bail plea
-
‘మూడో వ్యక్తి కంప్లయింట్ చేస్తే కేసు పెడతారా?’
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు. ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణను వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా అప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది.ఇక.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది కోర్టు. మరోవైపు.. బాపట్ల కోర్టులో వర్రా రవీందర్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ‘ఏ కేసులో మిమ్మల్ని అరెస్టు చేశారో తెలుసా?’’ అని రవీందర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. అయితే.. కేసుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు తనకు ఇవ్వలేదని రవీందర్రెడ్డి చెప్పారు. దీంతో.. పోలీసులను న్యాయమూర్తి మందలించారు. అలాగే.. వర్రాకు వచ్చే నెల 13వ తేదీదాకా రిమాండ్ విధించారు. -
అరెస్టు కక్ష సాధింపే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
-
వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె నిన్ననే బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోరిన కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ ఉదయం పిటిషన్పై విచారణ కొనసాగగా.. షర్మిల కొట్టిందన్న వీడియోలను మాత్రమే పదే పదే చూపిస్తున్నారని, కానీ అంతకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది మాతంర చూపించడం లేదని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్టీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపు ఇచ్చారు. షర్మిలను పరామర్శించిన విజయమ్మ చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ షర్మిలను.. వైఎస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని విజయమ్మ నిలదీశారు. ‘‘పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా? ప్రజల కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ ఆశయ సాధన కోసమే షర్మిల పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలను ప్రశ్నించడమే మా తప్ప. ప్రశ్నించే వారిని ఇంకా ఎంతకాలం అణచివేస్తారు? అని విజయమ్మ పేర్కొన్నారు. ఇదీ చదవండి: నాకు స్వేచ్ఛ లేదా?.. వైఎస్ షర్మిల -
మనీశ్ సిసోడియాకు మళ్లీ షాక్.. కస్టడీ పొడిగింపు.. బెయిల్పై 12న విచారణ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 17వరకు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. సిసోడియా బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మరికొన్ని రోజులు కస్టడీలో ఉండటం అనివార్యమైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసునకున్నప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే నెల రోజులకుపైగా కస్టడీలోనే ఉండటంతో ఏప్రిల్ 12న బెయిల్పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. సిసోడియాపై మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆయన ఖాతాలోకి అక్రమంగా రాలేదని అతని తరఫు న్యాయవాది వాదించారు. ఇల్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారని, ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో దీనిపై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ.. -
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడు భాస్కర్కు చుక్కెదురు
సాక్షి, విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడు భాస్కర్కు చుక్కెదురైంది. భాస్కర్, ఆయన భార్య అపర్ణ బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. రెండు బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై ప్రత్యేక న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు పిటిషన్ను కోర్టు కొట్టివేయడం సంతోషకరమన్నారు. ‘‘గత ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో.. తినుకో స్కీములు ఎక్కువగా నడిచాయి. ప్రజాధనాన్ని దోచుకున్న వారు చట్టం నుండి తప్పించుకోలేరు. ఈ కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. భాస్కర్, అతని భార్య అరుణ ఉపాధ్యాయ తప్పిదాల్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని భావిస్తున్నాను. ఈ కేసును ఈడీ కూడా నిశితంగా పరిశీలిస్తుంది’’ అని పొన్నవోలు సుధాకర్ తెలిపారు. చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని -
మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పెటిషన్పై విచారణను మార్చి 10కి వాయిదా వేసింది న్యాయస్థానం. అలాగే సీబీఐ కస్టడీని మరో మూడు రోజులు(మార్చి 6వరకు) పొడిగించింది. సిసోడియాకు కోర్టు గతంలో విధించిన ఐదు రోజుల సీబీఐ కస్టడీ నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన్ను మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. విచారణకు మరింత సమయం కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మరోవైపు సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆప్ కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం ఎదట పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కట్టుదిట్టమైన భద్రత నడుమ సిసోడియాను కోర్టుకు తరలించారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పైనా కోర్టులో వాదనలు జరగనున్నాయి. తనను కస్టడీలో ఉంచితే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ కేసుకు సంబంధించి సీబీఐ అన్నింటినీ స్వాధీనం చేసుకుందని చెప్పారు. అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి విచారణకు హాజరవుతానని సిసోడియా పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను ఆదివారం 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత రోజు కోర్టులో ప్రవేశపట్టి ఐదు రోజులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం సిసోడియా డిప్యూటీ సీఎం, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. చదవండి: 48 గంటల్లోనే హైవే కింద సొరంగం.. ఇది కదా మనకు కావాల్సింది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. -
సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే!.. సుప్రీంలో యోగి సర్కార్
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ హింసకు కారకుడు, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశిష్ మిశ్రాకు బెయిల్ను వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అలహాబాద్ హైకోర్టు ఇదివరకే అశిష్ బెయిల్ను తిరస్కరించగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాడతను. అయితే.. గురువారం ఈ పిటిషన్లపై వాదన సందర్భంగా యోగి సర్కార్ తీవ్ర అభ్యంతరాలే బెంచ్ ముందు ఉంచింది. ఇది ఘోరమైన, క్రూరమైన నేరం. ఇలాంటి నేరానికి బెయిల్ ఇవ్వడం అంటే.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్(అదనపు) గరిమా ప్రసాద్.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అంతకు ముందు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గల కారణాలేంటనే అభ్యంతరాలను వెల్లడించించాలని యూపీ సర్కార్ను కోరింది బెంచ్. ‘‘అతను ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?’’ అని బెంచ్.. యూపీ సర్కార్కు ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్ తెలపగా, ఆవెంటనే బాధిత కుటుంబాల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే బెంచ్ ముందు తీవ్ర ఆరోపణలే చేశారు. ఇది కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిన హత్య. ఛార్జ్షీట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. సంఘంలో అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసు కోసం నియమించుకున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఒక భయంకర సందేశాన్ని పంపినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఈ తరుణంలో.. మిశ్రా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి.. దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని బెంచ్కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని ముకుల్ రోహత్గి కోర్టుకు అభ్యంతరాలను వెల్లడించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అక్టోబర్ 3వ తేదీ 2021లో.. టికునియా లఖింపూర్ ఖేరీ వద్ద అప్పటి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఓ ఎస్యూవీ.. నలుగురు రైతుల మీద నుంచి వెళ్లిందని, ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మరో వాహనం డ్రైవర్తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను దాడి చేసి చంపారని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ హింసలో ఓ జర్నలిస్ట్ కూడా మృత్యువాత పడ్డాడు. అశిశ్ మిశ్రాతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు యూపీ పోలీసులు. ఇంతకు ముందు అశిష్కు బెయిల్ దక్కినట్లే దక్కి.. మళ్లీ రద్దు అయ్యింది. గతేడాది డిసెంబర్ 12వ తేదీన సుప్రీంలో దాఖలైన బెయిల్ పిటిషన్పై యూపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. నిరసనలకారుల హింసకు సంబంధించిన అఫిడవిట్ను తమ ముందు ఉంచాలని యూపీ సర్కార్ను సుప్రీం బెంచ్ ఆదేశించింది. గురువారం జరిగిన వాదనల అనంతరం.. బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు ప్రకటించింది సుప్రీం బెంచ్. -
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు కోర్టులో మరోసారి చుక్కెదురు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. జైన్తో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్లకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్ను మే 30న అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన జూన్లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. ఇప్పుడు రెండో సారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ కేసులో విచారణకు జైన్ సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకుసాగకుండా తమను తప్పదోవ పట్టిస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో న్యాయస్థానం జైన్కు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. 2017 ఆగస్టు 24న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా జైన్ను ఈడీ అదికారులు మే 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. తిహాడ్ జైల్లో జైన్కు వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నాడనే ఆరోపణలతో ఆ జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
నా ఒకేఒక్క తప్పు.. మంత్రి కావడం!
ఢిల్లీ: మంత్రి కావడమే తాను చేసిన పెద్ద తప్పైపోయిందని, ఆ పదవే లేకుంటే తనపై ఆరోపణలు.. కేసు ఉండేవి కావని ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ అంటున్నారు. ఈ మేరకు మనీల్యాండరింగ్ కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన అభ్యర్థనలో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ ఎదుట సత్యేందర్ తరపున సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరణ్ శుక్రవారం వాదనలు వినిపించారు. విచారణ దశలో ఉండడంతో.. తొలి బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందని ఈ సందర్భంగా అడ్వొకేట్ హరిహరణ్ గుర్తు చేశారు. అయితే ఆరోపణల్లో పేర్కొన్నట్లు తన క్లయింట్ ఏ కంపెనీలోనూ డైరెక్టర్గా, షేర్హోల్డర్గా లేరనే విషయాన్ని ప్రస్తావించారు. మంత్రి పదవితో ప్రజా జీవితంలోకి రావడమే తన తప్పైందంటూ సత్యేందర్ తరపున ఆయన వాదించారు. ఒకవేళ పదవిలో లేకుంటే.. అసలు తనపై కేసే ఉండేది కాదని చెప్పారాయన. అంతేకాదు.. ఈడీ సమర్పించిన ఆధారాల్లో సదరు కంపెనీల్లో జైన్ వాటాలు కలిగి ఉన్నట్లు నిరూపితం కాలేదని హరిహరణ్ వాదించారు. ఇక సత్యేంద్ర జైన్ బెయిల్ అభ్యర్థన పిటిషన్పై నవంబర్ 5వ తేదీన ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి, ఈడీ వాదనలు విననున్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్(57) మే నెలలో అరెస్ట్ అయ్యారు. ఇదీ చదవండి: సత్యేందర్ జైన్ హవాలా లింకులపై ప్రాథమిక సాక్ష్యాలు: కోర్టు -
Varavara Rao: శాశ్వత బెయిల్పై సుప్రీంకు వరవరరావు
సాక్షి, న్యూఢిల్లీ: బీమా కోరేగావ్ కేసులో నిందితుడు వరవరరావు శాశ్వత బెయిల్ పిటిషన్పై ఈ నెల 11న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రస్తుతం మెడికల్ బెయిల్పై ఉన్న వరవరరావు.. శాశ్వత బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను ఏప్రిల్ 13న బాంబే హైకోర్టు తిరస్కరించింది. విచారణ సమయంలో.. హైదరాబాద్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలన్న పిటిషన్నూ తోసిపుచ్చింది. అయితే.. మూడు నెలల పాటు మెడికల్ బెయిల్ పొడిగించింది. ఈ తరుణంలో బాంబే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాల వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. -
డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ ఖాన్ దగ్గర డబ్బులు లేవు
ముంబై: నిషేధిత మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్కు బుధవారం కూడా బెయిల్ దొరకలేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రత్యేక కోర్టు అతడికి బెయిల్ నిరాకరించింది. తాజాగా ఈ రోజు కూడా బెయిల్ పిటిషన్పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఆర్యన్ ఖాన్ తరఫున లాయర్ అమిత్ దేశాయ్, ఆర్యన్కు వ్యతిరేకంగా అదనపు సొలిసిటరల్ జనరల్ అనిల్ సింగ్ పోటాపోటీగా వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అమిత్ దేశాయ్ గంటన్నర పాటు కోర్టులో వాదించారు. ‘డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ దగ్గర డబ్బులు లేవు. విక్రయించడానికి కానీ సేవించడానికి కానీ అతడి దగ్గర డ్రగ్స్ లేవు. అలాంటప్పుడు అతడిని ఎందుకు ఇందులో ఇరికించారు? బెయిల్ పిటిషన్కు ఎన్సీబీ ఇచ్చిన సమాధానంలో కొత్తదనం ఏమీ లేదు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే నా క్లయింట్స్ మాదకద్రవ్యాల విక్రేతలు కాదు. ఇప్పటికే వారు తగినంత బాధ అనుభవించార’ని అమిత్ దేశాయ్ పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ను వ్యతిరేకిస్తూ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. దేశం మొత్తం నిషేధిత మాదకద్రవ్యాల వాడకం గురించి ఆందోళన చెందుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తి సంబంధించిన విషయం కాదు. డ్రగ్స్ దందాను నడిపిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ఎన్సీబీ పనిచేస్తోంది. ఈ కేసులో నిందితులను విడుదల చేస్తే దర్యాప్తు కుంటుపడే అవకాశముంది. విదేశీయుడొకరితో వాణిజ్య పరిమాణంలో హార్డ్ డ్రగ్స్ గురించి ఆర్యన్ ఖాన్ చాట్ చేసినట్టు ఎన్సీబీ గుర్తించింది. ఈ సంభాషణలు ముంబై క్రూయిజ్ కేసుకు సంబంధించినవి కాదా అనేది గుర్తించాల్సి ఉంద’ని అనిల్ సింగ్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. బెయిల్ రాకపోవడంతో ఆర్యన్ ఖాన్ ఈరోజు కూడా జైలులో గడపాల్సి ఉంటుంది. కాగా, ఈనెల 2న అతడిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే శిక్ష ఎన్నేళ్లంటే..?) -
స్వేచ్ఛను పొందే హక్కు యువకులకి ఉంది: ఆర్యన్ ఖాన్ లాయర్
ముంబై డ్రగ్స్ బస్ట్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇప్పటి వరకు ఎన్సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్లో ఉంచాలని కోర్టు తెలిపింది. అయితే ఈ విచారణ సమయంలో యువకులు తమ స్వేచ్ఛను తిరిగి పొందేందుకు అర్హులని ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మానేషిండే మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. నటి రియా చక్రవర్తి ప్రమేయం ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సహా ఇతర కేసుల్లోని తీర్పులను చదివి వినిపించారు. తక్కువ చిన్న పరిమాణం కలిగి ఉన్న వ్యక్తులతో చట్టం వ్యవహరించే తీరును గమనించాలని కోరినప్పటికీ బెయిల్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ విచారణ ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ 51వ పుట్టిన రోజున జరగడం యాదృచ్ఛికం. కాగా ఈ సందర్భంగా ఈ స్టార్కిడ్కి బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చదవండి: కష్టాల్లో సల్మాన్ తోడుగా ఉంటాడన్న షారుక్.. పాత వీడియో వైరల్ -
కోర్టులో ఆర్యన్కు చుక్కెదురు: రెండవసారి కూడా బెయిల్ నిరాకరణ
ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ షాక్ మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతన్ని14 ఎన్సీబీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం కేసుని స్పెషల్ కోర్టుకు అప్పగించింది. అయితే శుక్రవారం కొనసాగిన విచారణలో ఆర్యన్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వచ్చే 3 నుంచి 5 రోజుల పాటు అతన్ని ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్లో ఉంచనున్నారు. అయితే ముంబై తీరంలో జరిగిన క్రూయిజ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని, గత వారం ఈ స్టార్ కిడ్తో కలిపి మొత్తం ఎనిమిదిని అరెస్టు చేసింది ఎన్సీబీ. గురువారం వరకూ ఎన్సీబీ ఆఫీస్లోనే ఉంచి విచారించగా, కోర్టు తీర్పుతో ఆర్థర్ రోడ్ జైలుకి తరలించనున్నారు. చదవండి: సోషల్ మీడియా ట్రెండిగ్లో #ReleaseAryanKhan -
వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ గడువు ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరవరరావు తన బెయిల్ను పొడగించాలని విజ్ఞప్తి చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు శుక్రవారం ఈ పిటిషన్ను విచారించింది. ఈ క్రమంలో వరవరరావు బెయిల్ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా వరవరరావు కోర్టు తనకు ఫిబ్రవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని.. ఫలితంగా తాను కుంటుంబానికి దూరంగా ఉంటున్నానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 84 ఏళ్ల వయసులో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్ట్ విధించిన ఏ ఒక్క షరతును తాను ఉల్లంగించలేదని వరవరరావు కోర్టుకు తెలిపారు. (చదవండి: ఒకరి భార్యకు ‘ఐ లవ్ యూ’ అని రాసి చిట్టి విసరడం నేరమే) ముంబై హాస్పిటల్స్లో చికిత్స చేయించుకోవాలంటే తన లాంటి వారికి చాలా కష్టం అవుతుందన్నారు. తన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే తన కుటుంబం దగ్గరికి వెల్లేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వరవరరావు వాదనలు విన్న కోర్టు ఈ నెల 25న ఆయనను సరెండర్ కావాలని ఆదేశించింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు గత 4 సంవత్సరాలుగా ముంబైలోనే ఉంటున్నారు. చదవండి: భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు! -
‘బిడ్డను కనాలనుకుంటున్నాను నా భర్తకు బెయిలివ్వండి’
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు ముందుకు ఓ వింత పిటిషన్ వచ్చింది. ‘‘బిడ్డను కనాలనుకుంటున్నాను.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి’’ అంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పైగా ఆమె భర్త జైల్లో ఉన్నది అత్యాచార ఆరోపణల మీద. భర్త ఇలాంటి పనులు చేసి జైలుకెళ్తే ఏ భార్య అయినా అతడి నుంచి విడిపోవాలని అనుకుంటుంది. కానీ నువ్వేంటి తల్లి.. ఏకంగా అతడితో బిడ్డను కనాలనుకుంటున్నావ్.. అసలు రాజ్యంగా ఖైదీలకు ఇలాంటి ఓ హక్కును కల్పించిందా అనే దాని గురించి పరిశోధించే పనిలో ఉన్నారు అధికారులు. ఆ వివారలు.. ఉత్తరాఖండ్కు చెందిన సచిన్ అనే వ్యక్తి, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు సచిన్తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇప్పటికి అతడు జైలుకెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది. పెళ్లైన మూడు నెలలకే భర్త జైలుకెళ్లాడని.. తమకు కలిసి ఉండే అవకాశమే లభించలేదని తెలిపింది సచిన్ భార్య. ‘‘మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. కనుక నా భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వండి’’ అంటూ సచిన్ భార్య హైకోర్టును ఆశ్రయించిది. తనకు మాతృత్వంలోని మాధుర్యం అనుభవించాలని ఉందని, ఇది భార్యగా తన హక్కు అని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని వేడుకుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల ధర్మాసనం ఈ పిటిషన్ని విచారించింది. గతంలో ఎన్నడూ ఇలాంటి వింత పిటిషన్ రాలేదని విచారణ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం పలు అనుమానాలను లేవనేత్తింది. ఈ క్రమంలో తమకు సలహా ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు వ్యక్తం చేసిన అనుమాలు ఇలా ఉన్నాయి.. ‘‘అత్యాచారం కేసులో దోషిగా నిరూపణై జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా?.. ఈమె ‘భార్యగా నా హక్కు’ అంటూ కోర్టుకెక్కింది. ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే వారికి కలిగే సంతానం కూడా వచ్చి ‘బిడ్డలుగా మా హక్కు’ అనే అవకాశం ఉంది కదా’’.. అని హైకోర్టు అభిప్రాయపడింది. పైగా తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమైన విషయం, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కనడం కోసమే నిందితుడికి బెయిల్ ఇవ్వడం సబబేనా అని కూడా ధర్మాసనం ఆలోచిస్తోందన్నారు. అలాగే తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని కోర్టు అభిప్రాయపడిది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగా తెలియడం లేదని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇలాంటి కేసులేమైనా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లో నమోదయ్యాయా.. ఒకవేళ నమోదైతే అక్కడి కోర్టులు ఎలాంటి తీర్పులిచ్చాయి.. అన్న వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలపాలని హైకోర్టు కోరింది. -
మాజీ ముఖ్యమంత్రికి మళ్లీ నిరాశ
రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే బెయిల్ కోసం రాష్ట్రపతికి ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 50 వేల పోస్టుకార్డులు రాసి ‘మానవత దృక్పథంతో నా తండ్రిని విడుదల చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. మళ్లీ రెండు నెలల వరకు లాలుకు బెయిల్ లభించే అవకాశం లేదు. దాణా కుంభకోణం కేసులో అరెస్టయిన లాలు ప్రసాద్ యాదవ్ 2017 డిసెంబర్ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శుక్రవారం ఆయన బెయిల్ పిటిషన్ రాగా హైకోర్టు నిరాకరించింది. రెండు నెలల తర్వాత బెయిల్ పిటిషన్ మళ్లీ వేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ఈ బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నా విడుదల చేసేందుకు న్యాయస్థానం అంగీకరించడం లేదు. అయితే లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న లాలును రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. కిడ్నీ 25 శాతం మాత్రమే పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానవతావాదంలో లాలును విడుదల చేయాలనే విజ్ఞప్తులు భారీగా వస్తున్నాయి. -
చిన్నమ్మకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. తనను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుని 2021 జనవరి చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత సహాయకురాలు శశికళ నటరాజన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు చిన్నమ్మగా సుపరిచితరాలు. మంచి ప్రవర్తనను చూపుతూ ఆమె బెంగళూరు జైలు నుంచి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, కోర్టు పిటిషన్ను తిరస్కరించటంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందస్తు విడుదలకు కోర్టు అంగీకరిస్తుందనే ఆశతో.. రూ.10 కోట్ల జరిమానాను చిన్నమ్మ వర్గీయులు కోర్టుకు డిపాజిట్ చేసినట్లు సమాచారం. -
సుప్రీం కోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్ విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వరవరరావు భార్య హేమలత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ని విచారించిన జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ముంబయి హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. వరవరరావుకు చికిత్స అందజేస్తున్న హాస్పిటల్లో సౌకర్యాలను కూడా ముంబై హై కోర్టే పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వరవరరావు బెయిల్ అప్పీల్ను సరైన సమయంలో విచారించాలని సుప్రీం కోర్టు, ముంబయి హైకోర్టుకు సూచించించింది. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్
బెంగళూరు: శాండల్వుడ్లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు శనివారం బెయిల్ మీద బయటకు వస్తామని భావిస్తుండగా.. వారి ఆశ కాస్త నిరాశ అయ్యింది. వీరికి సంబంధించిన బెయిల్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా అది కాస్తా సెప్టెంబర్ 21 కి వాయిదా పడింది. సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అధికారులు తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని కనుక బెయిల్ పిటిషన్ విచారణని వాయిదా వేయాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్) ప్రత్యేక కోర్టు రాగిణి, సంజనా బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే సోమవారానికి(సెప్టెంబర్ 21) వాయిదా వేసింది. రాగిణి, సంజనలు ఇద్దరికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని.. వారు పార్టీలలో మాదకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లకు, పెడ్లర్లకు మధ్య జరిగిన మెసేజ్లను కూడా రిమాండ్ కాపీలో పొందు పర్చారు అధికారులు. (చదవండి: డ్రగ్స్కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు?) డ్రగ్స్ రాకెట్ కేసుకు సంబంధించి సీసీబీ రాగిణి ద్వివేదిని సెప్టెంబర్ 4 న అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 8 న సంజన గల్రానిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పరపన అగ్రహార జైలులో ప్రత్యేక సెల్లో ఉన్నారు. శాండల్వుడ్ డ్రగ్ రాకెట్కు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల సెలబ్రిటీ జంట ఐంద్రితా రే, దిగంత్లను సీసీబీ విచారణకు పిలిచింది. ఒక రోజు ప్రశ్నించమే కాక వారి గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని తరువాత పంపించింది. ఈ రోజు నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు యువరాజ్లను సీసీబీ విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. -
‘ఏ కూతురు ఇలాంటి ఆరోపణలు చేయదు’
ముంబై: సభ్య సమాజం సిగ్గుపడాల్సిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త చదివితే ఇలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం కంటే అనాథలుగా బతకడం మేలనిపిస్తుంది. కుమార్తెలపై భర్త ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తండ్రి దారుణాల గురించి తల్లికి చెబితే.. ఆమె వారిన కొట్టి.. దీని గురించి ఎవరికి చెప్పవద్దని బెదిరించడం నిజంగా దారుణం. ఈ క్రమంలో కేసులో ప్రధాన నిందితురాలైన తల్లికి బాంబే కోర్టు బెయిల్ తిరస్కరించింది. జరిగిన దారుణం తమను తీవ్రంగా కలిచి వేసిందని.. నిజంగా ఇది ప్రకృతి విరుద్ధమైన ఘటన అని కోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన కాజీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలు.. హెడ్మాస్టర్గా పని చేస్తున్న నిందితుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 31న తన 20 ఏళ్ల పెద్ద కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో మిగతా ఇద్దరు కుమార్తెలు పెద్దగా ఏడుస్తూ గొడవ చేయడం ప్రారంభించారు. తల్లిందండ్రులు వారిని గదిలో వేసి దారుణంగా కొట్టారు. చివరకు ఎలాగో అలా తమ పరిస్థితి గురించి ఓ స్నేహితుడికి సమాచారం అందించారు. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు హెడ్మాస్టర్ ఇంటికి చేరుకోని బాధితులను విడిపించి కేసు నమోదు చేశారు. ఏళ్లుగా ఆ అమ్మాయిలు అనుభవించిన నరకం గురించి చెప్తుంటే పోలీసులకు కూడా కళ్లు చెమర్చాయి. (అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?) 2012 నుంచి తండ్రి తనపై అత్యాచారం చేయడం ప్రారంభించాడని పెద్ద కుమార్తె పోలీసులకు తెలిపింది. దీని గురించి తల్లికి చెబితే ఆమె తనను తీవ్రంగా కొట్టిందని వెల్లడించింది. అలానే తన 18 ఏళ్ల రెండో చెల్లిపై ఐదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి అఘాయిత్యం చేశాడని తెలిపింది. అప్పుడు కూడా ఆ మహాతల్లి తండ్రి దారుణాల గురించి ఎవరికి చెప్పవద్దని పిల్లలను బెదిరించడం గమనార్హం. రెండేళ్ల క్రితం తన మూడో సోదరిపై కూడా తండ్రి అత్యాచారం చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఏళ్లుగా తండ్రి చేతుల్లోనే తాము నరకం అనుభవిస్తున్నామని.. తల్లి మౌనంగా చూస్తూ.. అతడికి మద్దతిస్తుందని వారు వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు హెడ్మాస్టర్ దంపతుల మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. (కిడ్నాప్, ప్రైవేటు భాగాలపై శానిటైజర్) ఈ క్రమంలో బాధితురాలి తల్లి.. పెద్ద కుమార్తె చెడు తిరుగుళ్లు తిరగడంతో తాము మందలించామని.. అందుకే తమ మీద ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుందని కోర్టుకు తెలిపింది. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి బెంచ్ సదరు మహిళ అభ్యర్థనను తోసి పుచ్చారు. ఆమె ప్రవర్తన ప్రృతికి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాక ఏ కూమార్తె కూడా తల్లిదండ్రుల గురించి ఇలాంటి ఆరోపణలు, అబద్ధాలు చెప్పదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాక సదరు మహిళ మౌనంగా ఉంటూ భర్త అఘాయిత్యాలకు మద్దతు తెలిపిందని కోర్టు వెల్లడించింది. అంతేకాక పెద్ద కుమార్తె అబద్ధం చెప్తే.. మిగతా ఇద్దరు అందుకు మద్దతు తెలపరని కోర్టు స్పష్టం చేసింది. -
అమూల్యకు బెయిల్ నిరాకరణ
బెంగళూర్ : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజ్ విద్యార్థిని అమూల్య లినా బెయిల్ దరఖాస్తును బెంగళూర్ కోర్టు తోసిపుచ్చింది. ఆమెను విడుదల చేస్తే ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశంతో పాటు పారిపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 20న బెంగళూర్లో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఆమె పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించారు. కాగా ఈ నినాదం చేసిన వెంటనే ఆమె వ్యాఖ్యలను ఓవైసీ ఖండించారు. తామంతా భారత్ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ నినాదం చేసిన వెంటనే ఆమెను పలువురు కిందకు తీసుకువెళుతుండగా, మైక్రోఫోన్ను లాక్కునే ముందు ఆమె హిందుస్తాన్ జిందాబాద్ అని, లాంగ్లివ్ ఇండియా అని నినదించారు.ర్యాలీలో అలజడి రేపిన అమూల్యపై బెంగళూర్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. కాగా ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అమూల్య ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు నివేదించారు. కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్త లాక్డౌన్తో ఆమె బెయిల్ పిటిషన్లో జాప్యం నెలకొంది. చదవండి : మిస్డ్ కాల్తో పరిచయం ఆపై.. -
చిదంబరానికి స్వల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో జీవితం గడుపుతున్న కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర విచారణను కోరుతూ చిదంబరం న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు 47వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం కానీ, బుధవారం గానీ దీనిపై వాదనలను విననుంది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత బెయిల్ పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో చిదంబరం బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన స్పెషల్ కోర్టు ఈ నెల 27 వరకు జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ లభించవచ్చునని ఆశించిన ఆయన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. 2007లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు తన శాఖలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆయన అనుమతి ఇప్పించారన్న ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 16న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అంతకు ముందే 2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
బిటన్ హైకోర్టులో నీరవ్ బెయిల్ పిటిషన్
లండన్: భారత్లో మోసాలకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోదీ బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. గతంలో మూడుసార్లు బెయిల్ పిటిషన్ను తిరస్కరించినప్పటికీ బ్రిటన్ హైకోర్టులో శుక్రవారం ఆయన మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ జూన్ 11వ తేదీన విచారణకు రానుందని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న క్రౌన్ ప్రోసెక్షన్ సర్వీస్ తెలిపింది. గురువారం నీరవ్ కేసుపై విచారణ జరిపిన కోర్టు, ఆయన రిమాండ్ను జూన్ 27 వరకు పొడిగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14 వేల కోట్లు మోసం చేసి బ్రిటన్ పారిపోయిన నీరవ్ను ఇక్కడకు తీసుకురావడానికి భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 19న బ్రిటన్ పోలీసులు అరెస్టు చేసినప్పటినుంచి నీరవ్ మోదీ రిమాండ్లోనే ఉన్నారు. -
నీరవ్ మోదీ కోసం లండన్కి సీబీఐ, ఈడీ
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కేసు లండన్ కోర్టులో విచారణకు రానుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం లండన్ బయలుదేరింది. ఈడీ–సీబీఐ నుంచి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని బుధవారం లండన్ బయలుదేరారు. నీరవ్మోదీ భార్య అమీపై ఈడీ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా తీసుకువెళ్లనున్నారు. భారతీయ అధికారులు ఆ దేశంలోని వివిధ అధికారులను, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ను కలిసి మోదీ, అతని కుటుంబ సభ్యులు, ఇతరులపై భారత్లో దాఖలైన కేసులకు సంబంధించిన వివరాలు, తాజా సాక్ష్యాలు గురించి వారికి తెలియజేస్తారు. నీరవ్మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణాలు తీసుకుని ఎగవేసినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. -
హనీప్రీత్కు బెయిల్ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ను దోషిగా తేల్చిన అనంతరం చెలరేగిన అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఇన్సాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు గురువారం తోసిపుచ్చింది. హనీప్రీత్ బెయిల్ అప్పీల్ను కోర్టు తిరస్కరించిందని, అయితే ఉత్తర్వుల కాపీ తమకు ఇంకా అందలేదని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ దత్తపుత్రికగా చెబుతారు. హింసను ప్రేరేపించారనడానికి ఆమెకు వ్యతిరేకంగా హర్యానా పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవంటూ హనీప్రీత్ బెయిల్ను కోరుతున్నారని న్యాయవాది తెలిపారు.గత ఏడాది పంచ్కులలో జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్ట్ అయిన 15 మందికి వేర్వేరు కోర్టుల్లో బెయిల్ లభించిందని డిఫెన్స్ న్యాయవాది పేర్కొనగా, ఆమె బెయిల్ అప్పీల్ను ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. గత ఏడాది ఆగస్ట్ 25న గుర్మీత్ సింగ్ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన అల్లర్లలో 41 మంది మరణించగా, పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఆరు నెలల నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. -
కొడుకు పెళ్లికి జైలులోనే లాలూ..?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మాజీ మంత్రి చంద్రిక రాయ్ కూడా ఐశ్వర్య రాయ్ కూతురితో మే12న అంగరంగ వైభవంగా జరుగబోతోంది. పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో ఈ వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకకు కూడా లాలూ హాజరవుతారో లేదో ఇంకా క్లారిటీ లేదు. దాణా కుంభకోణ కేసులో ప్రస్తుతం రాంచి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు నిశ్చితార్థానికి కూడా రాలేకపోయారు. డయాబెటీస్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో రాంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇటీవలే చికిత్స తీసుకున్న లాలూ... తక్షణ చికిత్స కోసం తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసుకున్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణను జార్ఖాండ్ హైకోర్టు మే 11కు వాయిదా వేసింది. మే 11నే తేజ్ ప్రతాప్ పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ మే 11న కోర్టు బెయిల్ మంజూరు చేసిన రాంచి నుంచి పాట్నాకు ఒక్క రోజులో రావడం కొంచెం కష్టమే అంటున్నారు సన్నిహిత వర్గాలు. లాలూ దాఖలు చేసుకున్న పిటిషన్పై నిన్ననే జార్ఖాండ్ హైకోర్టు విచారించాల్సి ఉంది. కానీ న్యాయవాదుల బంద్తో ఈ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు. అయితే త్వరగా ఈ బెయిల్ పిటిషన్ విచారించాల్సిందిగా లాలూ వర్గాలు కోరుతున్నాయి. వచ్చే శుక్రవారం ఈ పిటిషన్ను విచారించాలని సీబీఐ వాదిస్తుందని, అయితే తమకు అనుకూలంగానే ఆదేశాలు వస్తాయని ఆర్జేడీ ఎంపీ, లాలూ సన్నిహితుడు జై ప్రకాశ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్న లాలూను రాజకీయ కుట్రతో సోమవారం రాంచి జైలుకు తరలించారని ఆరోపించారు. లాలూ అనారోగ్యంగా ఉండటంతో, తాము పెరోల్కు దరఖాస్తు చేయలేదని ఆర్జేడీ అధినేత న్యాయ వ్యవహారాలు చూసుకున్న వ్యక్తి చెప్పారు. తక్షణ చికిత్స కోసం బెయిల్ను కోరినట్టు తెలిపారు. సాధారణంగా పెరోల్ను పెళ్లి వేడుకలకు కానీ, అంత్యక్రియలకు కానీ దరఖాస్తు చేసుకుంటారు. 2014 తర్వాత లాలూ కుటుంబంలో జరుగబోయే అతిపెద్ద వేడుక తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లినే. ఆర్జేడీ చిన్న కూతురు రాజ్ లక్ష్మి పెళ్లి తర్వాత, ఇప్పుడు ఆ ఇంట్లో తేజ్ పెళ్లి జరుగుతోంది. -
అనూహ్యం.. సల్మాన్ బెయిల్పై రంగంలోకి జడ్జి
జోధ్పూర్ : సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణ జింకల వేటాడిన కేసులో సల్మాన్కు శిక్షలు ఖరారు చేసిన సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషిని బదిలీ చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. అయితే తన బదిలీ కంటే ముందుగానే ఆయన బెయిల్ పిటిషన్పై విచారణకు ముందుకు వచ్చారు. దీంతో బెయిల్ పిటిషన్పై నెలకొన్న అనిశ్చితి వీడిపోయింది. శనివారం ఉదయం హడావిడిగా కోర్టుకు హాజరైన జోషి.. బెయిల్ పిటిషన్పై దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు వాదనలు ముగియగా.. సల్మాన్ తరపు న్యాయవాది హస్తిమల్ సరస్వత్ వివరాలను మీడియాకు వివరించారు. బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తిగా వినిపించామని.. భోజన విరామ సమయం తర్వాత పిటిషన్పై జడ్జి తీర్పు వెలువరిస్తారని హస్తిమల్ మీడియాకు వివరించారు. దీంతో ఇప్పుడు మీడియా ఫోకస్ అంతా సల్మాన్కు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్న దాని వైపు మళ్లింది . -
సల్మాన్ ఖాన్కు మరో షాక్
జోధ్పూర్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్పై సంగ్దిగ్ధం నెలకొంది. శనివారం పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా.. రాజస్థాన్ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జోధ్పూర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సల్మాన్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటున్న సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను ట్రాన్స్ఫర్ చేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లేనని.. ఆయన మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు చెబుతున్నారు. నిజానికి సల్మాన్కు శిక్ష ప్రకటించిన రోజే (గురువారం) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసుపై మరోసారి పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఆయనకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ధారిస్థానని జడ్జి జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం సల్మాన్కు బెయిల్ వస్తుందని అంతా భావించారు. (సల్మాన్కు శిక్ష హ్యాపీగా ఉంది : నటి) ప్రస్తుతం జోషి స్థానంలో చంద్ర కుమార్ సొంగారాను జడ్జిగా బదిలీ చేశారు. చంద్ర కుమార్ తీసుకునే నిర్ణయంపైనే సల్మాన్ బెయిల్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయమై న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేస్తామని సల్మాన్ తరపు న్యాయవాది చెబుతున్నారు. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్పై మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. సుమారు 20 ఏళ్ల విచారణ తర్వాత జోధ్పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్కు ఐదేళ్ల శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. (సల్మాన్ కేసు.. మతం రంగు) -
కేజ్రీవాల్ ఇంట్లో సీసీటీవీ దృశ్యాలు ట్యాంపరింగ్
న్యూ ఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అన్షు ప్రకాశ్పై దాడి కేసులో ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే సూచనలే కన్పిస్తున్నాయి. సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి సేకరించిన సీసీటీవీ దృశ్యాలు ట్యాంపరింగ్ జరిగినట్టు తెలుస్తుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న కేజ్రీవాల్ని ఇది మరింత ఇబ్బందులకు గురిచేసేలా ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ బెయిల్ పిటిషన్పై తీస్ హజారి అడిషనల్ సెషన్ష్ కోర్టు జడ్జీ అంజు బజాజ్ చందన విచారణ చేపట్టారు. సీఎస్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లాడని చెబుతున్న సమయానికి, సీసీటీవీలో నమోదైన సమయానికి మధ్య వ్యత్యాసం ఉందని పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ సలహాదారుడు వీకే జైన్ సీఎస్ అర్థరాత్రి తర్వాత సీఎం నివాసానికి వచ్చారని పేర్కొన్న విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. దీనిపై డిఫెన్స్ లాయర్ బీఎస్ జూన్ వాదిస్తూ సీసీటీవీలో సీఎస్ కేజ్రీవాల్ నివాసానికి 11.24 గంటలకు వచ్చి, 11.31 కు వెళ్లినట్టు తెలుస్తోందన్నారు. ఇది పోలీసులు చెబుతున్న సమయానికి దాదాపు నలభై నిమిషాల తేడా ఉందన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తే ఏది నిజమో తెలుస్తోందన్నారు. దీనిపై పబ్బిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే జర్వాల్పై ఇంతకు ముందు అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన జూన్, అతను ఏ కేసులోను దోషిగా తెలలేదన్నారు. ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుగా పేర్కొన్నారు. ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించక ముందే కేసు నమోదు చేశారన్నారు. అందువల్ల ఈ కేసుని పరిగణలోకి తీసుకొకూడదని అన్నారు. ఈ దాడి సీఎం క్యాంప్ ఆఫీస్లో జరగలేదని, సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూంలో జరిగిందని ఆడిషనల్ డీసీపీ హీరేంద్ర సింగ్ కోర్టుకి తెలిపారు. జర్వాల్ గతంలో కింది స్థాయి అధికారులపై దాడి చేశాడని, ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారిపై దాడికి పాల్పడ్డడాని పేర్కొన్నారు. జర్వాల్ బెయిల్ ఫిటిషన్పై తీర్పును కోర్టు మంగళవారం మధ్యహ్నం 2 గంటలకు వెల్లడించనుంది. -
'ఇది మాములు స్క్రిప్ట్ కాదు.. ఊహించలేరు'
తిరువనంతపురం: 'దిలీప్ పలు చిత్రాల్లో నటించారు. కానీ, ఇదే ఉత్తమ స్క్రిప్ట్. ఎవ్వరూ ఊహించలేనంత భారీగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఇది' అంటూ కేరళలో ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మలయాళ నటుడు దిలీప్ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉన్న దిలీప్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు చేస్తూ ఎలాంటి ఆధారం లేకుండానే తన క్లైంట్ను అరెస్టు చేయడమే కాకుండా రిమాండ్కు తరలించారని తెలిపారు. ఇది ముమ్మాటికీ వివక్ష పూరిత చర్యే అవుతుందంటూ కోర్టులో చెప్పుకొచ్చారు. అయితే, కోర్టు మాత్రం కనీసం రెండు రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు పోలీసుల విచారణకు అప్పగిస్తున్నామంటూ స్పష్టం చేసింది. -
కన్హయ్యకు హైకోర్టు భరోసా
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు 29కి వాయిదా వేసింది. కన్హయ్య భద్రతకు ఉన్నత న్యాయస్థానం హామీయిచ్చింది. తన భద్రతపై కన్హయ్య ఆందోళన వ్యక్తంగా చేయగా... 'నీకు ఎటువంటి ప్రమాదం లేదు. వాళ్లు నిన్నేమీ చేయకుండా పటిష్ట భద్రత కల్పిస్తాం. చిన్న దెబ్బ కూడా పడనీయమ'ని హైకోర్టు భరోసాయిచ్చింది. పటియాలా కోర్టు ఆవరణ కోర్టు ఆవరణలో కన్హయ్య కుమార్ పై లాయర్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. అతడిపై మళ్లీ దాడులు చేస్తామని కూడా న్యాయవాదులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కన్హయ్యకు పటిష్ట భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
కన్హయ్య పిటిషన్ పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. లొంగిపోయేందుకు తమకు భద్రత కల్పించాలని ఉమర్ ఖలీద్, మరికొందరు జేఎన్ యూ విద్యార్థులు పెట్టుకున్న పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, ఇతర విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన మరో పిటిషన్ పై విచారణకు కూడా ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. చట్టానికి అడ్డుతగులుతున్న జేఎన్ యూ వీసీ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ లో కోరారు. -
హార్దిక్కు మళ్లీ చుక్కెదురు
సూరత్: దేశద్రోహం కేసులో పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన సూరత్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పటేళ్లకు ఓబీసీ కోటాలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గుజరాత్ కు చెందిన హార్ధిక్ పటేల్ పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని లేవదీసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమం ఆందోళన కరంగా మారి ఘర్షణలకు తావిచ్చింది. ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. ఆయనపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, ప్రత్యేకంగా ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు అవసరం అయితే ప్రాణాలు తీయాలని వ్యాఖ్యానించి ఆందోళనకారులను రెచ్చగొట్టాడు. ఉద్యమకారులారా ఆత్మహత్యలు వద్దు అవసరం అయితే పోలీసులను చంపేయండి అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి గత నెల 16న లప్ పోర్ జైలులో వేశారు. దీంతో ఆయన సూరత్ జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. కానీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అక్టోబర్ నుంచే హార్ధిక్ పై దేశ ద్రోహం కేసులు పలు చోట్ల నమోదయ్యాయి. -
కోర్టులో వాదనలు ఎలా జరిగాయి?
ఓటుకు కోట్లుకేసులో మొదటి నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణ ఆద్యంతం ఉత్కంఠంగానే సాగింది. వచ్చే మంగళవారాని(జూన్ 30)కి బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు వెల్లడించింది. దాదాపు గంటసేపు వాదనలు, ప్రతివాదనలు, న్యాయమూర్తి ఛలోక్తుల మధ్య విచారణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అడుగేస్తే.. అడుగేయలేం.. కేసు విచారణకు గంటముందుగానే హైకోర్టులోని 11వ నంబరు హాలు కిక్కిరిసిపోయింది. న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు రాకతో మొత్తం అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ముందుగా తన బృందంతో కోర్టుహాలుకు చేరుకున్నారు. ఆతర్వాత రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు హాల్లోకి ప్రవేశించారు అప్పటికే కోర్టు హాలు నిండిపోవడంతో సిద్ధార్థ లూథ్నా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఈకేసును వాదించాల్సింది తామే.. దయచేసి కాస్త స్థలం ఇవ్వండంటూ సిద్ధార్థ బృందంలోని న్యాయవాది ... అక్కడున్నవారికి విజ్ఞప్తిచేశారు. కాసేపటి తర్వాత ఏసీబీ తరఫు న్యాయవాదులు, వారి ప్రతినిధులు వచ్చేసరికి.. అప్పటికే నిండిపోయిన ఉన్న కోర్టు హాల్లో నిలబడ్డమే కష్టంగా మారింది. ఈగంట వ్యవధిలోనే రేవంత్ కు బెయిల్ వస్తుందా, లేదా అన్నదానిపై న్యాయవాదుల మధ్య చాలా చర్చోపచర్చలు సాగాయి. బెయిల్ వస్తుందని కొందరు, రాదని కొందరు.. ఇలా తలోరకంగా తమతమ అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 2:15 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ ఇళంగోవ్ కోర్టులోకి ప్రవేశించారు. పూర్తిస్థాయిలో నిశ్చబ్ధ వాతావరణం కనిపించింది. కోర్టులో వినిపించని టీడీపీ వాదనలు.. ఓటుకు నోటు కేసు వచ్చినదగ్గరనుంచి తెలుగుదేశం పార్టీ నేక వాదనలు వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబుకూడా రోజుకో వాదనలు చేస్తున్నారు. స్గింగ్ ఆపరేషన్లు చెల్లవని ఒకసారి, రేవంత్ రెడ్డిన కుట్రలో ఇరికించారని ఒకసారి, ఈకేసు ఎన్నికలసంఘం పరిధిలోకి వస్తుందని మరోసారి, ఫోన్ ట్యాప్ చేశారని, ఇది అక్రమమని ఇంకోసారి.. ఇలా పలురకాల వాదనలు వినిపిస్తున్నారు. ప్రజలముందు డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని కోర్టులో మాత్రం రేవంత్ రెడ్డి తరఫున్యాయవాదులెవ్వరూ ఇందులో ఒక్క మాటనుకూడా కోర్టు ఎదుట ప్రస్తావించలేదు. ఈకేసులో ఎఫ్ ఐ ఆర గురించి డిఫెన్స్ లాయర్ ప్రస్తావించగానే జడ్జి అడ్డుకున్నారు. ఈదశలో ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావించడం సరికాదన్నారు. ప్రాథమికంగా నేరం జరిగినట్టేనని పలుమార్లు కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఎమ్మెల్యే కొనుగోలు ప్రయత్నం, డబ్బు, వీడియోలు ఉన్నాయని కోర్టు ప్రస్తావించింది. రేవంత్ రెడ్డికి బెయిల్ ఎందుకివ్వాలో అన్నదానిపై మాత్రమే వాదనలు వినిపించాలని న్యాయమూర్తి డిఫెన్స్ లాయర్ సిద్ధార్థకు స్పష్టంచేశారు. ఈకేసులో ఇప్పటికే నిందితుడు 26 రోజులు పాటు రిమాండ్ లో ఉన్నారని, విచారణకోసం ఐదురోజులు కస్టడీకి కూడా తీసుకున్నారని కోర్టుకు నివేదించారు. ప్రత్యక్ష సాక్షుల విచారణ, వారి స్టేట్ మెంట్లనుకూడా తీసుకున్నారని కోర్టు ముందు ఉంచారు. ఏసీబీ ఆధారాలుగా చెప్తున్న వీడియో, ఆడియో టేపులన్నీ.. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఉన్నాయని, ఈకేసులో ఇంతకన్నా విచారించాల్సింది.. ఏమీ లేదని కోర్టుకు తెలిపారు. గతంలో నిందితుడికి ఒకరోజు బెయిల్ ఇస్తే.. కోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకున్నారని,ఇప్పుడు కూడా ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం వ్యక్తంచేయకుండా పాటిస్తామని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గట్టిగా వాదించారు. ఈకేసుపూర్వాపరాలను చెప్తున్న సమయంలో.. జడ్జి జోక్యంచేసుకున్నారు. మొత్తం వివరాలను తాను చదివానన్నారు. వీడియోకూడా తాను టీవీల్లో చూశానని జడ్జి రాజా ఇళంగోవ్ చెప్పుకొచ్చారు. బెయిల్ ఎందుకు ఇవ్వరాదో వాదనలు వినిపిస్తే చాలన్నారు. రేవంత్ రెడ్డికి బెయిల్ ఎందుకు నిరాకరించాలో చెప్తూ ఏడు కారణాలను ఏజీ కోర్టు ముందు ఉంచారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, రాజకీయంగా అత్యంత పలుకుబడి వారు అయినందున కేసును ప్రభావితంచేస్తారని కోర్టు ముందు ఉంచారు. ఈకేసులో పట్టుబడ్డ డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో, మిగిలిన నాలుగున్నరకోట్లు ఎక్కడున్నాయి, మొత్తం ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. రేవంత్ రెడ్డికి చెందిన పార్టీ పక్కరాష్ట్రంలో అధికారంలో ఉందని, పైగా ఢిల్లీలో వీళ్లకు చెందినవారు అధికారంలో ఉన్నారన్న విషయాన్ని కోర్టు ఎదుట ఉంచారు. ఇప్పటికే ఈ కేసులోనోటీసు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణాధికారి ఎదుట హాజరుకాలేదన్న విషయాన్ని ఏజీ కోర్టుకు తెలిపారు. నాలుగో నిందితుడైన మత్తయ్య ఇప్పటికీ దొరకలేదని, పక్కరాష్ట్రంలో దాక్కుంటున్నారని చెప్పారు. దర్యాప్తు మొత్తం ఇంకా ప్రాథమిక దశలో ఉందని, కాల్ డేటాను కూడా విశ్లేషించాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సమయంలో... సమాచారం రాలేదా? అంటూ జడ్జి ఏజీని ప్రశ్నించారు. కస్టడీ సమయంలో ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఏపార్టీకి ఎంతమందికి ఉన్నారు,, ఏపార్టీనుంచి ఎవరు పోటీచేశారు.. తదితర అంశాలపై జడ్జి ఇళంగోవ్ ప్రశ్నలు వేశారు. టీడీపీకి ఎంతమంది ఎమ్మెల్యే లు ఉన్నారో కూడా అడిగి తెలుసుకున్నారు. అదేసమయంలో జేఎంఎం కేసునుకూడా జడ్జి ప్రస్తావించారు. ఓటుకు నోటు అనే మాట మొదట ఈకేసు నుంచే వచ్చింది కదా? అని జడ్జి అన్నారు. ఓట్లు కొనుగోలు చేయడం అనేది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఏజీ ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చేటప్పుడు నేర తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని ఏజీ వాదించారు. 10 మంది ఎమ్మెల్యేలను కొని ఉంటే... ప్రభుత్వమే కూలిపోయేదన్న అంశాన్ని కోర్టుకు ముందు ఉంచారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్న వ్యక్తులు, దర్యాప్తును అడ్డుకోలేరా? అంటూ ఏజీ.. భయాన్నీ, సందేహాలనూ వ్యక్తంచేశారు. ఇక ఈ కేసులో నేరం రుజువైతే ఎంతకాలం శిక్షపడే అవకాశం ఉందని న్యాయమూర్తి అడ్వకేట్ జనరల్్ను అడిగారు. దీంతో కనిష్ఠంగా ఆరునెలలు గరిష్ఠంగా ఐదేళ్ల శిక్షపడే అవకాశం ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఆ రెండు కారణాలు... రేవంత్ రెడ్డికి బేయిల్ నిరాకరించాలంటూ అడ్వకేట్ జనరల్ చెప్పిన ఏడుకారణాల్లో కేవలం రెండు మాత్రమే ఆయనకు అనుకూలంగా ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బెయిల్ ఇస్తే.. విచారణను ప్రభావితం చేయడంతోపాటు, సండ్రవెంకట వీరయ్య విచారణకు హాజరుకాకపోవడం, మత్తయ్య పరారీలో ఉండడాన్ని కోర్టు తీవ్రంగానే పరిగణించింది. అయితే ఏడేళ్లకంటే తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టు చేయకూడదంటూ చట్టం చెబుతున్న అంశంకూడా వాదనల్లో ప్రస్తావనకు వచ్చింది. అఇయతే సాధారణ కేసుల్లా కాకుండా ఈకేసును ప్రత్యేకంగా చూడాలని, నేర స్వభావం, తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని ఏజీ కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్నతర్వాత మంగళవారం తీర్పు వెల్లడిస్తానని జడ్జి ప్రకటించారు. తమ వాదనలను లిఖిత పూర్వకంగా ఇస్తామని ఏజీ కోర్టుకు చెప్పగానే, అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. బెయిల్ పిటిషన్ పై విచారణ ముగిసిన కొన్ని నిమిషాల్లోనే ఏసీబీ కోర్టు.. అవినీతినిరోధకశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును అందించింది. లిఖితపూర్వక వాదనల్లో ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టునుకూడా కోర్టు ముందు ఉంచే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెప్తున్నారు. -శ్రీహరి, సాక్షి టీవీ -
'విచారణలో ఇది కీలక దశ.. బెయిలివ్వలేం'
న్యూఢిల్లీ: నకిలీ ఢిగ్రీ పత్రాలు కలిగి ఉన్న కేసులో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనకు ఇప్పటికే విధించిన జ్యుడిషియల్ కస్టడీని జూలై 6వరకు పెంచింది. ఆయనపై నమోదైన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, కేసు ప్రభావం రీత్యా బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తాను సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని, అందుకే తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా కోరుతూ తోమర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే, కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలియజేయడంతో వారి వాదనలతో కోర్టు అంగీకరించింది. తోమర్కు బెయిల్ నిరాకరించింది. -
బెయిల్ వచ్చిందనుకుని ఆనందం, రాలేదన్న వార్తతో నైరాశ్యం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆస్తుల కేసుకు సంబంధించి, బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మంగళవారం తొలుత బెయిల్ వచ్చిందనుకుని సంబరాలు జరుపుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంతలోనే బెయిల్ రాలేదని తెలుసుకుని నైరాశ్యంలో మునిగారు. ఈ కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్న జయ బెయిల్ పిటిషన్పై మంగళవారం కిక్కిరిసిన హైకోర్టులో ఎంతోఉత్కంఠగా వాదోపవాదాలు సాగాయి. ఈ దశలో, జయలలితకు షరతులతో కూడిన బెరుుల్ మంజూరుకు తమకు అభ్యంతరం లేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ) భవానీ సింగ్ ప్రసాద్ ప్రకటించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో అమ్మకు ఇక బెయిల్ ఖాయం అంటూ తమిళనాడులోని అమ్మ అభిమానులంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. దీనికి తోడు జయుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైనట్టు అన్నా డీఎంకే ఆధ్వర్యంలోని జయ టీవీసహా పలు టెలివిజన్ చానళ్లు, న్యూస్ వెబ్సైట్లు వార్తలు వెలువరించడంతో చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయం, పోయెస్ గార్డెన్లోని జయులలిత నివాసం వద్ద సంతోషం వెల్లివిరిసింది. చెన్నైలోని పలు రోడ్ల కూడళ్లలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టారు. అయితే,.. వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు.. ఇంతలోనే పిడుగుపాటు వంటి వార్తతో వారు నైరాశ్యంతో కుంగిపోయారు. కండీషనల్ బెరుుల్పై ఎస్ఎస్పీ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదని, జయకు బెయిల్ మంజూరు కాలేదని తెలిసి, ఆవేదన చెందారు. ఎక్కడికక్కడ రాస్తారోకోకు దిగారు. మహిళలు గుండెలవిసేలా రోదించారు. ఊటీ బస్స్టాండ్లో కర్ణాటక ఆర్టీసీ బస్సును వందవుంది అన్నాడీఎంకే కార్యకర్తలు నిలివేశారు. పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టి బస్సును సురక్షిత ప్రాంతానికి తరలించారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని అత్తిపల్లి వద్ద కర్ణాటక పోలీసులు మంగళవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే కార్యకర్తలను అడ్డుకున్నారు. -
జయకు బెయిల్ నిరాకరణ
బెయిల్ మంజూరుకు తగిన కారణాలు లేవన్న కర్ణాటక హైకోర్టు సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో మంగళవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జయుతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసిల బెయిల్ పిటిషన్లను జస్టిస్ ఏవీ చంద్రశేఖర నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. జయలలితకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ విచారణ సందర్భంగా చెప్పినా ఆయున వాదనతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర ఏకీభవించలేదు. కిక్కిరిసిన కోర్టు హాలులో తీర్పు పాఠాన్ని చదివిన న్యాయమూర్తి ‘అవినీతి.. మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. అవినీతి మానవ చరిత్రలోనే ఒక జాడ్యంగా మారిపోయింది అవినీతి కేసులను అధిక ప్రాధాన్యత ప్రాతిపదికపై పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆదేశించింది. అవినీతిని తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. తీవ్రమైన చర్యలు తీసుకోని పక్షంలో అది సమాజానికి జాడ్యంగా మారుతుంది. అవినీతి సమాజ వ్యతిరేకమైందని 2012లో సుప్రీం కోర్టు ఒక కేసు విచారణలో వ్యాఖ్యానించింది. అందువల్ల తమిళనాడు మాజీ సీఎంకు బెయిల్ మంజూరు చేయడానికి సహేతుక కారణాలు కనిపించడం లేదు’ అన్నారు. ఆస్తుల కేసులో జయను దోషిగా నిర్ధారిస్తూ, గత నెల 27న బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను, రూ.వంద కోట్ల జరిమానాను, శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు తలా రూ.పది కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టుకు వెళ్లడంపై జయదే నిర్ణయుం బెరుుల్ తిరస్కరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ, సుప్రీం కోర్టుకు వెళ్లే విషయమై జయలలితే స్వయుంగా నిర్ణయం తీసుకుంటారని ఆమె తరఫున హైకోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ తెలిపారు. హైకోర్టు ఆదేశాలు తనను నిరాశ పరిచాయన్నారు. అంతకు ముందు హైకోర్టులో ఆయన వాదనలు వినిపిస్తూ, జయలలితకు సత్వరమే బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు. దాణా కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఉటంకించారు. అయితే ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. బెయిల్కు ముందు లాలూ ప్రసాద్ యూదవ్ పది నెలలు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. కాగా, సుప్రీం కోర్టులో బుధవారం బెయిల్ పిటిషన్ను దాఖలు చేయడానికి జయ తరఫు న్యాయవాదులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తన బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించినట్టు తెలిసిన వెంటనే జయలలిత కుప్పకూలి పోయారు. తన బెయిల్ పిటిషన్పై వాదనల గురించి తెలుసుకోవడానికి ఆమె వుంగళవారం ఉదయుం నుంచే టీవీని వీక్షిస్తూ ఉన్నారు. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైందని తెలియడంతో ఆమె కుప్పకూలారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. లో-బీపీతో బాధ పడుతున్నట్లు గుర్తించి ఆమెకు వైద్యం చేశారు. భారీ బందోబస్తు: జయలలిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టులోనూ, పరప్పన అగ్రహార జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా జయ బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తమిళనాడుకు వెళ్లాల్సిన కేఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు జయలలితను తమిళనాడు జైలుకు తరలించే విషయమై తవు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోజాలదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జయలలితను తమిళనాడు జైలుకు తరలించాలన్న మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యపై ఆయన మంగళవారం స్పందించారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘కన్నడిగులను జైల్లో పెడతాం’ చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ కోసం తపించిపోతున్న ఆ పార్టీ శ్రేణులు కర్ణాటకపై పోస్టర్ల యుద్ధానికి శంఖారావం పూరించారు. జయకు బెయిల్ ఇవ్వకుంటే తమిళనాడులోని కన్నడీగులను జైల్లో పెడతాం జాగ్రత్త అంటూ చెన్నై నలుమూలలా పోస్టర్లను అంటించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కావేరీ జలాల వాటా విషయంలో ఉభయు రాష్ట్రాలకూ పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే స్థాయిలో విభేదాలు, విద్వేషాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఇలాంటి విద్వేషాలున్న తరుణంలో జయలలిత బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న పరిణావుం, తమిళనాడు ప్రజలకు, ముఖ్యంగా అన్నాడీఎంకే శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. సోమవారం రాత్రి కర్ణాటక హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘‘హెచ్చరిక..హెచ్చరిక. వంచనతో కూడిన తీర్పును వెలువరించిన కర్ణాటక న్యాయస్థానమా!..జనం ముఖ్యమంత్రి అమ్మను వెంటనే విడుదల చేయి, లేకుంటే తమిళనాడులో నివసించే కర్ణాటక ప్రజలందరినీ చెరలో పెడతాం’’ అని హెచ్చరిస్తూ పోస్టర్లను అంటిం చారు. పోస్టర్లలో మంత్రి వలర్మతి, టీ నగర్ ఎమ్మెల్యే కలైరాజన్ తదితర ప్రముఖుల పేర్లు ఉండటం చర్చనీయాంశమై ఉద్రిక్తతకు దారితీసింది. చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ ఆదేశాలతో కానిస్టేబుళ్లు పోస్టర్లను చింపివేశారు. అరుుతే కర్ణాటక పేరెత్తకుండానే మంగళవారం సాయంత్రం మరో పోస్టరు వెలిసింది. ‘ఖండిస్తున్నాం..తీవ్రంగా ఖండిస్తున్నాం. సత్యమే జీవితం గా బతుకుతున్న నీతిమంతురాలిని జైల్లో పెట్టిన నీకు శ్మశానంలోనూ చోటు లేదు..విడుదల చెయ్ అమ్మను విడుదల చెయ్’అంటూ పోస్టర్లు అంటించారు. -
నిజంగా మీరు జయలలితను అభిమానిస్తే...
చెన్నై: అన్నాడీఎంకే మద్దతుదారులు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. మీరు నిజంగా జయలలితను అభిమానిస్తే సహనాన్ని పాటించాలన్నారు. మంగళవారం జయలలిత తరపున దాఖలైన పిటిషన్ ను బెంగళూరు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో జయ అభిమానులకు, అన్నాడీఎంకే మద్దతుదారులకు పన్నీర్ సెల్వం సూచించారు. ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్నారనే దాఖలైన కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జయలలితకు బెయిల్ లభించిందంటూ పుకార్లు రావడంతో పలు మీడియా, వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో వార్తల్ని ప్రసారం చేశాయి. ఆతర్వాత బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందనే వార్త బయటకు పొక్కడంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్న అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో అభిమానులు,కార్యకర్తలు అవేశానికి లోనవ్వద్దని పన్నీర్ సెల్వం సూచించారు. -
జయ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
-
మళ్లీ అమ్మకు నిరాశే.. బెయిల్ కు నో..!
-
మళ్లీ అమ్మకు నిరాశే.... బెయిల్ కు నో...
బెంగళూరు : పురచ్చితలైవికి మరోసారి నిరాశే ఎదురైంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అభ్యంతరం వ్యక్తం చేయటంతో జయకు బెయిల్ ఇవ్వటం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల ఏడో తేదీన హైకోర్టు సాధారణ బెంచ్లో విచారణకు ఆదేశించింది. కాగా జయ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. మరోవైపు కోర్టు తాజా తీర్పుతో అమ్మతో పాటు అన్నాడీఎంకే వర్గాలకు మళ్లీ నిరాశే ఎదురైంది. దాంతో జయలలిత దసరా పండుగకు జైల్లోనే గడపనున్నారు. -
జయ బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం
హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. జయ తరపున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని, ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయాలని కోరుతూ జయలలిత దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా జయ బెయిల్ దరఖాస్తుపై విచారణను వెకేషన్ బెంచ్ తొలుత వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, సత్వర విచారణ కోరుతూ, జయలలిత తరఫున రాంజెఠ్మలానీ నేతృత్వంలోని న్యాయవాదుల నివేదన మేరకు విచారణ బుధవారం చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీహెచ్ వాఘేలా సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దాంతో జయ బెయిల్ పిటిషన్పై నేడు న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. మరోవైపు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. జయకు బెయిల్ రావాలంటూ తమిళనాడు వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. -
జయలలిత పిటిషన్పై రేపు విచారణ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు బుధవారం విచారణ జరుపనుంది. కేసులో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని, ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయాలని కోరుతూ జయలలిత దరఖాస్తు చేసుకున్నారు. జయలలిత దరఖాస్తుపై విచారణను వెకేషన్ బెంచ్ తొలుత వచ్చేనెల 6వ తేదీకి వాయిదావేసింది. అయితే, వచ్చే నెల 2 నుంచి 6 వరకు సెలవులు అయినందున, సత్వర విచారణ కోరుతూ జయలలిత తరఫున రాంజెఠ్మలానీ నేతృత్వంలోని న్యాయవాదులు హైకోర్టు రిజిస్ట్రార్కు అందజేసిన నివేదన మేరకు విచారణ బుధవారం చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి డీహెచ్ వాఘేలా సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ** -
తేజిందర్ సింగ్ అరెస్ట్కు రంగం సిద్ధం
న్యూఢిల్లీ: భారత మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ తేజిందర్ సింగ్కు కోర్టులో చుక్కెదురైంది. టట్రా ట్రక్ కొనుగోలు కుంభకోణంలో తేజిందర్ సింగ్కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. టట్రా ట్రక్ కొనుగోలు ఒప్పందంలో మాజీ సైనికాధికారి జనరల్ వీకే సింగ్కు తేజిందర్ లంచ ఇవ్వచూపారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తేజిందర్ సింగ్ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. -
సుప్రీంలో ఆశారాం బాపుకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గుజరాత్ లో ఆశారాం బాపుపై దాఖలైన రేప్ కేసులో బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ గుజరాత్ హైకోర్టులో దాఖలు చేయాలని ఆశారాంకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే రాజస్థాన్ లో నమోదైన మరో రేప్ కేసులో ఆశారాం బెయిల్ పిటిషన్ పై విచారణకు అనుమతిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఆశారాం బాపు వ్యవహారంలో రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసు జారీ చేసింది. -
తేజ్పాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పనాజీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించింది. కటకటాల్లో ఉన్న తేజ్పాల్ బెయిల్ పిటిషన్ ను బుధవారం నాడు గోవా కోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తేజ్ పాల్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
లైంగిక వేధింపుల ఆరోపణలతో కటకటాల్లో ఉన్న తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై బుధవారం నాడు గోవా కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తరుణ్ తేజ్ పాల్ కు బెయిలు నిరాకరించిన గోవా కోర్టు
-
లాలూప్రసాద్ యాదవ్కు బెయిల్ నిరాకరణ
దాణా కుంభకోణంలో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. లాలూకు బెయిల్ దక్కలేదు. బెయిల్ పిటిషన్ను అనర్హమైనదిగా పేర్కొంటూ గురువారం న్యాయస్థానం తోసిపుచ్చింది. లాలూకు బెయిల్ రాకపోవడంతో వ్యతిరేక నినాదాలు చేసిన ఆర్జేడీ కార్యకర్తల్ని భద్రతాధికారులు కోర్టు సముదాయం నుంచి బయటకు పంపించారు. బెయిల్ కోసం లాలూ చేసిన దరఖాస్తును విచారించిన కోర్టు తీర్పును నేటికి రిజర్వ్లో ఉంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దాణా స్కాంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు బెయిల్ మంజూరవడంతో లాలూకు వస్తుందని భావించారు. అయితే నిరాశ ఎదురైంది. లాలూ, మిశ్రాతో పాటు మొత్తం 43 మందికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. -
ఏడోసారి బెయిల్ ఇచ్చిన సిబిఐ కోర్టు
-
అనారోగ్యం ఉంటే అధికారం వద్దంటారా: చౌతాలాపై సుప్రీం వ్యాఖ్యలు
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన స్కాంలో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా దోషులుగా తేలిన విషయం తెలిసిందే. తనకు అనేక వ్యాధులున్నాయని, అందువల్ల తాను బయటే ఉండేందుకు అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. చౌతాలా పేర్కొన్న వ్యాధులన్నీ వృద్ధాప్యం కారణంగా వచ్చేవేనని కోర్టు తెలిపింది. ''నాకు ఒకటి అనిపిస్తోంది. ఒకవేళ పిటిషనర్కు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం వస్తే, మాకు చెప్పిన వ్యాధులను కారణంగా చూపించి పదవిని వద్దంటారా'' అని జస్టిస్ దత్తు వ్యాఖ్యానించారు. అనారోగ్యం ఉన్నవాళ్లంతా జైలు వద్దంటే, కేవలం ఆరోగ్యవంతులకు మాత్రమే జైలు పరిమితం అవుతుందని జస్టిస్ ముఖోపాధ్యాయ అన్నారు. అయితే.. జైలు అధికారుల వద్ద సెప్టెంబర్ 23లోగా లొంగిపోయేందుకు మాత్రం చౌతాలాకు కోర్టు అనుమతినిచ్చింది. ఆయనకు తగిన, సమర్ధమైన, నిపుణులతో వైద్య చికిత్సలు అందించాలని జైలు అధికారులకు సూచించింది.