ARMOOR
-
ఏకచక్రపురం.. నవనాథపురం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అశ్మక రాష్ట్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఇందూరు వరకు నామాంతరం చెందిన నిజామాబాద్ (Nizamabad) చుట్టుపక్కల ప్రాంతాలు పౌరాణిక, ప్రాచీన చారిత్రక నేపథ్యాన్ని ఇముడ్చుకున్నాయి. మంజీర, గోదావరి పరీవాహకంలో ఉండి ప్రాచీన కాలంలో ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా విరజిల్లి, ప్రస్తుతం సాధారణ పట్టణంగా ఉన్న బోధన్ (Bodhan) ఎనలేని ప్రాచీన చరిత్రను కలిగి ఉంది. అయితే దీని చరిత్ర నిరంతరం బయటపడుతూనే ఉంది. తవ్వకాలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా దీని చరిత్ర ఆశించిన స్థాయిలో వెలుగు చూడటం లేదనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ ఎన్ని తవ్వకాలు జరిపితే అంత చరిత్ర (History) బయటపడే అవకాశముంది. ఈ విషయంలో పాలకులు అంతగా దృష్టి సారించకపోవడంతో.. పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ఘనమైన చరిత్ర బయటకు రావడం లేదని పలువురి వాదన.పౌరాణిక నేపథ్యం ప్రకారం ఈ ప్రాంతాన్ని పరశురాముడు(Parasu Ramudu) తన చక్రంతో రక్షించడంతో పాటు చక్రతీర్థమనే చెరువును నిర్మించడంతో ఏకచక్రపురంగా పేరుపొందినట్లు పలువురు చెబుతున్నారు. పౌరాణిక సాహిత్యంలో, జైన సాహిత్యంలో, బౌద్ధ సాహిత్యంలో బోధన్ ప్రాశస్త్యం ఉంది. మహాభారతంలో వసుమతి, పద్మపురం నామాలతో, జైన సాహిత్యంలో పోదనపురం నామంతో, బౌద్ధ సాహిత్యంలో పోదన నామంతో పేరొందింది. ఇక ప్రాచీన, మధ్యయుగాల్లో ఈ ప్రాంతం ధన సంపదలతో తులతూగడంతో.. బహుధాన్యపురం పేరుతో పిలిచినట్లు చరిత్ర చెబుతోంది. గొప్ప వర్తక కేంద్రంగా వర్ధిల్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక శాసనాలు, పాత్రలు, శిల్పాలు, నాణేలు(Coins) లభించాయి. అశ్మకుడనే రాజు పాలనలో.. ఈ ప్రాంతాన్ని అశ్మకుడనే రాజు పరిపాలించినట్లు మహాభారతంలో ప్రస్తావన ఉందని పలువురు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు, మరాఠా రాజులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ రాజులు, మొఘలులు పరిపాలించారు. ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా చాలాకాలం పేరొందిన ఈ పట్టణం ప్రస్తుతం బోధన్ పేరుతో స్థిరపడింది. ఈ ప్రాంతం గురించి ఎంత శోధిస్తే అంత చరిత్ర బయటపడే అవకాశముందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.నాటి నవనాథపురం.. నేటి ఆర్మూర్ ప్రస్తుతం పసుపు పంట అత్యధికంగా పండించే ప్రాంతంగా ఉన్న ఆర్మూర్ (Armoor) ప్రాంతం సైతం ఘనమైన చరిత్రను కలిగి ఉంది. నవనాథపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం.. నేడు ఆర్మూర్ నామాంతరంతో స్థిరపడింది. ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్ధులగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేశారు. దీంతో గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతానికి నవనాథపురంగా పేరు వచ్చింది. కాలక్రమంలో నవనాథపురం నుంచి ఆర్మూర్గా నామాంతరం చెందింది.వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనాథులైన గోరఖ్నాథ్, జలంధర్నా, చరఫట్నాథ్, అపభంగనాథ్, కానీషనాథ్, మచ్చింద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్, బర్తరినాథ్ తదితరులు ఇక్కడికి వచ్చారు. నల్లని రాళ్లు పేర్చినట్లున్న ఈ గుట్టపై ఒక ఇరుకైన గుహలో తమ ఇష్టదైవమైన సిద్ధేశ్వరుడిని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. వారి పేరిట గుట్టకు నవనాథ సిద్ధుల గుట్టగా పేరు వచ్చింది. దీంతో గుట్టను ఆనుకున్న గ్రామానికి నవనాథపురంగా నామకరణం చేసుకున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!కాలక్రమంలో ఈ తొమ్మిది మంది సాధువుల్లో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సాధువులు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్గా పేరు స్థిరపడింది. మరికొందరు చరిత్రకారులు ఆర్మూర్ అనే పదం.. ఆరావం అనే పదం నుంచి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సిద్ధుల గుట్ట ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం..
-
ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం
సాక్షి, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. గర్భస్థ శిశువు మృతి చెందిన కానీ మూడు రోజులైనా బాధితులకు విషయం చెప్పకుండా వైద్యాధికారిణి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిరికొండ మండలం రూప తండాకు చెందిన మంజుల రెండో కాన్పు కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.డెలివరీ తేదీ ఖరారు కావడంతో ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో తీసిన స్కానింగ్ రిపోర్టులను వైద్యాధికారిణికి బాధితురాలు అందజేసింది. శిశువు గుండె చప్పుడు తక్కువగా ఉందని బాధితురాలికి వైద్యురాలు సూచించింది. బాధితులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా గర్భస్థ శిశువు మృతి చెందినట్లు వైద్యురాలు తెలిపింది.గర్భస్థ శిశువు మృతి చెంది మూడు రోజులైనా విషయాన్ని తెలపకపోవడం పట్ల వైద్యులపై బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధితురాలి బంధువులను సముదాయించి గర్భస్థ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.ఇదీ చదవండి: కాలేజీలా.. మురికి కూపాలా? -
BRS కౌన్సిలర్లకు ఊహించని షాక్
-
TSRTC: ‘ఫ్రీ జర్నీ సరే.. మరి మాకు సీట్లుంటలేవ్!’
వైరల్: ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణం సదుపాయం.. కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. మహిళలతో బస్సులు కిటకిటలాడిపోతుండగా.. అదే సమయంలో సీట్లు లేక మగవాళ్లు స్టాండింగ్ జర్నీలతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడో యువకుడు రోడ్డెక్కి బస్సుకు అడ్డం తిరిగాడు. ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మంచి విషయమే అయినా.. మగవాళ్లను కూడా ప్రభుత్వం కాస్త పట్టించుకోవాలని కోరుతున్నాడు. దీంతో బస్సులు నిండుగా ఉంటున్నాయని, పురుషులకు బస్సుల్లో వసతి లేకుండా పోయిందని, సీట్లు ఉండటం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా.. మగజాతి ఆణిముత్యం అంటూ కొందరు సరదాగా ఆ యువకుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. -
తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రచారంలో అపశృతి.. పడిపోయిన కేటీఆర్
-
50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది : సీఎం కేసీఆర్
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఏపీలో యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. మూడు గంటల కరెంట్ కావాలా 24 గంటల కరెంట్ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, రైతు బంధు కావాలా వద్దా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.ఎవరో చెప్పారని ఓటు వేయద్దని ఏ పార్టీ మంచి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి ఇంకా రాలేదన్నారు. సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ‘అంకాపూర్ అంటే నాకు బాగా ఇష్టం. అంకాపూర్ను రైతులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలి. తెలంగాణ రాక ముందు కరెంటు లేదు. తాగునీరు సాగు నీరు లేదు.. వలసలు ఉండేవి. దళిత బందు పథకం కనిపెట్టిందే నేను. దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తీసేస్తే రైతు బంధు ఎవరికి ఇస్తారు. ధరణి లేకపోతే మళ్లీ వీఆర్వోలు వస్తారు. మళ్లీ అవినీతి వస్తుంది. ప్రజల మధ్యే ప్రజల కోసం ఉండే జీవన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని కేసీఆర్ కోరారు. బైంసా సభలో కేసీఆర్... ‘ఓటు చేతిలో నుంచి జారిపోక ముందే అలోచించాలని, ఓటు వేయడంలో తప్పిదం జరిగితే తీవ్రంగా నష్టపోతాం. 24 గంటల కరెంట్ వద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు. మహరాష్ట్రలో కరెంటు లేదు. మనదగ్గర కరెంటు ఉంది. ముథోల్, తానూర్, లోకేశ్వరం మండలాల్లోని యాభై వేల ఎకరాలకు ఎస్సారేస్పీ నీరు అందిస్తాం. ప్రదానికి మోడికి పిచ్చి పట్టింది. విమానాలు, రైల్వేలు అన్ని ప్రైవేటు పరంచేస్తున్నారు. బైంసాలో బీజేపీ అభ్యర్థిని నిలదీయండి. ఎందుకు మోటర్లకు మీటర్లు పెడుతారని ప్రశ్నించండి. బైంసా అంటేనే యుద్దం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. మతం పేరుతో మంటలు చేలరేగాలనా. రక్తం పారలనా..మీరే అలోచించుకోండి’అని కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలి.. ‘దేశ ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాలి. పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి ప్రజలు ఓటు వేయాలి. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు.తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో చూడాలి. తెలంగాణ వచ్చినంకనే ఇంటింటికి నీళ్లిచ్చాం.24 గంటల కరెంట్ ఇచ్చాం.చేనేత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ పెంచుతాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు.ధరణి తీసేస్తామని కాంగగ్రెస్ అంటోంది.ధరణి ఉండాలన్నా వద్దా తేల్చుకోవాలి’అని కోరుట్ల సభలో కేసీఆర్ ప్రజలను కోరారు. -
Nizamabad: అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..
సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల కోసం గాలం.. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్ అర్బన్ రూరల్ బోధన్ బాన్సువాడ మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608 పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225 ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804 -
కేసీఆర్ లూటీ చేసిందంతా తిరిగి ఇస్తాం: రాహుల్ గాంధీ
సాక్షి, నిజామాబాద్: సామాజిక తెలంగాణ కోరుకొని సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోనియా మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. కానీ తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యిందని విమర్శించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కార్నర్ మీటింగ్లో రాహుల్ మాట్లాడారు. ప్రధాని మాటలకు విలువ లేదని అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు విషయంలో ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధపు హామీ ఇచ్చారని మండిపడ్డారు. నాలుగున్నరెళ్ళ కిందట పసుపు బోర్డు ఇస్తామని చెప్పి కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. పసుపు పంటకు రూ. 12 నుంచి 15 వేలు మద్దతు ధర ఇస్తామని తెలిపారు. పసుపు రైతులతో పాటు అన్ని పంటలకు ఎమ్ఎస్పీతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని విమర్శించారు. తెలంగాణ బీఆర్ఎస్ బీజేపీ.. కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలుకుతుందని దుయ్యబటారు. తన మీద 24 కేసులు ఉన్నాయన్న రాహుల్.. కేసీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు, చర్యలు ఉండవని అన్నారు. దేశంలోనే అవినీతి సీఎం కేసీఆరేనని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలుపు పక్కా కాంగ్రెస్ను ఓడించేందుకుచ బీజేపీని గెలిపించేందుకు ఎంఐఎం రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను నిలబెడతారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలని చెబితే అక్కడ ఎంఐఎం ఉంటుందని మండిపడ్డారు. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. చదవండి: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కొక్కరికి ఎంతంటే! ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ నాకు ఇల్లు లేదు. దేశమే నా ఇల్లు. మా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం. పెన్షన్ రూ. 4 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తాం. కేసీఆర్ ఎంత లూటీ చేస్తున్నారో అంతా తిరిగి ఇస్తాం’ అంటూ రాహుల్ కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. రోడ్డు మార్గాన హైదరాబాద్కు.. సభ అనంతరం ఆర్మూర్ నుంచి రోడ్డు మార్గంలోనే రాహుల్ హైదరాబాద్ బయల్దేరారు. హైలికాప్టర్ రద్దు కావడంతో రోడ్డు మార్గంలో నేరుగా శంషాబాద్ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో తెలంగాణలో రాహుల్ గాంధీ విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగిసింది. ఈనెల 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రాహుల్, ప్రియాంక యాత్ర ప్రారంభించారు. ములుగు నియోజక వర్గం నుంచి ఆర్మూర్ వరకుమూడు రోజుల యాత్ర సాగింది. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో కొనసాగింది. కాంగ్రెస్లో చేరిన రేఖా నాయక్ ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్లో చేరారు. సిట్టింగ్ను కాదని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను జాన్సన్ నాయక్ కేటాయించడంతో అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
ఆర్మూరు నియోజకవర్గం చరిత్రను తిరగరాసేది ఎవరు?
ఆర్మూరు నియోజకవర్గం ఆర్మూరు నియోజకవర్గంలో మరోసారి ఆశన్నగారి జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పక్షాన ఘన విజయం సాదించారు.ఆయన 28795 ఓట్ల ఆదిక్యతతో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, ఎమ్మెల్సీ ఆకుల లలితపై గెలుపొందారు. ఆకుల లలిత ఎన్నికలు పూర్తి కాగానే టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. జీవన్ రెడ్డికి 72125 ఓట్లు రాగా, లలితకు 43330 ఓట్ల వచ్చాయి. కాగా బిజెపి తరపున పోటీచేసిన పి.వినయ్ కుమార్ రెడ్డికి 19వేలకు పైగా ఓట్లు వచ్చి మూడోస్థానంలో నిలిచారు. గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్ది రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ఆర్మూరులో తొలి నుంచి రెడ్డి సామాజికవర్గం నేతలే అత్యదికంగా గెలిచారు. 2014లో ఆర్మూరులో మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి ని జీవన్ రెడ్డి ఓడిరచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల నాటికి సురేష్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిపోయి తదుపరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ఐ అధికారంలోకి వచ్చాక స్పీకరు పదవిని చేపట్టిన కె.ఆర్. సురేష్రెడ్డి ఇంతకుముందు బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందగా 2009లో ఆయన బాల్కొండలో కాకుండా ఆర్మూరు నియోజకవర్గానికి మారి పోటీ చేయగా, స్వయాన ఆయన మేనత్త ఆలేటి అన్నపూర్ణమ్మ చేతిలో అనూహ్యంగా పరాజితులయ్యారు. ఆర్మూరు నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిది సార్లు గెలిస్తే, తెలుగుదేశం పార్టీ మూడుసార్లు,టిఆర్ఎస్ మూడుసార్లు, సోషలిస్టుపార్టీ ఒకసారి గెలుపొందాయి. ఆర్మూరు నుంచి సంతోష్రెడ్డి నాలుగుసార్లు గెలుపొందారు. రెండువేల నాలుగులో టిఆర్ఎస్ పక్షాన గెలిచి కొంతకాలం మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తరువాత ఆయన అసమ్మతి నేతగా మారి శాసనమండలి ఎన్నికలలో విప్ ఉల్లంఘన కింద అనర్హతకు గురయ్యారు. అయితే తీర్పు వెలువడడానికి ఒక రోజు ముందు ఈయన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసారు. సంతోష్రెడ్డి గతంలో నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో కూడా సభ్యునిగా ఉన్నారు. కొంత కాలం జడ్పి చైర్మన్గా కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన తుమ్మల రంగారెడ్డి బాల్కొండలో మరోసారి గెలిచారు. రంగారెడ్డి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత పొందారు. మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య ఒకసారి, మాజీ మంత్రి జి.రాజారామ్ మరోసారి ఇక్కడ నుంచి గెలిచారు. అంజయ్య ముషీరాబాద్లో మూడుసార్లు, రామాయంపేటలో మరోసారి గెలిచారు. అలాగే లోక్సభ, రాజ్యసభలకు కూడా ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయన కొంతకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. రాజారామ్ బాల్కొండలో మరో నాలుగుసార్లు గెలిచారు. ఈయన కూడా జలగం, మర్రిచెన్నారెడ్డి, అంజయ్యల క్యాబినెట్లలో పనిచేసారు. 1999లో ఇక్కడ గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ 2004లో బాన్స్వాడ నుంచి గెలిచారు. 2014,2018లలో టిఆర్ఎస్ తరపున నిజామాబాద్ రూరల్ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 1985లో ఆర్మూరులో గెలిచిన మహీపాల్రెడ్డి, 1994, 2009లో గెలుపొందిన అన్నపూర్ణమ్మలు భార్యాభర్తలు. మహిపాల్రెడ్డి ఎన్టీఆర్ క్యాబినెట్లో కొద్ది కాలం మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్మూరు గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఆర్మూర్లో అక్కాచెల్లెళ్ల హత్య !
నిజామాబాద్: ఆర్మూర్లో బుధవారం జరిగిన జంట హత్యలతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని రెండో వార్డు పరిధిలోని జిరాయత్నగర్లో నివాసముండే రాజవ్వ(72), గంగవ్వ(62) అనే అక్కాచెల్లెళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. పట్టణానికి చెందిన రాజవ్వ, గంగవ్వ అక్కాచెల్లెళ్లు. రాజవ్వకు 20 ఏళ్ల క్రితం విడాకులు కావడంతో ఒంటరిగా ఉంటుంది. గంగవ్వకు ఇద్దరు కుమారులు శ్రీనివాస్, మహిపాల్ ఉండగా.. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్లో, చిన్న కుమారుడు మహిపాల్ మామిడిపల్లిలో ఉంటున్నారు. గంగవ్వ భర్త 20 ఏళ్ల క్రితం మృతి చెందడంతో అనారోగ్యంతో మంచానపడ్డ అక్క రాజవ్వకు సపర్యలు చేసుకుంటూ ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. మహిపాల్ తన తల్లి గంగవ్వకు నిర్మల్ జిల్లా ముదోల్ ఆస్పత్రిలో మంగళవారం నేత్ర పరీక్షలు చేయించుకుని సాయంత్రం ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయమే ఇద్దరు మహిళలు ధారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఒంటరిగా ఉంటున్న వారి తలలపై ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. అనంతరం హత్యలను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఇంట్లోని దుస్తులకు నిప్పు పెట్టి జారుకున్నారు. ఇంటి నుంచి పొగలు వస్తుండడంతో స్థానికులు గంగవ్వ కుమారుడు మహిపాల్కు సమాచారం అందించారు. అనంతరం లోపలికి వెళ్లిన స్థానికులు పొగల మధ్యన మహిళలను వెతుకుతుండగా హత్యకు గురై విగత జీవులుగా పడి ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, ఎస్హెచ్వో సురేష్ బాబు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ మహిళలను వారిపై ఉన్న నగల కోసమే హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంటి పక్కన కల్లు కాంపౌండ్ ఉండడంతో అక్కడికి వచ్చే వారే ఒంటరిగా ఉంటున్న మహిళలను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరు కున్న ఇన్చార్జీ సీపీ ప్రవీణ్కుమార్ హత్యలు జరిగిన తీరును పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారించి నేరస్తులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
అమెరికా అమ్మాయి-ఆర్మూర్ అబ్బాయి. ఔను వాళ్లు ఇష్టపడ్డారు
సాక్షి, నిజామాబాద్: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నది పెద్దల మాట. కానీ, మనసులు కలిస్తే చాలు.. అనేది ఇప్పటి జనరేషన్లో కొంతమంది చెప్తున్న మాట. అందుకే తమ వైవాహిక బంధాలకు కులం, మతం, ప్రాంతం లాంటి పట్టింపులు లేకుండా చూసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన ఓ వివాహం.. స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకు కారణం.. అబ్బాయి లోకల్ అయితే.. అమ్మాయి అమెరికా దేశస్థురాలు కావడం!. విధినిర్వహణలో ఆ ఇద్దరూ పరిచయం అయ్యారు. ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలని అనుకున్నారు. పెద్దలకు ఎలా చెప్పాలా? అని మధనపడ్డారు. చివరికి ఎలాగోలా ఒప్పించగలిగారు ఖండాలు, సప్త సముద్రాలు దాటిన ఆ ప్రేమకథ.. చివరకు పెళ్లితో సుఖాంతం అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందుపేట్ గ్రామానికి చెందిన మూగ ఆకాష్.. చర్చిఫాదర్లకు క్లాసులు నిర్వహిస్తూ సేవాలందిస్తున్నాడు. ఐదేళ్ల కిందట.. అమెరికాకు చెందిన అలెక్స్ ఓల్సాతో అతనికి పరిచయం ఏర్పడింది. నర్సింగ్ పూర్తి చేసిన ఓల్సా.. భారత్లో క్రైస్తవ మిషనరీల్లో నర్సుగా సేవలందిస్తోంది. అయితే ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్ల తర్వాత.. ఎట్టకేలకు తల్లిదండ్రులను ఒప్పించలిగారు. ఇవాళ(మంగళవారం) ఆర్మూర్లోని ఒక ఫంక్షన్ హాల్లో పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. ఎల్లలు దాటినా ఈప్రేమజంటను ఆశీర్వదించడానికి స్థానికంగా ఉన్న బంధువులతో పాటు.. అమ్మాయి తరుపు విదేశీ బంధువులు కూడా తరలివచ్చారు. ఇష్టపడ్డ తాము పెళ్లితో ఒక్కటి కావడం ఎంతో సంతోషాన్ని పంచిందని చెబుతోంది ఆ జంట. అందుకే ఈ వివాహం స్థానికులను అంతలా ఆకట్టుకుంది. -
Photo Feature: కల్లు కమ్మగుంది..
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద ఆదివారం ఓ కోతి కల్లు తాగింది. కల్లు కవర్ను తెచ్చుకొని గోడపై కూర్చొని రుచి చూసింది. -
తలుపు తట్టి.. తలకు తుపాకీ గురిపెట్టి..
బంజారాహిల్స్(హైదరాబాద్): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిందితుడు తుపాకీతో కాల్చేందుకు యత్నిస్తుండగా ఎమ్మెల్యే కేకలు వేయడంతో పరుగున వచ్చిన గన్మెన్లు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని వేమిరెడ్డి ఎన్క్లేవ్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గం మాకునూరు మండలం కల్లాడి సర్పంచ్ లావణ్య... పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెన్షన్కు గురయ్యారు. ఎమ్మెల్యేతో మొదటినుంచీ విభేదాలు ఉండటం, భార్యపై సస్పెన్షన్ ఎత్తివేత ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఆమె భర్త, టీఆర్ఎస్కే చెందిన పెద్దగాని ప్రసాద్గౌడ్ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అంతం చేయాలనే పథకం వేసినట్లు సమాచారం. నాలుగురోజులు రెక్కీ పథకంలో భాగంగా ప్రసాద్గౌడ్ రెండు తుపాకులు, ఒక బటన్ చాకు (కత్తి)ని కొనుగోలు చేశాడు. 4 రోజుల పాటు బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే నివాసం వేమిరెడ్డి ఎన్క్లేవ్ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఎమ్మెల్యే ఏ సమయంలో వస్తున్నాడు.. ఎవరెవరు ఇంటి వద్ద ఉంటారు.. అన్నీ పరిశీలించాడు. సోమ వారం రాత్రి 7.30 గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంటికి వచ్చి సెక్యూరిటీ గార్డులు, గన్మెన్లతో కొద్దిసేపు మాట్లాడాడు. ఎమ్మెల్యే నియోజక వర్గానికే చెందిన సర్పంచ్ భర్త కావడం, గతంలో కూడా ఇలాగే వచ్చాడు కదా అని గన్మెన్లు, సెక్యూరిటీ గార్డులు ఇంట్లోకి అనుమతించారు. నేరుగా బెడ్రూమ్కు వెళ్లి.. రాత్రి 8.30 గంటల వరకు మెయిన్ హాల్లో తచ్చాడిన ప్రసాద్గౌడ్.. గన్మెన్లు, సెక్యూరిటీ గార్డులు సమీపంలో లేకపోవడం చూసి నేరుగా లిఫ్ట్లో మూడో అంతస్తులోని జీవన్రెడ్డి పడక గది వద్దకు వెళ్లి తలుపు కొట్టాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న ఎమ్మెల్యే తలుపులు తీసి ఎదురుగా నిలబడ్డ ప్రసాద్ ను చూసి షాక్ తిన్నారు. ‘ఏంటి? ఏం కావాలి?’ అని అడుగుతుండగానే ప్రసాద్ తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. ఎమ్మెల్యే పెద్దగా కేకలు వేస్తూ, తలుపులు మూస్తూ తప్పించుకునే ప్రయ త్నం చేశారు. ఆయన అరుపులు విన్న గన్మెన్లు, సె క్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకుని ప్రసాద్ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మె ల్యేకు ప్రాణహాని తప్పింది. ఒక చేతిలో నాటు తుపాకీ, ఇంకో చేతిలో కత్తితో ఉన్న ప్రసాద్ను అదు పులోకి తీసుకున్న గన్మెన్లు వెంటనే బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని రెండు తుపాకులు, కత్తి, నిందితుడి కారు (టీఎస్ 16ఎఫ్ బీ 9517) స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 307, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాక్కు గురైన జీవన్రెడ్డి నిందితుడు నేరుగా బెడ్రూమ్ వరకు వచ్చి కాల్చేందుకు యత్నించడంతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మధ్యాహ్నం వరకు కూడా కోలుకోలేదు. ఏ మాత్రం అటూఇటూ అయినా ప్రాణాలు పోయేవని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం, నగర ప్రజలకు పోలీసుల సూచన -
తాగిన మత్తులో కత్తితో రోడ్డుపై యువకుడి వీరంగం
-
కారు పార్టీలో చిచ్చు.. రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, నిజామాబాద్ : అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. టీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు బట్టబయలవుతోంది. సోమవారం నందిపేట్ మండలం లక్కంపల్లి సెజ్లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ ప్రైవేట్ బయో ప్లాస్టిక్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠల్రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదంతో ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. కార్యక్రమానికి రాకుండా తనను పోలీసులతో అడ్డగించారని ఎమ్మెల్యేపై విఠల్రావు మండిపడ్డారు. దీంతో మంత్రి ప్రశాంత్రెడ్డి కలగజేసుకుని ఇరువురిని సముదాయించాల్సి వచ్చింది. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్సీ కవిత, జిల్లా ముఖ్యనేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణలో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ మాక్లూర్లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ పంచాయితీ సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా సోమవారం జరిగిన ఘటన పార్టీలో అంతర్గత పోరును బయట పెట్టింది. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడు, సీనియర్ నాయకుడు ఏఎస్ పోశెట్టి గత ఎన్నికల వేళ ఏకంగా ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాపై విమర్శనాస్త్రాలు సంధించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య ఉప్పు.. నిప్పు.. అన్న చందంగా పోరు నడిచిన సంగతి తెలిసిందే. భూపతిరెడ్డి టీఆర్ఎస్ను వీడటంతో ఇక్కడ ఆధిపత్య పోరుకు తెరపడినట్లయింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండలో అంతర్గత పోరు ఇప్పటి వరకు బట్టబయలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ఇక్కడ ఇద్దరు అగ్రనేతల మధ్య కొంత ఆధిపత్య పోరు తలెత్తే అవకాశాలున్నట్లు అప్పట్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి ఘటనలేవీ బయటకు రాలేదు. మిగతా నియోజకవర్గాల్లోనూ.. అధికార పార్టీలో అంతర్గత పోరు ఒక్క ఆర్మూర్ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. ఇతర నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. బోధన్లోనూ స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమేర్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శరత్రెడ్డి మధ్య కూడా ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరి మధ్య విభేదాలు ఇప్పటి వరకు ఇలా బహిర్గతం కాకపోయినప్పటికీ, బోధన్ మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల జోక్యంపై శరత్రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
కారు దిగి కమలం కండువా కప్పుకుంటారా..!
సాక్షి, నిజామాబాద్ : తెలుగు రాజకీయాల్లో పరిచయమక్కర్లేని పేరు మండవ వెంకటేశ్వరరావు. వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న లీడర్. కీలక పదవులు అనుభవించిన అనుభవం. టీడీపీలో ఎన్టీఆర్తో పాటు చంద్రబాబుతో కలిసి చక్రం తిప్పిన నేత.. ఇదంత బాగానే ఉన్నా పార్లమెంట్ ఎన్నకల ముందు ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మండవ ఇంటికి వెళ్లి స్వయంగా కలిసి కండువా వేసి వచ్చారు. ఇక అప్పటి నుండి మండవకు పెద్ద పదవే ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. కాని ఇప్పటి వరకు ఏమీ లేక పోవడంతో ఆయన డైలామాలో పడ్డారు.. అసలు మండవ ప్యూచర్ ఏంటీ..? సైకిల్ దిగి కారేక్కశారు.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుకు కుడిభుజంగా పేరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోను పెద్ద నాయకునిగా గుర్తింపు పోందారు. తన సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచారు. తెలంగాణలో టీడీపీ అధికారం కోల్పయినప్పటి నుంచి సైలెంట్ అయిన మండవ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికలకంటే ముందు పాత స్నేహంతో సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపి గులాబీ పార్టీలోకి అహ్వనించారు. కేసీఆర్కు మండవకు మంచి స్నేహం ఉండటంతో కాదనలేక పోయారు. దీంతో సైకిల్ దిగి కారేక్కశారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న సురేష్ రెడ్డి, ఇటు మండవ ఇద్దరు కారేక్కడంతో పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు ఖాయం అనుకున్నారు అందరూ కానీ ఎంపీగా కవిత ఓడిపోయారు. ఇక అప్పటి నుండి ఇద్దరి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. కానీ అనుహ్యంగా సురేష్ రెడ్డికి రాజ్యసభ సీటిచ్చేశారు. మండవకు మాత్రం ఎలాంటి హమీ మాత్రం దక్కకపోగా ఒక్కసారిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడసలు మండవకు పదవి వస్తుందా లేదా గులాబీ బాస్ ఎలా అకామిడేట్ చేయనున్నారు అనే ప్రశ్న అతనితో పాటు అతని అనుచరులును కూడా వేదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని అడగాలో ఎం చేయాలో తెలియని పరిస్థిలో ఉన్నారట. పార్టీ మారాలనే ఒత్తిడి కూడా అనుచరుల నుండి పెరుగుతుందట. సంవత్సరం గడిచినా ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారట మండవ. ఇప్పటికే ఓ పదవిని మండవకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీకి దూరంగా.. గతంతో ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కి ఇచ్చిన ప్రభుత్వ సలహదారు పదవిని మండవకు ఇద్దామనే ఆలోచనలో సీఎం ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పదవి తీసుకోవాల వద్దా అనే డైలామా మండవను వేంటాడుతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి దీనికి బలం చేకూర్చుతుంది. దీంతో పాటు గత కొద్ది రోజులుగా మండవ పార్టీ కార్యక్రమంలో అసలు పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కారు దిగి కమలం కండువ కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక అటు నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్ తన పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవి మండవకు కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తారో.. మండవకి రాజ్యసభ ఎప్పుడొస్తుందో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. -
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో ఐసోలేషన్కు వెళ్లారు. కాగా,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్గౌడ్ ఇటీవల కోవిడ్బారినపడి చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 58,908కి చేరింది. కరోనాతో మంగళవారం ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 492కి చేరింది. (చదవండి: బయటకు వెళ్లి.. ఇంట్లోకి తెస్తుండ్రు) -
ఆర్మూర్లో 6కు చేరిన కరోనా కేసులు
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో కరోనా కేసులు 6కు చేరాయి. కాగా గ్రామంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామస్థులు బయటి వారు గ్రామంలోకి రాకుండా పొలిమేరలో కంచె ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులతో గ్రామంలోని వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణాన్ని అధికారులు పిచికారీ చేయిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. (కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే) -
త్వరపడండి: రూపాయికే గుడ్డు
సాక్షి, ఆర్మూర్ టౌన్: కరోనా దెబ్బకు రోజురోజుకు కోడిగుడ్డు ధర అమాంతంగా పడిపోతోంది. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనే పుకార్లు రావడంతో గుడ్ల వ్యాపారం పడిపోయింది. దీంతో ఆర్మూర్ పట్టణంలోని బృందావనం థియేటర్ సమీపంలో ఓ గుడ్ల వ్యాపారి కేవలం వంద రూపాయలకే వందగుడ్లు విక్రయిస్తున్నాడు. అదేవిధంగా 100 రూపాయలకే 100 గుడ్లు అని ఆటోలో ప్రచారం చేస్తున్నాడు. దీంతో ప్రజలు తరలివచ్చి గుడ్లను కొనుగోలు చేస్తున్నారు. (అలా పెరిగే కోళ్లతో డేంజర్!) (కోడి కూర.. మాకొద్దు బాబోయ్) -
మూడోసారి ఆర్మూర్ పీఠం ఎవరిదో..?
సాక్షి, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ చరిత్రలో మూడో పాలకవర్గం కోసం ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధంమైంది. యాభై రెండు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీగా ఉన్న ఆర్మూర్ను పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామపంచాయతీగా మార్చారు. సుమారు 44 సంవత్సరాలు గ్రామపంచాయతీగా కొనసాగిన అనంతరం తిరిగి 2006 మే 26న నాటకీయ పరిణామాలమధ్య మున్సిపాలిటీగా మార్చారు. తొలి మున్సిపల్ చైర్మన్ కేవీ నరసింహారెడ్డి 1956 నుంచి 1962 వరకు ఆర్మూర్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చైర్మన్గా కేవీ నరసింహారెడ్డి ఎన్నికైయ్యారు. తరువాత గ్రామపంచాయతీగా మారింది. 2001 నుంచి 2006 వరకు గ్రామ పంచాయతీకి చివరి సర్పంచ్గా కొంగి సదాశివ్ బాధ్యతలు నిర్వహించారు. తిరిగి ఆర్మూర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తరువాత మొదటి సారిగా 2008లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆర్మూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గానికి మూడో పర్యాయము మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డులు - 36 ఓటర్లు - 55,016 పురుషులు - 26,601 మహిళలు - 28,413 ఇతరులు - 02 పట్టణ జనాభా - 67,252 చైర్పర్సన్ రిజర్వేషన్ - బీసీ మహిళ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఈ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అందుకే ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డి పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం పోలింగ్ నిర్వహించి ఈ నెల 25వ తేదీన కౌంటింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విలీన గ్రామాలైన పెర్కిట్–కొటార్మూర్, మామిడిపల్లిని కలుపుతూ ఆర్మూర్ పట్టణ జనాభా 67, 252గా ఉంది. పట్టణంలో మొత్తం ఓటర్లు 36 వార్డులకు 55,016 మంది కాగా అందులో పురుషులు 26, 601 మంది, మహిళలు 28,413 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. బీసీ ఓటర్లే అధికం మొత్తం ఓటర్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలుగా విభజించగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్లు 44,727 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 21,520 మంది ఓటర్లు, మహిళలు 23,207 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 4,518 మంది కాగా వీరిలో పురుషులు 2,104 మంది, మహిళలు 2,414 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 664 మంది కాగా అందులో పురుషులు 313 మంది, మహిళలు 351 మంది ఉన్నారు. ఇక మిగిలిన ఓసీ ఓటర్లు 5,105 మంది కాగా అందులో పురుషులు 2,663 మంది, మహిళలు 2,442 మంది ఉన్నారు. 24వ వార్డులో అత్యధికంగా 1,714 మంది ఓటర్లు ఉండగా 9వ వార్డులో అత్యల్పంగా 1,348 మంది ఓటర్లు ఉన్నారు. -
ఏడుగురు కొడుకులు ఏడాదిన్నరకొకరు చొప్పున..!
సాక్షి, ఆర్మూర్: విధి ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఏడుగురి సంతానంలో ఐదుగురు ఏడాదిన్నరకు ఒకరు చొప్పున అకాల మృత్యువాత పడ్డారు. ఏడుగురిలో ఇప్పటికే నలుగురు చనిపోగా, గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదో కుమారుడు ముజా హిదీన్ (22) మరణించాడు. కన్న కొడుకులు పాతిక సంవత్సరాల వయసు కూడా నిండకముందే ఒక్కొ క్కరుగా పిట్టల్లా రాలిపోవడంతో ఆ కన్నతల్లి కడుపుకోత వర్ణనాతీతంగా మారింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రినగర్లో నివాసం ఉండే షేక్ అబ్దుల్ కరీం, రహీమున్సీసా బేగం దంపతులకు ఏడుగురు సంతానం. కాగా, బీడీ పొగాకు అమ్ముతూ కుటుంబాన్ని పోషించే ఇంటికి పెద్ద దిక్కు అయిన అబ్దుల్ కరీం 15 ఏళ్ల కింద అనారోగ్యంతో మృతి చెందడంతో బీడీలు చుట్టి తల్లి రహీమున్నీసా బేగం పిల్లలను పెంచి పెద్ద చేసింది. ముగ్గురు కొడుకులు అనారోగ్యంతో మృతి చెందగా, ఇద్దరు కొడుకులు ప్రమాదాల బారిన పడి మరణించారు. అయితే మృతి చెందిన ఐదుగురు కూడా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. షేక్ ఇర్ఫాన్ ఆటో డ్రైవర్గా పని చేసేవాడు. ఇతడు 2011లో అనారోగ్యంతో మృతి చెందాడు. మరో ఏడాదిలోనే (2013లో) పెద్ద కుమారుడు షేక్ బాబా సైతం అనారోగ్యంతో మృతి చెందగా, అతడి భార్య, పిల్లలు అనాథలయ్యారు. నాలుగో కుమారుడు షేక్ మోబిన్ సైతం ఆటో డ్రైవర్గా పని చేస్తూ 2015లో గూండ్ల చెరువులో స్నానం చేయడానికి దిగి ఈత రాక పోవడంతో మృత్యువాత పడ్డాడు. మూడో కుమారుడు షేక్ అజ్జు 2017లో గుండెపోటుతో మృతి చెందడంతో అతడి భార్య, పిల్లలకు పెద్దదిక్కు లేకుండాపోయింది. ప్రస్తుతం ఐదో కుమారుడు ముజాహిద్ను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. ఏడాదిన్నర వ్యత్యాసంతో ఒక్కొక్కరు మృత్యువాత పడుతుండటంతో 55 ఏళ్ల వృద్ధాప్యంలో తల్లి రహీమున్సీసాకు కడుపుకోతగా మారింది. -
అభాసుపాలైన టాస్క్ఫార్స్..!
సాక్షి, నిజామాబాద్: టాస్క్ఫోర్స్.. ఈ పేరు వింటేనే అసాంఘిక శక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టాలి. పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా నియమించే ఈ విభాగానికి సీపీకి ఉండే అధికారాలన్నీ ఉంటాయి. సీపీ పరిధి ఏ మేరకు ఉంటుందో ఆంత పరిధిలో టాస్క్ఫోర్స్ బృందం దాడులు నిర్వహించవచ్చు. స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు నియమించిన విభాగం ఇది. మరి ఇలాంటి విభాగమే జిల్లాలో అభాసు పాలుకావడం ఇప్పుడు పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ డివిజన్లో భారీ స్థాయిలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ విభాగం దాడి చేసింది. ఈ ఘటనలో విభాగం ఇన్చార్జిగా ఉన్న సీఐ సత్యనారాయణ ఇద్దరు అధికార పార్టీ నేతలను కేసు నుంచి తప్పించేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై ఆకస్మిక బదిలీ వేటు వేశారు. ఆయనను ఏఆర్ వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆ విభాగం పనితీరే ప్రశ్నార్థకంగా మారింది. కమిషనరేట్లో ప్రత్యేకం.. ప్రత్యేక అధికారాలు కలిగిన టాస్క్ఫోర్స్ విభాగం కేవలం పోలీసు కమిషనరేట్ ఉన్న చోట మాత్రమే ఏర్పాటు చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్న విభాగంలో సుమారు పది మంది వరకు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే చాలు విభాగం జిల్లా అంతట ఎక్కడైనా ఆకస్మిక దాడులు (రైడ్స్) నిర్వహించవచ్చు. సెర్చ్ వారెంట్ కూడా ఈ విభాగానికి అవసరం లేదు. మరి అంతటి అధికారాలున్న ఈ విభాగం అధికార పార్టీ నేతలకు వంతపాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల చెప్పుచేతల్లో పనిచేయడం సర్వసాధారణమై పోవడమే పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మరి అలాంటిది ప్రత్యేక అధికారాలు కలిగిన ఈ విభాగం కూడా అదే అధికార పార్టీ నేతలకు తొత్తుగా వ్యవహరించడంతో స్థానిక పోలీసులకు, ఈ ప్రత్యేక విభాగానికి ఏం తేడా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తర్వులు వెనక్కి తీసుకుందామా..? టాస్క్ఫోర్స్ సీఐపై బదిలీ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో ఉన్నారు. సీఐని వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఈవిషయమై సీపీ కార్తికేయను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
ఎల్ఎల్ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే
సాక్షి, వరంగల్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపస్లోని దూరవిద్యా కేంద్రం భవనంలో నిర్వహించిన ఎల్ఎల్ఎం ఫైనలియర్ రెండో పేపర్ ఇన్సూరెన్స్ లా పరీక్షను ఆయన రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ చదవుతున్న ఎమ్మెల్యే జీవన్రెడ్డి పరీక్షలు రాస్తున్నారు. ప్రజాప్రతినిధిగా బిజీగా ఉండే జీవన్రెడ్డి చదువు కొనసాగిస్తుండటం విశేషం. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన రెండోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
జెరూసలేంలో జగన్ను కలిసిన ఆర్మూర్ వాసులు
సాక్షి, ఆర్మూర్ : జెరూసలెం పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇజ్రాయిల్ తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్కు చెందిన ఆర్మూర్ వాసులు శనివారం కలిసి తమ అభిమానాన్ని చాటారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో తన కొడుకుకు వైఎస్సార్ అని నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి వేటలో తాము ఇజ్రాయిల్ వచ్చినా ప్రతీ ఏటా తమ ప్రియతమ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్న తీరును జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జగన్ను కలిసిన వారిలో అంకాపూర్ తిరుపతిగౌడ్, ప్రశాంత్, కలిగోట్ చరణ్గౌడ్ తదితరులున్నారు. -
15 రోజుల పాపను ఎత్తుకెళ్లిపోయారు
సాక్షి, ఆర్మూర్టౌన్ (నిజామాబాద్): పాప పుట్టి నెల రోజులైనా కాలేదు. తనని కళ్లారా చూసుకుంది లేదు... తనివితీరా ముద్దాడింది లేదు. అంతలోనే ఎవరో దుండగులు తల్లి నుంచి బిడ్డని వేరు చేశారు. తల్లి ఆదమరచి నిద్రిస్తున్న సమయం లో పాపను శిశువును ఎత్తుకుపోయారు. ఆర్మూర్ మండలం పెర్కిట్లో గల క్లాసిక్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ నారాయణ్ కథనం ప్రకారం.. పెర్కిట్కు చెందిన సుమలత 15 రోజుల క్రితం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. శనివారం రాత్రి ఉక్కపోతగా ఉండడంతో పసిబిడ్డతో కలిసి ఇంటి ఎదుట నిద్రకు ఉపక్రమించింది. తెల్లారి లేచి చూసే సరికి శిశువు కనిపించలేదు. అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కేసు నమోదుచేసిన పోలీసులు శిశువు కోసం గాలిస్తున్నారు. -
2 ఓట్లతో గెలుపు.. లాటరీలో అనూహ్య ఫలితం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆర్మూరు మండలం పిప్రిలో ఓట్ల లెక్కింపులో వింత పరిస్థితి నెలకొంది. తొలుత ఓ అభ్యర్థి గెలవగా.. రీ కౌంటింగ్లో పరిస్థితులు మారిపోయాయి. చివరకు విజేత ఎవరో తెలుసుకోవడానికి లాటరీ తీయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తొలుత పిప్రికి సంబంధించి అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టగా రెండు ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్కు పట్టుబట్టారు. వారి విజ్ఞప్తి మేరకు అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. ఈ సారి అధికారులు ఓట్లు లెక్కించగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు(690) వచ్చాయి. దీంతో విజేత ఎవరో తెలుసుకోవడానికి అధికారులు లాటరీ తీయగా.. బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. దీంతో అధికారులు బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వను గెలిచినట్టు ప్రకటించారు. -
వారణాసికి చేరిన పసుపు రైతులు
వారణాసి(ఉత్తర్ ప్రదేశ్): ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పసుపు రైతులు సోమవారం నామినేషన్లు వేయనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు అనే ప్రధాన డిమాండ్తో వీరు మోదీపై పోటీకి దిగారు. పసుపు రైతుల రాష్ట్ర అధ్యక్షులు నర్సింహనాయుడు, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి తదితరులు వారణాసి కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 29న సుమారు 50 మంది పసుపు రైతులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ రైతులకు మద్ధతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్ రైతన్నలు శనివారం కలెక్టర్ ఆఫీస్కు వచ్చారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, పసుపు బోర్డు సమస్యను జాతీయస్థాయిలో నేతలు గుర్తించేలా చేసేందుకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల తొలిదశలో భాగంగా నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ కవితపై 175 మంది రైతులు పోటీ చేసిన విషయం తెల్సిందే. అటు వెలిగొండ ప్రాజెక్టు సాధనకు ప్రకాశం జిల్లా అన్నదాతలు వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ వేసేందుకు వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి నేతలు వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్ వర్మ ఇప్పటికే కాశీ వెళ్లారు. -
పరీక్ష రాసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హన్మకొండ: ప్రజాప్రతినిధిగా గెలుపొంది.. శాసనసభలో అడుగుపెట్టినా.. ఆయన చదువును మాత్రం ఆపలేదు. దూరవిద్యలో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూ.. క్రమం తప్పకుండా సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. తాజాగా తోటి విద్యార్థులతో కలిసి ఆయన హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లాలో పరీక్షలు రాశారు. ఆయనే ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి. హన్మకొండలోని ఆదర్శ్ లా కాలేజీలో జీవన్రెడ్డి ఎల్ఎల్ఎం అభ్యసిస్తున్నారు. ఎల్ఎల్ఎం విద్యలో భాగంగా ఆయన ప్రస్తుతం మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది రెండు సెమిస్టర్ పరీక్షలు రాసి పాసయ్యానని, ఈ రోజు మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యానని తెలిపారు. పరీక్షలకు హాజరుకావడం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందని, పదో తరగతి, ఇంటర్ పరీక్షలు గుర్తుకువచ్చాయని అన్నారు. -
ఆర్మూర్లో కాంగ్రెస్కు షాక్
నిజామాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్మూర్లో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత రాజారాం యాదవ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆర్మూరులో టీడీపీ తరపున రాజారాం యాదవ్ పోటీ చేశారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరిపోయారు. రెండు నెలల క్రితం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరిన సంగతి తెల్సిందే. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ల తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో ఆర్మూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకలా సాఫీగా ఉందని టీఆర్ఎస్ కార్యకర్తలు భావిస్తున్నారు. -
తెలంగాణలో ఉన్నది టీఆర్ఎస్ కాదు..టీఆర్ఎస్ఎస్
-
జనం మధ్యనే జీవన్రెడ్డి సతీమణి
సాక్షి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించగా టీఆర్ఎస్ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి సతీమణి రజితరెడ్డి వేదికపైకి వెల్లకుండా ప్రజల్లో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. -
అభ్యర్థి ఎవరైనా కార్యకర్తలు వారే..
సాక్షి,ఆర్మూర్: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అయినా సరే ర్యాలీ నిర్వహించినా.. ప్రచారం చేసిన అధిక సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు హాజరై ఆ ర్యాలీలను విజయవంతం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ, అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న లేకుండా అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాల్లో వీరే పాల్గొంటుండడంతో ఓటరు నాడి అర్థం కాక రాజకీయ పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న డబ్బుల కోసం మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమ బలనిరూపణ చేసుకోవడం కోసం ప్రచార కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు, యువజన సంఘాల సభ్యులను తరలిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏది, తమకు సేవ చేస్తున్న నాయకుడా, కాదా అనే అంశాలను పట్టించుకోకుండా కేవలం వారిచ్చే డబ్బుల కోసం వీరు తరలి రావడం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలకు రోజుకు రూ. రెండు వందల నుంచి రూ. మూడు వందల వరకు చెల్లిస్తున్నట్లు డబ్బులు పంపిణీ చేస్తున్న నాయకులే బహిరంగంగా సమాచారం ఇస్తున్నారు. ఇక మోటార్ సైకిల్ ర్యాలీల్లో పాల్గొనడానికి వస్తున్న యువతకు ఒక్కో మోటార్ సైకిల్కు ఐదు వందల రూపాయలు, కారుకు 15 వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, యువకులు, కుల సంఘాల సభ్యులు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారో లేదో అర్థం కాని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జన సమీకరణతో ప్రత్యర్థులకు దడ పుట్టించాలని తద్వారా తాము గెలుస్తున్నామన్న టాక్ను సృష్టించాలని వివిధ పార్టీల అసెంబ్లీ అభ్యర్థులు పోటీ పడి మరీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి ఈ జన సమీకరణ చేసే విధానం కేవలం ఆర్మూర్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. అయితే అన్ని పార్టీల ప్రచారానికి వారే రావడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తమ పార్టీల మేనిఫెస్టోలతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి చేయాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తే సరిపోయేదానికి ఇలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ర్యాలీల ద్వారా ప్రచారం నిర్వహించడం వల్ల అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ లేదని ప్రజలు, ఓటర్లు చర్చించుకుంటున్నారు. -
టీఆర్ఎస్ ‘తొలి టికెట్’ చరిత్రను మార్చిన జీవన్రెడ్డి
సాక్షి,ఆర్మూర్(నిజామాబాద్): టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి టికెట్ కేటాయించిన అభ్యర్థి ఓటమి పాలవుతాడనే అపవాదును ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి చెరిపేశారు. టీఆర్ఎస్లో మొదటి అభ్యర్థి కూడా విజయం సాధిస్తాడని పార్టీ చరిత్రను తిరగ రాశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం 2004లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొట్టమొదటి టికెట్గా ప్రకటించిన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పాపారావ్ ఓటమి పాలయ్యారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డిని ప్రకటించారు. ఆయన కూడా ఓడిపోయారు. దీంతో టీఆర్ఎస్ అధినేత తొలి టికెట్ ప్రకటించిన అభ్యర్థి ఓటమి పాలవుతారనే ప్రచారం సాగింది. ఇలాంటి తరుణంలో 2013 ఏప్రిల్లో టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ సభను పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్చార్జి ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర్మూర్లో విజయవంతంగా నిర్వహించారు. దీంతో సభ అనంతరం జీవన్రెడ్డి ఇంటికి వచ్చి మరీ టీఆర్ఎస్ మొట్ట మొదటి అభ్యర్థిగా ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి జీవన్రెడ్డి పేరును ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే తన అభ్యర్థి త్వాన్ని కేసీఆర్ ప్రకటించడమే కాకుండా పలు సభల్లో ‘జీవన్రెడ్డి నా కుడి భుజం’ అంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇదే ఉత్సాహంతో జీవన్రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులను కూడగట్టి టీఆర్ఎస్ను బలోపేతం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డిపై 13,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. దీంతో టీఆర్ఎస్లో మొదటి టికెట్ కేటాయించిన వ్యక్తి ఓటమి పాలవుతాడనే అపవాదును జీవన్రెడ్డి తుడిపేశారు. -
తొలగిన భయం
సాక్షి, ఆర్మూర్(నిజామాబాద్): జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల ముఖచిత్రం మారిపోయింది. 2004 ఎన్నికలకు పూర్వం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామాల్లో యువత ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొనాలంటే తీవ్ర ఒత్తిడికి గుర య్యే వారు. ఎన్నికలను బహిష్క రించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం.. మరోవైపు, కచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనాలంటూ పోలీసు లు, అధికారులు ఒత్తిడి తేవడంతో ఆయా గ్రామాల ప్రజలు నలిగి పో యే వారు. ఫలితంగా గ్రామీణ యువతతో పాటు భూస్వాములు, రాజకీయ నాయకులు గ్రామాలను ఖాళీ చేసి వెల్లిపోయే వారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎన్నిక ల విధులు నిర్వహించడానికి సై తం ప్రభుత్వ ఉద్యోగులు భయాం దోళనకు గురయ్యేవారు. కానీ, 2018 ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి అం తంత మాత్రంగానే ఉండేది. ఈ క్రమంలో మావోయిస్టులతో పాటు వారి సానుభూతిపరులు సైతం గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉండే వారు. కమ్మర్పల్లి మండల కేంద్రం నుంచి ఇనాయత్నగర్కు వెళ్లే దారిలో మావోయిస్టులు రోడ్డుపై అమర్చిన బాంబులు పేలి ముగ్గురు కానిస్టేబుళ్లు గాయాల పాలయ్యారు. 1996 నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ రోజే సిరికొండ మండలం రావుట్ల సమీపంలో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఎస్సై విక్టర్.. మావోయిస్టులు పేల్చిన బాంబు కారణంగా మృత్యువాత పడ్డారు. మావోయిస్టుల దాడులకు భయపడి కమ్మర్పల్లి మండలం మానాల లాంటి మారుమూల గ్రామాల్లో ఎన్నికల విధులు నిర్వహించడానికి సైతం ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసే వారు. ఈ క్రమంలో 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక మావోయిస్టులతో జరిపిన చర్చల తర్వాత జిల్లాలో మావోల ప్రభావం తుడిచి పెట్టుకుపోయింది. దీంతో మారుమూల గ్రామమైన మానాలలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ బహిరంగ సభ సైతం ఏర్పాటు చేసి అధికారులతో పాటు ఈ ప్రాంత ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. క్రమంగా మావోయిస్టుల ప్రభావం తగ్గడం, రోడ్డు, రవాణా వ్యవస్థతో పాటు సెల్ఫోన్ల రాక కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు చైతన్యవంతులై మావోయిస్టుల భయం నుంచి క్రమంగా బయటికి వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొని రాజకీయ పార్టీల తరపున ప్రచారాలు సైతం నిర్వహించారు. తాజాగా 2018 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆయా రాజకీయ పార్టీల నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు మారుమూల గ్రామాల్లోకి సైతం వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నాటి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రజలు అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని స్వాగతించడంతో పాటు వారు సైతం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటుండడం విశేషం. -
వార్డు మెంబర్గా ఓడి.. ఎమ్మెల్యేగా గెలిచి..
సాక్షి, ఆర్మూర్ (నిజామాబాద్) : తన సొంత గ్రామమైన సిరికొండ మండలం ముచ్కూర్లో వార్డు మెంబర్గా ఓటమి పాలైన శనిగరం సంతోష్ రెడ్డి తరువాతి కాలంలో రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర కేబినెట్లో అత్యున్నతమైన మంత్రి పదవులను నిర్వహించారు. కళాశాల విద్యనభ్యసిస్తున్న రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న శనిగరం సంతోష్రెడ్డి తరువాత కాలంలో నాలుగు పర్యాయాలు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర కేబినెట్లో ఉన్నత పదవులను అలకరించి రాజకీయ చతురుడిగా, మృదు స్వభావిగా గుర్తింపు సాధించుకున్నారు. 1964–65లో కళాశాల విద్యనభ్యసిస్తున్న రోజుల్లో నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల జనరల్ సెక్రెటరీగా సంతోష్రెడ్డి ఎన్నికయ్యారు. 1966–67లో కళాశాల అధ్యక్షుడిగా కొనసాగారు. బడుగు, బలహీనవర్గాల నేత, మాజీ మంత్రి అర్గుల్ రాజారాం, సంతోష్రెడ్డి బావ అయిన స్వాతంత్ర సమరయోధుడు బీఆర్ గంగారెడ్డి స్ఫూర్తి, ప్రోద్భలంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1969లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో అర్గుల్ రాజారాంతో కలిసి పాల్గొన్ని జైలుకు సైతం వెళ్లారు. 1970లో తన స్వస్థలమైన భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామ పంచాయతీ మెంబర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1971లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నిజామాబాద్ బీడీ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రెటరీగా ఎన్నుకోబడ్డారు. 1975లో యువజన కాంగ్రెస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా నియమింపబడ్డారు. తన రాజకీయ గురువుల సహకారంతో 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి నుంచి ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే ఏడాది మొట్టమొదటి సారిగా శాసనసభకు ఎన్నిక కావడం విశేషం. 1983లో సినీ నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా తెలుగుదేశం అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందారు. ఆ సమయంలో సంతోష్రెడ్డి ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. 1985లో టీడీపీ అభ్యర్థి ఏలేటి మహిపాల్రెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు. 1989లో టీడీపీ అభ్యర్థి వేముల సురేందర్రెడ్డిపై విజయం సాధించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1990 – 91 వరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, 1991– 92 వరకు నేదురుమల్లి జనార్దన్రెడ్డి కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా, 1992–93 వరకు కోట్ల విజయభాస్కర్రెడ్డి కేబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1994లో టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణపై ఓటమి పాలయ్యారు. 1999లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 3,500 స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. తన రాజకీయ జీవితం ముగిసిందన్న సమయంలో మంత్రి చెన్నారెడ్డితో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపిన అనుభవంతో అదే నినాదంతో ఆవిర్భవించిన టీఆర్ఎస్లో చేరి 2001లో భీమ్గల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. మెజార్టీ సభ్యుల బలంతో నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్లో అసమ్మతి బాట పట్టి కాంగ్రెస్ వాదిగా కొనసాగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన తన పదవీ కాలం ముగియకముందే రాజీనామా సమర్పించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇకముందు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సంతోష్రెడ్డి ఇదివరకే ప్రకటించారు. తాను కాంగ్రెస్లో చేరకున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న సత్సంబంధాలతో తన తనయుడు శనిగరం శ్రీనివాస్రెడ్డి(వాసు)ని 2009 ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీకి నిలిపారు. శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలవడంతో అమెరికాకు వెళ్లిపోయాడు. అయినా సంతోష్ రెడ్డి తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డితో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తిరిగి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకపోవడంతో నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. -
నిజామాబాద్లో మరో ఆటో ప్రమాదం
సాక్షి, నిజమాబాద్: ఆటో బావిలో పడి 11 మంది దుర్మరణం చెందిన ఘటనను మరువకముందే నిజామాబాద్లో మరో ఆటో ప్రమాదం జరిగింది. ఆర్మూర్లోని సిద్దుల గుట్ట ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం ఓ ఆటో అదుపు తప్పి పడిపోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా అతి వేగమే ఆటో బోల్తాకు కారణమని స్థానికులు అంటున్నారు. గాయపడినవారిలో నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు చెందిన సువర్ణ, మామిడిపల్లికి చెందిన వెంకట్ స్వామి ఉన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్కు ఆర్నెళ్ల జైలు
నందిపేట్ (ఆర్మూర్): రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్కు ఆర్నెళ్ల జైలుశిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. నందిసేట్ ఎస్సై సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జోర్పూర్ గ్రామానికి చెందిన ఏడ మహేశ్ తన స్నేహితుడైన బచ్చు రాముతో కలిసి 2015 మార్చి 31న పొలానికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఆర్మూర్ డిపో బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా, మహేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసు గురువారం విచారణకు రాగా ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ మేకల రాజశేఖర్కు ఆర్నెళ్ల జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ మేజిస్ట్రేట్ ఉదయ్కుమార్ తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రవీణ్ నాయక్, ఇన్వెస్టిగేషన్ అధికారిగా జాన్రెడ్డి వ్యవహరించారు. -
వివాహిత ఆత్మహత్య
పెర్కిట్(ఆర్మూర్): అత్తారింటి వేధింపులు తాళ లేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ర్మూర్ పట్టణంలో చేసుకుంది. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. మెండోరా మండలం సా వెల్ గ్రామానికి చెందిన దీపిక అలియాస్ భావన(23)కు ఆర్మూర్ పట్టణంలోని కాశీహన్మాన్ వీధికి చెందిన హన్మాండ్లుతో తొమ్మిది నెలల క్రి తం వివాహం జరిగింది. కొన్ని రోజుల నుంచి భర్త, కుటుంబ సభ్యుల వేధింపులతో దీపిక మ నస్థాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం దీపిక సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురా లి తల్లి లింబాయి ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రైతుల ఆందోళన.. ఆర్మూర్ లో 144 సెక్షన్
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో రైతులు తలపెట్టిన రిలే దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మద్దతు ధర కోసం ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళనతో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 48 గంటల పాటు 144 సెక్షన్ విధిస్తూ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది రైతులు గుమిగుడితే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 144 సెక్షన్ నేపథ్యంలో దాదాపు 250 మంది పోలీసులు ఆర్మూర్లో మోహరించారు. -
బోధన్ ఇరిగేషన్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
సాక్షి, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఇరిగేషన్ డిఈ శ్రావణ్ కుమార్ రెడ్డి ఇంటిపై ఏసీబి దాడులు చేసింది. బాన్సువాడ లోని ఆయన నివాసంలో రూ.40లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఖదీదైన కారును సీజ్ చేశారు. ఆర్మూర్లో ఉన్న ఆయన ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. ఇక్కడా విలువైన అస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. -
మందులు అమ్మడానికి వస్తూ..
తరతరాలుగా ఆయుర్వేద మందులు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు డివైడర్ పైకెక్కి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. తాత, మనువడు మృతి చెందిన ఈ ఘటన ఆర్మూర్ మండలం మామిడిపల్లి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పెర్కిట్(ఆర్మూర్): గాంధారి మండలం గుజ్జాల్ తండాకు చెందిన సిరిగిరి పవన్, దుర్గమ్మ దంపతులు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయుర్వేద మందులు విక్రయిస్తుంటారు. పవన్ తండ్రి ఎల్ల స్వామి (49) గాంధారి ప్రాంతంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఇటీవలే మానేసి ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నాడు. ఆర్మూర్ ప్రాంతంలో మందులను విక్రయించడానికి ఎల్ల స్వామి, పవన్, దుర్గమ్మలతో పాటు వారి కుమారుడు వినీత్ అలియాస్ వినయ్ (3) మారుతి కారులో సోమవారం వేకువజామున బయల్దేరారు. మహబూబ్నగర్లో ఉండే ఎల్ల స్వామి అల్లుడు పొనకంటి నర్సింహులు కుటుంబం సైతం మందులను విక్రయించడానికి ఆర్మూర్కు కారులో బయల్దేరారు. రెండు కుటుంబాలు ఇందల్వయి వద్ద కలుసుకున్నాయి. రెండు కార్లు ఒకదాని వెనుక ఒకటి వస్తుండగా, మామిడిపల్లిలోని 44వ జాతీయ రహదారి వద్ద గల పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే ముందుగా వస్తున్న పవన్ కారు అదుపు తప్పింది. ఒక్కసారిగా డివైడర్ పైనుంచి రాంగ్ రూట్లోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఎల్లస్వామి అక్కడికక్కడే మృతి చెందగా, వినీత్తో పాటు పవన్, దుర్గమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వెనుక కారులో వస్తున్న ఎల్లస్వామి అల్లుడు నర్సింహులుకు ముందున్న కారు కనబడక పోవడంతో అనుమానం వచ్చి రోడ్డు పక్కన కారు ఆపాడు. నడుచుకుంటూ వెనక్కు వెళ్లి చూడగా రాంగ్రూట్లో ప్రమాదానికి గురైన కారు కనిపించింది. హ్రుటాహుటిన అక్కడకు చేరుకొని చూడగా, మామ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన పవ¯న్, దుర్గమ్మ, మేనళ్లుడు వినీత్ కనిపించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మేనళ్లుడిని బతికించుకోవడానికి పెర్కిట్లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతడు తుది శ్వాస విడిచాడు. తీవ్ర గాయాలతో ఉన్న పవన్, దుర్గమ్మలను జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, ఎన్హెచ్ఏఐ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని రహదారిపై ఉన్న కారును క్రేను సహాయంతో తొలగించి, మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాదంలో తమ గ్రామస్తులు మృతి చెందడంతో గాంధారి జెడ్పీటీసీ తానాజీ, ప్రజాప్రతినిధులు ఆర్మూర్, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలి వచ్చారు. నిద్రమత్తులో అజాగ్రత్తగా కారు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. -
ఆలూరు బాధితులను ఆదుకుంటాం
-
శిలాఫలకం ధ్వంసం
ఆర్మూర్ : మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ నిర్వహించి ప్రారంభించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియిని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్పందించి భద్ర పరచాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆర్మూర్ పట్టణాభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి రూ.6 కోట్లు కేటాయించడంతో ఈ నెల 6న మంత్రితో శంకుస్థాపన నిర్వహించేందుకు మినీ స్టేడియంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేల సమక్షంలో భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమం నిర్వహించి 20 రోజులు కూడా గడవకముందే శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న రేకులను తొలగించి దిమ్మ వెనుక భాగంలో పడేశారు. శంకుస్థాపన నిర్వహించేంత వరకు ఈ శిలాఫలకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మున్సిపల్ పాలకవర్గంలోని పలువురు కౌన్సిలర్లు తమ భర్త పేరును, తండ్రి పేరును, అన్న, కొడుకు పేర్లను సైతం కౌన్సిలర్ల పేర్లతోపాటు ముద్రించుకుని పలువురి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కార్యక్రమం ముగియగానే ఈ శిలాఫలకాన్ని పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. దీంతో మినీ స్టేడియంలో పడేశారు. -
తెలంగాణను నెంబర్ వన్గా నిలిపాం
-
ప్రమాద ఘంటికలు!
నిజామాబాద్ : గణనీయంగా పెరిగిన భూగర్భ నీటిమట్టం తగ్గుదల షురువైంది. ఆయా ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో నీటి వినియోగం పెరగడంతో భూగర్భ నీటి మట్టం పడిపోవడం ప్రారంభమైంది. గత నెల నవంబర్తో పోల్చితే కొన్ని మండలాల్లోనైతే తీవ్ర స్థాయిలో పడిపోవడం మళ్లీ ఆందోళనకు దారితీస్తోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పాతాల గంగ పైపైకి వచ్చింది. అంతకు ముందు రెండేళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు 2016 సీజనులో కురిసిన వర్షాలకు భారీగా పెరిగాయి. ఏకంగా జిల్లా సగటున 7.10 మీటర్లకు పెరిగింది. గత నెలాఖరు (2016 డిసెంబర్) వరకు జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా నిజామాబాద్ డివిజన్లో 4.64 మీటర్లు ఉన్నాయి. ఆర్మూర్లో 6.57 మీటర్లు, బోధన్లో 10.95 మీటర్ల మేరకు నీటి మట్టం ఉంది. అంటే సగటున 7.10 మీటర్లకు పెరిగాయి. 2015 డిసెంబర్ జిల్లా సగటు 21.23 మీటర్లు ఉంది. అంటే 14.13 మీటర్లు పెరిగాయి. తాజాగా జిల్లాలో బోర్లు, బావుల్లో నీటి వినియోగం పెరిగింది. దీంతో పెరిగిన భూగర్భ జలాల మట్టం పడిపోవడం ప్రారంభమైంది. నిజామాబాద్ మండలం ముప్కాల్లో 2016 నవంబర్లో 9.88 మీటర్ల మేరకు నీటిమట్టం ఉండగా, డిసెంబర్ 31 నాటికి 11.40 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. అంటే ఒక్క నెలలోనే ఒకటిన్నర మీటర్లు పడిపోవడం గమనార్హం. అలాగే జక్రాన్పల్లి, వేల్పూర్, బోధన్, రెంజల్లలోనూ 1.5 మీటర్లకు పైగా పడిపోయాయి. భూగర్భ జల శాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 85 చోట్ల ఫీజో మీటర్లు ఏర్పాటు చేసి.. భూగర్భ జల మట్టాన్ని లెక్కిస్తోంది. వీటిలో ఐదు చోట్ల టెలీమీటర్లున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ టెలీ మీటర్లు ఉపగ్రహంతో అనుసంధానమై ఉంటాయి. ఎప్పటికప్పుడు భూగర్భ జలమట్టాన్ని కొలిచే ఈ టెలీమీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇలా జిల్లాలో ఐదు చోట్ల టెలీమీటర్లు పనిచేస్తున్నాయి. ఇప్పటికీ ప్రమాద ఘంటికలే.. జిల్లాలో మొత్తం 29 మండలాలు కాగా, ఎనిమిది మండలాల్లో భూగర్భ నీటిమట్టం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ఎనిమిది మండలాల్లో జిల్లా సగటు నీటి మట్టం కంటే భారీగా పడిపోయింది. జిల్లా సగటు 7.10 మీటర్లు కాగా, ఈ ఎనిమిది మండలాల్లో పది మీటర్లకు పైగా లోతుకు పడిపోయాయి. మండలాలవారీగా పరిశీలిస్తే.. మాక్లూర్ మండలంలో 10.8 మీటర్లు, కోటగిరిలో 15.60 మీటర్లు, ఎడపల్లిలో 14.20 మీటర్లు, రెంజల్లో 12.03 మీటర్లు, రుద్రూర్లో 14 మీటర్లు, మోర్తాడ్లో 12.82 మీటర్లు, వేల్పూర్లో 10.50 మీటర్లు, ముప్కాల్లో 11.40 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఎనిమిది మండలాల్లో.. భూగర్భ జల శాఖ అధికారులు మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల కింద కూడా నీటిమట్టాన్ని ప్రత్యేకంగా లెక్కిస్తున్నారు. ఈ పనులు చేపట్టిన చెరువుల కింద భూగర్భ జలాలు పెద్దగా పెరిగిన దాఖాలేవీ కనిపించడం లేదు. మిషన్ కాకతీయ ఫేజ్–1, ఫేజ్–2 కింద పనులు చేసిన మొత్తం తొమ్మిది చెరువుల కింద నీటి మట్టం వివరాలు అధికారులు సేకరించారు. రెండు నెలల క్రితం 2016 నవంబర్లో లెక్కించిన వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్ మండలం చేపూర్ చెరువులో మిషన్ కాకతీయ మొదటి విడత కింద పనులు చేపట్టారు. ఈ చెరువు కింద (టీఐఎన్) నీటి మట్టం 5.29 మీటర్లు ఉండగా.. ఇదే గ్రామంలో చెరువు ప్రభావం ఉండని ప్రాంతంలో(ఎన్ఐజెడ్)లో 5.96 మీటర్లు ఉంది. అంటే ఈ చెరువు పనులు చేసినా ఒక్క మీటరు కూడా నీటి మట్టం పెరగలేదని భూగర్భ జలశాఖ నివేదికలే చెబుతున్నాయి. నామమాత్రంగా 0.67 మీటర్లు మాత్రమే పెరిగాయి. మోర్తాడ్ మండలం దొన్కల్ పెద్ద చెరువు కూడా మొదటి విడతలో పనులు చేశారు. ఈ చెరువు కింద నీటిమట్టాన్ని పరిశీలిస్తే.. ఈ చెరువు కింద ఉన్న ప్రాంతం (టీఐఎన్)లో 10.09 మీటర్ల లోతులో భూగర్భ నీటి మట్టం ఉంది. ఇదే గ్రామ శివారులో ఈ చెరువు ప్రభావితం లేని ప్రాంతంలో మాత్రం 9.76 మీటర్ల లోతులో నీటి మట్టం ఉందని భూగర్భ జలశాఖే నిర్దారించింది. అంటే ఈ చెరువు కింద ఉన్న ప్రాంతం కంటే ఈ చెరువు ప్రభావం లేని ప్రాంతంలో నీటి మట్టం పైపైకి రావడం గమనార్హం. ఈ రెండు ఉదాహరణలు చాలు జిల్లాలో మిషన్కాకతీయ పథకం ఏ మేరకు ఫలితాలనిచ్చిందో చెప్పడానికి.. -
జ్ఞాపకాలు–2016
నిజామాబాద్ అర్బన్ : ఇందూరుకు 2016 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. జిల్లాల పునర్విభజన, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు వంటి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.టనాలుగేళ్ల తర్వాత విస్తారంగా వర్షాలు కురియడంతో జిల్లా తడిసి ముద్దయింది. ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలుగా మారాయి. ఆర్మూర్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ►వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో ఆమె బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించారు. ►ఏప్రిల్ 29న మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ప్రశాంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ►మే 25న కామారెడ్డి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదం నింపింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ►మే 26న ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభకు ఎంపికయ్యారు. ►సీఎం కేసీఆర్ ఈ సంవత్సరం రెండు సార్లు జిల్లాలో పర్యటించారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో నిజామాబాద్, బాన్సువాడలలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు 28న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేమలు ప్రశాంత్రెడ్డి తండ్రి సురేందర్రెడ్డి మృతి చెందడంతో సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన చోటు చేసుకుంది. ►ఇందూరు జిల్లాకు సంబంధించి గతేడాదిలో చోటు చేసుకున్న పరిణామాల్లో కీలకమైనది జిల్లాల పునర్వ్యవస్థీకరణ. 36 మండలాలతో దశాబ్దాలుగా కొనసాగిన నిజామాబాద్ జిల్లా రెండుగా విడిపోయింది. దసరా రోజున కామారెడ్డి జిల్లా పురుడు పోసుకుంది. అదే రోజు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటయ్యాయి. ►జిల్లాలో మరో కీలక పరిణామం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు. జిల్లాలోని అన్ని ఠాణాలను కలిపి కమిషనరేట్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి పోలీస్ కమిషనర్గా కార్తికేయ బాధ్యతలు స్వీకరించారు. ►నవంబర్ 8న ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రకటన ప్రభావంతో ఇందూరు ప్రజా బ్యాంకుల ముందు బారులు తీరింది. కొత్త నోట్లు రాక, నగదు చేతిలో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటీఎంలు తెరుచుకోలేదు. డబ్బు దొరకక ప్రజలు ఆందోళనకు దిగారు. టనవంబర్ 12, 13 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరుగడంతో నిరుద్యోగుల్లో సంతోషం వెలిసింది. -
‘హలో వన్ సీ ఉంది.. పర్సంటేజ్ ఎంత?’
-
‘హలో వన్ సీ ఉంది.. పర్సంటేజ్ ఎంత?’
రూ. 2 వేల నోట్లు ఇస్తారా లేక రూ.100 నోట్లా.. ఆర్మూర్లో జోరుగా కమీషన్ వ్యాపారం ఆర్మూర్అర్బన్: ‘‘హలో నా పార్టీ దగ్గర వన్ సీ (రూ.కోటి) బ్లాక్మనీ ఉంది.. వైట్ చేయడానికి ఎంత పర్సంటేజ్ తీసుకుంటావు. నాకు ఎంత కమీషన్ ఇస్తావు..? నాతో కలుపుకొని ఇంకా ముగ్గురం ఉన్నాం. అందరం సంతృప్తి అయ్యేలా సెటిల్ చేయ్’’ ఇదీ ప్రస్తుతం కొద్ది రోజులుగా పెద్ద నోట్లపై నడుస్తున్న పర్సంటేజీల దందా. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టడానికి ఈ నెల 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసేంద. దీంతో ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు ఆర్మూర్ ప్రాంతంలో పర్సంటేజీల దందాకు తెర లేపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాగే బ్లాక్మనీని వైట్ చేయడానికి బ్రోకర్ల అవతారమెత్తారు. ఎవరినీ చూసిన ఫోన్ పట్టుకుని గంటల తరబడి ఇవే లావాదేవీల గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రూ.లక్ష బ్లాక్ మనీని వైట్ చైయడానికి బ్రోకర్లు 20-30 శాతం వరకు ఆశిస్తున్నట్లు సమాచారం. అంటే రూ.లక్ష వైట్ కావాలంటే రూ.80 వేలు మిగులుతారుు. అరుుతే, ప్రభుత్వం కొన్నింటికి మినహారుుంపు ఇవ్వడంతో లావాదేవీలు ఫోన్ల వరకే పరిమితమయ్యాయని, ఎక్కడా సెటిల్మెంట్ జరగలేదని చెబుతున్నారు. ఈ గడువు గురువారం ముగియడంతో ఇక నల్లధనం పెద్ద మొత్తంలో బయటకు వస్తుందంటున్నారు. పెరిగిన బంగారం ధర.. పెద్ద నోట్లు రద్దు కావడంతో పేరుకుపోరుున నల్లధనాన్ని మార్చుకోవడానికి బడా వ్యాపారులు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. ఎక్కువ ధర పెట్టిన బంగారం కొంటుండడంతో దాని ధర పెరిగిపోరుుంది. నోట్ల రద్దుతో భవిష్యత్తులో స్థిరాస్తుల విలువ పడిపోయే అవకాశం ఉందని కొందరు తమ ఇళ్ల స్థలాలు ఇప్పుడున్న ధరలకు విక్రరుుస్తున్నట్లు సమాచారం. నల్లధనం ఉన్న కొంత మంది పెద్ద మనుషులు స్థలాలను కొనుగోలు చేస్తూ స్థిరాస్తులుగా మార్చుకుంటున్నారు. స్థిరాస్తుల వ్యాపారంలో లావాదేవీలు జరిగిన పెద్ద నోట్లను చివరకు కొంత మంది జీరో అకౌంట్లలో పరిమితి వరకు జమ చేస్తున్నట్లు సమాచారం. జమ చేసే సమయంలో ఆరు నుంచి 12 నెలల వరకు వడ్డీ లేకుండా డబ్బులను వాడుకోవచ్చని ఎర వేస్తున్నట్లు తెలిసింది. కరెన్సీ మార్పిడి కోసం బ్యాంకు ఎదుట ఆందోళన రుద్రూర్ : రద్దరుున నోట్ల మార్పిడికి గురువారం చివరి రోజు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బ్యాంకులకు పోటెత్తారు. దీంతో బ్యాంకులన్నీ కిటకిటలాడారుు. అరుుతే, రుద్రూర్ సిండికేట్ బ్యాంకులో డబ్బు ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. చివరి రోజు కావడంతో ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకుకు వచ్చారు. అరుుతే, బ్యాంకర్లు గంటలోపే విత్ డ్రాలను నిలిపివేయడంతో ఖాతాదారులు అసహనానికి గురయ్యారు. కరెన్సీ మార్పిడి చేసివ్వాలని ఆందోళన చేపట్టారు. సమాచారమందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఖాతాదారులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దారు. -
పాలపొంగును చల్లార్చుతారా!
ఆర్మూర్: ‘‘ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను చంద్రబాబే ప్రవేశ పెట్టారు. ఉద్యోగ భద్రత లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాం ట్రాక్టు ఉద్యోగి అన్న పదమే ఉండదు. అందరి నీ పర్మినెంట్ చేసేస్తాం’’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులలో, శాసనసభ ఎన్నికల సందర్భం గా ప్రతీ బహిరంగ సభలో కేసీఆర్ చెప్పిన మా టలు ఇవి. ఏ ప్రసంగంలోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అంటూ ప్రస్తావించలేదు. దీంతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయన్న ఆశతో ప్రతీ కాంట్రాక్టు ఉద్యోగి కుటుం బం ఆ పార్టీకే ఓటు వేసింది. సోమవారం అ సెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యా ఖ్యలు తెలంగాణ పది జిల్లాలలో ఉన్న కాంట్రా క్టు ఉద్యోగుల గుండెలలో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రెండు రోజులు మౌనంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులంతా తాము మోసపోయామని నిర్ధారణకు వచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వా నికి వ్యతి రేకంగా ఉద్యమ బాట పట్టడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తెలంగాణ సర్వశిక్ష అభియాన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులు గురువారం ఎంఈ ఓ కార్యాలయాలకు తాళాలు వేసి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ పరిస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టుల పరిధిలో వేల సంఖ్యలో ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరి ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారు అన్న అంశంపై కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ మూడు రోజుల క్రితం వరకు స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. ముఖ్యమ ంత్రి ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రాజెక్టులలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాజీవ్ విద్యామిషన్, అం గ న్వాడీ, ఉపాధి హామీ పథకం, సాక్షరభారతి లాంటి పథకాలలో వేల సంఖ్యలో ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉపాధి హామీ ఉద్యోగులు, ఐకేపీ కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ మాట్లాడక పోవడంతో వారు ఇక తమ ఉద్యోగాలు పర్మినెంట్ అయినట్లేనంటూ ఆశావహ దృక్పథంతో ఉన్నారు. అప్పుడు అలా చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే ‘కేజీ టు పీజీ’ ఉచిత నిర్బంధ విధ్యను అమలు చేయాలన్నదే తన ప్రధాన సంకల్పమని కేసీఆర్ ఇప్పటికే పలు మార్లు ప్రకటించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా ఆర్వీఎం పరిధిలో బాధ్యతలు నిర్వహించే సుమారు 650 మంది కాంట్రాక్టు ఉద్యోగులది కీలక పాత్ర. ఈ పథకంలో 42 మంది ఇన్క్లూసివ్ ఎడ్యూకేషన్ రిసోర్స్ టీచర్స్ (ఐఈఆర్ఎటీ), 232 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్పీ), 36 ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డివిజనల్ లెవల్ మానిటరింగ్ టీం, 36 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఆడిటర్లు, 36 మంది మెసెంజర్లు, 239 మంది కస్తూర్బా బాలికల పాఠశాలలలో (కేజీబీవీ) కాంట్రాక్టు రిసోర్స్ టీచర్స్, ఆడిటర్లుగా పని చేస్తున్నారు. ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు సుమారు మూడు వేల మందికి పైగా ఉన్నారు. సాక్షరభారతిలో వందల సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులలో కార్యాచరణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ఇక తమ ఉద్యోగాలు పర్మినెంట్ కావనే భావనతో తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ‘చలో హైదరాబాద్’ పేరిట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంగన్వాడీ సిబ్బంది సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజులలో కార్యాచరణ రూపొందించుకుంటామని యూనియన్ నాయకులు తెలిపారు. -
ప్రాచీన కట్టడాలను పరిశీలించిన సినీ సమీక్షకులు రంగారావు
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో ఉన్న ప్రాచీన కట్టడాల చరి త్రను పరిశీలించి వివరాలు సేకరించడంలో భాగంగా భారతీయ సినీ, లలిత, సంగీత సుప్రసిద్ధ సమీక్షకులు చైన్నైవాసి వీఏకే రంగారావు సోమవారం ఆర్మూర్ పట్టణాన్ని సందర్శించారు. సిద్దుల గుట్ట చరిత్రను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ లో ఉన్న నవలా రచయిత డాక్టర్ నందిని రామరాజు దంపతుల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ కట్టడాలను సందర్శించి వాటి చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా కోట, బాల్కొండ కోట, దోమకొండ కోటలతో పాటు చారిత్రక కట్టడాల గురించిన సమాచారాన్ని సేకరించామన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కోట, కుంటాల, పొచ్చెర జలపాతాలను సందర్శించామన్నారు. అనంతరం నందిని రామరాజు దంపతులు, జిల్లా క్లాసిక్ సినిమా, కల్చరల్ సొసైటీ ప్రతినిధులు మేక రామస్వామి, వీపీ చందన్ రావు, చిటిమల విద్యాసాగర్ ఆయనను ఘనంగా సన్మానించారు. -
ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తేయాలి
ఆర్మూర్ : టీడీపీ శాసనసభ్యులపై వెంటనే స స్పెన్షన్ ఎత్తివేయాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. ఆమె సోమవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఓ వైపు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వాస్తవ పరిస్థితులతో పాటు సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో టీడీపీ ప్రశ్నిస్తోందని, దీంతో సభలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో వృద్ధులు, వికలాంగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. అధికారంలోకి రాగానే ‘మన ఊరు మన ప్రణాళిక’ పేరుతో సమస్యలు తెలుసుకున్నారని, వాటి పరిష్కారానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించామని అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీకి రూ. 20 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలోనూ రూ. 20 కోట్లే కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్, సరఫరాపై శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు నిజానిజాలు తెలియజేశారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ కోతలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రజలకు స్పష్టతనివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యత్వం.. అన్నపూర్ణమ్మ ఆన్లైన్ పద్ధతిలో టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల సుధాకర్, కౌన్సిలర్ జీవీ నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు కిషోర్రెడ్డి, నాయకులు జితేందర్రెడ్డి, గుండెం రమేశ్, పసుపుల రవి పాల్గొన్నారు. -
కిక్ బాక్సర్కు సర్కారు అండ
ఆర్మూర్ : పేదరికాన్ని జయించి జాతీయ స్థాయి క్రీడాకారునిగా ఎదిగి.. పాముకాటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కిక్ బాక్సర్ కుమ్మరి దిలీప్ను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. మెరుగైన వైద్య సేవలందించడానికి తక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 4 లక్షలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సోమవారం ‘సాక్షి’తో తెలిపారు. అవసరాన్ని బట్టి అతడి చికిత్స కోసం మరింత మొత్తాన్ని సైతం మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దిలీప్ కిక్ బాక్సింగ్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు. ప్రస్తుతం ఆర్మూర్ పట్టణంలోని నరేంద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఈ నెల 2న తన గ్రామంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి పాము కాటుకు గురయ్యాడు. విషం శరీరమంతా వ్యాపించడంతో ప్రాణాపాయ స్థితికి చేరాడు. చావు బతుకుల మధ్య ఉన్న తమ కుమారుడిని బతికించుకోవడానికి సునీత, విజయ్ దంపతులు అప్పులు చేసి సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రీడాకారుడి దీన స్థితిని తెలుపుతూ ‘చావు బతుకుల్లో కిక్ బాక్సర్’ శీర్షికతో ‘సాక్షి’ ఈ నెల 12వ తేదీన మానవీయ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని చూసి తక్షణమే స్పందించిన ఇజ్రాయిల్ దేశంలోని ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి చేతుల మీదుగా బాధితుని కుటుంబానికి అందించారు. దిలీప్ను జీవన్రెడ్డి పరామర్శించి, మేమున్నామన్నా భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు డబ్బులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి దిలీప్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి పట్టుదలతో జాతీయ స్థాయి కిక్ బాక్సర్గా ఎదిగిన దిలీప్ను ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు. చికిత్స నిమిత్తం తక్షణ సహాయం కింద రూ. 4 లక్షలు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్ష రూపాయలలోపే ఆర్థిక సహాయం అందించవచ్చు. అయితే గ్రామీణ క్రీడాకారుడిని బతికించుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రూ. 4 లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరకు సంబంధించిన జీఓను సోమవారం రాత్రి ఆస్పత్రిలో అందించామన్నారు. దిలీప్ తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
నిజామాబాద్ : ఆర్మూర్ బిల్దియాలో కలకలం సృష్టించిన కౌన్సిలర్ శంకర్ కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. విశాఖలో నిన్న కౌన్సిలర్తో పాటు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు బట్టు శంకర్, వందన లక్ష్మినారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి శంకర్ను కాంగ్రెస్కు చెందిన నాయకులు ఆయుధాలతో బెదిరించి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్కు గురైన కౌన్సిలర్ భార్య స్వప్న ఫిర్యాదు మేరకు ఆరుగురు కాంగ్రెస్ నాయకులు, మాజీ మావోయిస్టులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కిడ్నాప్కు గురైన కౌన్సిలర్తో పాటు కాంగ్రెస్ నాయకులను వైజాగ్లో గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సెల్ఫోన్ నెట్వర్క్, సిగ్నల్స్ ఆధారంగా శంకర్ను ఎక్కడకి తీసుకెళ్లారనేది గుర్తించారు. వారిని పోలీసులు నిజామాబాద్ తరలించారు. -
ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. తుమ్మల రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. యూఏఈకి చెందిన ఓ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని జీవన్ రెడ్డి ఎగవేసినట్లు, అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్మూరు ప్రజల్ని జీవన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రమేష్ రెడ్డి ఫేస్ బుక్లో కథనాలు పోస్ట్ చేశాడు. దీంతో తన పరువుకు నష్టం కలిగేలా రమేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రేసు గుర్రాలకు రేటు!
ఆర్మూర్, న్యూస్లైన్: నిజామాబాద్ మేయర్, ఆర్మూర్, కా మారెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ల ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వ హించనున్నారు. అధికారం ఆశిస్తున్నవారికి ఇదే వరంగా మారింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు వారు పడరాని పాట్లు పడుతున్నారు. మున్సిపల్, పరిషత్, సార్వత్రి క ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడిన నాటినుంచి రా ష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాజకీయ నాయకులు ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా జిల్లాలోని ఎన్నికల అధికారులు గట్టి చర్యలే చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం నిలువలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. కానీ, పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలను ప్రకటించిన అనంతరం ప్రజా ప్రతినిధులను శిబిరాలకు తరలించడమే కాకుండా, లక్షలు పోసి కొనుగోలు చేస్తున్న విషయా న్ని మాత్రం ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేద నే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ఓటర్లను రూ. 500తోనో, రూ. వెయ్యితోనో, మద్యంతోనో ప్రలోభాలకు గురి చేస్తేనే తప్పని భావించిన ఎన్నికల కమిషన్ లక్షల రూపాయలు వెచ్చించి క్యాంపులలో ప్రజా ప్రతినిధులకు మద్యం, విందులు ఏర్పాటు చేస్తున్న విషయాలను మాత్రం విస్మరిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఇదీ పరిస్థితి నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల ఫలితాల అనంతరం మేయ ర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ స్థానాలను ఆశిస్తున్నవారు క్యాంపులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 36 మండలాలలో 583 ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీల ఫలితాల అనంతరం విజేతలను ప్రకటించడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోసం క్యాంపు రాజకీయాలను ప్రారంభించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కాపలా కాస్తున్నారు. అందుకు విందులు, వినోదాల రూపంలో లక్షలు ఖర్చు చేస్తున్నారు. మరి కొందరు ప్రజా ప్రతినిధులను విహార యాత్రలకు పంపిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉంది. స్పష్టమైన మెజారిటీ సాధించిన ప్రదేశాలలో మినహాయిస్తే హంగ్ ఏర్పడిన స్థానంలోనే అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నవారికి ఖర్చు ఎక్కువ అవుతోందని ఆయా పార్టీల నాయకులే స్వయంగా చెప్పుకుంటున్నారు. సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లకు సైతం లక్షల్లో ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం కోసం సుమారు రూ. రెండు కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. దీంతో ఆర్థిక స్థోమత లేని కొందరు నాయకులు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా, దీనిని నియంత్రించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్గాని, జిల్లా ఎన్నికల అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
నేడే మున్సిపోల్స్ ఫలితాలు
ఆర్మూర్, న్యూస్లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఆర్మూర్లో జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. మున్సి‘పోల్స్’ అనంతరం 43 రోజుల తర్వాత సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న కౌంటింగ్లో అభ్యర్థుల గెలుపు ఓటములు తేలనున్నాయి. దీనిపై పలువురు జూదం కాస్తున్నారు. రాజకీయ నాయకులు, పట్టణంలోని వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, యువకులు బెట్టింగ్లో పాలు పంచుకుంటున్నారు. పట్టణంలోని ప్రధాన వీధులైన కొత్తబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, గోల్బంగ్లాల వద్ద గల అడ్డాలలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్లా చైన్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వారి మిత్రులు, ఎవరైనా తనతో బెట్టింగ్ కాస్తే ఒకటికి మూడు ఇస్తానంటూ ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో పలువురు బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఓడిపోతే చిన్న మొత్తమే పోతుంది.. గెలిస్తే మూడు రెట్ల డబ్బు వస్తుందనే ఆశతో బెట్టింగ్లో పాల్గొంటున్నారు. మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో బెట్టింగ్ ఆయా పార్టీల అభ్యర్థులపైనే కాస్తున్నారు. చైర్పర్సన్ పీఠం సైతం ఈ రెండు పార్టీలకు సంబంధించిన వారిలో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే వారే కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలలో చైర్పర్సన్ అభ్యర్థులపైనే ప్రధానంగా బెట్టింగ్కు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికల గెలుపు ఓటములపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. -
ప్రజలు మోడీ పాలనను కోరుకుంటున్నారు
ఆర్మూర్ టౌన్, న్యూస్లైన్: దేశాన్ని పాలించే శక్తి, యుక్తి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకే ఉన్నాయని విశ్వసిస్తూ, ఆయన పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని బీజేపీ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ లోక భూపతి రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్స్తో పోల్చుతూ మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని అన్నారు. రాబోయే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్గా భావిస్తున్నట్లు, ఈ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుంభ కోణాలతో పాటు నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం సడలిందన్నారు. సామాన్యుడి బతుకును దుర్భరం చేసిన కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించడం లేదని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. 2014 ఎన్నికలు దేశ, బీజేపీ భవిష్యత్తును తీర్చిదిద్దేవని అభివర్ణించారు. దిగ్విజయ్ ప్రకటనపై అనుమానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ అదేశాల మేరకు వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోందని భూపతి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు, విభజన బిల్లు ఆమోదం పొందాలన్నారు. అంతకు ముందు పార్టీ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్గా నూతనంగా నియమితులైన భూపతి రెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో సత్కరించారు. మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా భూపతిరెడ్డి పేర్కొన్నారు. -
కుదేలైన.. రియల్ ఎస్టేట్ రంగం
బాన్సువాడ/ కామారెడ్డి, న్యూస్లైన్: నెల రోజుల క్రితం వరకు బంగారం ధర రూ.26 వేల నుంచి రూ. 28 వేల వరకే ఉండడంతో చాలా మంది బంగారంపైనే పెట్టుబడి పెట్టారు. దీని ప్రభావం భూములు, ప్లాట్ల కొనుగోళ్లపై పడింది. జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూ ర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పతనావస్థలో ఉంది. ప్లాట్లను విక్రయిద్దామంటే కొనుగోలు చేసే వారే లే రు. జిల్లా కేంద్రంలో ప్రతి రోజూ వందకు పైగా రిజి స్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు సగానికి పడిపోయాయి. బాన్సువాడలో రోజూ 10 నుంచి 20 రిజిస్ట్రేషన్లు జరగగా, ఇప్పుడు 3, 4 రిజిస్ట్రేషన్లకు మించి జరగడం లేదు. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జోరుగా సాగిన సమయంలో వ్యాపారులకు పెట్టుబడులు ఏడాది లోపే రెట్టింపు అయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అందరి దృష్టి ఈ రంగంపై పడింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం ఒకే సారి 10, 12 ప్లాట్లను కొనుగోలు చేయడం, 5 నుంచి 10 ఎకరాల వెంచర్లలో భాగస్వాములు కావడం జరిగింది. సుమా రు ఆరు నెలల క్రితం వరకు ప్లాట్ల కొనుగోళ్లు బాగానే సాగాయి. పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరానికి రూ. 50 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ధర పలికాయి. బాన్సువాడ సమీపంలోనే ఎకరానికి రూ.కోటి చొప్పున పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చారు. వీరితో పాటు మరో ఇద్దరు, ముగ్గురు రియల్టర్లు వెంచర్లను ప్రారంభించారు. దీంతో ప్లాట్ల విక్రయం సందర్భం గా పోటీ పెరిగింది. దీని ప్రభావం ప్లాట్లపై పడింది. రూ. 5వేలకు గజం అమ్మాలని భావించిన రియల్టర్లు ప్రస్తుతం రూ. 3వేలకు అమ్మడానికి సిద్ధమయ్యారంటే పరిస్థితి ఎలా తారుమారయ్యిందో తెలుస్తోంది. ఈ ధరలకు సైతం ప్లాట్లను కొనుగోలు చేసే వారు కరువయ్యారు. బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఆరు నెలల క్రితం రూ. 8 వేల నుంచి రూ. 9 వేలకు గజం ప్లాట్ ధర ఉండగా, వాటినే ఇప్పుడు రూ. 6 వే ల నుంచి రూ. 7వేలకు అమ్మడానికి సిద్ధమవుతున్నా రు. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ ప్రాం తంలో రూ.8 వేలకు గజం స్థలం లభించగా, నేడు రూ. 5వేలకు అమ్మడానికి సిద్ధమైనా కొనుగోలు చేసే వారు లేరని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘న్యూస్లైన్’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడంతో రియల్టర్లు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలకు చెల్లించలేక అవస్థలు పడు తున్నారు. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డిలో రియల్ దందా ఆర్నెళ్ల క్రితం జోరుగా సాగింది. పట్టణంలోని ప్రధాన కాలనీల్లో గజానికి రూ.10 వేలు పెట్టినా ప్లాట్లు దొరక లేదు. పట్టణానికి రెండు,మూడు కిలోమీటర్ల దూరాన గజం రూ.3 వేల నుం చి రూ. 5 వేలు అమ్మారు. ప్లాట్ల వ్యాపారం జోరుగా సాగడంతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. అయితే భూముల ధరలు భారీగా పెరగడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. కొనుగోలు చేసేవారు వెనుకడుగు వేస్తుండడంతో భూములపై పెట్టుబడులు పెట్టి న వారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అప్పు లు తెచ్చి పెట్టిన పెట్టుబడులు ఆగిపోవడంతో వాటిని సర్దుబాటు చేయలేక, భూమిని అమ్ముకోలేక తలలు పట్టుకుంటున్నారు. వ్యాపార అవసరాల కోసం ఫైనాన్సుల నుంచి, వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి డబ్బును అప్పుగా తీసుకుని దందా చేసేవారు ఎప్పటిలాగే అప్పు అడిగితే ‘అయ్యో ఫైనాన్సులో పదివేలు కూడా నిల్వలేవు’ అనే సమాధానం వస్తున్నట్టు పలువురు తెలిపారు. అప్పులు తెచ్చి భూములు కొనుగోలు చేసి న వారంతా భూమి అమ్ముడుపోక, అప్పులకు వడ్డీలు పెరుగుతుడడంతో లబోదిబోమంటున్నారు.