chalo
-
రైతుల ‘చలో ఢిల్లీ’.. హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఫిబ్రవరి 13న రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్కు పిలుపునివ్వడాన్ని దృష్ట్యాలో పెట్టుకుని పంజాబ్ నుండి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్లోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు ఇప్పటికే తమ ట్రాక్టర్లపై నిరసన ప్రదర్శనకు బయలుదేరారు. అయితే వారిని ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఆ దారిలోని ప్రతి కూడలిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు హర్యానా పోలీసులు. హర్యానా ప్రభుత్వం చౌదరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, సిర్సా, గురుగోవింద్ సింగ్ స్టేడియం, దబ్వాలిని తాత్కాలిక జైళ్లుగా మార్చింది. ఆందోళనకు దిగుతున్న రైతులను వీటిలో పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే హర్యానాలోని 15 జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 13 వరకు ఇంటర్నెట్ బంద్ చేశారు. డ్రోన్ల ద్వారా అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, పంజాబ్ సరిహద్దులను మూసివేయడానికి భారీ కాంక్రీట్ బారికేడ్లను ఏర్పాటు చేసి, పదునైన ముళ్ల తీగలను అమర్చారు. #WATCH | Ambala, Haryana: Shambhu border sealed ahead of the farmers' call for march to Delhi on 13th February. pic.twitter.com/9jbrddosnV — ANI (@ANI) February 12, 2024 మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఇదేసమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. గురువారం జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 13 న నిరసనకు దిగుతున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే ఈరోజు(సోమవారం) ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. -
చలో చేతికి షటిల్
న్యూఢిల్లీ: ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్ఫాం ’చలో’ తాజాగా ఉద్యోగులకు యాప్ ఆధారిత బస్సు సర్వీసులు అందించే షటిల్ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించినదీ మాత్రం వెల్లడించలేదు. దేశీయంగా తమ కార్యకలాపాలు లేని పెద్ద నగరాల్లోను, అంతర్జాతీయంగానూ విస్తరించేందుకు షటిల్ కొనుగోలు ఉపయోగపడగలదని పేర్కొంది. షటిల్ సర్వీస్ ఇకపై కూడా అదే బ్రాండ్ పేరుతో కొనసాగుతుందని వివరించింది. షటిల్కు చెందిన 60 మంది సిబ్బంది తమ సంస్థలో చేరతారని చలో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ దూబే తెలిపారు. రెండు సంస్థలు కలిస్తే నెలకు 2.5 కోట్ల పైచిలుకు ట్రిప్లను నమోదు చేయవచ్చని వివరించారు. కోవిడ్–19కి పూర్వం షటిల్ హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి ప్రధాన నగరాలతో పాటు బ్యాంకాక్ వంటి అంతర్జాతీయ సిటీల్లోనూ కార్యకలాపాలు సాగించేది. 2,000 బస్సులతో రోజూ దాదాపు 1,00,000 ట్రిప్లు నమోదు చేసేది. అయితే, కోవిడ్–19 దెబ్బతో వర్క్ ఫ్రం హోమ్ విధానం ప్రాచుర్యంలోకి వచ్చి, కార్యాలయాలకు ఉద్యోగులు ప్రయాణించడం తగ్గడంతో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. దీంతో కొనుగోలుదారు కోసం షటిల్ కొంతకాలంగా అన్వేషిస్తోంది. చదవండి: బ్లాక్చైన్ టెక్నాలజీతో యువత బంగారు భవిష్యత్కు భరోసా -
వీరి గాత్రం.. వేసింది మంత్రం..
రంగమ్మ మంగమ్మ అంటూ మానసి.. శ్రోతలను ఫిదా చేశారు. దారి చూడు అంటూ పెంచల్ దాస్ దుమ్ము లేపారు. చూసి చూడంగానే నచ్చేశావే అని అనురాగ్ కులకర్ణి అంటే... వినీ వినంగానే ఎక్కేసిందే అంటూ శ్రోతలు వంతపాడారు. ఇంకేం ఇంకేం కావాలే అని సిద్శ్రీరామ్ అంటే.. ఇకపై ఈ పాటనే వింటామే అంటూ సంగీత ప్రియులు బదులిచ్చారు. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని మోహన భోగరాజు చెప్పగా.. అంతే శ్రద్దగా చెవులురిక్కించి విన్నారు ఆడియెన్స్. ఈ ఏడాది గాయనీగాయకులు తమ గాత్రాలతో చేసిన మ్యాజిక్ను ఓసారి చూద్దాం. రంగమ్మ మంగమ్మ.. అంటూ మానసి రంగస్థలం సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాష్టారే పరీక్ష రాస్తే నూటికి నూరు మార్కులు వచ్చినట్టు.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా.. మాస్ సూత్రాలను సరిగ్గా పాటిస్తూ.. సుకుమార్ తీసిన రంగస్థలం అంతా ఒక ఎత్తైతే.. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఈ చిత్రంలోని ప్రతీపాట ప్రేక్షకులను కట్టిపడేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రంగమ్మ మంగమ్మ పాట గురించే. ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. ఈ పాటలో సమంత అభినయం, డ్యాన్సులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఈ పాటపై సోషల్ మీడియాలో లెక్కలేని వీడియోలను రీక్రియేట్ చేసేశారు అభిమానులు. ఈ పాట జనాల్లోకి వెళ్లడానికి దేవీ అందించిన ట్యూన్ ఒక కారణమైతే.. మానసి గాత్రం మరో కారణం. ఈ పాటతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్ను సంపాదించేశారు గాయని మానసి. ఈ వీడియోసాంగ్ను ఇప్పటివరకు 129మిలియన్ల మంది వీక్షించారు. దారి చూపి దుమ్ము లేపిన దాస్.. ఈ ఏడాదిలో వచ్చిన పాటలన్నింటిలో మాస్ను ఊపేసిన పాట ఇది. నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా మిశ్రమ ఫలితాన్నిచ్చినా.. ఈ చిత్రంలోని ఈ పాట మాత్రం పాపులర్అయింది. ఎక్కడ ఎలాంటి ప్రొగ్రామ్స్ అయినా ఈ పాట ప్లే అవ్వాల్సిందే. చిందులు వేయాల్సిందే. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా.. రాయలసీమ రచయిత పెంచల్ దాస్ అందించిన గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ అయింది. ఆ గాత్రంలో ఉన్న మ్యాజిక్కే.. ఈ పాటను ఇంతలా వైరల్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో సాంగ్ను యూట్యూబ్లో 38మిలియన్ల మంది వీక్షించారు. వినీ వినంగానే నచ్చేసిందే... ఈ ఏడాది యూత్ను ఊపేసిన పాటల లిస్ట్లో మొదటి వరుసలో ఉండేది ఛలో సాంగ్. చూసి చూడంగానే అంటూ నాగశౌర్య రష్మిక మాయలో పడిపోతే.. ఈ పాటను వినీ వినంగానే నచ్చేసిందే అనేలా చేసేశారు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి. ఎక్కడ చూసిన ఈ పాటే కాలర్ట్యూన్.. రింగ్టోన్గా మారిపోయింది. ఈ పాటను 94మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఏడాదిలో అనురాగ్ అందరికీ గుర్తుండియో పాటలు పాడి శ్రోతలకు మరింత దగ్గరయ్యారు. మహానటి టైటిల్ సాంగ్.. ఆర్ఎక్స్ 100 పిల్లా రా వంటి సాంగ్లను పాడి అనురాగ్ కులకర్ణి ఫుల్ ఫేమస్ అయ్యారు. వీటిలో పిల్లా రా సాంగ్ను యూత్ను కట్టిపడేసింది. యూట్యూబ్లో ఈ సాంగ్ను 140మిలియన్ల మంది చూశారు. ఇంకేం ఇంకేం కావాలే.. ఇంకేం ఇంకేం కావాలే.. అని సిద్ శ్రీరామ్ అంటే ఈ ఏడాదికి ఇదే చాలే అని ప్రేక్షకుల బదులిచ్చారు. గీతగోవిందంలోని ఈ పాటే సినిమాపై హైప్ను క్రియేట్ చేసింది. ఒక్కపాట సినిమాపై అంత ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఈ పాటే ఓ ఉదహరణ. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు బలాన్నిచ్చింది. గోపి సుందర్ అందించిన బాణీకి, సిద్శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోయగా.. సంగీత ప్రియులను ఈ పాట ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భాషలతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులకు అందరికీ ఈ పాట ఎక్కేసింది. రికార్డు వ్యూస్లతో యూట్యూబ్లో ఈ పాట దూసుకెళ్తోంది. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని గంభీరంగా చెప్పిన మోహన.. అరవింద సమేత.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో సంగీతం ప్రధాన ప్రాత పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని రెడ్డమ్మ సాంగ్కు విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా ముగింపులో వచ్చే ఈ పాట.. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని వివరించగా.. ఆ గాత్రంలోని తెలియని ఆకర్షణకు అందరూ ముగ్దులయ్యారు. మోహన భోగరాజు ఈ పాటతో అందరికీ సుపరిచితురాలయ్యారు. పెంచల్ దాస్ తన రాయలసీమ యాసలో అందించిన సాహిత్యం ఈ పాటపై మరింత ప్రభావాన్ని చూపింది. ఇలా ఈ ఏడాది తమ గాత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువతరంగాలు.. వచ్చే ఏడాది కూడా తమ హవాను కొనసాగించాలని మరిన్ని మంచి పాటలను ఆలపించాలని ఆశిద్దాం. -
‘భీష్మా’ జోడిగా రష్మిక
ఛలో సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. గీత గోవిందం సినిమాకు ఏకంగా వంద కోట్ల వసూళ్లు రావటంతో రష్మిక కూడా లక్కీ గర్ల్ అన్న ముద్ర పడిపోయింది. అయితే యంగ్ హీరోలు, దర్శకులు రష్మిక కోసం క్యూ కడుతున్నారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కు రష్మికను ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. నితిన్ హీరోగా భీష్మా పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్గా కన్ఫమ్ చేశాడు వెంకీ. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నాడు. -
మెగా బ్యానర్లో నాగశౌర్య..!
ఛలో సినిమాతో మంచి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత తడబడ్డాడు. వరుసగా కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల సినిమాలు బోల్తా పడటంతో ఈ యంగ్ హీరో కెరీర్ మరోసారి గాడి తప్పింది. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్న ఈ యువ కథానాయకుడు మెగా బ్యానర్లో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నాగశౌర్య హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓ యువ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
యంగ్ హీరో ఇన్నాళ్లకు..!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెల్ఫోన్ నిత్యావసరాల్లో ఒకటైపోయింది. అలాంటిది ఈ జనరేషన్లో కూడా ఇంతవరకు సెల్ఫోన్ వాడకుండా ఉన్న హీరో ఉన్నాడటే నమ్మలేం. కానీ అలాంటి హీరో కూడా ఒకడు ఉన్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య తరువాత కెరీర్ లో కాస్త ఇబ్బంది ఎదురైనా ఛలో తిరిగి నిలదొక్కకున్నాడు. తాజాగా ఈ హీరో మరో బిగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇన్నేళ్లు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉన్న నాగశౌర్య మొబైల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘ఇన్నేళ్ల తరువాత నా చేతిలో మొబైల్ ఫోన్. నేను కూడా విషపూరిత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానా..?’ అంటూ ట్వీట్ చేశారు. A smartphone in my hand after all these years.. Did I enter a vicious world?🙃 pic.twitter.com/uQvSqfSTRg — Naga Shaurya (@IamNagashaurya) 25 September 2018 -
సొంత బ్యానర్లో మరో సినిమా
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఛలో తరువాత అమ్మమ్మగారిల్లు లాంటి ఫ్లాప్ వచ్చినా అది నాగశౌర్య కెరీర్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న నర్తనశాల సినిమాలోనటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా తరువాత భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నారి నారి నడుమ మురారి సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఆ తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పాడట ఈ యంగ్ హీరో. అంతేకాదు ఈ సినిమాను నాగశౌర్య మరోసారి తన సొంతం నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించనున్నాడు. శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తేజ ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈసినిమాకు గణ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
పే...ద్ద..చిన్న సినిమాలు
సినిమాల్లో పెద్దా చిన్న ఉండదు. కానీ చిన్న సినిమా ఒక్కోసారి పెద్దగా కనబడుతుంది.కథా వస్తువు గొప్పదనమే అనలేం! ఇవ్వాళ చిన్న సినిమా పెద్దగా కనబడటానికి కారణం కథ కంటే పెద్ద కథనమే! నిజానికి చిన్న సినిమాలకు పెద్ద సినిమాల మధ్య వెంట్రుక వాసంత సందు కూడా దొరికేది కాదు.ఊపిరాడక డబ్బాల్లోనే చచ్చిపోయేవి. కానీ టైమ్ మారింది. కాదు.. కాదు.. సినిమా మారింది. కాదు.. కాదు.. కాదు.. ఆడియన్స్ మారారు. సినిమాను మారుస్తున్నారు. 2018లో వచ్చిన ఆరు పే...ద్ద.. చిన్న సినిమాల దర్శకులతో మీకోసం ‘సాక్షి ఫన్డే’ స్పెషల్..! ఛలో విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018 దర్శకుడు: వెంకీ కుడుముల నటీనటులు: నాగశౌర్య, రష్మిక మందన్న నిర్మాత: ఉష ముల్పురి సంగీతం: మహతి స్వరసాగర్ ‘ఛలో’.. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్బస్టర్. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వెంకీ కుడుముల. ‘ఛలో’తో పాపులర్ అయిన ఈ దర్శకుడి ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే... ∙ ఇంట్లో వాళ్లను ముందే ప్రిపేర్ చేశా! మాది భద్రాద్రి జిల్లా. హైదరాబాద్లో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. సినిమాల్లో కెరీర్ను బిల్డ్ చేసుకోబోతున్నట్లు ఇంట్లో నేరుగా చెప్పకుండా ముందు అమ్మానాన్నల్ను ప్రిపేర్ చేశా. చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పా. ఆ తర్వాత ‘పై చదువులు చదువుతావా?’ అని అడిగారు. లేదన్నాను. సినిమా ఫీల్డ్లోనే కెరీర్ అని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడంతో వాళ్లూ నో చెప్పలేదు. ∙ సోషల్ మీడియా పరిచయాలతో ఇండస్ట్రీలోకి..! కాలేజీ డేస్లోనే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్లకు సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టేవాడ్ని. డైలాగ్స్ను స్టేటస్లుగా పెడుతుండేవాడ్ని. హీరో శివబాలాజీ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, ‘అదుర్స్’ రవి వీరందరూ నాకు ఇలానే పరిచయం. అలా ‘ఇంకోసారి’ సినిమా దర్శకుడు సుమన్ పాతూరి పరిచయం అయ్యారు. ఆయన దగ్గర నాకు రైటర్ బలభద్రపాత్రుని రమణిగారు పరిచయం అయ్యారు. ఆవిడ నన్ను దర్శకుడు తేజగారికి పరిచయం చేశారు. నిజానికి నేను యాక్టర్ అవుదామని వెళ్లాను. కానీ తేజగారు నాలో డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి ఆ దిశగా ప్రోత్సహించారు. ఆ టైమ్లో డైరెక్షన్పై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ యోగిగారి దగ్గర, నాగశౌర్య ‘జాదుగాడు’ సినిమాకు పనిచేశా. ఆ తర్వాత త్రివిక్రమ్గారి దగ్గర కూడా వర్క్ చేశా. ∙ ‘ఛలో’ అలా మొదలైంది! ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నప్పుడు, ఈ సినిమా తర్వాత డైరెక్షన్ ప్రయత్నాలు స్టార్ట్ చేయమన్నారు త్రివిక్రమ్గారు. ‘జాదుగాడు’ సినిమా టైమ్లో హీరో నాగశౌర్య పరిచయం అయ్యారు. ‘మనం సినిమా చేద్దాం కథ రెడీ చేయ్!’ అన్నారు. నేను చెప్పిన కథ ఆయనకు నచ్చింది. ఓ నిర్మాతకు కథ చెప్పాం. ‘కథ కమర్షియల్గా ఉంది. వేరే హీరోకి వెళ్దామా?’ అన్నారు. శౌర్యతో ఇంకో లవ్స్టోరీ చేయవచ్చు కదా అని ఆయన అభిప్రాయం. ‘నేను శౌర్యతోనే చేస్తాను’ అని చెప్పా. ఆ సమయంలోనే శౌర్య తన పేరెంట్స్కు నేను చెప్పిన కథ చెప్పాడు. వాళ్లు ఎగై్జట్ అయ్యారు. అలా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్లో నా తొలి సినిమా ‘ఛలో’ మొదలైంది. ∙ ‘ఛలో’ కథ అప్పుడే పుట్టింది! ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా మా ఊరు అశ్వరావుపేట తెలంగాణ బోర్డర్లోకి వచ్చింది. అంటే మా ఇంటి దగ్గర్నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఇప్పుడు ఆంధ్ర వస్తుంది. ఓకే.. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కాకుండా.. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ అయితే ఎలా ఉంటుంది? హీరో తమిళనాడు అమ్మాయిని లవ్ చేస్తే? ఈ బ్యాక్డ్రాప్లో స్క్రీన్ప్లే వర్కౌట్ అవుతుంది కదా అనిపించింది. అలా ‘ఛలో’ సబ్జెక్ట్ను టేకప్ చేశాను. ∙ నితిన్తో చేస్తున్నా! నితిన్తో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్లో ఉంది. అక్టోబర్ ఫస్ట్ వీక్లో సినిమా సెట్స్పైకి వెళుతుంది. తొలిప్రేమ విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2018 దర్శకుడు: వెంకీ అట్లూరి నటీనటులు: వరుణ్తేజ్, రాశిఖన్నా నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ సంగీతం: ఎస్. థమన్ వరుణ్తేజ్కు హీరోగా ఫస్ట్ మేజర్ బాక్సాఫీస్ హిట్ ‘ఫిదా’ తర్వాత వచ్చిన ‘తొలిప్రేమ’ కూడా అంతే పెద్ద హిట్. వెంకీ అట్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒక సింపుల్ ప్రేమకథనే రిఫ్రెషింగ్ కథనంతో నడిపించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. నటుడిగా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి తన కెరీర్ గురించి చెప్పిన విశేషాలు... ∙ యాక్టింగ్ నుంచి డైరెక్షన్కి! నాది హైదరాబాద్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లో కెరీర్ను బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు రైటింగ్పై ఆసక్తి కలిగింది. ముందు ‘స్నేహగీతం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత నాకు యాక్టింగ్ కన్నా, రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటేనే మక్కువ ఏర్పడింది. అందుకే ‘స్నేహగీతం’ సినిమా చేసిన తర్వాత రైటింగ్ అండ్ డైరెక్షన్పై ఫోకస్ పెట్టాను. దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. ఫైనల్లీ ‘తొలిప్రేమ’తో డైరెక్టర్ అయ్యాను. నిజానికి ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్.. టీమ్ వర్క్ అని చెబుతా. ∙ ‘తొలిప్రేమ’కు నో చెప్పారు! మొదట్లో ‘తొలిప్రేమ’ కథకు చాలా మంది ఓకే చెప్పలేదు. ఆ తర్వాతే అది దాని దారి వెతుక్కొని ఇలా వచ్చింది. మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఎవరి పని వాళ్లని చేయనిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది 95 పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక ఫైవ్ ఫర్సెంట్ లక్ ఉండాలి. ‘తొలిప్రేమ’ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. ∙ పొలిటికల్ డ్రామా చేస్తా! లవ్స్టోరీస్తో పాటు నాకు ఫ్యామిలీ డ్రామాలంటే ఆసక్తి ఎక్కువ. పొలిటికల్ డ్రామాలన్నా ఇష్టమే. భవిష్యత్లో నానుంచి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఓ సినిమాను ఆశించవచ్చు. ∙ అఖిల్తో సినిమా చేస్తున్నా! ప్రస్తుతం అఖిల్తో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు దృష్టంతా ఈ సినిమాపైనే. ఒక సినిమా సెట్స్పై ఉన్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. ఎఫర్ట్ అంతా సినిమా మీదనే పెడతా. ప్యారలల్గా మరో సినిమా చేయడం నాకు కంఫర్ట్గా అనిపించదు. ఏకాగ్రత తగ్గుతుందేమోనని నా భయం. మణిరత్నం, త్రివిక్రమ్ నా ఫేవరైట్ డైరెక్టర్స్. వాళ్ల నుంచి ఎక్కువ ఇన్స్పయిర్ అయ్యాననే చెప్తా. అ! విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2018 దర్శకుడు: ప్రశాంత్ వర్మ నటీనటులు: కాజల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, నిత్యామీనన్ నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపురనేని సంగీతం: మార్క్ కె. రాబిన్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘అ!’తో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. ఒక మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు అర్బన్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కథల్ని తెరకెక్కించాలన్న డ్రీమ్తో ముందుకెళ్తానంటున్న ప్రశాంత్ వర్మ తన గురించి చెప్పిన కొన్ని విశేషాలు.... ∙ సినిమాలను పిచ్చిగా చూసేవాడ్ని! మాది భీమవరం దగ్గర పాలకొల్లు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ సినిమాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. స్కూల్లో మంచి స్టూడెంట్ని. చిన్నప్పుడు ప్రతి సినిమా చూసేవాణ్ని. అయితే డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి. తర్వాత ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమా గురించి తెలుసుకోవడం, చదవడం మొదలెట్టాను. ఆ తర్వాత యాడ్స్ చేశాను. ∙ ‘అ!’ నా 33వ కథ... ‘అ!’.. ఫ్రస్ట్రేషన్తో రాసిన కథ. 2017 న్యూ ఇయర్కు నా కొత్త సినిమా స్టార్ట్ కావల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. అప్పుడు ఈ కథ రాశాను. ఆడియన్స్ ఎప్పుడూ చూడని ఒక కొత్త కథ చెబుదాం అన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ పిక్ చేసుకున్నాను. ఇది నేను రాసిన 33వ కథ. అలా అని ముందు 32 కథలు రిజెక్ట్ అయ్యాయని అనను. ఏవేవో కారణాలతో సినిమా ఫైనలైజ్ కాలేదు. ‘అ!’ సినిమా నా సొంత ప్రొడక్షన్లోనే చిన్న సినిమాలా కొత్త వాళ్లతో చేద్దాం అనుకున్నాను. మెల్లిగా కాజల్, నాని వచ్చి పెద్ద ప్రాజెక్ట్ అయింది. ∙ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు! మన దగ్గర మాత్రమే ‘నా కథతో నేనే సినిమా తీస్తాను’ అనుకుంటాం. హాలీవుడ్లో ఒకరు కథ రాస్తారు. మరొకరు స్క్రీన్ప్లే. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ కంపెనీ ఒక డైరెక్టర్ని నియమించుకుంటుంది. ఇలాగే బాలీవుడ్ ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ నా దగ్గరికొచ్చింది. ‘అ!’ పనుల్లో బిజీగా ఉండి చేయడం కుదర్లేదు. ఆ సినిమా మధ్యలో ఆగిపోతే, మిగతా భాగమంతా వెళ్లి పూర్తి చేసి వచ్చాను. డైరెక్షన్ అనేది ఒక జాబ్ అని అనుకుంటాను నేను. అలానే వెళ్లి ఆ సినిమా చేసి వచ్చాను. నా తర్వాతి సినిమా వేరే అతని కథతో చేస్తున్నాను. ‘కథ’ అని అతనికి టైటిల్ వేస్తాను. నాకెలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు. ∙ ఆ బ్రాండ్ నా డ్రీమ్! ‘స్క్రిప్ట్ విల్లా’ అనే కంపెనీ ద్వారా మంచి కథల కోసం వెతికే ప్రొడక్షన్ హౌస్లకు, యాక్టర్స్కు మా సంస్థ నుంచి కథలను అందించే ప్రయత్నం మొదలుపెడుతున్నా. వీలైనన్ని కొత్త కథలు ఆడియన్స్కు చెప్పడమే నా డ్రీమ్. ‘వీడు ఇప్పటివరకూ మనం అనుకున్నట్టుగా కాకుండా, కొత్తగా కథలు చెబుతాడ్రా!’ అనే బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటే చాలు. ఆర్ఎక్స్ 100 విడుదల తేదీ: జూలై 12, 2018 దర్శకుడు: అజయ్ భూపతి నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్పుత్ నిర్మాత: అశోక్రెడ్డి సంగీతం: చైతన్ భరద్వాజ్ 2018లో చిన్న సినిమాల్లో అతిపెద్ద సెన్సేషన్ ‘ఆర్ఎక్స్100’. కొత్త దర్శకుడు అజయ్ భూపతి కొత్త నటీనటులతో చేసిన ఈ సినిమా యూత్ ఆడియన్స్కు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి. ఫ్యూచర్లో ఎంత పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చినా వాళ్లను తన స్టైల్లోకి తీసుకొచ్చుకొని సినిమా చేస్తానంటున్న అజయ్ ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే.. ∙ సినిమాలో మా ఊరే! మాది ఆత్రేయపురం. సినిమాలో మీరు చూసిందే. నా ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా మా ఊర్లోనే చదువుకున్నాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు మా నాన్న గారు ‘నీకు నేనేం ఆస్తులు ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే నువ్విలా ఉండు. అలా ఉండు అని చెప్పొచ్చు. నీకు నచ్చింది నువ్వు చెయ్’ అన్నారు. ∙ అప్పుడే ఫిక్స్ అయ్యా! నా పదో తరగతిలోనే ఫిక్స్ అయ్యా, సినిమా డైరెక్టర్ అవ్వాలని. ఆ తర్వాత చదువుకోవడం కూడా టైమ్ వేస్ట్లా ఫీల్ అయ్యాను. ఎవ్వరైనా సరే వాళ్లేమవ్వాలనుకుంటున్నారు అనే చిన్న క్లారిటీ ఉంటే చాలు.. అది ఎంత కష్టమైనా చేసేయొచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్గా నాని ‘రైడ్’, రవితేజ ‘వీర’ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత మా బాస్ రామ్గోపాల్ వర్మ ‘అటాక్’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ సినిమాలకు వర్క్ చేశాను. ∙ ఎన్నో అవమానాలు.. చీదరింపులు... సినిమాల్లోకి రావాలనుకున్నాక అవమానాలు, చీదరింపులు, పస్తులు ఉండటాలు... అన్నీ ఉన్నాయి. కానీ ‘ఆర్ఎక్స్ 100’ కథను చాలామందికి చెప్పా. ఎవ్వరూ రిజెక్ట్ చేయలేదు కానీ, వాళ్ల వాళ్ల కారణాల వల్ల సినిమా చేయడం కుదర్లేదు. కార్తికేయకి బాగా నచ్చేసింది. తర్వాత నిర్మాత అశోక్ వచ్చారు. నాకు రియలిస్టిక్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ పాయింట్ బావుంటుందని గట్టి నమ్మకం ఉండేది. నేను తప్ప ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు ఈ సబ్జెక్ట్ని. ‘ఆర్ఎక్స్ 100’లో మీరు చూసిన హీరో క్యారెక్టర్ మన ఊర్లో కనబడే రెబల్ కుర్రాడిలానే ఉంటుంది, పంచాయతీ ప్రెసిడెంట్, రాంకీగారి పాత్ర.. ఇలా ప్రతీ పాత్రను ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా డిజైన్ చే శాను. ∙ నెక్ట్స్ మల్టీస్టారర్... ‘ఆర్ఎక్స్100’ సక్సెస్ తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటివరకైతే ఏదీ ఫైనల్ చేయలేదు. కానీ నెక్ట్స్ సినిమా మాత్రం మల్టీస్టారర్ ఉంటుంది. రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరి వ్యక్తుల కథ. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. రెండు నెలల్లో ఫుల్ డీటైల్స్ అనౌన్స్ చేస్తాను. ఏ కథ చెప్పినా రియలిస్టిక్ అప్రోచ్తో చెప్పడమే నా లక్ష్యం. అలాగే ప్రభాస్, రామ్ చరణ్తో సినిమా చేయడం నా డ్రీమ్. ఒకవేళ మా స్టైల్లో సినిమా కావాలని వాళ్లు అడిగినా స్టోరీ సిట్టింగ్స్లో వాళ్లను నా దారిలోకి తెచ్చేసి నా స్టైల్లో సినిమా తీసేస్తా! చి.ల.సౌ విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: రాహుల్ రవీంద్రన్ నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ నిర్మాతలు: నాగార్జున, జశ్వంత్ నడిపల్లి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’. జనరల్గా చాలా మంది నటీనటులు చెప్పే మాట ఇది. అయితే రాహుల్ రవీంద్రన్ మాత్రం ‘డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ అంటున్నారు. హీరోగా సినిమాలతో మెప్పిస్తూనే ఉన్న రాహుల్, దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ.’ సినిమా ఈ నెల్లోనే విడుదలై సూపర్ హిట్గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. డైరెక్టర్గా మారిన ఈ యాక్టర్ సినిమా గురించి, తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పిన విశేషాలు... ∙ చిన్నప్పట్నుంచీ కథలంటే ఇష్టం! నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే! నాన్న ఎన్.రవీంద్రన్, అమ్మ వసుమతి. నాన్న బిజినెస్మేన్. చిన్నప్పట్నుంచీ అమ్మ రామాయణం, మహాభారతం కథలు చెబుతూ, యాక్టింగ్ చేసి చూపించేది. అప్పుడే నాకు కథలంటే ఇష్టం పెరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మణిరత్నంగారి ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) సినిమాను టీవీలో చూశా. చాలా కొత్తగా, ఫ్రెష్గా అనిపించింది. ఓ సినిమాని ఇలా కూడా తీయొచ్చా? అనిపించింది. అప్పట్నుంచి సినిమా, డైరెక్షన్ సైడ్ ఇష్టం పుట్టింది. ఇంటర్కి వచ్చాక ఫిల్మ్మేకర్ అవ్వాలనుకుని డిసైడ్ అయ్యా. నటుడవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ∙ అసిస్టెంట్గా చాన్స్ దొరకలేదు.. హీరో అయ్యా! మా ఫ్యామిలీలో ఎవరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. మాది ఆ నేపథ్యం కాదు. అందుకే ఫస్ట్ చదువు పూర్తి చేసి తర్వాత ప్రయత్నిద్దామనుకుని అహ్మదాబాద్లో ‘మైకా’ కళాశాలలో ఎంబీఏ మార్కెటింగ్ చేశా. తర్వాత బాంబేలో ఏడాదిన్నర పాటు రేడియో సిటీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్గా చేశా. 2007లో చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకున్నా. కానీ, ఎవరి వద్దా అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఓ రోజు ఆడిషన్స్కి రమ్మని కాల్ వచ్చింది. వెళ్లగానే యాక్టింగ్ రోల్ అన్నారు. ఏ పాత్ర అంటే.. హీరో అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా చాన్స్ రాలేదు. హీరోగా వచ్చింది. చేస్తే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవచ్చు. డబ్బులు కూడా వస్తాయని చేశా. రవివర్మన్ డైరెక్షన్లో ‘మాస్కోవిన్ కావేరి’ చిత్రం చేశా. ∙ ‘అందాల రాక్షసి’ మొత్తం మార్చేసింది! ‘అందాల రాక్షసి’ చిత్రా నికి ఇద్దరు హీరోలు కావాలి. నవీన్ చంద్ర ఓ హీరోగా ఓకే. రెండో హీరో సెట్ అవడం లేదు. మీకు తెలిసినవారు ఎవరైనా ఉన్నారా? అని పాటల రచయిత లక్ష్మీ భూపాల్గారు అహ్మదాబాద్లో నాతోపాటు చదువుకున్న ఫ్రెండ్ దీప్తిని అడిగారు. తను నా గురించి చెప్పింది. తెలుగు రాదు అంది. పర్లేదు ఫొటోలు పంపమన్నారు. దీప్తికి పంపా. హను రాఘవపూడిగారు ఆడిషన్స్ చేసి ఓకే చేశారు. ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి హైదరాబాద్లో సెటిల్ అయ్యా. సాయి కొర్రపాటిగారు బాగా ప్రమోషన్ చేశారు. నాకు, నవీన్ చంద్ర, లావణ్యా త్రిపాఠికి మంచి లైఫ్ వచ్చింది. ఆ సినిమా విడుదలై ఆరేళ్లయింది. ∙ డైరెక్షన్ ట్రయల్స్.. హీరో అయినా, ఆ వెంటనే దర్శకుడిగానూ ప్రయత్నాలు మొదలుపెట్టా. నాలుగున్నరేళ్ల క్రితం ఓ హీరోకి ‘చిలసౌ’ కథ చెప్పా. అప్పుడది వర్కవుట్ అవ్వలేదు. ఈలోగా మళ్లీ హీరోగా బిజీ. తర్వాత సుశాంత్కి చెప్పా. ఓకే. నచ్చింది అన్నాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్కి చెప్పాడు. ఆయన నిర్మాతలు భరత్, జశ్వంత్లకు చెప్పారు. వారు కథ విని ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేశారు. ఇప్పుడు సినిమా విడుదలై ఇంత పెద్ద హిట్ అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. ∙ చిన్మయి హ్యాపీ! ‘అందాల రాక్షసి’ టైమ్లో పరిచయమైన సింగర్ చిన్మయి కొద్దిరోజుల్లోనే మంచి ఫ్రెండయింది. తను నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందని నేనే ప్రపోజ్ చేశా. తను కొద్దికాలం ఆలోచించి ఓకే చెప్పింది. తను నాకు, నేను తనకు బలం. ‘చి.ల.సౌ.’ రిలీజయ్యాక, నేను నా కలను సాధించినందుకు తను ఎంతో హ్యాపీ! ∙ యాక్టింగ్, డైరెక్షన్ రెండూ చేస్తా! తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్ను నిర్మాతలు బాగా ఎంకరేజ్ చేస్తారు. ‘చిలసౌ’ రిలీజ్కి ముందే చాలామంది కలిసి సినిమాలు చేయమన్నారు. అయితే రెండో సినిమా అన్నపూర్ణ బ్యానర్లో చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నా. ఇకపై డైరెక్షన్కే నా మొదటి ప్రాధాన్యత. మంచి సినిమాలు తీస్తా. అయితే యాక్టింగ్ వదులుకోను. ప్రస్తుతం ‘యూ టర్న్’, ‘దృష్టి’ సినిమాలు చేశా. త్వరలో రిలీజ్ కానున్నాయి. గూఢచారి విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: శశికిరణ్ తిక్క నటీనటులు: అడివిశేష్, శోభిత దూళిపాల, మధుశాలిని నిర్మాతలు: అభిషేక్ నామ, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంగీతం: శ్రీచరణ్ పాకాల హీరో అడివి శేష్ ‘క్షణం’ సినిమాతో రెండేళ్ల క్రితం న్యూ వేవ్ సినిమా అంటూ రవికాంత్ పేరు అనే ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. మళ్లీ రెండేళ్లకు అదే న్యూ వేవ్ అంటూ ‘గూఢచారి’తో మరో కొత్త దర్శకుడు శశికిరణ్ తిక్కను పరిచయం చేశారు. ఆగస్టు 3న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్హిట్ టాక్తో దూసుకెళ్తోంది. రిఫ్రెషింగ్ స్పై థ్రిల్లర్గా, లో బడ్జెట్లో తెరకెక్కిన బెస్ట్ విజువల్స్తో మెప్పిస్తోన్న ఈ సినిమా గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి శశికిరణ్ మాటల్లో.... ∙ కేరాఫ్ అమలాపురం నేను పుట్టింది అమలాపురంలో. అమ్మానాన్న రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. నాన్న గతంలో కొబ్బరి, కన్స్ట్రక్షన్ బిజినెస్లు చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయ్యారు. అన్నయ్య రాజమండ్రిలో బిజినెస్ చూసుకుంటున్నారు. ∙ 15 మంది నిర్మాతలకు కథ చెప్పా! నాకు మొదట్నుంచీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. డైరెక్టర్ కావాలనే అమెరికాలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్, రైటింగ్లో రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నా. ఇండియాకొచ్చి శేఖర్ కమ్ములగారి దగ్గర ‘లీడర్’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశా. ‘లీడర్’కు పనిచేసిన తర్వాత కొన్ని కథలు రాసుకొని దాదాపు 15మంది నిర్మాతలకి చెప్పా. కొందరు చేద్దామన్నా రకరకాల కారణాల వల్ల కుదర్లేదు. ఓ సినిమా అయితే రేపు లాంచ్ అనగా ఆగిపోయింది. ఈ గ్యాప్లో ఫ్రెండ్స్కి రైటింగ్ సైడ్ హెల్ప్ చేశా. అడివి శేష్ ‘కర్మ’ సినిమాకి ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేశా. ∙ ‘గూఢచారి’ అలా పుట్టిందే! ‘కర్మ’ సినిమా అప్పుడే అడివి శేష్తో మంచి స్నేహం కుదిరింది. శేష్ రాసిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ కథను ఆయనతో కలిసి నేను, రాహుల్ పాకాల (రైటర్) ఎనిమిది నెలలు కష్టపడి పూర్తి స్క్రిప్ట్గా రెడీ చేశాం. కథని అబ్బూరి రవిగారికి వినిపించాం. ఆయన సలహాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. ∙ ఇంత పెద్ద సక్సెస్ ఊహించలేదు! ‘గూఢచారి’ హిట్ అవుతుందనుకున్నా. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు. ఈ సినిమా సక్సెస్ కాగానే చాలా మంది నిర్మాతలు అడిగారు. ఇంకా ఎవరి వద్దా అడ్వాన్సులు తీసుకోలేదు. ఎవరితో చేయాలన్నది నిర్ణయించుకోలేదు. నాకు డబ్బు ముఖ్యం కాదు, పని సంతృప్తినివ్వడమే ముఖ్యం. నావల్ల నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ∙ అన్ని జానర్స్ చెయ్యాలి! స్పై థ్రిల్లర్తో డెబ్యూట్ ఇచ్చినా నాకు కామెడీ అంటే ఇష్టం. ఫ్యూచర్లో అన్ని జానర్స్లో సినిమాలు చేయాలనుంది. నాకిష్టమైన దర్శకుల నుంచి ఇన్స్పైరై ఇంకా బాగా పని చేయాలనుకుంటా. – సాక్షి సినిమా డెస్క్ -
రష్మిక మందన్న.. ఇప్పుడొక సెన్సేషన్!
రష్మిక మందన్న. సౌతిండియన్ సినీ పరిశ్రమలో ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్. తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో సూపర్హిట్ సినిమాలతో దూసుకుపోతోన్న ఈ స్టార్కు ముఖ్యంగా యూత్లో తిరుగులేని క్రేజ్ ఉంది. తెలుగు సినిమాకు పరిచయం కాకముందు రష్మికకు ‘కర్ణాటక క్రష్’ అనే పేరుంది. ఇప్పుడైతే ఆమె పాపులారిటీ సౌతిండియా మొత్తం పాకేసింది కాబట్టి, రష్మికను ‘యూత్ క్రష్’ అని చెప్పేసుకోవచ్చు. ఈ స్టార్ గురించి కొన్ని విశేషాలు... చిన్నప్పట్నుంచీ యాక్టివ్... రష్మిక సినిమాల్లో ఎంత హుషారుగా కనిపిస్తుందో, నిజజీవితంలోనూ అంతే యాక్టివ్! టీనేజ్లో ఉన్నప్పట్నుంచే సినిమాలంటే పిచ్చి. అలా పద్దెనిమిదేళ్లకే మోడలింగ్లోకి వచ్చి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు చాలా కమర్షియల్ యాడ్స్కు రష్మిక టాప్ ప్రయారిటీగా ఉండేది. మోడలింగ్లో ఆ క్రేజే ఆమెకు సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. కిరాక్ ఆఫర్ 2016. కన్నడలో ‘కిర్రిక్ పార్టీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. అందులో హీరోయిన్ పాత్రకు ఒక ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని నిర్మాతలు అనుకుంటున్న టైమ్లో రష్మికను ఒక యాడ్లో చూశారు మేకర్స్. ఆడిషన్స్ చేసి, రష్మికను సెలెక్ట్ చేసి, సినిమాను గ్రాండ్గా తెరకెక్కించి, అదే ఏడాది చివరికి రిలీజ్ చేశారు. సినిమా పెద్ద హిట్. అందులో హీరోయిన్ రష్మిక అయితే ఒక్కసారే ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. ‘కర్ణాటక క్రష్’ అన్న పేరు సంపాదించుకునేంతగా యూత్ మనసు దోచేసుకుంది. ఛలో తెలుగు ‘కిర్రిక్ పార్టీ’ సక్సెస్తో రష్మికకు తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలైంది. అలా వచ్చిందే నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’! ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా చిన్న బడ్జెట్ సినిమాల్లో బ్లాక్బస్టర్. ఈ సక్సెస్తో కన్నడ సినిమాలకు కూడా నో చెప్పేంతగా తెలుగులో బిజీ అయిపోయింది రష్మిక. ప్రస్తుతం ఆమె ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘దేవదాస్’ సినిమాల్లో హీరోయిన్గా కనిపించనుంది. రిలేషన్షిప్ స్టేటస్:ఎంగేజ్డ్ రష్మిక వయస్సు ఇప్పుడు 22 ఏళ్లు. మామూలుగా అయితే హీరోయిన్గా పేరొస్తున్న వాళ్లు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటారు. రష్మిక ఇవేవీ పట్టించుకోకుండా చిన్న వయసులోనే పెళ్లికి రెడీ అయిపోయింది. ‘కిర్రిక్ పార్టీ’లో తన కో స్టార్ రక్షిత్ శెట్టితో గతేడాది రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. గీత మేడమ్! ‘ఛలో’ సినిమా రిలీజ్ అయి హిట్టయ్యాక రష్మిక పాపులర్ అయితే, ‘గీత గోవిందం’ అనే సినిమా విడుదల కాకముందే ఇందులో ఆమె చేసిన పాత్ర పాపులర్ అయింది. ‘గీతా మేడమ్.. గీతా మేడమ్..’ అని పిలుస్తూ ట్రైలర్లో హంగామా చేస్తోన్న విజయ్దేవరకొండ ఈ సినిమాలో హీరో. ఈ సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాట గత నెల రోజులుగా ఆన్లైన్లో బాగా పాపులర్ అయిన పాట. ఇందులో గీత మేడమ్కు.. అదే రష్మికకు.. ఆమె ఫ్యాన్స్ ఇప్పటికే ఫిదా అయిపోయారు. -
త్వరలో సెట్స్ మీదకు ‘భీష్మ’
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం పనుల్లో బిజీగా ఉన్న నితిన్ ఈ సినిమాతో త్వరలో ప్రారంభించనున్నాడట. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండటంతో ఆగస్టు మొదటి వారంలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సింగిల్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీనివాస కళ్యాణంలో నితిన్ రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా శతమానంభవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. -
బాలయ్యని మళ్లీ వాడేస్తున్నాడు!
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అమ్మమ్మగారిల్లు సినిమాతో మరో డిసెంట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో సొంత బ్యానర్లో మరో సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య ఇటీవల భవ్య క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాను ప్రారంభించాడు. సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్తో నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను ప్రారంభించి సౌందర్య మరణంతో మధ్యలో ఆపేశారు. ఇప్పుడు భవ్య క్రియేషన్స్ సినిమాకు కూడా బాలయ్య టైటిల్నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. నాగశౌర్య లవర్బాయ్గా కనిపించనున్న ఈ సినిమాకు నారి నారి నడుమ మురారి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. బాలయ్య సూపర్ హిట్ సినిమాల్లో నారి నారి నడుమ మురారి ఒకటి. నాగశౌర్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు. -
భవ్య క్రియేషన్స్లో నాగశౌర్య..!
పైసా వసూల్ తరువాత సినిమా కాస్త గ్యాప్ తీసుకున్న భవ్య క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కొత్త సినిమా ప్రారంభించారు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్యతో రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (శనివారం) ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్, కూకట్పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
ఆజన్మ బ్రహ్మచారిగా నితిన్
టాలీవుడ్ లో పెళ్లికాని ప్రసాదులు చాలా మందే ఉన్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి లతో నితిన్ కూడా వయసు పెరుగుతున్న సినిమాలతోనే కాలం గడిపేస్తున్నారు. తాజాగా నితిన్ సింగిల్ ఫర్ఎవర్ అనే స్టేట్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్లో మాత్రం కాదు. రీల్ లైఫ్లోనే. ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్ తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పాడు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు సింగిల్ ఫర్ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మా పేరుతో లవ్ స్టోరి తెరకెక్కిస్తుండటంతో భీష్మాపై ఆసక్తి నెలకొంది. -
మెగా బ్యానర్లో యువ దర్శకుడు
ఇటీవల టాలీవుడ్లో ఒక్క సినిమాతో సెన్సేషన్గా మారిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ఛలో సినిమాతో ఈ జాబితాలో చేరిన దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన వెంకీ తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్నాడు. దీంతో పెద్ద బ్యానర్ల నుంచి కూడా వెంకీకి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నితిన్, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో వెంకీ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకీ కుడుముల ఓ బడా బ్యానర్లో సినిమా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ సినిమాలతో పాటు యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలను రూపొందిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్లో వెంకీ కుడుముల ఓ సినిమా చేయనున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో రూపొందించబోయే సినిమా ఇది అన్న టాక్ వినిపిస్తోంది. ఛలో తరువాత వెంకీ తన తదుపరి ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు. -
మెగా హీరోతో ఛలో డైరెక్టర్
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్కు సంబంధించి ఓ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమా చేస్తున్న సాయి ధరమ్ తదుపరి ప్రాజెక్ట్ను ఇంతవరకు ప్రకటించలేదు. కిశోర్ తిరుమల, చంద్రశేఖర్ ఏలేటి, గోపిచంద్ మలినేని లాంటి దర్శకులతో చర్చలు జరగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్లో వెంకీ కుడుమల కూడా చేరాడు. వీరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాను గీతా ఆర్ట్స్లో తెరకెక్కించనున్నారు. -
‘ఛలో’ హీరోతో ‘హలో’ హీరోయిన్..!
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్ నిర్ణయించారు. ఇటీవలే లాంచనంగా షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహరీన్ను తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. తరువాత ఆమె స్థానంలో కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జా పేరు వినిపించింది. తాజాగా మరో అందాల భామ పేరు తెర మీదకు వచ్చింది. అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమాతో పరిచయం అయిన కళ్యాణీ ప్రియదర్శన్ నర్తనశాల సినిమాలో హీరోయిన్గా నటించనుందట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
నాగశౌర్యకు జోడీగా సిమ్రాన్..?
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా నిఖిల్ కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జాను ఫైనల్ చేశారట. హిందీ సీరియల్స్తో పాపులర్ అయిన సిమ్రాన్.. కిరాక్ పార్టీ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అవుతోంది. నాగశౌర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కణం త్వరలో రిలీజ్ అవుతుండగా మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
‘ఛలో’ దర్శకుడి కొత్త సినిమా అప్డేట్
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్కు సంబంధించి ఓ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రేమమ్, బాబు బంగారం లాంటి సినిమానలు తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాను నిర్మిస్తోంది. త్వరలో ఇదే బ్యానర్లో సుదీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మరో సినిమా ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో ప్రాజెక్ట్ను సిద్ధం చేస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించే అవకాశం ఉంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఛలో
-
సినిమా హిట్.. కారు గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : నాగశౌర్య, రష్మిక నటించిన ఛలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. రెండు వారాల్లో సుమారు రూ.23.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. శాటిలైట్, రీమేక్ హక్కులతో మరో ఆరు కోట్లవరకూ బిజినెస్ చేసి 2018లో బ్లాక్బస్టర్గా నిలించింది. ఈ సందర్భంగా నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉషా ముల్పూరి సినిమాకు పనిచేసిన 24 రంగాలకు చెందిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సినిమా ప్రారంభం రోజునే అనుకున్నామని, హిట్ అవగానే సినిమాకు కష్టపడి పని చేసిన వారిని సత్కరించాలని అనుకున్నామని తెలిపారు. సినిమా కోసం కష్టపడి పనిచేసిన వారికి తాము ఇచ్చే చిరుకానుక అని అన్నారు. ఐరా బ్యానర్ ప్రారంభించడానికి కారణమైన వెంకీ కుడుములకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుములకు నిర్మాతలు కారు బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి సినిమా నిర్మించిన నిర్మాతల రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ సినిమా చేసే అవకాశం ఇవ్వడం గిఫ్ట్ అయితే, హిట్ అవడం డబుల్ గిఫ్ట్ అని, ఇక నిర్మాతలు కారు బహుమతిగా ఇవ్వడం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్గా భావిస్తున్నానని తెలిపారు. నాగ శౌర్యలేకపోతే తాను లేనని, తన హీరోను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు. -
ఆ కష్టం ‘ఛలో’తో తెలిసింది – నిర్మాత ఉష
‘‘మేం గతంలో మా ఫ్యామిలీతో సినిమాలు చూసేవాళ్లం. సినిమా తీయాలంటే హీరో, హీరోయిన్, దర్శకుడు ఉంటే చాలనుకునేవాళ్లం. కానీ మా ‘ఐరా క్రియేషన్స్ బ్యానర్’ ప్రారంభించాక ఓ విషయం అర్థమైంది. తెరమీద కనిపించే వారి వెనక వందలాది శ్రామికుల కష్టం ఉంటుందని’’ అన్నారు నిర్మాత ఉష మూల్పూరి. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఆమె నిర్మించిన చిత్రం ‘ఛలో’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయపథంలో దూసుకెళుతోందని ఉష తెలిపారు. ఈ సందర్భంగా ‘ఛలో’ చిత్రానికి పని చేసిన 24 క్రాఫ్ట్స్ వాళ్లని సత్కరించారు. అనంతరం ఉష మాట్లాడుతూ– ‘‘వెంకీ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే మేం ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. ఐరా క్రియేషన్స్ మొదలు పెట్టడానికీ, ఇంత మంచి హిట్ సినిమా ఇచ్చిన వెంకీకి కృతజ్ఞతగా కారు గిఫ్ట్గా ఇచ్చాం. తను మరిన్ని విజయాలు సాధించాలి’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘సినిమాకి వెళతానంటే నా తల్లిదండ్రులు డబ్బులిచ్చారు. నాగశౌర్య తల్లిదండ్రులు డబ్బులిచ్చి సినిమా తీసారు. వారి రుణం మరచిపోను. ఈ చిత్రం చేసే అవకాశం ఒక గిఫ్ట్ అయితే.. ప్రేక్షకులు బ్లాక్బస్టర్ హిట్ చేయటం డబుల్ గిఫ్ట్... ఇప్పుడు నాకు కారు గిఫ్ట్ ఇవ్వటం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్గా ఫీలవుతున్నా. నాగశౌర్య పరిచయం కాకపోతే నాకు ఈ జీవితం లేదు’’ అన్నారు. శంకర్ ప్రసాద్, నాగశౌర్యలతో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. -
‘అమ్మమ్మగారిల్లు’ ఫస్ట్ లుక్
శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ సినిమాకు సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ, ‘తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా. షూటింగ్ చేస్తున్నంత సేపు సెట్ లో పండగ వాతావారణంలా కోలాహాలంగా ఉంది. కుటుంబ అనుబంధాలు..ఆప్యాయతలు..అనురాగాలు.. అందులో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు.. ఆవేదన ఎలా ఉంటుందనేది దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. కథను నమ్మి సినిమా చేశాం. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. క్వాలిటీగా సినిమా చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ సినిమాతో నేను మరింత దగ్గరవుతాను` అని అన్నారు. హీరోయిన్ షామిలి మాట్లాడుతూ, ‘‘ఓయ్’ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతోనే మరో సినిమా చేయలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘అమ్మమ్మగారిల్లు’ కథ నచ్చడంతో సినిమాకు వెంటనే ఒప్పుకున్నాను. నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. నాగశౌర్య తో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని అన్నారు. దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ, ‘రిలేషన్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని రాసిన కథ ఇది. దర్శకుడిగా నాకిది తొలి సినిమా. తెరపై సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు థియేటర్ లో ఉన్నామన్నా ఫీలింగ్ కాకుండా పండగ వాతావరణంలో తమ కుటుంబంతో గడుపుతున్న అనుభూతి కలుగుతుంది. నాగశౌర్య అద్భుతంగా నటించాడు. ఎమోషన్ సన్నివేశాల్లో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులంతా కూడా తమ పాత్రల ఫరిది మేర అద్భుతంగా నటించారు. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చి నిర్మాతలు రాజేష్, ఆర్ .కె గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ‘సినిమా బాగా వచ్చింది. దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. అలాగే నాగశౌర్య నటన సినిమాకు హైలైట్ గా ఉంటుంది. నటనపై ఆయన కమిట్ మెంట్.. డెడికేషన్ చాలా బాగున్నాయి. భవిష్యత్ లో పెద్ద స్టార్ అవుతాడు. మేము సినిమా నిర్మించి ఎంత అనుభూతి పొందామో....సినిమా చూసిన తర్వాత అంతే అనుభూతి ప్రేక్షకులు పొందుతారు’ అని అన్నారు. -
విశాఖలో ఛలో సినిమా సక్సెస్ మీట్
-
గురువారం మార్చి ఒకటి.. అంటున్న నాగశౌర్య
ఛలో సినిమాతో మంచి విజయం అందుకున్న నాగశౌర్య స్పీడు పెంచాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కణం షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్నాడు. గతంలో నువ్వు లేక నేను లేను, తొలిచూపులోనే లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాశీ విశ్వనాథ్ తరువాత నటుడిగా బిజీ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల తరువాత నాగశౌర్య సినిమాతో ఆయన తిరిగి మెగాఫోన్ పట్టనున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు సూపర్హిట్ సినిమా దూకుడులోని ‘గురువారం మార్చి ఒకటి’ పాట పల్లవిని టైటిల్గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఛలో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ హీరో ఈ నెలాఖరున సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో శ్రీనివాస్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నర్తనశాల సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో గురువారం మార్చి ఒకటి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
అత్తారింట్లో సరదాగా...
రష్మికా మండన్నా.. లేటెస్ట్ తెలుగు సినిమా సెన్సేషన్. ‘ఛలో’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగు యూత్ అందరి నెక్ట్స్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయారామె. కానీ ఆవిడ సింగిల్ కాదండోయ్. కన్నడంలో ‘కిరిక్ పార్టీ‘ సినిమా సూపర్ హిట్ అవ్వగానే అందులో హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారీ కన్నడ బ్యూటీ. ఎంగేజ్ అయిన తర్వాత ఎవరి కెరీర్లో వాళ్లు బిజీ అయిపోయారు. వీలున్నప్పుడల్లా రష్మికా, రక్షిత్ శెట్టి కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నారట. ఈ మధ్యన రక్షిత్ శెట్టి వాళ్ల ఫ్యామిలీ ట్రెడిషన్ అయిన ‘భూత కోల’ అనే ఆటను రష్మికా చూశారట. భూత కోల కూడా మన జాతరలలో అమ్మవారి ముందు చేసే నృత్యం లాంటిదే. తులు మాట్లాడే కన్నడ వాళ్ల సాంప్రదాయం ఈ ‘భూత కోల’. కన్నడంలో ‘భూత’ అంటే ‘స్పిరిట్’ అని ‘కోల’ అంటే ఆట అని అర్ధం. ఈ ట్రిప్ గురించి మాట్లాడుతూ – ‘‘ఇది నా ఫస్ట్ ‘భూత కోల’ ఎక్స్పీరియన్స్. చాలా ఎగై్జటింగ్గా అనిపించింది. ఇంతకు ముందు రక్షిత్ ద్వారా దీని గురించి విన్నాను. ఈ ఆచారాలను ఇంకా ఎంతోమంది ఫాలో అవుతున్నారంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత కూడా ‘భూత కోల’ లాంటి మరో సంప్రదాయ నృత్యాన్ని చూశాం. ఈ ట్రిప్ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. వెంటనే మా పనుల మీద బెంగళూర్ వెళ్లిపోవాల్సి ఉంది. ఉన్న ఆ కొద్ది టైమ్లో రక్షిత్ శెట్టి వాళ్ల ఇంట్లో కొద్దిసేపు గడిపాము. వాళ్ల ఫ్యామిలీ, కిడ్స్ అందరితో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాను. నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై కుడా సెర్వ్ చేశారు’’ అని కాబోయే అత్తారింటి విశేషాలను పేర్కొన్నారు రష్మికా. -
హిట్ అనుకున్నాం.. సూపర్ హిట్ అయ్యింది – నాగశౌర్య
‘‘ఛలో’ ఓ ఎమోషనల్ జర్నీ. మంచి సినిమా తీశాం. హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ పెద్ద హిట్.. సూపర్హిట్ అయ్యింది. టికెట్లు దొరకడం లేదని కొందరు నన్ను టికెట్లు అడుగుతుంటే ‘వీళ్లు కావాలనే అడుగుతున్నారా.. లేకుంటే నిజంగానే పెద్ద హిట్ అయ్యిందా అన్నది అర్థం కావడం లేదు’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛలో’. శంకర్ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఛలో’ సినిమాకి నేనొక్కడినే బలం కాదు. నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ. నాకు మా అమ్మానాన్న బలమైతే.. ఐరా క్రియేషన్స్కి బుజ్జి అంకుల్, శ్రీనివాసరెడ్డి అంకుల్ ఇద్దరే బలం. మరో నాలుగు సినిమాలు తీయొచ్చనే ధైర్యం ఇచ్చింది వారిద్దరే. ‘ఛలో’ని బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ రోజుల్లో డైరెక్టర్గా అవకాశం దొరకడం ఎంత కష్టమో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాకు తెలుసు. అటువంటిది నన్ను నమ్మి, సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఉషా ఆంటీ, శంకర్ప్రసాద్ అంకుల్. మిమ్మల్ని జీవితంలో మరచిపోలేను. శౌర్య, రష్మిక చాలా బాగా చేశారు’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘ఛలో’ సినిమాని ఆదరించడంతో పాటు నన్ను బాగా సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అన్నారు రష్మిక మండన్న. శంకర్ప్రసాద్, ఉషా, కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
దడ దడగా ఉంది : వెన్నెల కిశోర్
వెండితెర మీద తన కామెడీ టైమింగ్ తో అలరించే వెన్నెల కిశోర్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటాడు. తన షూటింగ్ అప్ డేట్స్తో పాటు ఫన్ని ట్వీట్స్ చేస్తూ ఫాలోవర్స్ను ఎంటర్టైన్ చేస్తుంటాడు. తాజాగా తనకు దడ పుట్టించిన ఓ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు ఈ కామెడీ స్టార్. వెన్నెల కిశోర్ ట్విటర్ అకౌంట్ ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫాలో అవుతున్నట్టుగా వచ్చిన నోటిఫికేషన్ స్క్రీన్ షాట్ను షేర్ చేశాడు. ఈ ఫొటోతో పాటు దడ పెరుగుతోంది అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కమెడియన్గా ఉన్న కిశోర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన టచ్ చేసి చూడు, ఛలో సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. సౌత్ లీడింగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఇదే తరహా నోటిఫికేషన్ వచ్చింది. అమితాబ్ తన ట్విటర్ అకౌంట్ ఫాలో అవుతున్నట్టుగా రకుల్ కు నోటిఫికేషన్ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన రకుల్ ‘అమితాబ్ బచ్చన్ మీ అకౌంట్ ను ఫాలో అవుతున్నారు అన్న నోటిఫికేషన్ చూసినప్పటి నా ఫీలింగ్ను మాటల్లో చెప్పలేను. థ్యాంక్యూ సర్’ అంటూ ట్వీట్ చేసింది రకుల్. 😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳palpitations in progress😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳😳 pic.twitter.com/nGIiqrsRGv — vennela kishore (@vennelakishore) 2 February 2018 Can't express my feelings when an alert stating @SrBachchan follows u back popped up. Thanku sir 😀😀🙏Such a wow feeling . #fanforever — Rakul Preet (@Rakulpreet) 2 February 2018 -
‘ఛలో’ మూవీ రివ్యూ
టైటిల్ : ఛలో జానర్ : కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : నాగశౌర్య, రష్మిక మందాన, నరేశ్, గిరిబాబు, పోసాని కృష్ణమురళి తదితరులు సంగీతం : మహతి స్వర సాగర్ బ్యానర్ : ఐరా క్రియేషన్స్ నిర్మాత : ఉషా మూల్పూరి దర్శకుడు : వెంకీ కుడుముల ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణవైభోగమే, జ్యో అచ్యుతానంద లాంటి క్లాస్ హిట్స్తో మెప్పించాడు నాగశౌర్య. మధ్యలో మాస్ హీరోయిజం కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. తిరిగి తన స్టైల్లో మాంచి లవ్ ఎంటర్టైనర్గా చేసిన ఛలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సారిగా తన సొంత బ్యానర్ను తన సినిమాతోనే ప్రారంభించారు. మరి సినిమా ఏ మేరకు అలరించిందో చూద్దాం. కథ : హరి( నాగశౌర్య )కి చిన్నతనం నుంచీ గొడవలంటే ఇష్టం. ఆ గొడవల్లో తనకు దెబ్బలు తగిలినా సరే ఆనందిస్తూనే ఉంటాడు. మొత్తానికి ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటాడు. చిన్నప్పుడు హరి ఏడుపు ఆపడం లేదనీ, హరి నాన్న( నరేశ్ ) అందర్నీ కొట్టు కొట్టు అని చూపిస్తూ..కొడుతూ ఉంటే హరి నవ్వుతూ ఉంటాడు. అలా మొదలైన నవ్వు స్కూల్లో, వీధుల్లో కొనసాగిస్తూనే ఉంటాడు. ఇది చివరికి నరేశ్కి తలనొప్పిగా మారుతుంది. తన కొడుకు గొడవలకు దూరంగా ఉండాలంటే గొడవలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో పెడితే మారతాడని అనుకుంటాడు. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో తిరుప్పురు అనే గ్రామంలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి.ఆంధ్ర రాష్ట్రం విడిపోయేప్పుడు తిరుప్పురు ఊరు మధ్యలోంచి సరిహద్దు వెళ్తుంది. మొదటగా సరిహద్దు గీయడానికి ఊరి పెద్దలు ఒప్పుకోరు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఊరు తమిళ, తెలుగు భాగాలుగా విడిపోతుంది. అప్పటి నుంచీ ఆ ఊరిలో అటు వైపు వారు ఇటు రారు. ఇటువైపు వారు అటు పోరు. అలాంటి ప్రాంతంలో హరిని ఉంచితే మారతాడని అక్కడి కాలేజీలో జాయిన్ చేస్తాడు. ఆ కాలేజ్లోనే కార్తీక(రష్మిక మందాన)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు హరి. అసలు ఆ కార్తీకకు ఊరికి సంబంధం ఏంటీ? ఆ ఊరి సమస్య హరి ప్రేమకు ఏమైనా అడ్డు తగిలిందా ? తన ప్రేమను కాపాడుకోవడానికి హరి చేసిని ప్రయత్నం ఏంటి? గొడవలంటే ఇష్టమున్న హరి తన ప్రేమకోసం ఊరిని ఒక్కటి చేస్తాడా? అసలు చివరకు ఏమైందో తెలియాలంటే థియేటర్కు ‘ఛలో’ అనాల్సిందే. నటీనటులు : నాగశౌర్య సహజంగా నటించాడు. చాక్లెట్ బాయ్లా కనిపిస్తూ.. అమ్మాయిల మనసు కొల్లగొట్టేస్తాడు. హీరోయిన్గా నటించిన రష్మిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది. తెలుగులో తొలి సినిమానే అయినా తన నటన, క్యూట్ లుక్స్తో అలరించింది. తొందరగానే తెలుగులో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. తండ్రి పాత్రలో సీనియర్ నరేశ్ ఒదిగిపోయాడు. ప్రగతి తల్లి పాత్రలో తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంది. కాలేజీ లెక్చరర్గా పోసాని, ప్రిన్సిపాల్గా రఘుబాబు, స్టూడెంట్స్గా వైవా హర్ష, శీను, సత్య ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తారు. వెన్నెల కిశోర్ కామెడీ సరికొత్తగా ఉంటుంది. ఊరి పెద్దలుగా తమిళనటులు జి.ఎం.కుమార్, మైమి గోపి, అచ్యుత్ కుమార్ వారి పాత్రకు న్యాయం చేశారు. విశ్లేషణ : వెంకీ కుడుముల దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా తన పెన్నులోని చమత్కారాన్ని చూపించాడు. ప్రతీ సన్నివేశంలో కామెడీ పండించాడు. థియేటర్లో నవ్వుల పువ్వులు పూస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఊరి ఫ్లాష్ బ్యాక్ గురించి హీరో తెలుసుకునేందుకు పడే పాట్లు, ముక్కలు ముక్కలుగా దాని గురించి తెలుసుకోవడం చాలా బాగుంటుంది. ద్వితియార్థంలో వచ్చే వెన్నెల కిశోర్ పాత్రను దర్శకుడు చాలా బాగా వినియోగించుకున్నాడు. ఆ పాత్ర ద్వారా వీలైనంత కామెడీ పండిచాడు. సరిహద్దు వివాదంగా ప్రమోట్ చేసిన ఈ సినిమాలో సీరియస్ నెస్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే నిరాశతప్పదు. ఊరు విడిపోవడానికి గల కారణాలు, క్లైమాక్స్లో ఊరు కలిసిపోయే విధానం కాస్త సిల్లీగా అనిపించినా కామెడీ సినిమాగా చూస్తే ఎంజాయ్ చేయోచ్చు. మ్యూజిక్ పరంగా మణిశర్మ తనయుడిగా మహతి నిరూపించుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు వినడానికీ, చూడడానికీ బాగుంటాయి. ముఖ్యంగా చూసి చూడంగానే పాట చాలా కాలం పాటు గుర్తుండి పోతుంది. సాయి శ్రీరామ్ తన కెమెరాతో నాగశౌర్య, రష్మికలను అందంగా చూపించాడు. సెకండాఫ్ హాఫ్ లెంగ్త్ కాస్త ఇబ్బంది పెడుతుంది. ప్లస్ పాయింట్స్ : నాగశౌర్య నటన రష్మిక నటన, అందం కామెడీ మైనస్ పాయింట్స్ : ఎక్కడా సీరియస్నెస్ కనపడకపోవడం సెకండాఫ్ నిడివి ముగింపు : హాయిగా నవ్వుకోవాలంటే సినిమాకి చల్ ‘ఛలో’.... బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
లేఛలో నుంచి ఛలో వచ్చింది
‘‘గతంలో నా సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవాణ్ణి కాదు. అయితే సినిమా పోతే ముందు నన్నే క్వొశ్చ చేస్తున్నారు. అందుకే కొంచెం ఎక్కువ బాధ్యత తీసుకుని ఈ కథ కోసం వెంకీతో కలిసి ఏడెనిమిది నెలల పాటు కష్టపడ్డాం. నాకు ఏదైనా నచ్చకపోతే వెంకీకి చెప్పి మార్పించుకునేవాణ్ణి. అయితే షూటింగ్ స్టార్ట్ చేశాక ఇన్వాల్వ్ కాలేదు’’ అన్నారు నాగశౌర్య. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య, రష్మికా మండన్న జంటగా శంకర్ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి, నిర్మించిన ‘ఛలో’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. ► అమ్మానాన్న ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు. నిర్మాతలుగా ఫస్ట్ టైమ్ కాబట్టి, మొదట్లో కాస్త ఇబ్బందిపడినా ఆ తర్వాత ఈజీ అయింది. ఎక్కడా రాజీపడలేదు. అమ్మ దగ్గరుండి క్వాలిటీగా వచ్చేట్లు చూసుకుంది. అనుకున్నట్లుగా బాగా తీయగలిగాం. సినిమా బిజినెస్ పూర్తయింది. నైజాం మాత్రం మేం ఉంచుకుని మిగతా ఏరియాలు అమ్మేశాం. హిందీ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ► మా బేనర్కి ‘ఐరా’ అని పేరు పెట్టడానికి కారణం నాకు ఏనుగులంటే ఇష్టం. ఇంద్రుడు వాహనం ఐరావతం వచ్చేట్లు ఐరా క్రియేషన్స అని పెట్టాం. నా ఇష్టదైవం వినాయకుడు. మా బుజ్జి అంకుల్, శ్రీనివాసరెడ్డిగారు బ్యాక్బోన్ లా నిలబడ్డారు. కెమెరామేన్ సాయిశ్రీరామ్ బాగా సహకరించారు. సాగర్ మహతి మంచి పాటలిచ్చారు. ► రామ్చరణ్ ‘బ్రూస్లీ’ సినిమా చూస్తున్నప్పుడు ‘లేఛలో..’ పాట చూసి, అదే టైటిల్గా పెడితే? అనుకున్నాం. లేఛలోని కుదించి, ఛలో అని పెట్టాం. కథకు తగ్గ టైటిల్ ఇది. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని ఒక ఊరు తెలుగు, తమిళ్ అని రెండుగా విడిపోతుంది. రెండు ఊళ్లకు మధ్యన ఉన్న కంచెను ఎవరైనా దాటితే రూల్ ప్రకారం చంపేస్తారు. అలాంటి ఊళ్లోకి నేనెందుకు వెళ్లాను? అనేది మెయిన్ థీమ్. హీరోయిన్తో చేసిన సీన్స్ మినహా మిగతా అన్ని సీన్స్లోనూ నేను రియల్ లైఫ్లో ఉన్నట్లే ఉంటాను. ► వెంకీ కుడుములకు డైరెక్టర్గా మంచి పేరు వస్తుంది. ‘జాదూగాడు’ సినిమా అప్పుడు ఏర్పడిన మా పరిచయం మంచి స్నేహంగా మారింది. తను నన్ను ‘చిట్టి’ అని పిలుస్తాడు. నాతో సినిమా చేయాలని ఉన్నా, చెప్పలేదు. అది గ్రహించి, స్టోరీ రెడీ చేయమన్నాను. ‘సినిమా కన్నా స్నేహం ముఖ్యం’ అంటే.. కథ రెడీ చేసుకోమన్నాను. ఓ రెండు లైన్స్ అనుకున్నాక.. అవి కాదనుకుని ‘ఛలో’ స్టోరీ బాగుందనిపించి, ఫైనలైజ్ చేశాం. నిహారికతో పెళ్లా? నటుడు నాగబాబు కుమార్తె నిహారికతో మీ పెళ్లి అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి? అని అడిగితే –‘‘ఆ వార్తలకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోందని మంగళవారం నా ఫ్రెండ్స్ చెబితే నాకు తెలిసింది. ఇప్పుడు పెళ్లి ఆలోచనే లేదు. మరో మూడు నాలుగేళ్ల తర్వాత అమ్మ బలవంతపెడితే అప్పుడు చేసుకుంటా. ∙ -
అంత మెచ్యూర్టీ ఇంకా రాలేదు
‘‘ఏ సినిమాకైనా స్టోరీ ఇంపార్టెంట్ అని నమ్ముతాను. ‘ఛలో’ సినిమాలో ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉందనిపించింది. వెంటనే గ్రీన్సిగ్నల్ ఇచ్చాను’’ అన్నారు రష్మికా మండన్న. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ‘ఛలో’ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో కథానాయిక రష్మిక మాట్లాడుతూ– ‘‘డిగ్రీ కంప్లీట్ చేయడానికి బెంగళూరు వచ్చా. ఆ టైమ్లోనే కన్నడ చిత్రం ‘కిర్రిక్ పార్టీ’లో నటించే చాన్స్ వచ్చింది. అలా నా సినీ ప్రయాణం స్టారై్టంది. ‘కిర్రిక్ పారీలో నా యాక్టింగ్ చూసి ‘ఛలో’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు దర్శక–నిర్మాతలు. ఐరా క్రియేషన్స్ ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లోకి ఎ్రంటీ ఇస్తున్నందుకు హ్యాపీ. షూటింగ్ స్పాట్లో చాలా ఎంజాయ్ చేశా. ‘ఛలో’ యాప్ట్ టైటిల్ అని సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అనుకుంటారన్న నమ్మకం ఉంది. షూటింగ్కి ముందు రోజే దర్శకులు వెంకీగారు డైలాగ్స్ పేపర్స్ ఇచ్చేవారు. డైరెక్టర్కు థ్యాంక్స్. ప్రిపేరై లొకేషన్కి వెళ్లెదాన్ని. సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి ఈ ప్రాసెస్ ఉపయోగపడింది. భవిష్యత్లో నేను చేయబోయే చిత్రాలకు సొంత డబ్బింగ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నాగశౌర్య మోస్ట్ కంఫర్టబుల్ హీరో. షూటింగ్ టైమ్లో చాలా హెల్ప్ చేశారు. ఎవరినైనా ఇన్స్పైరింగ్గా తీసుకునేంత మెచ్యూర్టీ నాలో ఇంకా రాలేదు. కానీ హీరోయిన్ అనుష్కా శెట్టి వర్కింగ్ స్టైల్ అండ్ కమిట్మెంట్ నాకు ఇన్స్పైరింగ్లా అనిపిస్తాయి. ప్రజెంట్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నాను. కన్నడలో మరో రెండు సినిమాలు చేస్తున్నా’’ అన్నారు. -
నాకు స్ఫూర్తి ఆ ఇద్దరే – వెంకీ కుడుముల
‘‘నాది ఖమ్మం జిల్లా అశ్వరావుపేట. సినిమాలపై ఆసక్తితో రచయిత బలభద్రపాత్రుని రమణి ద్వారా తేజ గారి వద్ద ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరా. ఆ తర్వాత ‘అ ఆ’ సినిమాకు త్రివిక్రమ్గారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశా. దర్శకులు త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ నాకు స్ఫూర్తి’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ‘ఛలో’ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర ్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ –‘‘నాగశౌర్య ‘జాదూగాడు’ సినిమాకు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసా. నా వర్క్ నచ్చడంతో కథ రెడీ చేసుకురమ్మన్నారు శౌర్య. నేను వినిపించిన ‘ఛలో’ స్టోరీ ఆయనకు నచ్చడంతో సినిమా ప్రారంభమయ్యింది. నన్ను, నా కథను నమ్మి నాగశౌర్య పేరెంట్స్ ఈ సినిమా నిర్మించినందుకు వారికి నా కృతజ్ఞతలు. కన్నడ ‘కిరిక్ పార్టీ’ సినిమా చూశాక రష్మిక హీరోయిన్గా కరెక్ట్ అనిపించింది. నాగశౌర్యతో పాటు ఆయన పేరెంట్స్ కూడా ఓకే అనడంతో తనని తీసుకున్నాం. సంగీత దర్శకుడు సాగర్ మణిశర్మగారి అబ్బాయి అని అందరికీ తెలుసు. ‘జాదూగాడు’ టైమ్లో నాకు పరిచయమయ్యారు. ‘ఛలో’ సినిమాకు మంచి పాటలిచ్చారు. ఇప్పటి యువ దర్శకులపై త్రివిక్రమ్గారి ప్రభావం ఉంటుంది. అయితే ఆయన్ని అనుకరించకూడదు. సినిమా అవుట్పుట్ చూశాక టెన్షన్ లేదు. ‘ఛలో’ రిలీజ్ తర్వాత కొత్త సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభిస్తా’’ అన్నారు. -
‘అప్పుడు నా ఫంక్షన్ తూతూ మంత్రంగా జరిగింది’
‘‘నాగశౌర్య సినిమాలు బిగ్ స్క్రీన్పై చూడలేదు. తను మా నిహారికతో చేసిన ‘ఒక మనసు’ చిత్రం టీవీలో చూశా. హ్యాండ్సమ్గా, మంచి పర్సనాలిటీతో ఉన్నాడు. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీకి కావాలి, రావాలి. అప్పుడే కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా ఉంటుంది’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛలో’. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ –రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఏ పరిచయం ఉందని నాగశౌర్య ఫంక్షన్కి చిరంజీవి వచ్చాడు అనుకుంటున్నారా? నన్ను కలవాలని నాగశౌర్య తన తల్లి ఉషగారితో మా ఇంటికొచ్చాడు. ‘మా ‘ఛలో’ ప్రీ–రిలీజ్ వేడుక మీ సమక్షంలో జరగాలి’ అని కోరితే ఆలోచించకుండా వస్తానన్నాను. అలా అనడానికి కారణం ఉంది. నా తొలినాళ్లలో నా సినిమా వంద రోజుల ఫంక్షన్కి నేను అభిమానించే ఓ పెద్ద స్టార్ని రమ్మని పిలిచాం. ఆయన వస్తే ఆ ఉత్సాహం.. ప్రోత్సాహం బాగుంటుందని. ఆయన బిజీగా ఉండి రాలేకపోయారు. ఆ రోజు ఫంక్షన్ తూతూ మంత్రంగా జరుపుకున్నాం. అప్పుడు చాలా నిరుత్సాహపడ్డా. ఇప్పుడు నాగశౌర్యలో నన్ను నేను చూసుకున్నా. నాలాంటి వాళ్లు వెళితే తనకి ఇచ్చే ప్రోత్సాహం.. ఉత్సాహం వేరు. అందుకే వస్తానన్నా. రెండు మూడేళ్లుగా టాలీవుడ్లో పెద్ద స్టార్ల సినిమాలు ఎంత హిట్ అయ్యాయో.. యంగ్స్టార్స్ సినిమాలూ అంతే హిట్ అయ్యాయి. ‘ఉయ్యాల జంపాల, పెళ్ళిచూపులు, ఊహలు గుసగుసలాడే, శతమానం భవతి, ఫిదా, అర్జున్రెడ్డి, హలో’ వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ‘ఛలో’ మంచి విజయం సాధించి, శౌర్య కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలవాలని కోరుకుంటున్నా. ట్రైలర్ చూడగానే సినిమా ఎంత త్వరగా చూడాలా అనిపించింది. వెంకీ నాకు ఓ డైరెక్టర్లా అనిపించలేదు. మీలో ఒక్కడిగా అనిపించాడు. నా అభిమాని డైరెక్టర్ అయ్యాడంటే సంతోషంగా ఉంది. రేపు మీలో ఎవరైనా ఈ స్థాయికొస్తే ఆశీర్వదించేవాళ్లలో తొలి వ్యక్తి నేనే. మణిశర్మ అబ్బాయి సాగర్ పాటలు చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాల విజయం ఈ పరిశ్రమకు అవసరం. మీరందరూ ఈ సినిమాని ఆశీర్వదించాలి’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘చిరంజీవి సార్.. పదేళ్లు ఎక్కడికి వెళ్లిపోయారు? ఇలాంటి ఆడియో ఫంక్షన్స్.. ఇంతమంది జనాలు.. ఇండస్ట్రీలో మీరు లేకపోవడంతో ఆడియో రిలీజ్లు హోటల్స్లో చేసుకోవాల్సి వస్తోంది సార్. అది ఆడియో రిలీజా? రిసెప్షనా? అని అర్థం కాకుండా జరుపుకుంటున్నాం. మళ్లీ మెగాస్టార్ వచ్చారు. ఆడియో రిలీజ్ అంటే ఏంటో చూపించారు. చిరంజీవిగారు నటిస్తున్న రోజుల్లో 1,2,3,4.. అంటూ నాలుగు కుర్చీలుండేవి. ఆయన వెళ్లిపోయాక కుర్చీలు లేవు. అందరూ నిల్చోవడమే. మళ్లీ ఆయన వచ్చారు.. కుర్చీ తెచ్చుకున్నారు.. కూర్చున్నారు. ఇంకెవరూ రారు.. రాలేరు.. కూర్చోలేరు.. ఆ కుర్చీ ఆయనది కాదు. ఆయనకోసమే కుర్చీ పుట్టింది. మరో జన్మంటూ ఉంటే మళ్లీ మా అమ్మనాన్నలకు కొడుకుగా.. మెగాస్టార్ అభిమానిగానే పుడతా’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘చిరంజీవి సార్.. మీ ఫ్యాన్స్, ఫాలోయర్స్ లిస్టులో నేనూ ఒకడిని. ‘ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్’ సినిమాలకు బట్టలు చింపుకుని మరీ కటౌట్లు కట్టాను. మిమ్మల్ని లైఫ్లో ఒక్కసారి కలవాలనుకున్నా. కానీ మా సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో కలుస్తానని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు. కెమెరామెన్ సాయి శ్రీరామ్, నిర్మాత సి.కల్యాణ్, దర్శకులు వంశీ పైడిపల్లి, నందినీరెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పాటల రచయిత భాస్కరభట్ల, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
'ఛలో' స్టిల్స్
-
‘అసలేంటి భయ్యా ఈ ఊరి గొడవ’
ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల కాస్త స్లో అయ్యారు. వరుసగా ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కణం’ సినిమాతో పాటు తెలుగులో వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఛలో’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ‘ఛలో’ సినిమాను నాగశౌర్య అమ్మనాన్నలు ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ రాష్ట్రాల మధ్య ఉన్న ఓ ఊరి గొడవ నేపథ్యంలో ఎంటర్టైనింగ్ సినిమాను రూపొందించారు. నాగశౌర్య సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. -
' ఛలో ' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
సక్సెస్ గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నాం – నాగశౌర్య
‘‘సాయి శ్రీరామ్గారు ఇచ్చిన ధైర్యంతో మేం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాం. వెంకీ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. నిర్మాతలు మా తల్లిదండ్రులే. వారి గురించి పెద్దగా మాట్లాడలేను. అయితే నిర్మాతలుగా మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘ఛలో’ సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘ఛలో’. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. కొత్త సంవత్సరం సందర్భంగా సినిమాలోని రెండో పాటను సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు, బీఏ రాజు విడుదల చేశారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘అసోసియేట్ డైరెక్టర్ని అయిన నేను ‘ఛలో’ సినిమాతో డైరెక్టర్గా మారాను. ఈ కొత్త ఏడాదిలో మంచి పేరున్న డైరెక్టర్ అవుతాననే నమ్మకం ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్కు మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరి 2న సినిమాని గ్రాండ్గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ప్రసాద్ మూల్పూరి. ‘‘కథ విన్నప్పుడే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పా. సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ రైట్స్తో పాటు, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడైపోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు సీనియర్ నరేశ్. పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్. -
‘ఛలో’ రిలీజ్ వాయిదా..!
ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల కాస్త స్లో అయ్యాడు. వరుసగా ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కణం’ సినిమాతో పాటు తెలుగు వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ఛలో’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ‘ఛలో’ సినిమాను నాగశౌర్య అమ్మనాన్నలు ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ను చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ లో కాకుండా ఫిబ్రవరి తొలి వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి రిలీజ్ వాయిదాపై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. -
తండ్రి మ్యూజిక్ బ్రహ్మ..కొడుకు మ్యూజిక్ ప్రిన్స్ – నాగశౌర్య
‘‘ఛలో’ టీజర్కి మంచి స్పందన వచ్చింది. రిలీజ్ చేసిన తొలి పాటకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సాగర్ మహతి చక్కటి సంగీతం అందించారు. సాగర్ తండ్రి మణిశర్మగారు మ్యూజిక్ బ్రహ్మ అయితే, సాగర్కి మ్యూజిక్ ప్రిన్స్ అని పేరు పెట్టాలనుకుంటున్నా’’ అన్నారు నాగశౌర్య. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముప్పలూరి సమర్పణలో ఉషా ముప్పలూరి నిర్మిస్తున్న సినిమా ‘ఛలో’. ఈ చిత్రం తొలి పాటను హైదరాబాద్లో విడుదల చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి మా అమ్మ, నాన్నలే నిర్మాతలు. నాకు నచ్చిన స్క్రిప్ట్ను నమ్మి, వారు ఈ సినిమా చేస్తున్నారు. కన్నడ హిట్ మూవీ ‘కిరిక్ పార్టీ’ రష్మిక మండన్నా చక్కగా నటించారు. సాయిశ్రీరామ్ ప్రతి సీన్ను అందంగా చూపించారు’’ అన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు టైమ్లో నా కథ ఓకే చేశారు. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా అడిగిన దాని కంటే ఎక్కువగానే ఇచ్చారు నిర్మాతలు. సినిమా బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శంకర్ ప్రసాద్ ముప్పలూరి. -
సినిమా తీయడం పెద్ద అవస్థ – త్రివిక్రమ్
‘‘నాకు సినిమా తప్ప వేరే విషయాలు గురించి పెద్దగా తెలియదు. పెద్దది కావొచ్చు.. చిన్నది కావొచ్చు! రాజమౌళి నుంచి అవసరాల శ్రీనివాస్ వరకూ ఎవరైనా సినిమా తీస్తూనే ఉండాల్సిందే’’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. నాగశౌర్య, రష్మికా మండన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఛలో’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ని త్రివిక్రమ్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వ శాఖలో పనిచేసిన వారిలో వెంకట్ ఒకడు. నాకిష్టమైన వాళ్లలో తనూ ఒకడు. వెంకీ డైరక్టర్ కావడం హ్యాపీ. సాయి కొర్రపాటి బ్యానర్తో నాగశౌర్య మొదలు పెట్టిన ప్రయాణం తన సొంత బ్యానర్ వరకూ వచ్చింది. కొత్త బ్యానర్లో సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను చేసిన ‘స్వయంవరం’ సినిమాకు చాలా కష్టాలు పడ్డాను. సినిమా తీయడం పెద్ద అవస్థ. ఆ అవస్థను ‘ఛలో’ యూనిట్ అధిగమించిందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ యూనివర్సిటీలా భావిస్తే, అందులో త్రివిక్రమ్గారిని హయ్యస్ట్ కేడర్ ప్రొఫెసర్గా భావిస్తా. అటువంటి దర్శకుడి వద్ద పనిచేయడం గర్వంగా ఉంది. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్లో జరిగే కాలేజీ లవ్స్టోరీ ఇది’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘నాకిష్టమైన త్రివిక్రమ్ గారి చేతుల మీదగా టీజర్ విడుదల కావడం హ్యాపీ. ఆయన బ్యానర్లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారో.. నా బ్యానర్లోనూ అలాంటి చిత్రాలు తీసేందుకు ప్రయత్నిస్తా’’ అన్నారు నాగశౌర్య. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు రష్మికా మండన్నా. ఈ సినిమాకి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్. -
నటుడిగా మరో మెట్టు పైకి...
ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు కళాశాల ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘ఛలో’. నాగశౌర్య, రష్మికా మండన్న జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శంకర్ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ను ఈ శనివారం రిలీజ్ చేస్తున్నారు. ఉషా ముల్పూరి మాట్లాడుతూ– ‘‘ఛలో’ ఫస్ట్ లుక్ పోస్టర్స్కి ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మంచి కథను కమర్షియాలిటీ మిస్ కాకుండా ఎంటర్టైనింగ్గా చెప్పారు వెంకీ. నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. డిసెంబర్ 29న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నటుడిగా నాగశౌర్య అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన్ని ‘ఛలో’ సినిమాలో వైవిధ్యంగా చూపించబోతున్నాం. నటుడిగా తనను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఈ నెల 18న వచ్చే టీజర్తో సినిమాపై అంచనాలు పెరుగుతాయి’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘దర్శకుడు వెంకీ కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. నాగశౌర్యకు మంచి కమర్షియల్ హిట్ సినిమా అవుతుందని దీమాగా చెబుతున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 29న సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నాం’’ అని శంకర్ప్రసాద్ ముల్పూరి అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్. -
హైదరాబాద్ టు తిరుపురం
‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణ వైభోగం’ వంటి సినిమాలతో అలరించారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పని చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కన్నడ ‘కిరిక్ పార్టీ’ ఫేమ్ రష్మికా మండన్న కథానాయిక. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘ఛలో’ టైటిల్ ఖరారు చేశారు. ఉషా మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ లవ్స్టోరీ, క్లైమాక్స్తో పాటు ఎంటర్టైన్మెంట్తో రూపొందిన చిత్రమిది. మేము సినిమా నిర్మాణంలోకి వస్తామనుకోలేదు. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో, ఈ సినిమాను నిర్మిద్దామనుకున్నాం. కెమెరామేన్ సాయి శ్రీరామ్గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. కథలు నచ్చితే బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. ‘‘ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో జరిగే కాలేజ్ లవ్స్టోరీ ఇది. హైదరాబాద్ నుంచి హీరో తిరుపురం వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందన్నది ఆసక్తిగా ఉంటుంది. నాగశౌర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు శంకర ప్రసాద్ ముల్పూరి. ఈ సినిమాకి సంగీతం: సాగర్ మహతి. -
‘ఛలో’ అంటున్న యంగ్ హీరో
మంచి విజయాలతో కెరీర్ ప్రారంభించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత ఆ ఫాం కొనసాగించలేకపోయాడు. లవర్ భాయ్ ఇమేజ్కు చేరువవుతున్న తరుణంలో వరుస ఫ్లాప్ లు ఎదురై కష్టాల్లో పడ్డాడు. సోలో హీరోగా ఆకట్టుకోలేకపోయిన నాగశౌర్య జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి లాంటి సినిమా లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా మరోసారి సోలో హీరోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు నాగశౌర్య. కొత్త దర్శకుడు వెంకీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ఛలో అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను నాగశౌర్య అమ్మా నాన్నలే నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగు తమిళ భాషల్లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న కణం సినిమాలోనూ నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, నాగశౌర్యకు జోడిగా నటిస్తోంది. -
తాటాకు చప్పుళ్లకు భయపడొద్దు
క్రమశిక్షణతో పాదయాత్రకు తరలిరండి కాపులకు ముద్రగడ పిలుపు కిర్లంపూడి (జగ్గంపేట) : పోలీసుల తాటాకు చప్పుళ్లకు భయపడవద్దని, ఈ నెల 26న చేపట్టనున్న ఛావో రేవో ఛలో అమరావతి పేరుతో నిర్వహించనున్న నిరవధిక పాదయాత్రకు కాపులు భారీగా తరలిరావాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామం నుంచి భారీ సంఖ్యలో మోటారుసైకిళ్లపై కాపులు తరలివచ్చి ముద్రగడ చేపట్టనున్న పాదయాత్రకు సంఘీభావం తెలపడమే కాకుండా పాదయాత్రలో పాలుపంచుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారినుద్ధేశించి మాట్లాడుతూ పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమనండి .. కేసులకు భయపడే పనిలేదు , ఏది ఏమైనా ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతికి ఇచ్చిన హామీలు సాధించుకుంటేనే కాపు జాతి భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాపు జాతి భవిష్యత్తు కోసం ఊపిరున్నంత వరకు పోరాడే వ్యక్తి ఒక్క ముద్రగడ పద్మనాభం ఒక్కరేనన్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌతు స్వామి, తూము చినబాబు, చల్లా సత్యనారాయణ, తోట బాబు, గోకేడ సత్యనారాయణమూర్తి, మండపాక చలపతి, ఇబ్రహీంతో పాటు పోతులూరు గ్రామానికి చెందిన వాసిరెడ్డి నందబాబు, శెట్టి గంగబాబు, సిద్ధా దొరబాబు, చక్కపల్లి నాగేశ్వరరావు, పాలంకి సత్తిబాబు, చక్కపల్లి వెంకట్రావు, దేవారపు బాబూరావు, ఎలుగుబంటి బాబ్జి, శెట్టి చక్రరావు, పసుపులేటి కృష్ణ, చీకట్ల రామకృష్ణ, శ్రీపతి నాగేశ్వరరావు, భారీ సంఖ్యలో కాపు నాయకులు పాల్గొన్నారు. -
చలో అమరావతితో చావో రేవో తేల్చుకుంటాం..
- జైల్లో పెట్టినా బెయిల్ తెచ్చుకుని పాదయాత్ర కొనసాగిస్తా - నిరవధిక పాదయాత్రకు అడ్డుతగిలి అప్రతిష్టపాలుకావద్దు - ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ లేఖ - జూలై 26న పాదయాత్ర రూట్ మ్యాప్ వివరాలు ప్రకటన జగ్గంపేట/కిర్లంపూడి : ఎన్నికల సమయంలో మా జాతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుర్తు చేయడం కోసం జూలై 26న చావోరేవో చలో అమరావతి కార్యక్రమం చేపట్టినట్టు మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను, రూట్మ్యాప్ను విడుదల చేశారు. లేఖ సారాంశమిదీ... చావో రేవో చలో అమరావతి నిరవధిక పాదయాత్ర జూలై 26వ తేదీ నుంచి చేస్తానని ప్రకటించగానే విశాఖ మహానాడులో ‘కమిషన్ రిపోర్టు తెప్పించుకుని కేబినేట్లోను పార్టీ మీటింగ్లోను, ప్రజలతోను, బీసీ నాయకులతోను వంద శాతం ఏకాభిప్రాయం వచ్చిన అనంతరం రిజర్వేషన్పై నిర్ణయం చేస్తామని సెలవిచ్చారు. ఈ చిలక పలుకులు మీ పాదయాత్రలోను ఎన్నికల ప్రచార సభల్లోను మాట్లాడినప్పుడు, మ్యానిఫెస్టో రచించినప్పుడు ఎందుకు లేవని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే కాదు 1993–94 మా జాతి (బలిజ, తెలగ, ఒంటరి, కాపు) రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బీసీ సోదరులు అనుభవించే కోటాలో మా జాతికి వాటా ఇమ్మని అడగలేదు. వారు అనుభవించే ఎ, బి, సి, డి, ఈ గ్రూపుల్లో కూడా మాకు ఇవ్వబోయే బీసీ రిజర్వేషన్ పెట్టవద్దు. ప్రత్యేక క్యాటగిరీ పెట్టే ఇవ్వండి అని అడుగుతున్నాం. మా మధ్య తగవులు పెట్టి పబ్బం గడుపుకోవడం మీకు అలవాటుగా మారింది. రిజర్వేషన్ అనే పండును మూడు సంవత్సరాలుగా డీప్ ఫ్రిజ్లో పెట్టి 2019 ఎన్నికల ముందు మా జాతికి ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే దురాలోచనలు, కుట్రలు తెలుసుకోలేనంత స్థితిలో మా జాతి లేదండీ. పాదయాత్ర రూట్ ఇదీ : జూలై 26 కిర్లంపూడిలోని తన నివాసం నుంచి ప్రారంభమయ్యే చలో అమరావతి పాదయాత్ర తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు మీదుగా కృష్ణ జిల్లా నుంచి అమరావతి వరకు నాలుగు జిల్లాలో పరిధిలో 116 గ్రామాల మీదుగా సాగనుంది. నిరవధిక పాదయాత్ర ప్రకటించడంతో షెడ్యూల్ ప్రకారం కాకుండా సమయానుకూలంగా యాత్ర సాగునుంది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర గ్రామాలు... జిల్లా మొత్తం 22 గ్రామాల్లో పాదయాత్ర జరగనుంది. కిర్లంపూడి, రాజుపాలెం, వీరవరం, రామచంద్రాపురం, గోనాడ, రామవరం, జగ్గంపేట, నీలాద్రిరావుపేట, తాళ్ళూరు, మల్లేపల్లి, గండేపల్లి, మురారి, రాజానగరం, చక్రద్వారా బంధం, రాదేయ్యపాలెం, శ్రీకృష్ణపట్నం, భపాలపట్నం, పుణ్యక్షేత్రం, శాటిలైట్ సిటీ, బి.ఆర్.కె.గార్డెన్, మెరంపూడి, కోటిపల్లి బస్స్టాండ్ నుంచి రోడ్ కం రైలు బ్రిడ్జి మీదుగా కొవ్వూరు వరకు. పశ్చిమలో : కొవ్వూరు వై జంక్షన్, నందమూరు, చాగల్లు, ఊనగట్ల, కలవలపల్లి, యస్.ముప్పవరం, బ్రహ్మణగూడెం, నిడదవోలు, సమిశ్రగూడెం, డి.ముప్పవరం, మునుపల్లి, కానూరు, నడిపల్లికోట, దమ్మెన్ను, మోర్త, ఉండ్రాజవరం, పాలంగి, పైడిపర్రు, తణుకు, కాకుల ఇల్లింద్రపర్రు, తూర్పువిప్పరు, పెనుగొండ, మోర్టేరు, కవిటం, వేడంగి, జిన్నూరు, పాలకొల్లు, దిగమర్రు, చిట్టివరం, నామనపల్లి, నర్పపూర్, పెదమూడపల్లి, లిఖితపూడి, సరిపల్లి, పొప్పరు, మల్లవరం, తిల్లపూడి, యస్.చిక్కాల, వీరవాసరం, గురువునందమూరు, శృంగవృక్షం, పెన్నాడ, గొరగనమూడి, విస్సాకోడేరు, భీమవరం, చినఅమిరం, పెద అమిరం, సీసలి, కాళ్ళ, కాళ్ళకూరు, జువ్వలపాలెం, ఏలూరుపాడు. కృష్ణాజిల్లాలో : కలిదిండి, కోరుకొల్లు, సానా దుర్రవరం, బొమ్మినంపాడు, అల్లూరు, క్రొగుంటపాలెం, ఈదేపల్లి, పెదగున్నూరు, సింగరాయంపాలెం, శ్రీహరిపురం, వడాలి, ముదినేపల్లి, పెదపాలపర్రు, వలివర్తిపాడు, గుడివాడ, కొమరోలు, చిన ఎరుకుపాడు, పామర్రు, కురమద్దాలి, మంటాడ, ఉయ్యూరు, ఆకునూరు, దవులూరు, కంకిపాడు, గోసాల, పెనమనూరు, పోరంకి, తాడిగడప, ఎనికేపాడు, రామవరప్పాడు, బెంజిసర్కిల్, రామలింగేశ్వర్నగర్, బాలాజీ నగర్, ఆర్టీసీ కాంప్లెక్, ప్రకాశం బేరేజీ. గుంటూరు జిల్లా : సీతానగరం, ఉండవిల్లి, తాడేపల్లి, సులకపేట, యర్రబాలెం, కృష్ణపాలెం, వెలగపూడి (అమరావతి). -
శిరోముండనం కేసులో పీపీ తొలగింపుపై 3న చలో కాకినాడ
కాకినాడ సిటీ: వెంకటయ్యపాలెం దళితుల శిరోముండనం కేసులో అధికారం అండతో పీపీని తొలగించడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్ 3న చలో కాకినాడ నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి తెలిపారు. బుధవారం స్థానిక సుందరయ్యభవన్లో సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, లిబరేషన్, న్యూడెమోక్రసీ, జనశక్తి వామపక్ష పార్టీలతో పాటు దళిత సంఘాల నాయకులు విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ పాలకులకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఏపాటిదో ఈ కేసుతో అర్థమవుతుందన్నారు. దువ్వా శేషుబాబ్జి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును ఒకసారి రద్దు చేసిందని తిరిగి హైకోర్టు జోక్యంతో కేసును పున్నయ్య కమిషన్ పునఃప్రారంభించిందన్నారు. దళితులందరూ 3న చలో కాకినాడకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 26కి ఈ కేసుతుది విచారణకు వచ్చే ముందు ఈ నెల 23న పీపీని తొలగిస్తూ జీఓ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ పార్టీలోని దళితులందరూ ఆత్మపరిశీలన చేసుకుని తోట త్రిమూర్తులను శిక్షించేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. 3న ఉదయం 10 గంటలకు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందని 11 గంటలకు కలెక్టరేట్ ముట్టడికి తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఎ.రామేశ్వరరావు(ఆర్పీఐ), బి.రమేష్(జనశక్తి), ఎం.కృష్ణమూర్తి (కేవీపీఎస్), తోకల ప్రసాద్ (డీహెచ్పీఎస్), ఎం.డేవిడ్రాజు(కేవీపీఎస్), జుత్తుక కుమార్ (ఏఐటీయూసీ) పాల్గొన్నారు. -
శిరోముండనం కేసులో పీపీ తొలగింపుపై 3న చలో కాకినాడ
కాకినాడ సిటీ: వెంకటయ్యపాలెం దళితుల శిరోముండనం కేసులో అధికారం అండతో పీపీని తొలగించడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్ 3న చలో కాకినాడ నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి తెలిపారు. బుధవారం స్థానిక సుందరయ్యభవన్లో సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, లిబరేషన్, న్యూడెమోక్రసీ, జనశక్తి వామపక్ష పార్టీలతో పాటు దళిత సంఘాల నాయకులు విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ పాలకులకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఏపాటిదో ఈ కేసుతో అర్థమవుతుందన్నారు. దువ్వా శేషుబాబ్జి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును ఒకసారి రద్దు చేసిందని తిరిగి హైకోర్టు జోక్యంతో కేసును పున్నయ్య కమిషన్ పునఃప్రారంభించిందన్నారు. దళితులందరూ 3న చలో కాకినాడకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 26కి ఈ కేసుతుది విచారణకు వచ్చే ముందు ఈ నెల 23న పీపీని తొలగిస్తూ జీఓ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ పార్టీలోని దళితులందరూ ఆత్మపరిశీలన చేసుకుని తోట త్రిమూర్తులను శిక్షించేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. 3న ఉదయం 10 గంటలకు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందని 11 గంటలకు కలెక్టరేట్ ముట్టడికి తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఎ.రామేశ్వరరావు(ఆర్పీఐ), బి.రమేష్(జనశక్తి), ఎం.కృష్ణమూర్తి (కేవీపీఎస్), తోకల ప్రసాద్ (డీహెచ్పీఎస్), ఎం.డేవిడ్రాజు(కేవీపీఎస్), జుత్తుక కుమార్ (ఏఐటీయూసీ) పాల్గొన్నారు. -
ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
కోదాడ: ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని కోరుతూ ఈ నెల 19 నుంచి ఆగష్టు 12 వరకు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఎమ్మార్పీస్ నేత మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయాలని మాదిగ మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షరాలు మారేపల్లి సావిత్రమ్మ కోరారు. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా నేటికి ఆ విషయాన్ని పట్టించుకోక పోవడం అన్యాయమన్నారు. ఈ నెల 29న మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతున్నందున కోదాడ నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మాతంగి శైలజ, గోళ్ల సుజాత, పిడమర్తి నాగేశ్వరి, బోడ శ్రీరాములు, ఏపూరి రాజు తదితరులు పాల్గొన్నారు.