birth anniversay
-
హరనాథ్ మంచి మనసున్న వ్యక్తి
‘‘నేను, హరనాథ్ కలిసి చాలా సినిమాల్లో నటించాం. అతను నిజమైన అందాల నటుడు.. అలాగే మంచి మనసున్న వ్యక్తి. నేను హీరోగా నటించిన ‘మా ఇంటి దేవత’ చిత్రాన్ని కూడా నిర్మించారు హరనాథ్’’ అని సూపర్స్టార్ కృష్ణ అన్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు. 1936లో సెప్టెంబర్ 2న జన్మించిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 167 సినిమాల్లో నటించారు. 1989, నవంబర్ 1న మరణించారాయన. కాగా హరనాథ్ జీవిత చరిత్రను ‘అందాల నటుడు’ పేరుతో డా.కంపల్లి రవిచంద్రన్ రచించారు. శుక్రవారం హరనాథ్ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు. ఈ పుస్తకావిష్కరణలో హరనాథ్ కుమార్తె జి. పద్మజ, అల్లుడు జీవీజీ రాజు (‘తొలి ప్రేమ, గోదావరి’ చిత్రాల నిర్మాత), మనవళ్లు శ్రీనాథ్ రాజు, శ్రీరామ్ రాజు, పుస్తక రచయిత కంపల్లి రవిచంద్రన్ పాల్గొన్నారు. -
సియాటెల్ లో వైఎస్ఆర్ 73వ జయంతి వేడుకలు
-
ఇండియాకు చేగువేరా
నేడు చేగువేరా జయంతి కాదు. ఆయన వర్ధంతి కూడా కాదు. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటి? ఆయన 1959లో ఇదే రోజు (జూన్ 30) తొలిసారి భారతదేశం వచ్చారు! ఆ రాత్రి పొద్దు పోయాక ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగారు. మర్నాడు నాటి ప్రధాని నెహ్రూ తన అధికార నివాసం తీన్మూర్తి భవన్లో చేగువేరాను సాదరంగా ఆహ్వానించారు (కింది ఫొటో). నియంతల గుండెల్లో నిద్రించిన యోధుడు చేగువేరాకు భారతదేశంలో పనేమిటి? అంతకన్నా ముందు, ఆయన ఎవరో సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించారు. చే బాల్యంలో ఆస్తమా బాధితుడు. దీంతో పసివాడికి ఏమౌతుందో అని భయపడుతూ అతని తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేశాడు! వైద్య విద్యార్థిగా వున్నప్పుడే లాటిన్ అమెరికా మొత్తం పర్యటించాలని చే మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని చే కూడా ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను చే కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్ పట్టా చేతికొచ్చిన చేగువేరాను చూసి తల్లితండ్రులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆయన ఆలోచనలు వేరుగా వున్నాయని వారికి తెలియదు. దోపిడీ చేస్తున్న నియంతృత్వాన్ని అంతమొందించి.. బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని అనుకుంటున్నట్లు చే వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు. తన విప్లవానికి మొదట బొలీవియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి, క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. క్యూబా నియంత బాటిస్టాపై చే నడిపిన గెరిల్లా యుద్ధం విప్లవబాటకు కొత్త అడుగులు నేర్పింది. ఆ తర్వాత క్యూబా పునర్నిర్మాణంలో చే పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు క్యాస్ట్రోని ప్రేమించినట్లే చేగువేరాను కూడా ప్రేమిస్తారు. ఇక ఆయన ఇండియా ఎందుకు వచ్చారంటే.. క్యాస్ట్రో పంపించారు. బాండుంగ్ ఒప్పందంలో ఉన్న దేశాలన్నిటినీ చేగువేరాని పర్యటించి రమ్మన్నారు. బాండుంగ్ అనేది ఇండోనేషియాలోని పట్టణం. వలస పాలన నియంతృత్వాన్ని వ్యతిరేకించే ఆఫ్రో–ఏషియన్ దేశాలన్నీ బాండుంగ్లో సమావేశమై.. సమైక్యంగా ఉండాలని, ఆర్థికంగా సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో ఇండియా కూడా ఉంది. అందుకే చేగువేరా ఇండియా వచ్చారు. ఇక్కడే కొన్ని రోజులు ఉన్నారు. కలకత్తా కూడా సందర్శించారు. 39 ఏళ్ల వయసులో 1967 అక్టోబర్ 9న ఈ విప్లవ వీరుడు, గొరిల్లా యుద్ధంలో ఆరితేరిన యోధుడు మరణించారు. బొలీవియా సైన్యం అతడిని పట్టి బంధించి, చంపేసింది. -
రాజకీయ జీవితంలో రెండు సార్లు వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్
-
ఆత్మవిశ్వాసానికి నిండైన రూపం!
తెలుగు సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగొందుతున్న సమయంలో ‘ఢిల్లీ’ కాళ్లకింద తెలుగువాడి ఆత్మగౌరవం నలిగిపోతుంటే చూసి రగిలిపోయారు ఎన్టీఆర్. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ‘తెలుగువారి ఆత్మ గౌరవ’ నినాదంతో కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో అధికార పీఠాన్ని అధిరోహించారు. ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ ‘పేదలకు పక్కా ఇళ్ళు’ వంటి పథకాలు, బీసీలకు 29 శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే – ఈ ఇద్దరు వ్యక్తులకూ శత్రువు ఒకరే కావడం! ‘‘నేను అవమానాల పాలైనప్పుడల్లా మీరు గౌరవంతో కిరీటం పెట్టారు నన్ను దుమ్మెత్తి పోస్తున్నప్పుడు నా నిజాయితీ ఆదర్శంపట్ల విశ్వాసం ప్రకటించారు నన్ను నియంతృత్వపు ఉక్కుపాదాల క్రింద నలుపుతున్నప్పుడు మీ నాయకుడిగా గుర్తించారు నన్ను నేను సమర్థించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు నన్ను సమర్థించారు ప్రతి సామాన్యమైన రీతిలో అత్యల్ప మానవునిగా సేవ చేయుటయే గర్వంగా భావిస్తుంటే మీరు నన్ను పైకెత్తి ప్రపంచం ముందు మీ ప్రతినిధిగా నిలబెట్టారు’’ అనీబిసెంట్ ఇంగ్లిష్లో రాసిన కవిత అంటూ 1989లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయాక గండిపేట ‘తెలుగు విజయం’ ఆఫీసులో జరిగిన పార్టీ మీటింగులో ఎన్టీఆర్ గారు ఈ కవితను వినిపించారు.పార్టీ పట్ల, సభ్యుల పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన విశ్వాసాన్ని తనవారే భగ్నం చెయ్యటం ఆయన ఊహించని విషయం. చివరకు తనవారి చేతిలో ఘాతుకానికి బలైపోవటానికి కారణాలు ఆయన మంచితనం, నిష్కాపట్యమే తప్ప మరొకటి కాదు. అటు వంటి నాయకుడిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుదార్లుగా చరిత్ర ఉన్నంతవరకూ ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితం, సినిమా, రాజకీయ జీవితాలు పరిశీలిస్తే మాట తప్పని మనిషిగా, పేదవర్గాల పట్ల సానుభూతి ఉన్న నాయకుడిగా నమ్మి వచ్చిన స్త్రీకి తాళికట్టి గౌరవాన్ని కాపాడిన మేరు నగ ధీరుడిగా కన్పిస్తారు. ఎన్టీఆర్ నిజంగా చారిత్రక పురుషుడే. ఒక మనిషి జీవితంలో ఎన్ని ఆరోహణా సోపానా లుంటాయో అవన్నీ అధివసించిన వ్యక్తి. 1923 మే 28న కృష్ణా జిల్లా, నిమ్మకూరు గ్రామంలో రైతుబిడ్డగా జన్మించి, ఉన్న ఆస్తులు పోగొట్టుకుని, కన్న ఊరుని విడిచి విజయవాడకు చేరింది ఆయన బాల్యం. తండ్రి చేసిన పాల వ్యాపారంలో తోడుగా నిలిచిన ఉత్తమ పుత్రుడు. నివసిస్తున్న పూరి పాకలో వర్షం వస్తే అది పడిపోకుండా తెల్లవార్లూ తండ్రితోపాటు నిట్టాడి కొయ్యను పట్టుకొని, కుటుంబాన్ని రక్షించుకొన్న కష్టజీవి. బ్రేకుల్లేని పాత హెర్క్యులస్ సైకిల్ మీద 60 కిలోల బరువును పెట్టుకొని పంక్చర్ అయిన సైకిల్ను నడిపించుకుంటూ 60 మైళ్ళు అర్ధరాత్రి విజయవాడ దాకా ప్రయాణం చేసిన సాహసి. స్నేహితుని వివాహానికి వెళ్లాల్సిన రైలు తప్పిపోతే ఆ పట్టాల వెంబడే 30 మైళ్ళు నడిచి వెళ్ళిన స్నేహశీలి. అంతేకాదు, తమ్ముడు త్రివిక్రమరావుకు ‘పెదమద్దా’ వాళ్ళ అమ్మాయిని ఇస్తామని చెప్పి తీరా ముహూర్తాలు పెట్టుకునే సమయానికి రాకుండా మొహం చాటేసినప్పుడు... మధ్యవర్తుల ద్వారా త్రివిక్రమరావుకు చదువులేదు, ఆస్తి లేదు, అందువల్ల భార్యను పోషించలేడు కనుక ఈ సంబంధం వదిలేస్తున్నామని వారన్నట్లు తెలియడంతో... ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంపుడు తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తిని అప్పటికప్పుడే తమ్ముడి పేర మార్చి వివాహం జరిపించిన సోదర ప్రేమికుడు. కష్టపడి బీఏ చదివి, సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సంపాదించి కూడా అక్కడ జరుగుతున్న అవినీతి నచ్చక ఆ ఉద్యోగం వదిలేసి సినీ రంగంలో భవిష్యత్తును వెతుక్కున్న నీతిమంతుడు. సినిమా రంగాన్ని 30 ఏళ్లకు పైగా శాసించిన కళాకారుడు. 1949లో ‘మనదేశం’లో చిన్న ఎస్సై పాత్రతో మొదలైన సినీ జీవితం అప్రతిహతంగా కొనసాగింది. సమయపాలన, అకుంఠిత దీక్ష అగ్రస్థానంలో నిలబెట్టాయి. నిర్మాతను ఎన్నడూ కష్టపెట్టలేదు. 1970 వరకు ఆయన రెమ్యునరేషన్ – వేలల్లోనే ఉండేది. ప్రతి చిత్రంలో తన వేషాన్ని 6 వారాల్లోగా పూర్తి చేసేవారు. 1969 వరకు నెలకొక్క సినిమా చొప్పున చేశారు. 1964 ఒక్క సంవత్సరంలో మాత్రం 15 సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. 1949 నుండి 1982 వరకు అంటే 33 సంవత్సరాల్లో సుమారు 300 సినిమాల్లో నటించారు. ఇందులో 140 చిత్రాలు వెయ్యి థియేటర్లలో 100 రోజులు ప్రదర్శితమయ్యాయి. 33 సినిమాలు 108 ప్రదర్శన శాలల్లో 25 వారాలు ప్రదర్శించబడి రజతోత్సవం జరుపుకున్నాయి. కళామతల్లికి ఎనలేని సేవ చేసి తన 60వ యేట రాజకీయాల్లో ప్రవేశించారు. తెలుగుభాష పట్ల మక్కువ కల్గిన ఆయన తన పార్టీకి ‘తెలుగుదేశం’ అని పేరు పెట్టుకుని, ఆత్మ గౌరవ నినాదంతో 1982 మార్చి 29న పార్టీని ప్రకటించి, కేవలం 9 నెలల్లోనే అధికారానికి తీసుకురావటం చారిత్రాత్మకం. 1965లో ఒకసారి, 1978లో రెండవసారి జరిపిన ప్రయోగాలు విఫలమై కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తి లేదనుకున్న తరుణంలో ఎన్టీఆర్ ఆకర్షణ ఆయన పార్టీకి బలంగా నిలబడి గెలిపించింది. నాడు కాంగ్రెస్ను ఎదిరించి నిలబడిన నాయకుడు ఎన్టీఆర్ అయితే... నేడు అదే కాంగ్రెస్ను రెండు రాష్ట్రాలలో మట్టి కరిపించిన ప్రజాకర్షణ మళ్లీ జగన్మోహన్రెడ్డి గారిదే. ఇద్దరి ఆశయం ఒక్కటే. సామాజిక న్యాయం, అగ్రకులాధిపత్యంలో ఎన్నో ఏళ్లుగా నలిగి ఓటుకే తప్ప పదవికి దూరంగా ఉంచబడ్డ బడుగు, బలహీన వర్గాలను ఆదరించి అక్కున చేర్చుకుంది ఈ ఇద్దరు నాయకులే. ‘పటేల్–పట్వారీ’ వ్యవస్థను తొలగించి ‘మండల’ వ్యవస్థను తెచ్చి ఎన్టీఆర్ ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని నడిపించారు. ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ ఇవ్వడం, పక్కా ఇళ్ళు నిర్మించడం, బీసీలకు 29 శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి 50 శాతం అవకాశాలు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే – ఈ మంచి పనులు చేసిన ఇద్దరు వ్యక్తులకూ శత్రువు ఒకరే. రాజకీయం అంటే అడ్డదారులే అని నమ్మినవాడు, అవినీతిని జీవిత లక్ష్యంగా చేసుకుని సొంత మామనే అధికారం కోసం వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చినవాడు చంద్రబాబు. తన స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని 1995 ఆగస్టు 25న ఘోరంగా పాతిపెట్టిన వ్యక్తి. అతని వలన ఎంతోమంది తమ రాజకీయ జీవితాన్ని వదులుకోవలసి వచ్చింది. నాదెండ్ల దగ్గరనుండి నల్లపరెడ్డి వరకు అందరూ బలి పశువులే. ఉన్నతమైన వ్యక్తిత్వంతో నిస్వార్థంగా ప్రజలకు మేలు చేద్దామనుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ పదవినీ, పార్టీనీ లాక్కొని చెప్పులేయించాడు. చివరకు బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపచేసిన ఇటువంటి నీచ మనస్తత్వం మానవ జాతిలో కనిపించదు. అవమాన భారంతో అల్లుడి దుర్మార్గాలను ఎదిరించలేక అలసిపోయిన ఎన్టీఆర్... ఆడియో, వీడియోల రూపంలో చంద్ర బాబు వెన్నుపోటు తెలియజేసి చివరకు ఆక్రోశిస్తూనే 1996 జనవరి 18వ తేదీన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ‘‘ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై వ్యాపించు కాల మేఘాళిలో’ అన్న శ్రీశ్రీ మాటలు ఈ విషాద దృశ్యానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఆయన ఆశయాల అడుగు జాడలలో నడుస్తూ, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని బహుశా ఆయన ఆత్మ ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ‘విషం కక్కే భుజంగాలో, మదం పట్టిన మాతంగాలో’ ఎవ్వరు అడ్డుపడినా జగన్మోహన్రెడ్డి తన ఆశయాల బాటలో ముందుకు సాగుతూనే ఉంటారు. ఉండాలి కూడా! వ్యాసకర్త: డా‘‘ నందమూరి లక్ష్మీపార్వతి రచయిత్రి, ఎన్టీఆర్ సతీమణి (నేడు ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం ప్రారంభం) -
దాసరి జయంతి: పాన్ ఇండియా దర్శకులకు సత్కారం
దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియా దర్శకులకు దాసరి కల్చరల్ ఫౌండేషన్ ఆద్వర్యంలో తెలుగు సినిమా వేదిక-ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ సమన్వయంతో ఎఫ్.ఎన్.సి సి క్లబ్ లో అంగరంగ వైభవంగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన బాలీవుడ్ దర్శకులు, నటీమణులు మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని అందుకుందని కితాబునిచ్చారు. దాసరి బయోపిక్ ను ‘దర్శకరత్న’ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాడివాక రమేష్ నాయుడు స్థాపించిన దాసరి కల్చరల్ ఫౌండేషన్... తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, ఎఫ్ టి పి సి అధ్యక్షులు చైతన్య జంగా సంయుక్త సారధ్యంలో దాసరి సంస్మరణ వేడుక హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు తరుణ్ భట్టాచార్య, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు బి.గోపాల్, వీరశంకర్, ముప్పలనేని శివ, ఆర్.నారాయణమూర్తి, చంద్రమహేష్, రాజా వన్నెంరెడ్డి, బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణమోహన్ రావు, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్, మాదాల రవి, మోహన్ గౌడ్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా దేశవ్యాప్తంగా 16 భాషలకు చెందిన దర్శకులకు సన్మానం చేశారు. అనంతరం సీనియర్ దర్శకులు ధవళ సత్యం సారధ్యంలో తాడివాక రమేష్ నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బహుభాషా బయోపిక్ "దర్శకరత్న" పోస్టర్ ను ఆవిష్కరించారు. -
గిరిజనుల పాలిట దేవుడు అల్లూరి సీతారామరాజు
బంజారాహిల్స్(హైదరాబాద్): తన వీరోచిత పోరా టాలతో తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించి గిరిజనుల పాలిట దేవుడిగా, ప్రజల్లో దేశ భక్తిని నింపిన స్వాతంత్య్ర సమరయోధుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్ర చిరస్థాయిలో నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రముఖుల జీవి తాలను ఈ తరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని జాతీయ సంబురాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లా డుతూ.. ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. ఏపీలోని లంబసింగిలో అల్లూరి మ్యూజియానికి రూ.35 కోట్లు కేటాయిం చామని, అందులో ఇప్పటికే రూ. 6.93 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాల్లోనే మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అల్లూరిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నామని చెప్పారు. సూపర్స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారానే ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలిసిందని, తాను ఆ సినిమాను 20 సార్లు చూశానని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలి: ఏపీ మంత్రి అవంతి ఏపీ పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసే విధంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కృషి చేయాలని కోరారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఒక జిల్లాకు అల్లూరి పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అల్లూరి పేరుతో విశ్వవిద్యాలయాల్లో గోల్డ్ మెడల్స్ను ప్రవేశ పెట్టాలన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ.. తన పన్నెండో ఏట నుంచే అల్లూరి అంటే ఇష్టమని.. తన వందో చిత్రం అల్లూరి సీతారామరాజు.. అని గుర్తు చేసుకున్నారు. తాను 365 సినిమాలలో నటించినా ఇప్పటికీ తనకు నంబర్ వన్ చిత్రం అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, హీరో మోహన్బాబు మాట్లాడుతూ.. రాజులు చాలా గొప్పవారని, వాళ్లల్లో రాజకీయం నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటుందని అన్నారు. రాజులంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు ఎన్.నాగరాజు, ప్రధాన కార్యదర్శి పి.నానిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో కృష్ణను సత్కరించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. -
కాంగ్రెస్తోనే దేశానికి పూర్వ వైభవం
సాక్షి, హైదరాబాద్: దేశానికి పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం గాంధీభవన్లో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం ఘనం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను రేవంత్రెడ్డి ఆవిష్కరించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. స్వాతంత్య్రం కోసం ఎంతో శ్రమించి.. శాంతియుత పోరాటంతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిందని గుర్తు చేశారు. అలీన విధానం, హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఫుడ్ సెక్యురిటీ, ఉపాధి హామీ, సాంకేతిక అభివృద్ధి అంతా కాంగ్రెస్తోనే సాధ్యమైందని వివరించారు. ప్రస్తుత పాలకులు కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బ తీయాలని చూస్తున్నారని, ఎందరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి మట్టి అంటదని స్పష్టం చేశారు. కుటుంబం అంటూ లేని ప్రధాని మోదీ ఆడ పిల్లల పెళ్లి వయసు పెంచి దేశంలో అలజడి సృష్టించారన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కి, మల్లు రవి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. -
గానకోకిల పాటకు పట్టాభిషేకం
పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పీ సుశీల జన్మదినోత్సవం సందర్భంగా 13 దేశాల నుంచి 50 మంది గాయనీమణులు 100 పాటలు గానం చేశారు. భారతదేశం, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఓమాన్, ఖతార్, బహరేయిన్, మలేషియా మరియు స్వీడన్ దేశాల నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శుభోదయం గ్రూప్ ఇండియా, శ్రీ సాంస్కృతిక కళా సారథి, సింగపూర్, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. డాక్టర్ వంశీ రామరాజు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కలపటపు, రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, అనిల్ కుమార్, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి, రాధిక నోరి, లక్ష్మీ శ్రీనివాస రామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గ్లోబల్ స్టార్డమ్ దక్కిన తొలి ఇండియన్ హీరో ఎవరో తెలుసా?
Sivaji Ganesan Birth Anniversary Google Doodle: భారీ బడ్జెట్లు, హై టెక్నికల్ వాల్యూస్, క్వాలిటీ మేకింగ్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియన్ సినిమాలు.. ఇవన్నీ ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవల్లో నిలబెతున్నాయి. వెండితెరపై తమ కటౌట్లతో విదేశీ అభిమానం సైతం సంపాదించుకుంటున్నారు మన నటులు ఇప్పుడు. అయితే కొన్ని దశాబ్దాల క్రితమే కేవలం ‘నటన’ ద్వారా తన స్టార్డమ్ను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి శివాజీ గణేషన్. ఈరోజు ఆయన 93వ జయంతి (అక్టోబర్ 1, 2021). ► మెథడ్ యాక్టర్గా పేరున్న శివాజీ గణేషన్.. తన నటన ద్వారా కమల్ హాసన్, రజినీకాంత్లాంటి వాళ్లెందరిపైనో ప్రభావం చూపించిన వ్యక్తి. ► అసలు పేరు గణేస(ష)మూర్తి.. పుట్టింది తమిళనాడు విల్లుపురంలో అక్టోబర్ 1, 1928న. ► ఏడేళ్ల వయసుకే థియేటర్ ఆర్టిస్ట్ అవతారం.. నాటకాల్లో ఆడ పాత్రలతో మంచి గుర్తింపు ► 1945లో శివాజీ కంద హిందూ రాజ్యం అనే నాటకంలో శివాజీ పాత్రను పోషించాడు. స్టేజీపై ఆయన నటనను చూసి మైమరిచిపోయిన ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి.. గణేసన్ను నటనలో ‘శివాజీ’గా అభివర్ణించాడు. అలా ఆయన పేరు అప్పటి నుంచి శివాజీ గణేసన్ అయ్యింది. ► 1952లో ప్రజాశక్తి సినిమా ద్వారా ఆయన తెరంగగ్రేటం చేశారు. అప్పటి నుంచి 300 సినిమాల్లో నటించారు. ► భావోద్వేగాలు పండించడంలో శివాజీ గణేషన్ దిట్ట. ప్రత్యేకించి కంచు కంఠంతో తమిళ సినిమాలో ఓ చెరగని ముద్ర వేసుకున్నారు ► విశేషం ఏంటంటే.. భారత సినీ రంగం నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి నటుడు ఈయనే!. ► 1960 ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్(వీరపాండియ కట్టబొమ్మన్కుగానూ) అవార్డును అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ నుంచి అందుకున్నారు. ఈ చిత్ర డైలాగులు నేటికి తమిళ నాట ప్రతిధ్వనిస్తుంటాయి. ► అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తొలి భారతీయ నటుడు కూడా ఈయనే!. 1962లో కల్చరల్ ఈవెంట్ కోసం శివాజీ గణేషన్ హాజరయ్యారు. అంతేకాదు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీ, శివాజీని కల్చరల్ అంబాసిడర్గా గుర్తించారు కూడా. ఆ తర్వాత ఎన్నో దేశాల్లో భారతీయ నటుడి హోదాల్లో పర్యటించారు శివాజీ గణేషన్. ► 1961లో ‘పాశమలర్’ కుటుంబ సమేత చిత్రంగా ఓ ట్రెండ్ సృష్టించగా.. 1964లో వచ్చిన ‘నవరాత్రి’ తొమ్మిది గెటప్లతో సరికొత్త రికార్డు సృష్టించాడు ► దైవ మగన్, పుదియా పరవై ..ఇలా ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ► తేవర్ మగన్(క్షత్రియ పుత్రుడు)లో క్యారెక్టర్కి నేషనల్ అవార్డు(స్పెషల్ జ్యూరీ) దక్కింది శివాజీ గణేసన్కి. కానీ, ఎందుకనో ఆయన ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. ► 1995లో ఫ్రాన్స్ గౌరవం, 1997లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు శివాజీ గణేషన్. ► తమిళ సీనియర్ నటుడు ప్రభు ఈయన తనయుడే. ఇక మనవడు విక్రమ్ ప్రభు(తెలుగులో వచ్చిన గజరాజు హీరో) కోలీవుడ్లో యంగ్ హీరోగా ఉన్నాడు. ► ది లాస్ ఏంజెల్స్ టైమ్స్ శివాజీ గణేషన్ను ‘మార్లోన్ బ్రాండో ఆఫ్ సౌత్ఇండియన్’గా అభివర్ణించింది. ► ఓ స్టార్ హీరో సినిమాలో పాటలు లేకపోవడం జరిగింది కూడా శివాజీ గణేసన్ విషయంలోనే. ఆయన నటించిన ‘అంధ నాల్’లో ఒక్క పాట కూడా ఉండదు. ► పరదేశీ(1953), పెంపుడు కొడుకు, మనోహర, బొమ్మల పెళ్లి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, రామదాసు, బంగారు బాబు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త(అలెగ్జాండర్ పాత్ర), నివురు గప్పిన నిప్పు, బెజవాడ బొబ్బులి, విశ్వనాథ నాయకుడు(నాగమ నాయక పాత్ర), అగ్ని పుత్రుడు లాంటి తెలుగు సినిమాలతోనూ అలరించారు. ► ఆత్మబంధువు లాంటి తమిళ డబ్బింగ్ సినిమా, అందులోని పాటల్ని తెలుగు ప్రేక్షకులు చాలామంది ఇష్టపడుతుంటారు. ► 1999 సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పడయప్ప(నరసింహా) శివాజీ గణేసన్ తెర మీద కనిపించిన చివరి సినిమా. ► శ్వాసకోశ సంబంధిత సమస్యలతో జులై 21, 2001న ఆయన కన్నుమూశారు. ► కలైమామణి, పద్మ శ్రీ, పద్మ భూషణ్, చెవలియర్(ఫ్రాన్స్), దాదా సాహెబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు అందుకున్నారు శివాజీ గణేషన్. ► శివాజీ గణేషన్ జయంతి సందర్భంగా గూగుల్ ఇవాళ డూడుల్తో ఆయన్ని గుర్తు చేసింది. ► బెంగళూరుకు చెందిన నూపూర్ రాజేష్ చోక్సీ.. ఈ డూడుల్ను క్రియేట్ చేశాడు. - సాక్షి, వెబ్స్పెషల్ -
గురజాడ అప్పారావుకు సీఎం జగన్ ఘన నివాళి
సాక్షి, అమరావతి: మహాకవి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా మంగళవారం ఆయనకు సీఎం జగన్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహానీయుడిని మరువదు ఈ తెలుగు నేల’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: యువతకు గుడ్న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహనీయుని మరువదు ఈ తెలుగునేల. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2021 -
ఆయన మాట విరుపులు చాలు.. నవ్వులే నవ్వులు
Dharmavarapu Subramanyam Birth Anniversary: వెండితెరపై కొందరు పంచిన నవ్వులు ఎల్లకాలం గుర్తిండిపోతాయి. ఆ లిస్ట్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ‘అబ్బా.. అబ్బే.. మాక్కూడా తెలుసు బాబూ.. ఏంది నువ్వు..’ అంటూ చేతులు పిసుక్కుంటూ ఆయన నోటి నుంచి జారే మాటల విరుపులు ప్రేక్షకుల పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పాత్ర ఏదైనా పెద్దగా కష్టపడకుండా బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో అలరించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా లెక్చరర్ పాత్రల్లో ఆయన పంచిన నవ్వుల్ని అంత ఈజీగా మనం మరిచిపోగలమా? ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి ఇవాళ.. ►ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో జన్మించారు. ఒంగోలులోని సీఎస్ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారాయన. ► విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగం సైతం చేశారాయన. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లుతో పరిచయం ధర్మవరపు జీవితాన్ని మలుపు తిప్పింది. తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ► కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మ ఆయన నటన కెరీర్లో ప్రముఖంగా చెప్పుకోదగింది. అందులో నటించడమే కాదు.. కొన్ని ఎపిసోడ్స్ను సైతం డైరెక్ట్ చేశారాయన. 80వ దశకంలో దూరదర్శన్లో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ సెన్సేషన్ హిట్గా నిలిచింది. ► ఆనందో బ్రహ్మ ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి పేరుతో పాటు సినిమా అవకాశాల్ని తెచ్చిపెట్టింది. జంధ్యాల చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో సినిమాల్లోకి అడుగుపెట్టారాయన. అందులో కొడుకు, స్నేహితుడితో వైరం పెట్టుకునే తిక్క లెక్కల మాష్టార్ క్యారెక్టర్లో ధర్మవరపు నటన అలరిస్తుంది. ► బావా బావా పన్నీరు, స్వాతి కిరణం, పరుగో పరుగు, ష్ గప్చుప్, ఓహో నా పెళ్లంట, నువ్వే కావాలి, ఆనందం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్, నీ స్నేహం, సొంతం, నువ్వే నువ్వే, జయం, మన్మథుడు, ఒక్కడు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దొంగోడు, రెఢీ, వసంతం, వర్షం, వెంకీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, జై చిరంజీవా, డార్లింగ్, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, జల్సా, చిరుత, మహేష్ ఖలేజా, లీలా మహల్ సెంటర్.. ఇలా ఎన్నో చిత్రాలతో అలరించారు. ► క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ స్కోప్ ఉన్న పాత్రల్లో ఆయన నటనా ప్రస్థానం కొనసాగింది. ఈ క్రమంలో అగ్రహీరోల సరసన సైతం ఆయన నటించారు. ► మణ్ణిన్ మెయింధాన్, చెన్నై కాదల్.. తమిళ చిత్రాల్లోనూ నటించారాయన. ► ‘యజ్ఞం’, ‘ఆలస్యం అమృతం’కు ఉత్తమ కమెడియన్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు. ► జంధ్యాల, తేజ తీసిన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లు ప్రత్యేకంగా నిలిచాయి. ► ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘తోకలేనిపిట్ట’ ► రాష్ట్ర సాంస్కృతికమండలి చైర్మన్గానూ ఈయన పనిచేశారు. ► సాక్షి టీవీలో ఆయన హోస్ట్గా వ్యవహరించిన రాజకీయ వ్యంగ్య కార్యక్రమం ‘డింగ్ డాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ► 2013 డిసెంబర్ 7న 59 ఏళ్ల వయసులో కాలేయ కేన్సర్తో ఆయన కన్నుమూశారు. తెలుగు ఆడియొన్స్కు మరిచిపోలేని హస్యానుభూతుల్ని మిగిల్చి వెళ్లిపోయారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. - సాక్షి, వెబ్స్పెషల్ -
రియల్ హీరో.. యే దిల్ మాంగే మోర్!
నాయకుడంటే.. ఏదో ముందుండి నడిపిస్తున్నాడనే పేరుంటే సరిపోదు. లక్ష్యసాధనలో తన వెనకున్న వాళ్లకు సరైన దిశానిర్దేశం చేయాలి. విజయం కోసం అహర్నిశలు కృషి చేయాలి. అవసరమైతే తెగువను ప్రదర్శించాలి.. త్యాగానికి సిద్ధపడాలి. ఇది మిగతా వాళ్ల గుండెల్లో ధైర్యం నింపుతుంది. గెలుపు కోసం చివరిదాకా పోరాడాలనే స్ఫూర్తిని కలగజేస్తుంది. కార్గిల్ వార్లో అసువులు బాసిన వీరులెందరో. అందులో కెప్టెన్ విక్రమ్ బాత్రా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. కారణం.. పైన చెప్పిన లక్షణాలన్నీ ఆయన ప్రతిబింబించారు కాబట్టి. అన్నట్లు ఇవాళ ఈ కార్గిల్ అమరవీరుడి జయంతి. ఈ సందర్భంగా ఆ రియల్ హీరోను స్మరించుకుంటూ... ►హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్ జిల్లా ఘుగ్గర్ గ్రామంలో 1974 సెప్టెంబర్ 9న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు. ► చదవులోనే కాదు.. ఆటపాటల్లోనూ రాణిస్తూ ఆల్రౌండర్గా పేరు సంపాదించుకున్నారు. ► విక్రమ్ బాత్రా చిన్నప్పటి నుంచే ధైర్యశాలి. కరాటేలో గ్రీన్ బెల్ట్ హోల్డర్. టేబుల్ టెన్నిస్ నేషనల్ లెవల్లో ఆడారు. ► నార్త్ ఇండియా ఎన్సీసీ కాడెట్(ఎయిర్ వింగ్) నుంచి ఉత్తమ ప్రదర్శన అవార్డు సైతం అందుకున్నారు ► డిగ్రీ అయిపోగానే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ అయ్యారు. ► 1996లో ఆయన కల నెరవేరింది. ఇండియన్ మిలిటరీ ఆకాడమీలో చేరారు. ► విక్రమ్ బాత్రా.. మన్నెక్షా బెటాలియన్కి చెందిన జెస్సోర్ కంపెనీ(డెహ్రాడూన్)లో చేరి, ఆపై లెఫ్టినెంట్గా, అటుపై కెప్టెన్ హోదాలో కార్గిల్ హోదాలో అడుగుపెట్టారు. ► డేరింగ్ అండ్ డాషింగ్ ఆటిట్యూడ్ ఉన్న విక్రమ్ను తోటి సభ్యులుగా ముద్దుగా షేర్షా అని పిల్చుకునేవాళ్లు ► గాంభీర్యంగా పైకి కనిపించే బాత్రా చాలా సరదా మనిషి. ఆయన చిరునవ్వే ఆయనకు అందమని చుట్టుపక్కల వాళ్లు చెప్తుంటారు ► ఆయన నోటి నుంచి ఓ ఇంటర్వ్యూలో వచ్చిన ‘యే దిల్ మాంగే మోర్’ డైలాగ్.. తర్వాతి కాలంలో పెద్ద బ్రాండ్కి ప్రచార గేయం అయ్యిందని చెప్తుంటారు కొందరు. అందులో నిజమెంతో గానీ.. ఆయన నుంచి మాత్రం ఆ మాట వచ్చిన విషయం వాస్తవం. ► కార్గిల్ వార్లో వేల అడుగుల ఎత్తున శత్రువులు సైతం ఊహించని మెరుపుదాడికి సిద్ధమయ్యారు ► దాడిలో తీవ్రంగా గాయపడ్డా కూడా శత్రువులకు వెన్నుచూపెట్టలేదు ఆయన. ముగ్గురు శత్రువుల్ని మట్టుబెట్టిన మరీ 24 ఏళ్లకు దేశం కోసం వీరమరణం పొందారు. ఆ పోరాటం మిగతా వాళ్లలో స్ఫూర్తిని విజయ బావుటా ఎగరేయించింది. ► మరణాంతరం పరమ వీర చక్రతో పాటు రియల్ హీరోల జాబితాలో చోటుసంపాదించుకుని యావత్ దేశం నుంచి గౌరవం అందుకున్నారాయన. ► డిగ్రీ టైంలో డింపుల్ ఛీమాతో నడిచిన ప్రేమ కథ.. విక్రమ్ వీరమరణంతో పెళ్లి పీటలు ఎక్కకుండానే విషాదంగా ముగిసింది. అంతా బలవంతం పెట్టినా విక్రమ్ జ్ఞాపకాలతో ఉండిపోవాలనుకుని ఆమె వివాహం చేసుకోలేదు. ‘రక్త్ సింధూర్’ ప్రేమ కథగా విక్రమ్-డింపుల్ కథ చరిత్రలో నిలిచిపోయింది. విక్రమ్ పుట్టినరోజు, మరణించిన రోజు డింపుల్ తప్పకుండా విక్రమ్ ఇంటికి వెళ్లి.. ఆయన పేరెంట్స్తో కాసేపు గడుపుతుంటుంది కూడా. ► రీసెంట్గా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన షేర్షా.. ఈయన జీవిత కథ ఆధారంగానే తీసింది. ఇందులో డింపుల్ పాత్రను కియారా అద్వానీ పోషించింది. Heartfelt Tributes to great patriot Param Vir Chakra Captain #VikramBatra on his birth anniversary. He’s an epitome of courage, sacrifice and bravery. His exemplary bravery and valour would always inspire the Nation. #AmritMahotsav pic.twitter.com/2QDQWoYI1n — Ministry of Culture (@MinOfCultureGoI) September 9, 2021 - సాక్షి, స్పెషల్ డెస్క్ -
ధ్యాన్చంద్ జయంతి.. ఆసక్తికర విషయాలు
-
‘క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్చంద్కు గొప్పనివాళి’
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. భారత్ దిగ్గజ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్కు ఘన నివాళులు అర్పించారు. క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్చంద్కు గొప్ప నివాళి అని పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతోనే భారత్ క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుందని అన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్లో భారత్ క్రీడాకారులు విశేషమైన ప్రతిభ కనబర్చారని అన్నారు. సాధించిన 7 పతకాలలో.. హకీ విభాగంలో ఒక పతకం గెలుచుకున్నామని తెలిపారు. ఇదే స్పూర్తిని భవిష్యత్లో కూడా కొనసాగించాలని అన్నారు. చదవండి: త్వరలో సిద్ధూ, అమరీందర్లతో రావత్ చర్చలు -
Telugu Language Day: నేడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల పాలకుల నిర్వాకం, నిబద్ధత లేని కారణంగా ప్రస్తుతం అమ్మ భాష రోజురోజుకూ ప్రాధాన్యత కోల్పోతూ నిరాదరణకు గురవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరభాషా వ్యామోహం పెంచుకుంటున్నారు. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మా రాయి. ఫలితంగా సొంత గడ్డపైనే తెలుగు పరాయిదైపోయింది. రాష్ట్ర ఏర్పాటుకు ఊతమిచ్చిన తెలంగాణ భాష ప్రత్యేకమైనది. ఆ భాషకు న్న శక్తితోనే కవులు, రచయితలు అందించిన సాహిత్యం ఉద్యమానికి చైతన్యం తీసుకువచ్చింది. తెలంగాణ భాష పదజాలం పౌరుషాన్ని, రోషాన్ని నింపి రాష్ట్ర సాధన వరకు వెన్నుదన్నుగా నిలిచిన మన అమ్మ భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. సదాస్మరణీయుడు.. తెలుగుభాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి అందించిన సేవలు సదాస్మరణీయం. తెలుగు భాషలో గ్రాంథిక వాదానికి స్వస్తి చెప్పి, వ్యవహారిక వాదానికి శ్రీకారం చుట్టిన భాషోద్యమకారుడాయన. గిడుగు జయంతినే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పని చేశారు. సంప్రదాయక విద్య కంటే ఆధునిక విద్యలో విశాల దృష్టి అవరమని చెప్పారు. 1913లో వ్యవహారిక భాషలోనే విద్యాబోధన జరగా లని ఆనాటి మద్రాస్ గవర్నర్కు విజ్ఞాపన పత్రం అందజేశారు. తెలుగు–సవర, ఇంగ్లిష్–సవర నిఘంటువులను, గద్య చింతామణి, వ్యాసావళి, నిజమైన సంప్రదాయం మొదలగు గ్రంథాలు ఆయన కీర్తిని ప్రకాశమానం చేశాయి. తెలుగు భాషలోని సొబగులను సామాన్య ప్రజలకు అందించడంలో గిడుగు ప్రయత్నం ప్రశంసనీయం. 1919లోనే మొట్టమొదటి తెలుగు వ్యవహారిక భాషా పత్రికను స్థాపించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అ ప్పారావు వంటి సాహితీవేత్తలతో కలిసి అదే ఏడాది ఆంధ్రాభాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు. సామాన్యుల పట్ల మనకు శ్రద్ధ ఉండాలని, పేదవారి ముఖాల్లో వెలుగులు విరజిమ్మాలంటే భాషాసంస్కరణ ఒక్కటే మార్గమని గట్టిగా విశ్వసించిన ఆయన 1940 జనవరి 22న స్వర్గస్తులయ్యారు. తెలుగును పరిరక్షించాలి ఉన్నత తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృ భాషలో బోధన కొనసాగిస్తూ తెలుగు భాషను పరిరక్షించాలి. ప్రాథమిక చదువులు తల్లి భాషలో సాగితేనే జ్ఞానార్జన, ఆలోచనాశక్తిని, ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. ప్రభుత్వం కూడా తెలుగు చదివిన వారికి ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తే తెలుగు నిత్యనూతనమై విరాజిల్లుతుంది. – దాస్యం సేనాధిపతి, కవి, రచయిత, సాహితీ విమర్శకులు మాతృభాష వైపు మళ్లాలి ప్రపంచీకరణ ప్రభావంతో మన భాషా సంస్కృతులను పరిరక్షంచుకునే ఆత్మరక్షణలో పడ్డాం. ఇది ఆత్మగౌరవ సమస్య. ఆంగ్ల భాష వ్యామోహంలో నుంచి మాతృభాష వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరం తెలుగు భాషను కాపాడున్నవారం అవుతాం. ఆ దిశగా ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలి. – కేఎస్.అనంతాచార్య, కవి, రచయిత చదవండి: మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె -
చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే!
Google Doodle Sarla Thukral: ఆమె చీర కట్టింది. కాక్పిట్లో కూర్చుంది. ధైర్యంగా ఎయిర్క్రాఫ్ట్ నడిపింది. వెయ్యి గంటల ప్రయాణం తర్వాత దేశంలోనే తొలిసారి ‘ఏ’ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. ఆ టైంకి ఆమె వయసు 21 ఏళ్లు మాత్రమే. అందుకే పైలెట్ సరళ పేరు చరిత్రకెక్కింది. సరళ త(తు)క్రల్.. భారత తొలి మహిళా పైలెట్. ఎయిర్క్రాఫ్ట్ను.. అదీ సంప్రదాయ చీరకట్టులో నడిపిన మొదటి మహిళా పైలెట్ ఈమె. ఇవాళ (ఆగష్టు 8న) ఆమె 107 జయంతి. అందుకే గూగుల్ ఆమె డూడుల్తో గుర్తు చేసింది. సాధారణంగా గూగుల్ డూడుల్ రెండుసార్లు రిపీట్ అయిన సందర్భాలు లేవు. నిజానికి కిందటి ఏడాదే సరళ పేరు మీద డూడుల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ టైంలో కేరళలో విమాన ప్రమాదం జరిగింది. అందుకే ఆ టైంలో సహాయక చర్యలకు గుర్తుగా డూడుల్ను నిలిపివేశారు. At the age of 21, Sarla Thukral soared to new heights by taking her first solo flight and becoming India’s first woman pilot 👩✈️ Today's #GoogleDoodle honours this incredible pilot, designer, and entrepreneur, on her 107th birth anniversary. ➡️ https://t.co/5dF5JBxUY2. pic.twitter.com/UBeh7LuJkz — Google India (@GoogleIndia) August 8, 2021 ఈసారి ఆమె మీద గౌరవార్థం 107వ జయంతి సందర్భంగా డూడుల్ను ఉంచినట్లు గూగుల్ ప్రకటించింది. ‘వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్ఫూర్తినిస్తూ చరిత్రలో ఆమె ఒక చెరగని ముద్ర వేశారు. అందుకే ఆమె కోసం రెండోసారి డూడుల్ని సృష్టించాం’ అని ప్రకటించింది గూగుల్. ఎయిర్క్రాఫ్ట్లో చీరకట్టులో ఉన్న ఈ డూడుల్ను వ్రిందా జవేరీ రూపకల్పన చేశారు. 16 ఏళ్ల వయసుకే పెళ్లి.. సరళ.. 1914లో పుట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్లైంది. ఆమె భర్త పైలెట్. ఆయన స్ఫూర్తితోనే పైలెట్ అవ్వాలనుకుంది. నాలుగేళ్ల పాప ఉండగానే.. 21 ఏళ్ల వయసులో చీర కట్టులో విమానం నడిపి ఏ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. లాహోర్ ఫ్లైయింగ్ క్లబ్ తరపున ఈ ఘనత సాధించాక.. కమర్షియల్ పైలెట్ శిక్షణ కోసం జోధ్పూర్ వెళ్లింది. అయితే 1939లో ఆమె భర్త చనిపోవడం, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కమర్షియల్ పైలెట్ కావాలనే కల చెదిరింది. ఆపై లాహోర్కు వెళ్లి ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్ కోర్సులు చేసింది. విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆర్పీ త(తు)క్రల్ను వివాహం చేసుకుంది. ఆపై ఆభరణాల డిజైనింగ్, బట్టల డిజైనింగ్ వ్యాపారంతో ఎంట్రప్రెన్యూర్గా పెద్ద సక్సెస్ అయ్యింది. 2008లో సరళ తక్రల్ అనారోగ్యంతో కన్నుమూసింది. -
తెలంగాణ రణాన్ని, నినాదాన్ని చాటినవాడు
తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఉద్యమనేత, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం, అక్కంపేట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అధ్యాపకుడిగా, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకుల పతిగా సేవలు అందించిన జయ శంకర్ ఎప్పుడూ తెలంగాణ వాదాన్ని వదిలిపెట్ట లేదు. విద్యార్థిదశ నుంచి కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటు వంటి, నిర్మాణాత్మకమైన, నిక్కచ్చిౖయెన మనస్తత్వం గలవాడు ఆయన. తెలంగాణలో జరుగుతున్న ఆంధ్ర వలసవాదుల, సమైక్యవాదుల దోపిడీ నుండి తెలం గాణ విముక్తి కోసం కంకణం కట్టుకున్న విద్యావేత్త. మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు అధికారం కావాలని ప్రశ్నించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ ప్రజలు ఎన్నాళ్లు యాచించా లనే ఒక కసి, పట్టుదలతో 1952లో నాన్ ముల్కీ, ఇడ్లీ, సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, తనదైన శైలిలో కాకతీయ, ఉస్మానియా విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు, ఆచార్యులతో సమా వేశాలు ఏర్పాటుచేసి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరంగా చెప్పారు. ఆయా విశ్వవిద్యా లయాలలో చదువుతున్న విద్యార్థులను, పరిశోధకు లను కూడగట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నం మరు వలేనిది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యావంతులు, మేధావులు ప్రతిఘటించాలనీ; ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలనీ; విద్యా వంతులమైన మనమే గళం విప్పకపోతే ఎలా? మేధా వులు సామాజిక బాధ్యతను విస్మరించడం క్షంతవ్యం కాదనీ వక్కాణించారు. నాలుగు గోడల మధ్యలో కుర్చొని, కేవలం నినా దాలు చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారం ఉండదని బలంగా నమ్మిన వ్యక్తి జయశంకర్. అందుకే సమస్యలకు దారితీసిన కారణాలను సాక్ష్యా ధారాలతో, శాస్త్రీయంగా, గణాంకాలతో సహా నిర్భ యంగా, నిర్మొహమాటంగా విశ్లేషిస్తూ అనేక రచనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలం గాణ రణాన్ని, నినాదాన్ని చాటిచెప్పిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కల్వ కుంట్ల చంద్రశేఖరరావు తన వాణి, బాణీæ వినిపి స్తున్న క్రమంలోనే ప్రజల మద్దతుతో 2001లో తెలం గాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. ఒకానొక సంద ర్భంలో జయశంకర్ మాట్లాడుతూ, ‘‘అబ్తో ఏకీ హీ ఖ్వాయిష్ హై, ఓ తెలంగాణ దేఖ్నా మర్ జానా (ఇప్పుడైతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది, అది చని పోయేలోగా తెలంగాణ ఏర్పాటు కళ్ళారా చూడటం); అది కేవలం తెలంగాణ మొనగాడు ‘రావు సాబ్’తోనే సాధ్యం అవుతుంది, తర్వాత నేను చనిపోవాలి’’ అని అన్న సందర్భాలు అనేకం. జయశంకర్ మార్గదర్శ కత్వంలో కేసీఆర్ ఆమరణ నిరాహరదీక్ష చేపట్టి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు గడగడలాడించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేయక తప్పలేదు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొనడం, ఖంగు తిన్న సమైక్యవాదులు ఆ ప్రకటనను జాతి వ్యతిరే కమైనదిగా, ‘కాగ్నిజబుల్ అఫెన్స్’గా పేర్కొనడం, తదుపరి జరిగిన పరిణామాలతో డిసెంబర్ 23న మరొక ప్రకటన చేసి, శ్రీకృష్ణ కమిటీ రూపంలో తెలం గాణ ప్రజలను గాయపరచడం జరిగింది. తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసి, నిరవధికంగా ఉద్యమా లను చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెచ్చిన ఫలితంగా 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోకసభ ఆమోదం లభిం చింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్య నాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంతవరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, 2014 పిభ్రవరి 20న రాజ్య సభలో బిల్లుకు య«థాతథంగా మూజువాణీ ఓటుతో ఆమోద ముద్ర పడింది. 2014 జూన్ 2 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ‘సారు’ కలల తెలంగాణ ఏర్పడింది. అయితే ప్రత్యేక తెలం గాణ రాష్ట్రాన్ని చూడకుండానే జయశంకర్ అనా రోగ్యంతో 2011 జూన్ 21న తుదిశ్వాస విడిచారు. -డా. సంగని మల్లేశ్వర్ వ్యాసకర్త విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ 98662 55355 (నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి) -
అవ్యవస్థ ఉన్నన్నాళ్లూ రావిశాస్త్రి సజీవం
తన అపారమైన కృషి ద్వారా ఇరవయ్యో శతాబ్ది రెండో అర్ధ భాగపు తెలుగు సామాజిక, సాహిత్య జీవితం మీద అసాధా రణమైన ప్రభావం వేసిన రాచ కొండ విశ్వనాథశాస్త్రి (30 జూలై 1922–10 నవంబర్ 1993) శత జయంతి సంవత్సరం ఇవాళ మొదలవుతున్నది. ఆయన జీవితం గురించీ రచన గురించీ తలుచు కోగానే గుర్తుకొచ్చే అంశాలు–ధైర్యమైన వస్తువుల ఎంపిక, అపురూపమైన శిల్పం, సునిశితమైన విమర్శా దృక్పథం, సువిశాలమైన, లోతైన దూరదృష్టి, చురుక్కుమనిపించే వ్యంగ్యం, కవితాత్మకమైన వచనం, తీగలు తీగలుగా సాగే వర్ణనా చాతుర్యం, ఎప్పటికీ గుర్తుండిపోయే, కోటబుల్ కోట్స్గా పనికొచ్చే పదునైన వ్యాఖ్యలు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని తుమ్మ పాల గ్రామానికి చెందిన రావిశాస్త్రి తండ్రి న్యాయవాద వృత్తి వదిలి వ్యవసాయంలోకి దిగారు. ‘‘మా నాన్న ప్లీడరుగా పదేళ్లే ప్రాక్టీసు చేసేరు. ఆ వృత్తిలో ఉండలేక వ్యవసాయం చేసేరాయన. వ్యవసాయం చెయ్యలేక, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్లీడరీ వృత్తిలోనే ఉండిపోయేన్నేను’’ అని తానే రాసుకున్నట్టు రావిశాస్త్రి ఇరవై ఏడో ఏట న్యాయవాద జీవితం ప్రారంభించి చివరిదాకా అందులోనే ఉన్నారు. సమాంతరంగా అంతకు అంత సాహిత్య కృషీ చేశారు. 1942లో బీఏ ఆనర్స్ పూర్తి చేసి, మిలిటరీ అకౌంట్స్ శాఖలో పూనా, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలలో పనిచేసి, 1946–48ల్లో మద్రాసులో లా చదివి, 1949లో విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. పేదలకు న్యాయం అందించడానికి చేసే కృషిలో ఆయనకు సహజంగానే న్యాయవ్యవస్థ కోరలలో చిక్కుకున్న అమాయకులు, వేశ్యలు, అక్రమ సారావ్యాపార సామ్రాజ్యాలలో అట్టడుగు అంచుల అభాగ్యులు, పెరుగు తున్న నగరంలో విస్తరిస్తున్న నేరమయ అధోజగత్ వాసులు పరిచితులూ, క్లయింట్లూ అయ్యారు. పదమూడో ఏటనుంచే రచనమీద ప్రారంభమైన ఆసక్తి, పదిహేనో ఏట అచ్చయిన తొలి కథ, విస్తారమైన అధ్యయనం వల్ల 1949కి ముందే మొదలైన సాహిత్య జీవితానికి అటు మిలిటరీ అకౌంట్స్ ఉద్యోగంలో దేశ మంతా తిరిగి సంపాదించిన జీవితానుభవం, ఇటు న్యాయవాద వృత్తిలో అట్టడుగు ప్రజల జీవితాలతో సన్ని హిత పరిచయం, మార్క్సిస్టు దృక్పథం, రాజకీయ విశ్వా సాలు పదును పెట్టాయి. సాహిత్య సృజన సాధనలో భాగమైన అంతకు ముందరి కథలు పక్కనపెట్టినా, అల్ప జీవి నవల (1953) నుంచి ఇల్లు నవల (1993) వరకూ నిండా నాలుగు దశాబ్దాలు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రబలంగా ప్రచండంగా వీచిన గాలి ఆయన. ఈ రెండు నవలల మధ్యలో మరొక ఐదు నవలలు (రాజు–మహిషి 1965, గోవులొస్తున్నాయి జాగ్రత్త 1966, రత్తాలు– రాంబాబు 1976, సొమ్మలు పోనాయండి 1980, మూడు కథల బంగారం 1982), డెబ్బైకి పైగా కథలు, మూడు నాటకాలు, దాదాపు రెండు వందల వ్యాసాలు, వచన రచ నలు, నేరుగా రాసిన కొన్ని కవితలు, అనేక ఉపన్యా సాలు... కనీసం మూడు వేల పేజీల సృజన. పోలీసు వ్యవస్థ అక్రమాలు, న్యాయవ్యవస్థ అన్యా యాలు–ఆయన రాసిన ఐదారు దశాబ్దాల తర్వాత కూడా ఈ సమాజంలో కొన్ని యథాతథంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే రూపం మార్చుకున్నట్టు కనబడుతున్నప్పటికీ ఇంకా దుర్మార్గంగా తయారయ్యాయి. అందువల్లనే ఆయన ఇవాళ్టికీ సజీవంగా ఉంటారు. ‘‘...రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవల్సిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హానీ, చెడ్డకి సహాయమూ చెయ్యగూడదని నేను భావిస్తాను’’ అని ఆయన అలవోకగా చెప్పిన మాటలు రచయితల దృక్పథ ప్రాధాన్యతను, పాఠకుల సాహిత్యా భిరుచినీ నిర్దేశిస్తాయి. రావిశాస్త్రి రచనల్లో ఆరు సారా కథలు మాత్రమే చది వినా ఆయన అద్భుతత్వం పాఠకుల కళ్లకు కడుతుంది. ఆంధ్రప్రదేశ్లో తొలి మద్యనిషేధం అమలైన కాలంలో ఆ నిషేధాన్ని అమలు చేయవలసిన వ్యవస్థల పూర్తి సహకారంతో అక్రమ సారావ్యాపారం ఎట్లా సాగిందో, ఆ వ్యాపారంలో చిన్న చేపలను పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎట్లా పీడించాయో, ఆ వ్యథార్థ జీవన యథార్థ దృశ్యంలో ఎంత కరుణ, బీభత్సం, విషాదం, వ్యంగ్యం, వంచన దాగి ఉన్నాయో ఆ కథలు పాఠకులకు చూపు తాయి. అందుకే ఈ కథలు 1962లో పుస్తకంగా వెలువ డినప్పుడు రాసిన ముందుమాటలో ‘‘ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగింపజేసే కళాఖండాలను మాత్రమే నేను ఉత్కృష్ట రచనలుగా అంగీకరిస్తాను’’ అంటూ, ఆ రసాను భూతికి ‘రసన’ అనే కొత్త పేరు పెట్టి, అది తాను చార్లీ చాప్లిన్ చిత్రాలలో, పికాసో గుయెర్నికాలో, డికెన్స్ నవ లల్లో, గురజాడ రచనల్లో గుర్తించాననీ, అది రావిశాస్త్రి రచనల్లో కూడా ఉందనీ శ్రీశ్రీ అన్నాడు. ఈ రసన సృష్టికి రావిశాస్త్రికి పునాదిగా నిలిచినది అవ్యవస్థ మీద ఆగ్రహం. ‘‘విప్లవాలూ యుద్ధాలూ లేకుండా లోకంలో న్యాయం జరిగిపోతే, దేముడికి కానీ మనకి కానీ అంతకంటే కావలసిందేముంది?!... నా గుండెల మీద కూర్చున్న పెద్దపులి మనసు మార్చుకొని సన్యాసం పుచ్చుకొని, కమండలం పట్టుకొని తావళం తిప్పుకొని వాయుభక్షణ చేసుకొంటూ హరినామ సంకీ ర్తనలో కాలం గడుపుకుంటే దానికీ నాకూ పేచీనే లేదు. దిక్కపోతేనే పేచీ. ఇది చదివిన నా స్నేహితులు ఒకాయన చిరునవ్వు నవ్వి, మీ గుండెల మీద కూర్చున్నది పెద్దపులి కాబట్టి మారదు; కానీ ఆ కూర్చున్నది మనిషైతే మారొచ్చు కదా అన్నారు. అప్పుడు నావంతు ప్రకారం నేను చిరునవ్వు నవ్వి, వాడే మనిషైతే అలా కూర్చోనే కూర్చోడు కదా అన్నాను’’ (రాముడు, 1970) అని రాసినప్పుడు రావిశాస్త్రి వ్యక్తీకరించినది ఆ ఆగ్రహాన్నే. తన అనుభవంలోకి వచ్చిన అవ్యవస్థకు సాహిత్యంలో అద్దం పట్టిన, దాని మీద తన ఆగ్రహాన్ని వ్యక్తీకరించిన రావిశాస్త్రి ఆ అవ్యవస్థ కొనసాగి నంతకాలమూ సజీవంగానే ఉంటారు, శతజయంతి ఒకా నొక మైలురాయి మాత్రమే. -ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త వీక్షణం సంపాదకుడు మొబైల్ : 98485 77028 (రావిశాస్త్రి శతజయంతి సంవత్సరం ప్రారంభం) -
చాలా మిస్ అవుతున్నానమ్మా.. సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్
కరోనా కష్టకాలంలో దేవుడిలా వచ్చి నిరుపేదలను ఆదుకున్న ‘రియల్ హీరో ’సోనూసూద్. కార్మికులు మొదలు.. రైతులు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి అడిగిన సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు చేతికి ఎముక లేదన్నట్లుగా సాయం చేస్తున్నాడు. తాజాగా ఈ రియల్ హీరో తన తల్లి జయంతి సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ.. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలనుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. ఈ మెసేజ్లు నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో.. ఎప్పటికీ వ్యక్తిపరచలేవు. మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసేవరకు ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. అలాగే మీరు నాకు ఎల్లప్పుడు మార్గనిర్దేశం చేయండి’ అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. కాగా, సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ 2007లో కన్నుమూశారు. 2016లో సోనూసూద్ తండ్రిని కోల్పోయాడు. Happy birthday Maa❤️ I wish I could wish you personally & thank you for the lessons of life you have taught me. These messages can never express how much I miss you.The vaccum that has been created in my life without you will always remain the same till I see you again. pic.twitter.com/pUEylXOzsQ — sonu sood (@SonuSood) July 21, 2021 -
ప్రజల హృదయాల్లో వైఎస్సార్కు శాశ్వత స్థానం
హ్యూస్టన్ (టెక్సాస్) : ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవించాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటూ టెక్సాస్కి చెందిన ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. మహానేత ప్రియతమ నాయకుడు డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలను వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఎంతో వైభవంగా హ్యూస్టన్ మహా నగరం లో జరిపారు. ఈ కార్య క్రమానికి వైఎస్సార్ అభిమానులు , డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ మెంబెర్స్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మహానేత రాజన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చేసిన గొప్ప సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ , ఫీజు రేయింబర్సుమెంట్ , 108 , ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఉచిత విద్యుత్, పేదలకు ఇల్లు వంటి అనేక కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. మహానేతతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరీష్ రామిరెడ్డి, డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి, బ్రహ్మ రెడ్డి, మారుతీ రెడ్డి, వేణు దాసరి, రామ్ చెరువు, పుల్లా రెడ్డి, వీరా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్, సుధీర్ , సురేష్ పగడాల, రామ్ మోహన్ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, రాఘవ రెడ్డి కే, సన్నప్పరెడ్డి విశ్వ, అరవింద్ రెడ్డి ,వంశీ అరిమండ, సుధీర్ సూరా, సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒహియోలో మహానేత రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
కొలంబస్ (ఒహియో): డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఒహాయో రాష్ట్రం లో కొలంబస్ నగరం లో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. వినోద్ రెడ్డి డేగ, ఉదయ కిరణ్ బసిరెడ్డి గారి నాయకత్వం లో చక్రధర్ కోటి రెడ్డి నరేంద్ర రూక, రాజీవ్ రెడ్డి పెనుబోలు, కిషోర్ కుర్రి తిరు గాయం. రామ్ సోనేపల్లి మరియు గోవర్ధన్ ఎర్రగొండ, సుబ్బా రెడ్డి కోవూరు, ప్రశాంత్ తల్లపురెడ్డి, ప్రహ్లాద రెడ్డి కంభం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనది. -
జననాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి
మన్రో,న్యూజెర్సీ: ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే రాజశేఖరరెడ్డికి ముందు , రాజశేఖరరెడ్డికి తర్వాత అనే విధంగా ఆయన పరిపాలన చేశారని ప్రవాస భారతీయులు అన్నారు. ఒక రాజకీయ నాయకుడిని ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత మంది గుర్తు పెట్టుకుంటున్నారంటనే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని మన్రోలో వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి హాజరైన వారు వైఎస్సార్తో తమకు ఉన్న అనుబంధాన్ని , తమ జీవితంలో వైఎస్ఆర్ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యుడు ఆళ్ల రామిరెడ్డి మాట్లాడుతూ న్యూజెర్సీలో 2010లో వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలను అమెరికాలో 16 స్టేట్స్లో 19 నగరాల్లో ఘనంగా నిర్వహించామని తెలిపారు. వైఎస్సార్పై ఉన్న అభిమానం, ప్రేమ, భక్తితోనే తాము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీని ప్రజలెవరు మర్చిపోలేరని వైఎస్ఆర్ స్నేహితుడు డాక్టర్ కే రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడం అనవసరమని తనతో వైఎస్ఆర్ తనతో ఎప్పుడూ అంటుండే వారని అనుకోకుండా 60 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయారంటూ ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. డాక్టర్ వైఎస్సార్ లాంటి నాయకులు మళ్లీ మళ్లీ భారత దేశంలో పుట్టాలని కోరుకుంటున్నట్టు డాక్టర్ రాఘవరెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. వైఎస్ఆర్ బతికుంటే అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఎంతో ముందుకు వెళ్లి ఉండేదని అభిప్రాయపడ్డారు. రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మిన మహానేత రాజశేఖరరెడ్డి అని పి శ్రీకాంత్రెడ్డి . జలయజ్ఞం పేరుతో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. పోలవరం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. -
ప్రజల గుండెల్లో నిలిచిన నేత డాక్టర్ వైఎస్సార్
అట్లాంట: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోందని అభిప్రాయపడ్డారు ప్రవాస భారతీయులు. సీఎం జగన్ సైతం తండ్రిగారి బాటలోనే నడుస్తున్నారని ప్రశంసించారు. జులై 11 ఆదివారం మధ్యాహ్నం అట్లాంటాలో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సీడీసీ నిబంధనలు పాటిస్తూ రాజన్నకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ పాలన, ఆయన హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఏపీలో సీఎం జగన్ పాలనలో జరుగుతున్న ప్రజా సంక్షేమ పథకాలు గురించి చర్చించారు. శ్రీనివాస్రెడ్డి కొట్లూరు, నంద గోపినాథ్రెడ్డి, వెంకటరామి రెడ్డి చింతంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అట్లాంటాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఏ సభ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా భారీ ఎత్తున అభిమానులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి జరిగిన 72వ జయంతి వేడుకలకు భారీగానే ఆయన అభిమానులు వచ్చారు. ఇందులో ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్లే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అభిమానులు కూడా ఉండటం విశేషం. జననేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కొంతమంది వక్తలు ప్రసంగిస్తూ.... వైఎస్సార్తో తమకున్న సాన్నిహిత్యం, ఆయన ద్వారా చేకూరిన లబ్ది, వారి ప్రాంతంలో అందిన సంక్షేమ ఫలాలు గురించి ప్రసంగించారు. -
న్యూజిలాండ్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
ఆక్లాండ్ (న్యూజిలాండ్) : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 72 వ పుట్టినరోజు వేడుకలు న్యూజిలాండ్లో ఘనంగా జరిగాయి. వైయస్ఆర్సీపీ నాయకుడు బుజ్జే బాబు నెల్లూరి ఆధ్వర్యంలో ఆక్లాండ్లో జులై 10న ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. వీరితో పాటు న్యూజిల్యాండ్ నుంచి అతిధులుగా పారిశ్రామికవేత్త కృష్ణారెడ్డి, వ్యాపారవేత్త నరేంద్రరెడ్డిలు కూడా హాజరయ్యారు. భారతదేశం నుంచి వైయస్ఆర్ మేధో వేదిక తరఫున ఎన్. శాంతమూర్తి , నెల్లూరి మదన్ మోహన్, తాళ్లూరి లతలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్కి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కిలారి శివ, శామ్యూల్ రెజినాల్డ్, ప్రతాప్ రెడ్డి , డాక్టర్ రవి ముసుగు, ప్రవీణ్, జాన్ బాబు, కృష్ణ చైతన్య, దిలీప్ కుమార్, ఆనంద్ కిరణ్, విపుల్ బాబు, కోడమల దీపక్, శ్రీధర్ బాబులు హాజరయ్యారు. -
డమాస్కస్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మేరిల్యాండ్: అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన అధ్యాయం లిఖించారని అమెరికాలోని మేరిల్యాండ్లో ఉన్న ప్రవాస భారతీయులు అభిప్రాయ పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని డమాస్కస్ నగరంలో జులై 11న ఘనంగా జరిగాయి.వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థసారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, పవన్ ధనిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో గల అనుబంధాన్ని ప్రవాస భారతీయులు గుర్తుచేసుకున్నారు. - వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టి, ప్రతీ పేదవాడికి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు. గత పదేళ్లుగా వైఎస్సార్ జయంతి, వర్ధంతిలతో పాటు బ్లడ్ డొనేషన్, ఫుడ్ డొనేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు వైఎస్సార్ పేరు మీదుగా మేరిల్యాండ్లో జరుపుతున్నామని తెలిపారు. వైఎస్సార్ సంక్షేమ పథకాల స్ఫూర్తితోనే నవరత్నాలకు సీఎం జగన్ రూపకల్పన చేశారని తెలిపారు. - వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలం లో కూడా ఇంత మంది ఈ వేడుకల్లో భాగం కావడం చూస్తుంటే రాజశేఖరరెడ్డి ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. - మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జ్ మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్ సారధిరెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు డాక్టర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందారని చెప్పారు. మాట తప్పని..మడమ తిప్పని నేతగా ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. - వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు పవన్ ధనిరెడ్డి మాట్లాడుతూ... అందరికీ మంచి చేయాలనే తపనతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ వైఎస్సార్ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ తపన ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు రాజశేఖర్ యరమల మాట్లాడుతూ... కులమతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్సార్కు అభిమానులు ఉన్నారని చెప్పారు. పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థ సారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు భాస్కర బొమ్మారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కొండా, వెంకట్ యర్రం, పవన్ ధనిరెడ్డి, కోట్ల తిప్పారెడ్డి, రాజశేఖర్ రెడ్డి యరమల, రవి బారెడ్డి, మురళి బచ్చు, రాంగోపాల్ దేవపట్ల, శ్రీనివాస్ పూసపాటి, రామకృష్ణ, వాసుదేవ రెడ్డి తల్లా, గిరిధర్ బండి, సతీష్ బోబ్బా, పూర్ణశేఖర్ జొన్నల, శ్రీనాథ్, వెంకట్ కీసర, శ్రీనివాస్ పూతన, రామచంద్ర యారుబండి, నాగిరెడ్డి, లక్ష్మి నారాయణ, కరుణాకర్ వణుకూరి, అనంత్ పూసపాటి, శివ పిట్టు, శ్రీనివాస్, రాజు గొనె, రవి ముత్తోజు, రరాజు బచ్చు, నవీన్ చింతలపూడి లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఫుడ్డ్రైవ్ వైఎస్సార్ జయంతి సందర్భంగా పిక్నిక్ , ఫుడ్ డ్రైవ్ కూడా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దలు వరకు రెండు వందల మందికి పైగా కుటుంబం తో వచ్చి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఫుడ్ డ్రైవ్ లో ఐదు వందల పౌండ్స్ కి పైగా ఫుడ్ ను మన్నా ఫుడ్ సెంటర్కి డొనేట్ చేశారు. -
షికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడకలు అమెరికాలోని షికాగో నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హమ్మర్ పార్కులో సమావేశమైన ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సుమారు 150 మంది వరకు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరైన వెంకట్రెడ్డి లింగారెడ్డితో పాటు తెలంగాణ అమెరికా తెలుగు సోసైటీకి నుంచి కందిమళ్ల సత్య, ఏ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటం ముందు దీపాలను ఆర్వి రెడ్డి దీపాలను వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ, శివ దేశూ, శ్రీజన్, శేషు, ఆడి, శశాంక్, శివారెడ్డి, రామకాంత్, భూపాల్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజన ఏర్పాటు చేశారు. దీంతో పాటు పిల్లల కోసం సరదా కార్యక్రమాలు నిర్వహించారు. -
అమెరికాలో ‘బాలమురళి’ గానామృతం
కాలిఫోర్నియా: సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ "సంపద" ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో కర్ణాటక సంగీత సామ్రాట్ తెలుగువారు గర్వించదగిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి. జులై 4న వర్చువల్గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు హాజరై బాల మురళి కృష్ణ గారితో తమకున్న అనుబంధాలని పంచుకున్నారు. స్వర నివాళి ఈ కార్యక్రమంలో కేరళ నుంచి మంగళంపల్లి శిష్యులు ప్రిన్స్ రామ వర్మ, హైదరాబాద్ నుంచి డీవీ మోహన కృష్ణ పాల్గొని గురువు గారితో వారికున్న అనుభవాలని పంచుకున్నారు. ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బి ఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్ గారు మరియు సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం గారు, మోదుమూడి సుధాకర్ గారు, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్ గారు, జీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. బాలమురళి గారి థిల్లానాలకు ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ శిష్యురాలు శ్వేత ప్రచండె అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసి వీక్షకులను అలరించారు. బాలమురళి గారి శిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి గారి కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు. ఆకట్టుకున్న డాక్యుమెంటరీలు సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవన విశేషాల పై ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. దీనికి స్క్రిప్ట్ మరియు వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి (ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల ఏమన్నారంటే - ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు మాట్లాడుతూ ‘సంపద’ వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయమన్నారు. సంగీతం లోనే కాకుండా లోనే కాకుండా వయోలిన్, వయోలా మరియు మృదంగం, కంజీర వంటి వాద్యాలలో బాలమురళి కృష్ణ చక్కటి ప్రతిభను కనపరిచేవారు అని పేర్కొన్నారు. - ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందన్నారు. - బాలమురళి కృష్ణ గారి జీవించి ఉన్న సమయంలో తను జీవించడం గొప్ప అదృష్టంగా భావిస్తానని ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధ రఘునాథన్ అన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చిరునామ అన్నారు. - బాలమురళి కృష్ణ జయంతి సందర్భంగా సంపద ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి అన్నారు. ‘సంపద’కు అభినందనలు ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షులు దీనబాబు గారికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారి శిష్యులు, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ మరియు మమత కూచిభొట్ల బాలమురళి గారి అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు. -
ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు
విశాఖపట్నం: జిల్లాలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి. తెలుగువారికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో రాజశేఖరరెడ్డి నిలిచిపోతారు. దేశంలో సంక్షేమ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్. తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నారు. సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే సీఎం జగన్ వంద అడుగులు ముందుకు వేస్తున్నారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి, పార్టీ కన్వీనర్ కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, అక్రమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల, చింతలపూడి, తైనాల విజయ్ కుమార్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వైయస్సార్ జిల్లా: రాజంపేట మండలంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకముందు ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, అకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట పాత బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. గుంటూరు: నగరంపాలెంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. కృష్ణా: దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా.. ఉంగుటూరు మండలం తేలప్రోలులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వింత శంకర్ రెడ్డి, వాసు రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, తోట వెంకయ్య పాల్గొన్నారు. కడప: వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాష వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, మేయర్ సురేష్ బాబు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, ఏపీ ఏనార్టీ డైరెక్టర్ ఇలియస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిష్ణారెడ్డి కమలాపురం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహమండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రాజుపాలెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ ఉత్తమారెడ్డి పాల్గొన్నారు. కర్నూలు: జిల్లా వ్యాప్తంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, కర్నూలు మేయర్ బి.వై. రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుకా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా దేవరపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ: ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి వెల్లంపల్లి, మల్లాది విష్ణు. ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని.. వైఎస్ఆర్ అడుగు జాడల్లో సీఎం జగన్ వెళ్తున్నారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. పేదలందరి జీవితాల్లో వైఎస్ఆర్ వెలుగులు నింపారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నెల్లూరు: గాంధీబొమ్మ సెంటర్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి అనిల్కుమార్. ''తండ్రి ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. అన్నివర్గాల సంక్షేమాన్ని చూస్తూ జనహృదయనేతగా ఎదుగుతున్నారు'' అంటూ అనిల్ తెలిపారు. -
వైఎస్ఆర్ లేఖతో శాంతి కుమార్లో నూతన ఉత్తేజం
-
SV Ranga Rao: ప్రతి దీపావళి స్డూడియో స్టాఫ్కి కొత్త నోట్లు ఇచ్చేవారు
ఎస్. వి. రంగారావు... నిండైన విగ్రహం... వెండితెర మీద కనపడగానే ప్రేక్షకుల చప్పట్లు, ఈలలు ఒక్కసారి కళ్లు చిట్లించి, పెదవి విరిచి, తల కొద్దిగా ఆడిస్తే.. ప్రేక్షకులకు మైమరపే.. మాట పెదవి దాటకుండానే భావం ముఖంలో కనపడుతుంది.. ఘటోత్కచుడు, రావణుడు, కీచకుడు, నేపాళ మాంత్రికుడు, హిరణ్యకశిపుడు.. ఇంటి పెద్దన్నయ్య, మతిమరపు తండ్రి.. ఏ పాత్రయినా ఆయనలో జీవిస్తుంది.. ఆయనపై కోపం తెప్పిస్తుంది. ‘బానిసలకు ఇంత అహంభావమా’, ‘ఎవరూ సృష్టించనిదే మాటలు ఎలా పుడతాయి’ ‘సాహసం సాయరా రాజకుమారి దొరుకుతుంది’ ‘జై పాతాళభైరవీ’ ఈ మాటలు వేటికవే ప్రత్యేకం.. మాయా బజార్, పండంటి కాపురం, బాంధవ్యాలు, నర్తనశాల, సంపూర్ణ రామాయణం, భక్త ప్రహ్లాద.. ఎన్ని చెప్పినా ఏదో ఒకటి మరచిపోయినట్లే. నటనే శ్వాసగా జీవించి, నటిస్తూనే తుదిశ్వాస విడిచారు.ఆయన మేనల్లుడు, ఆయన దగ్గరే పెరిగిన ఉదయ్ కుమార్ బడేటి.. ఎస్. వి. రంగారావు మావయ్య గురించి సాక్షికి వివరించారు. SV Ranga Rao Birth Anniversary: మా మావయ్య కృష్ణా జిల్లా నూజివీడులో జూలై 3, 1918లో జన్మించారు. తండ్రి సామర్ల కోటేశ్వరరావు ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్, తల్లి లక్ష్మీ నరసాయమ్మ. మావయ్య వాళ్లు నలుగురు అన్నదమ్ములు, ఏడుగురు అక్కచెల్లెళ్లు. మావయ్య వాళ్ల తాతగారు కోటయ్యనాయుడు పేరున్న డాక్టరు. మావయ్యకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి విజయలక్ష్మి, అల్లుడు (మేనల్లుడు) సూర్యవరప్రసాద్ శృంగారం, డల్లాస్లో ఉంటున్నారు. రెండో అమ్మాయి ప్రమీలారాణి, అల్లుడు సత్యనారాయణ కడిం హైదరాబాద్లో ఉంటున్నారు. అబ్బాయి పేరు కోటేశ్వరరావు కాలం చేశాడు. నేను మావయ్య ఆరవ చెల్లెలి కొడుకును. అమ్మ పేరు శకుంతల. బెత్తంతో దెబ్బలు.. మావయ్య వాళ్లని మంచి చదువులు చదివించాలనే ఉద్దేశంతో, మావయ్య వాళ్ల నాయనమ్మ.. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లతో చెన్నై ట్రిప్లికేన్లో ఇల్లు తీసుకుని, హిందూ హైస్కూల్లో మావయ్యను పదో తరగతి వరకు చదివించారట. ఆ తరవాత వైజాగ్లో ఇంటర్, కాకినాడ పీఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుకున్నారు. అక్కడే యంగ్ మెన్స్ క్లబ్లో నాటకాలు వేసేవారట. మావయ్యకు చదువు మీద కంటే, సినిమాలంటేనే ఇష్టం. ప్రతిరోజూ సెకండ్ షోకి వెళ్లేవారట. ఇందుకోసం తమ్ముడితో కలిసి ముందు గదిలో పడుకుని, తమ్ముడి కాలి వేలికి ఒక దారం కట్టి, సినిమా నుంచి రాగానే తమ్ముడి కాలి దారాన్ని లాగ్గానే, తలుపు తీస్తే, వచ్చి పడుకునే వారట మావయ్య. ఒకరోజు కరెంటు పోయిన సమయంలో, మావయ్యను నిద్ర లేపడానికి వాళ్ల నాయనమ్మ వచ్చేసరికి అక్కడ మావయ్య స్థానంలో తలగడలు ఉన్నాయిట. అప్పుడు ఆవిడ తాడును పట్టుకుని మావయ్య వచ్చేవరకు కూర్చుని, రాగానే బెత్తంతో నాలుగు దెబ్బలు వేసిందట. ఉదయ్ కుమార్ బడేటి అదే మొదటి శుభకార్యం... మావయ్య వివాహం 1947 డిసెంబరు 27న ఏలూరులో జరిగింది. మావయ్యది మేనరికం. అత్త పేరు లీలావతి. మావయ్య షూటింగ్లతో బిజీగా ఉండేవారు. ఇంటికి వచ్చినవారందరికీ అత్తయ్య వంట చేసేది. మావయ్య 1958 ఏప్రిల్ 30న చెన్నై హబీబుల్లా రోడ్డులో సొంత ఇంటి గృహప్రవేశం చేశారు. మావయ్య పెద్ద కూతురు విజయలక్ష్మి వివాహం మావయ్య వాళ్ల అక్క రాజవల్లి కుమారుడితో జరిగింది. రెండు నెలల పాటు ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. వేసవి సెలవులు మావయ్య వేసవిలో షూటింగ్లు లేకుండా ఖాళీ ఉంచుకుని, మా అత్తమ్మ పుట్టిల్లు ఏలూరు వెళ్లేవారు. కాకినాడలో మావయ్య స్నేహితులను కలిసేవారు. నెల్లూరు మైపాడ్ దగ్గర ‘బాంధవ్యాలు’ సినిమా షూటింగ్కి నన్ను అత్తయ్యను తీసుకువెళ్లి, అక్కడ మా కోసం బోట్ హౌస్ ఏర్పాటు చేయించారు. షూటింగ్ ఉన్నన్ని రోజులూ అందులోనే ఉన్నాం. అప్పుడప్పుడు మహాబలిపురం దారిలో ఉన్న తోటకు తీసుకువెళ్లేవారు. అక్కడ సరదాగా ఏదో ఒక వంటకం చేసేవారు. కోవళం బీచ్ నుంచి తాజా సముద్రపు చేపలను తీసుకువచ్చేవారు. ఆయనకు భోజనంలోకి నాలుగైదు రకాలు ఉండాలి. అందులో స్వీట్ తప్పనిసరి. మటన్ బాగా ఇష్టం. మావయ్యకు ఇష్టమైన వంటకాలను అత్తయ్య వండి పెట్టేది. ప్రతి దీపావళికి బ్యాంక్ నుంచి కొత్త నోట్లు తెచ్చి స్డూడియో స్టాఫ్కి ఇచ్చేవారు. మా అందరికీ కొత్త బట్టలు, ఎన్ని రోజులు కాల్చినా తరగనన్ని టపాసులు తెచ్చేవారు. దసరా పండుగకు బొమ్మల కొలువుతో సందడిగా ఉండేది. మల్టీ టాలెంటెడ్.. మావయ్య ఆల్రౌండర్. హంటింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో డబుల్ బ్యారెల్ గన్, రైఫిల్, రివాల్వర్ ఉండేవి. ఖాళీ దొరికితే బొమ్మలు వేసేవారు. కవిత్వం రాసేవారు. బాగా మూడ్ వస్తే ఎస్. రాజేశ్వరరావు సోదరులు ఎస్ హనుమంతరావును పిలిపించి, సరదాగా ట్యూన్స్ చెప్పేవారు. పుస్తకాలు ముఖ్యంగా షేక్స్పియర్ పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. ఆయన అప్పట్లో ‘యువ’లో రాసిన కథలను సేకరించి తిరుపతి ‘కథాప్రపంచం’ వారు పుస్తకం ప్రచురించారు. ప్రకృతి ప్రేమికులు.. ఇంట్లో కుక్కలు, పావురాలు, ఆక్వేరియం ఉండేవి. 24వేల చదరపు అడుగుల స్థలంలో పూల మొక్కలతో పాటు పెద్ద పెద్ద చెట్లు పెంచారు. మామిడి చెట్లకు కాసిన పెద్ద పెద్ద కాయలను అందరికీ పంచేవారు. ఆయనకు నూజివీడు రసాలు, బంగినపల్లి చాలా ఇష్టం. వాచీలు, సిగరెట్ లైటర్లు సేకరించేవారు. ఇంట్లో ఉన్న 16 ఎంఎం ప్రొజెక్టర్ కెమెరాలో సినిమాలు వేసి చూపించే వారు. ప్రివ్యూ చూశాక, సినిమా ఎలా ఉందని అడిగేవారు. మావయ్య ఈజ్ స్పెషల్... తిరుపతి వచ్చిన వారంతా టూరిస్టు బస్సులలో మావయ్యను చూడటానికి చెన్నై వచ్చేవారట. గేటు తీయగానే పరుగుపరుగున లోపలకు వచ్చి, సంతకాలు తీసుకుంటూ, దేవుడిని చూసినట్లు చూసేవారట. మావయ్య చూడటానికి భారీ విగ్రహంలా ఉన్నప్పటికీ చాలా సింపుల్గా ఉండేవారు. మా కోసం క్రికెట్ వీఐపీ పాస్లు తెప్పించేవారు. ఆయనకు ఖాళీ ఉంటే వెళ్లేవారు. లేదంటే రేడియోలో కామెంటరీ వినేవారు. పిల్లల సినిమాలకు ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలకు మావయ్య స్వయంగా తీసుకువెళ్లేవారు. మావయ్య అమెరికా వెళ్తున్నప్పుడు అందరినీ తన వెంట తీసుకువెళ్లి, అమెరికా అంతా చూపించారు. ఆయన పోయేవరకు రైలు అంటే తెలియదు. మావయ్యకు నాలుగు కార్లు ఉండేవి. విమానంలోనో, కారులోనో తిప్పేవారు. అంత అపురూపంగా చేసేవారు. ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాం. మావయ్య మరణం మాకు చీకటి మిగిల్చింది. నా 13 సంవత్సరాల జీవితం మావయ్య దగ్గరే గడిచింది. మావయ్య మనవల్ని (ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) పెంచాను, ఇప్పుడు వాళ్లే నన్ను చూస్తున్నారు. మావయ్య నాకు దైవం.. నా కంటే పైన ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు రామారావు. నేను పుట్టిన ఐదు నెలలకు అన్నయ్యకు బాగా అనారోగ్యం చేసింది. రెండు సంవత్సరాల పాటు అమ్మ అన్నయ్యను చూసుకోవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నన్ను అత్తయ్య మావయ్య చేరదీశారు. నేను పుట్టిన దగ్గర నుంచి ఆయన పోయేవరకు ఆయనకు సన్నిహితంగా ఉన్నాను. నన్ను మద్రాసు చర్చ్పార్క్ స్కూల్లో చేర్పించారు. అప్పుడప్పుడు దింపేవారు. ఆ దింపటంలో ఒక గమ్మత్తు జరిగేది. ఏదో ఆలోచించుకుంటూ స్కూల్ దగ్గర దింపటం మరచిపోయి షూటింగ్కి తీసుకు వెళ్లిపోయి, ‘అయ్యో మర్చిపోయానే’ అని మళ్లీ షూటింగ్ పూర్తయ్యాక ఇంటికి తీసుకువచ్చేసేవారు. ఎప్పుడైనా సినిమాల పని మీద హైదరాబాద్ వెళ్లవలసి వస్తే, నన్ను మా అమ్మ దగ్గర వదిలేసి, మళ్లీ వెనక్కు వెళ్లేటప్పుడు తీసుకువెళ్లేవారు. స్కూల్లో చేరాక కుదరలేదు. అందరితోనూ ఎంతో ప్రేమగా ఉండేవారు. ఎవరితో మనస్ఫర్థలు వచ్చినా సర్దుకుపోయేవారు. పిల్లలు ‘ఇది కావాలి’, ‘ఇది కొనుక్కుంటే బావుంటుంది’ అనుకునేలోపే వస్తువులు ఇంటికి వచ్చేసేవి. బ్రేక్ఫాస్ట్కి ఉడ్లాండ్స్ హోటల్కి తీసుకువెళ్లేవారు. నేను చిన్నపిల్లవాడిని కావటం వల్ల ఒంటి నిండా పోసుకునేవాడిని. అందుకని టిఫిన్ కారు దగ్గరకు తీసుకు వచ్చి, డాష్ బోర్డుకి హుక్ పెట్టి, దాని మీద ప్లేట్ పెట్టి తినిపించేవారు. అప్పుడప్పుడు బీచ్కి తీసుకు వెళ్లేవారు. బుహారీ హోటల్లో చికెన్ 65, ఐస్క్రీమ్, చైనీస్ హోటల్లో ప్రాన్ పకోడా పెట్టించేవారు. – ఉదయ్కుమార్ బడేటి (ఎస్.వి. రంగారావు మేనల్లుడు) సంభాషణ: వైజయంతి పురాణపండ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గూగుల్లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
గొప్ప వ్యక్తులకు, మేధావులకు, సెలబ్రిటీలకు గూగుల్ డూడుల్తో గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇవాళ(జులై 3న) ఓ జర్మన్ డాక్టర్కి గూగుడ్ డూడుల్ దర్శనమిచ్చింది. ఆయన పేరు సర్ లుడ్విగ్ గట్ట్మన్. న్యూరోసర్జన్. పారాఒలింపిక్స్కు ఆద్యుడు ఈయనే. అంతేకాదు జర్మనీలో నాజీల చేతిలో అవమానాలు అనుభవిస్తూనే.. వందల మంది పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాడు. ఒకానొక టైంలో హిట్లర్కు ఆయన మస్కా కొట్టిన తీరు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది కూడా. వెబ్డెస్క్: జర్మనీలోని టాస్ట్(ఇప్పుడది టోస్జెక్ పేరుతో పోలాండ్లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్విగ్. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో కోల్మైన్ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ వ్యక్తి తన కళ్ల ముందే మరణించడం లుడ్విగ్ మనసును కలిచివేసింది. అలా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. బ్రెస్లావు యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా, ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్లో డాక్టరేట్ను అందుకున్నాడు. ఆ తర్వాత న్యూరోసర్జన్గా ఒట్ఫ్రిడ్ ఫోరెస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. అయితే పేదలకు ఉచితంగా సేవలు చేయాలన్న ఆయన సంకల్పం.. ఫోరెస్టర్కు నచ్చలేదు. దీంతో ఆయన్ని వెలేశాడు. ఆ తర్వాత నాజీలు అధికారంలోకి వచ్చాక యూదులను మెడిసిన్ ప్రాక్టీస్కు అనుమతించలేదు. దీంతో బ్రెస్లావు జూయిష్ ఆస్పత్రిలో సేవలందించాడు లుడ్విగ్. ఆ టైంలో నాజీల చేతిలో యూదులు బలికాకుండా ఉండేందుకు.. వాళ్లను తన ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేర్పించుకుని నాటకంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టాడు. క్రిస్టాలెనెచ్ట్ మారణ హోమం టైంలో గాయపడ్డ వాళ్లెవరనేది చూడకుండా ఉచిత చికిత్స అందించి మనుసున్న మంచి డాక్టర్గా పేరు దక్కించుకున్నాడు. హిట్లర్కు మస్కా కొట్టి.. యూదుల సానుభూతిపరుడు అయినప్పటికీ.. వైద్యమేధావి అనే ఉద్దేశంతో హిట్లర్, లుడ్విగ్ గట్ట్మన్ జోలికి పోలేదు. ఆ టైంలో హిట్లర్ తన మిత్ర రాజ్యం పోర్చుగల్ నియంత అయిన అంటోనియో డె సాలాజార్కు చికిత్స కోసం గట్ట్మన్ను ఏరికోరి మరీ పంపించాడు. అయితే తిరుగు ప్రయాణంలో లుడ్విగ్ నాజీ సైన్యానికి మస్కా కొట్టాడు. లండన్లోనే తన కుటుంబంతో సహా విమానం దిగిపోయి.. యూకే శరణు వేడాడు. దీంతో యూకే ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం కల్పించింది. అక్కడే ఆయనకు 250 పౌండ్ల సాయంతో శరణార్థిగా ఉండిపోయాడు. హిట్లర్కు లుడ్విగ్ మస్కా కొట్టిన తీరును దాదాపు అన్ని మీడియా ఛానెళ్లన్నీ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి కూడా. యుద్ధవీరుల కోసం ఆటలు ఇక యూకే వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో సేవలందించిన లుడ్విగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో లార్డ్ లిండ్సేకి మకాం మార్చాడు. 1943లో ప్రభుత్వ ప్రోత్సాహంతో బకింగ్హాంషైర్లో స్టోక్ మండ్విల్లే ఆస్పత్రిని నెలకొల్పాడు. ఇది వెన్నెముకలు దెబ్బతిన్న పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. ఈ సెంటర్కు లుడ్విగ్నే మొదటి డైరెక్టర్గా నియమించింది యూకేప్రభుత్వం. 1945లో గట్ట్మన్కు బ్రిటన్ పౌరసత్వం దక్కింది. ఆ టైంలో స్టోక్ మండ్విల్లే గేమ్స్ను నిర్వహించాడు లుడ్విగ్. ఈ ఈవెంట్లో సైన్యంలో సేవలందిస్తూ కాళ్లు, చేతులుకోల్పోయిన వాళ్లు, నడుం చచ్చుపడిపోయి వీల్ చైర్కు పరిమితమైనవాళ్లతో ఆటలు నిర్వహించాడు. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే రోజున జులై 29, 1948 లండన్ ఒలింపిక్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఆటలకు పారా ఒలింపిక్ గేమ్స్ అనే పేరు దక్కింది. అలా డిజేబిలీటీ ఉన్నవాళ్లతో ఒలింపిక్స్ నిర్వహించడం తర్వాతి కాలంలో క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే లుడ్విగ్ గట్ట్మన్ను ‘ఫాదర్ ఆఫ్ పారా ఒలింపిక్స్’ అని పిలుస్తారు. గుండెపోటుతో ఐదు నెలలు.. ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ’ని నెలకొల్పాడు గట్ట్మన్. 1966లో క్లినికల్ వర్క్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కొన్నాళ్లపాటు ఆటగాళ్ల కోసం పని చేశాడాయన. ఆ తర్వాత హార్టికల్చర్తో ‘పొప్పా జీ’ అనే బిరుదు దక్కించుకున్నాడు. భారీ క్యాలిప్లవర్లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1979 అక్టోబర్లో ఆయనకు గుండెపోటు రాగా.. ఐదు నెలలపాటు ఆస్పతత్రిలో పొందుతూ.. చివరికి 1980, మార్చి18న కన్నుమూశాడు. ఆయన గౌరవార్థం.. 2012లో స్టోక్ మండ్విల్లే స్టేడియం బయట కాంస్య విగ్రహాన్ని ఉంచారు. అదే ఏడాది జరిగిన లండన్ పారా ఒలింపిక్స్ కమిటీకి ఆయనకూతురు ఎవా లోయిఫ్లెర్ను మేయర్గా నియమించారు. జర్మనీ ప్రభుత్వం ఆయనకు మెడికల్ సొసైటీ ప్రైజ్తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం 2013లో స్టాంప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు గూగుల్ 122వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్తో స్మరించుకుంది. చదవండి: అంతరిక్షంలోకి తెలుగు ధీర.. శిరీష బండ్ల -
పీవీని కేసీఆర్ అవమానించారు: బండి సంజయ్
భీమదేవరపల్లి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, వేడుకలను తూతూమంత్రంగా నిర్వహించి ఆయనను అవమానపర్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మం డలంలోని ఆయన స్వగ్రామమైన వంగరను సోమ వారం సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా పీవీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని గతంలో కేసీఆర్ చెప్పగానే ఒవైసీ సోదరుల్లో ఒకరు పీవీ ఘాట్ను కూలుస్తామని ప్రకటించాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్కు పీవీపై ప్రేమ ఉంటే అలాంటి మాటలన్నందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చదవండి: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి -
అలా పిలిస్తే బాలుగారు కోప్పడ్డారు; చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
SP Balasubrahmanyam: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి నేడు(జూన్ 04). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నివాళులర్పిస్తున్నారు. బాలు జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఎమోషనల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో బాలుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ ఓ సంఘటనను వివరించారు. ‘ఓ సందర్భంలో నేను ‘ఎస్పీ బాలు గారూ’ అని సంబోధిస్తే.. ఆయన ఎంతో బాధ పడ్డారు. ఎప్పుడూ నోరారా అన్నయ్య అనేవాడివి ఇవాళ బాలు గారూ అంటూ మర్యాదగా పిలిచి నన్ను దూరం చేస్తున్నావా అంటూ చిరు కోపం ప్రదర్శించారు. మీ ఔన్నత్యం తెలిశాక మీలాంటి వారిని ఏకవచనంతో సంబోధించడం సరికాదనుకుంటున్నానని చెప్పడంతో, అలా పిలిచి నన్ను దూరం చెయ్యకయ్యా అన్నారు. కానీ, ఇవాళ మనందరికీ అన్యాయం చేసి ఆయన దూరమయ్యారు’ అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు, ఎస్పీ బాలు సోదరి ఎస్పీ వసంత ఆలపించిన ఓ పాటను కూడా పొందుపరిచారు. ‘అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి.. వినమ్ర నివాళి ! ’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి..వినమ్ర నివాళి ! #TearfulTributeToSPB #SPB75 #SPVasantha https://t.co/c1oEvrv4y1 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2021 చదవండి: ఆమె.. అతడు ఒక యుగళగీతం జీవితాన్ని ప్రేమించిన బాలుడు -
సంపాదకుల సంపాదకుడు.. తాపీ ధర్మారావు
‘‘పత్రికలు వట్టి మాటల పోగులే కాదు, క్రియాకలాపానికి కూడా దారి తీయాలి. సంఘంలో ఒక కొత్త జీవనకళను కలిగించడంలో చేతనైన విధంగా పత్రికాముఖంగా పాటు పడాలి’’ ఇది తాపీ ధర్మారావు సంపాదకుడుగా ‘కాగడా’ వార పత్రికలో సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన విషయం! అది ఇప్పటికీ అర్థవంతమైనదే. తాపీ ధర్మారావును కొందరు జనవాణి, సమదర్శిని, కాగడా మొదలైన పత్రికల సంపాదకుడుగా గుర్తుంచుకుంటే–మరికొందరు ఎన్నో విజయవంతమైన తెలుగు చలనచిత్రాల స్క్రీన్ ప్లే, సంభాషణల రచయితగా స్మరించుకుంటారు. కొంతమంది కొత్తపాళీ, దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?, విజయవిలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య వంటి విభిన్నమైన రచనల కర్తగా ప్రస్తుతిస్తుండగా – ఇంకొంతమంది రచయితల సంఘాలకు వారు చేసిన సేవలను కొనియాడుతారు. కానీ వారు చేసిన సేవ ప్రధానంగా ఏమిటో విద్వాన్ విశ్వం, ఆరుద్ర వంటివారు చాలా విస్పష్టంగా పేర్కొన్నారు. తెలుగు దినపత్రికల్లో తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన సాహసిగా విద్వాన్ విశ్వం ‘మాణిక్యవీణ’లో ధర్మారావును శ్లాఘించారు. మన తెలుగు సినిమాల్లో వ్యావహారిక భాష ఆయన పెట్టిన భిక్ష అని ఆరుద్ర ‘వనిత’ మాసపత్రికలో తాపీవారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విశదం చేశారు. 1887 సెప్టెంబరు 19న పుట్టిన తాపీ ధర్మారావు 1973 మే 8న కన్నుమూశారు. గిడుగు రామమూర్తి ఆయనకు పర్లాకిమిడిలో పాఠం చెప్పిన గురువు. ఆయన విజయనగరంలో చదువుకునే కాలంలో గురజాడ అప్పారావు ఉన్నారు. ధర్మారావు ఆసక్తి చూపిన అంశాల జాబితాగానీ, తిరిగిన ఊళ్ళ సంఖ్య గానీ, చేసిన ఉద్యోగాల చిట్టాగానీ పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది! శ్రీకాకుళం, విజయనగరం, బరంపురం, పర్లాకిమిడి, చీకటి సంస్థానం, విశాఖపట్నం, మదరాసు, చుండి, ఊర్కాడు, దక్షిణ వల్లూరు, మందసా, చల్లపల్లి, విజ యవాడ – ఇలా చాలా ఊళ్ళలో ఆయన పనిచేశారు. ఉపాధ్యాయుడు, సర్వేయరు, సంరక్షకుడు, అంతరంగిక కార్యదర్శి, మేనేజర్, రిక్రూటింగ్ ఆఫీసర్ – ఇలా ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఈ ఉద్యోగాల సమయంలో వేట, గుర్రపుస్వారి, తుపాకి పేల్చడం, ఫొటోగ్రఫీ, టెన్నిస్ వంటివి నేర్చుకున్నారు. కుస్తీలు, నాటకాలు, మ్యూజిక్ గురించి చెప్పనక్కరలేదు. కనుకనే వారికి జీవితమంటే ఏమిటో తెలుసు. జనం భాష ఏమిటో బాగా తెలుసు! గూడవల్లి రామబ్రహ్మంగారి తోడ్పాటుతో దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు– అనే శీర్షికతో వ్యాసాలు రాశారు. అంతేకాదు ఆయనతో కలసి ‘మాలపిల్ల’తో చలనచిత్రరంగ ప్రవేశం చేశారు. తెలుగు చలనచిత్రాల తొలిదశలో ప్రవేశించిన ధర్మారావు ఒకవైపు సంభాషణలలో వ్యావహారిక భాషను, మరోవైపు హేతుబద్ధతను రంగరించారు. అప్పట్లో తెలుగు సినిమారంగంలో స్క్రీన్ ప్లే పరంగా ‘తాపీ స్కూలు’ అని ప్రత్యేకంగా పిలిచేవారట. పత్రికలలో అగ్రస్థానంలో ఉంటూనే సినిమాల్లో పనిచేశారు. ఏక కాలంలో మేధావుల, పండితుల వేదిక అయిన పత్రికారంగంలోనూ; పామరుల, సామాన్యుల రంజకమైన సినిమాల్లోనూ రాణించడం చిన్న విషయం కానేకాదు. వారికి ఆ మాధ్యమాల మర్మాలే కాదు, వాటి ప్రభావాలు కూడా బాగా తెలిసి వుండాలి! ధర్మారావు సంభాషణలు రాసిన ప్రతి సినిమా శతదినోత్సవం జరుపుకుంది. వారి దగ్గర ఉపసంపాదకులుగా పనిచేసిన నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పి. శ్రీరాములు మొదలైన వారు తర్వాతి కాలంలో ప్రముఖ సంపాదకులుగా రాణిం చారు. తాపీ ధర్మారావు సంపాదకుల సంపాదకుడు, ఆయనను చూసి నేర్చుకున్నానని నార్ల వెంకటేశ్వరరావు పేర్కొనడం గమనించాలి. తన పత్రికాభాషకు స్ఫూర్తి వేమన అని ప్రకటించిన ప్రజాస్వామిక స్ఫూర్తిమూర్తి తాపీ ధర్మారావు. -డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 (నేడు తాపీ ధర్మారావు వర్ధంతి సందర్భంగా) -
ఇంగ్లిష్లోన మేరేజ్ హిందీలో అర్థము షాది...
ఈ పాటొస్తే మనకు అలనాటి నటి గిరిజ గుర్తుకొస్తారు. ‘కాశీకి పోయాను రామాహరే... గంగలో మునిగాను రామాహరే’ ఈ పాట విన్నా గిరిజే గుర్తుకొస్తారు. ‘సరదా సరదా సిగిరెట్టు’ పాట కూడా ఆమెదే కదా. మార్చి 3 ఆమె 83 వ జయంతి. తెలుగు ప్రేక్షకులు ఆమెను స్మరించుకునే రోజు. తెలుగులో తొలితరం కామెడీ స్టార్స్లో ఒకరుగా వెలిగారు గిరిజ. కృష్ణాజిల్లా కంకిపాడు నుంచి చెన్నై వెళ్లి రేలంగి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ‘పాతాళభైరవి’లో ఆమె పలికిన ‘నరుడా... ఏమి నీ కోరికా’ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత అక్కినేని, శివాజీగణేశన్ వంటి హీరోల పక్కన నటించారు. అక్కినేనితో ఆమె పాడిన ‘హాయి హాయిగా జాబిల్లి’.. పాట నేటికీ హిట్. అయితే ఆమె కొద్ది కాలానికే కామెడీ స్టార్గా మారారు. ‘భార్యాభర్తలు’, ‘కులగోత్రాలు’, ‘జగదేకవీరుని కథ’, ‘ఆరాధన’, ‘డాక్టర్ చక్రవర్తి’ తదితర సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. ఆ తర్వాతి రోజుల్లో ‘బలిపీఠం’, ‘సెక్రటరీ’, ‘పంతులమ్మ’ సినిమాల్లో వయసు మళ్లిన పాత్రలూ పోషించారు. ‘లవకుశ’లో కీలకమైన రజకుని భార్య వేషం కట్టారు. ‘ఒల్లనోరి మామా’ పాట జనాదరణ పొందింది అందులో. భర్త సన్యాసి రాజుతో కలిసి ‘భలే మాస్టారు’, ‘పవిత్ర హృదయాలు’ సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయారు. ఆమె కుమార్తె సలీమా మలయాళ సినిమా రంగంలో హీరోయిన్గా పని చేశారు. 1995లో మరణించిన గిరిజ తనదైన నటనతో తెలుగు వారికి గుర్తుంటారు. -
ఆమె బతికే ఉంది.. ఇదిగో సాక్ష్యం
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎప్పుడు ఎవరు తెర మీదకు వస్తారో.. ఎవరు కనుమరుగవుతారో చెప్పడం చాలా కష్టం. స్వయంగా అధినేత కిమ్ జాంగ్ ఉన్నే చాలా రోజుల పాటు కనమరుగయ్యారు. దాంతో ఆయన చనిపోయాడని.. ఇక బాధ్యతలు కిమ్ సోదరి చేతిలోకి వెళ్తాయని ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ.. కొన్ని రోజుల క్రితం కిమ్ తెరమీదకు వచ్చారు. ఇదిలా ఉండగా కిమ్ భార్య కనిపించి ఏడాది పైనే అవుతోంది. ప్రసుత్తం ఆమె గర్భవతిగా ఉంది అందుకే కనిపించడం లేదనే వార్తలు కొన్ని రోజులు షికారు చేశాయి. ఏడాది కాలం పూర్తయిన ఆమె బహిరంగంగా కనిపించకపోవడంతో.. ఇక ఆమె చనిపోయి ఉంటుంది.. లేదా చంపేశారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిమ్ భార్య రి సోల్ జు మంగళవారం తన భర్తతో కలిసి కనిపించారు. తన మామ కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కన్సర్ట్కి ఆమె తన భర్త కిమ్ జాంగ్ ఉన్తో కలిసి హాజరయ్యారు. రి సోల్ జు ఇలా పబ్లిక్గా దర్శనమిచ్చి దాదాపు ఏడాది పైనే అవుతోంది. గతేడాది జనవరిలో కనిపించిన రి సోల్ జు మళ్లీ ఇప్పుడే దర్శనమిచ్చారు. ప్యోంగ్యాంగ్లో ఏర్పాటు చేసిన మామ జయంతి కార్యక్రమంలో భర్తతో కలిసి హాజరైన రి సోల్ జు.. కన్సర్ట్ను వీక్షించి.. ప్రదర్శనకారులను ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నార్త్ కొరియా అధికారిక న్యూస్ పేపర్లో ప్రచురితం అయ్యాయి. కింగ్ జోంగ్ ఇల్ జయంతిని ఉత్తర కొరియా ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా నేషనల్ ఇంటిలిజెన్స్ సర్వీస్ అధికారి ఒకరు రి సోల్ జు క్షేమంగానే ఉన్నారని.. తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. కరోనా కాలం కావడంతో పబ్లిక్ మీటింగ్లకు హాజరు కావడం లేదన్నారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే కిమ్ భార్య పబ్లిక్గా దర్శనమిచ్చి.. అన్ని అనుమానాలను పటాపంచలు చేశారు. ఇదిలా ఉంటే, ఉత్తర కొరియా అధ్యక్షులను చైర్మన్ అని పిలుస్తుంటారు. నార్త్ కొరియా దేశానికి మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన కిమ్ సంగ్ని మాత్రమే ప్రెసిడెంట్ అని పిలిచేవారు. ఆ తరువాత పనిచేసిన అధ్యక్షులను చైర్మన్ అని పిలిచారు. అయితే, ప్రస్తుత చైర్మన్ కిమ్ జోంగ్ ఉన్ను ఆ దేశ మీడియా మొదటిసారి ప్రెసిడెంట్ అని సంభోదించింది. ఇక ఉత్తర కొరియా మీడియా ఏజెన్సీ కూడా ఇదే విధంగా సంభోదించడం విశేషం. చదవండి: ఒక్కసారిగా ఏడ్చేసిన కిమ్ నెల రోజులుగా కనిపించని కిమ్ సోదరి?! -
స్మితకు ఆ పాత్రలంటే ఇష్టం ఉండేవి కాదు..
సాక్షి, హైదరాబాద్: సిల్క్ స్మిత ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాదిన తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత (డిసెంబర్ 2) జయంతి నేడు. ఈ సందర్భంగా మరోసారి ఆమెను గుర్తు చేసుకుందాం. 1960 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆమె ఒక మేకప్ ఆర్టిస్ట్గా తన సినీ కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత సినమాల్లో సపోర్టు క్యారెక్టర్స్ చేసుకుంటున్న తరుణంలో 1979లో ఆమె నటించిన తమిళ సినిమా ‘వండిచక్రం’తో ఆమె కేరీర్ మలుపు తిరిగింది. ఇందులో బార్ డ్యాన్సర్గా గ్లామర్ పాత్ర పోషించి ఆమెకు రాత్రి రాత్రే స్టార్డమ్ వచ్చింది. అలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ లాల్, అక్కినేని నాగార్జున, మమ్ముట్టి వంటి సూపర్ స్టార్లతో కలిసి నటించిన సిల్క్ స్మిత తన జీవితం తెరపై కనిపించినంత రంగుల మయం కాదని ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తూండేవారు. ఈ క్రమంలోనే ఆమె అర్థాంతరంగా తనువు చాలించి సినీ పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టారు. (చదవండి: పవన్ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్) అయితే ఆమె మరణవార్త విని బాధపడిన వారు ఎంతమంది ఉన్నారో.. ఆమె లేదని సంతోషించిన వారు సైతం కూడా ఉన్నారు. ఎందుకంటే నటిగా ఆమె తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు, వాటితో స్మితకు వచ్చిన పేరును చూసి చాలామంది అసూయపడేవారు. అయితే పరిశ్రమలో అంతటి పేరు తెచ్చుకున్న ఆమె జీవిత కథ తెలిసిన వారు మాత్రం కన్నీరు పెట్టుకోవాల్సిందే. ఓ చిన్న పల్లెటూరిలో పుట్టిన ఆమె అసలు పేరు విజయ లక్ష్మీ వడ్లపాటి. తన తల్లిదండ్రులు చదివించలేక నాలుగో తరగతిలోనే ఆమెను స్కూల్ మాన్పించారు. అంతేకాకుండా చిన్న వయసులోనే వివాహం చేసి పంపించారు. అయితే అక్కడ భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక రైలెక్కి చెన్నై వెళ్లిన ఆమె సినిమా అవకాశాల కోసం ఎదురుచుశారు. ఈ క్రమంలో పలు సినిమాల్లో ఐటెం సాంగ్లో నటించిన ఆమె ఆ తర్వాత వెండితెరను ఏలే శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా బోల్డ్ క్యారెక్టర్స్తో స్టార్ నటిగా ఎదిగిన ఆమెకు అసలు ఆ పాత్రలంటే ఇష్టం ఉండేవి కాదని స్వయంగా ఆమె పలు ఇంటర్య్వూలో వెల్లడించారు. (చదవండి: ఆమె అంతే!) నిజానికి మంచి ఆర్టిస్టు కావాలన్న ఆమె కోరిక అందుకోసమే సినిమాల్లోకి వచ్చారు. అయితే తమిళంలో వచ్చిన ‘వండిచక్రం’ సినిమాలో సిల్క్ స్మితా అనే బార్ డ్యాన్సర్గా నటించిన ఆమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుంచి దర్శక నిర్మాతలు అలాంటి పాత్రలే ఇచ్చారు. ఇష్టం లేకున్న వరుసగా అలాంటి పాత్రలే చేయడంతో అలా సిల్క్ స్మిత అంటే గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఈ తరుణంలోనే 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నైలోని తన అపార్ట్మెంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అయితే ఆమె మృతి ఎన్నో అనుమానాలతో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ క్రమంలో సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా హిందీలో ‘ది డర్టీ పిక్చర్’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విద్యాబాలన్ స్మితా పాత్రను పోషించారు. -
నంద్యాల ఘటన బాధాకరం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : దేశానికి తొలి విద్యా శాఖ మంత్రిగా అబుల్ కలాం సేవలందించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అబుల్ కలాం జయంతిని జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. అబుల్ కలాం జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య నుంచి వర్సిటీ విద్య వరకు అబుల్ కలాం అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. చదవండి: టపాసుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను అబుల్ కలాం హయాంలో స్థాపించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నిరుపేద విద్యార్థులకు మంచి చదువు అందించేలా నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇంగ్లీష్ మీడియం అందించేలా మార్పులు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు వసతి దీవెన అందిస్తున్నామని, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా రూ.3,428 కోట్లు అందించినట్లు వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నమన్న సీఎం జగన్ మైనార్టీలపై ట్విట్టర్, జూమ్ల్లో మాత్రమే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు సంధించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, చంద్రబాబు పాలనలో కేవలం రూ.2500 కోట్లు మాత్రమే మైనార్టీల సంక్షేమానికి కేటాయించారని దుయ్యబట్టారు. నంద్యాల ఘటన బాధాకరమని తెలిపిన సీఎం జగన్ తన దృష్టికి రాగానే చట్టబద్దంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నంద్యాల ఘటనలోనూ పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారని తెలిపారు. న్యాయస్థానంలో నిందితులకు బెయిల్ కూడా మంజూరైందని, బెయిల్ రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలిపారు. మంచి చేయాలని తాము ఆలోచిస్తుంటే.. ఎలా బురద జల్లాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేస్తున్నమని తెలిపారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను కూడా ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. మదర్సాలకు అమ్మ ఒడిని అనుసంధానించామని, వచ్చే ఏడాది నుంచి పెళ్లి కానుక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ నీలం సాహ్ని, మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అల్లు రామలింగయ్య జయంతి; చిరు భావోద్వేగం
తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుత స్థాయిలో కామెడి పండించిన హాస్యపు రారాజు అల్లు రామలింగయ్య. వెండితెరపై ఆయన పూయించిన నవ్వుల జల్లు ఎల్లకాలం గుర్తిండిపోతుంది. హాస్యానికి చిరునామా అయిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్యకు తమ కుటుంబసభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని అల్లు అరవింద్ కుటుంబం అల్లు రామలింగయ్య పేరు మీదుగా అల్లు స్టూడియోస్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని గండిపేట్ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అల్లు అరవింద్ తోపాటు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ పేర్కొన్నారు.. చదవండి: 'అల్లు' స్టూడియోస్ ప్రారంభం అదే విధంగా అల్లు రామలింగయ్య జయంతి రోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను మరోసారి స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడిదయాలో భావోద్వేగ పోస్టు చేశారు. రామలింగయ్య కేవలం తనకు మామయ్య మాత్రమే కారని గొప్ప వ్యక్తి, డాక్టర్, స్వాతంత్ర్య సమరయోధుడు అని గుర్తు చేసుకున్నారు. ‘ఆయన పేరు గుర్తుకు రాగానే అందరి పెదాలపైన చిరునవ్వు మెదులుతుంది. మామయ్య గారు కేవలం అందరిని మెప్పించిన నటుడే కాదు. తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి డాక్టర్ కూడా. తత్వవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, నాకు మార్గదర్శి, గురువు, అన్నింటికి మించి మనసున్న మనిషి. ఈ 99వ పుట్టినరోజు నాడు ఆయన శత జయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను.’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. (భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్) Fondly remembering Shri.Allu Ramalingayya garu.. pic.twitter.com/xbQgHFImEj — Chiranjeevi Konidela (@KChiruTweets) October 1, 2020 -
ప్రత్యామ్నాయ కవిత్వం.. పరిపూర్ణ కవిత్వం
జాషువా 125వ జయంతిని కరోనా కాలంలో జరుపుకుంటున్నాం. ఇదొక అనుభవం. ఇన్నేళ్ళుగా ఆయన కవిత్వం ‘ప్రజల నాల్కల యందు’ జీవిస్తూనే ఉంది. తరం తరువాత తరం మీద పరిమితులు లేని ప్రభావాన్ని వేస్తూనే ఉంది. జాషువా కేవలం గొప్ప భావాల్ని మాత్రమే వ్యక్తం చేసి ఊరుకోలేదు. అవి ప్రజల నాల్కల మీద ఆడే రీతిలో రాశాడు. తనకాలంలో వస్తున్న కవిత్వానికి ప్రత్యామ్నాయ కవిత్వాన్ని రాసి మెప్పించినవాడు జాషువా. తన కవితా ప్రస్థానంలో ఎన్ని అడ్డంకులూ, అవమానాలూ ఎదుర్కొన్నాడో అన్ని నీరాజనాలూ అందుకున్నాడు. తాను రంగంలోకి దిగేసరికి తెలుగు కవిత్వంలో మూడు ధోరణులు ప్రధానంగా నడుస్తున్నాయి. కృష్ణశాస్త్రి, రాయప్రోలు నాయకత్వంలో భావకవిత్వం ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. విశ్వనాథ సత్యనారాయణ నాయకత్వంలో హిందూ సనాతన కవిత్వం మరోపక్క సవ్వడి చేస్తోంది. శ్రీశ్రీ నాయకత్వంలో అభ్యుదయ కవిత్వమూ ఉద్యమంలా వస్తో్తంది. ఈ మూడు ధోరణులకు భిన్నంగా రాస్తూ ప్రత్యామ్నాయ కవిత్వాన్ని సృష్టించాడు జాషువా. ప్రేమనూ, విరహాన్నీ ఊహించి విలపించే భావకవిత్వం వాస్తవానికి దూరంగా ఉందని విమర్శించాడు. విశ్వనాథ సనాతన హిందూ ధర్మాన్నీ ఎండగట్టాడు. ‘ప్రణయ కవి యొకండు, పాషాణ కవి యొక్కడు’ అని పై రెండు ధోరణుల కవుల్ని అధిక్షేపించాడు. ‘నేనాచరించని నీతులు బోధించి/ రాని రాగము తీయగలేను నేను’ అంటూ అభ్యుదయ కవుల మీదా చురకలు వేశాడు. తన కాలపు కుల, మత వాస్తవికతనూ, అంటరానితనాన్నీ, అంధవిశ్వాసాలనూ, పేదరికాన్నీ, దోపిడీనీ, స్త్రీల పీడననీ శక్తిమంతమైన కవిత్వంగా మలిచాడు. ప్రకృతి మీదా, పిల్లల మీదా, ప్రేమా, కరుణల వంటి విలువల మీదా, కళల మీదా, మానవ అశాశ్వతత్వం మీదా, మరణం మీదా– ఇలా విభిన్న అంశాల మీద వైవిధ్యపూరితమైన కవిత్వం రాశాడు. వివిధ తరహాల పాఠకులు కనెక్ట్ కాగలిగే వస్తు విస్తృతి జాషువాది. విభిన్నత నుంచి విశ్వజనీనతను చేరుకున్న కవిత్వం రాయడం ద్వారా ‘విశ్వ నరుడ్ని నేను’ అని సగర్వంగా ప్రకటించుకోగలిగాడు. ‘గబ్బిలం’, ‘పిరదౌసి’, ‘అనాథ’, ‘నేతాజీ’, ‘క్రీస్తు చరిత్ర’ ‘ముసాఫరులు’తో సహా 38 కవిత్వ గ్రంథాలను అందించాడు. ఇవి కాక వ్యాసాలూ, జాబులూ తదితర రచనలూ చేశాడు. ఒకపక్క రాయప్రోలు ‘పొగడరా నీదు తల్లి భూమి భారతిని /నిలపరా నీ జాతి నిండు గౌరవము’అని దేశభక్తిని గానం చేస్తుంటే జాషువా ఈ దేశాన్ని విమర్శించాడు. కులవ్యవస్థతో పంచముల్ని పీక్కుతినే ఈ దేశం భయంకరమైనదని అన్నాడు: ‘ఇది భయంకర దేశము వర్ణభేదముల్ గూడలు గట్టినవనరాదు పంచమ జాతివారికిన్ కూడు హుళక్కి, మానవత గూడ హుళక్కి, హుళక్కి జన్మమున్’. నిచ్చెనమెట్ల కుల సమాజంతో మనుషుల్ని ఎక్కువ తక్కువలుగా విభజించి, పంచములకు ఆహారాన్నీ, ఆత్మగౌరవాన్నీ, మనిషితనాన్నీ నిరాకరించిన ఈ దేశం భయంకరమైనదని బాధతో ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చాడు. ‘లేదురా ఇటువంటి భూమి ఎందులేదురా/మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక’, అని ఈనేలనూ, ప్రజల్నీ వైభవీకరించటాన్ని జాషువా తప్పు పట్టాడు. ఈ భూమి నీచమైనదనీ, ఈ పౌరులు కులోన్మాదులై దళితుల శ్రమను దోచుకునేవారనీ రాశాడు. ‘నేను చిందులాడి నేను డప్పులు గొట్టి యలసి సొలసి సత్తి కొలువు గొలువ ఫలితమెల్ల నొరులు భాగించుకొనిపోవు నీచమైన భూమి జూచినావె?’ అని అందుకే నిలదీశాడు. దళితుల గురించి దేశమూ, దళితేతరులూ ఏమనుకుంటున్నారనేది కాదు, దేశాన్ని గురించీ, తమను నిత్యం పీడిస్తున్న కులాల పౌరుల గురించీ దళితులు ఏమనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యంగా వ్యక్తం చేశాడు కవి. అందుకే ఈయన దృక్కోణం ప్రత్యామ్నాయ దృక్కోణమయ్యింది. ఈ వ్యవస్థ గురించి సంప్రదాయ కవులూ, మేధావులూ, నాయకులూ అల్లిన పవిత్ర భ్రమల్నీ, కట్టుకథల్నీ భగ్నంచేసి వాటి వెనకవున్న నిజాల్ని వెల్లడిచేయటంలోనే జాషువా ప్రత్యామ్నాయ దృక్కోణం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ పేరుతో హిందూమతాన్ని వైభవీకరిస్తే, జాషువా దానికున్న కుల స్వభావాన్ని బయటపెట్టాడు. దళితుల్ని అంటరాని వాళ్లుగా కసరి కొడుతూ ఆకలితో అలమటింపజేసిన హైందవ సంస్కృతిని గాఢమైన కవితాభివ్యక్తిలో పట్టుకున్నాడు: ‘ఆ అభాగ్యుని రక్తమునాహరించి ఇనుపగజ్జలతల్లి నర్తనము చేయు కసరి బుసకొట్టు నాతని గాలిసోక నాల్గు పడగల హైందవ నాగరాజు’ మనిషిని పశువుకన్నా హీనంగా జూసిన, చూస్తున్న చరిత్రను ఇంతకన్నా బలంగా ఎవరు చెప్పగలరు! శ్రమ గురించీ, దోపిడీ గురించీ, అసమానతల గురించీ రాసినప్పటికీ, శ్రీశ్రీ వాటి ముఖ కవళికల గురించీ, నిర్దిష్ట రూపురేఖల గురించీ రాయలేదు. ఆ పని జాషువా చేశాడు. ఈదేశ వర్గ దోపిడీ కుల పెత్తనంలో భాగంగా ఉందీ, ఇక్కడ వర్గాలు కులాలలో మనుగడ సాగిస్తున్నాయనే అంబేడ్కరిస్టు అవగాహనను జాషువా సమర్థంగా పలికించాడు. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్య రమ పండి పులకింప సంశయించు వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు’ అని ఈ దేశంలో దోపిడీ యొక్క నిర్దిష్ట రూపాన్ని స్పష్టంగా పట్టుకున్నాడు. ‘కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి/స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు’ అని దళితుడి చేత చెప్పించాడు. కులవ్యవస్థ కారణంగా దేశాన్ని విమర్శించినప్పటికీ, తన దేశప్రేమను జాషువా దాచుకోలేదు. బుద్ధుడినీ, గాంధీనీ, అంబేడ్కర్నూ ప్రేమిస్తూ పద్యాలు రాశాడు. నేతాజీ, శివాజీల మీద కావ్యాలు రాశాడు. దేశ స్వాతంత్య్ర అవసరాన్ని ఆకాంక్షించాడు. ‘స్వీయ రథము’ వస్తుంది కనుక వెరపు వలదని తన జనానికి ధైర్యం చెప్పాడు. దళితుల్ని అగ్రకులస్తులు పీడించటాన్ని విమర్శించి ఊరుకోకుండా దళితుల్లో సఖ్యత లేనితనాన్ని కూడా ఎద్దేవా చేశాడు. ‘వాని గుడిసె మీద వాలిన కాకి నా గుడిసె మీద వాలగూడదెప్పుడు కాకులందు మాలకాకి మాదిగ కాకి రూఢిసేయు మా విరోధములను’ అంటూ మాలమాదిగల విభేదాల్ని బయటపెట్టాడు. ‘దేవుడొక్కడు మాకు దేవళంబులు రెండు/ దేశమొకటి మాకు తెగలు రెండు’ అంటూ విమర్శించాడు. స్వతంత్ర భారతం దళితులకు రాజ్యాధికార భాగాన్ని తీసుకువస్తుందని విశ్వాసం వెలిబుచ్చాడు. ‘వెరపు వలదు నీకు హరిజన సోదరా స్వీయ రథము వెడలి వచ్చె లాగికొమ్ము నీకు భాగంబు కలదంచు పాడుచుండె రత్న భరతమాత’ ఇలా ఈనాటి దళిత రాజ్యాధికార భావనను ఆనాడు పలికించాడు. తన తరవాత రాబోయే దళిత కవులకు మార్గం చూపాడు. కులమతాల విమర్శతోనూ వేదనతోనూ ఆగిపోకుండా స్త్రీల పీడననూ ఎత్తిచూపాడు. స్త్రీలకు ‘ఎదిరింప జాలని చిలుకల చదువు నేర్పి’ బానిసలుగా పడుండే స్థితిని తెచ్చిన పురుష స్వామ్యాన్ని గట్టిగా ఎండగట్టాడు. శ్మశానం మీద రాసిన పద్యాలతో మానవ జీవితాన్నీ, మరణాన్నీ తాత్వీకరించాడు. ‘ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు’ లాంటి బలమైన భావాల్ని శ్మశానానికి ఆపాదించాడు. పలనాటిని ప్రస్తావిస్తూ, ‘గడ్డి మొలిచెను పులి చారల గద్దెమీద’ అంటాడు. ఇంత గంభీర కవిత్వం రాస్తూనే, మరొకపక్క జీవితంలోని అందాల్నీ, ప్రకృతి సౌందర్యాన్నీ కవిత్వంలో సున్నితంగా ప్రతిభావంతంగా పండించాడు. గిజిగాడినుద్దేశించి– ‘తేలిక గడ్డిపోచలను దెచ్చి రచించెదవీవు తూగుటుయ్యేల గృహంబు మానవుల కెరీకి సాధ్యము కాదు’ అంటాడొకచోట. పసి బాలుడ్ని ‘గానమాలింపక కన్నుమూయని రాజు/అమ్మ కౌగిటి పంజరమ్ము చిలక’ అని అద్భుతంగా వర్ణిస్తాడు. ఇంత గొప్పగా జీవితంలోని పలు పార్శా్వలను పదునైన వ్యక్తీకరణతో సాధికారికంగా, సజీవంగా చిత్రించాడు జాషువా. నిండైన కవిగా పరిణమించాడు. అతి సామాన్యమైన మాటలూ, అంతకు ముందు కవులెవ్వరూ వాడని పదాలూ, పదబంధాలూ, నిత్యం జనం వాడుకలో ఉన్న పలుకుబడీ ప్రయోగించి కవిత్వానికి సరికొత్త జీవశక్తిని ప్రసాదించాడు. అవమానించిన వారినుంచే అభినందనలు పొందాడు. రాసింది పద్యాలైనప్పటికీ వాటిలో ఆధునిక కవితా వ్యూహాల్ని ప్రదర్శించి అబ్బురపరిచాడు. చదువరుల్ని మంత్రముగ్ధు్దల్ని చేసే వ్యక్తీకరణను సాధించగలిగాడు. జాషువా సృజించిన కవిత్వాన్ని మొత్తంగా చూసినప్పుడు, ఆయన ప్రత్యామ్నాయ కవే కాదు పరిపూర్ణ కవి కూడా అనిపిస్తాడు. రవీంద్రనా«థ్ టాగూర్లా, సుబ్రమణ్య భారతిలా జాతీయ స్థాయి కవని అనిపిస్తాడు. తెలుగు జనం, తెలుగు కవిత్వం గర్వించదగ్గ కవి శిఖరం జాషువా. -జి.లక్ష్మీనరసయ్య -
నాన్నకు ప్రేమతో.. రాహుల్ గాంధీ
నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి . ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తండ్రి జయంతిని పురస్కరించుకొని ఆయన తనయుడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీకి భవిష్యత్తు మీద ఉన్న విజన్ చాలా గొప్పది. అంతకంటే ఆయన ఓ గొప్ప మనసున్న వ్యక్తి.. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి నా తండ్రి అయినందుకు, అలాంటి వ్యక్తికి కుమారుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను చాలా లక్కీ. ఈరోజు, ప్రతిరోజు మిమ్మల్ని మిస్సవుతున్నాం. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (ఇంకెంత కాలం జాప్యం..!) Rajiv Gandhi was a man with a tremendous vision, far ahead of his times. But above all else, he was a compassionate and loving human being. I am incredibly lucky and proud to have him as my father. We miss him today and everyday. pic.twitter.com/jWUUZQklTi — Rahul Gandhi (@RahulGandhi) August 20, 2020 అలాగే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఇక 1944 ఆగష్టు 20న ముంబైలో జన్మించిన రాజీవ్ గాంధీ 1984లో 6వ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు... అతి చిన్న వయసులోనే(40) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 1989 డిసెంబర్ 2 వరకు ప్రధానిగా రాజీవ్ గాంధీ పని చేశారు. ఆ తర్వాత మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) జరిపిన ఎన్నికల ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజును 'సద్భావన దివాస్' గా జరుపుతున్న విషయం తెలిసిందే. (గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి వద్దు) On his birth anniversary, tributes to former Prime Minister Shri Rajiv Gandhi Ji. — Narendra Modi (@narendramodi) August 20, 2020 -
శ్రీదేవి జయంతి; జాన్వీ కపూర్ భావోద్వేగం..
అందం, అభినయం ఆమె సొంతం. తన నటనతో ఎన్నో మరుపరాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్గ్రీన్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. కేవలం తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఆమె ఈ లోకాన్ని వీడిచి రెండేళ్లు దాటినా.. ఆ పేరు చెబితే ఇప్పటికీ అదే క్రేజ్. ఇంతకీ ఆమె ఎవరో కాదు..అందాల తార శ్రీదేవి. నేడు ఈ అతిలోక సుందరి 57వ జయంతి. కాగా 2018 ఫిబ్రవరిలో దుబాయ్లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు శ్రీదేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. (ఎర్రగులాబీలులో... కీర్తీ సురేష్) శ్రీదేవి జయంతి సందర్బంగా సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానులు ఆమె తాలూకూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తన తల్లిని మదిలో గుర్తు చేసుకుంటూ తనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ‘హ్యపీ బర్త్డే ముమ్మ.. లవ్ యూ’ అంటూ.. తల్లితో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో షేర్ చేశారు. అలాగే శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ఆమెతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “లెజెండ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని కార్తీక్ ఆర్యన్ జాన్వీ పోస్ట్పై స్పందించగా.. జోయా అక్తర్, భూమి పెడ్నేకర్, సంజయ్ కపూర్ లాంటి చాలా మంది హార్ట్ ఎమోజీలను జతచేశారు. (అందరికీ నెగటివ్... ఆల్ హ్యాపీ) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి #happybirthdayamma ❤️🎂#happybirthdaysridevi #sridevi #SrideviLivesForever pic.twitter.com/y0pqddDmPd — Jhanvi Kapoor (@janhvikapoorr) August 13, 2020 View this post on Instagram I love you mumma A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Aug 12, 2020 at 11:36pm PDT Jaan missing you lots every second of the 900 days you left us , but more so today to see the joy on your face for the good reaction to Janu’s work in Gunjan, I wish you were here with us, our joy is incomplete without you. Happy birthday my love my life. #HappyBirthdaySridevi pic.twitter.com/jkVSzfzD90 — Boney Kapoor (@BoneyKapoor) August 13, 2020 -
దక్షిణాది రాష్ర్టాల నుంచి ఆ గౌరవం పీవీకే దక్కింది
సాక్షి, హైదరాబాద్ : పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు శుక్రవారం ఇందిరాభవన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య , షబ్బీర్ అలీ, కమిటీ చైర్మన్ గీతారెడ్డి, వీహెచ్ హనుమంతరావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే దేశాన్ని పాలించే స్థాయికి పీవీ ఎదిగారని కొనియాడారు. ఒక సామాన్యుడు సైతం ప్రధాని కావచ్చనే విషయాన్ని పీవీని చూసి స్ఫూర్తి పొందాలన్నారు. ఒక తెలుగువ్యక్తికి అంతటి గోప్ప స్థాయి కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి పీవీకి దక్కిన గౌరవం మరెవరికి దక్కలేదని, సోనియాగాందీ సలహామేరకు ఏఐసీసీ ఆమోదంతో పీవీ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. పీవీ ప్రధాని పదవి చేపట్టాక దేశ ఆర్థిక సంస్కరణలు పీవీకి ముందు ఆయన తర్వాత అనేలా ఉన్నాయని పేర్కొన్నారు. ('పుట్టుక నుంచి చనిపోయే వరకు పీవీ కాంగ్రెస్ వాది') 24వ శతాబ్ధంలో రాజీవ్గాంధీ ఆలోచనలకు రూపకల్పన చేసింది పీవీ అని వీహెచ్ హన్మంతరావు అన్నారు. సొంత గూటి నుంచే పీవీకి గట్టి పోటీ ఉండేదన్నారు. 'పీవీని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం జరిగింది. మా అధ్యక్షుడు మాటకు గౌరవం ఇచ్చి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటం లేదు. కొందరు ఆయన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎవరి వల్లా కాదు. మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. పీవీ ఆశించినట్లు బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి' అని వీహెచ్ అన్నారు. తెలుగు జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహారవు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు అన్నారు. ఆయన ఘనత భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (హ్యాపీ బర్త్డే తారక్: సీఎం జగన్) -
అపర భగీరథుడు.. తండ్రికి తగ్గ తనయుడు!
నీ చిరునవ్వు.. మా గుండెల్లో చెరగని జ్ఞాపకం నీ నాయకత్వం.. మా బతుకుల్ని వెలిగించిన దీపం నీ సంక్షేమాభిలాష.. మా పాలిట సంజీవని మా ఆత్మ బంధువైన.. నిన్ను ఎన్నటికీ మరువం రాజన్నా అభివృద్ధి ఎంత ముఖ్యమో.. సంక్షేమమూ అంతే ముఖ్యమని నమ్మిన ప్రజానాయకుడు.. బీడు భూముల్లో ఆనందపు సిరులు నింపేందుకు జలయజ్ఞం చేపట్టిన రైతు బాంధవుడు.. పేద ప్రజల ఆరోగ్యమే తనకు మహాభాగ్యమన్న మహానేత.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్న రాజనీతిజ్ఙుడు రాజన్న. ప్రజాసేవలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటానన్న ఆ మేరునగ ధీరుడు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాయి. రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగనన్నకు ఓ దిక్సూచిలా పనిచేస్తున్నాయి. అపర భగీరథుడు.. తండ్రికి తగ్గ తనయుడు (సాక్షి, వెబ్ ప్రత్యేకం) : ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పాడి పంటలతో పులకించాలి. బీడు బడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరుడు నిండాలి’’ అని వైఎస్సార్ ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి పేరిట వ్యవసాయ రంగాన్ని విస్మరించి గ్లోబలైజేషన్ వెంట పరుగులు పెడుతున్న పాలకులకు మట్టి వాసనను మళ్లీ పరిచయం చేశారు. దేశానికి వెన్నెముకైన రైతును రాజును చేసేందుకు జలయజ్ఞం ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని సంకల్పించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి.. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని ఆరంభించి, అనుమతులు తెచ్చి 80 శాతం పనులు పూర్తి చేశారు. గుండ్లకమ్మ, వెలిగొండ, అలీసాగర్, సుద్దవాగు, దేవాదుల, సురంపాలెం, మద్దువలస, పెద్దేరు ఇలా పదుల సంఖ్యలో ప్రాజెక్టులను పూర్తి చేసి అపర భగీరథుడిగా అన్నదాతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అంతేగాక ఉచిత విద్యుత్ పథకం మీద తొలి సంతకం చేసి.. ‘వ్యవసాయం దండగ.. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’ అన్న గత పాలకుల మాటలు తలకిందులు చేసి వ్యవసాయాన్ని పండుగ చేశారు. అలా రాజన్న పాలనలో స్వర్ణయుగం చూసిన రైతులకు రాష్ట్ర విభజన తర్వాత మరోసారి కష్టాలు మొదలయ్యాయి. రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హామీలను తుంగలో తొక్కి రైతులకు తీరని అన్యాయం చేసింది. ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కష్టాల పాలు చేసింది. అటువంటి సమయంలో రాజన్న వారసుడు జగనన్న అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ‘‘వైఎస్సార్ రైతు భరోసా’’ పేరిట బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడాది పాలనలోనే 49.43 లక్షల మంది రైతులకు రూ.10,209.32 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అంతేగాక రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.2,000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో జనతా బజార్ ఏర్పాటు చేయడం సహా... రైతులు పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తులు కూడా ఇందులో అమ్ముకునే వీలు కల్పించారు. వీటి ద్వారా ప్రభుత్వమే 30 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో పోటీ పెంచి మంచి ధర లభించేలా ప్రణాళికలు రచించారు. అదే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ఏర్పాటు చేసి.. వీటి ద్వారా రైతులకు ఎన్నో సేవలతోపాటు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపులో సమూల మార్పులు చేసి, రైతులపై ఏ మాత్రం భారం పడకుండా వారు కేవలం ఒక రూపాయి కడితే చాలు.. ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. సన్న, చిన్న కారు రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ద్వారా ఉచిత బోర్ వెల్స్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా అనేక రకాలుగా రైతులకు అండగా నిలబడుతూ రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పేదల పాలిట సంజీవని.. ప్రతిధ్వనిస్తున్న విప్లవ శంఖం! ముఖ్యమంత్రి యెడుగూరి సందింటి రాజశేఖర్రెడ్డిని రాజన్నగా పేద ప్రజలకు చేరువ చేసిన అతి ముఖ్యమైన పథకాల్లో ఆరోగ్య శ్రీ ఒకటి. నిజానికి ఇది వైఎస్సార్ మానస పుత్రిక వంటిది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించేలా రూపొందించిన ఈ ఆరోగ్య బీమా పథకం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రజల పాలిట సంజీవనిలా మారింది. 2007లో ఆరోగ్యశ్రీ తొలుత 3 జిల్లాల్లో 163 వ్యాధులకు చికిత్స అందించేలా రూపొందించారు. ఆ తర్వాత రెండేళ్ల కాలంలోనే ఈ సేవలను విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు. కేన్సర్, గుండె జబ్బులు, న్యూరో, గర్భ కోశవ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారు ఇలా లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. పార్టీలకు అతీతంగా అర్హులందరు వైద్య సహాయం పొందారు. 108 సర్వీసులతో ఎంతో మందిని సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చడం సహా 104 వాహనాలు(సంచార వైద్యశాలలు )లతో ఎంతో మందికి ఔషధాలు అందించారు. ‘‘నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండడుగులు ముందుకేస్తా’’ అన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని 90 శాతం వాగ్దానాలను అమలు చేశారు. రాష్ట్రంలోని 95.85 శాతం కుటుంబాలకు ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పేరుతో పేద కుటుంబాలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలోని 1,42,54,134 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేసే కొత్త కార్డులను పంపిణీ చేశారు. కొత్తగా 1,000 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి, మొత్తం 2,059 వ్యాధులకు వైద్యం అందించే పైలట్ ప్రాజెక్టుకు జనవరిలోనే శ్రీకారం చుట్టారు. క్యాన్సర్ సహా 2,059 వ్యాధులకు వైద్యం చేయిస్తామని.. బిల్లు రూ.1,000 దాటితే పథకం వర్తిస్తుందని ప్రకటించారు. అవ్వా తాతలకు కంటి వెలుగు పథకం తీసుకువచ్చారు. అదే విధంగా వైద్య రంగంలో సమూల మార్పులు చేపట్టి.. . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేసేందుకు నాడు –నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున 11,197 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్ర పౌరులందరికీ హెల్త్ రికార్డులను సిద్ధం చేయబోతున్నారు. భారీగా వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు సింగిల్ నోటిఫికేషన్ జారీ చేయించారు. 16 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించబోతున్నారు. ఇక జూలై 1న వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన 108, 104 కొత్త వాహనాల ప్రారంభోత్సవం ఎంత కన్నుల పండువగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1,088 వాహనాలు ఒకేసారి సేవల్లోకి బయలుదేరి వెళ్లాయి. రాజన్న వారసుడి ప్రజారోగ్య రథయాత్రకు ప్రజలంతా నీరాజనం పట్టారు. 108, 104 వాహనాలు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి వివిధ జిల్లాలకు తరలివెళ్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో మరోసారి పేద ప్రజల కళ్లల్లో ఆశాజ్యోతులు వెలిగించారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు లభించాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మూడు ప్రధాన నగరాల్లో 130 ఆసుపత్రులను ఎంపానల్ చేశారు. అంతేగాకుండా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ దేశంలోనే రికార్డు స్థాయిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సహా.. ప్రాణాంతక వైరస్ సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫీజు రీయింబర్స్మెంట్.. రెండడుగులు ఎక్కువే! పేదరికం ప్రతిభకు ప్రతి బంధకం కాకూడదని.. ఉన్నత విద్యనభ్యసించాలనే కలకు ఆటంకం కారాదని భావించారు వైఎస్సార్. కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఒకరు ఉన్నా.. ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ఆయన నమ్మారు. అందుకే చదు‘కొన’లేని విద్యార్థులకు చేయూత అందించడమే లక్ష్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థుల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించేలా పథకాన్ని రూపొందించారు. ఈ విప్లవాత్మక పథకం ద్వారా లబ్ది పొంది ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నత విద్యావంతులయ్యారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా కెరీర్లో స్థిరపడ్డారు. వైఎస్ జగన్ను అధికారంలోకి తీసుకువచ్చిన నవరత్నాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కూడా ఒకటి. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదని.. ఏ ఉన్నత చదువుకైనా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (జగనన్న విద్యా దీవెన) అమలు చేస్తున్నామని ప్రకటించారు. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది చదువేనని విశ్వసించిన ఆయన గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాట వేశారు. అదే విధంగా జగనన్న వసతిదీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందించేందుకు సిద్ధమయ్యారు. అంతేగాకుండా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ‘అమ్మ ఒడి’ అమలు చేశారు. ‘జగనన్న గోరుముద్ద’పేరిట మధ్యాహ్న భోజనం పథకంలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘జగనన్న విద్యా కానుక’తో బుక్స్, నోట్స్, యూనిఫాం, షూస్, బ్యాగ్ తదితరాలు పంపిణీ చేస్తున్నారు. నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు నాంది పలికారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తూనే.. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సన్నద్ధులను చేసేందుకు, ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అవ్వాతాతలకు అండగా.. వైఎస్సార్ పెన్షన్ కానుక వృద్ధాప్యం భారం కాకూడదనే ఆలోచనతో వైఎస్సార్ అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా పెన్షన్లు అందే ఏర్పాటు చేశారు. ఆసరాలేని వృద్ధులు, దివ్యాంగులు, ఆర్థిక సాయం ఎదురు చూసేవారికి ఈ పెన్షన్లు చేయూతనిచ్చాయి. కేవలం 75 రూపాయిల కోసం ప్రభుత్వాధికారుల చుట్టూ పడిగాపులు పడే పరిస్థితులను మార్చి అర్హులందరికీ పెన్షన్ అందేలా ఆయన చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ వైఎస్సార్ పెన్షన్ ఫైల్పై తొలి సంతకం చేసి తండ్రి ఆశయ వారసత్వాన్ని నిలబెట్టారు. ఓ అడుగు ముందుకేసి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుడి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇచ్చే సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు.‘గడప వద్దకే పెన్షన్’ కార్యక్రమాన్ని అమలు చేసి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, రోగుల కళ్లలో ఆనందం నింపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం.. ప్రజల వద్దకే పాలనను ఆవిష్కృతం చేశారు. నాడు ప్రజాప్రస్థానం పేరుతో రాజన్న చేపట్టిన పాదయాత్ర 1,470 కిలోమీటర్లు కొనసాగింది.. ఆ యాత్ర నుంచే ‘ప్రజా మేనిఫెస్టో’ రూపుదిద్దుకుని... రైతును రాజు చేసింది... నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందించింది... అన్నివర్గాల ప్రజలకు మేలు చేసి కోట్లాది మంది గుండెల్లో ‘మహానేత’ను కొలువుదీరేలా చేసింది... ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ఎన్నికై సంక్షేమ పాలన అందిస్తున్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా అప్పులు స్వాగతం పలికినా చిరునవ్వు చెరగనీయక ముందుకు సాగుతున్నారు. మేనిఫెస్టోలో 129 హామీలిస్తే ఏడాది కాలంలోనే 77 హామీలను అమలు చేసి, మరో 36 హామీలు అమలుకు తేదీలతో క్యాలెండర్ ప్రకటించి.. ఇంకా మిగిలి ఉన్న 16 హామీలను కూడా ఈ ఏడాది పరుగులు పెట్టిస్తామని ప్రకటించారు. రైతు భరోసా, అమ్మఒడి, పింఛన్ కానుక, ఆరోగ్యశ్రీ, వాహన మిత్ర, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, వైఎస్సార్ కాపునేస్తం తదితర పథకాలు అమలు చేశారు. అక్కాచెల్లెమ్మలకు పెద్దపీట వేస్తూ దాదాపు 30 లక్షల మందికి పైగా పేద మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చేందుకు సన్నద్ధమయ్యారు. వైఎస్సార్ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఇంత గొప్పగా ప్రజల రుణం తీర్చుకుంటూ, తండ్రి పేరు ప్రతిష్టలు నిలబెడుతూ... నువ్వు మాతోనే ఉన్నావన్న అభయం ఇస్తున్న తనయుడిని కన్న రాజన్నా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!! అలాగే రైతు దినోత్సవ శుభాకాంక్షలు!! -
అందరి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఎవ్వరికీ భయపడేవారు కాదు. మంత్రులు, అధికా రులు, ఇతరుల మీద ఆధా రపడి రాజకీయ నిర్ణయం చేసే వారు. ఉదాహరణకు 2004లో వారు మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. హిమాయత్నగర్ నియోజకవర్గంలోని నారాయణగూడ వద్ద డిస్టిల్లరీ చాలా సంవత్సరాల నుండి మూతబడి ఉన్నది. ఒకవైపు భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలంలో స్థానిక ప్రజలు ఒక పార్కును అభివృద్ధి చేశారు. నేను కేంద్రమంత్రిగా పర్యటిస్తున్నప్పుడు ఆ పార్కును స్థానికులు అభివృద్ధి చేయమని కోరారు. 2002లోనే నేను అప్పటి ముఖ్యమంత్రికి లేఖ ద్వారా దీన్ని విన్నవించాను. అయినా 2003లో ప్రభుత్వం ఆ భూమిని వేలం వేయాలని నిర్ణ యించింది. ఆ నిర్ణయాన్ని వ్యతి రేకించి నిర్ణయాన్ని అబేయన్సు (నిలుపుదల)లో పెట్టించడం జరిగింది. 2004 ఎన్నికల అనంతరం రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రాంత నూతన శాసన సభ్యులు జి.కిషన్రెడ్డి ‘ఆ పార్కును అభివృద్ధి చేయ మని నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. మీరూ మాట్లాడితే మీ మాట వింటారని’ అన్నారు. అప్పుడు నేను వైఎస్సార్ గారికి ఫోన్ చేసినప్పుడు, బాగున్నారా సర్ అని నా యోగక్షేమాలు అడిగారు. ఆ పార్క్ ఎలాగైనా అభివృద్ధి చేయాలని కోరాను. ఆ ఫైల్ ప్రాసెస్ అయ్యిందనీ, దానిని మీరు మళ్లీ అబేయన్సులో పెట్టడానికి సంతకం చేస్తున్నా రని తెలిసిందని అంటే, వారు ‘గత ముఖ్యమంత్రి మీ మిత్రులే గదా’ అని అడిగారు. ‘మీరు కూడా పాత ప్రభుత్వ బాటలోనే నడుస్తారా?’ అని ప్రశ్నించాను. వారు నవ్వుతూ, మీరు చెప్పారు కదా, నేను తప్పకుండా చేస్తాననీ, నెల తరువాత మీరే మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయండనీ అన్నారు. నేను ఇప్పుడు పార్ల మెంట్ సభ్యుడిని కాదని బదులివ్వగా, మీరే శంకుస్థాపన చేయాలి, మీకు జీఓ కాపీ పంపుతానని హామీ ఇచ్చి, వెంటనే తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆవిధంగా రాజ కీయాలకు అతీతంగా నిర్ణయాలు చేసేవారు. వ్యక్తిగతంగా ఆత్మీయ మైన సంబంధం నెలకొల్పుకునే వారు. వై.ఎస్. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రాణ హిత నది గోదావరి నదిలో కలవక ముందే ఎత్తి పోతల ద్వారా తెలంగాణలో మంచినీటికి, ఐదున్నర లక్షల ఎకరాల సాగునీటికి ఉపయోగించాలని తలపెట్టి ఇందుకోసం పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయడానికి జీవో 557 విడుదల చేసి, ఖర్చుల కోసం ఒక కోటి 66 లక్షల 40 వేల రూపాయలు విడుదల చేయడం జరి గింది. ఈ ఉత్తర్వులు ప్రాంతీయ విభే దాలకు ఆజ్యం పోసే విధంగా ఉన్నా యని నాటి మాజీ కేంద్రమంత్రి సీహెచ్. విద్యాసాగర్ రావు (ప్రస్తుత మాజీ గవర్నర్) నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే ప్రభుత్వానికి లేఖ సిద్ధం చేయమనీ, బీజేపీ ప్రతినిధి బృందంతో ముఖ్యమం త్రిని కలుద్దామనీ బదు లిచ్చాను. వెంటనే ముఖ్యమంత్రి అపా యింట్మెంట్ అడ గ్గానే కేటాయిం చారు. మేము వెళ్ళగానే లేచి, పెద్దవారు వచ్చారని ఆత్మీయంగా మమ్మల్ని ఆహ్వానించి, మెమొరాండం మొత్తం చదివారు. ‘అవును నిజమే కదా’ అని కొంత ఆశ్చ ర్యానికి గురై, ఎలా జీవో జారీ చేశారని ఇరిగేషన్ కార్యదర్శి శర్మ ఐఏఎస్ గారికి ఫోన్ చేశారు. బయట మీడియా మిత్రులకు ఏమి చెప్పమం టారని అడిగితే, మీరు కోరినట్లే ప్రభుత్వం అంగీకరించిందనీ, ఐదున్నర లక్షల ఎకరాలకు బదులు పది లక్షల ఎకరాలకు సాగునీరు కొరకు, హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటికి కేటాయించే విధంగా రెండు రోజుల్లో సవరించిన జీవో విడుదలవుతుందని మాట ఇచ్చినట్లు చెప్ప మన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ విధంగా పార్టీలకు అతీతంగా ప్రజాను కూల నిర్ణయాలు త్వరితగతిన తీసుకునేవారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రికి అనేక సమస్యల మీద లేఖలు వ్రాయడం ప్రారం భించాను. ఆ లేఖలకు ‘ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ’ అనే పేరు పెట్టాను. హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో రంగారెడ్డి జిల్లాలో అనేకమంది రైతుల భూములు కారు చవకగా తీసుకొని నష్టపరిహారం ఎకరానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేవారు. దానిని రాజశేఖరరెడ్డి ఎకరానికి ఎనిమిది లక్షలు చేశారు. భూమికి భూమి ఇవ్వాలని ఉద్యమించాము. అప్పుడు లేఖలు 100 దాటాయి. ఒకరోజు రైతు సమస్యల మీద ఆయన్ని కలవడానికి వారి నివాసానికి వెళ్ళాము. ముఖ్య మంత్రి బయటకు వస్తూనే మమ్మల్ని చూసి రండి రండి అని మా వద్దకు వచ్చి మెమొరాండం తీసు కున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వట్టి వసంత కుమార్, బండారు దత్తాత్రేయ గారు మీకు బహిరంగ లేఖలు రాస్తూ మిమ్మల్ని విమర్శిస్తున్నా రని అన్నారు. దానికి వైఎస్సార్ చిరునవ్వుతో వారి బాధ్యత వారు నెరవేరుస్తున్నారు. వారు నాకు ఏ లేఖలు వ్రాసినా నేను వాటిని ‘ప్రేమ లేఖలు’గానే భావిస్తానని అదే చిరునవ్వుతో బదులిచ్చారు. అలా వారు ఏ విషయమైనా స్పోర్టివ్గానే తీసుకునేవారు. ప్రజాహితం కోసం సహృదయంతో రాజకీయాలకతీతంగా నిర్ణయం తీసుకునేవారు. వ్యాసకర్త: బండారు దత్తాత్రేయ, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ -
360 డిగ్రీస్ పర్సనాలిటీ పీవీ: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్కు సంస్కారం, గొప్ప చరిత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని, ఆయనలాంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పీవీ నరసింహారావు గురించి చెప్పడానికి కొంత సాహసం కావాలని, ఒక్క మాటలో చెప్పాలంటే 360 డిగ్రీస్ పర్సనాలిటీ పీవీ నరసింహారావు కొనియాడారు. (చదవండి : పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్ నివాళి) పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలియని, గొప్ప సంస్కరణ శీలి అని అన్నారు. సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమని సీఎం కీర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గురుకుల పాఠశాలలను తీసుకొచ్చింది పీవీనే అని, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చిన నేత పీవీ నరసింహరావని.. మన పీవీ మన తెలంగాణ ఠీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. భూసంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మంది పేదలకు న్యాయం చేశారన్నారు. 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ అని,ఆయన ఏ రంగంలో ఉన్న అందులో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. విద్యాశాఖను మానవవనరుల శాఖగా మార్చడమే కాకుండా నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టి అనేక మంది ప్రతిభావంతుల్ని దేశానికి అందించారన్నారు. 360 డిగ్రీలపర్సనాలిటీ అని పీవీ చరిత్రపై ఓ పుస్తకమే రాయొచ్చని సలహా ఇచ్చారు. ఆయన జీవిత చరిత్ర వ్యక్తిత్వ పఠిమను పెంపొదించుకోవడానికి ఉపయోగపడుతందని సీఎం కేసీఆర్ అన్నారు. -
ఆ పిలుపులో ఆత్మీయత చవిచూశా : చిరు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్, దివంగత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా రామానాయుడుని గుర్తు చేసుకున్నారు. సినిమా పట్ల ఆయన తపన ఎంతో గొప్పదని, అది ఇతరులను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడుతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. (చదవండి : రాజమౌళిని గుర్తుచేసుకున్న రష్యా ఎంబసీ) ‘రాజా ...!" అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు...నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం.సినిమా అంటే మీకున్న ప్రేమ,మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. (చదవండి : ఏపీ సీఎంతో సినీ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం) "రాజా ...!" అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు...నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం.సినిమా అంటే మీకున్న ప్రేమ,మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం pic.twitter.com/HBRvhrVfze — Chiranjeevi Konidela (@KChiruTweets) June 6, 2020 -
ఎన్టీఆర్కు నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
-
శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘విశ్వవేదికపై తెలుగు కవిత కీర్తిపతాకను ఎగురవేసిన మహాకవి శ్రీశ్రీ జయంతి నేడు. కవిత్వానికి ఉండే శక్తి ప్రపంచాన్ని కదిలించగలదని, సమాజ హితానికి తోడ్పడగలదని శ్రీశ్రీ తన అభ్యుదయ రచనల ద్వారా చాటిచెప్పారు. ఆయన రచనలు తరతరాలకూ స్ఫూర్తినిరగిలించే దివిటీలుగా నిత్యం వెలుగుతూనే ఉంటాయి.’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. -
అన్నయ్యను గుర్తుచేసుకున్న కళ్యాణ్రామ్
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్రామ్ ట్విటర్ వేదికగా తన అన్నయ్య దివంగత జానకిరామ్ను గుర్తుచేసుకున్నాడు. బుధవారం జానకిరామ్ జయంతి. ఈ సందర్భంగా కళ్యాణ్రామ్ జానకిరామ్కు నివాళులర్పించారు. తన అన్నయ్య జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా కళ్యాణ్రామ్ స్పందిస్తూ.. ‘మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలో, మా ప్రార్థనలలో జీవించే ఉంటారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. వి మిస్ యూ’అంటూ ట్వీట్ చేశాడు. సొంతంగా ఎన్టీఆర్ బ్యానర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన జానకిరామ్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయితే సక్సెస్ ఫుల్ నిర్మాతగా మరిన్ని విజయాలను అందుకోవాల్సిన జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఐదేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం చెందారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో జానకిరామ్ మృతిచెందారు. ట్రాక్టర్ను తప్పించబోయి జానకిరామ్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. పెద్దకుమారుడి మాదిరిగానే నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఇక 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా మోతే వద్ద ఆయన ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ వరుస ప్రమాద కారణాలతోనే ‘అతి వేగం ప్రమాదకరం.. యాక్సిడెంట్ వల్ల మేము ఇప్పటికే మేము ఎంతో కోల్పోయాము. ఆ పరిస్థితి మరేవరికి రావద్దు’ అంటూ నందమూరి వారసుల చిత్రాల ప్రారంభానికి ముందు వాయిస్ ఓవర్ వస్తుంటుంది. చదవండి: లవ్ యూ అమ్మ: రామ్ చరణ్ విలన్గా అనసూయ..! -
ఆర్ఎస్ఎస్ మూలస్తంభం
ఆర్ఎస్ఎస్గా నేడు అందరికీ సుపరిచితమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బహుముఖాలుగా విస్తరించడానికి కీలకమైన భూమిక పోషించినవారు గోల్వాల్కర్. మహారాష్ట్రలోని నాగపూర్ దగ్గర గల రాంటెక్లో 1906 ఫిబ్రవరి 19న సదాశివరావు, లక్ష్మీబాయ్ దంపతులకు మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ జన్మించారు. తొమ్మిదిమంది సంతానంలో బతికి బట్టకట్టినది ఈయన ఒక్కరే. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి తరచూ బదిలీలు కావడంతో చిన్నతనంలో దేశంలోని వివిధ ప్రాంతాలను గోల్వాల్కర్ చూశారు. అప్పటి నుంచే ఆయనలో మతపరమైన, ఆధ్యాత్మికమైన ఆసక్తి పెరిగింది. క్రైస్తవాన్ని తీవ్రంగా వ్యతిరేకించి హిస్లాప్ కాలేజీని వదిలిపెట్టి వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరి సైన్స్ లో 1927లో డిగ్రీ చేయడంతోపాటు, 1929లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. తరువాత మెరైన్ బయోలజీ చేయడానికి మద్రాస్ వెళ్లినప్పటికీ తండ్రి పదవీ విరమణ కారణంగా పూర్తి చేయకుండానే వెనక్కి వచ్చి బెనారస్ యూనివర్సిటీలోనే జువాలజీ బోధించడం ప్రారంభించారు. గోల్వాల్కర్ ధరించే సామాన్యమైన దుస్తులు, పొడవాటి గడ్డం కారణంగా ఆయనను గురూజీ అని పిలిచేవారు. తరువాత నాగపూర్ చేరుకున్న ఆయన అప్పటి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ సంచాలక్ కె.బి. హెగ్డేవార్ సలహా మేరకు 1937లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. నాగపూర్ శాఖకు 1934లో కార్యదర్శిగా నియమితులైన గోల్వాల్కర్ను 1939లో ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు హెగ్డేవార్ ప్రకటించారు. ఆయన మరణానంతరం పగ్గాలు చేపట్టిన గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ను దేశంలోనే బలమైన మతవాద రాజకీయ శక్తిగా నిర్మించారు. లక్షమంది ఉండే సభ్యుల సంఖ్యను పది లక్షలకు చేర్చారు. రాజకీయ, సామాజిక, మత, విద్య, కార్మికరంగాలకు 50 ప్రధాన శాఖల ద్వారా విస్తరించారు. ఆర్ఎస్ఎస్ను విదేశాలకు కూడా విస్తరించారు. భారతీయ స్వయం సేవక్ సంఘ్, హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరిట ఏర్పడిన సంస్థల్లో పలువురు హిందువులు సభ్యులుగా చేరారు. ఆర్ఎస్ఎస్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గోల్వాల్కర్ 1973, జూన్ 5న కన్నుమూశారు. (రేపు గోల్వాల్కర్ జయంతి సందర్భంగా) -
చనిపోయేముందు చివరిసారిగా ట్వీట్..
-
ప్రియాంకపై మాయావతి ఫైర్
లక్నో : సామాజికవేత్త, కవి రవిదాస్ను అధికారంలో ఉండగా కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ గౌరవించలేదని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆలయ సందర్శనలను మాయావతి ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.తాము అధికారంలో ఉన్న సమయంలో రవిదాస్కు తాము అత్యంత గౌరవం ఇచ్చామని మాయావతి చెప్పుకొచ్చారు. తమ పార్టీ యూపీలో అధికారంలోకి వస్తే బదోహి జిల్లాను తిరిగి సంత్ రవిదాస్ నగర్ జిల్లాగా మార్చుతామని స్పష్టం చేశారు. ఎస్పీ ప్రభుత్వం గతంలో కుల కోణంలోనే రవిదాస్ నగర్ జిల్లా పేరును తొలగించిందని ఆమె మండిపడ్డారు. 1994లో వారణాసి జిల్లా నుంచి వేరుపరుస్తూ బీఎస్పీ హయాంలో సంత్ రవిదాస్ నగర్ జిల్లా ఏర్పడగా 2014లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఆ జిల్లా పేరును బదోహిగా మార్చింది. కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలు అధికారంలో ఉండగా సంత్ గురు రవిదాస్ను పట్టించుకోకుండా, విపక్షంలో ఉన్నప్పుడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయాలు, ఇతర ప్రాంతాలను సందర్శిస్తున్నాయని మాయావతి ట్వీట్ చేశారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు వారణాసిలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్న క్రమంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి : మాయావతి ప్రకటనపై మందకృష్ణ ఆవేదన -
మహానేత అడుగు జాడల్లోనే వైఎస్ జగన్ పాలన
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తారని వైఎస్సార్సీపీ ఎంపీలు విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి కేక్ కట్ చేశారు. తొలుత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డి మాటాడుతూ.. రైతే దేశానికి వెన్నెముక అని బలంగా నమ్మి రైతు సంక్షేమానికి, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారన్నారు. ప్రతి గింజ మీద దాన్ని తినే వారి పేరు రాసి ఉంటుందని చెప్పినట్టుగానే.. రాష్ట్రంలో రైతు పండించే ప్రతి గింజ మీద ఆ రైతు పేరుతోపాటు వైఎస్సార్ పేరు కూడా ఉంటుందన్నారు. ఆ స్థాయిలో రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ రక్తం పంచుకుని పుట్టిన ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తండ్రి అడుగు జాడల్లోనే పనిచేస్తారని, వైఎస్సార్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అమలు చేస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోనే నంబర్–1గా నిలుపుతారని అన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. రైతులతో మహానేతకు విడదీయలేని బంధం ఉందన్నారు. రైతుల గుండెల్లో ఆయన చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ తామంతా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, బాలశౌరి, మాంగుట శ్రీనివాసులురెడ్డి, రఘురామకృష్ణంరాజు, రెడ్డెప్ప, నందిగం సురేష్, గొడ్డేటి మాధవి, దుర్గాప్రసాద్, తలారి రంగయ్య పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో.. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. వైఎస్సార్ విగ్రహానికి మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్రెడ్డి, మాజీ మేయర్ రత్నబిందు, పార్టీ అధికార ప్రతినిధి ఎన్.పద్మజ, మాజీ కార్పొరేటర్లు జె.దామోదరరావు, చోడిశెట్టి సుజాత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అడపా శేషు, జానారెడ్డి, మైలవరపు దుర్గారావు, అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అరుణ్, యువజన విభాగం రాష్ట్ర నేత రామిరెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. పదిమందికీ పట్టెడన్నం పెట్టే రైతులు చల్లగా జీవించాలని కలలుగన్న మనసున్న మహారాజు వైఎస్ రాజశేఖరరెడ్డి అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజశేఖరరెడ్డి 70వ జయంతి సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాజకీయాలను హుందాగా నడిపిన గొప్ప నేత రాజన్న అని, భ్రష్టుపట్టిన నేటి రాజకీయాలను సమూలంగా మార్చేందుకు జగన్మోహన్రెడ్డిని మనకు అప్పగించి వెళ్లిపోయారన్నారు. తెలంగాణ నేతల నివాళి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్సార్సీపీ తెలంగాణ నేతలు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. అంధులకు చెస్ కిట్లను పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ సీఎంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకూ, గుండెకూ చేరినందున వైఎస్సార్ పేరు చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, జె.మహేందర్రెడ్డి, నగర అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షులు కె.అమృతాసాగర్, సేవాదళ్ విభాగం నేత బండారు వెంకటరమణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎన్.రవికుమార్ పాల్గొన్నారు. -
మాజీ ప్రధాని పీవీకి మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులు అర్పించారు. పాలనా వ్యవహారాల్లో దిగ్గజ నేతగా పేరొందిన పీవీ దేశాన్ని సంక్లిష్ట పరిస్ధితుల్లో దీటుగా ముందుకు నడిపారని కొనియాడారు. ఆయన చేపట్టిన చర్యలు దేశ పురోగతికి బాటలువేశాయని మోదీ ట్వీట్ చేశారు. దేశ తొమ్మిదో ప్రధానిగా 1991 జూన్లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ 1996 మే వరకూ అధికారంలో కొనసాగారు. దేశ అభివృద్ధికి అవరోధంగా నిలిచిన లైసెన్స్ రాజ్ను తొలగించడంతో పాటు సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్ధను కొత్తపుంతలు తొక్కించిన ఘనత పీవీ నరసింహరావుకు దక్కింది. -
నిజాం క్లర్క్ నుంచి మేయర్ దాకా..
నాటి నిజాం నిరంకుశ పాలనలో తెలు గువారు అనుభవించే బాధలు చూడలేక తెలుగువారి ఉనికిని కాపాడటానికి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రోద్య మాన్ని వ్యాపింపజేసిన నాయకులలో మాడపాటి హనుమంతరావు ఒకరు. మాడపాటి కృష్ణా జిల్లా నందిగామ తాలుకాలోని పొక్కునూరు గ్రామంలో జనవరి 22, 1825లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి చిన్న తనంలోనే మరణించడంతో, తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మేనమామల ఇంటికి తల్లి తన పెద్ద న్నలతో స్వగ్రామం నుంచి తెలంగాణ ప్రాంతానికి మకాం మార్చారు. వరంగల్లులో 1903లో మెట్రిక్యులేషన్ ప్యాసయి, వరంగల్లు విద్యాశాఖలో ‘మీర్ మున్షి’ (క్లర్క్)గా 1904లో చేరి 8 ఏళ్లు కొనసాగారు. వరం గల్లులో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే పలు సాంఘిక, సాంస్కృతిక విద్యా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనేవారు. హైదరాబాద్కు మకాం మార్చి, నిజాం ప్రభుత్వ శాసనసభలో అనువాదకుడిగా పనిచేస్తూనే ప్రైవేటుగా లా పూర్తి చేశారు. ప్రముఖ న్యాయవాది రాయి విశ్వేశ్వరనాథ్ దగ్గర జూనియర్గా చేరారు. 1917లో హైదరాబాద్లోని హైకోర్టులో వకీలుగా స్వతంత్రంగా న్యాయవాద వృత్తి చేపట్టి పేరొందారు.. 1952–53, 1953–54లలో మూడుసార్లు వరుసగా హైదరాబాద్ మేయర్గా ఎన్నికయ్యారు. హైదరా బాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వ హించడం మొదలుపెట్టాక ఎన్నికైన తొలి నగర మేయర్ మాడపాటివారే. ఆయన పలు వినూత్న పథకాలు ప్రవే శపెట్టారు. ఆ తర్వాత 1958లో రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్గా ఆయన ఆరు సంవత్సరాలు నిష్పక్షపాతంగా సమర్థవం తంగా నిర్వహించారు. జన వరి 26, 1955లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్న తొలి తెలుగు పెద్దగా నిలిచిన ఆయనను, 1956లో ఉస్మానియా వర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరిం చింది. మాడపాటి 85 ఏళ్ల వయస్సులో నవంబర్ 11, 1970లో కన్నుమూశారు. నాటి ప్రముఖ హిందీ నవలా రచయిత ప్రేమ్చంద్ రాసిన హిందీ రచనలను తెలుగులోకి అనువదించినవారిలో ప్రథ ములు. తెలంగాణ–ఆంధ్ర ఉద్యమాల గురించి రెండు సంపుటాలను ఆయన రచించారు. (నేడు మాడపాటి జయంతి) కొలనుపాక కుమారస్వామి మొబైల్ : 99637 20669 -
హలో చెన్నై.. హ్యాపీ బర్త్ డే
సాక్షి, చెన్నై : 379 ఏళ్ల క్రితం ఓ చిన్న కుగ్రామంలా ఏర్పడిన మద్రాస్ నేడు దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచింది. నాడు బ్రిటిష్ పాలకులు నాటిన మద్రాస్ మొక్క నేడు మహావృక్షమై విలసిల్లుతోంది. మద్రాస్ నగరం ఏర్పడి నేటికి 379 ఏళ్లు పూర్తయ్యాయి.. 1639 ఆగస్ట్ 22న నాటి బ్రిటిష్ అధికారి ప్రాన్సిస్ డే మద్రాస్ నగరాన్ని నిర్మించారు. ఆ తరువాత అదే నగరం బ్రిటిష్ వారికి దక్షిణ భారతంలో అతిపెద్ద వర్తక స్థావరంగా మారింది. దేశంలో 1608లో వర్తకం ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్లో సెయింట్ జార్జ్కోట ద్వారా అధికారికంగా పరిపాలన కొనసాగించింది. భారత దేశంలో బ్రిటిష్ వాళ్లు నిర్మించిన మొట్టమెదటి కట్టడం సెయింట్ జార్జ్కోటనే కావడం విశేషం. 1689లో దేశంలో తొలి మున్సిపాలిటీగా గుర్తింపుపొంది.. బ్రిటిష్ వర్తకానికి కీలక స్థావరంగా మారింది. చెన్నపట్నంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, మద్రాస్పట్నం, మద్రాస్గా మారి చివరికి చెన్నైగా పేరొందింది. బ్రిటిష్ పాలనలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర రాష్ట్రాలతో కలుపుకుని మద్రాస్ ప్రెసిడెన్సీగా గుర్తింపు పొందింది. దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తరువాత నాలుగు రాష్ట్రాలుగా విడిపోయి.. మద్రాస్ రాష్ట్రానికి రాజధానిగా మారింది. ఆ తరువాత మద్రాస్ పేరును 1969లో తమిళనాడుగా మార్చగా.. 1996లో రాజధాని పేరును చెన్నైగా మార్చారు. దేశంలో ద్రవిడ ఉద్యమానికి బీజాలు పడింది ఈ గడ్డపైనే. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకతలు మద్రాస్ సొంతం. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో ఎప్పుడూ వైవిద్యాన్ని చూపుతోంది మద్రాస్. దేశంలో ఆగ్రనాయకులుగా పేరొందిన పెరియార్ రామస్వామి నాయర్, సీ రాజగోపాల చారి, అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి ఈ గడ్డపైనే ఉద్యమ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఆగస్ట్ 22న చెన్నై వాసులు మద్రాస్ డేను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దేశ వ్యాప్తంగా మద్రాస్తో అనుబంధం ఉన్నవారు సోషల్ మీడియాలో ‘హ్యాపీ మద్రాస్ డే’ అంటూ శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. Happy #MadrasDay! It’s a city full of love, talent and vibrance! Glad to have spent many good memories and share a special bond with the people of #Madras! — Suresh Raina (@ImRaina) August 22, 2018 -
‘కులమతాలకు అతీతంగా రంగా పనిచేశారు’
సాక్షి, విజయవాడ : కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన రంగా కృషి చేశారని రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా నగరంలోని రాఘవయ్య పార్క్ వద్ద రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తన తండ్రిని ఆరాధించడం సంతోషంగా ఉందన్నారు. పేదల కోసమే రంగా పనిచేశారని.. అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. రంగా కుమారుడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. రాధా రంగా మిత్ర మండలి సభ్యులను కలుపుకొని పని చేస్తానని రాధాకృష్ణ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో.. వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా పేద ప్రజల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మళ్లీ తప్పులో కాలేసిన గూగుల్
సాక్షి, న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ వరుస తప్పులతో అభాసుపాలు అవుతోంది. ఆ మధ్య నెహ్రూ సంబంధిత సమాచారానికి మోదీ ఫొటోను ఉంచి ట్రోలింగ్ను ఎదుర్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పొరపాటే చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 157వ జయంతి సందర్భంగా గూగుల్లో ‘భారత జాతీయ కవి’ పేరిట టాప్ ట్రెండింగ్ను సృష్టించింది. అయితే గూగుల్లో ఆ పేరుతో పరిశోధించిన వారు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. నోబెల్ గ్రహీత ఠాగూర్ ప్లేస్లో.. ఆధ్యాత్మిక వేత్త శ్రీ అరబిందో ఫోటో ప్రదర్శితమైంది. దీనికితోడు మే 9న ఠాగూర్ పుట్టిన రోజు అయితే... తేదీని మే 7 అని తప్పుగా చూపిస్తోంది. ఈ వ్యవహారంపై బెంగాలీలు మండిపడుతున్నారు. తప్పులు లేకుండా ప్రచురించటం గూగుల్కి సాధ్యం కాదా? అంటూ కొందరు నిలదీస్తున్నారు. మరికొందరు తమదైన శైలిలో సోషల్ మీడియాలో గూగుల్పై సెటైర్లు పేలుస్తున్నారు. -
రామదాసు కీర్తనలతో ఓలలాడిన భద్రాద్రి
సాక్షి, భద్రాచలం: భక్త రామదాసు 385వ జయంత్యుత్సవాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత భక్త రామదాసు చిత్రపటంతో భక్తుల కోలాటాల నడుమ నగర సంకీర్తనతో ఆలయం నుంచి గోదావరి నది వరకూ వెళ్లారు. అక్కడ గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. ఆలయం తరపున గోదారమ్మకు పసుపు, కుంకుమ, వస్త్రాలను అందజేసి హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని భక్త రామదాసు విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం చేసి గర్భగుడిలోని స్వామి వారి మూలమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకున్నారు. చిత్రకూట మండపంలో సంగీత విద్వాంసులంతా ఒకేసారి రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి గానం చేశారు. ఒక్కో కీర్తన మధ్యలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి వివిధ ఫలాలు, పుష్పాలతో అర్చకులు పూజలు నిర్వహిస్తూ మంగళ హారుతులు ఇచ్చారు. కళాకారులను కృష్ణ మోహన్ ఘనంగా సత్కరించారు. కచేరీలు ఈ నెల 25 వరకూ కొనసాగుతాయి. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
'ఎప్పటికీ ప్రజల హృదయాల్లో ఉంటారు'
ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబీకులు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘‘కొందరు వ్యక్తులు మనల్ని వదిలి వెళ్లిపోయినా.. ఎప్పటికీ మన హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతారు. మా నాన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనను మనసారా తలచుకుంటున్నాం. ఆయన లేని లోటు తీర్చలేనిది’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తన తండ్రితో గల అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మహానేత జయంతి సందర్భంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. Some people live forever in the hearts of all those they leave behind. Fondly remembering and missing my father, on his birthday. — YS Jagan Mohan Reddy (@ysjagan) 8 July 2016