను మించి టీడీపీ నేతలు ప్రాంతానికి తగ్గట్టు స్వరాలను మారుస్తున్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మదనపల్లెలో జిల్లా కేంద్రం ఉండాలని అక్కడి తెలుగుదేశం నేతలు, రాజంపేటను కేంద్రంగా చేయాలని ఇక్కడి టీడీపీ శ్రేణులు నానా యాగీచేస్తున్నారు. రాయచోటిలో మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేయడమే కాకుండా సంబరాలు జరుపుకుంటున్నారు. వీరి తీరును పలువురు విమర్శిస్తున్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వ్యవవహరిస్తున్నారని మండిపడుతున్నారు. టీడీపీ వైఖరి స్పష్టంచేయాలి అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి. ఆ నేతల తీరు అనుమానంగా ఉంది. ఒక పక్క రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నారు. మరోపక్క మదనపల్లెలోనూ అదే పాట పాడుతున్నారు. ఇంకోపక్క రాయచోటిలో ఆపార్టీ వారే కృతజ్ఞతలను తెలుపుతున్నారు. రాజకీయపార్టీలు స్పష్టమైన వైఖరి లేకుండా మాట్లాడటం సరైన విధానం కాదు. –మేడా విజయశేఖర్రెడ్డి, జేఏసీ నాయకుడు, రాజంపేట ఒకే నిర్ణయానికి కట్టుబడాలి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కాకుండా అన్నమయ్య జిల్లాపై టీడీపీ స్పష్టమైన వైఖరి తెలపాలి. రాజకీయపార్టీల నాయకులు ఒకే నిర్ణయానికి కట్టుబడాలి. మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న టీడీపీ తీరును ప్రజలు గుర్తించాలి. –దాసరి చిదానందగౌడ్, రాష్ట్రబీసీ సంక్షేమసంఘం నేత, రాజంపేట -
వైఎస్ కుటుంబం ఆదరణ మరచిపోలేనిది: అన్నమయ్య వంశస్తులు
సాక్షి, తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని తన సంకీర్తనలతో ఓలలాడించిన తాళ్లపాక అన్నమాచార్యుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం రాయచోటి కేంద్రంగా శ్రీఅన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడంపై తాళ్లపాక అన్నమయ్య వంశస్తుల ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి అంశతో పుట్టిన అన్నమయ్య తన 95ఏళ్ల జీవితకాలంలో 32వేల సంకీర్తనలతో శ్రీవారిని కీర్తిస్తూ రచనలు చేశారు. శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్య పేరును ఓ కొత్త జిల్లాకు నామకరణం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలుగు ప్రజలే కాకుండా విశ్వమంతటా ఉన్న శ్రీవారి భక్తులందరూ స్వాగతిస్తున్నారు. భక్తులే కాదు.. తమిళ, కన్నడ, మహారాష్ట్రకు చెందిన కళాకారులు సైతం ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షిస్తున్నారని తాళ్లపాక అన్నమయ్య 12వ తరం వారసులు తాళ్లపాక హరినారాయణాచార్యులు ఆనందం వ్యక్తం చేశారు. తాళ్లపాక అన్నమయ్య కుమారుడైన పెద్ద తిరుమలాచార్యుల సంతతికి చెందిన హరినారాయణాచార్యులు ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో సంకీర్తనా కైంకర్యము, కల్యాణోత్సవంలో తన సేవలను అందిస్తున్నారు. నాడు వైఎస్ జీవనభృతి కల్పించారు.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తాళ్లపాక అన్నమయ్య వంశస్తులకు జీవన భృతి అందించి అరుదైన ఘనత కల్పించారని హరినారాయణాచార్యులు గుర్తు చేశారు. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆ సమస్యను వైఎస్ దృష్టికి తీసుకువెళ్ళగానే అన్నమయ్య తరాల వారికి జీవనభృతి కల్పిస్తూ యుద్ధప్రాతిపదికన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్నమయ్య పేరిట ఓ జిల్లా రావడం చాలా సంతోషకరమన్నారు. శ్రీఅన్నమయ్య జిల్లా ప్రకటించడం జన్మజన్మల అదృష్టంగా తమ కుటుంబాలు భావిస్తున్నాయని హరినారాయణచార్యులు హర్షం వ్యక్తం చేశారు. అన్నమయ్య వారసులుగా తాము శ్రీవారి పవళింపు సేవ, సుప్రభాతం, శ్రీవారి కల్యాణోత్సవాల్లో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ వంశ పరంపర కొనసాగిస్తున్నామన్నారు. అన్నమయ్య పేరు జిల్లాకు పెట్టడం శ్రీవారి అనుగ్రహంగా, సీఎం వైఎస్ జగన్ మా కుటుంబంపై ఉంచిన నమ్మకానికి ప్రతీకగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. అన్నమయ్య మార్గం.. అంతులేని ఆనందం ‘‘తిరుమలకు పదపితాహుడు అన్నమయ్య నడిచిన మార్గాన్ని అన్నమయ్య మార్గంగా అభివృద్ధి చేసేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్నిస్తోంది. తిరుమలకు ప్రస్తుతమున్న ఘాట్ రోడ్లు నిర్మించడానికి పూర్వం భక్తులు శేషాచలం అడవిలోని అన్నమయ్య మార్గం ద్వారానే శ్రీవారి దర్శనానికి నడచి వచ్చేవారు. ఇప్పటికీ కొంతమంది భక్తులు ఇదే సంప్రదాయం పాటిస్తూ అన్నమయ్య నడయాడిన మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ఆ మార్గానికి గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ సంకల్పించడం... ఇదే సమయంలో ఆయన పేరును ఓ జిల్లాకు నామకరణం యాధృచ్ఛికమే కావొచ్చు. కానీ తాళ్ళపాక వంశస్తులకు మాత్రం ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది.’’ అని హరినారాయణాచార్యులు వ్యాఖ్యానించారు. -
అదివో.. అల్లదివో.. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి అడుగులు
రాజంపేట: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తన ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తాళ్లపాక నుంచి శేషాచలం అటవీ మార్గంలో వెళ్లిన కాలిబాట అభివృద్ధికి ఇన్నాళ్లకు అడుగులు పడ్డాయి. ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే రాయలసీమ జిల్లాలే కాకుండా దక్షిణ భారత యాత్రికులకు తిరుమల మరింత దగ్గర దారి అవుతుంది. చదవండి: హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే తిరుపతి వెళ్లకుండానే.. అన్నమయ్య కాలిబాట అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లకుండానే నేరుగా తిరుమల కొండ ఎక్కవచ్చు. వైఎస్సార్ జిల్లా సరిహద్దులో ఉన్న కుక్కలదొడ్డి నుంచి రైల్వే ట్రాక్ దాటుకుని పశ్చిమ భాగంలోని శేషాచలం అటవీ మార్గంలో 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకోవచ్చు. దీనివల్ల 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల తిరుమల వెళ్లే భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు ఆవశ్యకతను టీటీడీ బోర్డు గుర్తించింది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచి వెళ్లిన దారిని అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకుంది. నాడు వైఎస్సార్.. నేడు జగన్ పాలనలో.. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయడంపై టీటీడీ బోర్డు దృష్టి సారించింది. ఆయన మరణానంతరం ఈ ప్రతిపాదన అటకెక్కింది. అప్పట్లో ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆకేపాటి అమర్నాథ్రెడ్డి వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లిన సంగతి విదితమే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో అన్నమయ్య కాలిబాటకు మోక్షం కలిగింది. ఆహ్లాదకర వాతావరణంలో.. గోవింద మాల ధరించే భక్తులు సుమారు 500 ఏళ్ల నుంచి అన్నమయ్య కాలిబాటలో స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. ఓ వైపు పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు.. జలజల పారే సెలయేర్లు.. ఎత్తయిన బండలు ఇలా ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నమయ్య కాలిబాట పయనం కొనసాగుతుంది. భక్తులు ఈ బాటలో కొండకు చేరుకుంటారు. ఈ మార్గంలో అనేక చోట్ల యాత్రికుల బసకు సంబ«ంధించి సత్రాలు, అవ్వతాతల గుట్టలు, ఎర్రిగుంతలు, పార్వేటి మండపం, చావిళ్లు లాంటివి ఉన్నాయి. -
షేక్స్పియర్ నోట అన్నమయ్య పాట
తెలుగునాట తాళ్లపాక గ్రామంలో 15వ శతాబ్దంలో జన్మించిన అన్నమాచార్యులు సంస్కృతాంధ్ర భాషల్లో రచించిన వేల పదకవితలు పండితులను, పామరులను రంజింపజేశాయి. తత్త్వసంకీర్తనలు గానం చేస్తూ, తంబురమీటుతూ పురవీధులలో, తిరువీధులలో నాట్యం చేశాడు అన్నమయ్య. ఆనాటి వేద వాఙ్మయం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు అన్ని ప్రక్రియల్లో కనిపించే మానవతాధర్మాలు అన్నమయ్య పదాలలో గమనించవచ్చు. ‘నానాటి బతుకు నాటకము/ కానక కన్నది కైవల్యము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్టనడిమి పని నాటకము/ యెట్ట నెదుట గల దీ ప్రపంచము/ కట్ట గడపటిది కైవల్యము/ కుడిచే దన్నము కోక చుట్టెడిది/ నడ మంత్రపు పని నాటకము/ వొడి గట్టుకొనిన వుభయ కర్మములు/ గడి దాటినపుడె కైవల్యము/ తెగదు పాపము తీరదు పుణ్యము/ నగి నగి కాలము నాటకము/ యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక/ గగనము మీదిది కైవల్యము’ అన్నాడు అన్నమయ్య. ఎదుట కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా ఒక రంగస్థలం, దానిపై మానవుల అశాశ్వతమైన బతుకు నాటకమేనని ఉద్బోధించాడు. మనిషి పుట్టడం నిజం, మరణించడం నిజం, ఈ మధ్య జరుగుతున్న బతుకు కేవలం నాటకం; ఈ జనన మరణచక్రం ఎక్కడ ఆగుతుందో అదే కైవల్యము అన్నాడు. అన్నమయ్య తదనంతరం 16వ శతాబ్దిలో బ్రిటన్లో జన్మించిన షేక్స్పియర్ నటుడిగా, నాటకకర్తగా, కవిగా ఆంగ్ల సాహిత్యంలో ప్రఖ్యాతి గాంచాడు. ఆయన నాటకాల్లో ‘యాజ్ యు లైక్ ఇట్’ ఒకటి. ఇందులో ప్రేమకథను సుఖాంతంగా చిత్రించాడు. మానవ జీవితాంకాలు దశలుగా విభజించి నాటక రంగంలోని పాత్రలవలె మనిషి ఎలా జీవిస్తాడో షేక్స్పియర్ ఇందులో చెబుతాడు. The whole world is a stage, and all the men and women merely actors. They have their exits and their entrances, and in his lifetime a man will play many parts... ప్రపంచమంతా ఒక నాటక రంగం. స్త్రీ పురుషులందరూ అందులో కేవలం పాత్రధారులు. వారి వారి ప్రవేశాలు, నిష్క్రమణలు వారికుంటాయి. ఒక మనిషి తన జీవితకాలంలో అనేక పాత్రల్ని పోషిస్తాడు’ అంటాడు షేక్స్పియర్. భగవంతుడు ఈ అఖండ విశ్వాన్ని రంగస్థలముగా చేసి, అందులో మానవులకు వారి కర్మలనుబట్టి పాత్రలను కల్పించి, పావులుగా కదుపుతూ వారి జీవితాలతో ఆడుతున్న వింత నాటకమే ఈ జగన్నాటకం అని ఇద్దరు మహాకవులూ విశదపరిచారు. విభిన్న దేశాలలో, విభిన్న కాలాలలో జీవించినప్పటికీ, వారి భాషలు వేరైనప్పటికీ వారి భావమొక్కటే. వీరిద్దరి పద, పద్య పాదాలను పరిశీలిస్తే అన్నమయ్య తెలుగుపాటే షేక్స్పియర్ కవితగా మారిందా అనిపిస్తుంది. -యానాద్రి 97018 57260 -
ఆన్లైన్లో ‘అన్నమయ్య శతగళార్చన’
సింగపూర్ : సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ఆధ్వర్యంలో మూడవ "అన్నమయ్య శతగళార్చన ఆరాధనోత్సవాలు" ఘనంగా జరిగాయి. 5 దేశాలనుండి 17మంది కళాకారులతో 200 మందికి పైగా లైవ్ ప్రేక్షకులతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవిడ్-19 వైరస్ దృష్ట్యా ఈసారి సమ్మేళనాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఇండియా, దుబాయ్, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలనుండి తెలుగు వారందరు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ 2020 శతగళార్చన కార్యక్రమం 200మందికిపైగా భక్తి తత్వసాధకుల భాగస్వామ్యంతో జూమ్ యాప్, యూట్యూబ్ ద్వారా ప్రసారం చేశారు. 100మందికి పైగా పిల్లలు పంపిన అన్నమయ్య కీర్తనల నుండి, 16 కీర్తనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. చిన్నారులు తమ మధురమైన కీర్తనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ప్రముఖ వయొలినిస్ట్, స్వరకర్త డా. జ్యోత్స్నా శ్రీకాంత్ తమదైన శైలిలో "బ్రహ్మమొక్కటే” కీర్తనను వయోలిన్పై ప్రదర్శించి అందరినీ అలరించారు. ఊలపల్లి సాంబశివ రావు, వాణి ప్రభాకరి, డా.జ్యోత్స్నా శ్రీకాంత్, కవుటూరు రత్నకుమార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులైన చుక్కల ఉమాదేవి, చివుకుల లావణ్య, రాధాకృష్ణ గణేశ్న, చివుకుల సురేష్, భాగవతుల రవితేజ, ఇతర స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమం సంకలనం చేశామని అంతర్జాతీయ శాఖ అధ్యక్షులు ఊలపల్లి భాస్కర్, విద్యాధరి దంపతులు తెలిపారు. -
మాండలిక మాధుర్యాల పదకోశం
మాండలికాలు మన వారసత్వ సంపద. జానపద విజ్ఞానం మాండలికాల నుంచి పుట్టిందే. ప్రాచీన కాలంలో అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, సారంగపాణి, రామదాసు వంటి వాగ్గేయకారులు, వేమన, బద్దెన వంటి శతకకర్తలు మాండలికాలను వాడారు. యక్షగానాల్లోనూ పాత్రోచితంగా మాండలికాలను ఉపయోగించారు. సాహిత్యంలో గ్రాంధికం నుంచి శిష్టవ్యవహారికానికి, అక్కడ నుంచి మాండలికానికి ప్రాధాన్యత పెరిగి నేడు సాహిత్య రచన భాషగా మాండలికం నిలదొక్కుకుంది. ఈ మాండలిక భాషా సంపదను భద్రపరుచు కోవడం మన బాధ్యత. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇటీవల ఉద్యోగవిరమణ చేసిన ఆచార్య మూలె విజయలక్ష్మి ఆ బాధ్యతను ఎప్పటి నుంచో భుజానికెత్తుకున్నారు. వ్యావహారిక భాష నుంచి జాతీయాలు సేకరించి 2008లో ‘తెలుగు జాతీయాలు పర్యాయ పదకోశం’ నిర్మించారు. భారతీయ భాషల్లో జాతీయాలకు నిర్మించిన తొట్టతొలి పర్యాయపదకోశంగా ఇది గుర్తింపు పొందింది. దీనికి ముందు ‘తెలుగు జాతీయాల కోశం’ నిర్మించారు. తెలుగులో ప్రథమ మహిళా నిఘంటు నిర్మాతగా గుర్తింపు పొందారు. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ‘తెలుగు మాండలిక పదకోశం’ తెచ్చిన వీరు, తాజాగా చిత్తూరు జిల్లాకు కూడా ‘తెలుగు మాండలిక పదకోశం’ నిర్మించారు. తన గురువర్యులైన ప్రముఖ భాషా శాస్త్రవేత్త, నిఘంటు నిర్మాత జిఎన్రెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం ఈ పదకోశాన్ని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆవిష్కరింపచేశారు. భాష సామాజికం కనుక, సమాజంలో కనిపించే మార్పులు భాషలోనూ కనిపిస్తాయి. సమాజంలో ఉండే కుల, మత, ప్రాంత, వర్గ, వయోభేదాల అంతరాలు భాషా వైవిధ్యానికి దారితీస్తున్నాయి. చారిత్రకంగా, సామాజికంగా, ప్రాంతీయంగా భాషలో కలిగే మార్పులు, విలక్షణత, వైవిధ్యాన్ని మాండలికం అంటున్నాం. ఒక ప్రాంతంలో వాడే ప్రత్యేక పదాలు, పదబంధాలు, జాతీయాలు, సామెతలు, వ్యాకరణాంశాలు, ధ్వని పరిణామాలు, అన్యదేశ పదాలు ఒక ప్రాంత మాండలిక ప్రత్యేకతను పట్టిస్తాయి. మాటల ఉచ్ఛారణ తీరు ‘యాస’ కూడా మాండలికంలో భాగమే. తెలుగు భాషా ప్రాంతాన్ని స్థూలంగా కళింగాంధ్ర, కోస్తా, తెలంగాణ, రాయలసీమ అనే నాలుగు భాషా మండలాలుగా భద్రిరాజు కృష్ణమూర్తి విభజించారు. అయినప్పటికీ, ఆయా జిల్లాలకే పరిమితమైన పదజాలం, మాండలికత ఉంది. జిల్లా అంతటా కూడా భాషలో, యాసలో ఏకరూపత లేదు. ప్రాంతీయ, స్థానిక మాండలికాలకు ఖచ్చితంగా గిరిగీసి సరిహద్దులు ఏర్పాటు చేయలేం. తెలుగు పదజాలం, వ్యాకరణాంశాలు, ధ్వనిమార్పుల్లో ఉన్న వైవిధ్యం, విలక్షణత, భాష సుపంపన్నతను తెలియచేస్తుంది. ఏ రెండు మాండలికాలైనా భిన్న అర్థాలు ధ్వనిస్తే వాటిని భిన్న భాషలుగా గుర్తించవచ్చు. ఒక భాషలోని మాండలికాలే భిన్నభాషలుగా రూపాం తరం చెందినట్టు భాషా పరిణామ చరిత్ర చెపుతోంది. మూల ద్రావిడ భాష నుంచి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలు పుట్టుకు రావడం ఇందుకు నిదర్శనం. జిల్లాల వారీగా వ్యావహారిక ఖండికల్ని సేకరించి, ఆయా జిల్లాల మాండలిక భాషా నిర్మాణ భేదాల్ని గతంలో బూదరాజు రాధాకృష్ణ విశ్లేషించారు. జిల్లాల వారీగా జరగని మాండలిక పదసేకరణను ఈ ‘తెలుగు మాండలిక పదకోశం’లో మూలె విజయలక్ష్మి చేపట్టారు. కేవలం పదాల సేకరణకే పరిమితం కాకుండా, వాటి అర్థాలను, వాడే తీరును కూడా వివరించారు. నానాటికీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ ప్రభావం వల్ల మాండలిక పదజాలం కాలగర్భంలో కలిసిపోకముందే వాటిని నిక్షిప్తం చేయడం ఎంతైనా అవసరం. రాఘవశర్మ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్ : 94932 26180 -
పద కవితా పితామహుని పుట్టిన రోజు
తెలుగులో తొలి వాగ్గేయకారుడు, పదకవితా పితామహ బిరుదాంకితుడు, దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు అన్నమయ్య. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలం నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవుల నమ్మకం. ‘చందమామ రావే జాబిల్లి రావే’ ‘జో అచ్యుతానంద జో జో ముకుందా’ అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రం హాయిగా నిద్ర పోతారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనంటూ ఆయన రచించిన తందనానా పురే తందనానా అనే కీర్తన ఎప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉంటుంది. అన్నమయ్య జయంతినాడు ఆయన రచించిన కొన్ని కీర్తనలనైనా మనసారా పాడుకోవడం, ఆయనను స్మరించుకోవడం శ్రేయోదాయకం. (వైశాఖ శుద్ధ పౌర్ణమి అన్నమయ్య జయంతి) -
సిసలైన సామాజికత
అన్నమయ్య... ఈ పేరు వినగానే భక్త కవి అనో, గొప్ప వాగ్గేయకారుడనో, మహా భక్తుడనో, సంకీర్తనాచార్యుడనో మాత్రమే చెబుతారు తప్ప ఆయనలోని సామాజికతను తలచుకునేవారు చాలా తక్కువ. ఆయన పదాలను విశ్లేషించి చూస్తే అన్నమయ్య అసలైన సామాజిక కవి, విప్లవ కారుడు అనే విషయం తేటతెల్లమవుతుంది. ఎందుకంటే, ఆ కాలంలో మిగిలినవాళ్లు భక్తి మార్గంలో అత్యంత కఠినమైన, నిగూఢమైన, సామాన్యులకు అర్థం కానట్లు చెప్పే విషయాలను ఆయన అత్యంత సులభంగా అపారమైన విషయాన్ని చిన్న సూత్రంలో చెప్పినట్లుగా చెప్పాడు. అన్నమయ్య సామాజిక బాధ్యత ఉన్న కవి కాబట్టే భక్తి మార్గంలోనే సామాజిక సమస్యలను ఎత్తిచూపుతూ, సామాజిక రుగ్మతలను రూపుమాపడం, సామాజిక అంతరాలను తొలగించడం అన్నవే భగవంతుని ఆరాధనా మార్గాలని తన సంకీర్తనల్లో కీర్తించాడు. ‘కందువగు హీనాధికము లిందులేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ’ ఇందులో జంతు కులమంతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ అని సృష్టిలో ఎలాంటి అంతరాలు లేవు, అంతరాలన్నీ మనుషులు సృష్టించుకొన్నవే అంటాడు. ‘‘చేరి యశోదకు శిశువితడు... ధారుణి బ్రహ్మకు దండ్రియు నితడు’’ అన్న సంకీర్తనలో – భగవంతుడు గొప్పవాళ్లకు గొప్పగా, తక్కువవాళ్లకు తక్కువగా ఉండడు. అందుకు వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. అందుకని ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అన్నది నిర్ణయించే హక్కు మనుషులకు లేదని చాటాడు అన్నమయ్య. యశోద సామాన్యమైన స్త్రీ. ఆమెకు భగవంతుడు కొడుకు. తల్లి కన్నా కొడుకు మించినవాడు కాడు. అంటే భగవంతుడు సామాన్య స్త్రీ కన్నా మించినవాడు కాడు. దానర్థం... అవసరమైతే సామాన్యులైన భక్తుల కన్నా కూడా తగ్గి ఉండగలడు. యశోద కొడుతుంది, తిడుతుంది అన్నీ భరించి ఆమెకు అణిగి మణిగి కొడుకుగా ఉంటాడు. అదే భగవంతుడు సృష్టికర్త అయిన బ్రహ్మనే శాసించగల తండ్రి స్థానంలో ఉన్నాడు. అంటే భక్తుణ్ని బట్టి అతి తక్కువ స్థాయిలోను, అతి ఎక్కువ స్థాయిలోను ఉంటాడన్నమాట. అంతేకాదు, సృష్టిలో ఒక సామాన్య స్త్రీ కన్నా తక్కువగా ఉండటం, అదే సమయంలో సృష్టికర్తనే అధిగమించి ఉండటం అన్న రెండు భిన్న కోణాలు భగవంతుడి సర్వాంతర్యామిత్వాన్ని, బ్రహ్మాండ స్వరూపాన్ని తెలియజేస్తాయి. ఇంత అద్భుతంగా భగవంతుడి అనంతమైన తత్వాన్ని ఆవిష్కరించిన అన్నమయ్య భక్తితత్వాన్ని ఆకళింపు చేసుకొని, ఆచరణలో పెట్టగలిగినవాళ్లే నిజమైన భక్తులు. మిగిలినవాళ్లు భక్తి పేరుతో భుక్తి సాగించుకొనే సమాజ భోక్తలు. -
ఆర్ద్రత నిండిన భావావేశం...
చిత్రం: అన్నమయ్య రచన: అన్నమయ్య గానం: ఎస్.పి.బాలు సంగీతం: ఎం.ఎం.కీరవాణి తనకు 95 సంవత్సరాలు వచ్చే నాటికి 32 వేల సంకీర్తనలు రాసిన అన్నమయ్య, అంత్య దశలో ‘అంతర్యామి... అలసితి... సొలసితి...’ అంటూ రాసిన మొదటి వాక్యంలోనే తన పరిస్థితి వివరించాడు. ఒకనాటి అర్ధరాత్రి ఏమనిపించిందో, ఏమో తను రచించిన సంకీర్తనల తాలూకు తాళపత్ర గ్రంథాలు పట్టుకుని, గుడిమెట్లు ఎక్కుతుంటే ఒక్కసారి ఒళ్లు తుళ్లి సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి వక్షస్థలం మీద వాలతాడు. తలెల్తి చూసేసరికి, ఆ తిరుమలరాయుడు కంటికి కనిపిస్తాడు. ‘‘ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా, ఆభయహస్తంతో, కరుణామృతధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా, నా తల్లులిద్దరూ నెలవుండే ఈ గుండెల పైన నన్ను చేర్చుకున్నావా స్వామీ, నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలం ఇంత పెద్ద భూరి ముట్ట చెప్పావా. నా జన్మ తరించింది, ఇదిగో నీ సొమ్ము, భద్రంగా దాచుకో’’ అని సాక్షాత్తు ఆ వేంకటేశ్వరునికి బహుమతి ఇవ్వడానికి వచ్చినవాడిలా మాట్లాడతాడు. ‘‘అన్నమయ్యా! నీ ఆయుష్షు పెంచుతానయ్యా, నిత్య యవ్వనంలో ఉండి పాటలు రాస్తూండు...’’ అంటూ అన్నమయ్య రచించిన కొన్ని కీర్తనలు తన దేవేరులతో కలిసి గానం చేస్తాడు. వారు పాడుతుంటే సంబరపడి పోతూనే, ‘‘అలసిపోయానయ్యా! నాకింక మోక్షం ప్రసాదించు తండ్రీ!’’ అని అభ్యర్థిస్తాడు. అప్పుడు వేంకటేశ్వరస్వామి బేరానికి వచ్చి, ‘‘ఆఖరి పాట ఒక్కటి రాయవయ్యా నా కోసం’’ అంటాడు. అన్నమయ్య ఉప్పొంగిపోతాడు. అంతర్యామి అలసితి సొలసితి ... ఇంతట నీ శరణిదే సొచ్చితిని... అనే కీర్తన ఆలపిస్తాడు. తను ఎందుకు బయలుదేరాడో, తన మనసులో ఏ ఆలోచన ఉందో, ఆ ఆలోచన, ఆ ప్రయాణమే ఆ కీర్తనకు మకుటమైంది. ‘‘కోరిన కోర్కెలు.... కోయని కట్లు తీరవు నీవవి తెంచక...’’ ఒక చెట్టుకు కాసిన కాయలను ఎవరో ఒకరు తెంచకపోతే అవి కిందపడదు. అలాగే ఒంటి నిండా ఉన్న కోర్కెలను ఎవరో ఒకరు వచ్చి తెంచేయాలి. కోర్కెలన్నీ తెంచుకుని వస్తేనే ఆ స్వామిని చేరుకోగలం. ‘‘భారపు పగ్గాలు... పాపపుణ్యములు... నేరుపునబోవు నీవు వద్దనక...’’ ఎన్ని ఆశలు, వ్యామోహాలు పెంచుకున్నా... అవి పాపపుణ్యాల వంటివే. అవన్నీ భారపు పగ్గాల్లా వెనక్కు లాగుతూనే ఉంటాయి. అవి తెంచుకుంటేనే స్వామిని చేరగలమని నాకు తెలుసు... అంటాడు అన్నమయ్య. ఈ కీర్తనలో ప్రతి మనిషి తెలుసుకోవలసిన వేదాంతాన్ని, తత్వాన్ని బోధించాడు అన్నమయ్య. ఎంత సంపద ఉన్నా... చివరకు ఆ స్వామిని చేరవలసినదే అనే తత్వాన్ని తన జీవితానుభవంతో వర్ణించాడు అన్నమయ్య. – సంభాషణ: డా. వైజయంతి -
అన్నమయ్యకు ఘన నివాళి
విశాఖ–కల్చరల్ : విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమి ఆధ్వర్యంలో అన్నమయ్య 514వ వర్థంతిని పురస్కరించుకుని కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన గాత్ర కచేరి ఆకట్టుకుంది. నాద సుధా తరంగణి సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన గాత్ర కచేరిలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సినీ గాయని శ్రీనిధి (హైదరాబాద్) నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్న తదితర సంగీత ప్రముఖలు స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనలు శ్రావ్యమైన మోహన వంటి రాగాలతో ఆలపించి కచేరిని రక్తకట్టించి అన్నమయ్యకు ఘన నివాళులర్పించారు. కచేరికి వయోలిన్ రమకిరణ్మయి, మృదంగం ధర్మారావు వాయిద్య సహకారం అందించి శభాష్ అనిపించుకున్నారు. తొలుత అన్నమయ్య చిత్రపటానికి ప్రముఖ సినీ రచయిత గొల్లపూడి మారుతీరావు, నేదునూరి కృష్ణమూర్తి కుమార్తె శ్రీవల్లి, డాక్టర్ జి.ఇందిర, విశాఖ సంస్థ కార్యదర్శి జిఆర్కె ప్రసాద్ పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త దూసి ధర్మారావు వ్యాఖ్యతగా వ్యవహరించారు. సాగరతీరంలో సప్తగిరి సంకీర్తనలు బీచ్రోడ్ (విశాఖ తూర్పు) : టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, విశాఖ జిల్లా ధర్మ ప్రచార మండలి సంయుక్తంగా శుక్రవారం బీచ్రోడ్డులోని అన్నమయ్య విగ్రహం వద్ద సప్తగిరి సంకీర్తనలు అలపించారు. అన్నమయ్య 514వ వర్థంతి సందర్భంగా నగరంలోని సంగీత కళాకారులు ఈ కార్యక్రమంలో కీర్తనలు అలపించారు. దీంతో సాగరతీరం మొత్తం అన్నమయ్య కీర్తనలతో మార్మోగింది. కార్యక్రమంలో విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత డాక్టర్. సూరపనేని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అల అన్నమాచార్యుడు భువికేగెనా..
సీతానగరం (తాడేపల్లి రూరల్): ‘కలగంటి.. కలగంటి.. ఇప్పుడిటు కలగంటి..’, ‘వినరో భాగ్యము విష్ణు కథ..’ అంటూ.. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని సీతానగరం ఘాట్ వద్ద ఉన్న శ్రీసోమేశ్వర స్వామి ఆలయంలో శనివారం పెదనందిపాడుకు చెందిన శ్రీసీతారామాంజనేయ భక్త సమాజం సభ్యులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. తొలుత ఘాట్లో పవిత్ర స్నానాలు ఆచరించారు. -
అన్నమయ్యకు పట్టాభిషేకం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ ఏర్పాటు చేసిన ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణానికి వేదికైంది. పది మంది సంగీత దర్శకులు అన్నమయ్య సంకీర్తనలను సీడీల రూపంలో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వేసిన సెట్లో నిర్వహించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కీరవాణి, గాయని సునీత పాల్గొన్నారు. అన్నమయ్య పాటలు హృద్యంగా ఆలపించిన చిన్నారులను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభినందించారు. గత ఆరు నెలుగా 300కు పైగా అన్నమయ్య కీర్తనలకు పది మంది సంగీత దర్శకులు బాణీలు కట్టారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సీడీలను బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. -
అన్నమయ్య వేమన్న పదాలు
‘భక్తి కొలది వాడే పరమాత్ముడు’ అన్నాడు అన్నమయ్య. ‘భక్తి గలుగ వాడు పరమాత్ముడగునయా’ అని చెప్పాడు వేమన్న. ఈ విధంగా పదాలను ఉదహరిస్తూ పోతే అన్నమయ్యకూ వేమన్నకూ ఎంత దగ్గరి సామ్యం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ‘భక్తి కొలది వాడే పరమాత్ముడు’ అన్నాడు అన్నమయ్య. ‘భక్తి గలుగ వాడు పరమాత్ముడగునయా’ అని చెప్పాడు వేమన్న. ‘రానున్నా అది రాకుమన్న బోదు’ అని పాడాడు అన్నమయ్య. ‘రానున్నది కోరుకున్న రానే వచ్చున్’ అని చాటాడు వేమన్న. ‘ఎంత విభవము గలిగె నంతయును నాపదని’ అని సూక్ష్మం చెప్పాడు అన్నమయ్య. ‘ఎంత భాగ్యమున్న అంత కష్టపు చింత’ అని మరింత సూటిగా బోధించాడు వేమన్న. శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్వంతో సంకీర్తనా రచన సాగించిన పదకవితా పితామహుడు అన్నమయ్య. సామాజిక బోధన ప్రధానమైన తన పద్య రచనలతో సంఘ సంస్కర్తగాట పసిద్ధుడైనాడు వేమన. రాయలసీమ ప్రాంత వాసులైన అన్నమయ్య 15వ శతాబ్దానికీ, వేమన 17వ శతాబ్దానికీ చెందినవారు. వారిరువురి నడుమ సుమారు రెండు శతాబ్దాల తేడా వుండవచ్చు. వారి జీవిత చరిత్రలను పరిశీలిస్తే వారి కుటుంబీకులు కర్షకులైనప్పటికీ ఇరువురి జీవన విధానంలో ఎంతో వైరుధ్యముంది. కానీ, వారిరువురి రచనలను గమనిస్తే పద, భావాలలో ఎన్నో పోలికలు కనిసిస్తాయి. తాళ్లపాక అన్నమాచార్యులు క్రీ.శ.1408వ సంవత్సరంలో నందవరీక బ్రాహ్మణులైన లక్కమాంబ, నారాయణసూరి దంపతులకు కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించాడు. పుట్టుకతోనే ప్రతిభావంతుడైన అన్నమయ్య వేంకటేశ్వరునిపై రోజుకు ఒక సంకీర్తన చొప్పున 32,000 సంకీర్తనలు రచించాడు. తిరుమలలోని స్వామి సన్నిధిలో తన జీవితం గడిపి, క్రీ.శ.1503లో దివ్యధామం చేరుకొన్నాడు. వేమన సరళమైన అచ్చ తెనుగు పదాలతో ఆశుకవిగా తన స్వీయ అనుభవాలను ఆటవెలదుల్లో అలవోకగా లోకానికి విప్పి చెప్పిన విలక్షణ ప్రజాకవి. సుమారు 3000 పద్యాలు చెప్పాడు. అయితే, వేమన జీవిత చరిత్రకు సంబంధించిన ప్రాంతము, కాలం, కులము విషయంలో అనేక మంది పండితులలో, పరిశోధకులలో సందేహాలు ఉన్నాయి. వేమన కులము కాపు లేక రెడ్డి. తల్లి మల్లమ్మ, తండ్రి రెడ్డెన్న. వేమన కడప జిల్లాకు చెందినవాడని చాలామంది అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి చెందినవాడన్న విషయాన్ని మాత్రం అందరూ అంగీకరించారు. చివరికి కదిరి దగ్గర కఠారుపల్లెలో సమాధి నిష్టుడయ్యెనని చెప్పవచ్చు. వేమన త్రిశతాబ్ది జయంతిని క్రీ.శ.1972గా నిర్ణయించి, ఆయన జన్మించిన కాలం క్రీ.శ.1672 అని ‘ప్రభుత్వం’ అధికార ముద్ర వేయడం జరిగింది. అన్నమయ్య కాలం నుంచి వేమన కాలం వరకు దేశంలో కులమత భేదాలలోనూ, క్షుద్ర దేవతలను పూజించి, జంతుబలులివ్వడంలోనూ, శకునాలు, మూఢనమ్మకాలను పాటించడంలోనూ ప్రజలలో పెద్దగా మార్పు రాలేదు. కుల వ్యత్యాసాలు చూపకూడదని యిద్దరూ ఉద్బోధించారు. సమాజాన్ని చైతన్య పరచడంలో వారిరువురి సాహిత్యపు ఒరవడి నేటికి కూడా తిరుగులేనిదని చెప్పవచ్చు. విష్ణు దేవాలయాలను సందర్శించే నిమిత్తం కీర్తనలు పాడుతూ దేశం నలుమూలలా అన్నమయ్య, ఆయన సంతతి వారు సంచారం చేసినారు. వారు పర్యటించిన ప్రదేశాలలో యాదృచ్ఛికంగా వేమన కూడా సంచారాన్వేషణ చేసాడు. ఈ విధమైన యాత్రల మూలంగా అన్నమయ్య పదసాహిత్యపు వాసనలు వేమనకు దగిలి యుండవచ్చు. పద్యము కన్నా పదం సామాన్య జనానికి అందుబాటులో ఉంటుందని అన్నమయ్య గుర్తించి, సమాజములోని సామాన్యులు, దీనులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, ప్రపన్నులు అయిన వారికోసం పద రచన చేసాడు. ఆయన రచించిన అనేక కీర్తనలు ఆటవెలది పద్య ఛందమునకు దగ్గరగా ఉన్నవి. అన్నమయ్య పదకవితల శిల్ప విశేషాలను ప్రబంధ కవులు, పదకవులు యధేచ్ఛగా అనుకరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా వేమన మహాకవి కూడా తానొక సంస్కరణాభిలాషిగా, విశ్వశ్రేయోదాయక కవితా సందేశకర్తగా అన్నమయ్య పద రచనల పట్ల బాగా ఆకృష్టుడై ఉండవచ్చు. అవే పద భావాలను గ్రహించి, మరింత సులభతరంగా ఎన్నో పద్యాలు చెప్పగలిగినాడు. తులనాత్మక సూత్రాలను అనుసరించి, సమాన భావమున్న వారి పదాలను ఎంపిక చేసి ఒకదానితో నొకటి సమాంతరంగా పోల్చి చూపవచ్చు. భావాలు ఆలోచనలలో సామ్యం ఉండటమే కాకుండా అవే పదాలు ఉండటం ఆసక్తి కలిగించే అంశం. పదముతో, పాదముతో, విషయముతో అన్నిటా అనుకరణము నుండుననుటకు దృష్టాంతాలే యీ అవే పదాలు. దీనినే యిద్దరి కవుల భావ సంవాదమన్నారు పెద్దలు. ‘తలమేల కులమేల తపమే కారణము/ యెలమి హరిదాసులు యే జాతియైన నేమి’ అని అన్నమయ్య కీర్తన మొదలవుతుంది. ‘ఏది కులము నీకు ? ఏది స్థలంబురా/ పాదుకొనుము మదిని పక్వమెరిగి/ యాదరించు దాని నవలీల ముట్టరా/ విశ్వదాభిరామ వినుర వేమ!’ అని వేమన్న పద్యం. ఇందులో- ‘తలమేల కులమేల తపమే కారణము’ ‘ఏది కులము నీకు ? ఏది స్థలంబురా’ అవే పదాలు! అలాగే- ‘నీతితో నడచి తేను నెగులే లేదు/ జాతి దప్పకుండి తేను చలమే ఫలము’ అని అన్నమయ్య కీర్తన. నీతితో నడుచుకొంటె కష్టాలు బాధలుండవు. ఒప్పును ఒప్పుగా తప్పకుండా అంగీకరించితే మంచి ఫలితముంటుందని దీని భావం. నీతి అనే దీపం లేకుంటె అజ్ఞానాంధకారం నశించదు. అది లేకున్న బ్రహ్మస్వరూపం గోచరించదు. ధనం వున్నంత మాత్రాన ప్రయోజనం లేదు అన్న భావంతో వేమన్న ‘నీతి జ్యోతి లేక నిర్మలంబగునేది/ ఎట్లు కలుగు బరమదెంతయైన’ అన్న పద్యం చెప్పాడు. ఇందులో- ‘నీతితో నడచి తేను నెగులే లేదు’ ‘నీతి జ్యోతి లేక నిర్మలంబగునేది’ వాక్యాలను అవే పదాలుగా చూపవచ్చు. ఇంకా కొన్ని ఉదాహరణలు: ‘శ్రీపతి దాసులు చెడరెన్నడును’ (అన్నమయ్య). ‘ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు’ (వేమన్న). ‘పరుల పీడించి తేని పసిడొక్కటి సుఖము(అ). ‘పరుల మోసపుచ్చి పరధన మార్జించి - కాని పద్దు(వే). ‘తన శాంతమాత్మలో దగిలినపుడు గదా! ఫలియించుట’(అ). ‘శాంతమె జనులను జయము నొందించును’(వే). ‘మోహంబుచే వెనక ముందెఱుగ లేక’(అ). ‘ముప్ప త్రిప్పలబడి మోహంబు విడువడు’(వే). ‘పతిదయ గలిగిన పడతి దీ భాగ్యము’(అ). ‘తరుణి పుణ్యవతిగ నరుని బట్టియైయగు’(వే). ‘మగువల మాటలు మంచి చక్కెర తీపులు’(అ). ‘చెరుకు రసము కన్న చెలుల మాటలె తీపి’(వే). ‘వనితకు బతిమీది వలపే మూలధనము’(అ). ‘సతికి బతికినైన సంపదే సంపద’(వే). ‘తప్పలెంచే పనులైతే తాజేయనేల’(అ). ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’(వే). ‘వాకులొక్కటే భాషల వరుసే వేరు(అ). ‘భాష లెన్నిటిలో నైన భావమొకటె’(వే). ఈ విధంగా పదాలను ఉదహరిస్తూ పోతే అన్నమయ్యకూ వేమనకూ ఎంత దగ్గరి సామ్యం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. దీనిని బట్టి అన్నమయ్య ప్రభావం వేమన మీద చాలా గాఢంగా ఉన్నట్లు తెలుస్తుంది. పండితులు, పరిశోధకులు దీని మీద దృష్టి సారించి తులనాత్మక అధ్యయనం జరిపితే మరిన్ని విశేషాలు వెలుగులోకి వస్తాయి. అయితే, ఆశుకవిగా పేరొందిన సహజ ప్రతిభా సంపన్నుడైన వేమన్నకు ఈ అనుకరణ తప్పు కాదు. యిద్దరి పదాల సారూప్యానికి వారి భావైక్యమే కారణమని మాత్రం గమనించాల్సి వుంది. (వ్యాసకర్త, ‘అవే పదాలు’ పేరిట అన్నమయ్య, వేమన్న పదాల్లోని సామ్యాన్ని విశ్లేషిస్తూ పుస్తకం వెలువరించారు. ఫోన్: 9701857260) యానాద్రి -
అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
రాజంపేట (వైఎస్సార్ జిల్లా): టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్యుల 607వ జయంతి ఉత్సవాలు మంగళవారం వైఎస్సార్ జిల్లా తాళ్లపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో తొలిరోజు ఉదయం నాదస్వర సమ్మేళనం అనంతరం సప్తగిరి గోష్ఠిగానం నిర్వహించారు. అన్నమయ్య చిత్రపటాన్ని ఊరేగించి నగర సంకీర్తన నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణ తో తాళ్లపాక మారుమోగింది. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల నుంచి తీసుకువచ్చిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు అన్నమాచార్య ధ్యానమందిర ఆవరణలో కల్యాణం నిర్వహించారు. అన్నమయ్య వంశం 12వ తరానికి చెందిన హరినారాయణాచార్యులు, విజయరాఘవ, కుప్పా రాఘవాచార్యులు, వెంకటనాగభూషణం, శేషధర్ రవికుమార్, రాఘవ అన్నమాచార్యులు, నారాయణాచార్యులను టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సత్కరించారు. ఈ సందర్భంగా తాళ్లపాక అభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యుడు పుట్టాసుధాకర్ యాదవ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ పాల్గొన్నారు. -
అన్నమయ్య సంకీర్తనతో ‘అనంత’ ఖ్యాతి
అనంతపురం కల్చరల్ : కళలకు కాణాచి అయిన అనంత మరోసారి ప్రపంచ రికార్డు సంగీతోత్సవానికి జిల్లా వేదిక అయింది. ‘శ్రీ అన్నమయ్య అష్టోత్తర శత సంకీర్తనార్చన’ పేరిట శ్రీ నృత్యకళానిలయం వారు ఆలపించిన నిర్విరామ సంకీర్తనాలపనతో ప్రపంచ రికార్డు నమోదై అనంత కీర్తిప్రతిష్టలు ద్విగుణీకృతమయ్యా యి. ప్రపంచ రికార్డు స్థానాల కోసం 150 మంది కళాకారుల గాత్రాలతో ఏకధాటిగా 108 అన్నమయ్య సంకీర్తనాలపన ఆదివారం లలితకళాపరిషత్తులో జరిగింది. మేయర్ స్వరూప ఉదయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏకరూప వస్త్రధారణతో వందలాది మంది గాయనీమణులు తమదైన గాత్ర మాధుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మ ద్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు తమ విద్యార్థులు ఏకధాటిగా అన్నమయ్య సంకీర్తనలతో కళా ప్రాంగణాన్ని మార్మోగించారు. ప్రపంచ రికార్డును నమోదు చేయడానికి అనంతకు విచ్చేసిన ని ర్వా హకులు నరేంద్రగౌడ్, స్వర్ణశ్రీ తది తరులు ఆద్యంతం చిన్నారుల గళాలకు ముగ్దులైనట్టు ప్రకటించారు. వారిప్రదర్శనను రికార్డులలో నమోదు చేస్తున్నట్టు హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మేయర్ స్వరూప తదితరులు నృత్యకళానిలయం వారిని ఘనంగా అభినందించారు. సంధ్యామూర్తి ఎన్నో దశాబ్దాలుగా సంగీత, నృత్య ప్రపంచానికి నిరుమాన సేవలందిస్తున్నారని, మరోసారి అనంతను అందనంత ఎత్తులో నిలపడం గర్వకారణమన్నారు. నృ త్య కళా నిలయం వ్యవస్థాపకులు సంధ్యామూర్తి మాట్లాడుతూ జీని యస్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు వారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ విన్యాసాలలో సంక్షిప్తం చేసే దిశగా కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారని అందులో భాగంగా అనం త వేదికగా సాగిన తమ ప్రయత్నాన్ని రికార్డులలో నమోదు చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం సా యం త్రం జరిన సభా కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనాలపించిన గాయనీమణులతో పాటు నాగేశ్వరరావు (తబల), సుధాకర్ (మృదంగం),రమణయ్య (వయోలిన్) తదితర కళాకారులను ఘనంగా అభినందించారు. లయన్స్క్లబ్ అనంతపురం మెయిన్ జిల్లా అధ్యక్షురాలు ఫార్మాక్స్ విజయలక్ష్మీ ,వనితాక్లబ్ గూడూరు అనురాధ, ప్రఖ్యాత నాట్య విద్వాంసులు పట్నం శివప్రసాద్, హరిప్రసాద్ తదితరులు సంధ్యామూర్తిని ఘనంగా సన్మానించారు. ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనావళి వేద పండితులు ఆలూరు హరికిషోర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వేంకటేశ్వర ఆరాధనతో సంకీర్తనావళి ప్రారంభమైంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీని వాసుడికి ఉత్సవ విగ్రహాల ముందు స్వామివారికి ప్రీతిపాత్రమైన అన్నమ య్య పద సంకీర్తనలలో బ్రహ్మ కడిగిన పాదము..., అదివో అల్లదివో శ్రీహరివాసము...కట్టెదుర వైకుంఠము...వంటి పాటలు ఆనందడోలికలలో ముంచెత్తాయి.అవ్యక్తానందాన్ని కల్గించిన రికా ర్డు స్థాయి సంకీర్తనాలన కార్యక్రమంలో ఎల్కేపి కార్యదర్శి నారాయణస్వామి, పాండురంగమూర్తి, అస్లాం బాషా, శ్రీ నిధి రఘు, ప్రసాద్, రమ పాల్గొన్నారు. చిన్నారుల అద్భుత నృత్య ప్రదర్శన నృత్యకళానిలయం చిన్నారులు సంగీతంతో ప్రపంచ రికార్డు సాధనలో తమదైన ముద్రతో రాణించడమే కాకుండా అనంతరం జరిగిన కార్యక్రమంలో శాస్త్రీయ నృత్యాలతో ఆహూతులను అలరించారు. -
అన్నమయ్యకు అన్యాయం
-
శిల నుంచి సీడీ దాకా ‘తాళ్లపాక’ స్వరపేటికలు!
వాగ్గేయ సంపద ‘గుండు కరగగా పాడెను హనుమంతుడు’ అని కీర్తించిన అన్నమయ్య గుండుపై స్వరరచనా చేశాడు. కొంచెం ఆలస్యమైనా రాతిబండపై స్వరసహితంగా దొరికిన అతి ప్రాచీన అన్నమయ్య రచనలు - ‘తిరుమల శిలాగీతం’ పేరుతో సీడీ/పుస్తక రూపంలో విడుదలయ్యాయి. అయితే ఇవి ఇలా రూపుదాల్చడం వెనుక చాలా కథే ఉంది. తిరుమల ఆలయంలో ‘చంపకప్రదక్షిణ’ మార్గంలో ఏడడుగుల పొడవు-నాలుగడుగుల వెడల్పు,తొమ్మిది అంగుళాల మందం కలిగిన రెండు బండలపై వ్యక్తావ్యక్త తెలుగు లిపిని 1949లో గుర్తించారు. ఈ సంగతి వేటూరి ప్రభాకరశాస్త్రి దృష్టికి వెళ్లింది. ‘తాళ్లపాక సాహిత్యం’ పై పరిశోధన చేస్తోన్న ప్రభాకరశాస్త్రి ఇది తాళ్లపాక సాహిత్యమే అని నిర్ధారించారు. అన్నమయ్య. ఆయన కుమారుడు తిరుమలాచార్యులు. మనుమడు చినన్నల రచనలు తాళ్లపాక సాహిత్యంగా సుప్రసిద్ధం. ఆ మువ్వురూ జీవించిన కాలానికి చెందినవిగా వీటిని నిర్థారించారు. అయితే ఆ మరుసటి సంవత్సరమే ప్రభాకర శాస్త్రి మరణించగా ఆయన కుమారుడు వేటూరి ఆనందమూర్తి తండ్రి పరిశోధనా స్ఫూర్తితో 1965లో తాళ్లపాక కవుల సంగీతసాహిత్యంపై పీహెచ్డీ తీసుకుని ఈ శిలాగీతాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నించారు. ఆ భగీరథ ప్రయత్నానికి పరిశోధకులు ఏ.వి.శ్రీనివాసాచార్యులు, ప్రముఖ ఎపిగ్రాఫిస్ట్ (శాసనలిపి పరిశోధకులు) పి.వి.పరబ్రహ్మశాస్త్రి తదితర పెద్దలెందరో సహాయం చేశారు. అయితే అక్షరసాహిత్యాన్ని చదివేందుకు చూపు చాలును. కాని స్వరరచనలను చదివేందుకు చూపొక్కటి చాలదు. ‘చెవి’ సైతం కావాలి ప్రఖ్యాత సంగీత పరిశోధకులు నండూరి పార్ధసారథి శిలాస్వరాలను ఆవిష్కరించేందుకు ముందుకు వచ్చారు. రాతి బండలపై తెలుగు లిపిలో సంస్కృతంలో ఉన్న ఈ అన్నమయ్య స్వర సహిత సాహిత్యం పేరు ‘దశావతార సూలాది’. జాను తెలుగులో 32 వేల కీర్తనలు రచించిన అన్నమయ్య శిలారచన సంస్కృతం కావడం గమనార్హం! కన్నడ నుంచి తెలుగు లిపి పరిణామం చెందినట్లే ‘సూలాది’కి కూడా కన్నడే మాతృక. కన్నడలో ‘హాడు’ అంటే పాట. భక్తులు సులభంగా పాడుకునే పాట సూలాది (సులభహాది). తెలుగులో అనేక సూలాదులను రచించిన తాళ్లపాకవారు సంస్కృతంలో సూలాది ప్రక్రియను చేపట్టడం శిలాగీతాల ప్రత్యేకత! ‘దశావతార సూళాది ప్రబంధం’గా పేర్కొన్న ఈ స్వరరచనలు మాళవగౌళ రాగం (నేటి మాయామౌళవగౌళ)లో ఉన్నాయి. దశావతారాల కీర్తనలలో లోపించిన రెండు అవతారాలకు సంబంధించిన సాహిత్యాన్ని పుల్లెల రామచంద్రుడు, సంగీతాన్ని ఆకెళ్ల మల్లికార్జునశర్మ పూరించారు. సత్తిరాజు వేణుమాధవ్ గానం చేశారు. సూలాది సంగీతాన్ని సీడీ రూపంలో, సాహిత్యాన్ని పుస్తకరూపంలో ప్రభాకర మెమోరియల్ ట్రస్ట్ (9742486122) రూపొందించింది. డెబ్బయ్ సంవత్సరాల కృషి రెండువందల రూపాయలకు లభ్యం! అన్నమయ్య మాటలో ‘వెల సులభము-ఫలమధికము’! - పున్నా కృష్ణమూర్తి -
గీత స్మరణం
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెనీ పాదము ॥ చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తలమోపిన పాదము తలపక గగనము తన్నిన పాదము (2) బలరిపు గాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము వరమ యోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము ॥ గానం : చిత్ర, సుజాత, అనురాధా శ్రీరాం పల్లవి : గోవిందా నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తనలు మధురాతి మధురం స్వామి ఆహా... ఏమొకో... ఏమొకో చిగురుటధరమున యెడనెడ కస్తూరి నిండెనో భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ॥ చరణం : 1 కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొనచూపులు (2) నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా చరణం : 2 జగడపు చనవుల జాజర సఖినల మంచపు జాజర జగడపు చనవుల జాజర మొల్లలు కురుముల ముడిచిన బరువున మొల్లకు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగ పతిపై జల్లేరతివలు జాజర ॥ భారపు కుచముల పైపై కడు సింగారము నె ఱపెడి గంధముడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు జల్లేరు జాజర ॥ బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వేంకటపతిపై వెలదులు చించేరు సంకుమ దమ్ముల జాజర ॥ నిర్వహణ: నాగేశ్ -
దాచుకో నీ పాదాలకు తగ...
(అన్నమయ్య భావనా వాహిని నేటి కి ముప్పై శరత్తులు పూర్తి చేసుకున్న సందర్భంగా...) ఆమె గళం అన్నమయ్య... ఆమె మన ం అన్నమయ్య... పాడితే అన్నమయ్య... పలికితే అన్నమయ్య... ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసాలు అన్నమయ్య... సర్వం అన్నమయ్య స్వరూపం... అన్నమయ్య గళార్చనలో తరిస్తున్న ఆమె శోభారాజ్. అన్నమయ్య పురం ప్రారంభించడానికి కార ణాలు... నేను నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర కర్ణాటక సంగీతంలో సూక్ష్మ విషయాలు తెలుసుకుంటున్నాను. ప్రపంచశాంతికి అవసరమైన అవగాహన ఆ సంకీర్తనల్లో ఉందని గ్రహించాను. అద్భుతమైన కవిత్వం, అందమైన భావన, ప్రౌఢమైన రచనల నుంచి జానపదాల వరకు రచించిన అన్నమాచార్య అంటే ఆరాధన, అనుబంధం ఏర్పడుతూ వచ్చింది. వారి విశాలభావాలు నాకు బాగా నచ్చాయి. అదే సమయంలో నేను సినిమా సంగీత పోటీలలో బహుమతులందుకున్నాను. పెద్ద్దల ప్రశంసలు పొందాను. వారంతా సినిమా పాటలు పాడమంటే, అదృష్ట పరీక్ష చేసుకుందామనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే అంటే 1976లో టీటీడీ నుంచి పిలుపు వచ్చింది... అన్నమాచార్య సంకీర్తనల మీద అధ్యయనం చేసి, వాటిని ప్రచారం చేయడానికి బాణీలు చేయమని, అందుకు స్కాలర్షిప్ ఇస్తామని. ఒక పక్క సినిమా పాటలు, మరోపక్క స్వామి పిలిచాడు. ఏం చేయాలా అనే ఈ సంకట పరిస్థితిలో... స్వామిసేవకే నా హృదయం మొగ్గు చూపించింది. ఎందరో కళాకారులున్నా భగవంతుడు ఈ అవకాశం నాకే ఇచ్చినట్లుగా అనిపించింది. ‘జీవితాంతం నీ సేవ చేసుకుంటాను’ అని ప్రమాణం చేశాను. ఆ తరవాత... ‘నాకు పాడే శక్తి ఉంది, రాసే శక్తి ఉంది, మాట్లాడే శక్తి కూడా ఉంది. స్వామీ నాతో సేవ చేయించుకో’ అన్నాను. అలా 1983 నవంబరు 30, నా పుట్టినరోజు నాడు అన్నమయ్య భావనా వాహిని ఆవిర్భవించింది. అద్దె స్థలం నుంచి... నా సేవలను గుర్తించి, 1998లో రాష్ట్ర ప్రభుత్వం మా సంస్థకు స్థలం కేటాయించింది. నేను సంపాదించిన ధనం, కొంత విరాళాలు కలిపి ఆడిటోరియం నిర్మించాను. ఈ హాల్ ప్రారంభించి పదకొండేళ్లయింది. అన్నమయ్య పేరు దివ్యత్వం, శాశ్వతం కావాలనే ధ్యేయంతో ఆ ప్రాంగణంలోనే అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాను. ప్రపంచంలో ఒకే గర్భంలో వీరిద్దరికీ నిర్మితమైన ప్రప్రథమ దేవాలయం. శిష్యుల గురించి... ఇక్కడ 1984 నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. ఇప్పటికి సుమారు 16000 మందికి శిక్షణ ఇచ్చాను. అన్నమయ్య సంకీర్తనల మీద పోటీలు నిర్వహిస్తున్నాను. యేటా అన్నమయ్య జయంతి, వర్థంతి సందర్భంగా చిక్కడపల్లి వేంకటేశ్వర ఆలయం నుంచి టాంక్బండ్ అన్నమయ్య విగ్రహం వరకు నగర సంకీర్తన చేస్తున్నాము. మరచిపోలేని సంఘటనలు... చంచల్గూడ సెంట్రల్ జైలులో 1997 నవంబరు 30న నా పుట్టినరోజు సందర్భంగా దాదాపు 1700 మంది ఖైదీల సమక్షంలో కేక్ కట్ చేసి, వారి సమక్షంలో సంకీర్తనలు చేయడం... దానికి వారినుంచి లభించిన అపూర్వ స్పందన. ఉపశమన సంకీర్తన కార్యక్రమం... ఒత్తిడిలో ఉన్నవారు, జీవితంలో అనుకోని సంఘటనలకు, దుఃఖానికి లోనైనవారి ఇళ్లలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సోషల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఆయన హెర్నియా ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఎనిమా కోసం వాటర్ బదులుగా ఆసిడ్ ఎక్కించడంతో పేగులు దెబ్బతిన్నాయి. దాంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అక్కడ ఉపశమన సంకీర్తన చేశాం. ‘‘మీరు పాడుతున్నంతసేపు మాకు స్వామివారు ఉన్న అనుభూతి కలిగింది’’ అని చెప్పారాయన. కొంతకాలం తర్వాత ఆయన మా ఇంటికి వచ్చి, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను’’ అని చెప్పడం ఎంతో ఆనందం కలిగించింది. ఆ తర్వాత నుంచి నేను సంకీర్తనౌషధం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అభిరుచులు... నాకు ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగారి భక్తిభావం, అంకిత భావం, సుశీల గారి ఉచ్చారణ, మాధుర్యం, లతామంగేష్కర్గారి వాయిస్ మాడ్యులేషన్, మెలడీ, బాలుగారి సంస్కారవంతమైన ప్రవర్తన, బాలమురళి వంటి వారి నిరంతర కృషి ఎంతో ఇష్టం. అన్నమయ్య కీర్తనలలో బాగా నచ్చినది... అన్నమయ్య చరమ దశలో రచించిన ‘‘దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి... సంకీర్తనలో, ‘‘నా నాలుక నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితివి’’ కీర్తన చాలా నచ్చింది. మీరు చేసిన మార్పులు... ‘అదిగో అల్లదిగో’ సంకీర్తనను జనసామాన్యంలోకి తీసుకువెళ్లడానికి మల్లిక్గారు పాడిన భౌళిరాగంలో బాణిని తీసుకుని, భావోద్దీపన కోసం ఎక్కడ ఎలా పలికితే బావుంటుందో అలా మార్చాను. అనుపల్లవితో కీర్తన ప్రారంభించే సంప్రదాయం మేరకు నేను ప్రారంభించిన ‘బ్రహ్మమొక్కటే’కీర్తన సాధించిన విజయాలు... అన్నమయ్య తపాలాబిళ్ల కోసం కృషిచేసి, 2004లో అన్నమయ్యపురంలో తపాలాబిళ్ల విడుదల చేశాను. దేశవిదేశాలలో కార్యక్రమాలద్వారా యువతను ప్రోత్సహిస్తున్నాను. ప్రస్తుతం దేవాలయ కుంభాభిషేకం కోసం ప్రయత్నిస్తున్నాను. -డా.పురాణపండ వైజయంతి -
101 అన్నమయ్య కీర్తనల ఆలాపన
పాయకరావుపేట, న్యూస్లైన్: శ్రీప్రకాష్ విద్యా సంస్థ వేదికగా కోఠి స్టిర్స్ ప్రపంచ రికార్డు సాధనకు 101 అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ విద్యా సంస్థలో చదువుతున్న కోఠి సిష్టర్స్ (లక్ష్మీ శ్వేత ,సత్య అక్షోభ) ఆదివారం ప్రపంచ రికార్డు సాధన, అన్నమాచార్య తత్వ ప్రచారం ధ్యేయంగా ఈ సాహసానికి పూనుకున్నారు. అదివో అల్లదివో... కీర్తనతో మొదలై జయమంగళం... అనే కీర్తన వరకూ 101 కీర్తనలను ఐదున్నర గంటలు నిర్వరామంగా ఆలపించి సరికొత్త ప్రపంచ రికార్డుకు ప్రయత్నించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్ర జాలికుడు, ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త, చింతా శ్యామ్కుమార్ (శ్యామ్ జాదూగర్) మాట్లాడుతూ చిన్న వయస్సులోనే కోఠి సిస్టర్స్ 101 అన్నమయ్య గీతాల ను ఆలపించి ప్రపంచ రికార్డుకు ప్రయత్నించడం ఆనందంగా ఉందన్నారు. విద్యతోపాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ముందుకు నడిపిస్తున్న శ్రీప్రకాష్ విద్యాసంస్థల కృషి అభినందనీయమన్నారు. సినీ నటుడు కె.ఆర్.జె. శర్మ, ఎలమంచిలి సీఐ కె.రామారావు మాట్లాడుతూ ఎన్నో రోజుల పాటు సాధన చేసిన వీరు ప్రపంచ రికార్డు నెలకొల్పి ఈ ప్రాంతానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి అన్ని రంగాల్లో విజయం సాధించేలా బోధన ఇస్తున్నామని చెప్పారు. కోఠి సిస్టర్స్తో పాటు తల్లిదండ్రులు గౌతమ్, రామలక్ష్మమ్మలను విద్యా సంస్ధల కరస్పాండెంట్ సీహెచ్వికె నరసింహారావు అభినందించారు. 101 కీర్తనలు ఆలాపన చేసినట్లు స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసి కోఠి సిస్టర్స్కు ధ్రువపత్రాలు అందజేసి సుజలపుత్రి అనే బిరుదు ప్రకటించారు. -
రిలేషణం: పైకి కనిపించని అనుబంధం మాది
అక్కినేని నాగార్జున... పరిచయం అవసరం లేని పేరు. వెంకట్ అక్కినేని... బయట పెద్దగా వినిపించని పేరు. ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఇద్దరే. ఒకరు తెరమీద, మరొకరు తెర వెనుక. కలల దారిలో ఇద్దరూ ఒకటిగా అడుగులు వేశారు. ఈ సృజనాత్మక ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, అద్భుతాలు... ఐతే ఒకరు ఫోకస్లో ఉండి మరొకరు ఔట్ ఫోకస్లో ఎందుకు ఉండిపోయారు? ఇద్దరూ ఏ విషయాల్లో ఏకీభవిస్తారు, ఎక్కడ విభేదిస్తారు? ఇద్దరూ కలిసి నడిచిన కాలాలు, తడియారని జ్ఞాపకాల గురించి వెంకట్ అక్కినేని అంతరంగం... ఈ పాతికేళ్లలో నాగార్జున లైఫ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది. నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారాడు. అన్నమయ్య నుంచి దేవుని మీద భక్తి పెరిగిందనుకుంటా. ఇక తను అప్పుడూ ఇప్పుడూ హార్డ్ వర్కింగ్. ఆ విషయంలో ఎలాంటి మార్పూ లేదు. బాల్యంలో మీ అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది? నాన్నగారు సినిమాల్లో చాలా బిజీగా ఉండేవారు. కానీ మేం సినిమా ఆలోచన లేకుండా పెరిగాం. నేను, నాగ సుశీల దగ్గరి వయసువాళ్లం కాబట్టి ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్లం. నాగ్కు, నాకు ఐదేళ్లు తేడా. కాబట్టి మొదటి నుంచీ తన సర్కిల్ వేరు. నా సర్కిల్ వేరు. అయితే తనకు అమ్మమ్మతో చనువు ఎక్కువ. చదువుల రీత్యా కూడా వేరువేరుగా ఉండాల్సి రావడంతో మేం కలిసి పెరిగింది చాలా తక్కువ. 1975లో ఎం.బి.ఎ. కోసం యూఎస్ వెళ్లాను. నాగ్ చిన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడు. నేను యూఎస్ నుంచి వచ్చేసరికి చాలా హైట్ పెరిగి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. నేను వచ్చాక తను యూఎస్ వెళ్లిపోయాడు. సినిమాల్లోకి రావాలనేది మీ కలా? కేవలం యాదృచ్ఛికమా? మాది సినిమా కుటుంబమే అయినా మేం సినిమా ప్రపంచానికి దూరంగా, బాగా చదవాలని నాన్నగారు భావించేవారు. అంతకుముందు మా పేర్లమీద సినిమాలు తీసినా మాకు ప్రమేయం ఉండేది కాదు. కానీ అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. 1975లో నాన్నగారు అన్నపూర్ణా స్టూడియోస్ ప్రారంభించారు. నేను 1977లో అబ్రాడ్ నుంచి ఇండియాకు వచ్చాను. రాగానే స్టూడియో మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అప్పటికి హైదరాబాద్లో ఎవరూ పెద్దగా షూటింగ్ చేసేవాళ్లు కాదు. దాంతో సంవత్సరానికి 25 లక్షలు నష్టం వచ్చేది. అలాంటి సమయంలో మాకు ప్రొడక్షన్ తప్ప వేరే దారి కనిపించలేదు. చాలామంది ఆర్టిస్ట్ల చుట్టూ, డెరైక్టర్ల చుట్టూ తిరిగాను. వాళ్లు ఏదో రకంగా తప్పుకునేవారు తప్ప మాతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అలా కొంతకాలం గడిచింది. నాగార్జున యూఎస్లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు. ఇక వేరేవాళ్ల చుట్టూ తిరిగే ఓపిక లేక, నువ్వు హీరోగా చేస్తావా అని నాగార్జునను అడిగాను. యా ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు. ఇద్దరం నాన్నగారి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పాం. ఆయన కూడా ఓకే అన్నారు. అలా మా సారథ్యంలో విక్రమ్ మొదలైంది. అప్పట్లో అదంతా ఒక కలలా జరిగిపోయింది. మీరెప్పుడైనా హీరో కావాలనుకున్నారా? మొదటినుంచీ యాక్టర్ కావాలని అనుకోలేదు. నాన్నగారు ఆ ఆలోచనతో మమ్మల్నెప్పుడూ పెంచలేదు. చిన్నతనం నుంచీ మా ధాట్ ప్రాసెస్లో అది లేకపోవడం వల్ల జరగలేదు. కానీ హీరో అయ్యే క్యాపబిలిటీస్ నాలో ఉన్నట్లు నేను నమ్ముతాను. ఆ ఐడియా ఉంటే కచ్చితంగా హీరో అయ్యేవాణ్నేమో. ఆలోచన వచ్చేప్పటికి నేను హీరో వయసు దాటిపోయాను. తెర వెనుక మీ ఇంట్రస్ట్ ఏమిటి? ఒక దశలో డెరైక్టర్ కావాలనుకుని కొన్ని స్క్రిప్ట్ల మీద వర్క్ చేశాను. ఎందుకంటే నేను ప్రతీ దశలోనూ ప్రొడక్షన్తో ఇన్వాల్వ్ అయ్యాను. దాంతో నాకు డెరైక్టర్ కావాలన్న ఆలోచన వచ్చింది. నా టేస్ట్ మల్టీప్లెక్స్ సినిమాలకు దగ్గరగా ఉంటుంది. మన ఆడియన్స్ టేస్ట్, మార్కెట్ రేంజ్ ఆ స్థాయిలో లేదన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం విరమించాను. ఎప్పటికైనా నా టేస్ట్కు తగ్గ సినిమా తీయాలనుంది.. అది కాకుండా ఎడిటింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మా బ్యానర్లో చాలా సినిమాల ఎడిటింగ్లో నేను కీ-రోల్ ప్లే చేశాను. ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకుడిగా ఉన్న మీరు మధ్యలో ఎందుకు వెనక్కి వచ్చారు? దాదాపు ఇరవై సంవత్సరాల పాటు తన వ్యవహారాలన్నీ నేనే చూసుకున్నాను. కథలు వినడం, ఏ నిర్మాతతో సినిమా చేయాలి, ఏ డెరైక్టర్తో పనిచేయాలి వంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఒక దశకు వచ్చాక నాగ్కు సొంత నిర్ణయాలు తీసుకునే మెచ్యూరిటీ వచ్చింది. తనదైన ఐడియాలజీని రూపొందించుకుని తదనుగుణంగా కెరీర్ ప్లాన్ చేసుకునే స్థాయికి చేరుకున్నాడు. అప్పుడు నా అవసరం తనకు లేదనిపించింది. మరోవైపు ఒక దశలో మూవీ మేకింగ్ చాలా రిస్క్ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ఆర్గనైజ్డ్ బిజినెస్. అందులోనూ తను కూడా నిర్మాణంలో యాక్టివ్గా ఉన్నప్పుడు ఒకే పని ఇద్దరం చేయడం కరెక్ట్ కాదనిపించింది. నేనిక రిలాక్స్ కావచ్చనిపించింది. ఈ విషయంలో నేను, నాగార్జున ఒక అండర్స్టాండింగ్కు వచ్చాం. సినీ రంగంలో అక్కినేని వంశం అంటే నాగార్జున, నాగచైతన్య, అఖిల్... ఆ వరుసలో మీ పిల్లలు ఎక్కడా కనిపించరు ఎందుకని? బేసిక్గా మా పిల్లలకు సినిమా రంగం అంటే ఇష్టం లేదు. అబ్బాయి ఆదిత్యకు రేసింగ్ ఇష్టం. నాన్నగారికి ఆదిత్యను హీరో చేయాలని చాలా ఉండేది. తనకు కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. నేను చాలాసార్లు వాణ్ని అడిగి చూశాను. కానీ తనకు ఇంట్రస్ట్ లేదని చెప్పాడు. నాకు తను సినిమాల్లోకి హీరోగా వస్తే బాగుండనిపించేది. మన ఆశల కన్నా పిల్లల ఆసక్తులకు ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాను.తనకు ఇంట్రస్ట్ ఉన్న రంగం వైపు ప్రోత్సహించాను. ఇప్పుడు అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అమ్మాయి అన్నపూర్ణ ఆర్కిటెక్చర్ చేసి యూఎస్లో ఆర్కిటెక్ట్గా చేస్తోంది. తన టాలెంట్కు బోలెడన్ని అవార్డ్స్ వచ్చాయి. పిల్లలు వాళ్లు ఎంచుకున్న రంగంలో పేరు తెచ్చుకున్నారు. నాకదిచాలు. సినిమా నుంచి బయటకు వచ్చాక, ఏ వ్యాపారాలు చేపట్టారు? నాకు వైజాగ్ బేస్డ్గా ఫార్మా కంపెనీ ఉంది. దానికి ఎండీగా ప్రస్తుతం కంపెనీని విస్తరించే పనుల్లో ఉన్నాను. ఇంకా రకరకాల వెంచర్స్ చేస్తుంటాను. అన్నిటికన్నా నాకు ఫార్మింగ్ యాక్టివిటీ అంటే చాలా ఇష్టం. చిన్న స్కేల్లో హైడ్రోఫోనిక్స్ ద్వారా అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం. మీకు, నాగార్జునకు మౌలికమైన తేడాలేమిటి? తనకు ఆరోగ్యం పట్ల, తనకు సంబంధించిన ప్రతి విషయంలోను చాలా జాగ్రత్త. బహుశా నేనంత జాగ్రత్తగా ఉండలేనేమో. అదే తేడా. మరి మీ ఇద్దరి మధ్య సారూప్యత? ఇద్దరికీ చాలా కోపమెక్కువ. అది స్వభావరీత్యా అలవడిందనుకుంటా. ఈ మధ్యే నేను కొంత తగ్గాను. మీ ఇద్దరిలో ఎవరు మంచి బిజినెస్మ్యాన్? నిస్సందేహంగా నాగార్జునే. ఇద్దరిలో రిస్క్ చేయడంలో ఎవరు ముందుంటారు? ఆ విషయంలో ఇద్దరమూ ముందుంటాం. రిస్క్ చేసే గుణం ఉంది కాబట్టే ఏమాత్రం అనుభవం లేని రామ్గోపాల్వర్మను దర్శకుడిగా పెట్టి ‘శివ’ తీశాం. రిస్క్ చేసే ధైర్యం ఉంది కాబట్టే నాగార్జున ‘అన్నమయ్య’ చేయగలిగాడు. నాగార్జునను నటుడిగా మీరు మెచ్చే సినిమాలు? రాజన్న, అన్నమయ్య, రామదాసు. సాయిబాబాలో తన నటన చాలా బాగున్నా, సినిమా సరిగా తీయలేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీ మధ్య ఎలాంటి విషయాల్లో చర్చ జరుగుతుంది? మేం వారానికి రెండుసార్లు అన్నపూర్ణ స్టూడియోలో కలుస్తుంటాం. వీలైతే ఆదివారం నాన్నగారి ఇంట్లో అందరం కలుస్తాం. కలిసినప్పుడు మా ఇద్దరిమధ్యా లైఫ్స్టైల్, హెల్త్ విషయాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మేం ఆలోచించాల్సింది అవే కాబట్టి. అన్నపూర్ణా స్టూడియోను ఏ రోజుకైనా ఫిలిం ప్రొడక్షన్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆశయం. మీ అనుబంధాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇద్దరం చాలా క్లోజ్గా ఉంటాం. అలాగని చాలా దగ్గరగా ఉండే అన్నదమ్ములం కూడా కాదు. అందుకు ఒక కారణం ఏజ్ డిఫరెన్స్. రెండో కారణం... బంధం బలపడే వయసులో ఒక దగ్గర లేకపోవడం. కానీ ఏదైనా అవసరం వస్తే ఒకరి కోసం ఒకరం చాలా గట్టిగా నిలబడతాం. డబ్బు అంత ప్రయారిటీ కాదు కాబట్టే మా మధ్య అనుబంధం అంత బలంగా వుంది. సినిమా, వ్యాపారం... వీటికి దూరంగా మీ హాబీలు? నాకు వైల్డ్ లైఫ్, ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాను. ఇప్పుడు పరమహంస యోగానంద రాసిన ‘ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి’ చదువుతున్నాను. - కె.క్రాంతికుమార్రెడ్డి -
యువతకు ఆదర్శం ఈ సినిమా
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి అద్భుతమైన చిత్రాలకు కథలు అందించిన జేకే భారవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’. గ్లోబల్ సినీ క్రియేటర్స్ పతాకంపై శ్రీమతి నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ సినిమాలో ఆదిశంకరుడిగా కౌశిక్, ఇతర ప్రధాన పాత్రల్లో నాగార్జున, మోహన్బాబు, శ్రీహరి, సాయికుమార్ తదితరులు నటించారు. ఈ నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నాగ్ శ్రీవత్స స్వరపరచిన ఈ చిత్రం పాటలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ సందర్భంగా నారా జయశ్రీదేవి మాట్లాడుతూ -‘‘భారవి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, చూద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. కానీ శ్రీవత్స స్వరపరచిన పాటలు విన్నాక, సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా నిర్మాణంలో ఆలస్యం జరిగింది. గతంలో పలు చిత్రాలకు ఇలా జరిగింది. అవి విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘ఈ కథ చెప్పడానికి భారవి దాదాపు ఏడాది తిరిగాడు. కథ విన్న తర్వాత నా పాత్ర నన్ను హంట్ చేసింది. దాంతో ఒప్పుకున్నాను’’ అని శ్రీహరి అన్నారు. శివరాత్రి నాడు పాటలు విడుదలయ్యాయని, అప్పట్నుంచీ ఏ గుళ్లో చూసినా, ఏ ఇంట చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయని కౌశిక్బాబు తెలిపారు. ఆదిశంకరుని పేరు మీద చేసిన చిత్రానికి పాటలివ్వడం పూర్వజన్మ సుకృతమని శ్రీవత్స చెప్పారు. యువతకు ఆదర్శంగా నిలిచే సినిమా అని ‘శాంతా బయోటెక్’ వరప్రసాద్రెడ్డి అన్నారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానని భారవి తెలిపారు.