brisbane test
-
‘అప్పుడే డిసైడ్ అయ్యాను’.. రోహిత్ అలా.. అశ్విన్ ఇలా!
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. అశూ అన్న చెన్నైలోని తన ఇంటికి చేరుకున్న సమయంలో సమయంలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు మేళతాళాలతో ఆహ్వానం పలికారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.టీమిండియా క్రికెటర్గా మాత్రమేబ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగానే తాను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు అశ్విన్ తెలిపాడు. ఏదేమైనా క్రికెటర్ అశ్విన్గా తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని.. టీమిండియా క్రికెటర్గా మాత్రమే తన ప్రస్థానం ముగిసిందని పేర్కొన్నాడు. వీలైనంత కాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తానని అశూ తెలిపాడు.‘‘చాలా మందికి ఇదొక భావోద్వేగ సమయం. బహుశా నా మనఃస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. అయితే, నేను ఇప్పుడు పూర్తి సంతృప్తితో ఉన్నాను. రిటైర్మెంట్ విషయం చాలా రోజులుగా నా మదిలో తిరుగుతూనే ఉంది. అయితే, బ్రిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట జరుగుతున్నపుడు నేను నిర్ణయం తీసుకున్నా.జీరో రిగ్రెట్స్ఇదేమీ నా జీవితంలో అతిపెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను ఇకపై కొత్త దారిలో ప్రయాణిస్తాను’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా కెప్టెన్గా ఒక్కసారి కూడా అవకాశం రానందుకు బాధపడుతున్నారా అని విలేకరులుగా అడగా.. ‘‘నాకు ఎలాంటి విచారం లేదు. జీరో రిగ్రెట్స్.జీవితం, కెరీర్ పట్ల విచారంతో ఉండే వ్యక్తులను నేను దూరంగా ఉండి చూశాను. కానీ నా లైఫ్లో అలాంటివేమీ లేవు’’ అని అశ్విని తమ మనసులోని భావాలను వెల్లడించాడు. ఇక 2011లో వన్డే వరల్డ్కప్ గెలిచినపుడు తనకు ఘన స్వాగతం లభించిందని.. ఇప్పుడు మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారంటూ అశూ భావోద్వేగానికి లోనయ్యాడు.రోహిత్ అలా.. అశూ ఇలాకాగా తాను పెర్త్కు చేరుకున్నపుడే అశూ రిటైర్మెంట్ విషయం తెలిసిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పగా.. అశూ మాత్రం బ్రిస్బేన్లోనే తాను డిసైడ్ అయ్యానని చెప్పడం గమనార్హం.కాగా 2010లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు అశ్విన్. తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం.సీఎస్కే తరఫునఇదిలా ఉంటే.. వన్డేల్లో 707 పరుగులు సాధించిన అశ్విన్.. టీ20లలో 184 రన్స్ రాబట్టాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు(బ్రిస్బేన్) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇకపై అశూ క్లబ్ క్రికెట్కే పరిమితం కానున్నాడు. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తరఫున అతడు ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలం-2025లో చెన్నై ఫ్రాంఛైజీ.. అశూను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్ శర్మతో అశ్విన్The countless battles on the field are memorable ❤️But it's also moments like these that Ashwin will reminisce from his international career 😃👌 Check out @ashwinravi99 supporting his beloved support staff 🫶#TeamIndia | #ThankYouAshwin pic.twitter.com/OepvPpbMSc— BCCI (@BCCI) December 19, 2024 -
నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?: రోహిత్తో అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పెర్త్ టెస్టు సమయంలోనే అశూ ఈ నిర్ణయం తీసుకున్నాడని.. అయితే, తాను నచ్చచెప్పడం వల్ల ఇప్పటిదాకా ఆగాడని తెలిపాడు. అశ్విన్ను మ్యాచ్ విన్నర్గా అభివర్ణించిన రోహిత్.. ఇకపై అతడు జట్టులో లేని స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నాడు.తొలి టెస్టులో దక్కని చోటుటీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. తొలి టెస్టు పెర్త్లో జరుగగా.. రెండో టెస్టుకు అడిలైడ్ వేదికైంది. ఇక తొలి టెస్టులో అశూను పక్కనపెట్టిన టీమిండియా మేనేజ్మెంట్.. స్పిన్నర్ కోటాలో వాషింగ్టన్ సుందర్ను ఆడించింది.మూడో టెస్టులోనూ మొండిచేయిఇక రెండో టెస్టు తుదిజట్టులో ఈ చెన్నై ప్లేయర్కు చోటు దక్కినా.. పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అడిలైడ్లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్లో అశ్విన్ 18 ఓవర్లు బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టులో అశూ స్థానాన్ని రవీంద్ర జడేజాతో భర్తీ చేశారు.అశ్విన్ స్పష్టతతో ఉన్నాడుగబ్బా ఆతిథ్యమిచ్చిన ఈ టెస్టు డ్రాగా ముగియగా.. మ్యాచ్ అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రెస్మీట్లో కూర్చున్న అశూ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ విషయం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘అశ్విన్ తన నిర్ణయం పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నాడు.పెర్త్ టెస్టు తర్వాతే రిటైర్ అవ్వాలని భావించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుందో అతడికి తెలుసు. కాంబినేషన్లపై కూడా అతడికి అవగాహన ఉంది. నిజానికి మేము ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే సమయానికి అసలు స్పిన్నర్ను ఆడిస్తామో లేదో తెలియని పరిస్థితి.పరిస్థితులకు తగ్గట్లుగా ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేసుకోవాలని భావించాం. అయితే, నేను పెర్త్కు చేరుకున్నపుడే అశూ నాతో రిటైర్మెంట్ గురించి చర్చించాడు. అయితే, కనీసం పింక్ బాల్ టెస్టు వరకైనా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరాను.నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?‘ఒకవేళ ఈ సిరీస్లో నా అవసరం లేకపోతే.. నేను జట్టుతో కొనసాగడం కూడా దండగ. గుడ్ బై చెప్పడమే సరైంది’ అని అశూ అన్నాడు. ఇక మెల్బోర్న్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.స్పిన్నర్ను ఆడించే విషయంపై స్పష్టత లేదు. అందుకే తన నిర్ణయాన్ని గౌరవించాలని భావించాం’’ అని పేర్కొన్నాడు. అశ్విన్ బిగ్ మ్యాచ్ విన్నర్ అన్న రోహిత్ శర్మ.. అతడితో కలిసి ఆడిన క్షణాలు తనకు గుర్తుండిపోతాయని తెలిపాడు.చెరో విజయంతోకాగా ఆసీస్తో తొలి టెస్టుకు రోహిత్ స్థానంలో బుమ్రా సారథ్యం వహించగా.. రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. ఇక బుమ్రా కెప్టెన్సీలో పెర్త్లో గెలిచిన భారత జట్టు.. రోహిత్ నాయకత్వంలో పింక్ బాల్ టెస్టు ఓడిపోయింది. మూడో టెస్టు డ్రా కావడంతో ఇరుజట్లు ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టులు మెల్బోర్న్, సిడ్నీలలో జరుగుతాయి.చదవండి: వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం: కమిన్స్#Ashwin has announced his retirement from all forms of international cricket! With 765 wickets across formats, he bows out as one of the greatest spinners of all time. Go well, @ashwinravi99 ! 🙌 pic.twitter.com/alfjOj4IDm— Star Sports (@StarSportsIndia) December 18, 2024 -
‘కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై చెబుతాడు’
గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కెప్టెన్గానూ, బ్యాటర్గానూ ఈ ముంబైకర్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో రోహిత్ సేన వైట్వాష్కు గురైన విషయం తెలిసిందే.వరుస వైఫల్యాలుకివీస్తో సిరీస్లో బ్యాటర్గానూ రోహిత్ విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో అతడు చేసిన స్కోర్లు 2, 52, 0, 8, 18, 11. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ హిట్మ్యాన్ బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్.. అడిలైడ్లో తేలిపోయాడు. ఈ పింక్ బాల్ మ్యాచ్లో అతడు మొత్తంగా కేవలం తొమ్మిది (3, 6) పరుగులే చేశాడు.ఇక కీలకమైన మూడో టెస్టులోనూ రోహిత్ శర్మ విఫలయ్యాడు. బ్రిస్బేన్లో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ కేవలం పది పరుగులే చేశాడు. కాగా ఆసీస్తో ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓపెనర్గా కాకుండా ఆరోస్థానంలో రోహిత్ బ్యాటింగ్కు దిగడం గమనార్హం. దీంతో మిడిలార్డర్లో ఆడటం కూడా రోహిత్ ప్రదర్శనపై ప్రభావం పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. సారథిగా, బ్యాటర్గా వైఫల్యం చెందుతున్న రోహిత్ శర్మపై వేటు వేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆసీస్తో మిగిలిన రెండు టెస్టుల్లో రోహిత్ పరుగులు రాబట్టేందుకు కచ్చితంగా ప్రయత్నం చేస్తాడు.అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్బై!ఒకవేళ అలా జరగనట్లయితే.. తనను తానుగా తప్పుకొంటాడు. అతడు నిస్వార్థ గుణం ఉన్న కెప్టెన్. జట్టుకు భారంగా ఉండాలని కోరుకోడు. భారత క్రికెట్ ప్రయోజనాల పట్ల అతడి అంకితభావం అమోఘం. కాబట్టి వచ్చే రెండు మ్యాచ్లలోనూ ఇదే పునరావృతం అయితే, కచ్చితంగా కెప్టెన్గా తప్పుకొంటాడు’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. తొలి టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించగా భారత్ 295 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో టెస్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా తిరిగి రాగా.. ఆసీస్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. తదుపరి ఇరుజట్ల మధ్య మెల్బోర్న్, సిడ్నీ వేదికగా నాలుగు, ఐదు టెస్టులు జరుగుతాయి.చదవండి: వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం: కమిన్స్ -
‘వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం’
టీమిండియాతో మూడో టెస్టు డ్రాగా ముగియడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. వర్షం అడ్డుపడకపోయి ఉంటే తాము తప్పక గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో ఫలితం తేలకపోయినా.. తమ జట్టు సమిష్టిగా రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు కృషి చేయడం ఎంతో బాగుందని సహచర ఆటగాళ్లను కొనియాడాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆసీస్.. భారత్తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ మ్యాచ్లో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.పదే పదే అడ్డుపడ్డ వరుణుడుఅయితే, సిరీస్లో ఎంతో కీలకమైన మూడో టెస్టు మాత్రం డ్రాగా ముగిసిపోయింది. బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ టెస్టుకు తొలి రోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. మరోవైపు.. వెలుతురులేమి వల్ల కూడా మ్యాచ్కు అంతరాయం కలిగింది.ఆది నుంచి పటిష్ట స్థితిలోనే ఆసీస్ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటలో కూడా ఇలాంటి అవాంతరాలు ఎదురుకావడంతో.. అంపైర్ల సూచన మేరకు ఆసీస్- భారత కెప్టెన్లు కమిన్స్, రోహిత్ శర్మ డ్రాకు అంగీకరించారు. నిజానికి గబ్బా టెస్టులో ఆది నుంచి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాల కారణంగా పైచేయి సాధించింది.భారత్కు ఫాలో ఆన్ గండం తప్పిందిభారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగి 445 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలరేగిన చోట.. టీమిండియా మాత్రం తడబడింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77)తో పాటు ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా(10*), ఆకాశ్ దీప్(31) విలువైన ఇన్నింగ్స్ కారణంగా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. మొదటి ఇన్నింగ్స్లో 260 పరుగులతో మెరుగైన స్కోరు సాధించింది.ఐదోరోజూ ఆటంకాలుఈ క్రమంలో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఆసీస్.. 89/7 వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. తద్వారా భారత్ ముందు 275 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, పదే పదే వర్షం రావడంతో పాటు.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేసి.. ఇరుజట్ల కెప్టెన్లను సంప్రదించారు. భారత్ స్కోరు 8/0 వద్ద ఉండగా.. ఇరువురూ డ్రాకు అంగీకరించారు. నిజానికి ఈ మ్యాచ్కు వర్షం అడ్డుపడపకపోయి ఉంటే ఫలితం వచ్చేదే.2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వర్షం పదే పదే అడుడ్డుపడింది. లేదంటే 2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లం. అయినా, మన చేతుల్లో లేని విషయం గురించి ఆలోచించడం అనవసరం. ఏదేమైనా ఈ టెస్టులో మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది.మేము భారీ స్కోరు సాధించడంతో పాటు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. స్టార్క్, నేను బాగానే రాణించాం. కానీ దురదృష్టవశాత్తూ మేము జోష్ హాజిల్వుడ్ సేవలు కోల్పోయాం. ఇక ఐదో రోజు ఆటలో కూడా వర్షం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ ఇద్దరు అద్భుతంకొత్త బంతిని ఎదుర్కోవడం సవాలుగా మారింది. తొలి ఇన్నింగ్స్లో హెడ్, స్మిత్ అద్భుతంగా ఆడారు. అలెక్స్ క్యారీ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. నాథన్ లియోన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. స్టార్క్ వికెట్లు తీశాడు. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు.బాక్సింగ్ డే టెస్టుకు ముందు మాకు ఇలా ఎన్నో సానుకూలాంశాలు ఉండటం సంతోషం’’ అని పేర్కొన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తదుపరి టెస్టు బరిలో దిగుతామని కమిన్స్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్బోర్న్లో నాలుగో టెస్టు మొదలుకానుంది.చదవండి: Kohli- Gambhir: వారికి మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ మాత్రం అలా.. వీడియో -
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు డ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 275 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగగా.. 8/0 స్కోరు వద్ద వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశారు.ముందుగానే టీ బ్రేక్ను అంపైర్లు ప్రకటించారు. అంతలోనే వర్షం మళ్లీ తిరిగి రావడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో 1-1తో ఆస్ట్రేలియా, భారత్ సమంగా నిలిచాయి.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు(డిసెంబరు 14- 18)👉వేదిక: ది గబ్బా, బ్రిస్బేన్👉టాస్: భారత్.. బౌలింగ్👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 445 ఆలౌట్👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 260 ఆలౌట్👉ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 89/7 డిక్లేర్డ్👉భారత్ లక్ష్యం: 275 పరుగులు👉వర్షం కారణంగా భారత్ స్కోరు 8/0 వద్ద ఉండగా నిలిచిపోయిన ఆట👉ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించడంతో మ్యాచ్ డ్రా👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రవిస్ హెడ్(తొలి ఇన్నింగ్స్లో 152 రన్స్).చదవండి: #Ravichandran Ashwin: రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్శెభాష్.. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించారుPat Cummins definitely didn't forget about Akash Deep hitting him for six 😅#AUSvIND pic.twitter.com/UW7ZOLUuMe— cricket.com.au (@cricketcomau) December 18, 2024 -
శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం
టీమిండియా టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్లపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్లో ‘స్టార్’ బ్యాటర్ల కంటే.. ‘‘మీరే నయం’’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే.శతకాలతో చెలరేగిన ఆసీస్ బ్యాటర్లుబ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. దీంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినా అనూహ్య రీతిలో పుంజుకుంది. టీమిండియా పేసర్ల ధాటికి 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డవేళ.. ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆసీస్ను ఆదుకున్నారు. హెడ్(152) భారీ శతకం బాదగా.. స్టీవ్ స్మిత్(101) కూడా సెంచరీతో చెలరేగాడు.ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా ఆరు, మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్కు మొదలుపెట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి.ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడ్డ టీమిండియాటాపార్డర్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(4), వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(1) ఘోరంగా విఫలమయ్యారు. మిడిలార్డర్లో వచ్చిన విరాట్ కోహ్లి(3), రిషభ్ పంత్(9), కెప్టెన్ రోహిత్ శర్మ(10) సైతం పూర్తిగా నిరాశపరిచారు. ఆదుకున్న రాహుల్, జడేజాఈ క్రమంలో ఓపెనర్ కేఎల్ రాహుల్(84) అద్భుత అర్థ శతకంతో రాణించి భారత ఇన్నింగ్స్ను గాడిన పెట్టగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్తో అలరించాడు. అతడికి తోడుగా నితీశ్ రెడ్డి(61 బంతుల్లో 16) పట్టుదలగా నిలబడ్డాడు.ఇక సిరాజ్(11 బంతుల్లో 1) కూడా కాసేపు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించాడు. కాగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన జడ్డూ మొత్తంగా 123 బంతులు ఎదుర్కొని 77 పరుగులు సాధించాడు. అయితే జడేజా అవుటయ్యే సమయానికి టీమిండియా ఇంకా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కలేదు. అలాంటి సమయంలో జడ్డూ తొమ్మిదో వికెట్గా వెనుదిరగడంతో టీమిండియా పని అయిపోయిందని కంగారూలు సంబరాలు చేసుకున్నారు. ఇక ఫాలో ఆన్ ఆడించడమే తరువాయి అని భావించారు.బ్యాట్ ఝులిపించిన బుమ్రా, ఆకాశ్అయితే, పది, పదకొండో స్థానాల్లో బ్యాటింగ్ చేసిన బుమ్రా, ఆకాశ్ దీప్.. ఊహించని రీతిలో బ్యాట్ ఝులిపించారు. ఆచితూచి ఆడుతూనే వికెట్ పడకుండా బుమ్రా జాగ్రత్త పడగా.. మరో ఎండ్ నుంచి సహకారం అందించిన ఆకాశ్ ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు.Jasprit Bumrah just smashes Pat Cummins for six! #AUSvIND pic.twitter.com/vOwqRwBaZD— cricket.com.au (@cricketcomau) December 17, 2024 ఫాలో ఆన్ గండం తప్పిందివీరిద్దరి చక్కటి సమన్వయం, బ్యాటింగ్ కారణంగా 246 పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా.. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. ఇక వెలుతురులేమి కారణంగా మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి బుమ్రా, ఆకాశ్ క్రీజులోనే ఉన్నారు. బుమ్రా 27 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 10, ఆకాశ్ దీప్ 27 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు చేశాడు. అయితే, ఫాలో ఆన్ గండం నుంచి జట్టును గట్టెక్కించిన తర్వాత ఆకాశ్ కొట్టిన సిక్సర్తో భారత శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది. Akash Deep makes sure India avoid the follow-on and then smashes Pat Cummins into the second level!#AUSvIND pic.twitter.com/HIu86M7BNW— cricket.com.au (@cricketcomau) December 17, 2024 హెడ్కోచ్ గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నవ్వులు చిందిస్తూ తమ టెయిలెండర్లను ప్రశంసించారు. ఇక మంగళవారం ఆట పూర్తయ్యేసరికి టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. కాగా తొలి రోజు నుంచే ఈ మ్యాచ్కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది.ఫాలో ఆన్ అంటే ఏమిటి?టెస్టు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు.. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న జట్టు కంటే తొలి ఇన్నింగ్స్లో 200 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే.. ఫాలో ఆన్ ఆడిస్తుంది. అంటే.. సెకండ్ బ్యాటింగ్ టీమ్ ఆలౌట్ అయిన వెంటనే మళ్లీ బ్యాటింగ్ చేయమని అడుగుతుంది. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ)లోని 14.1.1 నిబంధన ప్రకారం ఆధిక్యంలో ఉన్న జట్టుకు ఈ హక్కు లభిస్తుంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు(డిసెంబరు 14- 18)వేదిక: ది గబ్బా, బ్రిస్బేన్టాస్: భారత్.. తొలుత బౌలింగ్ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్నాలుగోరోజు(డిసెంబరు 17) ఆట పూర్తయ్యేసరికి భారత్ స్కోరు: 252/9చదవండి: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ -
ఆదుకునేందుకు వాన వచ్చింది!
కంగారూ గడ్డపై భారత పేలవ బ్యాటింగ్ ప్రదర్శన మూడో టెస్టులోనూ కొనసాగింది. బౌలింగ్ వైఫల్యంతో ఆతిథ్య జట్టుకు భారీ స్కోరు చేసే అవకాశం కలి్పంచిన టీమిండియా తమ బ్యాటింగ్ వంతు వచ్చేసరికి చేతులెత్తేసింది. పది ఓవర్లలోపే పేలవ షాట్లతో యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి వెనుదిరగ్గా... కొద్ది సేపటికి రిషభ్ పంత్ వీరిని అనుసరించాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న తీరు చూస్తే మూడో రోజే మన ఆట ముగిసిపోతుందేమో అనిపించింది. అయితే ఉదయం నుంచి పదే పదే అంతరాయం కలిగించిన వర్షం చివర్లో మళ్లీ వచ్చి ఊరట అందించింది. నాలుగో రోజు మన బ్యాటర్లు ఆదుకొని జట్టును కాస్త మెరుగైన స్థితికి చేరుస్తారా... లేక ఆసీస్కు విజయావకాశం సృష్టిస్తారా చూడాలి. బ్రిస్బేన్: భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడో టెస్టుకు మరోసారి వర్షం అడ్డుగా నిలిచింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం కేవలం 33.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 394 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలోఆన్ నుంచి తప్పించుకోవాలంటే టీమిండియా మరో 195 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 405/7తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (88 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడగా, జస్ప్రీత్ బుమ్రా (6/76) ఆరు వికెట్లతో ముగించాడు. మరో 40 పరుగులు... మూడో రోజు ఆసీస్ ఆటను కేరీ నడిపించాడు. జడేజా బౌలింగ్లో ఫోర్తో 53 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... మిచెల్ స్టార్క్ (30 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిసేపు అండగా నిలిచాడు. స్టార్క్ను వెనక్కి పంపించి బుమ్రా తన ఆరో వికెట్ను సొంతం చేసుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత వాన రావడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. మళ్లీ మొదలయ్యాక మరో 5.1 ఓవర్లలో ఆసీస్ చివరి 2 వికెట్లు కోల్పోయింది. లయన్ (2)ను సిరాజ్ బౌల్డ్ చేసిన మరో 4 బంతులకు కేరీ వికెట్ ఆకాశ్దీప్ ఖాతాలో చేరింది. సోమవారం మొత్తం 16.1 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 40 పరుగులు జత చేసింది. టపటపా... ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్తో మొదలు పెట్టిన యశస్వి జైస్వాల్ (4)ను స్టార్క్ రెండో బంతికే పెవిలియన్ చేర్చగా, అతని తర్వాతి ఓవర్ తొలి బంతికే గిల్ (3 బంతుల్లో 1) కూడా అవుటయ్యాడు. గల్లీలో మిచెల్ మార్‡్ష అద్భుత రీతిలో గాల్లోకి ఎగిరి క్యాచ్ను అందుకోవడం విశేషం. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 3) ఆఫ్స్టంప్ బలహీనతను మరోసారి సొమ్ము చేసుకుంటూ హాజల్వుడ్ చక్కటి బంతితో వెనక్కి పంపించాడు. కోహ్లి వికెట్ పడగానే వర్షం రావడంతో ఆట కాస్త ఆగింది. ఆట మళ్లీ మొదలయ్యాక రిషభ్ పంత్ (12 బంతుల్లో 9)ను అవుట్ చేసి కమిన్స్ మరో దెబ్బ కొట్టాడు. అనంతరం మరో 19 బంతులకే వాన రాకతో ఆట పూర్తిగా రద్దయింది. ఒకవైపు నాలుగు వికెట్లు పడినా... మరో ఎండ్లో రాహుల్ కొన్ని చక్కటి షాట్లతో పట్టుదలగా నిలబడ్డాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) పంత్ (బి) బుమ్రా 21; మెక్స్వీనీ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; లబుషేన్ (సి) కోహ్లి (బి) నితీశ్ రెడ్డి 12; స్మిత్ (సి) రోహిత్ (బి) బుమ్రా 101; హెడ్ (సి) పంత్ (బి) బుమ్రా 152; మార్‡్ష (సి) కోహ్లి (బి) బుమ్రా 5; కేరీ (సి) గిల్ (బి) ఆకాశ్దీప్ 70; కమిన్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; స్టార్క్ (సి) పంత్ (బి) బుమ్రా 18; లయన్ (బి) సిరాజ్ 2; హాజల్వుడ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 35; మొత్తం (117.1 ఓవర్లలో ఆలౌట్) 445. వికెట్ల పతనం: 1–31, 2–38, 3–75, 4–316, 5–326, 6–327, 7–385, 8–423, 9–445, 10–445. బౌలింగ్: బుమ్రా 28–9–76–6, సిరాజ్ 23.2–5–97–2, ఆకాశ్దీప్ 29.5–5–95–1, నితీశ్ రెడ్డి 13–1–65–1, జడేజా 23–2–95–0. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) మార్‡్ష (బి) స్టార్క్ 4; కేఎల్ రాహుల్ (బ్యాటింగ్) 33; గిల్ (సి) మార్‡్ష (బి) స్టార్క్ 1; కోహ్లి (సి) కేరీ (బి) హాజల్వుడ్ 3; పంత్ (సి) కేరీ (బి) కమిన్స్ 9; రోహిత్ (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (17 ఓవర్లలో 4 వికెట్లకు) 51. వికెట్ల పతనం: 1–4, 2–6, 3–22, 4–44. బౌలింగ్: స్టార్క్ 8–1–25–2, హాజల్వుడ్ 5–2–17–1, కమిన్స్ 2–0–7–1, లయన్ 1–0–1–0, హెడ్ 1–0–1–0. -
‘నీకసలు మెదడు ఉందా?’.. భారత పేసర్పై రోహిత్ ఫైర్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. యువ పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నీకసలు బుర్ర(మెదడు) ఉందా?’’ అంటూ ఆకాశ్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూడో టెస్టులో పటిష్ట స్థితిలో ఆసీస్బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య శనివారం మొదలైన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేనకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రోజు నుంచే మెరుగైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా... రెండోరోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.మొదటి ఇన్నింగ్స్లో 445ఈ క్రమంలో 405/7(101 ఓవర్లు) ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టి.. మరో 40 పరుగులు జతచేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా మొత్తంగా 445 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఇక ఆసీస్ ఇన్నింగ్స్లో సోమవారం 114వ ఓవర్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆకాశ్ దీప్ చేతికి బంతినిచ్చాడు. అయితే, 28 ఏళ్ల ఈ పేసర్.. ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ క్రీజులో ఉన్న సమయంలో వైడ్ బాల్ వేశాడు.సర్ మే కుచ్ హై?వేగంగా వచ్చిన ఈ బంతిని ఆపేందుకు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన ప్రయత్నం వృథాగా పోయింది ఫలితంగా ఆసీస్ ఖాతాలో అదనపు పరుగులు(2) చేరగా.. సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. ఆకాశ్ను ఉద్దేశించి..‘‘అబ్బే సర్ మే కుచ్ హై?(బుర్రలో ఏమైనా ఉందా?)’’ అంటూ కామెంట్స్ చేయగా.. స్టంప్ మైకులో రికార్డయ్యాయి.ఇక మూడో రోజు ఆటలో భాగంగా బుమ్రా మరో వికెట్ తీయగా.. ఆకాశ్ దీప్(క్యారీ వికెట్), మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో బుమ్రాకు ఆరు, సిరాజ్కు రెండు, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలకు ఒక్కో వికెట్ దక్కింది. వర్షం వల్ల మూడో రోజు ఆటకు అంతరాయంకాగా ఆకాశ్కు విదేశీ గడ్డపై ఇదే తొలి మ్యాచ్. అడిలైడ్లో ఆడిన హర్షిత్ రాణాపై వేటు పడగా.. అతడి స్థానాన్ని బ్రిస్బేన్లో ఆకాశ్ భర్తీ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం వల్ల మూడో రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. అప్పటికి భారత్ 17 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 394 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’Rohit Sharma & Stump-mic Gold - the story continues... 😅#AUSvINDOnStar 👉 3rd Test, Day 3 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/vCW0rURX5q— Star Sports (@StarSportsIndia) December 16, 2024 -
‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. బ్రిస్బేన్లో శనివారం మొదలైన ఈ టెస్టులో భారత జట్టు పేలవంగా ఆడుతోంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేన.. ఆసీస్ను కట్టడి చేయలేకపోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో కంగారూ జట్టు 445 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.పెవిలియన్కు క్యూఅయితే, ఆసీస్ స్టార్లు ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాలతో చెలరేగిన గబ్బా మైదానంలో.. టీమిండియా బ్యాటర్లు మాత్రం తేలిపోతున్నారు. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి తాళలేక పెవిలియన్కు క్యూ కడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) విఫలం కాగా.. శుబ్మన్ గిల్(1), విరాట్ కోహ్లి(3) పూర్తిగా నిరాశపరిచారు.48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిఇక వికెట్ కీపర్ రిషభ్ పంత్ సైతం తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. సోమవారం నాటి మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే సమయానికి కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 30 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ సున్నా పరుగులతో ఆడుతున్నాడు. కేవలం 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గబ్బాలో టాస్ గెలిచిన రోహిత్.. తొలుత బౌలింగ్ ఎంచుకోవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు తప్పుబట్టారు. చెత్త సెటప్ అంటూ విమర్శలుమరోవైపు.. ఆదివారం నాటి రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ సెట్ చేసిన తీరుపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి రోహిత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చెత్త సెటప్’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఇక ఆసీస్ మాజీ స్టార్ డేవిడ్ వార్నర్ సైతం రోహిత్ తీరును విమర్శించాడు. హెడ్, స్మిత్లను షార్ట్ బాల్స్తో అటాక్ చేయాల్సిందిపోయి.. వారికి బ్యాట్ ఝులిపించే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ, ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రోహిత్ తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి‘‘ఇప్పుడు కూడా రోహిత్ శర్మను సమర్థిస్తే అంతకంటే ఘోర తప్పిదం మరొకటి ఉండదు. ఇంత డిఫెన్సివ్గా కెప్టెన్సీ చేస్తారా? ఇప్పటికైనా అతడు వాస్తవాలు అంగీకరించాలి. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.ఈ మ్యాచ్లో టీమిండియా ఓడితే రోహిత్ తప్పుకోవాలి. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు కోసం మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలి. బుమ్రాను టెస్టు జట్టు కెప్టెన్గా నియమించాలి’’ అని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్.బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్ గడ్డపై భారత్కు భారీ విజయంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. అయితే, పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. పితృత్వ సెలవుల కారణంగా అతడు అందుబాటులో లేకపోవడంతో.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో కంగారూ జట్టును చిత్తు చేసింది. అయితే, అడిలైడ్లో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ తిరిగి రాగా.. ఆతిథ్య జట్టు చేతిలో భారత్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అడిలైడ్ టెస్టులో రోహిత్ బ్యాటింగ్ పరంగా(3, 6)నూ నిరాశపరిచాడు. రోహిత్ కెప్టెన్సీలో చెత్త రికార్డుఇక ఆసీస్ టూర్ కంటే ముందు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో 3-0తో టీమిండియా వైట్వాష్కు గురైంది. భారత క్రికెట్ చరిత్రలో పర్యాటక జట్టు చేతిలో టీమిండియా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ కావడం అదే తొలిసారి. చదవండి: ‘నా వేలు విరగ్గొట్టేశావు పో’.. సిరాజ్పై మండిపడ్డ జడేజా! -
IND vs AUS: 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
-
సిరాజ్పై మండిపడ్డ జడేజా!.. నీకు ఎందుకంత దూకుడు?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్కు బ్రిస్బేన్లో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మూడో టెస్టు సందర్భంగా ఈ హైదరాబాదీ బౌలర్ను ఆస్ట్రేలియా అభిమానులు పరుష పదజాలం వాడుతూ హేళన చేశారు. అడిలైడ్ పింక్బాల్ టెస్టులో ట్రవిస్ హెడ్కు సిరాజ్ సెండాఫ్ ఇచ్చిన తీరును విమర్శిస్తూ.. అవమానించేలా గట్టిగా అరిచారు.ఆస్ట్రేలియా- భారత్ మధ్య శనివారం గబ్బా మైదానంలో మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా సిరాజ్ను కించపరిచేలా ఆసీస్ ఫ్యాన్స్ ప్రవర్తించారు. తాజాగా ఆదివారం నాటి రెండో రోజు ఆటలోనూ సిరాజ్కు మరో చేదు అనుభవం ఎదురైంది. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా.. ఈ స్పీడ్స్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిరాజ్పై మండిపడ్డ జడేజా!కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో పెర్త్లో భారత్, అడిలైడ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి.ఇక ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో మూడో టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల శనివారం నాటి తొలిరోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఆసీస్.. 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.బుమ్రాకు ఐదుఈ క్రమంలో ఆదివారం రెండో రోజు ఆట మాత్రం సజావుగా సాగింది. ట్రవిస్ హెడ్ భారీ శతకం(152), స్టీవ్ స్మిత్(101) సెంచరీ కారణంగా ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లు నష్టపోయి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.జడ్డూ కోపానికి కారణం అదేఇక మూడో టెస్టుతో భారత తుదిజట్టులోకి వచ్చిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. ఆదివారం బంతితో బరిలో దిగాడు. పదహారు ఓవర్ల పాటు బౌల్ చేసి 76 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, లంచ్ తర్వాత తాను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డర్ సిరాజ్ వ్యవహరించిన తీరు జడ్డూ కోపం తెప్పించింది.జడేజా బౌలింగ్లో ట్రవిస్ హెడ్ ఆఫ్సైడ్ దిశగా బంతిని తరలించి.. సింగిల్కు వచ్చాడు. ఈ క్రమంలో బాల్ను అందుకున్న సిరాజ్ కాస్త నిర్లక్ష్య రీతిలో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు బంతిని విసిరినట్లు కనిపించింది. హెడ్ తలమీదుగా వచ్చిన ఆ బంతిని అందుకునే క్రమంలో జడ్డూ చేతి వేళ్లకు బలంగా తగిలింది.దీంతో జడేజా కోపంతో సిరాజ్ వైపు చూస్తూ ఏదో అన్నట్లుగా కనిపించింది. అంత దూకుడు అవసరమా అన్నట్లు అసహనం ప్రదర్శించాడు. ఇందుకు చిన్నబుచ్చుకున్న సిరాజ్.. సారీ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.నా వేలును విరగ్గొట్టేశావు పో..ఈ నేపథ్యంలో కామెంటేటర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ స్పందిస్తూ.. సిరాజ్ అత్యుత్సాహం జడేజాతో మాటల యుద్ధానికి దారి తీసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నిజానికి జడ్డూ చేసింది సరైందేనని.. ‘‘నా వేలును విరగ్గొట్టేశావు పో.. ఏంటిది ఫ్రెండ్.. కాస్త సంయమనం పాటించు’’ అన్నట్లుగా అతడు లుక్ ఇచ్చాడని నికోలస్ పేర్కొన్నాడు.చదవండి: భారత్తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రpic.twitter.com/iJC2zadOh7— Sunil Gavaskar (@gavaskar_theman) December 15, 2024pic.twitter.com/oCw1kXmsYl— The Game Changer (@TheGame_26) December 15, 2024 -
కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన సంగతి తెలిసిందే. అయితే రెండో ఆట ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్లను ఔట్ చేసి ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ భారత ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి అద్భుతమైన బంతితో లబుషేన్ బోల్తా కొట్టించాడు.విరాట్ సూపర్ క్యాచ్..ఆసీస్ ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నితీశ్ రెడ్డి రెండో బంతిని ఔట్సైడ్ స్టంప్ లైన్ వద్ద ఫుల్ డెలివరీగా సంధిచాడు. ఆ డెలివరీని లబుషేన్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ థిక్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్లో ఉన్న విరాట్ కోహ్లి ఎటువంటి తప్పిదం చేయకుండా అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. క్యాచ్ పట్టిన వెంటనే విరాట్ కోహ్లి తన దైన స్టైల్లో కాస్త వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. గబ్బా మైదానంలో స్టాండ్స్లో కూర్చున్న ఆసీస్ అభిమానుల వైపు చూస్తూ మౌనంగా ఉండమని కోహ్లి సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ను ఆసీస్ ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. అతడు మైదానంలోకి అడుగుపెట్టగానే బూయింగ్(బిగ్గరగా అరవడం) చేశారు. ఈ క్రమంలోనే ఆసీస్ ఫ్యాన్స్కు కోహ్లి తన సెలబ్రేషన్స్తో కౌంటరిచ్చాడు.చదవండి: తెలుగు టైటాన్స్ గెలుపు pic.twitter.com/9kOwCXHb1p— Sunil Gavaskar (@gavaskar_theman) December 15, 2024 -
IND vs AUS 3rd Test Day 2: హెడ్, స్మిత్ సెంచరీలు.. ఆసీస్ భారీ స్కోరు
Ind vs Aus 3rd Test Day 2 Summary: బ్రిస్బేన్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రెండో రోజు ముగిసింది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో 28/0 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాటి ఆట మొదలుపెట్టిన ఆసీస్ టీమిండియాపై పైచేయి సాధించింది. ఆరంభంలో ఆకట్టుకున్న భారత పేసర్లు ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.అంతా తలకిందులుట్రవిస్ రాకతో అంతా తలకిందులైంది. ఆసీస్ స్కోరు 75/3 వద్ద ఉన్న సమయంలో స్టీవ్ స్మిత్తో కలిసిన హెడ్ ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టాడు. 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు .. మొత్తంగా 152 పరుగులు సాధించాడు. మరోవైపు.. స్మిత్ సైతం శతకం(101)తో మెరిశాడు.ఈ జంటను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేయడంతో టీమిండియా కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే, అలెక్స్ క్యారీ(47 బంతుల్లో 45*) ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ నాలుగు వందల పరుగుల మార్కు దాటింది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 101 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలో నిలిచింది. భారత బౌలర్లలో పేసర్లు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.Updatesఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్భారత పేసర్ సిరాజ్కు ఎట్టకేలకు వికెట్ దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్లో 98వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో కమిన్స్ వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోగా.. సిరాజ్కు ఈ మ్యాచ్లో తొలి వికెట్ దక్కింది. మిచెల్ స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 387-7(98). 96 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 377/6.96 ఓవర్లకు ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ కమ్మిన్స్(17), అలెక్స్ క్యారీ(33) ఉన్నారు. 96 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 377/6.ఆసీస్ ఆరో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఎట్టకేలకు ఔటయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్ను బోల్తా కొట్టించాడు. హెడ్ 152 బంతుల్లో 18 ఫోర్లతో 152 పరుగులు చేసి ఔటయ్యాడు. 88 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 330/6ఆసీస్ ఐదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో మిచెల్ మార్ష్(5).. విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్బుమ్రా బౌలింగ్లో స్మిత్ అవుటయ్యాడు. శతకం పూర్తి చేసుకున్న ఈ వెటరన్ బ్యాటర్ 101 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ క్రీజులోకి వచ్చాడు. హెడ్ 149 పరుగులతో ఆడుతున్నాడు. ఆసీస్ స్కోరు: 318/4 (84)స్మిత్ సెంచరీ..ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్మిత్ ప్రస్తుతం 100 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. స్మిత్కు ఇది 33వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. భారత్పై ఇది స్మిత్కు 10వ టెస్టు సెంచరీ. 82 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 313/3టీ బ్రేక్ సమయానికి ఆసీస్ స్కోరు: 234/3 (70).హెడ్ 103, స్మిత్ 65 పరుగులతో ఆడుతున్నారుట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ..బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 115 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను హెడ్ అందుకున్నాడు. హెడ్కు ఇది తొమ్మిదవ టెస్టు సెంచరీ. భారత్పై మూడో టెస్టు సెంచరీ. ప్రస్తుతం 101 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 69 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 231/3.స్మిత్ హాఫ్ సెంచరీ..ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తిరిగి తన ఫామ్ను అందుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. స్మిత్ 50 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 64 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 196/3.హెడ్ హాఫ్ సెంచరీ.. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 52 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 56 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 158/3. క్రీజులో హెడ్తో పాటు స్మిత్(44) ఉన్నాడు.భారత్కు మరోసారి హెడ్ 'ఎక్'ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరోసారి భారత్కు తలనొప్పిగా మారాడు. లబుషేన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెడ్ తనదైన స్టైల్లో ఆడుతున్నాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్ క్రీజులో పాతుకుపోయారు. 50 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెడ్(36), స్మిత్(35) ఉన్నారు.లంచ్ బ్రేక్కు ఆసీస్ స్కోర్: 104/3రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(20), స్టీవ్ స్మిత్(25) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా..లబుషేన్ ఔటైన అనంతరం ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 42 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(24), ట్రావిస్ హెడ్(17) ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్..75 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్.. నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్లో ఔటయ్యాడు. స్లిప్లో విరాట్ కోహ్లి అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. క్రీజులోకి ట్రావిస్ హెడ్ వచ్చాడు. 34 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 75/3నిలకడగా ఆడుతున్న ఆసీస్..ఆస్ట్రేలియా బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్మిత్ నిలకడగా ఆడుతున్నారు. 27 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(10), లబుషేన్(8) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. మెక్స్వీనీ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయిది. 9 పరుగులు చేసిన మెక్స్వీనీ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. 19 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/2బుమ్ బుమ్ బుమ్రా..తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ తమ మొదటి వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(21) వికెట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు.రెండో రోజు ఆట ప్రారంభం..బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ అటాక్ను ఆకాష్ దీప్ ఆరంభించాడు. కాగా తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 13. 2 ఓవర్లలో ఆసీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్వుడ్. -
గిల్కు ఎంతో ప్రత్యేకం: బ్రిస్బేన్లో సారా టెండుల్కర్, ఇతర సెలబ్రిటీల సందడి
-
‘రోహిత్ శర్మ నిర్ణయం తప్పు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని ఇంగ్లండ్ మాజీ సారథి, కామెంటేటర్ మైకేల్ వాన్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని తప్పుబట్టాడు. రోహిత్ నిర్ణయం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు సంతోషాన్ని మిగిల్చి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.సిరీస్ 1-1తో సమంగాకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో.. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడుతోంది. ఈ క్రమంలో పెర్త్లో జరిగిన మొదటి మ్యాచ్లో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం మూడో టెస్టు మొదలైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేయడం సులువవుతుందనేఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. వికెట్పై కాస్త పచ్చిక ఉన్నట్లు కనిపిస్తోంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పిచ్ పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం సులువవుతుందనే ఉద్దేశంతోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. ఇక ఆసీస్ సారథి కమిన్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కమిన్స్దీ అదే మాటతాను కూడా టాస్ గెలిచి ఉంటే.. తొలుత బౌలింగ్ ఎంచుకునే వాడినన్నాడు. అయితే, ఈ ఇద్దరు కెప్టెన్ల వ్యాఖ్యలకు విరుద్ధంగా మైకేల్ వాన్ కామెంట్ చేయడం విశేషం.రోహిత్ శర్మ నిర్ణయం తప్పు‘‘రోహిత్ శర్మ నిర్ణయంతో ప్యాట్ కమిన్స్ మనసులో గంతులేస్తూ ఉంటాడు. తాను టాస్ ఓడిపోయినందుకు సంతోషపడి ఉంటాడు. గత చరిత్ర ఆధారంగా అతడు బ్యాటింగే ఎంచుకుని ఉండేవాడు. ఏదేమైనా రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని తప్పుచేశాడు’’ అని మైకేల్ వాన్ హిందుస్తాన్ టైమ్స్తో వ్యాఖ్యానించాడు.కొత్త బంతితో నో మ్యాజిక్!కాగా గబ్బా పిచ్పై కొత్త బంతితో భారత పేసర్లు పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్లు కూడా రంగంలోకి దిగారు. బుమ్రా ఆరు ఓవర్ల బౌలింగ్లో 8, సిరాజ్ నాలుగు ఓవర్లలో 13, ఆకాశ్ దీప్ 3.2 ఓవర్లలో 2 పరుగులు ఇచ్చారు. ఇక ఆసీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్ల వద్ద ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి కంగారూ జట్టు వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. అయితే, ఆ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో తొలిరోజు ఆటను అంతటితో ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. -
Ind vs Aus 3rd Test Day 1: అభిమానులకు బ్యాడ్న్యూస్
క్రికెట్ ప్రేమికులకు చేదు వార్త!.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. వరణుడి కారణంగా బ్రిస్బేన్లో తొలి రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రెండో రోజు ఆట మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.20 నిమిషాలకు మొదలై.. కనీసం 98 ఓవర్లపాటు మ్యాచ్ సాగనుంది. నాలుగు మ్యాచ్లు గెలిస్తేనేబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లింది. ఇందులో కనీసం నాలుగు మ్యాచ్లు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో విజయంతో సిరీస్ మొదలుపెట్టిన భారత్.. అడిలైడ్లో మాత్రం ఆసీస్ ముందు తలవంచింది. పింక్ బాల్ టెస్టులో మరోసారి కంగారూ జట్టు చేతిలో ఓడిపోయింది.టాస్ ఆలస్యంఫలితంగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. తర్వాత కాస్త తెరిపినివ్వడంతో ఆట మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.మరోసారి వరణుడి అడ్డంకిఈ క్రమంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త బంతితో బరిలోకి దిగాడు. మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా వరుస ఓవర్లలో బౌలింగ్ చేశారు. అయితే, ఆసీస్ ఇన్నింగ్స్లో 13.2 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామం వరకు ఆటను వాయిదా వేశారు.తొలిరోజు ఆట ముగిసిందిలాకానీ.. వర్షం మాత్రం తగ్గలేదు. ఫలితంగా రెండో సెషన్ రద్దైపోయింది. అయితే, ఆ తర్వాత కూడా ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. వర్షం వల్ల మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేనందువల్ల అంతటితో తొలిరోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 19, నాథన్ మెక్స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మూడో టెస్టు(డిసెంబరు 14-18)వేదిక: ది గబ్బా స్టేడియం, బ్రిస్బేన్టాస్: టీమిండియా.. తొలుత బౌలింగ్వర్షం వల్ల 13.2 ఓవర్లకే ముగిసిపోయిన ఆటఆసీస్ స్కోరు: 28/0ప్లేయింగ్ ఎలెవన్భారత తుది జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియా తుది జట్టుఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్వుడ్.చదవండి: IND Vs AUS 3rd Test: బ్రిస్బేన్ టెస్టులో మహ్మద్ సిరాజ్కు చేదు అనుభవంUsman Khawaja puts away his first boundary of the day with this cracking shot off Siraj 👌#AUSvIND pic.twitter.com/xHJlbrFF8o— cricket.com.au (@cricketcomau) December 14, 2024 -
ఆసీస్తో మూడో టెస్టు.. సిరాజ్కు చేదు అనుభవం
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా జట్టు అభిమానులు ఈ హైదరాబాదీ బౌలర్పై అక్కసు వెళ్లగక్కారు. సిరాజ్ను ఉద్దేశించి పరుష పదజాలం వాడుతూ, గట్టిగా అరుస్తూ అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించారు. భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా ఈ ఘటన జరిగింది. బ్రిస్బేన్ వేదికగాబోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్లో విజయం సాధించిన భారత్.. అడిలైడ్లో జరిగిన పింక్ బాల్ మ్యాచ్లో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఇరుజట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం మూడో టెస్టు మొదలైంది.సిరాజ్ను టీజ్ చేసిన ఆసీస్ఫ్యాన్స్.. కారణం ఇదేగబ్బా మైదానంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. ఆసీస్ ఇన్నింగ్స్లో రెండో ఓవర్ను సిరాజ్ వేశాడు. అయితే, అతడు బంతి పట్టుకుని రంగంలోకి దిగగానే.. ఆస్ట్రేలియా అభిమానులు గట్టిగా అరుస్తూ అతడిని విమర్శించారు. గత మ్యాచ్లో సిరాజ్.. ఆసీస్ స్టార్ ట్రవిస్ హెడ్తో వ్యవహరించిన తీరే ఇందుకు కారణం.ఇద్దరికీ షాకిచ్చిన ఐసీసీఅడిలైడ్ టెస్టులో హెడ్ భారీ శతకం(141 బంతుల్లో 140)తో ఆకట్టుకున్నాడు. అతడిని అవుట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి రాగా.. ఎట్టకేలకు సిరాజ్ అద్భుత యార్కర్తో అతడికి చెక్ పెట్టాడు. అయితే, తన బౌలింగ్లో ట్రవిస్ హెడ్ బౌల్డ్ కాగానే.. ‘ఇక వెళ్లిపో’ అన్నట్లుగా రియాక్షన్స్ ఇస్తూ సిరాజ్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన హెడ్ సైతం గట్టిగానే అతడికి బదులిచ్చాడు.ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వీళ్లిద్దరికీ గట్టి షాక్ ఇచ్చింది. పరస్పరం దూషించుకున్న ఈ ఇద్దరు స్టార్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. చెరో డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది. గత రెండేళ్లలో ఇద్దరిదీ తొలి తప్పిదం కాబట్టి ఈమాత్రం శిక్షతో సరిపెట్టింది. లేదంటే ఇద్దరూ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చేది.వర్షం వల్ల అంతరాయంఇక సిరాజ్- హెడ్ గొడవపై క్రికెట్ పండితులు విమర్శలు గుప్పించగా.. ఆసీస్ ఫ్యాన్స్ మాత్రం మూడో టెస్టు సందర్భంగా సిరాజ్ను హేళన చేస్తున్నట్లుగా కామెంట్లు చేశారు. కాగా బ్రిస్బేన్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వరణుడి వల్ల తొలుత టాస్ ఆలస్యమైంది. ఆ తర్వాత మ్యాచ్ మొదలైనా.. 13.2 ఓవర్ల ఆట ముగిసే సరికి మళ్లీ వాన కురిసింది. ఈ నేపథ్యంలో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి ఆస్ట్రేలియా ఒక్క వికెట్ నష్టపోకుండా 28 పరుగులు సాధించింది.చదవండి: అవునా.. నాకైతే తెలియదు: కమిన్స్కు ఇచ్చిపడేసిన గిల్Big boo for siraj from the crowd#AUSvIND #TheGabba pic.twitter.com/rQp5ekoIak— ٭𝙉𝙄𝙏𝙄𝙎𝙃٭ (@nitiszhhhh) December 14, 2024 -
AUS Vs SA 1st Test: ఉగ్రరూపం దాల్చిన పేసర్లు.. రెండు రోజుల్లోనే ఖేల్ ఖతం
గబ్బా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో ఆతిధ్య ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగినప్పటికీ.. సఫారీలతో పోలిస్తే ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో విజయం సాధించగలిగింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (96 బంతుల్లో 92; 13 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆట తొలి రోజు 15 వికెట్లు నేలకూలిన ఈ టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఓవర్నైట్ స్కోర్ 145/5 వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మరో 73 పరుగులు జోడించి 218 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సఫారీ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్ 3, నోర్జే 2, ఎంగిడి ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. పాట్ కమిన్స్ (5/42), మిచెల్ స్టార్క్ (2/26), స్కాట్ బోలాండ్ (2/14), నాథన్ లయోన్ (1/17) ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ను సఫారీ ఏస్ పేసర్ రబాడ వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (2), డేవిడ్ వార్నర్ (3), స్టీవ్ స్మిత్ (6), ట్రవిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైప్పటికీ 19 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో రావడంతో ఆసీస్ గెలుపొందింది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. సఫారీ ఇన్నింగ్స్లో వికెట్కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. -
నిప్పులు చెరిగిన పేసర్లు.. తొలి రోజే 15 వికెట్లు
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆట తొలి రోజే ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పర్యాటక సౌతాఫ్రికాను 152 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం సఫారీ బౌలర్లు సైతం రెచ్చిపోయి 145 పరుగులకే సగం ఆసీస్ వికెట్లను పడగొట్టారు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (77 బంతుల్లో 78 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి బంతికే కగిసో రబాడ.. డేవిడ్ వార్నర్ను పెవిలియన్కు పంపగా, ఉస్మాన్ ఖ్వాజా (11), స్టీవ్ స్మిత్ (36)లను నోర్జే.. మార్నస్ లబూషేన్ (11)ను జన్సెన్ ఔట్ చేశారు. స్కాట్ బోలాండ్ (1)ను రబాడ ఔట్ చేయడంతో తొలి రోజు ఆట ముగిసింది. అంతకుముందు మిచెల్ స్టార్క్ (3/41), పాట్ కమిన్స్ (2/35), బోలాండ్ (2/28), నాథన్ లయోన్ (3/14) ధాటికి సౌతాఫ్రికా 152 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ ఇన్నింగ్స్లో వికెట్కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వెర్రిన్తో పాటు సరెల్ ఎర్వీ (10), టెంబా బవుమా (38), రబాడ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3), వాన్ డెర్ డస్సెన్ (5), జోండో (0), జన్సెన్ (2), మహారాజ్ (2), నోర్జే (0), ఎంగిడి (3) దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సౌతాఫ్రికా 3 టెస్ట్లు, 3 వన్డేలు ఆడనుంది. -
అతనో రాతి గోడ.. అతని ఓపికకు సలామ్
సిడ్నీ: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనో పటిష్టమైన రాతి గోడ అని, బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతులను సైతం అతను అడ్డుకోగల సమర్ధుడని, నేటి తరంలో అలాంటి క్లాస్ ఆటగాడిని చూడలేదని కొనియాడాడు. క్రీజులో అతను చూపించే ఓపికకు ఎంతటి బౌలర్ అయినా దండం పెట్టాల్సిందేనని ఆకాశానికెత్తాడు. గబ్బా టెస్ట్లో అతను మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రత్యక్షంగా చూశానని, ఓ ఎండ్లో పుజారా, మరో ఎండ్లో పంత్ను చూడటం విచిత్రంగా అనిపించిందని వెల్లడించాడు. తాజాగా ఓ అంతర్జాతీయ వెబ్సైట్తో ఆయన మాట్లాడుతూ.. పుజారాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పుజారాతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదని, అయినా అతని గురించి ఎంతో తెలుసన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు. ఇటీవల తమతో జరిగిన సిరీస్లో పుజారా అంత ప్రభావం చూపలేడని తొలుత భావించామని, కానీ సిడ్నీ, గబ్బా టెస్ట్ల్లో అతను బ్యాటింగ్ చేసిన తీరు చూసి అవాక్కయ్యామని తెలిపాడు. ముఖ్యంగా నాలుగో టెస్ట్లో పుజారా తన దేహానికి బంతులు తగిలించుకున్న విధానాన్ని చూస్తే ఎంతటివారైనా సలామ్ అనాల్సిందేనని అన్నాడు. భీకరమైన బంతులు శరీరాన్ని గాయపరిస్తే, పంటి బిగువన నొప్పిని భరించాడన్నాడు. అతనిలా జట్టు ప్రయోజనాల కోసం దెబ్బలు తగిలించుకున్న ఆటగాడిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. రాతి గోడపైకి బంతిని సంధిస్తే ఎలా ఉంటుందో, అతని డిఫెన్స్ కూడా అదేలా ఉంటుందని కొనియాడాడు. కాగా, టీమిండియా ఆటగాళ్ల అత్యద్భుత పోరాట పటిమ కారణంగా ఆసీస్తో జరిగిన సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా గబ్బాలో జరిగిన ఆఖరి టెస్టులో పుజారా అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బంతులు దేహానికి తగులుతున్నా గోడలా నిలబడి, టీమిండియాకు అపురూపమైన విజయాన్ని అందించాడు. చదవండి: ICC RANKINGS: రెండో ర్యాంక్ నిలబెట్టుకున్న కోహ్లీ -
పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు..
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్, టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో అతడి పాత్ర మరువలేనిదన్నాడు. గబ్బా టెస్టులో అతడి బ్యాటింగ్ శైలి చూస్తుంటే.. ఆస్ట్రేలియన్ మాదిరిగానే అనిపించిందని పేర్కొన్నాడు. కాగా 2020-21 ఆస్ట్రేలియా టూర్లో భాగంగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-1 తేడా(ఒకటి డ్రా)తో గెలిచిన రహానే సేన అరుదైన ఘనత సాధించింది. ముఖ్యంగా బ్రిస్బేన్లో జరిగిన నిర్ణయాత్మక చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో పుజారా(56), రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్మన్ గిల్(91) చెలరేగి ఆడి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ విషయాల గురించి మార్కస్ హారిస్ తాజాగా మాట్లాడుతూ... ‘‘మ్యాచ్ చివరి రోజు క్రికెట్ ప్రేమికులకు కన్నులపండుగే అయ్యింది. ముఖ్యంగా పంత్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, నాకు మాత్రం పుజారా పట్టుదలగా నిలబడటం నచ్చింది. అతడు బంతులను ఎదుర్కొన్న విధానం చూస్తే ఓ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు. ఇక రిషభ్ పంత్ గురించి చెబుతూ.. ‘‘పంత్ సూపర్బ్గా ఆడాడు. ప్రతి ఒక్కరు అతడిలో ఉన్న మ్యాజిక్ను చూడగలిగారు. సిరీస్ కోల్పోవడం మాకు నిరాశే మిగిల్చింది. అయితే, ఆటలో ఇవన్నీ సహజం’’ అని మార్కస్ చెప్పుకొచ్చాడు. చదవండి: Matthew Hayden: త్వరలోనే భారత్ మునుపటిలా మారిపోతుంది! -
ఒకేరోజు 381 పరుగులు.. సాధ్యమయ్యేనా!
సాక్షి క్రీడా విభాగం: నాలుగో రోజు లీచ్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్... ‘చెపాక్’ పిచ్ ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో అనేదానికి ఇదో సూచిక! దాదాపు లెగ్స్టంప్పై పడిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్స్టంప్ను తాకింది. రోహిత్ తన కాలును ముందుకు జరిపి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు ఇంగ్లండ్ తమ బౌలర్లకంటే కూడా పిచ్నే ఎక్కువగా నమ్ముకొని గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది. ఇలాంటి స్థితిలో భారత జట్టు ఆఖరి రోజు ఎలాంటి వ్యూహం అనుసరించబోతోందో చూడాలి. ఒక్క రోజులో, అదీ టెస్టు మ్యాచ్ చివరి రోజు 381 పరుగులు చేయడం సాధ్యమేనా? ఓవర్కు 4.2 పరుగుల వేగంతో అదీ అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై చేయగలరా అనేదే ఆసక్తికరం. బ్రిస్బేన్ విజయం తర్వాత టీమిండియాలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందనడంలో సందేహం లేదు. ఎలాంటి లక్ష్యం ముందున్నా బెదరకుండా సానుకూల దృక్పథంతో ఆడగలమనే నమ్మకాన్ని ఆ మ్యాచ్ కలిగించింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. అయితే ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టులో భారత్ లక్ష్యం 328 పరుగులు. చివరి రోజు 324 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో పది వికెట్లూ ఉన్నాయి. సొంత మైదానం కాకపోయినా ఆ సమయానికి పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. మంచి బౌన్స్తో షాట్లు ఆడేందుకు తగిన అవకాశం కూడా కనిపించింది. అన్నింటికి మించి పోరాడితే పోయేదేమీ లేదు అన్నట్లుగా రహానే బృందం సాహసం చేయగా, పంత్ ప్రత్యేక ఇన్నింగ్స్ జట్టును గెలిపించింది. ఇక్కడ మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఓడితే అది అవమానకరంగా భావించే పరిస్థితి కాబట్టి రిస్క్ చేయడం కష్టం. దీనిని ‘డ్రా’గా ముగిస్తే చాలు, తర్వాతి మూడు టెస్టుల్లో చూసుకోవచ్చనే ఆలోచన సహజం. మరికొందరు తాజా పరిస్థితిని 2008లో ఇదే చెన్నైలో ఇంగ్లండ్పై భారత్ గెలిచిన టెస్టుతో పోలుస్తున్నారు. నాటి మ్యాచ్లో భారత్ విజయలక్ష్యం 387 పరుగులు కాగా... నాలుగో రోజే సెహ్వాగ్ (68 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 83) మెరుపులతో భారత్ 131 పరుగులు చేసేసింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ఆఖరి రోజు మరో 256 పరుగులే అవసరమయ్యాయి కాబట్టి సచిన్ తదితరుల పని సులువైంది. కాబట్టి దానితో ఈ మ్యాచ్కు పోలికే లేదు. తాజాగా బంగ్లాదేశ్పై కైల్ మేయర్స్ అద్భుత బ్యాటింగ్తో వెస్టిండీస్ గెలిచిన టెస్టులో కూడా చివరి రోజు విండీస్ విజయానికి 285 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆట మొదలు పెట్టింది. ఇలా చూస్తే ఒకే రోజు 381 పరుగులు దాదాపు అసాధ్యమే! అయితే సంకల్పానికి, పట్టుదలకు అడ్డంకి ఏముంటుంది. భారత్ కూడా తొలి బంతి నుంచి ‘డ్రా’ కోసం ప్రయత్నించకపోవచ్చు. బ్రిస్బేన్ తరహాలోనే ఒక ఎండ్ను పుజారా రక్షిస్తుంటే మరో ఎండ్లో వచ్చిన ప్రతీ బ్యాట్స్మన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా పంత్ క్రీజ్లో ఉన్నంత వరకైనా గెలుపే లక్ష్యంగా టీమిండియా ముందుకు వెళుతుంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేదు కాబట్టి పరుగులు ధారాళంగా రాకపోతే తమ డిఫెన్స్ను నమ్ముకొని ‘డ్రా’పై దృష్టి పెట్టగల శక్తిసామర్థ్యాలు భారత్కు ఉన్నాయనేది వాస్తవం. ఇంగ్లండ్ కూడా ‘బ్రిస్బేన్’ భయంతోనే గెలుపు కాకపోయినా, ఓడకపోతే చాలనే స్థితిలోకి వెళ్లింది. భారత్కు ఎక్కువ ఓవర్లు అందుబాటులో ఉంచకుండా పరుగులు పెద్దగా రాకపోయినా రెండో ఇన్నింగ్స్ను సాగదీసింది. -
తండ్రి అయ్యాక అదెంతో మేలు చేసింది: కోహ్లి
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నటీ సెలవులు ముగించుకుని జట్టుతో కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇంగ్లాండ్తో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి టెస్టులో ఆడుతున్నాడు. అయితే ఏళ్ల తరబడి క్రికెటర్గా ఉండటం వల్ల కొత్త విషయాలను సులువుగా నేర్చుకోగలుతున్నానని తెలిపాడు. ఈ మేరకు బీసీసీఐ పోస్ట్ చేసిన ఓ వీడియోలో కోహ్లి తండ్రి అయిన తర్వాత తన జీవితంలోకి వచ్చిన కొత్త బాధ్యతల గురించి తెలియజేశాడు. డైపర్లు మార్చడం మరీ అంత కష్టమైన పనేం కాదన్నాడు. ‘‘ఏళ్లుగా క్రికెట్ ఆడటం వల్ల చాలా విషయాలను సులువుగా అర్థం చేసుకునే లక్షణం అబ్బింది. నేర్చుకున్న ప్రతి విషయంలో మాస్టర్ని కాకపోవచ్చు కానీ.. మేనేజ్ చేయగలను. ఇక రవీ భాయ్ వల్ల క్రీజులో, బయట అన్ని విషయాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగింది. పరిస్థితులకు అనుకూలంగా నన్ను నేను మార్చుకోగలగడం క్రికెట్ వల్ల సాధ్యమయ్యింది. ఇదే అంశం తండ్రి అయ్యాక నాకు బాగా పనికి వచ్చింది. డైపర్లు మార్చడం.. పాపను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకోవడం వంటి అంశాల గురించి ఇప్పడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాకు తెలిసి డైపర్లు మార్చడం మరీ అంత కష్టమేం కాదు. అయితే ఈ పనిలో నేను ఇంకా మాస్టర్ని కాలేదు’’ అన్నాడు. A special Test series triumph in Australia A new chapter in life Return of international cricket in India DO NOT MISS: #TeamIndia skipper @imVkohli and Head Coach @RaviShastriOfc get candid. 😎👌 Watch the full interview 🎥 https://t.co/9gffUQG2I2 @Paytm #INDvENG pic.twitter.com/ISg5TzMPXn — BCCI (@BCCI) February 5, 2021 ఇక బ్రిస్బెన్ టెస్ట్లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత టీమిండియాకు ఏ ర్యాంక్ ఇస్తారని ప్రశ్నించగా.. ఖచ్చితంగా టాప్ అనే వెల్లడించాడు కోహ్లి. ‘‘ఎందుకంటే బ్రిస్బెన్ టెస్ట్లో ఆస్ట్రేలియాతో పోల్చితే మాకు ఎన్నో అవరోధాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని తట్టుకుని మేం విజయం సాధించాం. అందుకే టాప్ ర్యాంక్ ఇస్తానని’’ తెలిపాడు. ఇక ఈ వీడియోలో కోహ్లి, టీమిండియా కోచ్ రవి శాస్త్రిలు పలు అంశాల గురించి ముచ్చటించారు. చదవండి: నిశ్చితార్ధం చేసుకున్న సిక్సర్ల వీరుడు.. చదవండి: ‘ఏంటి కోహ్లి.. మరీ అంత పనికిరాని వాడినా’ -
'వారి ఇన్నింగ్స్ చూస్తున్నా.. అప్పుడే డాక్టర్ పిలిచారు'
చెన్నై: బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా చారిత్రక విజయాన్ని అంత తొందరగా మరిచిపోలేం. సీనియర్ల గైర్హాజరీలో యువకులతో నిండిన జట్టు 32 ఏళ్ల ఆసీస్ జైత్రయాత్రకు చెక్ పెడుతూ టెస్టు విజయంతో పాటు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గబ్బా టెస్టులో టీమిండియా విజయానికి రిషబ్ పంత్, పుజారా పోరాటం ఎంతో కీలకమో.. సుందర్- శార్దూల్ ద్వయం తొలి ఇన్నింగ్స్లో నెలకొల్పిన 123 పరుగులు విలువైన భాగస్వామ్యానికి అంతే స్థానం ఉంది. వీరిద్దరే లేకుంటే గబ్బా టెస్టులో టీమిండియా పరిస్థితి వేరేలా ఉండేది. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రిస్బేన్ టెస్టుకు సంబంధించి మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఇంగ్లండ్తో తొలిటెస్టుకు సన్నద్దమవుతున్న వేళ కోహ్లి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 'బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా సాధించిన చారిత్రక విజయం గురించి ఇప్పటికే చాలాసార్లు చర్చించా. అయితే ఆరోజు జరిగిన మరో ఆసక్తికర విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. బ్రిస్బేన్ టెస్టు సమయంలో ఆసుపత్రిలో ఉన్న నేను సుందర్.. శార్దూల్ బ్యాటింగ్ను నా ఫోన్లో ఆస్వాదిస్తున్నా. వారిద్దరి సమన్వయంతో 127 పరుగుల కీలక భాగస్వామ్యం ఏర్పడింది. వారి ఇన్నింగ్స్ చూస్తున్న సమయంలోనే నాకు డాక్టర్ నుంచి పిలుపు వచ్చింది. ఒక బిడ్డకు తండ్రి అవడం అనేది నా జీవితంలో గొప్ప అనుభూతి. అదే సమయంలో టీమిండియా చారిత్రక టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. నేను చెప్పిన రెండు కారణాలు విభిన్న శైలిలో ఉన్నాయి.. యాదృశ్చికంగా నా జీవితంలో రెండు ఆనందాలు ఒకేసారి పొందడం ఆనందంగా ఉన్నా.. వాటిని ఒకదానితో మరొకటి ఎన్నటికీ పోల్చలేను. నేను లేకున్నా జట్టు విజయం సాధించడం.. ఆ మ్యాచ్ను నేను కళ్లారా వీక్షించడంతో టీమిండియాతో అనుబంధం మాత్రం ఎక్కడ ఉన్నా అలాగే ఉంటుందని మరోసారి రుజువైంది. చదవండి: ధోని గుర్తుగా కోహ్లి హెలికాప్టర్ షాట్ ఇక ఇంగ్లండ్తో సిరీస్కు మేం పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యాం. పెటర్నిటీ సెలవుల అనంతరం జట్టుతో కలవడం ఆనందంగా అనిపిస్తుంది. ఆసీస్పై టెస్టు సిరీస్ విజయాన్ని ఇంగ్లండ్తో మ్యాచ్ల్లోనూ కొనసాగిస్తాం. జూన్లో లార్డ్స్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్పిప్ ఫైనల్కు అర్హత సాధించడమే మా కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఇక రిషబ్ పంత్ వికెట్ కీపర్గా తుది జట్టులో కచ్చితంగా ఆడనున్నాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో పేస్ విభాగం మరింత పటిష్టంగా తయారైంది. స్వదేశంలో బుమ్రాకు ఇదే తొలి టెస్టు అయినా.. ఇప్పటికే తనేంటో ప్రపంచానికి తెలియచేశాడు. అతని ఫామ్పై ఎలాంటి సందేహాలు లేవు.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. చదవండి: సిక్సర్ల హోరు.. యునివర్సల్ బాస్ విధ్వంసం -
'ఆరోజు బ్యాట్ పట్టుకోవడమే ఇబ్బందిగా మారింది'
బ్రిస్బేన్: గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్లో 89* పరుగులు ఇన్నింగ్స్తో రిషబ్ పంత్ హీరో అవ్వగా.. అంతకుముందు 91 పరుగులు చేసిన ఓపెనర్ శుభ్మన్ గిల్ విజయంలో కీలకంగా మారాడు. కానీ వీరిద్దరి మధ్య మరో కీలక ఆటగాడు ఉన్నాడు.. అతనే చతేశ్వర్ పుజారా. అతడు చేసింది 56 పరుగులే అయినా.. అవే భారత జట్టు మ్యాచ్ను గెలిచేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. దాదాపు రెండు సెషన్ల పాటు ఆసీస్ బౌలర్ల సమర్థంగా ఎదుర్కొంటూ వారినే అలసి పోయేలా చేశాడు. పదునైన బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 211 బంతులు ఆడాడు. ఈ క్రమంలో అతని శరీరం మొత్తం గాయాలయ్యాయి. అతను చూపిన తెగువకు టీమిండియా అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే తన వేలికి గాయం కూడా అయింది. తాజాగా పుజారా బ్రిస్బేన్లో బ్యాటింగ్ ఆడిన తీరు గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. చదవండి: గంగూలీకి సర్జరీ.. అదనంగా రెండు స్టెంట్లు 'మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నా వేలికి గాయమైంది. దీని కారణంగా సిడ్నీ, బ్రిస్బేన్లలో బ్యాటింగ్ చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. బ్రిస్బేన్లో మళ్లీ అక్కడే దెబ్బ తగలడంతో గాయం మరింత తీవ్రమైంది. ఆ తర్వాత కనీసం బ్యాట్ పట్టుకోవడానికి కూడా రాలేదు. నాలుగు వేళ్లతోనే బ్యాట్ను గ్రిప్ చేయాల్సి వచ్చింది. జట్టును ఓటమినుంచి కాపాడాలనే ప్రయత్నంలో బాధనంతా దిగమింగుకొని ఎలాగోలా ఆడానంటూ' పుజారా చెప్పుకొచ్చాడు. చదవండి: క్రికెటర్ శిఖర్ ధావన్పై చార్జ్షీట్ -
గబ్బా విజయం: రవిశాస్త్రి చెప్పిన మంత్రమిదే
ముంబై: గబ్బాలో టీమిండియా 32 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. పింక్ బాల్ టెస్ట్లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు.. 40 రోజుల వ్యవధిలో.. అదే ఆస్ట్రేలియాను బ్రిస్బెన్ టెస్ట్లో మట్టి కరిపించింది. కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికి చారిత్రాత్మక విజయం సాధించిన బ్రిస్బేన్ టెస్ట్కు ప్రత్యేకతలేన్నో. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నటీ లీవ్లో ఉన్నాడు.. ఇక సీనియర్ ఆటగాళ్లను గాయాలు వెంటాడాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన అజింక్య రహానే ఆధ్వర్యంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు గబ్బా వేదికగా చరిత్రని తిరగరాసింది. పింక్ బాల్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలో గబ్బా విజయానికి సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. టీమిండియా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తన యూట్యూబ్ చానెల్లో రవిచంద్రన్ అశ్విన్తో జరిగిన సంభాషణలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన ప్రసంగం అడిలైడ్లో ఎదుర్కొన్న ఓటమి నుంచి టీమిండియా అదృష్టాన్ని ఎలా మలుపు తిప్పిందో వెల్లడించారు. (చదవండి: క్రికెటర్స్.. ‘గేమ్’చేంజర్స్..!) ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘36 ఆలౌట్ తరువాత ఏం జరిగిందో మీకు తెలియదు. అప్పుడు రవి (శాస్త్రి) భాయ్ జట్టు సభ్యులను పిలిచి ఇలా అన్నాడు.. ‘‘ఈ 36 ను మీ స్లీవ్స్లో బ్యాడ్జ్ లాగా ధరించండి.. ఆ ఓటమి మీలో కసి పెంచుతుంది. మీ ఆట తీరు మారుతుంది. ఇక చూడండి మీరు గొప్ప జట్టు అవుతారు’’ అన్నాడు. 40 రోజుల వ్యవధిలో రవిశాస్త్రి మాటలు నిజం అయ్యాయి. అలాగే, అడిలైడ్ టెస్ట్ అనంతరం రెండు రోజుల వ్యవధిలో మేము ఐదు సార్లు సమావేశం అయ్యాం. విరాట్ (కోహ్లీ), జింక్స్ (అజింక్య రహానె), కోచింగ్ సిబ్బంది కాంబినేషన్స్ గురించి చర్చించారు. విరాట్ కొన్ని అద్భుతమైన సూచనలు ఇచ్చాడు. వాటన్నింటి ఫలితమే ఈ విజయం’’ అన్నారు శ్రీధర్. (నన్ను ఎవరితోనూ పోల్చకండి: పంత్) -
రథంపై నటరాజన్.. సెహ్వాగ్ రియాక్షన్
ముంబై: ఆస్ట్రేలియా టూర్ను విజయవంతంగా ముగించి.. ట్రోఫితో ఇండియాకు చేరుకున్న భారత జట్టుకు దేశం యావత్తు ఘన స్వాగతం పలికింది. విమానాశ్రయ సిబ్బందితో సహా అభిమానులు, ప్రయాణికులు వారికి ఘన స్వాగతం పలకగా.. ఇక తమిళ సీమర్ నటరాజన్కు సొంతూర్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. అతడి కోసం రథం ఏర్పాటు చేసి.. ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ‘‘ఇది ఇండియా. ఇక్కడ క్రికెట్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి. నటరాజన్కు తన గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. వ్వాటే స్టోరీ’’ అనే క్యాప్షన్తో వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో మరో సారి షేర్ చేశారు సెహ్వాగ్. నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది. (చదవండి: ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు) -
ఊరేగింపు... మేళతాళాలు...
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియానే నేలకు దించి చరిత్ర తిరగరాసిన భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముందుగా ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరీస్ గెలిపించిన కెప్టెన్ అజింక్య రహానే మాతుంగాలోని తన స్వగృహానికి చేరగానే హౌజింగ్ సొసైటీలోని స్థానికులంతా ఎర్రతివాచీ పరిచి మరీ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. భార్యతో పాటు రహానే తన రెండేళ్ల కుమార్తెను ఎత్తుకొని నడుస్తుండగా ఇరుగు పొరుగువారు, స్థానికులు అతనిపై అడుగడుగున పూలజల్లు కురిపించారు. అనంతరం రహానేతో కేక్ కట్ చేయించి వేడుక జరుపుకున్నారు. అంతకుముందు ముంబై క్రికెట్ సంఘం రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షాలను ఘనంగా సన్మానించింది. బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్ ఢిల్లీలో హర్షధ్వానాల మధ్య ఇంటికి చేరుకున్నారు. తమిళ సీమర్ నటరాజన్కు సొంతూరైన ‘చిన్నప్పంపట్టి’ గ్రామస్థులంతా రథంపై ఊరేగించి బ్రహ్మరథం పట్టారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఊరంతా పాల్గొనడం విశేషం. ఓ నెట్ బౌలర్గా జట్టుతో పాటు వెళ్లిన ఈ తమిళ తంబి అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్గా ఘనత వహించాడు. కరోనా దృష్ట్యా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం రహానే, రోహిత్, శార్దుల్, పృథ్వీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలను ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ కావాలని అధికారులు సూచించారు. -
నాన్న లేని లోటు పూడ్చలేనిది: సిరాజ్
సాక్షి, హైదరాబాద్: ‘‘నాన్న లేని లోటు తీర్చలేనిది. నేను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన శ్రమ దాగి ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై వికెట్ తీసుకున్న ప్రతిసారీ నాన్నే గుర్తొచ్చారు. అక్కడి ప్రదర్శన ఆయనకే అంకితం’’ అంటూ టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. అదే విధంగా.. క్లిష్ట పరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆసీస్తో జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ హైదరబాదీ.. టూర్ ముగించుకుని నేడు నగరానికి తిరిగి వచ్చాడు. విమానాశ్రయం నుంచి నేరుగా తండ్రి మహ్మద్ గౌస్ సమాధిని సందర్శించిన సిరాజ్.. ఆయనకు నివాళులు అర్పించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్ విజయం వెలకట్టలేనిదంటూ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.(చదవండి: నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్) కోహ్లి భాయ్ ప్రోత్సహించాడు ‘‘కష్ట సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నన్ను రీటేన్ చేసుకుంది. కోహ్లి భాయ్ నాకు అడుగడుగునా అండగా నిలిచాడు. ఒత్తిడి వీడి ఆటపై దృష్టి సారించాలని చెప్పాడు. నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఐపీఎల్ ద్వారా మంచి అనుభవం లభించింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్తో పోలిస్తే సంప్రదాయ క్రికెట్ ఆడటం భిన్నమైంది. ఆసీస్ పర్యటనతో సంతోషంగా ఉన్నా. నాన్న కలను నెరవేర్చాలని పట్టుదలగా ఆడాను. టీమిండియాకు ఆడుతున్నా అనే విషయం మాత్రమే గుర్తుపెట్టుకున్నా’’ అంటూ టెస్టుల్లో అరంగేట్రానికి ముందు తను ఎదుర్కొన్న అనుభవాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సిరాజ్ బదులిచ్చాడు.(చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) ఫేవరెట్ వికెట్ అతడిదే.. ఇక ఆసీస్ టూర్ గురించి మాట్లాడుతూ.. ‘‘సీనియర్లు లేకపోయినా ఒత్తిడికి లోనుకాకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. బుమ్రా నాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. నాలుగో టెస్టులో తొలుత కాస్త ఆందోళనకు గురయ్యాను. కానీ తను సపోర్టు చేశాడు. నా ప్రదర్శనను ప్రశంసిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇక అజ్జూ భాయ్(అజింక్య రహానే) యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచాడు. నటరాజన్, సైనీ, వాషింగ్టన్ సుందర్, నన్ను ఇలా అందరినీ ప్రోత్సహించాడు. కోహ్లి భాయ్ కెప్టెన్సీని ఎంతగా ఎంజాయ్ చేశానో.. అజ్జూ భాయ్ సారథ్యాన్ని కూడా అంతే ఆస్వాదించాను. ఇక నా ఫేవరెట్ వికెట్ గురించి చెప్పాలంటే.. మార్నస్ లబుషేన్దే. కీలక సమయంలో తీసిన ఆ వికెట్ నాకెంతో ప్రత్యేకం’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. (చదవండి: కీలక వికెట్లు కూల్చిన సిరాజ్.. బుమ్రా ఆలింగనం) ఇప్పుడే ఇంటికి వచ్చాను అదే విధంగా.. ఇంగ్లండ్తో జరుగబోయే సిరీస్కు ఎలా సన్నద్ధమవుతారు అని ప్రశ్నించగా.. ‘‘ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటి భోజనం చేశా. అలా అని రిలాక్స్ అవ్వను. షమీ, ఉమేశ్ వచ్చిన తర్వాత కూడా మార్పు ఉండకపోవచ్చు. నిజానికి మేనేజ్మెంట్ ఎలా చెప్తే అదే నేను చేస్తాను. నేను ఇప్పుడు కూడా జూనియర్నే. అయితే ఆసీస్ విజయం ఇచ్చిన విశ్వాసంతో ముందుకు సాగుతాను. మనసు పెట్టి ఆడతాను అంతే. కఠినశ్రమతో పాటు ఆటను గౌరవించడం నేర్చుకున్నా. నా కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు నాకు అండగా నిలిచారు. ఇక ముందు కూడా ఇలాగే మీ మద్దతు నాకు కావాలి’’ అని ఫ్యాన్స్కు సిరాజ్ విజ్ఞప్తి చేశాడు. క్రీడలను కెరీర్గా ఎంచుకోవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలని ఈ హైదరాబాదీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా టెస్టు సిరీస్లో సిరాజ్ మొత్తంగా 13 వికెట్లు తీసి సత్తాచాటాడు. ముఖ్యంగా గబ్బాలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. టూర్లో ఉండగానే తండ్రి మరణం, ఆసీస్ ప్రేక్షకుల జాత్యహంకార వ్యాఖ్యలు వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఒత్తిడి జయించి తన ప్రతిభ నిరూపించుకుని దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. -
సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు ఆడుంటే
బ్రిస్బేన్: 1988 నుంచి 32 ఏళ్ల పాటు బ్రిస్బేన్ మైదానంలో ఓటమెరుగని ఆసీస్కు టీమిండియా చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ ఓడిపోవడంపై మాజీ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ క్రికెట్ ఆస్ట్రేలియా తీరును తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంప్రదాయం ప్రకారం బోర్డర్ గవాస్కర్ ట్రోపీని గబ్బాలో మొదలుపెట్టుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. ఆతిథ్య జట్టుకు 2-1తేడాతో పరాభవం జరిగేదికాదని అభిప్రాయపడ్డాడు. చదవండి: నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్ 'ప్రతీ ఏడాదిలో సమ్మర్ సీజన్లో ఆసీస్ ఎప్పుడు టెస్టు మ్యాచ్ ఆడినా.. గబ్బా వేదికగానే ఆరంభమవుతుంది. కానీ ఈసారి ఆ రూల్కు సీఏ వ్యతిరేకంగా వ్యవహరించింది. ఒకవేళ గబ్బాలో మొదటిటెస్టు జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆసీస్కు గబ్బా వేదిక బాగా కలిసొచ్చిన మైదానం.. 32 ఏళ్ల పాటు అక్కడ మాకు ఓటమి అనేది తెలియదు. ఇక్కడ తొలి మ్యాచ్ జరగుంటే ఆసీస్ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేది. కానీ సీఏ మాత్రం విరుద్ధంగా అడిలైడ్ వేదికగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ను అడిలైడ్లో ప్రారంభించింది. అంతేగాక టీమిండియా ఎప్పుడు వచ్చినా గబ్బా వేదికగానే తొలి టెస్టు ఆడాల్సి ఉండేది.. దీంతో పాటు పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్(వాకా) మైదానంలో ఈసారి ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశమే నన్ను సీఏను తప్పు పట్టేలా చేసింది.'అంటూ తెలిపాడు. -
నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్
హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్కు ఆత్మీయ స్వాగతం లభించింది. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ఇక హైదరాబాద్కు చేరుకోగానే సిరాజ్ తొలుత తన తండ్రి మహ్మద్ గౌస్ సమాధిని సందర్శించాడు. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న తండ్రి శ్రమను గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించాడు. కాగా సిరాజ్ తండ్రి ఆటోడ్రైవర్గా పనిచేసేవారు. కొడుకును టీమిండియా క్రికెటర్గా చూడాలనే కోరికతో అనేక కష్టనష్టాలకోర్చారు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వన్డేల్లో అరంగేట్రం చేసిన సిరాజ్ను చూసి ఎంతో మురిసిపోయారు.(చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) అయితే, నవంబరులో మొదలైన టీమిండియా ఆసీస్ పర్యటనకు ఎంపికైన సిరాజ్ అక్కడికి చేరుకున్న కొన్ని రోజులకే, మహ్మద్ గౌస్ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం విదితమే. ఈ క్రమంలో స్వదేశానికి వెళ్లేందుకు బీసీసీఐ సిరాజ్కు అనుమతి ఇచ్చినా, సంప్రదాయ క్రికెట్లో తన అరంగేట్రం కోసం కలలు గన్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు అక్కడే ఉండిపోయాడు. ఇక బాక్సింగ్ డే టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. టెస్టు సిరీస్లో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. (చదవండి: ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నన్ను ఎవరితోనూ పోల్చకండి: పంత్
న్యూఢిల్లీ: బ్రిస్బేన్ టెస్టులో ‘హీరో’చిత ఇన్నింగ్స్ ఆడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్న టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్ ప్రస్తుతం కెరీర్లోనే అత్యుత్తమ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో 691 పాయింట్లతో 13వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ను ధోనితో పోలుస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పంత్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటున్నాడు. కాగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా 2018లో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పంత్.. అనతికాలంలోనే తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నాడంటే చాలు.. ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడు ప్రదర్శిస్తూ చుక్కలు చూపించేవాడు. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్ ప్రేమికులు పంత్ను, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోల్చేవారు. పంత్ కూడా అందుకు తగ్గట్టుగానే రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడు.(చదవండి: 'గాబా’ మైదానంలో కొత్త చరిత్ర..) అయితే.. పంత్ మెరుగైన స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నప్పటికీ నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకుంటాడనే విమర్శలు మూటగట్టుకున్నాడు. టెస్టు క్రికెట్ను పక్కన పెడితే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్ కీపర్ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేయడంతో మెల్లగా అతడికి అవకాశకాలు కూడా సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ధోని వారసుడు అంటూ పంత్ను ప్రశంసించిన వాళ్లే అతడి ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఫిట్నెస్పై అతడికి శ్రద్ధ లేదని, పంత్ బదులు సంజూ శాంసన్ను వికెట్ కీపర్గా తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసేవారు. కానీ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్తో మరోసారి తన సత్తా ఏంటో చూపించిన పంత్.. విమర్శకుల నోళ్లు మూయించాడు. (చదవండి: స్పైడర్మాన్ అంటూ రిషభ్ పాట.. వైరల్) ఆఖరి టెస్టులో పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడి(89 పరుగులు, నాటౌట్) భారత జట్టు చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మరోసారి ధోనితో పోలిక తెచ్చి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు పంత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఆకట్టుకున్నాడు. ‘‘ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలతో పోల్చినపుడు ఎవరికైనా సరే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. నేను కూడా అంతే. ఎవరైనా అలా అన్నపుడు చాలా సంతోషపడతాను. అయితే నన్ను ఎవరితోనూ పోల్చకండి. ఎందుకంటే భారతీయ క్రికెట్ చరిత్రలో నాకంటూ ప్రత్యేక స్థానాన్ని, పేరును పొందాలని భావిస్తున్నా. ఆ దిశగా దృష్టి సారించాను కూడా. నిజానికి నాలాంటి యువ ఆటగాడిని దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదు’’ అని పేర్కొన్నాడు. (చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!) -
కెరీర్ అత్యుత్తమ స్థానంలో రిషభ్ పంత్
దుబాయ్: బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో తన కెరీర్లో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో పంత్ 13వ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 691 పాయింట్లు ఉన్నాయి. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో ఉండగా... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (862 పాయింట్లు)ని వెనక్కి నెట్టి ఆసీస్ ప్లేయర్ లబ్షేన్ (878 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో భారత ప్లేయర్లు పుజారా ఏడో స్థానంలో, రహానే తొమ్మిదో ర్యాంకులో నిలిచారు. బౌలర్ల విభాగంలో సిరాజ్ 32 స్థానాలు మెరుగుపరుచుకొని 45వ ర్యాంక్కు చేరాడు. బౌలర్ల జాబితాలో ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), స్టువర్ట్బ్రాడ్ (ఇంగ్లండ్), నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్)... ఆల్రౌండర్ల కేటగిరీలో బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్డిండీస్), జడేజా (భారత్) వరుసగా టాప్–3లో ఉన్నారు. -
'నా కొడుకు సెంచరీ చేసుంటే బాగుండేది'
బ్రిస్బేన్: ఆసీస్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా గెలుచుకున్న క్షణం నుంచి ఇప్పటిదాకా అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఆసీస్ విధించిన 328 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 7 వికెట్లు కోల్పోయి చేధించిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ కడదాకా నిలిచి 89* పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంత్కు తోడుగా పుజారా వికెట్లు కోల్పోకుండా అడ్డు గోడగా నిలిచాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత రిషబ్ పంత్, పుజారాలను ఆకాశానికి ఎత్తడం అందరూ గమనించారు. అయితే ఇక్కడ మరో ఆటగాడు భారత్ నాలుగో టెస్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఓపెనర్ శుబ్మన్ గిల్.. 91 పరుగులు చేసి భారత విజయానికి బాటలు పరిచాడు. 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న గిల్ ఇన్నింగ్స్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. గిల్ ఇన్నింగ్స్పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నవేళ.. గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్ మాత్రం తన కొడుకు సెంచరీ మిస్ అయినందుకు బాధపడ్డాడు. 'గిల్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా క్రికెట్ చరిత్రలో కొన్ని ఏళ్ల పాటు గర్తుండిపోతుంది. నా కొడుకు ఇన్నింగ్స్ నాకు ప్రత్యేకం.. కానీ దానిని సెంచరీగా మలిచి ఉంటే ఇంకా బాగుండేది. 91 పరుగుల వరకు వచ్చి కేవలం 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోవడం కాస్త బాధ కలిగించింది. అయినా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే చిరస్మరణీయ విజయంలో నా కుమారుడు భాగస్వామ్యం కావడం ఆ బాధను మరిచేలా చేసింది. అయితే గిల్ ఔటైన విధానం నన్ను కలవరపరిచింది. అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన గిల్ ఆఫ్ స్టంప్కు దూరంగా వెళ్తున్న బంతిని టచ్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కానీ ఇది అతనికి మంచి అనుభవం.. రానున్న మ్యాచ్ల్లో ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాడని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: దిగ్గజాలు ఇప్పుడేం సమాధానం ఇస్తారు! గిల్ తండ్రి లఖ్వీందర్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారతదేశ సగటు తండ్రి ఆవేదన ఇలాగే ఉంటుంది. ఎంతైనా ఒక కొడుకుకు తండ్రే కదా.. మీరు అలా ఆలోచించడంలో ఏ మాత్రం తప్పులేదు. అయినా గిల్ 91 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఆనందం ముందు 100 పరుగులు మిస్ కావడం పెద్ద విషయం కాదు' అంటూ తెలిపాడు. View this post on Instagram A post shared by Virender Sehwag (@virendersehwag) -
ఆసీస్ అభిమాని నోట భారత్ మాతాకీ జై.. వైరల్
బ్రిస్బేన్: 32 ఏళ్లుగా గబ్బా స్టేడియంలో ఓటమే ఎరుగని ఆస్ట్రేలియా జట్టును టీమిండియా కంగారుపెట్టించింది. 328 రికార్డు లక్ష్యాన్ని ఛేదించి అటు టెస్టును ఇటు సిరీస్ను ఎగరేసుకుపోయింది. కీలక ఆటగాళ్లు గాయాల గండంలో చిక్కుకున్నా అద్వితీయమైన ఆటతో రహానే సేన సగర్వంగా రెండోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముద్దాడింది. ఆసమయంలో 130 కోట్ల భారతీయుల గుండె ఉప్పొంగింది. దాంతోపాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానులు, క్రీడా విశ్లేషకులు టీమిండియా పోరాటపటిమను కొనియాడారు. ఆసీస్ ఆటగాళ్లు, కోచ్ సైతం ఇండియన్ క్రికెటర్లను తక్కువ అంచనా వేయొద్దని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో పేర్కొన్నారు. ఈక్రమంలో తమ జట్టు ఓటమిపాలైనప్పటికీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: 'గాబా’ మైదానంలో కొత్త చరిత్ర..) గబ్బా స్టేడియంలో అభిమానుల గ్యాలరీ నుంచి ‘భారత్ మాతాకి జై’, ‘వందే మాతరం’ అంటూ స్లోగన్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా, బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమిండియా మూడు వికెట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 369 పరుగులు చేయగా.. భారత్ 336 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 294 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన 33 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ఓవరాల్గా భారత్ ముందు 328 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. శుభ్మన్ గిల్ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు), రిషభ్ పంత్ (138 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించి భారత్కు విజయాన్ని అందించారు. (చదవండి: కరోనా : సానియా మీర్జా భావోద్వేగం) -
దిగ్గజాలు ఇప్పుడేం సమాధానం ఇస్తారు!
బ్రిస్బేన్: ఆసీస్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమిని మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై అత్యంత చెత్త రికార్డును మూట గట్టుకున్న భారత జట్టుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.అందునా తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి తిరిగి రావడంతో ఇవి మరీ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రికీ పాంటింగ్, మైకెల్ వాన్, మార్క్ వా, మైకెల్ క్లార్క్, బ్రాడ్ హడిన్ లాంటి మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై వెటకారంతో మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ' కోహ్లి లేని టీమిండియాను చూడలేమని ఒకరంటే.. తొలి టెస్టులోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా పని అయిపోయిందని.. ఈసారి వైట్వాష్ తప్పదని.. టీమిండియాకు ఇది ఒక చీకటి సిరీస్' అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది కానీ నెలరోజులు తిరగకముందే టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను వారి సొంత గడ్డపైనే వరుసగా రెండో సారి టెస్టు సిరీస్ను దక్కించుకొని ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వినూత్న రీతిలో స్పందించాడు. టీమిండియాను ఎత్తిపొడుస్తూ మాట్లాడిన మాజీ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని వారి ట్వీట్స్తో పాటు భారత జట్టు కప్ అందుకున్న ఫోటోను షేర్ చేస్తూ తనదైన శైలిలో చురకలంటించాడు. ‘గుడ్ ఈవ్నింగ్ గబ్బా!! ఈ మైదానంలో నేను ఆడలేకపోయాను క్షమించండి. కఠినమైన సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, గట్టి పోటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సిరీస్ను ఎప్పటికీ మరిచిపోలేం. ఇక కొందరు దిగ్గజాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. కోహ్లి లేకుండా మేం సిరీస్ను గెలవలేమన్నారు. ప్రధాన ఆటగాళ్లంతా గాయపడినా కుర్రాళ్లతో కలిసి బ్రిస్బేన్ టెస్టులో మరుపురాని విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టూ ఆర్ఎల్ఎస్.. ఈక్వేషన్ను సరిచేశాం. దిగ్గజాలు ఇప్పుడే సమాధానం ఇస్తారో చెప్పండి' అంటూ ట్రోల్ చేశాడు.చదవండి: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్: భారత జట్టు ఇదే! కాగా మూడో టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, అశ్విన్ల మధ్య జరిగిన సంభాషణ గురించి అందరికి తెలిసిందే. గాయంతో నాలుగో టెస్టుకు దూరమైన అశ్విన్ మూడో టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న భారత్ను హనుమ విహారితో కలిసి ఆసీస్ భీకరమైన బౌలింగ్కు ఎదురొడ్డి నిలిచాడు. ఒకవైపు ఆసీస్ పేసర్ల విసురుతున్న బౌన్సర్ల దాటికి నెత్తురోడుతున్న ఏ మాత్రం ఆలక్ష్యం వహించకుండా ఓపికతో ఆడిన అశ్విన్.. టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ క్రమంలోనే టిమ్ పైన్ అశ్విన్పై స్లెడ్జింగ్కు దిగిన సంగతి తెలిసిందే. 'నిన్ను గబ్బాలో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్'అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.వీటికి అశ్విన్ కూడా తనదైన శైలిలో ‘మేము కూడా మిమ్మల్ని భారత్లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. బహుశా నీకు అదే చివరి సిరీస్ కావొచ్చు.'అని ధీటుగా బదులిచ్చాడు. అయితే పైన్ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ అశ్విన్కు క్షమాపణ కోరడంతో వివాదం సద్దుమణిగింది.చదవండి: ఆసీస్తో సిరీస్ : అసలైన హీరో అతనే కాగా నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 7 వికట్లు కోల్పోయి ఛేదించింది. రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్మన్ గిల్(91) దూకుడు కనబర్చగా.. పుజారా(56) తనదైన డిఫెన్స్తో మెరిసాడు. ఫలితంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది. LHS ( not = ) RHS ! Yours happily India tour of OZ 2020/21 Humbled by all the love and support we have received over the last 4 weeks!🙏 pic.twitter.com/nmjC3znglx — Ashwin 🇮🇳 (@ashwinravi99) January 19, 2021 -
వాటే సిరీస్.. రహానే కెప్టెన్సీ భేష్: పాక్ ఫ్యాన్స్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ అభిమానులతో పాటు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు భారత జట్టును కొనియాడుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తుండటంతో టీమిండియా హాష్టాగ్ ట్రెండింగ్లో నిలిచింది. ఆసీస్ గడ్డపై భారత్ అపూర్వ విజయాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లు 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు గబ్బాలో ఓటమి రుచి చూపించిన తీరును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా పంత్, గిల్, సిరాజ్, పుజారా, వాషింగ్టన్ సుందర్, ఠాకూర్ల ప్రదర్శన అద్భుతమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సైతం విజయం సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కితాబిచ్చాడు. ఇక దాయాది దేశం పాకిస్తాన్ వాసులు సైతం భారత జట్టు విజయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేయడం విశేషం. రహానే కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల ప్రతిభను కొనియాడుతూ సానుకూల కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాటే సిరీస్.. చారిత్రాత్మక విజయం. భారత్కు శుభాకాంక్షలు. టీమిండియా చూపిన పట్టుదల అమోఘం. భారత జట్టు నేడు వారి క్లాస్ ఆటను చూపించింది. మీరు ఇలాగే ఆడుతూ ఉండాలి. పాకిస్తాన్ నుంచి మీకు అభినందనలు’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘‘ఇంతటి ఘన విజయం. రిషభ్ పంత్ అత్యద్భుతం. ఇండియా వలె పాకిస్తాన్ జట్టు కూడా మమ్మల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నాం’’ అంటూ మాలిక్ రెహమాన్ అనే వ్యక్తి ఆకాంక్షించారు.(చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం) ఇక మరొకరు.. ‘‘కీలక ఆటగాళ్లు లేరు కాబట్టి ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోతుంది అని అంతా భావించారు. కానీ మీరు మాత్రం అద్భుత పోరాటపటిమ కనబరిచి మీ అభిమానుల గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేశారు. శుభాకాంక్షలు అని మరొకరు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో #AUSvsIND పాకిస్తాన్లో ట్రెండింగ్లో నిలిచింది. ఇక పాక్ క్రీడాభిమానుల ప్రశంసలకు సానుకూలంగా స్పందించిన ఇండియన్ నెటిజన్లు.. సౌతాఫ్రికాతో జరుగబోయే సిరీస్కు మీకు ఆల్ ది బెస్ట్ అని విషెస్ చెబుతున్నారు. కాగా భారత్- పాక్ల మధ్య మ్యాచ్ అంటేనే అసలైన మ్యాచ్ అని, ప్రత్యర్థి జట్టును ఓడించడంలోనే సిసలైన మజా ఉంటుందంటూ ఇరు జట్ల అభిమానులు భావిస్తారన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఆసీస్ గడ్డపై భారత్ విజయాన్ని అభినందిస్తూ మరో ఉపఖండ జట్టు ఫ్యాన్స్ ట్వీట్లు చేయడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. What a series, Historic Victory, Congratulations India and Many Congratulations to Team India great Fight great ComeBack, India Show their class Today... Keep it up...🏏🏏🏏🏏🏏🏏🏏 💐 From Pakistan... 🤗 #AUSvIND#AUSvsIND #AUSvINDtest pic.twitter.com/8kLxg7qoLT — Fatima Khalil Butt (@FatiMaButt_4) January 19, 2021 What a historic game 👏 I wish the Pakistan will make us proud the same way India did. Rishabh pant is amazing. #AUSvsIND pic.twitter.com/KW46IQgHLY — Malik Abdur Rehman (@immalikrehman) January 19, 2021 -
ఈరోజుతో నా కల నెరవేరింది : పంత్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో టీమిండియా యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ పాత్ర మరువలేనిది. శుబ్మన్ గిల్ వెనుదిరిగిన తర్వాత పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఒకవైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును సగర్వంగా విజయతీరాలకు చేర్చాడు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న పంత్ గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్లో మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్బుతమనే చెప్పొచ్చు. ఈరోజు పంత్ ఆడిన ఇన్నింగ్స్ ప్రతి భారత అభిమాని మదిలో కొన్నేళ్ల పాటు నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. కాగా నాలుగో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన పంత్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు. 'నా కల నిజమైంది. నేను ఫామ్లో లేని సమయంలో టీమ్ నాకు మద్దతుగా నిలిచింది. తొలి టెస్ట్ తర్వాత నెట్స్లో చెమటోడుస్తున్నాం. టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ నాకు అండగా ఉంది. నేనో మ్యాచ్ విన్నర్ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించింది. అదే ఇవాళ నేను నిజం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది'అని పంత్ అన్నాడు. చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం అయితే స్వతహాగా రిషబ్ పంత్ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడు. 2018లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన పంత్ ఆరంభం నుంచే తనదైన దూకుడు ప్రదర్శించేవాడు. ఫామ్లో ఉంటే ప్రత్యర్థి ఎవరైనా సరే పంత్ మాత్రం బాదుడే లక్ష్యంగా పెట్టుకునేవాడు. మంచి స్ట్రైక్ రేట్ కలిగిన పంత్కు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటాడనే అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. ఇప్పటికే చాలాసార్లు నిరుపితమైంది. మ్యాచ్లు గెలుస్తామన్న దశలో దాటిగా బ్యాటింగ్ కొనసాగించే పంత్ అనవసర షాట్లు ఆడి వికెట్ పోగొట్టుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈ ఒక్క అంశంతోనే అతను జట్టులో సుస్థిరస్థానం పొందేవాడు కాదు. వాస్తవానికి ఆసీస్తో జరిగిన నాలుగు టెస్టు సిరీస్లో రిషబ్ పంత్ మొదట రిజర్వ్బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే టెస్టు జట్టు రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మొదటిటెస్టులో అంతగా ఆకట్టుకోకపోవడంతో మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 29 పరుగులు చేసి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. దీంతో పంత్ మరోసారి ట్రోల్స్ బారీన పడ్డాడు. అయితే వీటిని పట్టించుకోని బీసీసీఐ మూడో టెస్టులోనూ పంత్ను ఆడించింది. చదవండి: ఆసీస్తో సిరీస్ : అసలైన హీరో అతనే కాగా మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 36 పరుగులు చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం 97 పరుగులతో అదరగొట్టాడు. ఆసీస్ విధించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంత్ పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ ఉన్నంతవరకు మ్యాచ్ టీమిండియావైపై మొగ్గుచూపింది. అయితే అనూహ్యంగా 97 పరుగులు చేసిన పంత్ అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకోవడం.. ఆ తర్వాత అశ్విన్, విహారిలు ఓపికతో ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా మ్యాచ్ను డ్రా చేసుకుంది. అయితే గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం పంత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకుండా చివరిదాకా నిలిచి మ్యాచ్ను గెలిపించాడు. కాగా పంత్ టీమిండియా తరపున 16 టెస్టులు, 16 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.చదవండి: పాపం లాంగర్.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది -
విరాట్ కోహ్లి ఈజ్ బ్యాక్!
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్కు జాతీయ సెలెక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం భారత జట్టును ప్రకటించింది. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం భారత్కు వచ్చిన విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇషాంత్, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చారు. ఇక బ్రిస్బేన్ టెస్టులో అదరగొట్టిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. దాంతోపాటు స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ అవకాశం లభించింది. నాలుగు గెస్టుల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు చెన్నైలో ప్రారంభమవుతుంది. తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఇది... భారత జట్టు: విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. (చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం) -
ఆసీస్ టూర్: సిరాజ్ నుంచి సుందర్ దాకా
అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించరు.. అదే అద్భుతం జరిగిన తర్వాత దానిని ఎవరూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు అంటారు. నిజమే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే, బీసీసీఐ నమ్మకాన్ని నిలబెడుతూ సత్తా చాటారు. ఎన్నో అవాంతరాలు దాటి సంప్రదాయ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఆ ఆటగాళ్ల నేపథ్యం, ఈ సిరీస్లో నమోదు చేసిన గణాంకాలు పరిశీలిద్దాం. శభాష్ సిరాజ్.. హైదరాబాదీ బౌలర్. అతిసాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి ఆటోడ్రైవర్. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ మెరుగ్గా రాణించిన సిరాజ్.. ఆసీస్ సిరీస్తో జరిగే సుదీర్ఘ సిరీస్కు ఎంపికయ్యాడు. టూర్లో ఉండగానే అతడి తండ్రి మరణించినా.. ఆయన కలను నెరవేర్చాలనే ఆశయంతో జట్టుతోనే ఉండిపోయాడు. రెండో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. బాక్సింగ్ డే టెస్టుతో పాటు గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో మొత్తంగా 73 పరుగులు ఇచ్చిన హైదరాబాదీ, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్స్మిత్లను పెవిలియన్కు చేర్చాడు. వీరితో పాటు హాజల్వుడ్, స్టార్క్ను అవుట్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. (చదవండి: 36 పరుగులకు ఆలౌట్.. కానీ ఇప్పుడు ) రూ. 300 కోసం మ్యాచ్లు ఆడి.. హర్యానాలోని కర్నాల్లో జన్మించాడు. రైట్ ఆర్మ్ మీడియం బౌలర్. అతడి తండ్రి డ్రైవర్గా పనిచేస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన సైనీ.. క్రికెట్లో శిక్షణ తీసుకునేందుకు సరిపడా డబ్బు లేక ఇబ్బందులు పడ్డాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడుతూ వాటి ద్వారా వచ్చే 300 రూపాయలతో అవసరాలు తీర్చుకునేవాడు. 2019లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సైనీ వన్డేల్లో రంగప్రవేశం చేశాడు. ఇక సీనియర్ పేసర్ ఉమేశ్ గాయపడటంతో సిడ్నీ టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. ఈ టెస్టు సిరీస్లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్కు కలిసొచ్చిన టూర్ తమిళనాడులోని చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో జన్మించాడు. నిరుపేద కుటుంబం అతడిది. నటరాజన్ అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్తోనే ప్రాక్టీసు చేశాడు. ఈ క్రమంలో 2015లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్పై విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్ల సలహాలు నటరాజన్కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలతో బౌలింగ్ యాక్షన్లో మార్పులు చేసుకుని సత్తా చాటాడు. 2016 తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చిన నటరాజన్ యార్కర్లు సంధించే విధానంతో ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఆసీస్ టూర్కు నెట్బౌలర్గా ఎంపికైన నటరాజన్ మనుకా ఓవల్ మైదానంలో ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఆ తర్వాత టీ20, గబ్బా మ్యాచ్ ద్వారా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీశాడు. సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్, గిల్ తండ్రి సుందర్కు క్రికెట్ అంటే మక్కువ. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ వాషింగ్టన్ అనే వ్యక్తి ఆయనకు అండగా నిలబడ్డాడు. ప్రోత్సాహం అందించాడు. ఈ క్రమంలో స్థానికంగా సుందర్ మంచి పేరు సంపాదించారు. అయితే తన రెండో కొడుకు జన్మించే కొన్నిరోజుల ముందు వాషింగ్టన్ మరణించడంతో ఆయన జ్ఞాపకార్థం, వాషింగ్టన్ సుందర్గా తనకు నామకరణం చేశారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్తో వన్డేల్లో ప్రవేశించాడు. గబ్బా టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సుందర్.. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక వన్డేల్లో ఒకటి, టీ20ల్లో 21 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక సిరాజ్, సైనీ, నటరాజన్, సుందర్తో పాటు శుభ్మన్ గిల్ కూడా ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 259 పరుగులతో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. -
పాపం లాంగర్.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది
బ్రిస్బేన్: గబ్బా వేదికగా ఆసీస్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ విధించిన 328 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కూడా టీమిండియాను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా) 'ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈరోజు భారత ఆటతీరు ఔట్ స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఈ ఓటమితో మాకు గుణపాఠం కలిగింది. 150 కోట్ల మంది బలమున్న టీమిండియాను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదనేది ఈరోజే తెలిసొచ్చింది. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలోనూ టీమిండియా అద్బుత ప్రదర్శనతో 2-1 తేడాతో సిరీస్ను ఎగురేసుకుపోయింది. ఏది ఏమైనా ఇండియా-ఆసీస్ టెస్టు సిరీస్ మాత్రం మరుపురానిదిగా నిలిచిందనడంలో సందేహం లేదు.. మ్యాచ్ల్లో గెలుపోటములు అనేవి సహజం.. ఈ విజయంతో టెస్టు క్రికెట్కున్న విలువేంటో మరోసారి కనిపించింది. (చారిత్రాత్మక విజయం : నీతా అంబానీ ప్రశంసలు ) రిషబ్ పంత్ లాంటి ఆటగాడు టీమిండియాకు దొరకడం అదృష్టం.. అసలు ఏ మాత్రం భయం అనేది లేకుండా పంత్ సాగించిన ఇన్నింగ్స్ చూస్తే.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ హెడ్డింగేలో ఆడిన ఇన్నింగ్స్ను గుర్తుకు తెచ్చకునేలా చేసింది. శుబ్మన్ గిల్ కూడా మంచి బ్యాటింగ్ కనబరిచాడు. కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడిన గిల్కు టెస్టు క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉంది.'అని చెప్పుకొచ్చాడు. లాంగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీమిండియా మ్యాచ్ గెలిచాకా లాంగర్కు విషయం అర్థమయినట్లుంది అంటూ కామెంట్స్ జతచేశారు. 🗣 "Pant's innings reminded me a bit of Ben Stokes at Headingley actually. 🗣 "You can never take anything for granted. Never ever underestimate the Indians." - Justin Langer talks to @haydostweets about the series #AUSvIND pic.twitter.com/lnbnjqWjmg — 7Cricket (@7Cricket) January 19, 2021 -
32 ఏళ్ల జైత్రయాత్రకు టీమిండియా చెక్
బ్రిస్బేన్: గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడం ద్వారా 32 ఏళ్ల రికార్డును తిరగరాసింది. సాధారణంగానే గబ్బా మైదానం అంటేనే ఆసీస్కు బాగా కలిసొచ్చిన వేదిక.. 32 ఏళ్లుగా అక్కడ ఆడిన ఒక్క టెస్టులోనూ ఆసీస్ ఓడిపోలేదు. తాజాగా టీమిండియా గబ్బాలో విజయం సాధించడం ద్వారా ఆసీస్ 32 ఏళ్ల జైత్రయాత్రకు తెరదించింది. గబ్బాలో ఆసీస్ ఇప్పటివరకు 55 టెస్టులు ఆడగా.. 33 మ్యాచుల్లో విజయం సాధించింది. 13 టెస్టులను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇక 1988లో వివ్ రిచర్డ్స్ నేతృత్వంలోని వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో పరాజయం తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆసీస్ ఓడిపోలేదు. (చదవండి: అద్భుత విజయం: బీసీసీఐ భారీ నజరానా) అంతేగాక టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడు వందలకుపైగా స్కోర్లు చేజ్ చేసి గెలవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. ఇంతకముందు 1975-76లో విండీస్పై 406 పరుగులు చేధించగా.. 2008-09 సీజన్లో ఇంగ్లండ్పై 387 పరుగులు.. తాజాగా గబ్బాలో ఆసీస్పై 329 పరుగుల లక్ష్యం చేధించి కొత్త రికార్డు సృష్టించింది. అందులోనూ ఆసీస్కు బాగా కలిసొచ్చిన గబ్బా వేదికలో ఇంత భారీ స్కోరు ఛేదించడం అనేది టీమిండియాకు ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 2018-19 సీజన్లో ఆసీస్పై 2-1 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా.. 2020-21లోనూ మరోసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై వరుసగా రెండోసారి సిరీస్ను సాధించి బోర్డర్ గవాస్కర్ ట్రోపీని అట్టిపెట్టుకోవడం మరో రికార్డుగా చెప్పవచ్చు. ఆసీస్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టాప్ 5 టీమిండియా ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే.. బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ : 13 వికెట్లు( 3 టెస్టులు) ఆర్ అశ్విన్ : 12 వికెట్లు( 3 టెస్టులు) జస్ప్రీత్ బుమ్రా : 11 వికెట్లు(3 టెస్టులు) రవీంద్ర జడేజా : 7 వికెట్లు(2 టెస్టులు) శార్థూల్ ఠాకూర్ : 7 వికెట్లు(1 టెస్టు) బ్యాటింగ్: రిషబ్ పంత్ : 274 పరుగులు(5 ఇన్నింగ్స్లు) శుబ్మన్ గిల్ : 259 పరుగులు(6 ఇన్నింగ్స్లు) పుజారా : 271 పరుగులు(8 ఇన్నింగ్స్లు) అజింక్యా రహానే : 268 పరుగులు(8 ఇన్నింగ్స్లు) రోహిత్ శర్మ : 129 పరుగులు(4 ఇన్నింగ్స్లు) -
36 పరుగులకు ఆలౌట్.. కానీ ఇప్పుడు
బ్రిస్బేన్: ఒక ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌట్.. 96 ఏళ్ల తర్వాత ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ దాటలేక చతికిలపడ్డారన్న అపఖ్యాతి.. టీమిండియా రన్ మెషీన్, టెస్టుల్లో చారిత్రక విజయాలు సాధించిపెట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలో మునుపెన్నడూ లేనటువంటి ఘోర ఓటమి.. పింక్ బాల్ టెస్టు (రెండో ఇన్నింగ్స్)లో టీమిండియాకు ఎదురైన చేదు అనుభవాలు.. తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయినందుకు విమర్శలు.. పైగా ఈ మ్యాచ్ తర్వాత పితృత్వ సెలవుపై కోహ్లి స్వదేశానికి రావడంతో ఇక భారత్పై మరింత ఒత్తిడి పెరుగుతుంది.. కెప్టెన్తో పాటు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి జట్టుకు దూరం కావడంతో సిరీస్పై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దనే కామెంట్లు వినిపించాయి. కానీ బాక్సింగ్ డే టెస్టు నాటికి సీన్ మారింది. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ వంటి ముఖ్యమైన ఆటగాళ్లు దూరమైనప్పటికీ అజింక్య రహానే సారథ్యంలోని జట్టు సమిష్టి కృషితో ఆసీస్ను మట్టికరిపించింది. అడిలైడ్ టెస్టు పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్(ఐదు వికెట్లు) , బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ 80(45+35) అద్భుత ఇన్నింగ్స్తో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది.(చదవండి: సంచలన విజయం: నంబర్ 1గా టీమిండియా) అయితే సిడ్నీ టెస్టు నాటికి టీమిండియాను గాయాల బెడద ఎక్కువైంది. పేసర్ ఉమేశ్ యాదవ్ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో నవదీప్ సైనీ సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆసీస్ అరంగేట్ర ఆటగాడు పకోవ్స్కీ వికెట్ తీసి ఖాతా తెరిచిన సైనీ ఆ తర్వాత కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక మూడో టెస్టులో హనుమ విహారి స్లో ఇన్నింగ్స్కు తోడు జడేజా సూపర్ ఫీల్డింగ్, అశ్విన్ సమయోచితమైన ఇన్నింగ్స్తో ఆ మ్యాచ్ను భారత్ డ్రాగా ముగించింది. అసలు జరుగుతుందా లేదా? ఇక ఆస్ట్రేలియాలో కరోనా విజృంభణ నేపథ్యంలో చివరిదైన నాలుగు టెస్టు జరుగుతుందా లేదా అన్న అంశంపై అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే. బ్రిస్బేన్లో మరోసారి లాక్డౌన్ విధించడంతో కఠిన నిబంధనలు అమలు చేయడం, ఇందుకు భారత ఆటగాళ్లు విముఖంగా ఉన్నారంటూ స్థానిక మీడియాలో వార్తలు రావడం వంటి పరిణామాలు జరిగాయి. కొందరు ఆసీస్ మాజీ ఆటగాళ్లైతే గబ్బాలో భారత్కు మంచి రికార్డు లేదు కాబట్టే ఆడటానికి వెనుకాడుతున్నారంటూ విమర్శలు సైతం గుప్పించారు. ఇలాంటి తరుణంలో బ్రిస్డేన్లో ఆతిథ్య జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని భారత్ అనూహ్య రీతిలో ఛేదించింది. బుమ్రా, జడేజా, అశ్విన్ వంటి సీనియర్ల గైర్హాజరీలో సిరాజ్, శార్దూల్ ఆసీస్ బ్యాట్స్మెన్ ఆటకట్టించగా.. రిషభ్ పంత్ దూకుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్ తోడవడంతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తద్వారా 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆసీస్కు గట్టి షాకిచ్చి చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. అదరగొట్టిన అరంగేట్ర ఆటగాళ్లు ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్ (మెల్బోర్న్), నవదీప్ సైనీ (సిడ్నీ), వాషింగ్టన్ సుందర్ (బ్రిస్బేన్), టి.నటరాజన్ (బ్రిస్బేన్) సత్తా చాటి నవతర జట్టు కూడా మరింత పటిష్టంగా ఉంటుందనే భరోసానిచ్చారు. కోహ్లి, కేఎల్ రాహుల్, షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, అశ్విన్ కీలక మ్యాచుల్లో లేకపోయినప్పటికీ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో ఈ యువ ఆటగాళ్లతో పాటు వారి నైపుణ్యాలను సక్రమంగా ఉపయోగించుకుని చారిత్రక విజయం అందించిన రహానేపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆసీస్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ క్రికెటర్లు అంతగా ఆకట్టుకోకవపోవడం.. మిచెల్ స్టార్క్, హాజల్వుడ్, కమిన్స్, లయన్ వంటి కీలక బౌలర్లు నాలుగు టెస్టులు ఆడినప్పటికీ బోర్డర్- గావస్కర్ సిరీస్ను వరుసగా రెండోసారి భారత్కు సమర్పించుకుంది. -
సంచలన విజయం: నంబర్ 1గా టీమిండియా
బ్రిస్బేన్: బోర్డర్– గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించిన భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్లో అగ్రస్థానంలో నిలిచింది. గబ్బా టెస్టులో విజయంతో 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ తర్వాత న్యూజిలాండ్ (420), ఆస్ట్రేలియా(332) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.(చదవండి: ట్రెండింగ్లో టీమిండియా) ఇక ఆసీస్తో జరిగిన నాలుగో టెస్టులో సంచలన విజయం సాధించిన టీమిండియా(117.65) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో రెండోస్థానంలో నిలిచింది. ఆసీస్(113 పాయింట్లు)ను వెనక్కి నెట్టి ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకుంది. కాగా పాకిస్తాన్తో ఇటీవల జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన న్యూజిలాండ్(118.44) ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇక నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విధించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో ఛేదించిన భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టీమిండియా కైవసమైంది. (చదవండి: చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం) చదవండి : (టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం
బ్రిస్బేన్ : ఉత్కంఠభరిత, ఉద్విగ్న క్షణాలు... హోరాహోరీ సమరాలు, అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలు... అన్ని కలగలిసిన టెస్టు సిరీస్లో అంతిమ మ్యాచ్లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్లో టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్ ఛేదించింది. రిషభ్ పంత్ దూకుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్ తోడవడంతో ఆసీస్ గడ్డపై విజయాన్ని సాధించింది. నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుని గబ్బా మైదానంలో కంగారూలను గడగడలాడించింది. తాజా విజయంతో ఆసీస్ గడ్డపై భారత్ చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, బుమ్రా, అశ్విన్ లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే పటిష్టమైన ఆసీస్ టీంపై విజయాన్ని సాధించి ఔరా అనిపించింది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించింది. (టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన) నాలుగు పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్కు రోహిత్ శర్మ ఔట్ ద్వారా ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరవాత క్రీజ్లోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్ శుభమన్ గిల్తో ఇన్సింగ్స్కు బలమైన పునాదులు వేశారు. గిల్ 91 పరుగుల వద్ద ఔట్ అవ్వగా.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. పుజారా సైతం బాధ్యతగా ఆడి 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రహానే 24 పరుగులతో వెంటనే పెవిలియన్ బాట పట్టినా.. యువ సంచలనం రిషభ్ పంత్ సూపర్భ్ ఇన్నింగ్స్తో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. పంత్ 138 బంతుల్లో 89 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించి సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా కీలకమైన చివరి మ్యాచ్లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'అంతా బాగుంది.. నోబాల్స్ జీర్ణించుకోలేకపోతున్నా'
బ్రిస్బేన్: ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన టి.నటరాజన్ తొలి సిరీస్లోనే ఆకట్టుకునే ప్రదర్శనతో అదరగొట్టాడు.మూడు మ్యాచ్లు కలిపి 6.92 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీశాడు.ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్లో మాత్రం నటరాజన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే టీమిండియా ప్రధాన బౌలర్లంతా గాయపడడంతో బ్రిస్బేన్లో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా నటరాజన్ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లు తీశాడు... కానీ నటరాజన్ విషయంలో నో బాల్స్ అంశం మాత్రం బాగా కలవరపెడుతుంది. మంచి ఫుట్వర్క్ కలిగిన నటరాజన్ ఆడిన తొలి టెస్టులోనే ఏడు నోబాల్స్ వేయడం విశేషం. టెస్టు మ్యాచ్లో నోబాల్స్ పడడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఇదే అంశంపై ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందించాడు. 'నటరాజన్ బౌలింగ్ శైలి అద్భుతంగా ఉంది.. అతను వికెట్ తీసే విధానం కూడా చాలా బాగుంది. కానీ నో బాల్స్ విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా. టెస్టుల్లో నో బాల్స్ వేయడం అరుదు.. అలాంటిది నటరాజన్ మాత్రం ఏడు నోబాల్స్ వేశాడు. దీంతోపాటు ఒక ఓవర్ ప్రారంభంలోనే మొదటి బంతి సరిగా వేయడానికి ఐదు నో బాల్స్ వేయడం కాస్త ఆశ్యర్యం వేసింది. ఆ సమయంలో నటరాజన్కు ఆ బంతులు జీర్ణించుకోవడం కాస్త కష్టంగా మారి ఉంటుంది.' అని తెలిపాడు. (చదవండి: ఆసీస్ క్రికెటర్పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) కాగా గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్కు భారీ టార్గెట్ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం 33 పరుగులతో కలిపి ఓవరాల్గా టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ (4), శుభ్మన గిల్ (0) క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా.. చెరో విజయంతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఒక టెస్టు డ్రాగా అయింది. దాంతో తాజా టెస్టు విజయం నిర్ణయాత్మకంగా మారింది.(చదవండి: రోహిత్ కావాలనే అలా చేశాడా!) -
రోహిత్ కావాలనే అలా చేశాడా!
బ్రిస్బేన్: సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ రిషబ్పంత్ గార్డ్మార్క్ను చెరిపేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. స్మిత్ చేసిన పనిపై తీవ్ర విమర్శలు వచ్చినా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, కోచ్ లాంగర్ సహా ఇతర ఆటగాళ్లు స్మిత్ చేసింది తప్పు కాదంటూ సమర్థించుకోవడం విశేషం. తాజాగా బ్రిస్బేన్ టెస్ట్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ స్మిత్ను అనుకరించాడు. ఆసీసీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవర్ ముగియడంతో స్మిత్ లబుషేన్తో చర్చిస్తున్నాడు. ఇంతలో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ స్మిత్ చూస్తుండగానే షాడో బ్యాటింగ్ చేశాడు. అయితే స్మిత్ లాగా అతని బ్యాటింగ్ గార్డ్ను మాత్రం చెరిపేయలేదు. రోహిత్ కావాలనే స్మిత్ ముందు అలా చేసినట్లు వీడియోలో తెలుస్తుంది. అయితే స్మిత్ మాత్రం రోహిత్ టీజ్ చేస్తున్నట్లుగా గ్రహించి వెంటనే తల కిందకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే సమయంలో కామెంటరీ బాక్స్లో ఉన్న సంజయ్ మంజ్రేకర్ మాత్రం.. అప్పుడు స్మిత్ చేసింది తప్పయితే.. ఇది కూడా తప్పే అనడం విశేషం.(చదవండి:ఈ రికార్డులు చూస్తే తెలుస్తుంది గబ్బా కథ!) ఈ టెస్టు సిరీస్ ఆరంభం నుంచి భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య స్లెడ్జింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులో స్వయానా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ కూడా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను టార్గెట్ చేస్తూ స్లెడ్జింగ్కు దిగడం పెద్ద వివాదాస్పదమయింది. దీనిపై పైన్ క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. కాగా నాలుగో టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 294 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ముందు 326 లక్ష్యం నిలిచింది. కాగా ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ కోల్పోకుండా నాలుగు పరుగులు చేసింది. రోహిత్ 4, గిల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. Rohit doing a Steve Smith 😛😂😂@ImRo45#INDvsAUSTest #IndiavsAustralia #AUSvsIND #RohitSharma pic.twitter.com/W1t1GiyCLG — D s 45 (@imDs45) January 18, 2021 -
ఈ రికార్డులు చూస్తే తెలుస్తుంది గబ్బా కథ!
బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత్ ముందు ఆసీస్ గట్టి సవాల్ విసిరింది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆదిక్యంతో కలిపి ఓవరాల్గా 328 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు టీమిండియా ముందుంచింది. అయితే, ఇంకా ఒకరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటం.. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇప్పుడు రహానే సేన ముందున్న పరీక్ష. తొలి ఇన్నింగ్స్లో టాప్, మిడిల్ ఆర్డర్ విఫలమైనా లోయర్ మిడిల్ ఆర్డర్ రాణించడంతో భారత్ పోటీలో ఉంది. లేదంటే ఇప్పుడున్న టార్గెట్ కంటే మరో సెంచరీ పరుగుల లక్ష్యం మన ముందుండేది. వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), శార్దూల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్స్లు) ఇద్దరూ ఏడో వికెట్కు విలువైన 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులు చేసి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 369. (చదవండి: కీలక వికెట్లు కూల్చిన సిరాజ్.. బుమ్రా ఆలింగనం) ఛేదిస్తే రికార్డేగబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డు ఉంది. ఆ స్డేడియంలో ఆసీస్ 55 టెస్టులు ఆడగా.. 33 మ్యాచుల్లో విజయం సాధించింది. 13 టెస్టులను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇక 1988లో వెస్టిండీస్తో పరాజయం తర్వాత ఇప్పటివరకు అక్కడ ఒక్క టెస్టులో కూడా ఆసీస్ ఓడిపోలేదు. మరోవైపు గబ్బాలో ఇప్పటివరకు అత్యధిక ఛేజింగ్ స్కోరు 236 కావడం గమనార్హం. 1951/52 లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఆతిథ్య ఆసీస్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అనంతరం 1975/76 లో మళ్లీ వెస్టండీస్ పైన ఆస్ట్రేలియా 219 టార్గెట్ ఛేదించింది.1982/83 లో ఇంగ్లండ్పై ఆసీస్ 188 పరుగుల్ని ఛేదించింది. 1978/79లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై గెలుపొందింది. 2017/18లో ఆసీస్ 170 పరగుల టార్గెట్ ఛేదించి ఇంగ్లండ్పై గెలిచింది. ఈ రికార్డులను పరిశీలిస్తే భారత్ భారీగా పరుగులు సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. సిడ్నీ టెస్టు మాదిరిగా డ్రాగా దిశగా సాగినా ఈ పరిస్థితుల్లో భారత్కు అది విజయంతో సమానం!! (చదవండి: ఆసీస్ ఆలౌట్, భారత్కు భారీ టార్గెట్) -
సూపర్ సిరాజ్.. బుమ్రా ఆత్మీయ ఆలింగనం
బ్రిస్బేన్: టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెరీర్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన అతడి ప్రతిభను క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు. స్థానిక గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 294 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. 21/0 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కాగా ఈ ఇన్నింగ్స్లో సిరాజ్ కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 73 పరుగులు ఇచ్చిన హైదరాబాదీ, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్స్మిత్లను పెవిలియన్కు చేర్చాడు. వీరితో పాటు హాజల్వుడ్, స్టార్క్ను అవుట్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందుకు తోడు శార్దూల్ ఠాకూర్ (4), వాషింగ్టన్ సుందర్(1) మెరుగ్గా రాణించడంతో ఆతిథ్య జట్టును కట్టడి చేయగలిగారు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్ల నుంచి సిరాజ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, ప్రశంసిస్తున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ‘‘తొలిసారి ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్కు స్టాండింగ్ ఓవియేషన్’’ అంటూ ట్వీట్ చేసింది. కాగా సిరాజ్ ఆసీస్ టూర్లో ఉన్న సమయంలోనే అతడి తండ్రి మొహమ్మద్ గౌస్ (53)మరణించిన విషయం విదితమే.(చదవండి: ఆసీస్ ఆలౌట్, భారత్కు భారీ టార్గెట్) ఈ క్రమంలో బీసీసీఐ అతడికి స్వదేశానికి వెళ్లే అవకాశం కల్పించినప్పటికీ సంప్రదాయ క్రికెట్ ఆడాలన్న తన తండ్రి కలను నెరవర్చేందుకు అతడు అక్కడే ఉండిపోయాడు. ఇక టీమిండియా స్టార్ బౌలర్లు ఇషాంత్ శర్మ మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గైర్హాజరీ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ఈ యువ పేసర్ మెరుగ్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రేక్షకులు పలుమార్లు జాతి వివక్ష వ్యాఖ్యలతో అతడిని కించపరిచినప్పటికీ, ఆత్మవిశ్వాసం చెదరనీయకుండా బంతితో సత్తా చాటుతూ అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. A standing ovation as Mohammed Siraj picks up his maiden 5-wicket haul.#AUSvIND #TeamIndia pic.twitter.com/e0IaVJ3uA8 — BCCI (@BCCI) January 18, 2021 -
ఆసీస్ ఆలౌట్, భారత్కు భారీ టార్గెట్
బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్కు భారీ టార్గెట్ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం 33 పరుగులతో కలిపి ఓవరాల్గా టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 21/0 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుని కెరీర్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. శార్దూల్ ఠాకూర్ 4, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ ఓపెనర్లు మార్కస్ హేరిస్ (38) డేవిడ్ వార్నర్ (48) రాణించారు. వారికితోడు స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్ (37) కూడా పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించింది. ఇక టీ విరామానికి ముందు కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు మరోసారి అడ్డుతగిలాడు. దీంతో మూడో సెషన్లో ఆట నిలిచిపోయింది. రోహిత్ శర్మ (4), శుభ్మన గిల్ (0) క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా.. చెరో విజయంతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఒక టెస్టు డ్రాగా అయింది. దాంతో తాజా టెస్టు విజయం నిర్ణయాత్మకంగా మారింది. (చదవండి: గదుల్లో ఎలుకలు, నాణ్యతలేని ఆహారం) -
తొలి సెషన్లో ఆసీస్ 4 వికెట్లు ఖతం
బ్రిస్బేన్: గబ్బా టెస్టులో టీమిండియా బౌలర్లు మరోమారు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఓవర్నైట్ స్కోర్ 21/0తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఆసీస్ కీలక ఆటగాళ్లను తొలి సెషన్లో పెవిలియన్కు పంపారు. డేవిడ్ వార్నర్ (48), మార్కస్ హేరిస్ (38), మార్నస్ లబుషేన్(25), మాథ్యూ వేడ్ (డకౌట్) వికెట్లను తీశారు.మహ్మద్ సిరాజ్ రెండు, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా 149/4 తో ఉంది. క్రీజులో స్టీవెన్ స్మిత్(28), గ్రీన్(4) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 33 పరుగుల ఆధిక్యంతో ఓవరాల్గా ఆసీస్ 182 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 369 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 336 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. వారిద్దరూ ఏడో వికెట్కు అమూల్యమైన 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. (చదవండి: సుందరం శార్దూలం...) -
శార్దూల్, వషీ జబర్దస్త్; గతం గుర్తు చేసుకున్న సెహ్వాగ్
బ్రిస్బేన్: కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమై తుది జట్టుకు సరిపడా 11 మంది ఉంటే చాలుననే పరిస్థితుల నడుమ టీమిండియా వారిపై నమ్మకముంచింది. బాగా ఆడండి అని బెస్టాఫ్ లక్ చెప్పింది. ఆ నమ్మకాన్ని నిజం చేశారు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్. ముగ్గురికీ పెద్దగా అనుభవం లేకపోయినా బౌలింగ్ విభాగంలో తలో మూడు వికెట్లు తీసి ఆకట్టుకోగా.. బ్యాటింగ్ లోనూ శార్దూల్, సుందర్ మేటి ఆట ఆడారు. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని క్లిష్ట సమయంలో అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. బ్రిస్బేన్లో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో ఈ ఇద్దరూ ఏడో వికెట్కు విలువైన 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. (చదవండి: వీరాభిమాని నం.1) ఏడో వికెట్గా శార్దూల్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్స్లు) ఔటైన అనంతరం టీమిండియా బ్యాటింగ్ ఎంతోసేపు కొనసాగలేదు. ఆ వెంటనే నవదీప్ సైనీ (5), సుందర్ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), సిరాజ్ (13) పెవిలియన్ చేరారు. నటరాజన్ 1 పరుగుతో నాటౌట్గా నిలిచాడు. హేజిల్వుడ్ 5 వికెట్లతో టీమిండియాను దెబ్బ తీశాడు. స్టార్క్, కమినన్స్ చెరో రెండు వికెట్లు, లైయన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. మార్కస్ హేరిస్ (1), డేవిడ్ వార్నర్ (20) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 33 పరుగుల ఆదిక్యంతో ఆసీస్ ప్రస్తుతం 54 పరుగుల లీడింగ్లో ఉంది. ఇక శార్దూల్, సుందర్ పోరాటపటిమపై అటు మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు, ఇటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్న అసలైన ఆటగాళ్లు అని అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అడిలైడ్ టెస్టును గుర్తు చేసుకున్న వీరూ 186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన దశలో శార్దూల్, వషీ గుర్తుండిపోయే భాగస్వామ్యాన్ని నెలకొల్పారని టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్లో పేర్కొన్నాడు. 2003లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు గుర్తొస్తుందని చెప్పాడు. అప్పుడు కూడా భారత్ తొలి ఇన్నింగ్స్లో 33 పరుగుల వెనుకబడి ఉందని, తాజా గబ్బా టెస్టులోనూ అదే జరిగిందని అన్నాడు. 133 పరుగుల ఆదిక్యం లభిస్తుందని భావించిన ఆసీస్కు శార్దూల్, వషీ పోరాటంతో 33 పరుగులు మాత్ర దక్కాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆసీస్ నలుగురు బౌలర్లకు 1000 వికెట్లు తీసిన అనుభవం ఉండగా.. గబ్బా టెస్టులో టీమిండియా ఐదుగురు బౌలర్లకు 11 వికెట్లు తీసిన అనుభవమే ఉన్నా వారి అద్భుత ఆటతీరు జబర్దస్త్గా ఉందని పేర్కొన్నాడు. కాగా, 2003 నాటి అడిలైడ్ టెస్టులో భారత్ విజయం విజయం సాధించడం గమనార్హం. (చదవండి: నేను ఇలాగే ఆడతా : రోహిత్ శర్మ) Adelaide 2003 : India conceded a lead of 33. Today in Brisbane India concede 33 , when at one stage it looked like they may end up conceding 133. Great effort considering that Australia’s 4 bowlers had more than 1000 Test wickets to India’s 5 bowlers having 11. Shandar Zabardast — Virender Sehwag (@virendersehwag) January 17, 2021 -
ఏమాత్రం బాధ్యత లేని రోహిత్!
బ్రిస్బేన్: నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 62 పరుగులకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ 74 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి గిల్ ఔట్ కాగా, లయన్ వేసిన 20 ఓవర్ ఐదో బంతికి రోహిత్ పెవిలియన్ చేరాడు. అయితే, సులభమైన క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటైన తీరు అటు క్రికెట్ అభిమానులతో పాటు, క్రీడా విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. లయన్ వేసిన ఫ్లైట్ బంతిని మిడాన్ వైపునకు రోహిత్ షాట్ ఆడాడు. లాంగాన్లో ఉన్న స్టార్క్ కాస్త ముందుకు కదిలి దాన్ని ఒడిసిపట్టాడు. ఈక్రమంలో రోహిత్ షాట్ సెలక్షన్ అస్సలు బాగోలేదని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. (చదవండి: నటరాజన్ అరుదైన ఘనత) ‘చానెల్ 7 క్రికెట్’ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆయన హిట్మ్యాన్కు బాధ్యత లేదా అని ప్రశ్నించాడు. లాంగాన్లో, స్క్వేర్ లెగ్లో ఫీల్డర్లు ఉన్నప్పుడు అలాంటి షాట్ ఆడాలని ఎలా అనుకున్నావ్ అని వాపోయాడు. అంతకుముందు లైయన్ బౌలింగ్లో ఫోర్లు బాదిన రోహిత్.. అంతటి రాంగ్ షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదని గావస్కర్ తన కామెంటరీలో చెప్పుకొచ్చాడు. ఒక సీనియర్ అయి ఉండి అనవరసంగా వికెట్ సమర్పించుకున్నాడని వ్యాఖ్యానించాడు. కాగా, 274/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్ర బౌలర్లు నటరాజన్, సుందర్ తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు. సిరాస్ ఒక వికెట్, మరో బౌలర్ శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. చతేశ్వర్ పుజారా (8), కెప్టెన్ అజింక్యా రహానే (2) క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 307 పరుగుల వెనకబడి ఉంది. (చదవండి: హార్దిక్ పాండ్యా తండ్రి కన్నుమూత) Nathan Lyon's 397th Test wicket seemed to come out of nowhere and the Aussies were pumped! #OhWhatAFeeling #AUSvIND | @Toyota_Aus pic.twitter.com/rIhl4ZjbTu — cricket.com.au (@cricketcomau) January 16, 2021 -
రోహిత్ను బంతితో కొట్టిన పృథ్వీ షా!
బ్రిస్బేన్: పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లు ఏదైనా పొరపాటు చేసినట్టు తెలిస్తే చాలు ట్రోలింగ్ మొదలవుతుంది. ఐపీఎల్- 2020, ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతగా రాణించని పృథ్వీ షా కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో అతను తుది జట్టులో లేకపోయినప్పటికీ ట్రోలింగ్ బారినపడ్డాడు. తాజా టెస్టులో గజ్జల్లో గాయం కారణంగా నవదీప్ సైనీ అర్ధాంతరంగా మైదానాన్ని వీడక తప్పలేదు. దాంతో అతని స్థానంలో షా ఫీల్డింగ్కు వచ్చాడు. షా ఇన్నర్ లైన్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. బ్యాట్స్మన్ బాదిన ఓ బంతి అతని వైపునకు వచ్చింది. దాన్ని అడ్డుకుని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపునకు షా బంతిని బలంగా త్రో విసిరాడు. అయితే, అది కాస్తా మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మను తాకింది. ఊహించని బంతితో రోహిత్ ఒకింత కలవరానికి గురయ్యాడు. అయినప్పటికీ ఏమీ మాట్లాడకుండా బంతిని బౌలర్కు అందించాడు. (చదవండి: మారని తీరు: సిరాజ్పై మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు) ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో.. ‘ఫ్రెండ్లీ ఫైర్’ అంటూ షేర్ చేసింది. దాంతో షాపై ట్రోలింగ్ షురూ అయింది. నువ్ కావాలనే చేశావ్. రోహిత్ గాయపడితే జట్టులోకి వద్దామని ఇదంతా ప్లాన్ అని కొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ ఊరుకున్నా. మేము ఊరుకోం. నువ్ టీమ్లోకి అవసరం లేదు అని ఫన్నీ మీమ్స్తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇక టెస్టు సిరీస్ విషయానికొస్తే ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు మెరుగైన స్థానంలో నిలిచింది. 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మెన్లలో లబూషేన్ (108) రాణించాడు. స్టీవ్ స్మిత్ (36), మాథ్యూవేడ్(45) ఫరవాలేదనిపించారు. కామెరూన్ గ్రీన్ (28), కెప్టెన్ టిమ్ పైన్ (38) క్రీజులో ఉన్నారు. అరంగేట్ర బౌలర్ నటరాజన్ 2, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్సుందర్, సిరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. (చదవండి: ధోని నుంచి కోహ్లి వరకు.. సేమ్ టు సేమ్) ⚠ Friendly fire ⚠ Live #AUSvIND: https://t.co/IzttOVtrUu pic.twitter.com/8naJ3ykMe7 — cricket.com.au (@cricketcomau) January 15, 2021 -
మారని తీరు: సిరాజ్పై మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు
బ్రిస్బేన్: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్పై కొందరు ఆస్ట్రేలియా ప్రేక్షకులు మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో జరగుతున్న నాలుగో టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా, దాంతోపాటు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా, సిడ్నీ టెస్టులో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్, బుమ్రాపై సైతం ఆస్ట్రేలియన్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకున్నామని తెలిపింది. కామెంట్ చేసిన వారిని గుర్తించి స్టేడియం నుంచి బయటకు గెంటేశామని పేర్కొంది. వారిని పోలీసులకు అప్పగిస్తామని కూడా సీఏ హామి ఇచ్చింది. వారం గడవక ముందే మళ్లీ అదే తరహా ఉదంతం వెలుగు చూడటంతో టీమిండియా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించనుంది. (చదవండి: పంత్ మొత్తుకున్నా నమ్మలేదు..) ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు మెరుగైన స్థానంలో నిలిచింది. ఐదు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), మార్కస్ హ్యారిస్ (5).. 17 పరుగులకే ఔటైనా లబూషేన్తో కలిసి మూడో టెస్టు సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. జట్టు స్కోరు 87 పరుగుల వద్ద స్మిత్ రూపంలో భారత్కు భారీ వికెట్ లభించింది. అయితే, మాథ్యూ వేడ్తో కలిసి లబూషేన్ (204 బంతుల్లో 108; 9 ఫోర్లు) టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. మూడో సెషన్లో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో రహానే సేన ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్ (28), కెప్టెన్ పైన్ (38) క్రీజులో ఉన్నారు. అరంగేట్ర బౌలర్ నటరాజన్ 2, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్సుందర్, సిరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. (చదవండి: లైఫ్ ఇచ్చారు.. మూల్యం చెల్లించుకున్నారు!) Mohammed Siraj was labelled a “bloody grub” by members of the Gabba crowd less than a week after the abuse allegations which marred the Sydney Test Full story 👇https://t.co/gQtnhwbxMq#AUSvIND pic.twitter.com/QI1tfjRl9z — Sam Phillips (@samphillips06) January 15, 2021 -
పాపం పకోవ్స్కీ.. మళ్లీ ఔట్!
ఏ ముహుర్తానా ఆసీస్- భారత్ల మధ్య సిరీస్ ప్రారంభమైందో తెలియదుగాని ఆది నుంచి చూసుకుంటే ఇరు జట్లలో ఎవరు ఒక ఆటగాడు గాయపడుతూనే వస్తున్నారు. ఇప్పటికే టీమిండియా నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవగా.. అటు ఆసీస్లోనూ గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియన్ యువ ఓపెనర్ విల్ పకోవ్స్కీ గాయపడిన సంగతి తెలిసిందే. విల్ పకోవ్స్కీ.. టెక్నిక్గా చూస్తే మంచి ప్రతిభావంతుడు. కానీ చిన్నప్పటి నుంచి గాయాలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. టీమిండియాతో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 64, 8 పరుగులు చేశాడు. (చదవండి: ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ.. తొలి మ్యాచ్లోనే) అయితే సిడ్నీ టెస్టులో ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ సమయంలో పకోవ్స్కీ డైవ్ చేయగా అతని భుజానికి బలమైన గాయమైంది. అతని భుజం ఎముక పాక్షికంగా పక్కకు జరగడంతో నొప్పితో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. దీంతో అతను ఇరు జట్లకు కీలకంగా మారిన బ్రిస్బేన్ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు అతని ఫిట్నెస్ను పరీక్షించి నాలుగో టెస్టుకు ఎంపిక చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఏ తెలిపింది. కాగా జనవరి 15 నుంచి టీమిండియా- ఆసీస్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది.(చదవండి: 'ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధం') -
'ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధం'
సిడ్నీ: ఆసీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాలపాలవుతున్న సంగతి తెలిసిందే. గాయాలతో ఇప్పటికే మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్లు దూరమవగా.. తాజాగా జరిగిన మూడో టెస్టులో రవీంద్ర జడేజా, హనుమ విహారీలు కూడా గాయపడడం.. చివరకు టీమిండియా ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా కూడా గాయంతో నాలుగో టెస్టుకు దూరం కావడంతో సగం జట్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ సిరీస్లో గాయపడిన ఆరుగురు ఆటగాళ్ల ఫోటోలను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ పెట్టాడు.(చదవండి: మీ ఆటకు ఫిదా.. అవేవి మిమ్మల్ని ఆపలేదు) 'ఆసీస్ సిరీస్లో టీమిండియా గాయాలతో సతమతమవడం నేను చూడలేకపోతున్నా. షమీ, ఉమేశ్, రాహుల్, జడేజా, విహారి, బుమ్రా ఇలా ఒకరి తర్వాత ఒకరు గాయపడడంతో సగం జట్టు ఖాళీ అయింది. ఒకవేళ 11 మందిలో ఇంకా ఎవరు ఫిట్గా లేకున్నా వారి స్థానంలో నేను ఆడేందుకు సిద్ధంగా ఉన్నా..ఇప్పుడే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్దం.. కానీ బీసీసీఐ నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందేమో' అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు.(చదవండి: బుమ్రా ఔట్.. డైలమాలో టీమిండియా) మరోవైపు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసీస్తో జరగనున్న నాలుగో టెస్టుకు దూరమైనట్లు మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. పొత్తి కడుపు నొప్పి కారణంగా బుమ్రా సిరీస్లో మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్కు దూరమయ్యాడు. దాంతో భారత క్రికెట్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతుంది. పేస్కు అనుకూలించే పిచ్పై బుమ్రా ఆడకపోవడం జట్టును కలవరపరుస్తోంది. ఒకవైపు టీమిండియా డైలమాలో ఉన్నా సైనీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్లు కూడా పేస్ బౌలింగ్లో ఇప్పటికే నిరూపించుకోవడంతో కాస్త ధైర్యంగా ఉంది. జడేజా స్థానంలో శార్దూల్ ఠాకూర్, బుమ్రా స్థానంలో నటరాజన్లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. బుమ్రా గైర్హాజరీలో సైనీ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. కాగా ఇరుజట్ల మధ్య జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. Itne sab players injured hain , 11 na ho rahe hon toh Australia jaane ko taiyaar hoon, quarantine dekh lenge @BCCI pic.twitter.com/WPTONwUbvj — Virender Sehwag (@virendersehwag) January 12, 2021 -
ఆంక్షల్లో సడలింపులివ్వండి
న్యూఢిల్లీ: భారత్–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో చర్చనీయాంశంగా నిలుస్తోన్న బ్రిస్బేన్ టెస్టు క్వారంటైన్ నిబంధనల్ని సడలించాలని పేర్కొంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు లేఖ రాసింది. పర్యటన ప్రారంభంలోనే టీమిండియా కఠిన ఐసోలేషన్ను పూర్తి చేసుకున్నందున మళ్లీ నాలుగో టెస్టు కోసం బ్రిస్బేన్లో నిర్బంధంలో ఉండటం కష్టమని లేఖలో స్పష్టం చేసింది. సిరీస్ కోసం ఇరు బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందంలోనూ రెండు వేర్వేరు నగరాల్లో భారత జట్టు రెండుసార్లు కఠిన ఐసోలేషన్ పాటిస్తుందని ఎక్కడా పేర్కొనలేదని గుర్తు చేసింది. ఈనెల 15నుంచి బ్రిస్బేన్లో నాలుగో టెస్టు జరగనుంది. బ్రిస్బేన్ ఉన్న క్వీన్స్లాండ్ రాష్ట్రం కరోనా కట్టడి నిబంధనల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం కేవలం వారి గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే యూఏఈలో ఐపీఎల్ ముగించుకొని ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు అప్పుడే సిడ్నీలో ఈ తరహా కఠిన క్వారంటైన్ను పాటించింది. మళ్లీ బ్రిస్బేన్లో గదులకే పరిమితం అవ్వడాన్ని ఇబ్బందిగా భావిస్తోన్న భారత క్రీడాకారులు... హోటల్లోని బయోబబుల్లో సహచరులతో కలిసి భోజనం చేసేందుకు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు పేర్కొన్న ప్రకారం ఒకే అంతస్థులో ఉండే ఆటగాళ్లు కలుసుకోవచ్చు, కానీ వేరే అంతస్థులో ఉంటోన్న సహచరులతో దూరం పాటించాలి. ఇలాంటి నిబంధనలనే సడలించాలని లేఖలో కోరిన బీసీసీఐ, ఆటగాళ్లు ఐపీఎల్ తరహా బయోబబుల్ నిబంధనల్ని కోరుకుంటున్నట్లు చెప్పింది. భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సైతం బయటంతా మామూలుగా ఉన్నప్పుడు కేవలం హోటల్ గదులకే పరిమితం కావడం సవాలుతో కూడుకున్నదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
'ఆ మ్యాచ్ ఆడేందుకు త్యాగాలకు కూడా సిద్ధం'
సిడ్నీ: టీమిండియాతో నాలుగో టెస్ట్ను బ్రిస్బేన్లో ఆడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అన్నాడు. క్వారంటైన్ ఉన్నా కూడా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. దీనికోసం కొన్ని త్యాగాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. వాస్తవానికి ఆసీస్ టీమ్కు బ్రిస్బేన్ వేదిక బాగా కలిసొచ్చింది. ఇక్కడ 1988 నుంచి ఆసీస్ ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అందుకే ఆ గ్రౌండ్లో మ్యాచ్ జరగాలని తాను కోరుకుంటున్నట్లు వేడ్ స్పష్టం చేశాడు. అక్కడ తమ రికార్డు బాగుందని.. తమకు ఆ గ్రౌండ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే సిడ్నీలోనే రెండు వరుస టెస్టులు ఆడటానికి తాము సిద్ధంగా లేమని.. షెడ్యూల్ ప్రకారమే బ్రిస్బేన్లో ఆడటానికే మొగ్గు చూపుతున్నట్లు తెలిపాడు.(చదవండి: టాస్ వేశారు.. కాని కాయిన్తో కాదు) క్వీన్స్ల్యాండ్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో అక్కడి ప్రభుత్వం కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తుంది. దీంతో బ్రిస్బేన్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆడడానికి అంగీకరించడం లేదు. మరోసారి క్వారంటైన్లో ఉండేది లేదని టీమిండియా తేల్చి చెప్పింది. దీంతో నాలుగో టెస్ట్ జరుగుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని తెలిపింది. ఒకవేళ టీమిండియా బ్రిస్బేన్లో ఆడడానికి ఒప్పుకోకుంటే సిడ్నీలోనే నాలుగో టెస్టును నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ‘సింగిల్ తీయకపోతే, నీకు ఉంటది’) -
మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నా: వార్నర్
మెల్బోర్న్: భారత్ తో జరిగే మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నట్టు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రకటించాడు. తాను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నానని పేర్కొన్నాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వార్నర్ గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకున్నానని, బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధంగా ఉన్నానని అతడు వెల్లడించాడు. ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేయగలగుతున్నానని తెలిపాడు. కాగా, మూడో టెస్టుకు మిచెల్ మార్ష్ స్థానంలో రూకీ జోయ్ బర్న్ ను తీసుకున్నారు. వార్నర్ బదులుగా ఎవరి పేరు ప్రకటించకపోవడంతో అతడు ఆడే అవకాశం కన్పిస్తోంది. -
ప్రత్యర్థిని భయపెట్టడం అవసరం!
* మాటల యుద్ధం ఎప్పటికీ ఆగదు * మిషెల్ జాన్సన్ వ్యాఖ్య మెల్బోర్న్: బ్రిస్బేన్ టెస్టులో భారత ఓటమిని శాసించిన ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ ఏడాది క్రితం ఇంతకంటే ప్రమాదకర ఆటగాడిగా కనిపించాడు. అతని ధాటికి బతుకు జీవుడా... అంటూ ఆడిన ఇంగ్లండ్ 0-5తో యాషెస్ సిరీస్ను సమర్పించుకుంది. ప్రత్యర్థిని భయపెడుతూ వికెట్లు తీసే తనదైన శైలి గురించి జాన్సన్ తన మనసులో మాటను వెల్లడించాడు. ‘మిషెల్ జాన్సన్: బౌన్సింగ్ బ్యాక్’ పేరుతో రూపొందిన డీవీడీ విడుదల సందర్భంగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ శరీరాలను లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేయడం కూడా మా యాషెస్ విజయానికి ఒక కారణం. ఆటగాళ్లపైకి దాడి చేసినట్లుగా బౌలింగ్ ఉండాలి. యాషెస్ ఆఖరి టెస్టులో అవుటైన క్షణం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ‘హమ్మయ్య... ఇక అయిపోయింది’ అనే ఉపశమనం అతని మొహంలో కనిపించింది. ముఖ్యంపై లోయర్ ఆర్డర్లో భయం పుట్టించాలి’ అని జాన్సన్ చెప్పాడు. మైదానంలో జరిగే మాటల యుద్ధానికి ముగింపు ఎప్పటికీ ఉండదని అతను అన్నాడు. ఏదో ఒక మాటతో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించాలని అంతా ప్రయత్నిస్తారని, కొన్నిసార్లు అది పని చేస్తే మరికొన్ని సార్లు వ్యతిరేక ఫలితం ఇస్తుందని వ్యాఖ్యానించాడు. ‘కొన్ని సార్లు మేం అర్థంపర్థం లేని మాటలు అంటాం. కానీ కొన్ని సార్లు అవి నేరుగా బ్యాట్స్మెన్ మనసుపై ప్రభావం చూపిస్తాయి. నీ పాదాల కదలిక బాగా లేదనో, షార్ట్ బంతి వేస్తున్నామనే చెబితే అతను ఎంత వద్దనుకున్నా దానిపై దృష్టి మళ్లుతుంది. అది బౌలర్కు అనుకూలంగా మారుతుంది. ఇది నాకు ఇష్టం. నాకు తెలిసి ఇలాంటి మాటల యుద్ధం ఎప్పటికీ ఆగదు’ అని లెఫ్టార్మ్ పేసర్ అభిప్రాయపడ్డాడు. -
ధోనీ చెప్పినట్టే దుమ్ములేపారు..
బ్రిస్బేన్: 'ఆస్ట్రేలియాతో సిరీస్లో దూకుడైన క్రికెట్ ఆడుతాం'.. రెండో టెస్టుకు ముందు రోజు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్న మాటిది. ధోనీ చెప్పినట్టే బ్రిస్బేన్ టెస్టులో భారత యువ క్రికెటర్లు దుమ్ములేపారు. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా బుధవారం ఆరంభమైన రెండో మ్యాచ్లో భారత్ తొలిరోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లకు 311 పరుగులు చేసింది. మ్యాచ్ తొలి రోజు భారత్దే పైచేయి. విదేశీ గడ్డపై, అందులోనూ ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ ట్రాక్లపై భారత్ ఒకే రోజు 300 పైచిలుకు పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. పైగా ఫాస్ట్ పిచ్లపై తడబడే ఆనవాయితీకి ముగింపు పలుకుతూ భారత యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఆత్మస్థయిర్యంతో దూసుకుపోతుండటం శుభపరిణామం. బ్రిస్బేన్ మ్యాచ్లో భారత్ను కట్టడి చేసేందుకు ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 8 మంది బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ఫలితం దక్కలేదు. రోజంతా శ్రమించినా కంగారూలు నాలుగే వికెట్లు తీశారు. భారత జట్టులో మురళీ విజయ్ (144) సెంచరీకి తోడు రహానె (75 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ చేశాడు. రహానెతో పాటు రోహిత్ క్రీజులో ఉన్నాడు. తొలి టెస్టులో భారత్ ఓడినా పోరాటపటిమతో ఆకట్టుకుంది. ఓ దశలో విజయానికి చేరువైన భారత్ చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. గాయం కారణంగా ధోనీ గైర్హాజరుతో తొలి టెస్టుకు సారథ్యం వహించిన కోహ్లీ రెండు సెంచరీలతో కదంతొక్కాడు. లోయరార్డర్తో పాటు బౌలర్లూ రాణిస్తే టీమిండియా విజయం దిశగా పయనించడం కష్టమేమీకాదు.