Bhumana Karunakar Reddy
-
Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం?.. ప్రశ్నిస్తే కేసులే!
తిరుపతి, సాక్షి: శ్రీవారి గోశాలలో గోమాతల మరణాల వ్యవహారంలో ఊహించిందే జరిగింది. వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy)పై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయించింది. గోమాతల మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్చకు రావాలంటూ టీడీపీ నేతలే ఆయనకు సవాల్ విసిరారు. అదే టైంలో.. పోలీసుల సాయంతో భూమనను నిర్భందించి ఇబ్బంది పెట్టడంతో నిన్నంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా.. గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్(TTD Ex Chairman) భూమన కరుణాకరరెడ్డి పై కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. గోశాలపై అతస్య ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టించారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీశారంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో భూమనపై కేసు నమోదు అయ్యింది. గురువారం రాత్రి 8 గంటలకు ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు ఆగమేఘాల మీద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు ఈ కేసులో నమోదు అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీవారి ఎస్వీ గోశాలలో గోమాతల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే గోమాతలు చనిపోతున్నాయి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ గోశాల అధికారులే స్పష్టం చేయడం తెలిసిందే. అయినా కూడా గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి వాదిస్తుండడం కొసమెరుపు. -
చంద్రబాబు బినామీల ముఠా టీటీడీలో ఏం చేస్తోంది?
సాక్షి,తిరుపతి : పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి (ttd) ఆలయానికి అప్రతిష్టను తెచ్చి పెట్టిన సీఎం చంద్రబాబు (chandrababu naidu) తన బినామీలు లక్ష్మణ్ కుమార్, చందు తోటలు ఎవరో నిగ్గు తేల్చాలని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి (bhumana karunakar reddy) డిమాండ్ చేశారు.శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రపై భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీడీపీ పాలనలో టీటీడీ ప్రతిష్ఠ భ్రష్టు పట్టిపోయింది. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. వీళ్ళ అసమర్ధత కారణంగా తొక్కిసలాట జరిగింది. వీరి అలసత్వం కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు.ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణ అనుచరులు లక్ష్మణ్ కుమార్, చందులు. అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు అనేది ఉద్యోగస్తులే చెప్తున్నారు. ఎవరి లక్ష్మణ్ కుమార్, చందు తోట నిగ్గు తేల్చాలి. ఆర్టీఫిషల్ ఇంటిలిజెన్స్ పేరుతో సాఫ్ట్- వేర్ పేరుతో అనధికార వ్యక్తులు టీటీడీలో తిష్ట వేశారు. వెంకయ్య చౌదరినే ప్రధానంగా నిందితుడు. ఎలాంటి సంబంధం లేని జేఈవో గౌతమిపై వేటు చేశారు. దీనిపై నిజా నిజాలేంటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడే నిగ్గు తేల్చాలి.అడిషనల్ ఈవోను బదిలీ చేయాలి. టీటీడీలో బినామీల ముఠా కొండపై ఏమి చేస్తోంది. వేంకటేశ్వర స్వామిని స్వార్ధానికి వాడుకుంటున్నారు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.. ఏ సంబంధం లేకపోయినా ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే భక్తులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు క్షమాపణ చెబుతున్నాను’అని అనడం అభ్యతరకరం. హత్యలు, అత్యాచారాలు చేసి క్షమించాను అంటే కోర్టులు, జడ్జీలు వదిలి వేయరు కదా.ఆరు మంది చనిపోతే తొక్కిసలాటలో చనిపోయినట్లు తక్కువ సెక్షన్లు పెట్టారు. మీరు క్షమాపణలు చెప్పడంలో కుట్ర ఉంది, దోషులను శిక్షించాలి. అధికారులపై చర్యలు, అరెస్టు చేయాలి అని ఉండి ఉంటే బావుండేది. దోషులు పై చట్ట పరంగా జరిగిన సంఘటనకు చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షించే వారు’ అని అన్నారు. 👉చదవండి : వెంకటేశ్వర చూస్తున్నావా..? -
కొత్తాదేవుడండి.. పవన స్వామి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వచ్చారు. 14 ఏళ్లుగా తన కుమార్తెలను శ్రీవారి దర్శనానికి తీసుకురాని వ్యక్తి పవన్కళ్యాణ్. భక్తిపరులు, సనాతన ధర్మ ఆచార్యుల పిల్లలకు 9, 11 నెలలకే తలనీలాలు తీస్తారు. అలా చేయని పవనస్వామి సనాతన ధర్మ పరిరక్షకుడయ్యారు.కొత్తగా అవతరించిన పరమ హంస పరివ్రాజకాచార్య, మంత్రశాస్త్ర పయోనిధి, నరరూప నారాయణుడు, నిత్య సత్య ప్రవచనాల దీక్షాపరుడు, అస్కలిత బ్రహ్మచర్య దీక్షాపరుడు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పవన స్వాముల వారు మన తిరుపతికి వేంచేసి అనుగ్రహ భాషణం చేశారు. నిన్నకాక మొన్న తిరుపతిలో అడుగుపెట్టి, కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్తూ.. దారిపొడవునా వందల సంవత్సరాలుగా శాపగ్రస్తులైన కొన్ని మెట్లకు శాపవిముక్తి చేయడం కోసం కొన్ని చోట్లపడి దొర్లుతూ, కొన్నిచోట్ల పూర్తిగా పడిపోయారు. అలా తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి తిరుమలకు చేరుకున్నారు. సాక్షి, తిరుపతి: తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది అంటూ ఎద్దేవా చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా పవనానంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు. కల్లు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు.పవన్ కల్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ‘‘తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వచ్చారు. పవనానంద(పవన్) స్వాముల వారు వేంచేసినట్టుగా ఉంది. రాజకీయాలు మాట్లాడను అంటూ.. నా మీద, వైఎస్ జగన్ మీద ఇష్టానుసారం రాజకీయ ప్రేలాపనలు చేశారు. కోర్టులను కూడా హెచ్చరిస్తున్నట్టుగా పవన్ మాట్లాడారు. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. కల్లు తాగిన కోతిలా ప్రసంగం కొనసాగింది... హైందవ సంస్కృతికి పవన్ చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. అయోధ్యకు పంపిన లడ్డూలు నిజంగా కల్తీ అయితే శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయ్ పవన్. పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారు. సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియని వ్యక్తి పవన్. పీఠాధిపతులంతా తమ జీవితాలను త్యాగం చేశారు. ఈ పీఠాలకు ఏ విలువ లేదన్నట్టుగా పవన్ మాట్లాడారు. ఆయన మాటలు విని వారంతా భయపడిపోతారు. గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతా అన్నారు. పవన్ పీఠంలో గొడ్డు మాంసం తీసుకోవచ్చు. పవన్ భాష మతి చలింపచేసేలా ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరూ సనాతన ధర్మాన్ని పరిరక్షించలేదని మాట్లాడారు. పవన స్వాములు అల్వార్లా అవతరించినట్టు మాట్లాడుతున్నారు... పవన్ గతంలో ఏనాడూ సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపైనా పవన్ నొటికొచ్చినట్టు మాట్లాడారు. పవన్ కల్యాణ్ మనసంతా విషంతో నిండి ఉంది. జనం నీ మాటలు వింటారని ఏదైనా మాట్లాడతావా పవన్. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై హెచ్చరికలు జారీ చేస్తారా?. చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఆరోపణలకు ఆధారాలు ఎక్కడ?. 14 ఏళ్లుగా తన కుమార్తెలను దైవ దర్శనానికి తీసుకురాని వ్యక్తి పవన్. సనాతన ధర్మ ఆచారకులు పిల్లలకు 9 నెలలకే తల నీలాలు తీయిస్తారు. అలా చేయని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. ఆయన డిక్లరేషన్పై సంతకం చేస్తూ తిరుమలలో కనిపించారు. పవన్ సనాతన ధర్మం ప్రకారం బాప్టిజం తీసుకున్నా పర్వాలేదు.తిరుమల ప్రసాదంలో పశువుల కొవ్వు వాడారు అన్నారు. పవన్ క్షుద్ర రాజకీయ నాయకుడు. మతం ముసుగులో నాటకం ఆడాలనుకుంటున్నాడు. హైందవ సంస్కృతికి చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. నేను మళ్లీ పవన్కి ఛాలెంజ్ చేస్తున్నాను. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా సిద్ధం. శ్రీవాణి ట్రస్టుపై చేసిన ఆరోపణలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పు. శ్రీవాణి ట్రస్టులో ఒక్క రూపాయి దుర్వినియోగం అయినా ఏ శిక్షకైనా సిద్ధం. ఏదేదో మాట్లాడి వెళ్లిపోవడం కాదు.. దేవుడిపై ప్రమాణం చేసి చెప్పు. మతం కోసం, సనాతన ధర్మం, ఆచారాలు అవగాహన లేకుండా మాట్లాడారు నేను ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటే పొరపాటు. రాజకీయ సభ పెట్టి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతానని ప్రేలాపనలు మాట్లాడావు. అధికారం కోసం సనాతన ముసుగు పవన్ వేసుకున్నాడు. ఆ ముసుగులో మతాల మీద దాడిచేసే పవన్ నైజం తేటతెల్లమైంది’ అంటూ భూమన తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: పవన్కూ కోర్టులో మొట్టికాయలు తప్పవా? -
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణం చేసిన భూమన
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు.‘‘మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షుడు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం. అపచారం. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డు విషయంలో కళంకిత మైనది అని కలుషిత రాజకీయ మనష్కులు. అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను గాని తప్పు చేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోవాలి. నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతాము. నేను ఏ ఒక్క రాజకీయ మాట మాట్లాడలేదు. గోవిందా..గోవిందా’’...అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు.ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణీలో స్నానం చేసి, శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అఖిలాండం కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలో భూమన వెంట ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం చేశారు. -
దుర్మార్గం.. మహాపచారం
సాక్షి, అమరావతి: ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు తిరుమల మహా ప్రసాదమైన లడ్డూపై చేసిన ఉన్మాద వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల భక్తులు విస్తుపోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినే రీతిలో విస్మయకరమైన వ్యాఖ్యలు నిరాధారంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని ఒక హిందువుగా చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటలు ఎలా వచ్చాయని నివ్వెరపోతున్నారు. అత్యంత సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి, రాజకీయంగా లబ్ధి పొందాలనే దుగ్ధకు తిరుమలను వాడుకోవడం దారుణం, దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ ఇంత దారుణంగా మాట్లాడరని, రాజకీయాల కోసం దేవదేవుడినీ వదలక పోవడం పెద్ద పాపమని చెబుతున్నారు. కొంత కాలంగా చంద్రబాబు మానసిక పరిస్థితి పలు సందేహాలకు తావిస్తోందంటున్నారు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల తేకపోగా, వచ్చిన సీట్లను కూడా వద్దని కాలదన్నడం.. వరదల్లో అమరావతి మునగడం ప్రత్యక్షంగా అందరి కళ్లకు కనిపిస్తున్నా, ఆ మాటంటే నోటికి తాళమేస్తానని హెచ్చరించడం.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమవ్వడం.. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా తిరుమల ప్రసాదాన్ని వివాదం చేశారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని, ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రంగా మార్చి లబ్ధి పొందాలనుకుంటే సర్వనాశం అవుతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు నిప్పులు చెరిగారు. పరాకాష్టకు బాబు బురద రాజకీయాలు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు. వాస్తవం ఏంటంటే, తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే ఆయన బురద రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్నీకావు. చివరకు ఏమీ దొరక్క పోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. – భూమన కరణాకర్రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ చంద్రబాబు పెద్ద పాపమే చేశాడుదివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బ తీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపించుకున్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? – వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ -
జనసేనలో చేరితే కోటి రూపాయలు.. భూమన సంచలన కామెంట్స్
-
సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుపతి జిల్లా: సమృద్ధిగా వర్షాలు కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణయాగం వల్ల వర్షాలు కురిసాయన్నారు. శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగంలో భాగంగా వేడుకగా శుక్రవారం ఉదయం.. ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్తో పాటు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని తెలిపారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణ యాగం వల్ల వర్షాలు కురిసాయని, రానున్న రెండేళ్లలో వర్షపాతం తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ సూచన మేరకే వరుణ యాగం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
‘పట్టా’భిషేకం
ఆస్తులున్నా అనుభవించలేని దుస్థితి.. అమ్ముకోలేని పరిస్థితి.. వెరసి జీవితం దుర్భరం.. దశాబ్దాలుగా నరకం అనుభవిస్తున్న నిషేధిత భూముల యజమానులు.. ఈ దైనందిన స్థితి నుంచి ఎమ్మెల్యే భూమన విశేష కృషితో ఆ భూ యజమానులకు విముక్తి లభించింది. వారికి నేడు ఆ ఆర్డర్ కాపీలను అందజేయనున్నారు. దీనిపై ప్రత్యేక కథనం. తిరుపతి తుడా: నగరంలోని పలు ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై 22ఏ నిషేధిత నిబంధన శాపంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించే నాథుడే లేకపోగా 2018లో నాటి ప్రభుత్వం మరికొన్ని ప్రాంతాలను నివేధిత జాబితాలో చేర్చింది. దీంతో ఆస్తులున్నా అనుభవించలేని దయనీయ స్థితిలో నగర ప్రజలు దశాబ్దాలుగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి చొరవతో నిషేధిత జాబితాలోని 5,341 కుటుంబాలకు చెందిన భూములకు విముక్తి కల్పించారు. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రమబద్ధీకరణ ఆర్డర్ కాపీలను శివజ్యోతి నగర్ వాసులకు పంపిణీ చేశారు. దీంతో శివజ్యోతి నగర్, అయ్యప్పకాలనీ, ఎర్రకమిట్ట ప్రాంతాల్లోని 750 మందికి ఉపశమనం కలిగింది. ప్రస్తుతం మరోసారి 22ఏలోని నిషేధిత భూములకు మోక్షం లభించింది. తద్వారా సుమారు 10 వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. ఈ జాబితా నుంచి విముక్తి పొందిన నగర ప్రజలకు బుధవారం పట్టాభిషేకం చేయనున్నారు. 50 ఏళ్లుగా నరకం తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో భూములను 50 ఏళ్ల కిత్రమే 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారు. దీంతో ఆ భూములు క్రయవిక్రయాలకు నోచుకోలేదు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వారు 22ఏ నిబంధన విషయాన్ని పలుసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి నిషేధిత జాబితా నుంచి ఆ భూములకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో నగరవాసుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆ పాపంలో బాబూ భాగస్వామే తిరుపతిలోని 2,300 ఎకరాలకు సంబంధించిన భూములపై నాటి చంద్రబాబు ప్రభుత్వం 2018లో 22ఏ నిబంధన అస్త్రాన్ని ప్రయోగించింది. తప్పుల తడక కారణంగా ప్రభుత్వ, చుక్కల, దేవదాయ, మఠం భూములతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని భూములను ఆ జాబితాలో చేర్చింది. దీంతో గందరగోళం నెలకొనింది. ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఎవరు ఎప్పుడు ఇచ్చిన జీఓ కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయో ఆధారాలసహా వివరించడంతో ప్రతిపక్ష పార్టీలు చేసేదిలేక ఆ పాపం తమ నాయకుడిదేనని తలవంచక తప్పలేదు. 104 ఎకరాలకు విముక్తి 104 ఎకరాలకు సంబంధించిన భూములు 22ఏ నిషేదిత జాబితా నుంచి విముక్తి పొందాయి. విముక్తి పొందిన ప్రాంతాల్లో తంబవాణిగుంట, కొర్లగుంట, చంద్రశేఖర్రెడ్డి కాలనీ, నవోదయకాలనీ, ఎరుకుల కాలనీ, మారుతీనగర్, పూలవానిగుంట, ఆటోనగర్, అంబేడ్కర్కాలనీ, గొల్లవానిగుంట, బొమ్మగుంట, సూరయ్యకట్ట, ఎల్బీనగర్, సత్యనారాయణపురం, శ్రీకృష్ణనగర్, గాయత్రీనగర్, సుందరయ్యనగర్, సింగాలగుంట, రెడ్డిగుంట, తాతయ్యగుంట తదితర ప్రాంతాలు ఉన్నాయి. ప్రజలకు ఎంత చేయాలో అంతాచేస్తాం ప్రజా సమస్యలు, వినతులు, ఇబ్బందులు ఏవైనా నా వద్దకు వస్తే వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ముందుంటాను. 22ఏ గుదిబండపై వచ్చిన అన్ని వినతులను పరిశీలిస్తున్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని భూములకు నిషేధం నుంచి విముక్తి కల్పించాం. రాబోవు రోజుల్లో మరిన్ని భూములకు ఆ నిబంధన నుంచి ఉపశమనం కల్పిస్తాం. ప్రజలకు ఎంత చేయాలో అంతా చేస్తాం. 10 వేల మందికి లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తోంది. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం నగరంలో ఎన్నో ఏళ్లుగా భూసమస్యకు ఏ ఒక్కరూ పరిష్కారం చూపకపోగా 2018లో దాదాపు 2,300 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజల పాపం మూటకట్టుకున్నారు. ఆస్తులున్నా వాటిని అనుభవించలేని దుస్థితికి కారకులయ్యారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎంతో చర్చించి పరిష్కార మార్గాన్ని సాధించారు. వేలాది కుటుంబాలలో వెలుగులు నింపారు. రాబోవు రోజుల్లో తిరుపతి నగరం మరింత మంచిని చూడబోతోంది. –భూమన అభినయ్రెడ్డి, డిప్యూటీ మేయర్, తిరుపతి నేడు ఆర్డర్ కాపీల పంపిణీ 22ఏ జాబితాలోని 104 ఎకరాల భూములపై నిషేధం తొలగింపునకు సంబంధించిన ఆర్డర్ కాపీలను బుధవారం సాయంత్రం 4 గంటలకు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమంలో పంపిణీ చేయనున్నారు. భూమన కృషి అమోఘం నగరంలోని 22ఏ నిషేధిత భూములకు విముక్తి కల్పించేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఆయన తనయుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరి కృషిని నగరవాసులు కొనియాడుతున్నారు. -
చంద్రబాబు, పవన్ కు షాక్ ఇచ్చిన నేతలు
-
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన ఎమ్మెల్యే భూమన
-
గంగమ్మ తల్లికి సారె సమర్పించనున్న ఎమ్మెల్యే భూమన
-
తిరుపతిలో చారిత్రాత్మక, పురాతన కట్టడాల పరిరక్షణకు ముందడుగు
సాక్షి,తిరుపతి: తిరుపతి నగరంలోని చారిత్రాత్మకమైన, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం యువనేత భూమన అభినయ్ రెడ్డి ముందడుగు వేశారు. తిరుపతి 39వ డివిజన్, చెన్నారెడ్డి కాలనీలో ఓ పురాతనమైన కొలను ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు సేద తీరడం కోసం, స్నానాలు చేయడం కోసం ఈ కొలను నిర్మించారు. ఈ కొలనుకు కృష్ణంనాయుడి గుంటగా వాడుకలోకి వచ్చింది. అయితే కాలక్రమేణా ఈ కొలను అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. 2018 టీడీపీ హయాంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి చెన్నారెడ్డి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా కృష్ణంనాయుడి గుంట కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పిన విధంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్రెడ్డి ఆ గుంటను అభివృద్ధి పరచడానికి కౌన్సిల్లో చర్చించారు. నిధులు మంజూరు చేసి మరమ్మతులు ప్రారంభించారు. తాజాగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు పురాతన కట్టడాలను పరిరక్షించడం కోసం అడుగులు వేశామని భూమన అభినయ్ తెలిపారు. శ్రీకృష్ణంనాయుడి గుంట పరిరక్షణకు మొదటి విడతగా 57 లక్షలు మంజూరు చేసిన కౌన్సిల్, మలి విడతగా మరో 50 లక్షలను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. కొలనులో పూడికతీతతో పాటు ప్రహరీగోడ, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. -
‘సీమ’ గుండె చప్పుడిది
వికేంద్రీకరణకు మద్దతు దిశగా యావత్ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తోంది. మొన్న విశాఖ దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తే, ఇప్పుడు తిరుపతి జనసంద్రంగా మారి కదంతొక్కింది. రాయలసీమ గుండె చప్పుడు ప్రతిధ్వనించింది. పదులు.. వందలు కాదు.. వేలాది మంది ఆధ్యాత్మిక నగరిలో మూడు రాజధానులకు మద్దతుగా పెద్ద పెట్టున నినదించారు. మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు.. ఇలా ఒక్కరేంటి, అన్ని వర్గాల వారు రోడ్డుపైకి వచ్చి తమ ఆకాంక్షను బలంగా చాటారు. ‘సీఎం జగనన్న వికేంద్రీకరణ బాటలో నడుద్దాం.. న్యాయ రాజధాని సాధిద్దాం.. మన ఆత్మగౌరవం కాపాడుకుందాం.. స్వార్థ రాజకీయాలకు చరమగీతం పాడుదాం..’ అంటూ ప్రతినబూనారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఇటు రాయలసీమకు, అటు ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలి. అది ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు. రాయలసీమను రతనాల సీమగా మార్చే సత్తా సీఎం వైఎస్ జగన్కు మాత్రమే ఉంది. మనం కొంత కాలంగా పోగొట్టుకున్న దానిలో కొంతైనా తిరిగి ఇవ్వాలని కోరడం కోసమే ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన. ఇది రాయలసీమ గుండె చప్పుడు’ అని వికేంద్రీకరణను కాంక్షిస్తూ వేలాది మంది ప్రజలు నినదించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తిరుపతి నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులకు మద్దతుగా.. రాయలసీమ హక్కులు, కర్నూలులో న్యాయ రాజధాని సాధనే లక్ష్యంగా సాగిన ఈ మహా ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన గాంధీ రోడ్డు మీదుగా నాలుగు కాళ్ల మండపం, తిలక్ రోడ్డు, తిరుపతి మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. తిరుపతి నగరంలోని ప్రతి గడప నుంచి ప్రజలు తరలి వచ్చారు. స్థానికులు, మేధావులు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ కళాశాలల విద్యార్థులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల రాకతో నగరం జనసంద్రంగా మారింది. ప్ల కార్డులు చేతబట్టి.. ‘కర్నూలును న్యాయ రాజధాని చేయాలి’ అని కొందరు, జై జగన్ అంటూ మరి కొందరు.. పదండి ముందుకు మూడు రాజధానుల కోసం’ అంటూ ఇంకొందరు నినదిస్తూ ముందుకు సాగారు. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. దారి పొడవునా ప్రజలు మిద్దెలపై నుంచి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గాందీరోడ్డులో సాగుతున్న రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన తిరుపతి వేదికగా సీమ రాజధానికి విత్తనం తిరుపతి వేదికగా రాయలసీమ రాజధానికి విత్తనం నాటాం. మిగిలిన జిల్లాల వారూ నీరు పోస్తారు. తద్వారా రాజధాని మొక్క మహావృక్షమై కల సాకరమవుతుంది. సీఎం వైఎస్ జగన్ పాలన పట్ల, నిర్ణయం పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనేందుకు ఈ మహా ప్రదర్శనే నిదర్శనం. తిరుపతి చరిత్రలో మునుపెన్నడూ రానంతగా జనం ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడం సీఎం జగన్కే సాధ్యం అని సీమ ప్రజలు నమ్ముతున్నారు. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాష్ట్రానికి, రాయలసీమకు చేసింది శూన్యం. సీమ గడ్డమీద పుట్టిన చంద్రబాబు సీమకే ద్రోహం చేశారు. ఈ రోజు సీమ ప్రజలు నీరు తాగుతున్నారంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రజలంతా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానుల దిశగా ముందుకు వెళ్తున్నారు. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం లక్ష్యం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాయలసీమ మనోభావాలను గౌరవిస్తూ న్యాయ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దాన్ని వ్యతిరేకిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే ప్రాంతంలో అభివృద్ధి మొత్తం కేంద్రీకరించాలనుకోవటం దుర్మార్గం. లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రాంతంలో ఖర్చు చేసి, తన అనుయాయుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొమ్ముకాసే విధంగా రాయలసీమలోని పుట్టి పెరిగిన చంద్రబాబు వ్యవహరించటం శోచనీయం. దుష్టచతుష్టయం సహకారంతో రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటుతున్న చంద్రబాబుకు, ఆయన కోటరీకి ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన చెంపపెట్టు. మన పిల్లల ఉద్యోగ, ఉపాధి కోసం సీఎం జగన్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఐటీ కాన్సెప్ట్ సిటీని నిర్మించనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా 7 సెజ్లు నిర్మిస్తున్నారు. – మద్దెల గురుమూర్తి, తిరుపతి ఎంపీ సీమ ఆకాంక్షకు ఈ ప్రదర్శనే సాక్ష్యం రాయలసీమకు న్యాయ రాజధాని కావాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. అందుకు ఈ ఒక్క నగరంలో ఈ మహా ప్రదర్శనే సాక్ష్యం. అమరావతి యజమానుల వద్ద బానిసలుగా ఉన్న తిరుపతిలోని కొందరు రాయలసీమ ఆకాంక్షను గుర్తించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలియజెప్పాలి. ఇక్కడికి వచ్చిన ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. తిరుపతిలో శుక్రవారం సమావేశమైంది అఖిలపక్షం కాదు.. ఆ పేరుతో 2024లో పోటీ చేయనున్న మిత్రపక్షాలు. ఈ ప్రాంత వాసులై ఉండీ, ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా పావులు కదపడం సిగ్గుచేటు. ముసుగు తీసి బయటకు వచ్చి, మా అజెండా ఇదీ అని చెప్పుకునే ధైర్యం లేని మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 85 ఏళ్ల క్రితం రాయలసీమకు కృష్ణా, గోదావరి జలాల్లో అధిక వాటా ఇస్తామని చెప్పి, ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు. రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. రాయలసీమ ప్రజల గొంతు ఎండిపోకుండా ఉండేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. – శైలుకుమార్, మానవ వికాస వేదిక కన్వీనర్ -
వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన పూజలు
-
2016 నుంచి 2019 వరకు పెద్ద కుట్ర జరిగింది: భూమన
సాక్షి, అమరావతి: టీడీపీకి అడ్డదారిలో రాజకీయ లబ్ధి కలిగించేందుకు 2016–2019లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి పాల్పడ్డారని డేటా చోరీ అంశంపై విచారణకు శాసనసభ నియమించిన ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి చెప్పారు. ఆనాటి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ల డైరెక్షన్లోనే డేటా చోరీ జరిగినట్లు ఉపసంఘం విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయిలో పోలీసు దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే నివేదికను శాసనసభకు సమర్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత శాసనసభ సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులతో శాసనసభా ఉపసంఘం వరుసగా రెండో రోజు బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలన్నీ అత్యంత గోప్యమైనవని అధికారులు సభా సంఘానికి తెలిపారు. అటువంటి వివరాలు ‘సేవా మిత్ర’ అనే యాప్ నిర్వహించిన ఓ ప్రైవేటు ఏజెన్సీకి చేరడం అంటే ప్రభుత్వ పెద్దల ద్వారానే జరుగుతుందని అప్పటి ఐటీ, ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులు వివరించినట్టు సమాచారం. చదవండి: (అమ్మ, నాన్నల తర్వాత వైఎస్సారే నాకు స్ఫూర్తి: పంచ్ ప్రభాకర్) సమావేశం అనంతరం ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ప్రజల భద్రత, వ్యక్తిగత గోప్యత హక్కులకు భంగకరంగా వ్యవహరించిందన్నారు. ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన వివరాలను టీడీపీకి అనుకూలంగా ఏర్పాటు చేసిన సేవా మిత్ర యాప్తో అనుసంధానించారన్నారు. తద్వారా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు కుట్ర పన్నినట్టు తమ విచారణలో వెల్లడైందన్నారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది ఓటర్ల తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నిందని ఆయన చెప్పారు. అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ఈ వ్యవహారాన్ని గుర్తించి టీడీపీ కుట్రను అడ్డుకుందన్నారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ అధికారిక సమాచారం టీడీపీకి చెందిన యాప్ నిర్వాహకులకు చేరడం వెనుక చంద్రబాబు, లోకేశ్ల హస్తం ఉందన్నారు. ఆ స్థాయి పెద్దల పాత్రతోనే అంతటి గోప్యమైన సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తమకు వివరించారని భూమన తెలిపారు. గురువారం మరోసారి అధికారులతో సమావేశమైన అనంతరం తమ నివేదికను శాసనసభకు సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహనరావు, మద్దాల గిరి తదితరులు పాల్గొన్నారు. -
డేటా చోరీ బాధ్యులను విచారణకు పిలిపిస్తాం
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి బాధ్యులైనవారిని విచారణకు పిలిపిస్తామని శాసససభ ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి చెప్పారు. డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కోసం ఏర్పాటుచేసిన శాసనసభ ఉపసంఘం హోం, ఐటీ శాఖలతోపాటు ఇతర అధికారులతో వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం సమావేశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యక్తిగత డేటా, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడంపై వివరాలు సేకరించింది. గత సమావేశంలో ఉపసంఘం అడిగిన వివరాలను హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులు సమర్పించినట్టు తెలుస్తోంది. అనంతరం ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. దీంతో ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా యత్నించారని చెప్పారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగిలించి అడ్డదారుల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు కుట్రపన్నారని చెప్పారు. ఈ అంశంపై శాసనసభ ఉపసంఘం సమగ్రంగా విచారిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కోటారు అబ్బయ్యచౌదరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పెగాసస్ బండారం బయట పెడతాం: భూమన కరుణాకర్రెడ్డి
-
AP: భూమన నేతృత్వంలో పెగాసస్పై హౌస్ కమిటీ విచారణ
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ద్వారా మానవ హక్కులను చోరీచేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నియమించిన ఏపీ శాసనసభా సంఘం (హౌస్ కమిటీ) బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్రావు, మద్దాళి గిరిధర్ సమావేశమై ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరి నుంచి వివిధ మార్గాల్లో డేటా చోరికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ఏపీ (చంద్రబాబు) ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందని చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్య పరికరాలను వినియోగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఏపీ అసెంబ్లీ మార్చిలో సభాసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసింది. సాధికార సర్వే ద్వారా సమాచారం సేకరించి అప్రజాస్వామిక విధానాలు అవలంభించారు. దోషులను ప్రజల ముందు నిలబెడతాం. అప్పట్లో ప్రయివేటు వ్యక్తుల ఫోన్లు టాప్ చేసింది. ఇది శాసన సభ నమ్మింది, కమిటీ కూడా నమ్మింది. ఈరోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం ఇస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తాం. మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు కూడా ఒక అంశం. చంద్రబాబు చేసిన నిర్వాకాన్ని ఎత్తి చూపుతాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనిపై ఆరోపణలు చేశామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చదవండి: (గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ) -
విష ప్రచారాలు మానుకోండి: భూమన కరుణాకర్ రెడ్డి
-
కెడాయ్కి సంపూర్ణ సహకారం
తిరుపతి మంగళం: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్)కి తన వంతు సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్లో ఆదివారం క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2022 బ్రోచర్ను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన సంస్థగా క్రెడాయ్కి దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో జరిగే క్రెడాయ్ కార్యక్రమాలకు దేశ ప్రధాని, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, ప్రాంతీయ స్థాయిల్లో జరిగే కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఎదురవుతున్న నష్టాలను నివారించడంపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ప్రతినిధులు రాంప్రసాద్, రాజేష్గుప్తా, రాజేష్బాబు, ప్రభాకర్, రాజశేఖర్రావు, వివిధ బ్యాంకుల అధికారులు, బిల్డర్లు పాల్గొన్నారు. -
తిరుపతి : YSRCP ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన
-
భూమనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అభినందనలు
తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా): తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మానవత్వం చాటుకున్నారు. కరోనాతో మృతి చెందిన 21 మృతదేహాలను బంధువులు ఆస్పత్రిలో విడిచిపెట్టి వెళ్లగా, రుయా మార్చురీలో ఉన్న అనాథ మృతదేహాలకు బుధవారం ఎమ్మెల్యే ముందుకొచ్చి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గత ఏడాది ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తిరుపతిలో తొలిసారి కరోనా మృతదేహాలకు ఎమ్మెల్యే భూమన దగ్గరుండి చివరితంతును నిర్వహించారు. మరోసారి ఇప్పుడు 21 మృతదేహాలకు సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాలను మహాప్రస్థానం వాహనంలోకి నేరుగా ఆయనే ఎక్కించారు. కరోనాబారిన పడిన మృతదేహాలకు ఏడాది నుంచి కోవిడ్–19 తిరుపతి ముస్లిం జేఏసీ నాయకులు తమ సొంత ఖర్చులతో అంతిమసంస్కారాలను నిర్వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమన చివరితంతు నిర్వహించారు. భూమనకు పీఎంవో అభినందనలు ఎమ్మెల్యేకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అభినందనలు వచ్చాయి. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా బుధవారం నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో అభినందనలు తెలిపారు. తిరుపతిలో కరోనా బారినపడి మృతిచెందిన పార్ధివదేహాలకు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం అందరికీ ఆదర్శమని ఆయనను కొనియాడారు. చదవండి: కరోనా: ఒక్కడే.. ఆ నలుగురై! -
సీఎం జగన్ రాక తో బాబు వెన్నులో వణుకు పుడుతోంది : భూమన
-
ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. రెండవసారి కరోనా సోకి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతున్న భూమనకు శనివారం ఉదయం ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమనకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. రెండవసారి కరోనా సోకిన నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డికి బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చిన సంగతి తెలిసిందే. (ఎమ్మెల్యే భూమనకు మరోసారి కరోనా) -
ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్ కుమార్
చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్పీ భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుమారుడు ఎస్పీ చరణ్ను ఓదార్చారు. అనంతరం సాక్షితో మాట్లాడుతూ.. 'నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాము. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. (గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) ఆయన నెల్లూరు వాసి కావడం నెల్లూరు వ్యక్తిగా గర్వపడుతున్నాం. అన్ని భాషలలో అన్నివేల పాటలు పాడిన వ్యక్తి ఎవరూ లేరు, ఇక ఉండబోరు. బాలు కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఘన నివాళి అర్పించాము' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిలు కూడా ఎస్పీ బాలుకు పార్థివ దేహానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. (బాలు తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి..) కాగా.. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎస్పీబీ భౌతిక కాయాన్ని ఫామ్హౌస్లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గాన గంధర్వుడు బాలును చివరిసారిగా చూసేందుకు అభిమానులు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలు తరలి వస్తున్నారు. శనివారం ఫామ్హౌస్లోనే ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఎస్పీ బాలు కోలుకోవాలని భూమన పూజలు
సాక్షి, తిరుపతి : సంగీత దిగ్గజం ఎస్సీ బాల సుబ్రమణ్యం కరోనా వైరస్ బారినుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి గురువారం పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల సుబ్రమణ్యం దేశంలోనే గొప్ప గాయకుడని ప్రశంసించారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గాయకుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎస్పీ బాల సుబ్రమణ్యానికి టీటీడీతో మంచి అనుబంధం ఉందని అన్నారు. ( ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి ) కాగా, ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ వైద్యుల సూచనలతో ఎక్మో పరికరంతో వైద్యం చేస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన కోలుకునే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
మోటారు సైకిల్ పై తిరుగుతూ..
-
వైఎస్సార్ సీఎం అయ్యాకే సీమకు గుర్తింపు
సాక్షి, చిత్తూరు : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే రాయలసీమకు గుర్తింపు వచ్చిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏనాడూ రాయలసీమను పట్టించుకోలేదని అన్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. అధికార వికేంద్రీకరణ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇందుకు నారావారిపల్లెకు వచ్చిన జనమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ జరిగిందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిపుణుల కమిటీ సూచన మేరకే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబును ఓడించి కుప్పంకు పంపారు నారావారిపల్లె చాలా మంచిదని, అందుకే చంద్రబాబునాయుడిని ఓడించి కుప్పానికి పంపారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం బాగుండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రతి కుటుంబం సీఎం జగన్ను దేవుడిలా భావిస్తున్నారని అన్నారు. -
వికేంద్రీకరణ కోరుతూ ప్రభం'జనమై'..
పాలనా వికేంద్రీకరణతోనే అన్ని జిల్లాల అభివృద్ధి సాధ్యమని నినదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో 20 వేల మందికి పైగా ప్రజలు మహా ప్రదర్శన నిర్వహించి పాలనా వికేంద్రీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం, గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతమైన పెనుమాక, పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. రాష్ట్ర ప్రజల మనోగతానికి అనుగుణంగా వికేంద్రీకరణ చేపట్టాలని.. ఐదేళ్ల పాటు రాష్ట్రాభివృద్ధిని, రాజధాని నిర్మాణాన్ని గాలికొదిలేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అమరావతి పేరిట చేస్తున్న కపట నాటకాలు ఆపాలని.. రాష్ట్ర సమతుల అభివృద్ధిని అడ్డుకోజూస్తున్న ప్రతిపక్షాలు ప్రజాభీష్టానికి అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. తిరుపతి సెంట్రల్/పీలేరు: ‘కేంద్రీకరణ వద్దే వద్దు.. పాలనా వికేంద్రీకరణే ముద్దు’ అంటూ సోమవారం తిరుపతిలో మహా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20 వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చి తమ ఆకాంక్షను గళమెత్తి వినిపించారు. సంఘీభావంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. ‘సీఎం వైఎస్ జగన్ ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోగతానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం అమరావతిలో ఐదు వేల మంది కోసం అన్ని ఊర్లూ తిరుగుతున్నారు. తిరుపతిలో రెండ్రోజుల కిందట చంద్రబాబు జోలె పట్టి భిక్షాటన చేసినా 8 వందల మంది కూడా హాజరు కాలేదు. అదే వికేంద్రీకరణ కోసం ఈ రోజు ఎవరూ పిలుపు ఇవ్వకుండానే 20 వేలకు పైగా జనం తరలివచ్చారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి’ అన్నారు. ఎంపీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కుర్చీ కోసమే చంద్రబాబు ఊరూరా తిరుగుతున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో వికేంద్రీకరణ కోరుతూ భారీ ప్రదర్శన జరిగింది. మద్దతుగా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పశ్చిమ’లో సంఘీభావ ర్యాలీ బుట్టాయగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతమైన బుట్టాయగూడెంలో వికేంద్రీకరణ కోరుతూ ర్యాలీ జరిగింది. మహిళలు, యువకులు పెద్దఎత్తున తరలివచ్చి నెహ్రూ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. మద్దతుగా పాల్గొన్న ఏపీ శాసనసభ ఎస్టీ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందన్నారు. రాజధాని ప్రాంతంలో బినామీలతో భూములు కొనుగోలు చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు తన ఆస్తులను కాపాడుకునేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజధాని వద్దే వద్దు శ్రీకాకుళం: ఒక రాజధాని వద్దే వద్దని.. పాలనా వికేంద్రీకరణే ముద్దు అని శ్రీకాకుళం జిల్లా వాసులు నినదించారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. రాజాంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొని మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరారు. వీరఘట్టంలో డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జంక్షన్లో ర్యాలీ నిర్వహించారు. కోటబొమ్మాళిలో వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. అమరావతిలో కదం తొక్కిన ప్రజలు తాడేపల్లి రూరల్ (మంగళగిరి): పాలనా వికేంద్రీకరణ చేపట్టాలంటూ అమరావతి ప్రాంతంలోని తాడేపల్లి మండలం పెనుమాకలో వివిధ వర్గాల ప్రజలు కదం తొక్కారు. సోమవారం పెనుమాక నుంచి తాడేపల్లి భరతమాత సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. దీనికి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), వైఎస్సార్సీపీ నాయకులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, మునగాల మల్లేశ్వరరావు, పాటిబండ్ల కృష్ణమూర్తి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, యడ్ల సాయికృష్ణ, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, సంపూర్ణ పార్వతి, సంకె సునీత, దర్శి విజయశ్రీ, లక్ష్మీరోజాతోపాటు, వివిధ ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్స్టేషన్కు చేరుకుని ఎమ్మెల్యేను, ఇతర నాయకులను విడుదల చేయాలంటూ ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన 90 మందిపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి మోసగాడని, ఆయన్ని ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. రాజధాని పేరిట రైతుల నుంచి భూములు తీసుకుని ఐదేళ్లలో ఎలాంటి న్యాయం చేయని చంద్రబాబు ఇప్పుడు మాత్రం న్యాయం చేస్తాడనుకోవడం పొరపాటు అన్నారు. చంద్రబాబు శాశ్వతంగా అడుక్కోవడమే : మంత్రులు పేర్ని, కొడాలి సాక్షి, మచిలీపట్నం: ‘ఒకే రాజధాని వద్దు.. వికేంద్రీకరణే ముద్దు’ అని నినదిస్తూ మచిలీపట్నం వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు జాతీయ జెండాలు చేతబూని కోర్టు జంక్షన్ నుంచి కోనేరు సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ ఐదేళ్ల పాటు రాష్ట్రాభివృద్ధిని, రాజధాని నిర్మాణాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతి కోసం జోలె పట్టుకుని దొంగనాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని పేరిట చేస్తున్న కృత్రిమ ఉద్యమాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబుకు శాశ్వతంగా అడుక్కుతినే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. బందరు పోర్టు ఉద్యమంలో రైతులను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అమరావతి రైతుల కోసమంటూ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్బాబు, కైలే అనిల్కుమార్ పాల్గొన్నారు. వికేంద్రీకరణే ముద్దు విజయనగరం: పాలన వికేంద్రీకరణకు మద్దతుగా విజయనగరం జిల్లాలో పలుచోట్ల సోమవారం ర్యాలీలు, ప్రదర్శనలు సాగాయి. ఒకచోట వద్దు.. మూడు చోట్ల రాజధానుల ఏర్పాటే మంచిదంటూ నినదించారు. గజపతినగరం మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీకి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు. రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరిని మార్చాలంటూ కలెక్టరేట్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి దళిత, బీసీ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో.. సీమ ద్రోహి బాబు పెనుకొండ (అనంతపురం): పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం జిల్లా పెనుకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ‘రాయలసీమ ద్రోహి చంద్రబాబూ గో బ్యాక్’ అంటూ నినదించారు. వికేంద్రీకరణ చేపట్టాలంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ సోదరుడు మల్లికార్జున పాల్గొని మద్దతు పలికారు. అనంతపురం జిల్లా పెనుకొండలో .. విశాఖలో కాగడాల ప్రదర్శన సీతమ్మధార (విశాఖ): రాష్ట్ర పరిపాలన రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గురుద్వార్ వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మద్దతుగా పాల్గొన్న పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే ప్రజలే తరిమికొడతారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కేకే రాజు, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. నర్సీపట్నంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్ పాల్గొని మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించటంపై ఉత్తరాంధ్ర ప్రజలు సంబరాలు జరుపుకుంటుంటే అయ్యన్నపాత్రుడు లాంటి నాయకులు విమర్శలు చేయటం దారుణమన్నారు. -
3 కిలోమీటర్ల మేర.. మూడు రాజధానుల హోరు..!
సాక్షి, తిరుపతి : పాలన, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తూ.. మూడు రాజధానులు కావాలంటూ తిరుపతి వాసులు సోమవారం కదం తొక్కారు. ‘ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు’అంటూ నినాదాలు చేశారు. భారీగా కదిలివచ్చిన మద్దతుదారులతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు జనమయమైంది. మూడు రాజధానుల మాట హోరున వినిపించింది. ఈ ర్యాలీలో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యే భూమన, యువ నేత భూమన అభినయరెడ్డి పాల్గొన్నారు. కృష్ణపురం తనా నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అడుగడుగునా జైజై జగన్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. (చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు) అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా అభిమానులు, ప్రజలు విజయనగరం జిల్లా గజపతినగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడి నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు బైక్ ర్యాలీ సాగింది. ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. (చదవండి : జిల్లాల వారిగా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ..) -
అన్ని అనర్థాలకు మద్యమే కారణం: భూమన
-
‘సీఎం జగన్ మహిళా పక్షపాతి’
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతి అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని తిరుపతిలో శుక్రవారం ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అన్ని విధాల మహిళలకు చేయూతనిస్తున్నారని తెలిపారు. అలాగే నామినేటెట్ పదవుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్న గొప్ప సీఎం జగన్ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. -
శత వసంతాల గాన కోకిల.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి
శ్రీవారి అనన్య భక్తురాలైన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. ప్రపంచ ప్రసిద్ధ గాయనీమణిగా, భారత గానకోకిలగా, భారతరత్నగా, సంగీత విధుషీమణిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ప్రపంచ దేశాలను తన గాత్ర మాధుర్యంలో మెప్పించిన సుస్వరాల గాన కోకిలగా చరిత్రకెక్కారు. సోమవారం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి 103వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుపతి : శ్రీవేంకటేశ్వరస్వామి అనన్య భక్తురాలిగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శ్రీవారి వైభవ విశ్వవ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. ఎలాంటి ప్రసార సామగ్రి లేని సమయంలోనే ఆమె శ్రీవారు, అన్నమయ్య సంకీర్తనల తొలి ప్రచారకురాలుగా నిలిచారు. శ్రీవారు, అన్నమయ్య కీర్తనలను ప్రపంచానికి అందించడంలో ఎనలేని సేవచేశారు. శ్రీవారి సుప్రభాతాన్ని మారుమూల గ్రామాలకు తీసుకెళ్లిన ఘనత ఆమెకే దక్కుతుంది. శ్రీవారి సుప్రభాతం ప్రపంచవ్యాప్తంగా నేటికీ ఎమ్మెస్ గొంతుకతో వింటేనే స్వామి నిదురనుంచి మేల్కొంటారనే నానుడు ఉంది. ఆ గొంతుక సుప్రభాతం వింటేనే సంగీత ప్రియులకు సంతృప్తి కలుగుతుంది. ఆమె ఆలపించిన బాలాజీ పంచరత్నాలు, అన్నమాచార్య కీర్తనలు, శ్లోకాలు, భజనలు, స్తోత్రాలు ప్రసిద్ధికెక్కాయి. ఆమె ఆలపించిన సంకీర్తనలు, సుప్రభాతం నేటికీ విరాజిల్లుతున్నాయి. అప్పట్లోనే ఆ రికార్డులు, ప్రచారాల ద్వారా వచ్చిన నిధులను ఆమె టీటీడీకే అందజేసి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నారు. ఒక్క రూపాయి కూడా ఆశించికుండా శ్రీవారికే కానుకగా ఇచ్చిన ఆ నిధులు ఇప్పుడు వడ్డీతో సహా కోట్లాది రూపాయలు టీటీడీ ఖజానాలో జమ అయ్యాయి. తిరుపతి త్యాగరాజ మండపంలో సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదును ఆమె అందుకున్నారు. ఇదే వేదికలో తన గాత్రంతో శ్రోతలను మైమరపించారు. ఆమె 2004 డిసెంబర్ 11న పరమపదించగా, ఆమె తొలి కాంస్య విగ్రహం తిరుపతిలోనే ఏర్పాటు చేశారు. అప్పటి తుడా చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి సంగీతంపై తనకున్న మక్కువ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మిపై ఉన్న అభిమానంతో ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి తిరుపతి పూర్ణకుంభం సర్కిల్లో కాంస్య విగ్రహం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. కుటుంబ నేపథ్యం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలోని శ్రీమీనాక్షి అమ్మవారి ఆలయ మాడ వీధికి చెందిన వీణ విదూషిమణి షణ్ముఖవడివు, వకీలు మధురై సుబ్రమణ్య అయ్యర్ దంపతులకు 1916 సెప్టెంబర్ 16న జన్మించారు. తల్లి సంగీత విదూషిమణి కావడంతో అక్షరాలకన్నా ముందే సరిగమలను నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే ఆమె ఏకసంథాగ్రాహిగా సంగీతంలో రాణించడం మొదలుపెట్టారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన ఆమె 10వ ఏట ఆలపించిన పాటను గ్రామ్ ఫోన్ రికార్డు విడుదల చేయడం సంచలనం సృష్టించింది. 17ఏళ్లకే మద్రాసు మ్యూజిక్ అకాడమీలో కచేరీ చేసి పండితుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఎమ్మెస్ గాత్ర ప్రత్యేకత ఓంకారం ప్రజ్వలించే తంబుర శృతికి.. ఎమ్మెస్ తన గొంతు కలిపితే అదో మధురం. సుమధురం, ఆనంద తన్మయం, పరవశం, శ్రవణానందంతో ప్రతిఒక్కరూ భక్తి తన్మయం చెందాల్సిందే. అలాంటి సుమధుర కంఠం నుంచి సుస్వరాలు జాలువారితే ఇక సంగీత శ్రోతలకు వీనులవిందే. తమిళనాడుకు చెందిన ఆమె పరిపూర్ణ తెలుగులో సంకీర్తనలను గానం చేయడం మరో విశేషం. భక్తి, భావం, సాహిత్య సౌలభ్యం, సాహిత్య ఉచ్ఛారణ, రాగంలోని మాధుర్యాన్ని పలికించడంతో ఆమెకు ఆమే సాటి. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సంగీతం ప్రపంచంలో మరెవరికీ అందని కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నారు. దేశ అత్యున్నత పురస్కారాలను అంది పుచ్చుకున్నారు. శ్రీవారికి సేవచేసి చరిత్ర పుటల్లో నిలిచారు. ఐక్యరాజ్య సమితిలో ఆలపించిన తొలి మహిళగా, తొలి భారతీయురాలుగా కీర్తి గడించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రశంస లందుకున్నారు. ఆమె సుప్రభాతంతోనే శ్రీవారి మేల్కొలుపు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గానం చేసిన శ్రీవారి సుప్రభాతంతోనే సప్తగిరులు సైతం ఉదయిస్తాయి. ఆ అమ్మ పాటలో ప్రాణం ఉంటుంది. శ్రీవారి భక్తురాలిగా ఎనలేని నిస్వార్థ సేవచేశారు. శ్రీవారి వైభవ విశ్వవ్యాప్తంలో ఆమె పాటదే మెదటి స్థానం. సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయురాలు. అలాంటి మహోన్నత వ్యక్తి కాంస్య విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి -
ఆ ఘనత వైఎస్సార్దే
సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు తమకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న తెలుగు వారందరికీ తీరని లోటేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది పేదల గుండెల్లో ఇప్పటికి వైఎస్సార్ కొలువై ఉన్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి 10 సంవత్సరాలు అయ్యిందంటే నమ్మలేకపోతున్నామన్నారు. 2003లో విపరీతమైన ఎండలను కూడా లెక్క చేయకుండా తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తెప్పించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రిని మించిన పాలన అందిస్తున్నారని తెలిపారు. -
‘వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం’
సాక్షి, తిరుపతి: యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి వ్యతిరేకంగా బయటికి వచ్చి ఓ బలమైన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగారని ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సమూలమైన మార్పులు వస్తాయని, రాష్ట్రం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ.. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ వస్తే రౌడీయిజం పెరుగుతుందని చెప్పడం తప్పన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలుగు భాషా అభివృద్ధి చెందాలంటే భూమన తప్పకుండా గెలవాలన్నారు. బలమైన నాయకుడికి మద్దతు తెలపడానికే తిరుపతి వచ్చినట్టు తెలిపారు. భాష విషయంలో రాష్ట్రం బలహీనపడిపోయిందని, తెలుగుదేశం కాస్తా.. తెలుగులేశంగా మారిందని చెప్పారు. టీడీపీ పాలనలో ఇసుక, మట్టి మాఫీయా సృతిమించిపోయాయని, వైఎస్సార్ సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తనలాంటి రచయితలకు, భక్తులకు మంచి నాయకుడి కావాలని, అది వైఎస్ జగన్తోనే సాధ్యమని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగాప్రతి రాష్ట్రంలో వారి సొంత భాషను అభివృద్ధి చేసుకుంటుంటే ఏపీలో మాత్రం అశ్రద్ధ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ పుష్కరిణిలో చేపల పెంపకం జరడం దారుణమన్నారు. -
తిరుపతిలో తిరుగులేని వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి సెంట్రల్: తిరుపతిలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ వలసలు పెరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ జోరుకు తిరుగులేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు ఒకవైపు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి అన్ని వర్గాల ప్రజలు, నేతలను కలుపుకుంటూ, భరోసా ఇస్తుండడంతో ఆ పార్టీ వైపు అంతా ఆకర్షితులవుతున్నారు. మరోవైపు యువనేత భూమన అభినయ్ పరిణితిని ప్రదర్శిస్తూ అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతుండడం ఆ పార్టీకి అదనపు బలంగా మారింది. ఈ ఫలితం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. కరుడు గట్టిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ప్రత్యేకించి బలిజ,కాపు, యాదవ సామాజిక వర్గాలతో పాటు బీసీ సామాజిక వర్గాల నేతలందరిదీ అదే వరస అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొత్తగా వచ్చి చేరుతున్న వారి సంఖ్యతో ఆ పార్టీ గ్రాఫ్ పైపైకి ఎగబాకుతూనే ఉంది. వారం రోజుల వ్యవధిలోనే ఆ రెండు పార్టీల్లో ద్వితీయ శ్రేణి నేతలు దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. కాపు, బలిజ సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ముద్ర నారాయణ, దుద్దేల బాబు వంటి సీనియర్లు తొలి నుంచి వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ విద్యావేత్త కేఎం కృష్ణయ్య మనవడు కేఎంకే కిరణ్ రాయల్, ఎన్వీ సురేష్, చందు రాయల్, చెరకుల వెంకటేష్ , రోహిత్, గిరి,మణి, తిరుమలయ్య వంటి ద్వితీయ,తృతీయ శ్రేణి నాయకులు, తిరుమల స్థానికులు చేరారు. అనంతవీధిలో కాపు, బలిజ సామాజిక వర్గాల ప్రజలు మొదటి నుంచి టీడీపీ సంప్రదాయ ఓటర్లుగా ముద్ర ఉంటే..తాజగా సార్వత్రిక ఎన్నికల్లో ఆ ముద్రను చెరిపేస్తామని, వైఎస్సార్సీపీకే ఓట్లేస్తామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశంలో మహిళ సంఘాలకు ప్రాతినిథ్యం వహించిన పద్మ, అనసూయ, అరుణ, రాధామాధవి, మధుబాల, విజయలక్షి, విజయశాంతి వంటి వారుకూడా ఇటీవలే వైఎస్సార్సీపీ జెండాను భుజానకెత్తుకున్నారు. కాపు, ఉద్యమ కమిటీ నేత పోకల అశోక్ తన వంతు పార్టీ కోసం కృషి చేస్తున్నారు. టీడీపీకీ వరుస షాక్లు యాదవ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు కామాటి వరదరాజులు, కుడితి సుబ్రమణ్యం, తాళ్లపాక గోపాల్తో పాటు టౌన్ బ్యాంక్ మాజీ డైరక్టర్ జెల్లి తులసీ ఇటీవలే వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన బీసీ సంఘాల సమాఖ్య జాతీయ నాయకులు అన్నా రామచంద్రయ్య, అన్నా రామకృష్ణయ్య తాజాగా పార్టీలో చేరడంతో టీడీపీకి పెద్ద దెబ్బతగిలింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తిరుపతిలో ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీని యాదవ సామాజిక వర్గాలు దూరమయ్యాయి. దీనికితోడు టీడీపీలో యాదవ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందని యాదవ సామాజిక వర్గాలు గుర్రుగా ఉన్నాయి. టీడీపీలో కీలకంగా పనిచేసిన దొడ్డారెడ్డి శంకర్రెడ్డి, ఆచార్యా ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయ పాలకమండలి సభ్యుడు మురళీరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు లడ్డూ భాస్కర్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి వంటి నేతలు చేరడంతో వైఎస్సార్సీపీకి మరింత బలం పుంజుకుంది. -
తిరుపతి దశ, దిశ మార్చేస్తాం
తిరుపతి సెంట్రల్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదిస్తే తిరుపతి దశ,దిశ మార్చేస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి భరోసా ఇచ్చారు. తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన తిరుపతి నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో భూమన మాట్లాడుతూ ప్రజ లకు వరాల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాగానే తిరుపతి ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగులకు న్యాయ పరమైన సవాళ్లతో ప్రమేయం లేకుండానే ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయించామని, వైఎస్సార్ లేకపోవడంతో టీటీడీ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తాయని గుర్తుకు తెచ్చారు. తిరుపతిలో టీటీడీతో పాటు యూనివర్సిటీలు, ఆస్పత్రులు, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర సముదాయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు 30 వేల మందికిపైగా టైమ్ స్కేల్ వర్తింపజేస్తామని చెప్పారు. పరిశ్రమలతో పాటు ప్రతి సంస్థలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం తీసుకొస్తారని, దీంతో టీటీడీ సహా ఇతర సంస్థల్లో 15 వేల మందికి తగ్గకుండా ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. డీకేటీ స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ..మహిళల పేరిట రిజిస్ట్రేషన్లు చేయిస్తామని, దీనివల్ల నియోజక వర్గంలో 35 వేల మందికిపైగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. తిరుపతిలో 30 వేల ప్రభుత్వ పక్కాగృహాలను నిర్మించి, అర్హులందరికీ ఉచితంగా మంజూరు చేస్తామని భూమన హామీ ఇచ్చారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల్లో స్థలాలపై రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని...తాము అధికారంలోకి రాగానే అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తామని కరుణాకర రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రకటించిన సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. నగర ప్రజలకు 24 గంటలూ నీటిని సరఫరా చేయిస్తామన్నారు. కాలువలు, డ్రైన్లను ఆధునీకరిస్తామని తెలిపారు. తిరుపతిని అభివృద్ది బాట పట్టిస్తామని భూమన హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక నగరంలో సుపరిపాలన సాధిద్దామని, ఆశ్లీల నగరంగా మారకుండా పరిరక్షించుకోవాలని కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. -
చిత్తూరులో పోలీసుల పైశాచికం
సాక్షి, తిరుపతి/తిరుపతి సెంట్రల్ : ఓట్ల దొంగలను పట్టించిన పాపానికి ఓ ప్రజాప్రతినిధిపై పోలీసులు దాష్టీకానికి తెగబడ్డారు. ఫిర్యాదు చేసిన గ్రామస్తులపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఆందోళన చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపైనా అక్రమ కేసులు నమోదుచేసి అరెస్టుచేశారు. అంతటితో ఆగని పోలీసులు అతనిని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించేందుకు ఆదివారం రాత్రంతా తమిళనాడు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. తిండి, నీరు ఇవ్వకపోవటంతో ఎమ్మెల్యేకి బీపీ పెరిగింది. ఒక్క బీపీ టాబ్లెట్ ఇవ్వమని ఎంత ప్రాథేయపడ్డా పోలీసులు కనికరించలేదు. ఈ వ్యవహారం దావానలంలా వ్యాపించడంతో గత్యంతరంలేక సోమవారం ఉదయం చెవిరెడ్డిని సత్యవేడు పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే, పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే పోలీస్స్టేషన్లోనే నిరశనకు పూనుకున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్య జనం పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకోలు చేశారు. అలాగే, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి గ్రామస్తులతో కలిసి చిత్తూరు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వారిని కూడా అరెస్టుచేశారు. అసలేం జరిగింది? సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో గత కొద్దిరోజులుగా గుర్తుతెలియని యువకులు సర్వే పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా వివరాలు చెప్పిన వారి పేర్లను ట్యాబ్లో నమోదు చేస్తుండడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి యువకులను ప్రశ్నించి పోలీసులకు అప్పగించారు. అలా అప్పగించిన ఎర్రావారిపాలెం మండలానికి చెందిన వేణుగోపాల్రెడ్డి, నాగార్జునరెడ్డి, రామాంజనేయులను శుక్రవారం అరెస్టు చేశారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించి వారి కుటుంబాలపై దాడులు చేసి గాయాలపాల్జేశారు. అనంతరం ఆదివారం కూడా పాకాల మండలంలో ఓట్ల దొంగలు సర్వే పేరుతో గ్రామాల్లో పర్యటిస్తుండడంతో గ్రామస్తులు అడ్డుకుని వారిని పోలీసులకు అప్పగించారు. ఇలా అప్పగించిన నంగా నరేష్రెడ్డి, చెన్నకేశవరెడ్డి, ప్రకాష్రెడ్డిని కూడా పోలీసులు ఆదివారం అరెస్టుచేశారు. వీరిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లకుండా చిత్తూరులోని పోలీసు శిక్షణా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వారిని చిత్రహింసలు పెట్టినట్లు బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చిత్తూరులోని ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అరెస్టుచేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంతకీ వారిని విడిచిపెట్టకపోవడంతో చెవిరెడ్డి ఆందోళనకు దిగారు. సత్యవేడులో పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అరెస్టు ఆందోళన చేస్తున్న చెవిరెడ్డిని ఆదివారం అర్ధరాత్రి చిత్తూరులో పోలీసులు బలవంతంగా అరెస్టుచేశారు. అయితే, స్టేషన్కు తరలించకుండా పోలీసు వాహనంలోనే తనను రాత్రంతా తిప్పారని ఆయన ఆరోపించారు. ఆయన వెంట గన్మెన్లు, పీఏ ఎవరినీ రానివ్వలేదు. ఎమ్మెల్యే వాహనాలను గంటన్నర పాటు చిత్తూరు నుంచి కదలనివ్వలేదు. కాగా, రాత్రి ఆహారం లేకపోవడంతో బీపీ పెరిగిందని.. ట్యాబ్లెట్ కావాలని బతిమాలినా పోలీసులు కనికరించకుండా సోమవారం ఉ.4.30 గంటల ప్రాంతంలో సత్యవేడు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్యేపై సెక్షన్–353, 183, 141తో పాటు 149 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు అక్రమ అరెస్టుల విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, మహిళలు చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. జిల్లావ్యాప్తంగా కూడా సోమవారం ఆందోళనలు మిన్నంటాయి. గ్రామస్తులతో చిత్తూరులో ధర్నాకు దిగిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భార్య లక్ష్మీదేవి, కుమారులు మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డిలను పోలీసులు అరెస్టుచేశారు. ఎమ్మెల్యే భార్యను తిరుచానూరు పోలీస్స్టేషన్కి తరలించారు. ఇద్దరు కుమారులను యాదమర్రి పోలీస్స్టేషన్కి తరలించారు. పోలీస్స్టేషన్లోనే చెవిరెడ్డి నిరాహారదీక్ష పోలీసుల వైఖరికి నిరసనగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి సత్యవేడు పోలీస్స్టేషన్లోనే నీళ్లు సైతం తాగకుండా నిరాహారదీక్షకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సత్యవేడు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. డీఐజీ, ఎస్పీలకు ఫోన్చేసి ఎమ్మెల్యేని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా వచ్చిన వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఇది తెలుసుకుని సత్యవేడుకు చేరుకునేందుకు యత్నించిన పార్టీ కార్యకర్తలు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అనుమానం వచ్చిన వారిని అరెస్టు చేయడం ప్రారంభించారు. మరోవైపు చెవిరెడ్డికి సోమవారం సాయంత్రం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. టీడీపీకి మూల్యం తప్పదు : భూమన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని నిర్భంధించినందుకు టీడీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రగిరిని ఫ్యాక్షన్కు పుట్టినిల్లులా మార్చాలని టీడీపీ చూస్తోందని ధ్వజమెత్తారు. చెవిరెడ్డిని జైలుకు పంపేందుకు టీడీపీ ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తోందన్నారు. పనిగట్టుకుని దొంగ ఓట్లను ఎక్కించడం, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని అడ్డుకున్న తమ పార్టీ కార్యకర్తలను...పోలీసులు ఇష్టమొచ్చినట్టు కొట్టి, నిర్భందించారన్నారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు భూమన పేర్కొన్నారు. -
ప్రజాసంకల్పయాత్ర చారిత్రాత్మక పాదయాత్ర
-
వైఎస్ జగన్పై దాడికి మరో కుట్ర: భూమన
సాక్షి, శ్రీకాకుళం : ఇప్పటివరకు దొరికిన ఆధారాలతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతిపై ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం వేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆధారాలు దొరకని అవినీతి ఇంకా లక్షలకోట్లలో ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ఐదేళ్ల బడ్జెట్ని మించి టీడీపీ నేతలు దోపిడి చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సహజవనరులైన మట్టి, ఇసుకను కూడా మిగల్చకుండా అమ్ముకున్నారని భూమన నిప్పులు చెరిగారు. పోలవరం, రాజధాని భూముల కేటాయింపులో అంతులేని అక్రమాలు జరిగాయన్నారు. (నాలుగున్నరేళ్లలో చంద్రబాబు దోపిడీ 6.17 లక్షల కోట్లు) తిరుమలలో ఆధ్యాత్మిక దాడికి టీడీపీ కుట్ర 'వైఎస్ జగన్ సుధీర్ఘ పాదయాత్ర 9న ముగియబోతుంది. పాదయాత్ర ముందు జగన్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని బయలుదేరారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ప్రజాసంకల్పయాత్ర గొప్ప అధ్యాయంగా మిగిలిపోతుంది. కోటిన్నర మందితో ముఖాముఖి కలిశారు. 9న పాదయాత్ర ముగిసిన వెంటనే ఇచ్చాపురం నుంచి నేరుగా వైఎస్ జగన్ తిరుపతి చేరుకుని కాలినడకన స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తూ అనేక నిందారోపణలు చేస్తున్నారు. పోరాటాల పార్టీగా వైఎస్సార్సీపీని జగన్ రూపుదిద్దారు. పాదయాత్ర గురించి చంద్రబాబు, మంత్రులు అనేక ఆరోపణలు చేశారు. అయినా పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావొస్తుంది. స్వామివారి దర్శనానికి జగన్ వెళ్తున్న సందర్భంలో సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తారు అనే సమాచారం అందింది. స్వామివారి దర్శనానికి వెళ్లే సమయంలో హిందుత్వ దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారం మాకు వచ్చింది. టీడీపీ కార్యకర్తలతో జై జగన్ నినాదాలు చేపించి, పార్టీ జెండాలు విసిరి నెపం మాపై నెట్టాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారి మొక్కులు చెల్లించడానికి వెళ్తుంటే జగన్పై ఆధ్యాత్మిక దాడి చేయాలన్న కుట్ర జరుగుతోందని చెప్తున్నాం. చంద్రబాబు చేయబోతున్న కుట్ర ఇది. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో స్వామివారికి ఏటా పట్టువస్త్రాలు సమర్పించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కూడా విఫలమైందని ఇప్పుడు హైందవ ద్వేషిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. హిందువులు అందరికి ముందే కుట్ర గురించి చెప్తున్నాం. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాల గురించి ముందే చెప్తున్నాం. చంద్రబాబుకి దేవుడు కూడా రాజకీయ అవసరమే. వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు కుట్రలు ఎప్పటికప్పుడు ఎండగడతాం' అని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. -
'టీడీపీకి ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయం'
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవి బానిస రాజకీయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవరాజకీయాలకు మారు పేరు చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, వారితో కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నోసార్లు చెప్పామని స్పష్టం చేశారు. మీలా హోదా కోసం పూటకో మాట మార్చలేదని భూమన నిప్పులు చెరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేని చంద్రబాబు, ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో చంద్రబాబు అంత దుర్మార్గమైన, అవకాశవాద రాజకీయ నాయకుడు మరొకరులేరన్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా దోచుకున్న డబ్బును తెలంగాణ ఎన్నికల్లో మంచినీళ్లలా పారించారని, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో కూడా రానున్న ఎన్నికల్లో ఓటుకు మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రజలు తమ ఓటుతో టీడీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమన్నారు. -
వైఎస్ఆర్సీపీ అలు పెరుగని పోరాటం చేస్తోంది
-
చంద్రబాబు పాపాలు పండాయి : భూమన
సాక్షి, తిరుపతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాపాలు పండాయని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క వాగ్దానాన్ని కుడా చంద్రబాబు నిలబెట్టుకొలేదని నిప్పులు చెరిగారు. భూమన సమక్షంలో కాంగ్రెస్ క్రీయాశీలక నేత చిన్ని నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి భూమన ఆహ్వానించారు. కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ కే బాబు. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర, మైనారిటీ నేత ఖాధ్రీ, ఎంవీఎస్ మని, కుసుమ కుమారి, సాకమం ప్రభాకర్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్కు నీరాజనం పలుకు తున్నారని తెలిపారు. పాదయాత్రలో తండోప తండాలుగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. జగన్ సీఎం అయిన తరువాత ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. -
ఆంధ్రాలో కొనుగోలు.. తెలంగాణలో గగ్గోలా?
సాక్షి, శ్రీకాకుళం : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపుల గురించి నీతులు మాట్లాడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేను చంద్రబాబు నిస్సిగ్గుగా కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల గురించి గగ్గోలు పెట్టుడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుక శఖోపశాఖలుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. అవినీతి అధికారులపై దాడులు చేసే స్వతంత్ర ప్రతిపత్తి గల సీబీఐ వ్యవస్థను నీరుగార్చరని అన్నారు. ఏసీబీ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని దాడులు చేయించడం ఆయన దుర్బుద్ది అర్థమవుతోందని విమర్శించారు. -
చంద్రబాబువన్నీ స్వార్ధ రాజకీయాలే
-
దీక్షల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు
-
‘కనీస సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు’
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్ను పరామర్శించేందుకు హైదరాబాద్ వచ్చిన భూమన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించే సంస్కారం లేని వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని విమర్శలు గుప్పించారు. ‘వైఎస్ జగన్పై జరిగిన దాడి డ్రామా’ అని వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబు మానవ మృగంలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు నేర చరిత్ర ఉందని విమర్శలు గుప్పించారు. వంగవీటి రంగా హత్య కుట్రలో చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబు గతం, వర్తమానం రెండూ రక్తసిక్తమేనని అన్నారు. (వైఎస్ జగన్పై హత్యాయత్నం!) వైఎస్ రాజా రెడ్డిని హత్య చేయించిందికూడా చంద్రబాబేనని భూమన వ్యాఖ్యానించారు. వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన హంతకులకు బాబు నెల రోజులు ఆశ్రయమిచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తి నేడు శాంతి వచనాలు వల్లించడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. కుల రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడని అన్నారు. ఎన్కౌంటర్ పత్రికాధిపతి పింగళి దశరథ్రామ్ హత్యలో కూడా చంద్రబాబు ప్రమేయముందని భూమన ఆరోపించారు. 2003 అలిపిరి ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని గుర్తు చేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి చంద్రబాబును పరామర్శించి, దాడిని ఖండించారని అన్నారు. (జగన్పై దాడి..అంతా డ్రామా) -
యువనేస్తం పేరుతో మరోసారి దగా: భూమన
సాక్షి, విజయనగరం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువనేస్తం పేరుతో మరోసారి యువతను దగా చేశారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..42 లక్షల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేస్తే 2 లక్షల 10 వేల మందికి మాత్రమే ఇవ్వడం పచ్చి మోసం అన్నారు. 60 లక్షలకు పైగా నిరుద్యోగులుంటే 10 లక్షల మందికి మాత్రమే భృతి అని ముందే కోతలు పెట్టి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ఉద్యోగాల భర్తీని గాలికి వదిలేశారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి వల్ల దగా పడ్డ యువత అంతా వైఎస్ జగన్ వెంట నడిచి ఈ ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్నారని వ్యాఖ్యానించారు. -
గజపతిరాజు కోటకు బీటలు ఖాయం: భూమన
సాక్షి, విజయనగరం: విజయనగరం టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు కోటలు బీటలు వారడం ఖాయమని వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. విజయనగరంలో భూమన విలేకరులతో మాట్లాడారు. అధికార తెలుగుదేశం పార్టీ నిన్నటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఆటంకాలు కలిగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెల్లువెత్తిన జనసముద్రమే అధికార పార్టీ మీద ఉన్న ఆగ్రహానికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విషప్రచారాన్ని నిన్నటి సభ ద్వారా ప్రజలే తిప్పి కొట్టారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం, బహిరంగ సభకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని అధికార పార్టీ నేతలు చూసి ఎంత భయపడుతున్నారో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ రకమైన చర్యలు వారి భూస్వామ్య, నిరంకుశ పోకడలకు నిదర్శమన్నారు. -
వైఎస్ జగన్ను ఎదుర్కోలేక దుర్మార్గమైన ఆరోపణలు
-
బాబు ప్రజా ద్రోహి: భూమన
తిరుపతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా ద్రోహి అని వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్కే బాబు, నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి తదితరులు కలసి ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చి..ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని తీవ్రంగా ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి గాలికి వదిలేశాడని మండిపడ్డారు.చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా మహిళలు తీవ్రంగా మోసపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనపట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది..ఇందుకు నిదర్శనం తిరుపతిలో ఈ రోజు వైఎస్సార్సీపీ నిర్వహించిన ప్రజాబ్యాలెట్కు లభించిన స్పందనేనని వ్యాక్యానించారు. -
స్వామివారికి ఇచ్చిన నగలు ఏమయ్యాయి?
-
చంద్రబాబు ‘ఎర్ర’ నాయుడు
తిరుపతి సెంట్రల్: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనలో 10 లక్షల ఎకరాల్లో ఎర్రచందనాన్ని కొల్లగొట్టి, అక్రమంగా రవాణా చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తమ వాహనాల్లో ఎర్ర చందనాన్ని యథేచ్చగా తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. భూమన శుక్రవారం చిత్తూరు జిల్లా తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పచ్చచొక్కాలకు ఎర్ర చందనమే ఇంధనంగా మారనుందని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్మును వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయడానికి టీడీపీ సిద్ధమైందని విమర్శించారు. ‘‘ఎర్ర చందనాన్ని విక్రయించి రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఎర్రచందనం ద్వారా వచ్చిన సొమ్ముతో ఒక్క పైసా రుణం కూడా మాఫీ చేయలేదు. ఆఖరికి ఒక్క ఎర్రచందనం చెట్టు కూడా లేకుండా పచ్చదనాన్ని మాఫీ చేశారు. దేశంలోనే అత్యంతం అవినీతి రాష్ట్రం అనే ముద్ర పడేలా ఆంధ్రప్రదేశ్ను మార్చేశారు. చంద్రబాబు నాయుడు ఎర్ర నాయుడిగా మారిపోయారు. శేషాచలం కొండలు, వెలిగొండ, పాలకొండ, లంకమల కొండల్లో 1,500 కిలోమీటర్ల పరిధిలో, 35 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఎర్రచందనాన్ని పచ్చదండు కొల్లగొడుతోంది’’ అని భూమన దుయ్యబట్టారు. ఎర్రచందనం వేలంలో అక్రమాలెన్నో.. ‘‘ఎర్ర చందనం విషయంలో కుట్ర దాగి ఉంది. ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ వేలంలో సి–గ్రేడ్ రకం కింద దక్కించుకున్న ఎర్ర చందనాన్ని ఎ–గ్రేడ్ ఎర్రచందనంగా కేంద్రం పరిధిలోని డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సంస్థ గుర్తించింది. ఎ–గ్రేడ్ ఎర్రచందనం టన్ను ధర సగటున రూ.1.90 కోట్లుగా ప్రభుత్వం నిర్వహించిన వేలంలోని గణాంకాలే నిర్ధారిస్తున్నాయి. అంత ఖరీదైన ఎ–గ్రేడ్ ఎర్రచందనాన్ని అక్రమ మార్గంలో సి–గ్రేడ్ కింద పరిగణిస్తూ ఒక్కో టన్ను రూ.15 లక్షలకే పతంజలి సంస్థ దక్కించుకుందన్న కోణంలో డీఆర్ఐ విచారణ సాగింది. ఎర్రచందనం వేలం అక్రమాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే. నాలుగున్నరేళ్లలో 25 సార్లకుపైగా ప్రభుత్వం వేలం నిర్వహించిందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దేశం నుంచి తరలిపోతున్న ఎర్ర చందనంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. మరోవైపు ఎర్ర చందనం బహిరంగ వేలానికి నోచుకోకుండా ఎక్కడి నిల్వలు అక్కడే నిలిచిపోవడం వెనుక కూడా టీడీపీ సర్కారు కుట్ర దాగి ఉంది. వేలంలో ఒక టన్ను ధర రూ.2 కోట్ల దాకా పలుకుతుంటే.. మన రాష్ట్రంలో నిల్వలు ఎందుకు పెరిగిపోతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చైనా లాంటి దేశాలు ఎర్రచందనాన్ని ఎందుకు, ఏ రకంగా వినియోగిస్తున్నాయో కూడా మిస్టరీగా మారింది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఫర్నీచర్, బొమ్మల తయారీకే పరిమితమైతే ఒక్కొ టన్ను ఎర్రచందనాన్ని రూ.2 కోట్లు ఖర్చు చేసి కొనాల్సిన అవసరం ఉండదు. మన రాష్రంలో రూ.2 కోట్లకు విక్రయిస్తే చైనాకు చేరే సరికి ధర రూ.5 కోట్లకు పెరిగిపోతోంది’’ అని కరుణాకర్రెడ్డి చెప్పారు. చట్టం కోసం ఒత్తిడి చేయరేం? ‘‘ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? ఎర్రచందనం మన ప్రాంతంలోనే ఎక్కువగా పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టడానికి చట్టాలు పదునుగా లేవు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన చట్టం ఉంటేనే ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకోవచ్చు. మన ప్రాంతంలోనూ ఎర్ర చందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో చిత్తశుద్ధి లేదు. అటవీ శాఖ అధికారులకు పరిమిత అధికారాలే ఉన్నాయి. తగినంత మంది సిబ్బందిని, వాహనాలను, ఆయుధ సామగ్రిని సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. 1,500 కిలోమీటర్ల పరిధి, 35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో కేవలం 463 మంది సిబ్బందితో కూంబింగ్ చేయడం అసాధ్యం. ఎర్రచందనం కేసులో గంగిరెడ్డిని అరెస్టు చేసేశాం, అంతా అయిపోయిందని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఆ తర్వాత అక్రమ రవాణాను అడ్డుకోలేకపోయింది. అత్యంత విలువైన ఎర్రచందనం సంపదను భావితరాల కోసం పరిరక్షించాలి’’ అని భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. -
'4 లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ కో'
సాక్షి, హైదరాబాద్ : వృద్ధిరేటుపై ఏపీ ప్రభుత్వం అసత్యాలు చేప్తోందని వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మాయమాటలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర జీడీపీ పెరిగిపోతుందని హడావిడి చేస్తున్నారని, నాబార్డు నివేదికను చూస్తే బాబు పాలన ఎలా ఉందో తెలుస్తుందని ధ్వజమెత్తారు. నాబార్డు నివేదికపై చంద్రబాబు ఒక్కమాట మాట్లాడటం లేదన్నారు. ఏపీలో రైతాంగం సంక్షోభంలో ఉందనే విషయాన్ని నాబార్డు, నీతిఆయోగ్ తెలిపిందన్నారు. నాబార్డు నివేదికను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ హామీతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతులను వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేలా చేశారన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని భూమన నిప్పులు చెరిగారు. రైతులు, మహిళలు, యువతను చంద్రబాబు మోసం చేశారన్నారు. కుట్రలు, మోసాలు, అబద్ధాలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, నాలుగేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. విదేశీ పెట్టుబడుల విషయంలోనూ అసత్యాలే చెప్తున్నారని తెలిపారు. చంద్రబాబు అండ్ కో రూ.4 లక్షల కోట్లు దోచుకుందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 80శాతం మంది ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోందన్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రమే సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. -
ఏపీలోనే రైతుల పరిస్ధితి దారుణంగా ఉంది
-
చంద్రబాబే డాన్
హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జిల్లాకో మైనింగ్ డాన్ను తయారు చేశారని, మైనింగ్, ఎర్రచందనం, ఇసుక, మట్టి, భూ కబ్జా,కాల్మనీ మాఫియాలకు చంద్రబాబే డాన్ అని వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి తూర్పారబట్టారు. హైకోర్టు తప్పుబట్టినా కూడా మైనింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలోనే అక్రమ మైనింగ్ జరిగిందని, జరుగుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..మైనింగ్ విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఎక్కడికక్కడ బలవంతంగా అరెస్ట్లు చేశారని, తప్పును ఆపేందుకు ప్రయత్నిస్తున్న వారిని అరెస్ట్ చేయించడమంటే చంద్రబాబు దొంగల పక్షాన నిలబడతారని అర్ధమవుతుందని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు పండిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు సోనియా గాంధీతో కుమ్మక్కై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారు..జగన్ పరపతిని దెబ్బతీసేందుకు మళ్లీ తన విషపు కోరలను బయటకు తీసి ఆయన సతీమణి భారతిని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈడీ డిపార్టుమెంటులో ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఇద్దరు అధికారులు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలను ముందే చంద్రబాబు నాయుడికి ఇచ్చారని తెలిపారు. హెరిటేజ్ డైరెక్టర్లు భువనేశ్వరి, బ్రాహ్మణిలకు రూ.9.50 కోట్ల జీతం వస్తుందని ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు నోరు రావడం లేదని అన్నారు. హెరిటేజ్ ఆర్ధిక ఆదాయం పై విచారణకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. లోకేష్ అవినీతి, హెరిటేజ్ అక్రమాలపై భవిష్యత్ ప్రభుత్వాలు విచారణ చేస్తాయని చెప్పారు. చంద్రబాబు అవినీతి గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకమే రాశారని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారని ఆరోపించారు. వంగవీటి రంగాని హత్య చేయించింది చంద్రబాబేనని..ఆనాటి హోంమంత్రి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాసిన మాట వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. తుని ఘటనలో తనపై తప్పుడు కేసులు పెట్టారు..రైలు తగల బెట్టింది టీడీపీ నేతలే కాబట్టి ఒక్కరినీ అరెస్ట్ చేయలేదన్నారు. తుని విధ్వంసానికి చంద్రబాబే సూత్రధారి అందుకే రెండేళ్ల నుంచి కేసు విచారణ తేలలేదని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు గోత్రం ద్రోహం-భూమన
-
‘చంద్రబాబు, మోదీలు ప్రజా ద్రోహులుగానే మిగిలిపోతారు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. గురువారం గుంటూరులో తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 600 హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం వంచనతోనే ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగానే వంచనపై గర్జన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేస్తున్న వంచనను ప్రజలకు చెప్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీకి హోదా అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు, మోదీలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ధర్మపోరాటాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ధర్మపోరాటల పేరుతో ప్రజలను వంచిస్తోందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తానని ఇప్పటివరకు పోరాటం చేయలేదని తెలిపారు. బాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే వంచనపై గర్జన దీక్ష చేపట్టామన్నారు. చదవండి: గర్జనకు సిద్ధం వంచనపై వైఎస్సార్ సీపీ ‘యువ’గర్జన -
జగన్ వల్లే హోదా సజీవంగా ఉంది: భూమన
తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాల వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో గురువారం భూమన విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఊసరవెల్లిలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తన సభలలో తాను ఏం చేశాడో చెప్పుకోలేక పోతున్నాడని ఎద్దేవా చేశారు. కేవలం వైఎస్ జగన్ మీద ఆరోపణలకే సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా సభలో వైఎస్ జగన్ మీద దుర్మార్గంగా మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబూ ఎన్ని ప్రాజెక్టులు కట్టావో సమాధానం చెప్పాలి..రాజశేఖర్ రెడ్డి దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇప్పుడు గేట్లు ఎత్తుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ వీరోచిత పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాపుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో తొక్కింది చంద్రబాబేనని అన్నారు. తుని ఘటనకు చంద్రబాబే కారణమని, ఆయన మనుషులే హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. బాబు పాలన మీద, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన మీద చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే చర్చకు సిద్ధపడాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు భూమన సవాల్ విసిరారు. సోనియా గాంధీతో కలిసి వైఎస్ జగన్ మీద తప్పుడు కేసులు పెట్టించింది నువ్వు(చంద్రబాబు) కాదా అని సూటిగా అడిగారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు తిరుమల ప్రసాదంలా భావించాడని పేర్కొన్నారు. -
చంద్రబాబుది వంచన, దుర్మార్గపు పాలన
-
దళారీల నాయకుడు చంద్రబాబే
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు ముఖ్యమంత్రి చంద్రబాబు నిజస్వరూపాన్ని దేశవ్యాప్తం చేస్తే ఎయిర్ ఏషియా కుంభకోణం ఆయన అవినీతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిందని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు దళారీలకు నాయకత్వం వహించాల్సిన వ్యక్తని ప్రపంచానికి తెలిసిపోయింది. ‘బాబులా వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి మరెవరూ లేరు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై 2 రోజులుగా జాతీయ పత్రికలు కోడై కూస్తున్నా, ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా రాష్ట్రంలో బాబుకు భజన చేసే ఓ వర్గం మీడియా సంస్థలు ఒక్క వార్త కూడా రాయకుండా, చూపకుండా దాచిపెట్టాయి.’ అంటూ భూమన ధ్వజమెత్తారు. భూమన మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మద్యం ముట్టలేదా బాబూ? ‘చంద్రబాబు తాను ఎన్నడూ మద్యం ముట్టలేదని నవనిర్మాణ దీక్షల్లో చెప్పటం విడ్డూరంగా ఉంది. అత్తమ్ నరసింహులు బహుశా ఇప్పుడు బాబుకు గుర్తుంటారో లేదో తెలియదు. కాలేజీ చదివే రోజుల్లో చిన్న దుకాణం నడిపే నరసింహులు ద్వారా చేసిన తతంగాలను చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలి. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల పక్కన బాలాజీ కాలనీలో చిన్న దుకాణం నడిపే చలమయ్యను అడిగితే చంద్రబాబు విద్యార్థి దశలో చేసిన వ్యవహారాల గురించి కథలు పుంఖానుపుంఖాలుగా చెబుతారు. మద్యాన్ని ముట్టలేదని చెప్పే బాబు గురించి అప్పట్లో తిరుపతి చిన్నబజారులో ఉన్న వినాయక బ్రాందీ షాప్ ఓనర్ దగ్గరకు వెళ్తే చెబుతారు. చంద్రబాబు గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు.. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యార్థి దశ నుంచి ఆయన చేసిన సరస సల్లాపాలు మొదలు మద్యం దుకాణాలవైపు మరిగిన వరకూ తెలుసు’ అని భూమన పేర్కొన్నారు. -
దొంగగా తేలినా... అరెస్టు చేయరెందుకు?
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబే అసలు ముద్దాయని, చార్జిషీట్లో తక్షణమే ఆయన పేరు చేర్చి అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. చండీగఢ్ ఫోరెన్సిక్ లేబొరేటరీ స్పష్టమైన ఆధారాలిచ్చినా చంద్రబాబును కనీసం విచారణకు కూడా పిలవకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన వాయిస్ చంద్రబాబుదేనని దేశమంతా నమ్ముతోందని, ఈ కేసులో ఆయనకు శిక్ష పడకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందన్నారు. మూడేళ్లపాటు మూలన పడేసిన ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ప్రభుత్వం బయటకు తీసిందని, అయితే ఇది చంద్రబాబును రక్షించేందుకు కాదనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విచారణ వైపు వెళ్లకుండా చేసే లక్ష్యంతో కాకుండా, చిత్తశుద్ధితో కేసులో భాగస్వామ్యులైన వారికి శిక్షలు పడేలా చూడాలని కోరారు. చంద్రబాబుని ఆ దేవుడు కూడా రక్షించలేరంటూ గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రతిజ్ఞను ఈ సందర్భంగా భూమన గుర్తుచేశారు. చంఢీగడ్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగానైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు. దొంగ పట్ల ఉదాశీనతా..! ఒక ఎమ్మెల్యేను కొనేందుకు రూ.5 కోట్లకు బేరమాడి, 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా కూడా కేసులు పెట్టకపోవడం అన్యాయన్నారు. ఇది కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించేలా ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబును ముద్దాయిగా చేర్చి అరెస్టు చేయాలన్నారు. లేకుంటే ప్రజల్లో సామాన్యుడికి ఒకన్యాయం, చంద్రబాబుకు మరో న్యాయమా? అన్న అభిప్రాయం కలుగుతుందన్నారు. చంద్రబాబు అవినీతి 15 ఏళ్ల క్రితమే వెలుగు చూసిందని, అప్పట్లో తెహల్కా ఆయన అత్యంత అవినీతి పరుడని నిగ్గుతేల్చిందని భూమన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా విచారణ జరగకపోతే.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. తనకు అనేక మంది అండదండలున్నాయంటూ చంద్రబాబు అవినీతిని ఏరులై పారిస్తాడన్నారు. -
చంద్రబాబుది దీక్ష కాదు.. ప్రజలపై కక్ష!
సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో దీక్షలు, సభలు అంటూ రకరకాల మోసపూరిత ఎత్తుగడలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు చేస్తున్నది దీక్ష కాదు.. ప్రజలపై కక్ష అని నిప్పులు చెరిగారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా విశాఖపట్నంలో సోమవారం చేపట్టి ‘వంచన వ్యతిరేక దీక్ష’లో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పలువురు నాయకులు ఏమన్నారంటే.. కేంద్రంతో చంద్రబాబు లాలూచీ చంద్రబాబుకు అనుభవం ఉందని ప్రజలు నమ్మారని, కానీ ఆయన ప్రజలను నమ్మించి మోసం చేశారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. దొంగ దీక్షలతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు ముందుకొస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీని అద్భుతమంటూ.. దానిని చంద్రబాబు అంగీకరించారని, ప్రజల్లో వ్యతిరేకతను చూసి మళ్లీ ఆయన యూటర్న్ తీసుకున్నారని ధర్మాన గుర్తుచేశారు. మీరే అన్యాయం చేసి.. మీరే దీక్ష చేస్తానంటే ప్రజలు నమ్మరని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేశారని, ఇప్పుడు తనను ప్రజలే కాపాడాలని చంద్రబాబు వేడుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన అభ్యర్థించారు. అది దీక్ష కాదు.. కక్ష చంద్రబాబు చేస్తున్నది దీక్ష కాదు.. అది తెలుగువారి కక్ష అని వైఎస్సార్సీపీ నేత కరణం ధర్మశ్రీ అన్నారు. విభజన చట్టంలో ఏ ఒక్క హామీపై కూడా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేదని అన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు, ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏమైంది అని ఆయన చంద్రబాబును నిలదీశారు. ప్రత్యేక హోదా మన హక్కు, మన దిక్కు, మన లక్కు అని ఆయన పేర్కొన్నారు. ఓట్లరూపంలో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ముఖ్యమంత్రే దీక్ష చేయడమేంటి? హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబే దీక్ష చేయడమేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబూ.. దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేయలేవని పేర్కొన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని అభివర్ణించారు. చంద్రబాబు ‘ఆల్ ఫ్రీ’ అంటూ అందరినీ ముంచారని, మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నాలుగేళ్లుగా వంచిస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తూనే ఉన్నాడని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. హోదా మాట రాష్ట్రంలో వినపడకుండా కుట్రలు చేసిన బాబు ఇప్పుడు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఇన్ని రోజులు హోదా మాటా ఎత్తని చంద్రబాబు ఇప్పుడు కొంగ జపాలు చేస్తే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. చంద్ర బాబు లెంపలు వేసుకోవాలి రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్లుగా చేసిన అన్యాయానికి చంద్రబాబు చెంపలు వేసుకోవాలని వైఎస్సార్సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఓటుకు నోటు, పోలవరం కమీషన్ల వ్యవహారం, రాజధాని నిర్మాణంలో అవినీతిపై చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని కోటం రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు జగన్ భయం పట్టుకుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర, చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. హోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్సీపీ పోరాడుతోందని గుర్తు చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికే బాబు ధర్మ పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసినందుకుగాను చంద్రబాబు ఏపీ ప్రజల కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. -
‘చిత్తూరు’లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షం నియమావళిని ఉల్లంఘిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) ఆర్.పి.సిసోడియాను కలుసుకుని వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి ఈ నెల 26న నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల నియమావళి(కోడ్) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన.. ముఖ్యంగా వైఎస్సార్సీపీకి సంబంధించిన జెండాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగించారు. అయితే 30న తిరుపతిలో టీడీపీ బహిరంగసభ ఉందంటూ జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ జెండాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తెస్తున్నట్టు భూమన వివరించారు. ఇలా అధికార దుర్వినియోగం చేయడం సరికాదని, టీడీపీకి మినహాయింపునివ్వడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభ పేరుతో బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలు కట్టడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. చంద్రబాబు తన సభను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు వాడుకునే వీలుందని అనుమానం వెలిబుచ్చారు. తమ వినతిని పరిగణనలోకి తీసుకున్న సీఈవో చిత్తూరు కలెక్టర్తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు భూమన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే మాట ఎత్తితేనే జైలుకు పంపిస్తానని చెప్పిన సీఎం ఇపుడు ప్రత్యేక హోదా సాధనకు దీక్ష చేస్తాననడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 30న తిరుపతిలో జరిగేది దొంగల సభని ధ్వజమెత్తారు. -
వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి కుట్ర!
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కుట్రకు తెరతీశారు. ఇందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్ సందర్భంగా తిరుపతిలో జరిగిన బైక్ దగ్ధం ఘటనను ఆ పార్టీకి ముడిపెట్టాలని మంత్రులకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. బంద్లో విధ్వంసం సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ పనిచేసినట్లు కనిపిస్తోందని, దీన్ని ఆసరా చేసుకుని ఆ పార్టీపై ఎదురుదాడి చేయాలని చెప్పినట్లు సమాచారం. సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బంద్ ఎలా జరిగిందనే దానిపై చర్చ జరిగింది. ఈ సమయంలో తిరుపతి బైక్ దగ్ధం ఘటన ప్రస్తావనకు రావడంతో.. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పాత్ర ఉందనే అనుమానాలు లేవనెత్తాలని, ఇప్పటికే ఆ దిశగా విచారణ జరుగుతోందని చెప్పాలని సూచించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డికి దీంతో సంబంధం ఉన్నట్లు గట్టిగా ఆరోపణలు చేయాలని మంత్రులు, ముఖ్య నాయకులు దీనిపై దృష్టిపెట్టి ఎక్కడికక్కడ మీడియా సమావేశాల్లో ఈ విషయాన్ని పెద్దది చేసి చూపాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. గతంలో తుని రైలు దగ్ధం ఘటనలో భూమన కరుణాకర్రెడ్డి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు చేసిన మాదిరిగానే ఈ ఘటనలోనూ ఆయనకు లింకుపెట్టి ప్రచారం చేయాలని సూచించినట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా బంద్ల ద్వారా రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు విస్తృతంగా జనంలో చెప్పాలని మంత్రులకు బాబు దిశానిర్దేశం చేశారు. అలాగే, కృష్ణా జిల్లాలో జరుగుతున్న జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు వస్తున్న జనం గురించి కూడా అనుమానాలు రేకెత్తేలా మాట్లాడాలని చెప్పినట్లు సమాచారం. జనం రావడంలేదని, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, నకిలీ వీడియోలు పత్రికలకు ఇస్తున్నారని ప్రచారం చేయాలని కూడా చంద్రబాబు సూచించినట్లు సమాచారం. -
‘చంద్రబాబు మానసిక స్థితి బాగలేదు’
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. తిరుపతిలో సోమవారం బీసీ అధ్యయన కమిటీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమనతో పాటు ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్, పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. భారతదేశ నిర్మాణంలో బీసీలది ప్రధాన పాత్ర అన్నారు. దేశంలో మొదట నుంచి బీసీలకు మంచి స్థానం ఉండేదన్నారు. బంగారు పాలెం సంస్ధానాన్ని పరిపాలించింది కూడా బీసీలనే గుర్తుచేశారు. కుండలు తయారు చేసే చక్రం, నాగలి కనిపెట్టిన వడ్రంగి కులస్తులే మొదటి శాస్త్రవేత్తలన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి చేసిన పాదయాత్ర చేసి నేటితో 15 ఏళ్లు పూర్తైయిందన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు 50 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, రాజశేఖర్రెడ్డి ఓ అడుగు వేస్తే, జగన్ రెండు అడుగులు వేయాలనే తపన ఉన్న వ్యక్తి అని తెలిపారు. బీసీ వర్గాల సమస్యలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి అధ్యయం చేస్తామన్నారు. బీసీ మేలు చేసే ప్రతి అడుగులో అడుగేస్తా అని హామీ ఇచ్చారు. 14 ఏళ్లుగా బీసీలకు అన్యాయం రాష్ట్రంలోని 2 కోట్ల బీసీల కుటుంబాలు బాగుండాలని కోరుకున్నది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైఎస్సార్ బీసీలకు ఫీజు రియింబర్స్ మెంట్ ఇస్తే చంద్రబాబు వాటిని రూపుమాపారని విమర్శించారు. 14 ఏళ్లుగా చంద్రబాబు బీసీలను మోసగిస్తూనే ఉన్నారన్నారు. ఒక్కసారి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అవకాశం ఇస్తే.. అందరి భవిష్యత్ బాగుపడుతుందన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబుకు మానసిక స్థితి బాగలేకపోవడంతో రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబును గద్దెనెక్కించి తప్పు చేశామని, మరోమారు ఆ తప్ప్పు చేయోద్దని అనిల్ పేర్కొన్నారు. -
‘చంద్రబాబు అసమర్ధత వల్లే ఇదంతా’
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్, పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతిలో వాళ్లు మీడియాతో మాట్లాడారు. దేశంలో చంద్రబాబు అంత అవినీతిపరుడైన సీఎం మరొకరు లేరని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పోరాటం నేపథ్యంలో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ వరప్రసాద్ తెలిపారు. అదే రోజు ఏపీ భవన్ వద్ద ఆమరణ దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక హోదాపై నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి.. దీక్షలో పాల్గొనేలా చేయాలని సవాలు విసిరారు. ఇక కేసుల భయంతోనే బాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని.. ఇప్పటికైనా బాబు రెండు నాల్కల ధోరణిని మానుకోవాలని సూచించారు. ఈ నెల 6న వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భూమన తెలిపారు. -
చంద్రబాబు చోరీ చరిత్ర
-
యూటర్న్ అంకుల్ అనడంలో తప్పు లేదు..
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తమ పార్టీ నాయకులతో మాటల దాడి చేయిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి తీరును బాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీల అవినీతి భాగోతాన్ని విజయసాయి రెడ్డి ఎక్కడ బయటపెడతారో అన్న భయం తెలుగు దేశం పార్టీకి, నాయకులకు నిద్ రలేకుండా చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏది చేప్తే అది ఊదరగొట్టే ఎల్లో మీడియాతో ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న విజయసాయి రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై పూటకో మాట మాట్లాడే చంద్రబాబును యూటర్న్ అంకుల్ అనడంలో తప్పు లేదని అన్నారు. -
అవినీతికి కేరాఫ్ చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. చోడవరం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరత్నాలు కమిటీ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. విశ్వసనీయతకు, రాజకీయ నిబద్దతకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి సత్యారావు, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరదు కల్యాణితో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. -
జగన్పై తప్పుడు కేసులను కొట్టేస్తారు: భూమన
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వాస్తవానికి ఏ తప్పూ చేయలేదని, ఆయనపై సోనియాగాంధీ–చంద్రబాబు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా పెట్టించిన కేసులన్నింటినీ కచ్చితంగా కొట్టివేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం హైదరాబాద్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్పై కేసులు కొట్టేస్తారేమోనని చంద్రబాబు అనడం, దాన్ని ఓ పత్రిక పతాక శీర్షికన ప్రచురించడాన్ని భూమన ప్రస్తావించారు. తప్పుడు ఆరోపణలతో అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా అభియోగాలు మోపుతూ జగన్పై పెట్టిన కేసులను న్యాయస్థానాలు కచ్చితంగా కొట్టివేస్తాయని తేల్చిచెప్పారు. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు. భూమన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘చట్టంపై నమ్మకం లేని చంద్రబాబు, ఆయన మంత్రిమండలి, ఆయన ఎమ్మెల్యేలు, తైనాతీలకు ఈ కేసులపై అనుమానాలు ఉండొచ్చు గానీ మాకు మాత్రం చట్టం, న్యాయంపై అపారమైన నమ్మకం ఉంది. అందుకే ఈ కేసులపై విచారణ చేస్తున్న న్యాయస్థానాలు నిజాలను నిగ్గు తేలుస్తాయనే విశ్వాసం మాకు ఉంది. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక రెండున్నర దశాబ్దాలుగా శత్రువుగా చూసిన కాంగ్రెస్తో కూడా చేతులు కలుపుతున్నారు. తనను జగన్ ధిక్కరించారని సోనియా రగిలిపోతూంటే ఆజ్యం పోసింది టీడీపీ కాదా? సోనియాతో కలిస్తే గానీ జగన్ను ఎదుర్కోలేమని భావించి ఆయనపైకి సీబీఐని ఉసిగొల్పిన మాట నిజం కాదా? బాబు ఎంతకాలం అబద్ధాల శవ పేటికను మోస్తారు. అడ్డదార్లు జగన్కు తెలియదు జగన్పై కోపంతోనే చంద్రబాబు అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డితో కలిశారు. తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? అప్పటి న్యాయ మంత్రి భరద్వాజకు పాద పూజ చేసిన విషయం వాస్తవం కాదా? బాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని తెలంగాణ సీఎం కేసీఆర్కు సాష్టాంగపడి హైదరాబాద్ నుంచి పారిపోయి రావడం నిజం కాదా? విచారణకు సిద్ధమా బాబూ! చంద్రబాబు పాలనలో అవినీతి జరగనట్లు పచ్చ పత్రికలు, కొన్ని వార్తా చానళ్లు ప్రజలను ఇంకా భ్రమల్లోనే ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, ప్రజలన్నీ గుర్తిస్తున్నారు. జగన్లోని పోరాట తత్వాన్ని, నిజాయతీని గుర్తించారు. బాబుకు దమ్ముంటే ఆరోపణలన్నింటిపైనా విచారణకు సిద్ధపడాలి’’అని భూమన సవాల్ విసిరారు. -
విలువలే ఊపిరి... విశ్వసనీయతే ఆభరణం
సాక్షి, హైదరాబాద్ : విలువలు, విశ్వసనీయతే ప్రామాణికంగా ప్రజాక్షేత్రంలో తమ పార్టీ దినదినాభివృద్ధి చెందుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల జీవితాల్లో సంతోషం చిగురింపజేయాలన్నదే తమ పార్టీ ధ్యేయమన్నారు. ప్రజాక్షేత్రమే దేవాలయంగా తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనుక్షణం పోరాడుతున్నారని తెలిపారు. గడచిన ఏడేళ్లుగా పార్టీ చేసిన పోరాటాలు, ప్రజాభిమానం పొందిన తీరును భూమన ఈ సందర్భంగా వివరించారు. అత్యున్నత వ్యక్తిత్వం, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే నైజం, కొండంత ధైర్యం తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆభరణాలని భూమన కొనియాడారు. -
అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు
చిత్తూరు ఎడ్యుకేషన్ : వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమనకరుణాకర్రెడ్డి తెలిపారు. ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక పీసీఆర్ పాఠశాల ఎదుట చేపట్టిన రెండు రోజుల నిరవధిక నిరాహర దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్ బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. నూతన పెన్షన్ విధానం వలన ఎంతో మంది ఉద్యోగుల కుటుంబాలకు భద్రత లేకుండా పోతోందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆసరాగా ఉన్న పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు తన చేతిలో లేదని సీఎం చంద్రబాబునాయుడు చెప్పే మాటలను నమ్మే స్థితిలో ఉద్యోగులు లేరని తెలిపారు. ఆయనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు సమీర్, లోకేష్బాబు మాట్లాడుతూ సీపీఎస్ విధానం వలన తమ కుటుంబాలకు భద్రత లేదన్నారు. సీపీఎస్ను రద్దు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్ను పరిష్కరించేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో ఆ సంఘం నాయకులు నోబెల్, ఎస్పీబాషా, రాజేష్, వెంకటయ్య, వరదరాజులు, వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నగర బీసీ సెల్ అధ్యక్షుడు జ్ణానజగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు
-
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లాలలోని పార్టీ కార్యాలయాల్లోనూ వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం చేయడంతో పాటుగా, పళ్లు, మందులు, దుస్తులను పంపిణీ చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలోనూ జననేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్ భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని.....రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేక్ కటింగ్ అనంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఫ్రీ మెడికల్ క్యాంప్కు సైతం ఎత్తున స్థానిక ప్రజలు హాజరై వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వమే మన రాజకీయ ఆస్తి అని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి భారీ కేక్ కట్చేసి జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. జగన్ వ్యక్తిత్వంపై అకారణంగా మోసపూరిత కుట్రలు చేసినా, ఏ తప్పు చేయని వ్యక్తిని ఏడాదిన్నర పాటు జైలుకు పంపించినా, సడలని సంకల్పంతో తండ్రి ఆశయ సాధన కోసం, ప్రజలకు భద్రత కల్పించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ చేసిన ఉద్యమాలు ఏ నాయకుడు చేయలేదన్నారు. ఏ సినీ గ్లామర్ లేకపోయినా, కుట్రలు కుతంత్రాలు చేసినా ఇంతగా వైఎస్ఆర్సీపీని ముందుకు నడిపిస్తున్న యోధుడు వైఎస్ జగన్ అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్ జగన్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కడతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా... నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సూళ్లూరుపేటలోనూ జరిగాయి. ఆయనకు అంతా మంచే జరగాలని, ప్రజాసంకల్పయాత్ర మరింత దిగ్విజయంగా కొనసాగాలని పార్టీ నేతలు కోరుకున్నారు. శ్రీచెంగాల పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించి వైఎస్ జగన్ సీఎం కావాలని అమ్మవారిని కోరుకున్నామని ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు వైఎస్ జగన్కు ఉంటాయన్నారు. అలాగే వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో వైఎస్ఆర్ సీపీ యువ నేతలు పూజలు చేశారు. శ్రీవారి సన్నిధిలో కొబ్బరికాయాలు కొట్టారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడే వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు. అతిచిన్న వయస్సులో యువతకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్న ఏకైక నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ పుట్టిన రోజున వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో దుష్టశక్తులు అడ్డుపడుతున్నా.. అకుంటిత దీక్షతో ప్రజలతో మమేకమై, ప్రజల్లో ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. ఆయన నిండు నూరేళ్లు దేవుడి ఆశీర్వాదంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా వైఎస్ఆర్ సీపీతో కలిసి రావాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జగన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. -
సీబీఐ విచారణకు సిద్ధమా?
చంద్రబాబు దమ్ము, ధైర్యం ఉంటే సిద్ధపడాలి: భూమన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టు ఆధ్వర్యంలో సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్షల కోట్లు దోచుకునేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని తీసుకొచ్చారని, అది స్విస్ చాలెంజ్ కాదని సూట్ కేసుల చాలెంజ్ అని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణంలోని స్విస్ చాలెంజ్లో పారదర్శకత లేదని గుర్తించిన హైకోర్టు దానిపై స్టే ఇచ్చిందన్నారు. రాజధాని నిర్మాణానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే ఆ నిర్మాణం పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని భూమన చెప్పారు. రాజధాని పేరిట రైతుల భూములు లాక్కుని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. దోచుకోవడానికే స్విస్ చాలెంజ్.. రాజధాని నిర్మాణం పేరుచెప్పి ప్రభుత్వంలోని పెద్దలు కోట్లాది రూపాయలు మింగేయడానికే స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టారని భూమన ఆరోపించారు. తుని ఘటనలో ఏ మాత్రం పాత్రలేని, ఏ తప్పూ చేయని తనను విచారణకు పిలవటం హాస్యాస్పదంగా ఉందని భూమన అన్నారు.