daughter
-
'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)
-
కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)
-
నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)
-
'ఎంత ఎత్తుకు ఎదిగినా నాకు చిట్టి తల్లివే'.. మంచు లక్ష్మీ ఎమోషనల్
టాలీవుడ్ నిర్మాత, నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కూతురి హాఫ్ శారీ వేడుక గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు పాల్గొని సందడి చేశారు. తన మేన కోడలిని విద్యా నిర్వాణను చూసి మనోజ్ మురిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఎల్లప్పుడు నీ వెంటే ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.తాజాగా మంచు లక్ష్మీ తన కూతురిని తలచుకుంటూ మరో పోస్ట్ చేసింది. నువ్వు ఇంత అందమైన అమ్మాయిగా ఎదగడం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయిందని ట్వీట్లో రాసుకొచ్చింది. నీ దయ, సౌమ్యత, ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత.. నిన్ను 'నువ్వు'గా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం అంటూ కుమార్తె విద్యా నిర్వాణపై తల్లిగా తన ప్రేమను చాటుకుంది.మంచు లక్ష్మీ తన పోస్ట్లో రాస్తూ..'యాపిల్.. నిన్ను ఇంత అందమైన అమ్మాయిగా చూడటం నా హృదయాన్ని వర్ణించలేని ఆనందం. ఆ ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత... నిన్ను నువ్వుగా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం.. వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం. నువ్వు ఎదుగుతుండగా గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరాలకు వెళ్లినా సరే... నా హృదయంలో మాత్రం నువ్వు ఎప్పటికీ నా చిట్టి తల్లివే... సదా ఎల్లప్పుడూ నా కంటి పాపవే' అంటూ భావోద్వేగానికి గురైంది. Apple...Watching you blossom into such a beautiful young girl fills my heart with a joy I can’t even put into words. You are the very embodiment of kindness, gentleness, warmth, laughter, loyalty, and that effortless spark of sass that makes you you.Every moment of watching… pic.twitter.com/smHR7J6HZ8— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 24, 2026 -
ఒకే సీటు కోసం తండ్రి, కుమార్తెల ఫైట్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం తాజాగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏమిటంటే, అటు డీఎంకే లోనూ, ఇటు కాంగ్రెస్లోనూ ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన తండ్రీకూతుళ్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. డీఎంకేలో స్టాలిన్ సమక్షంలో ఇంటర్వ్యూ: చెన్నైలోని అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. సోమవారం ఈ ప్రక్రియ ముగియనుంది. ఆదివారం కోయంబత్తూరు జిల్లా డీఎంకే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో ఆర్.ఎస్.పురం ప్రాంత డీఎంకే కార్యదర్శి, 72వ వార్డు కౌన్సిలర్ కార్తీక్ సెల్వరాజ్ కోయంబత్తూరు దక్షిణం స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె కృపా శబరినాథన్ కూడా అదే సీటు కోరుతూ దరఖాస్తు సమరి్పంచారు. దీంతో పరిణామం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసిన స్టాలిన్, మీలో ఎవరికి సీటు ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారా? అని ప్రశ్నించడం గమనార్హం. ఇందుకు వారు స్పందిస్తూ, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామని, కొంగు మండలంలో వంద శాతం విజయం సాధించడమే తమ లక్ష్యమని తెలపడంతో స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ అదే సీన్ డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోయంబత్తూరు కార్పొరేషన్ మాజీ మేయర్ కలాలి వెంకటాచలం, ఆయన కుమార్తె గాయత్రి (ప్రస్తుత 44వ వార్డు కౌన్సిలర్) ఇద్దరూ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే కుటుంబానికి చెందిన తండ్రీ, కుమార్తె ఓ వైపు, కాంగ్రెస్ కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె మరో వైపు పోటీ పడుతుండటంతో ఇంతకీ ఈ సీటు కమల్ పార్టీ ఖాతాలోకి చేరేనా అన్న చర్చ ఊపందుకుంది. కమల్ ఖాతాలో పడేనా.. గత ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ పోటీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కోయబత్తూరు దక్షిణం నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఆయన సుమారు రెండు వేల లోపు ఓట్లతో బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసన్ చేతుల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా మక్కల్ నీది మయ్యం డీఎంకే కూటమిలో చేరింది. ఈ దృష్ట్యా, ఈసారి ఈసీటు ఆ పార్టీ ఖాతాలో పడేనా అన్నది వేచిచూడాల్సిందే. కమల్ తాజాగా ఎంపీ కావడంతో ఈ స్థానంలో ఆయన తరపున పార్టీ ప్రతినిధి పోటీ చేస్తారా..? లేదా, డీఎంకేకు వదలి పెడుతారా? అన్న చర్చ ఊపందుకుంది. ఒక వేళ కమల్ వదులకుంటే, ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే, మరో వైపు కాంగ్రెస్ మధ్య సమరం తప్పదేమో అన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
సీసీ కెమెరాతో తల్లిదండ్రులను పలకరింపు
-
8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు
మధ్యప్రదేశ్లోని నర్మదాపురం రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికను స్వయంగా తల్లే రైలు కిందకి తోసేసిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. సీసీటీవీలో రికార్డైన ఈ భయంకరమైన దృశ్యాలు వైరల్గా మారాయి.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం నర్మదాపురంలోని మలఖేడి ప్రాంతంలో నివసించే ప్రభుత్వ ఉద్యోగి బాధిత మహిళ. భర్త మరణం తర్వాత ఆమెకు కాంపెన్సేటరీ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి అప్పటి నుంచి వారిద్దరూ ఒంటరిగా జీవిస్తోంది. ఏం జరిగిందో తెలియదు గానీ, రైల్వే స్టేషన్కు వెళ్లి, ఉన్నట్టుండి రెండో తరగతి చదువుతున్న తన కుమార్తెను ఎదురుగా వస్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపైకి తోసివేసింది. దీంతో బాలిక తల, నడుము, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అయిపోయింది. ఆమెను కాపాడిన రైల్వే సిబ్బంది ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉంచిన చికిత్స అందించినా ఆమె పరిస్థితి విషమించడంతో భోపాల్లోని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!ఆందోళన కలిగించిన విషయం ఏమిటంటే..ఈ ఘటన జరగడానికి దాదాపు మూడు గంటల ముందు నుంచి తల్లీకూతుళ్లు ప్లాట్ఫారమ్పైనే ఉన్నారని నర్మదాపురం ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్చార్జి సంజీవ్ చౌక్సే వెల్లడించారు. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో తమిళనాడు ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారమ్ నెం. 1 వైపు వస్తుండగా, ఆ మహిళ అకస్మాత్తుగా చిన్నారిని పట్టాలపైకి తోసేసింది. లోకోమోటివ్ ఢీకొనడంతో ఆ బాలిక ప్లాట్ఫారమ్ అంచుకు, పట్టాలకు మధ్య ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలుతో నొప్పితో విలవిలలాడిపోయింది. దీంతో చుట్టుప క్కల వారు, రైల్వే సిబ్బంది ఆ చిన్నారి సహాయానికి పరుగెత్తుకొచ్చారు. ఆమెను బయటకు లాగిఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారికి సాయం చేయడానికి పరుగులు తీస్తున్నసందర్భంలో రైలుకిందకి బిడ్డను తోసేసిన ఆ మహిళ, బిడ్డను రక్షించవద్దని పదే పదే వేడుకుందని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో నిందిత మహిళ మానసిక ఆరోగ్య కోణం కూడా ఉండవచ్చని సూచిస్తోంది. ఆ మహిళ చికిత్స చరిత్రను ధృవీకరించే ప్రక్రియలో ఉన్నామని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
నటి మంచు లక్ష్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)
-
అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో
బాగా చదివి, ప్రయోజకులై,మంచి కానుకలతో తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేయాలని చాలా మంది బిడ్డల ఆలోచన. చక్కటి ఇల్లో, ఖరీదైన కారో కానుకగా ఇవ్వాలని చాలామంది డ్రీమ్. అలా తమ తల్లిదండ్రులకు ఒక సరికొత్త కారును గిఫ్ట్ ఇచ్చి, ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమ్మానాన్నలకు అపురూపమైన కానుకిచ్చిన ఇద్దరు కూతుళ్ళ కథ తెలుసుకుందాం పదండి.వర్ష అనే యువతి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సందడిగా మారింది. తన సోదరితో కలిసి తమ తల్లిదండ్రులకు కొత్త కారును గిఫ్ట్గా ఇచ్చింది.తమ తల్లిదండ్రుల కళ్ళకు గంతలు కట్టి డ్రైవ్వే వైపు మెల్లగా తీసుకొచ్చి మరీ బ్రాండ్ న్యూ కారు ఇచ్చారు. కొత్త కారును చూసి ఆ దంపతులు ఆశ్చర్య పోయారు. అందరూ కలిసి కారు పైన కవర్ తీయగానే అమ్మానాన్నల ముఖాల్లో వెయ్యి వోట్ల వెలుగు వచ్చింది. వెంటనే వారు తమ కుమార్తెలను హత్తుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. చుట్టూ ఉన్న బంధువుల చప్పట్లు, నవ్వులతో సందడిగా మారింది. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగాన్ని నింపాయి. View this post on Instagram A post shared by Varsha (@varshhaa.n)భావోద్వేగ సందేశం"మా తల్లిదండ్రులు ఇది లేదు, అది లేదు అని ఎపుడూ చెప్పలేదు. మమ్మల్ని ఏ విషయంలోనూ ఆపలేదు. ఎదిగి విజయం సాధించండి' అని మాత్రమే చెప్పారు. మా జీవితాంతం మాకు రక్షణగా, మద్దతుగా నిలిచినందుకు ఈ కారు ఒక చిన్న కృతజ్ఞత మాత్రమే. మేం నలుగురం ఒక్కటే."నెటిజన్ల ప్రశంసలుఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపించారు."ఇంతటి విలువైన కుమార్తెలను పొందిన ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు," అని ఒకరు "ఆ తల్లి కళ్లలోనే అంతా కనిపిస్తోంది. అందులో కేవలం ప్రేమానురాగాలు మాత్రమే ఉన్నాయి" అని మరొకరు రాశారు. కన్నబిడ్డలు ఎదుగుదల, తమకు గౌరవించే తీరు చూసినపుడు తల్లిదండ్రులు పొందే ఆ గర్వం, సంతోషం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
యాదాద్రిలో దారుణం.. కూతురు, కొడుకుపై తల్లి దాడి
-
యాద్రాద్రి భువనగిరి జిల్లాలో దారుణం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం తొక్కాపురం దారుణం జరిగింది. మానసికంగా బాగాలేక కూతురు, కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీలిమను ఉప్పల్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి దాడిలో కూతురు కృతికరెడ్డి మృతి చెందింది.బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. నిన్న(శనివారం) సాయంత్రం నీలిమ.. తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. -
కూతురితో బిగ్బాస్ సోనియా హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
-
'ఈ రోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది' మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి తన కూతురికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల బర్త్ డే సందర్భంగా చిరు విష్ చేశారు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి.. నేడు ఒక బలమైన, బాధ్యయుతమైన మహిళగా ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. నా సినిమాలు చూడటం.. ఇప్పుడు సినిమా నిర్మించడం.. నాకు చిరస్మరణీయమైన బ్లాక్బస్టర్ను అందించడం అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఒకటని ఆనందం వ్యక్తం చేశారు. తండ్రిగా నన్ను గర్వపడేలా చేశావని సుస్మితను కొనియాడారు.మెగాస్టార్ తన ట్వీట్ రాస్తూ..' నా ప్రియమైన సుస్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి నుంచి.. నేడు మీరు బలమైన, అందమైన బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగావ్. ఒక తండ్రిగా నాకు అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఇది ఒకటి. మీరు నా సినిమాలు చూడటం.. ఇప్పుడు ఏకంగా సినిమా నిర్మించడం, నాకు చిరస్మరణీయమైన బ్లాక్బస్టర్ను అందించడం.. నిజంగా నన్ను గర్వపడేలా చేసింది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, అంతులేని విజయం కలగాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ ఇలా ప్రకాశిస్తూ ఉండు నా ప్రియమైన హనీ పాపా. నీకు ఎల్లప్పుడూ నా ప్రేమ, ఆశీస్సులు ఉంటాయి' అని పోస్ట్ చేశారు. కాగా..ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మనశంకర వరప్రసాద్గారు చిత్రానికి సుస్మిత నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 'Happy Birthday my precious @sushkonidela ❤️From the little girl who once held my finger and walked beside me, to the strong, graceful and responsible woman you are today.One of the most special moments for me as a father was seeing you watching my films, now producing a film,… pic.twitter.com/Z8FwhsXUrQ— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2026 -
తన లవ్తో అమ్మ..అపుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు!
కనిపెంచిన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడం,పెళ్లిళ్లు చేయడం చాలా కామన్. అదే సమయంలో ఒంటరి తల్లితండ్రుల కోసం ఆలోచించడం, వారికి మళ్లీ ప్రేమను పరిచయం చేయడం పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా చూశాం.తల్లిగానీ, తండ్రి గానీ మళ్ళీ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనేది ఏ బిడ్డకైనా చాలా అరుదైన, భావోద్వేగంతో కూడిన క్షణం. అలాంటి హృదయాన్ని హత్తుకునే వేడుక ఒకటి నెట్టింట సందడిగా మారింది.పూజా భట్నాగర్ అనే యువతికి తన తల్లి వివాహ వేడుకను కళ్ళారా చూసే అదృష్టం దక్కింది. ఆ అద్భుతమైన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచు కున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రుల మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, పూజా తన తల్లి పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. తల్లి ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమార్తెగా మెరిసిపోతూ కనిపించారు. అలాగే ఒక ఏడాది క్రితం వివాహ సమయంలో పూజ పోస్ట్ చేసిన మరొక వీడియోలో,సింగిల్ మదర్గా ఒంటరిగా తన తల్లి ప్రయాణం గురించి మాట్లాడింది. ఎంతో ధైర్యంగా ఒంటరిగానే తనను పెంచి ప్రయోజకురాల్ని చేసిందని గుర్తు చేసుకుంది. ఇలాంటి తన తల్లికి తన జీవితంలోని కీలక మలుపులో మద్దతు ఇవ్వడం తన బాధ్యత అనిఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. కుమార్తె భావోద్వేగంఈ సందర్భంగా పూజ చాలా భావోద్వేగానికి లోనైంది. తల్లి వివాహం సందర్భంగా తాను అనుభవించిన అనుభూతుల గురించి వివరించింది. "ఆ రోజు నేను ఎన్ని ఆనంద బాష్పాలు కార్చానో ఎవరికీ తెలియదు. నా కళ్లముందే మా అమ్మ పెళ్లి జరగడం చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని అర్థమైంది." అని పేర్కొంది. ఈ జంటకు ఎవరి దిష్టి తగలకూడదని ఆకాంక్షిస్తూ "No Nazar" అని ఆమె పేర్కొన్నారు. అమ్మ తన ఆత్మబంధువును (Soulmate) పెళ్లి చేసుకోవడం చూస్తున్నారు" అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా కమెంట్స్ చేశారు. ఒక కూతురుగా తన తల్లి సంతోషం కోసం తీసుకున్న చొరవను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. View this post on Instagram A post shared by Pooja (Piyu) (@pooja_bhatnagar_) -
వైఎస్ జగన్ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)
-
బిడ్డ కోసం అమాంతం బావిలోకి దూకేసిన తల్లి..!
‘అమ్మ’ గొప్పదనం గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి మరీ బిడ్డల్ని కాపాడు కుంటుంది. తరతరాల చరిత్ర ఈ సత్యాన్ని పదే పదే నిరూపిస్తూనే ఉంది. పిల్లల్ని కాపాడటానికి తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఉదంతం బిడ్డలపై తల్లి ప్రేమ, చూపించే ధైర్య సాహసాలపై మరోసారి చర్చకు తావిచ్చింది. మాతృత్వం గౌరవాన్ని మరింత ఇనుపడింపజేసిన ఈ సంఘటన మంగళవారం జరిగింది.ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం తమిళనాడులోని నంబియూర్ సమీపంలో అయియంకట్టు తొట్టంలో తన కూతురిని కాపాడటానికి 55 ఏళ్ల మహిళ లోతైన బావిలోకి దూకేసింది. ఊంజపాళయంకు చెందిన సుందరం కుమార్తె దివ్య (27) స్పెషల్ నీడ్ చైల్డ్. ఇందుకోసం చికిత్స కూడా పొందుతోంది. ఆత్మహత్య చేసుకోవాలని ఆమె బావిలోకి దూకేయడంతో అక్కడే ఉన్న తల్లి ముత్తుమణి క్షణం కూడా ఆలోచించికుండా కూతుర్ని కాపాడేందుకు సాహసానికి పూనుకుంది. వెంటనే తాను కూడా బావిలోకి దూకేసి, కుమార్తెను గట్టిగా పట్టుకుంది. సహాయం కోసం ఆమె వేసిన కేకలు ఆ ప్రాంతం అంతటా ప్రతిధ్వనించాయి. దీంతో పొరుగువారు అప్రమత్తమై కడ్తూర్ పోలీసులకు, నంబియూర్ అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేదాకా ఆమె బిడ్డను కాపాడుకుంది. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ముత్తుమణి ధైర్యాన్ని స్థానికులు ప్రశంసలు కురిపించారు. తల్లీ బిడ్డల్ని కాపాడిన అగ్నిమాపక శాఖ కృషిని కూడా కొనియాడారు ఈ సంఘటనపై పోలీసులు సాధారణ విచారణ ప్రారంభించారు.In a split-second act of courage, a 55-year-old woman jumped into a deep well to save her daughter, triggering a dramatic rescue operation in Aiyankattu Thottam near Nambiyur on Tuesday.Divya, 27, daughter of Sundaram from Oonjapalayam, reportedly leaped into a well in the… pic.twitter.com/TeRzAkL4kF— IndiaToday (@IndiaToday) March 4, 2026 -
నేను ఎమ్మెల్యే అవుతా...! కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
-
మెగా డాటర్ నిహారిక ఫిబ్రవరి గడిచిందిలా (ఫొటోలు)
-
ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఆమెకే?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిని ఖరారు చేశారా? గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ చర్చకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన కుమార్తె కిమ్ జు ఆయేను దేశ తదుపరి అత్యున్నత నేతగా తీర్చిదిద్దే క్రమంలో కిమ్ కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవల జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో జు ఆయే స్వయంగా స్నిపర్ రైఫిల్ను ధరించి, లక్ష్యాన్ని ఛేదిస్తున్న చిత్రాలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ (KCNA) విడుదల చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సైనిక అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల కొత్త తరం స్నిపర్ రైఫిళ్లను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్ తన కుమార్తెకు కూడా ఒక రైఫిల్ను బహుకరించడం విశేషం. ఈ ఆయుధాలను అద్భుతమైన ఆయుధాలుగా వర్ణించిన కిమ్, ఇవి తన నమ్మకానికి ప్రతీకలని పేర్కొన్నారు.ఉత్తర కొరియా అధికార పార్టీ అయిన వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (డబ్ల్యూపీకే) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అకాడమీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ తయారు చేసిన అత్యాధునిక రైఫిళ్లను కిమ్ పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే కిమ్ కుమార్తె జు ఆయే(13) తన తండ్రి తరహాలోనే లెదర్ జాకెట్ ధరించి షూటింగ్ రేంజ్లో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు కిమ్ ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయి. గతంలో ఆమెను కేవలం కుమార్తెగా పిలిచిన ప్రభుత్వ మీడియా ఇప్పుడు ‘గౌరవనీయ కుమార్తె’గా సంబోధిస్తుండటం గమనార్హం.జు ఆయే ఇప్పటికే తన వారసత్వ శిక్షణను పూర్తి చేసుకుని, అధికారిక హోదాను ఖరారు చేసే దశకు చేరుకుందని దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్ఐఎస్) చెబుతోంది. ఆమె ఇప్పటికే విధానపరమైన అంశాల్లో తనదైన ముద్ర వేస్తోందని, దేశంలో అప్రకటిత రెండో అత్యున్నత నేతగా చలామణి అవుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైఫిల్ను స్వీకరించారు. అయితే, మొదటిసారిగా కేసీఎన్ఏ ఆమెను పార్టీ కేంద్ర కమిటీలోని ‘జనరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్’గా గుర్తించి, ఆమె అధికార పరిధిని స్పష్టం చేసింది.ఒకప్పుడు కిమ్ వారసురాలిగా యో జోంగ్ పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు జు ఆయే తెరపైకి రావడం కొరియా రాజకీయాల్లో కొత్త మలుపుగా పరిగణిస్తున్నారు. కిమ్ ఇల్ సంగ్ స్థాపించిన ఈ సామ్రాజ్యంలో జు ఆయే బాధ్యతలు చేపడితే, కిమ్ కుటుంబం నుంచి నాలుగో తరం నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించనుంది. కిమ్ జోంగ్ ఉన్ అడుగుజాడల్లో నడుస్తూ, సైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాల్లో చురుగ్గా కనిపిస్తున్న జు ఆయే, రాబోయే రోజుల్లో ఆ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’ -
ప్రేమిస్తే చంపేస్తారా..? కూతురితో బలవంతంగా పురుగుల మందు తాగించి
-
ఓ కూతురు తండ్రికి రాసిన మరణశాసనం
వేలూరు (తమిళనాడు): కుమార్తె ప్రేమ వివాహాన్ని ప్రశ్నించిన వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో వెలుగు చూసింది. వివరాలు.. అరసమరపేటకు చెందిన యోగనాథన్(63) సత్వచ్చారిలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి పదవీ విరమణ చేశాడు. బుధవారం ఉదయం యోగనాథన్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. బంధువులకు విషయం తెలిసి వేలూరు సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై విచారణ చేపట్టారు. యోగనాథన్ కుమార్తె వినోదిని ఏడాది కిందట ప్రేమవివాహం చేసుకుంది. విషయం తండ్రికి తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇంట్లో తండ్రికి తన భర్త కనిపించకుండా చూసుకునేది. ఈ విషయం యోగనాథన్కు తప్పా మిగతా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఇటీవల ప్రేమ వివాహం గురించి యోగనాథన్కి తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో యోగనాథన్ ఇంట్లో మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించారు. విచారణలో యోగనాథన్ది హత్య అని తేలడంతో పోలీసులు మృతుడి భార్య విమలాదేవి, కుమారుడు గోవిందరాజ్, స్నేహితులు అశ్వథామన్, శివదాస్, కుమార్తె వినోదినిని గురువారం అరెస్ట్ చేశారు. -
కన్నబిడ్డను హతమార్చిన వైద్యురాలు, 911 కాల్ రికార్డు సంచలనం
భారతీయ సంతతికి చెందిన వైద్యురాలు డాక్టర్ నేహా గుప్తా కన్నకూతుర్నే హతమార్చి ఏమీ తెలియ నట్టుగా 911 కాల్ చేసింది. ఒక్లహోమాకు చెందిన పిల్లల వైద్యురాలు కాల్ రికార్డును దర్యాప్తు అధికారులు తాజాగా విడుదల చేశారు. అలాగే 2025 జూన్లో జరిగిన సంఘటనను వివరించేందుకు గాను నిందితురాల్ని తాజాగా విడుదల చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని స్వల్పకాలిక అద్దె ఇంటిలోని తన నాలుగేళ్ల కుమార్తెను కొలనులో ముంచి చంపినట్లు పై అభియోగం మోపబడిన నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..ఒక్లహోమాకు చెందిన 36 ఏళ్ల నేహా గుప్తా పిల్లల డాక్టర్. వైద్యుడైన భర్త సౌరభ్ నుంచి ఆమె విడిపోయింది. నాలుగేళ్ల కుమార్తె అరియా ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్నది. ఆ బాలిక కస్టడీ వివాదం కోర్టులో ఉంగానే నాలుగేళ్ల అరియా కన్నుమూయడం విషాదాన్నినింపింది. కుమార్తె అరియాతో కలిసి నేహా గుప్తా ఫ్లోరిడాకు వెళ్లింది. అక్కడ తాత్కాలిక అద్దె ఇంట్లో బస చేసింది. అయితే అక్కడి నీటి కొలనులో పడి అరియా మునిగినట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని హాస్పిటల్కు తరలించారు. ఆ బాలిక అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.పోస్ట్మార్టం రిపోర్ట్లో అసలు విషయం తెలియడంతో ఆమెను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.పోస్ట్మార్టం నివేదికశవపరీక్షలో బాలిక ఊపిరితిత్తులలో లేదా కడుపులో నీరు కనిపించలేదు. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి, ఆ తరువాతే ఆమెను కొలనులో వేసినట్టు నిర్ధారించారు. సంఘటన జరిగిన సమయంలో, ఆరియా తలతి తండ్రి పూర్తి కస్టడీని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. గుప్తా మానసిక స్థితి గురించి. తన కుమార్తెను ఫ్లోరిడాకు తీసుకెళ్లారని తనకు తెలియదని వాపోయాడు.🇺🇸 📹 PEDIATRA ACUSADA POR MUERTE DE SU HIJA EN PISCINA Las cámaras de seguridad captaron a la madre y la niña en la vivienda de alquiler antes del hallazgo en la piscina. ¿Noticias y tendencias? ¡Sigue @ULTIMAHORAENX para MAS!🔔 Neha Gupta pediatra de Oklahoma… pic.twitter.com/ol8cVhh9BR— ⓍULTIMAHORAENX (@ULTIMAHORAENX) February 26, 2026911 రికార్డింగ్ వివరాలు"మేము నిద్రపోతున్నాము, నాకు ఏదో శబ్దం వినిపించింది ఆమె కొలనులో ఉంది, ఆమెను కాపాడటానికిప్రయత్నించాను, కానీ నాకు ఈత రాదు" అని అధికారులు విడుదల చేసినమె చెప్పినట్లు వినబడుతుంది. "నేను ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాను." అని ఆమె డిస్పాచర్తో చెప్పింది.ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడానికి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, గుప్తా, "లేదు, ఇక్కడ మేమిద్దరం మాత్రమే ఉన్నాము... నేనే... ఆమెను బయటకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేసాను" అని తెలిపింది. ఆ అమ్మాయి మేల్కొని ఉందా అని డిస్పాచర్ ఆమెను అడిగారు., గుప్తా, "లేదు, ఆమె కొలను అడుగున ఉంది... కదలడం లేదు" అని చెప్పింది.ఆ తర్వాత గుప్తా తన కూతురిని కొలను నుండి బయటకు లాగడానికి ప్రయత్నించమని అడిగాడు. అప్పుడు మీరు ఎప్పటికీ చేరుకుంటారని ఆమె డిస్పాచర్ను అడిగింది. "వారు దారిలో ఉన్నారు, కానీ మీరు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి, ఆమెను బయటకు తీసుకురావడానికి మీరు ఏదైనా మార్గాన్ని కనుగొనాలి" అని డిస్పాచర్ ఆమెకు చెప్పారు.ఆ తర్వాత డిస్పాచర్ ఆమెను కొలను ఎంత లోతు ఉంటుంది లాంటి వివరాలు అడిగాడు. ""తొమ్మిది అడుగులు ఉందని నేను అనుకుంటున్నాను, ఎంత లోతు ఉందో నాకు తెలియదు," అని గుప్తా చెప్పింది. "సరే, మీరు ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి, మేడమ్," అని డిస్పాచర్ మళ్ళీ చెప్పినపుడు నేను ప్రయత్నిస్తున్నాను," అని సమాధాన మిచ్చింది. కొన్ని క్షణాల తర్వాత, పోలీసు అధికారులు వచ్చినప్పుడు, గుప్తా వారి కోసం తలుపు తెరిచింది. అప్పుడు అధికారులు తన కుమార్తెను నీటిలో నుండి బయటకు తీశారు.మరోవైపు ఆరియా మరణం ప్రమాదవశాత్తు జరిగిందేనని గుప్తా, ఆమె న్యాయవాదులు వాదిస్తున్నారు. ఆమె మే నెలలో తిరిగి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త -
నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు..
నన్నెందుకు చంపావమ్మా? నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు.. ఒంటరిగానే నన్ను పెంచావు.. నీ సుఖం చూసుకుని ఊహాలోకంలో విహరించావు.. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించావు.. మాయాలోకంలో పడి నన్ను వదిలించుకోవాలనుకున్నావు.. నీ కడుపుచించుకుపుట్టిన నన్ను కర్కశంగా గొంతు నులిమి చంపేశావు.. నీకు తోడుగా నిలిచిన వాడితో కలిసి స్వర్ణమ్మలో కలిపేశావు.. నేనేం తప్పు చేశానమ్మా.. నాకెందుకీ శిక్ష వేశావమ్మా..?.. అన్నట్టు ఉంది కదూ ఈ చిత్రం.ఓ కసాయి తల్లి ప్రియుడి మోజులో పడి రెండున్నరేళ్ల పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. తిరుపతి: ‘11 నెలల చిన్నారి ‘పునర్విక’ ప్రాణం నిలబెట్టేందుకు అవసరమైన రూ.16 కోట్లు సమకూర్చేందుకు ఏ సంబంధం లేని లక్షల మంది ఒక్కటయ్యారు. తమవంతు సాయమందించి సమాజంలో మానవత్వం సజీవంగా ఉందని నిరూపించారు. ఈ కసాయి తల్లి కామాంధకారంతో కళ్లు మూసుకుపోయి కడుపుచించుకుని పుట్టిన అపురూప పాపాయిని అత్యంత పాశవికంగా చిదిమేసింది. ఆపై స్వర్ణమ్మ ఒడిలో పాతిపెట్టేసి చేతులు దులుపుకుంది. పోలీసులు తమదైన విచారణలో అసలు విషయం బయటపడింది. ఏ‘పాప’ం చేసిందని? తిరుపతికి చెందిన ఆశాలత భర్త రాజేష్తో విడిపోయి తిరుపతి పోస్టల్ కాలనీలో రెండున్నరేళ్ల కుమార్తె దుర్గతో కలిసి ఉంటోంది. ఈమెకు ఏర్పేడు మండలం, చెన్నంపల్లి దళితవాడకు చెందిన రెడ్డికుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రెడ్డికుమార్ను పెళ్లి చేసుకోవాలని, ఇందుకోసం అడ్డుగా ఉన్న తన కుమార్తె దుర్గను అంతమొందించాలని భావించింది. ఈ నెల 19వ తేదీన దుర్గను అతికిరాతకంగా చంపేసింది. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రియుడు రెడ్డికుమార్ సహాయంతో చిన్నారి మృతదేహాన్ని బైక్పై తీసుకుని ప్రియుడి గ్రామానికి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో గొయ్యిని తవ్వి పాతిపెట్టింది. చిన్నారి కనిపించకపోవడంతో అవ్వ ప్రశ్నించింది. తల్లి సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలిసిన ప్రతి హృదయం ద్రవించింది. ఏ పాపం చేసిందని పాప ప్రాణం తీశావంటూ ప్రతి గొంతు ఘోషించింది.గుండెలవిసేలా రోదించిన అవ్వ ఆశాలత తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశాలత, రెడ్డికుమార్తోపాటు వారికి సహకరించిన మరికొందరిని పోలీ సులు తమదైన శైలిలో విచారించారు. దీంతో కళ్లు బైర్లు కమ్మేలాంటి చిన్నారి హత్యోదంతాన్ని వారు బయటపెట్టారు. బుధవారం తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్ పోలీసులు, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి పాపానాయుడుపేట సమీపంలో పాపను పూడ్చిపెట్టిన స్వర్ణముఖి నదిలోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాప మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని చూసి వారి వెంట వచ్చిన చిన్నారి దుర్గ అమ్మమ్మ నాగరత్నమ్మ బోరున విలపించింది. నువ్వేం పాపం చేశావమ్మా.. అంటూ గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కదిలించింది. -
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)
-
ప్రియుడి కోసం.. కన్న కూతురినే చంపేసిన తల్లి
-
కూతురు గ్రాడ్యుయేషన్ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!
ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు గ్రాడ్యుయేషన్ డే అంటే ఎంతో సంతోషంతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అది వారికి ఓ గొప్ప పండుగ. అలాంటి గొప్ప వేడుకలో ఓ తల్లి ఎంత పట్టరాని సంతోషంలో ఉందంటే..ఆ కార్యక్రమంలో ఉన్న వాళ్లందరి ముఖాల్లో నవ్వలు విరిసేలా చేసింది. కూతురు గ్రాడ్యుయేషన్ డేలో ఆ తల్లి సంతోషమే హైలెట్గా నిలిచింది. ఇది ఎక్కడ జరిగిందంటే..కెనడాలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలో తన కూతురి కోసం తల్లి పట్టరాని సంతోషంతో డ్యాన్స్లు వేస్తూ సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ స్నాతకోత్సవంలో కూతురు నల్లగౌనులో వేదికపైకి వచ్చి ప్రొఫెసర్తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తుండగా..ఆ తల్లి సంతోషంతో నేను నిన్న ప్రేమిస్తున్నా తల్లి..అని గట్టిగా అరుస్తుంది. ఆ స్వరానికి అందరు ఆశ్చర్యపోతూ..అక్కడ ఒక్కసారిగా నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది. ఆ తల్లి ఎంతో గర్వంగా ఉద్విగ్నంగా కూతురిని, ఆ ప్రొఫెసర్ని ప్లీజ్ రెండు స్టెప్లు వేయమని కోరడం..అందరికీ నవ్వు తెప్పిస్తుంది. పిల్లలు సాధించిన ఘనతలను సంబరం చేసుకుని ఆనందపడేది ఒక్క మన తల్లిదండ్రులే కదా..!. నిజంగా పేరెంట్స్ మనల్ని చూసి గర్వంగా ఉప్పొంగిన క్షణం మాటలకందని సన్నివేశం, మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Gursehaj Kaur (@impromptu_gursehaj) (చదవండి: రష్మిక, విజయ్ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్..! ఎంత ఖర్చు అవుతుందంటే..) -
ఢిల్లీలో ఘోరం.. తల్లీకూతుళ్ల దారుణ హత్య
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. సరితా విహార్ ప్రాంతంలోని ఓ మహిళ(35), ఆమె ఆరేళ్ల కుమార్తె తమ ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పొరుగు వ్యక్తే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆలీ విహార్లోని ఓ ఇంట్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, ఇంటిలోని మంచం స్టోరేజ్ బాక్స్లో మహిళ, బాలికను గుర్తించారు. వెంటనే వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను జ్యోతి, ఆమె ఆరేళ్ల కుమార్తెగా గుర్తించారు.ప్రాథమిక పరీక్షల్లో బయటకి ఎటువంటి గాయాలు కనిపించలేదు. అయితే శనివారం నిర్వహించిన పోస్ట్మార్టం రిపోర్టులో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే వారు మరణించినట్లు తేలింది. అదే భవనంలో నివసించే అకౌంటెంట్ దీన్ దయాళ్ (35) ఈ కేసులో ప్రధాన నిందితుడి ప్రాథమిక విచారణలో తేలిసింది. ఇతడు బాధితుల కుటుంబానికి బంధువు (మేనల్లుడు) అని స్థానికులు చెబుతున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ ఇంట్లో దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నారు. రాత్రి భర్త ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు బయటే కూర్చుని ఉన్నారు. తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, కానీ ఏ వస్తువు పోలేదని తెలిపారు. నిందితుడు దీన్ దయాళ్ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించారు. -
ప్రజా బలం దైవబలం కలిసి.. అంబటి విడుదలపై కూతురు రియాక్షన్
-
గళ్ళ మాధవి, అనిత గుర్తుపెట్టుకోండి..!
-
అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్
-
బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు
హన్మకొండ: ఆడపిల్ల అదృష్టమంటారు. తన విజయానికి తన కూతురే (బంగారు తల్లి) కారణమని ఓ తండ్రి మున్సిపల్ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా గెలుపొందాక తన కూతురు కాళ్లు మొక్కాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 19వ వార్డునుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు 584 ఓట్లు రాగా, 207 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్న తరువాత కౌంటింగ్హాల్నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా తన కోసం వేచి చూస్తున్న కూతురు సహస్ర రెండు కాళ్లను మొక్కాడు. అనంతరం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, శ్రీనివాస్ మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు తన కూతురు సహస్ర పుట్టడంతో తన అదృష్టంగా భావించాడు. ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాడు. అందుకే గెలుపొందగానే తన కూతురు కాళ్లు మొక్కినట్లు అనుచరులు తెలిపారు. -
బిగ్బాస్ ఆదిరెడ్డి చిన్న కూతురి అన్నప్రాసన వేడుక (ఫొటోలు)
-
తల్లి నగ్నచిత్రాలు ప్రియుడికి..!
సాక్షి బెంగళూరు: సోషల్ మీడియా, ప్రేమ మోజులో పడి కొందరు విపరీతాలకు పాల్పడుతున్నారు. సొంత తల్లి, పెద్దమ్మ నగ్న ఫొటోలను రహస్యంగా తీసి వాటిని ప్రియుడికి పంపించిందో యువతి. బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల మహిళ ఇచి్చన ఫిర్యాదు మేరకు కుమార్తె, ఆమె ప్రియుడు వరుణ్పై బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బీబీఎం చదువుతోంది. గతేడాది ఆమెకు మొబైల్ కొనిచ్చారు. నెల రోజులుగా అపరిచిత యువకుడితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనుమానం వచ్చింది. విషయాన్ని బయట పెట్టకుండా యువతి మొబైల్ పాస్వర్డ్ను తెలుసుకున్నారు. తర్వాత ఆ మొబైల్ను పరిశీలించగా అందులో యువతి తల్లి ప్రైవేటు ఫొటోలతో పాటు ఆమె సోదరి అక్క ఫోటోలను యువకుడికి పంపినట్లు గుర్తించింది. అనంతరం కుమార్తె నిర్వాకంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుమార్తె ప్రియుడు వరుణ్ ఆ ఫొటోలను పంపించాలని ఒత్తిడి చేసినట్లు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి అంటూ చేసుకుంటే తాను ప్రేమించిన యువకుడినే చేసుకుంటా అంటూ ఇంట్లో గొడవ పడి వెళ్లినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రైవేటు ఫొటోలను ఆ యువకుడు ఇతరులకు పంపించే అవకాశం ఉందని, ఈ క్రమంలో తన కుమార్తె, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. -
పొగరు తగ్గించుకో... మౌనిక వార్నింగ్
-
ఐఏఎస్ ఆఫీసర్... అంగన్ వాడి స్కూల్
‘ఐఏఎస్ ఆఫీసర్లు తమ పిల్లలను ఎలాంటి స్కూల్స్లో చదివిస్తారు?’ అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. అయితే ఐఏఎస్ ఆఫీసర్, చిత్రకూట్ కలెక్టర్ పుల్కిత్ గార్గ్ ‘అందరు ఆఫీసర్లు ఒకేలా ఆలోచించరు’ అని నిరూపించారుమధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తన మూడేళ్ల కుమార్తె సియాను ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థ గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు చాలా మెరుగు పడింది. ఒక ఐఏఎస్ అధికారి తన బిడ్డను ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివించగలిగినప్పుడు సామాన్యులెవరూ సంకోచించకూడదు. అంగన్వాడీ కేంద్రాలపై ఉన్న అభిప్రాయాలు మారాయని విశ్వసిస్తున్నాను’ అన్నారు గార్గ్. ఈ సందర్భంగా బాల్యదశ అభివృద్ధి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, ఆరోగ్యం, పోషకాహారం... మొదలైనవి బిడ్డ ఎదుగుతున్న క్రమంలో ఎలా తీర్చిదిద్దుతాయో వివరించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థపై ఉన్న అపనమ్మకాన్ని వీడండి’ అని తల్లిదండ్రులను కోరారు. పుల్కిత్ గార్గ్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాల మాట ఎలా ఉన్నా అత్యధికులు ఆయనను సమర్థించి ప్రశంసించారు. -
ఈయనే నా కెప్టెన్: శేఖర్ కమ్ముల కూతురు (ఫోటోలు)
-
మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్
-
శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
-
సాక్ష్యాలు మాయం చేయడానికి పోలీసులు పొద్దున్నే ఇంటికి వచ్చి..
-
ఒక మహిళ అంత ఘోరంగా మాట్లాడుతుంటే.. అనితకు ఆ మాటలు వినపడలేదా
-
ఇంటికి వచ్చి అలా అనడం తప్పు.. అంబటి కూతురు ఎమోషనల్
-
టీడీపీ గూండాల విధ్వంసం తర్వాత ఇంట్లో అంబటి కుమార్తె..!!
-
తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్ ఫోన్ అయితేనేం..
ఎన్ని డబ్బులున్న కొనలేనివి చాలనే ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రేమ.. నోచుక్నుపిల్లలందరూ చాలా అదృష్టవంతులే. కంటిపాపలా కాచుకునే వాళ్లకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ కానరాదు. అలాంటి భావోద్వేగ సన్నివేశమే నెట్టింట వైరల్గా మారింది. అతడి వద్ద ఖరీదైన గాడ్జెట్ లేకపోతేనేం..తన కూతురి కళను పొందుపర్చుకోవాలన్న అతడి తాపత్రయం అందరి మనసులను గెలుచుకుంది. ఇది కథ తండ్రి ప్రేమ అనిపించేలా ఉంది ఆ ఘటన.అందుకు సంబంధించిన వీడియోని జితేందర్ సారస్వత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథంయలో కూతురు పాఠశాలలో పలు ఈవెంట్లు నిర్వహించారు. అందులో భాగంగా ఒక డ్యాన్స్ కార్యక్రమంలో కూతురు అద్భుతంగా నృత్యం చేస్తోంది. అయితే ఆ తండ్రి తన కూతురు డ్యాన్స్ని ఓ చిన్న కీప్యాడ్ఫోన్లో రికార్డు చేసేందుకు అక్కడే ఉన్న చిన్నారుల జన సముహానికి వెనుకవైపు నిలబడి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఫోన్ని చూసి ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో జాగ్రత్తగా రికార్డు చేసుకుంటున్న తీరు అందరి హృదయాలను తాకింది. ఆ వీడియోకి జితేందర్ మా సోదరు అందరు హృదయాలను గెలుచుకున్నాడు. అతడు కొత్త ఫోన్ తీసుకోవాలంటారా..మా ఈ కొత్త రీల్ని చూసి చెప్పండి అంటూ పోస్ట్ చేశాడు. తల్లిదండ్రుల ప్రేమ ముందు ఖరీదైన గాడ్జెట్లతో పని ఏమందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Jitendar Sarswat (@sarswatjitendar) (చదవండి: హార్డ్వర్క్ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..! నెట్టింట వైరల్గా పోస్ట్) -
20 ఏళ్లకే పెళ్లి, 15 రోజులకే వైధవ్యం, 30 ఏళ్లు మగాడిలా
జీవితాలు అందరివీ ఒక్కతీరుగా ఉండవు. ఈ అనంత కాల గమనంలో, ఈ రవ్వంత జీవన పయనంలో ఎవరి యుద్ధం వారిదే. పైకి కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కనిపించని బడబాగ్నులుండవచ్చు మరెన్నో అంతులేని కష్టాలూ ఉండవచ్చు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ముత్తు మాస్టర్ స్టోరీ ఇలాంటిదే. కన్న కూతురి కోసం మూడు దశాబ్దాలు పాటు మగాడిలా బతికింది.పెచియమ్మాళ్ అలియస్ ముత్తు ఎంతోమంది సగటు అమ్మాయిల్లాగానే జీవితాన్నిప్రారంభించింది. కోటి ఆశలతో 20 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. దురదృష్టం ఏమిటంటే.. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లైన 15 రోజులకే భర్త అనూహ్యంగా కన్నుమూశాడు. ఆ తరువాత కొన్ని రోజులకే తాను గర్బవతినని తెలుసుకుంది. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఇక్కడే పెచియమ్మాళ్ చాలా విభిన్నంగా ఆలోచించింది. ఏపనిచేసినా ఆమెకు లైంగిక వేధింపులుతప్పలేదు. సమాజం సూటి పోటి మాటలూ భరించాల్సి వచ్చేది. అందుకే సంచలన నిర్ణయం తీసుకుంది. తన గుర్తింపును మార్చుకుంది. మగాడిలా మారి పోయింది. జుట్టును చిన్నగా కత్తిరించుకోవడం, ప్యాంట్ చొక్కా వేసుకుంది. ముత్తు కుమార్ అనే పేరుతో అనేక సవాళ్ల మధ్య కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది.ఇదీ చదవండి: స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!చెన్నై,తూత్తుకుడిలోని హోటళ్ళు, రోడ్డు పక్కన షాపులల్లో అవిశ్రాంతంగా పనిచేసింది. పెయింటర్గా, కూలీగా, టీ మేకర్గా పని చేస్తూ ఎంతో కష్టపడింది ఇవన్నీ స్త్రీగా తన ఉనికి రహస్యాన్నిజాగ్రత్తగా కాపాడుకుంటూ, పురుషుల్లో పురుషుడిలా కలిసి పోయి బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడుతూ, బస్సులలో సైతం వారి పక్కనే కూర్చుంటూ కాలం నెట్టుకొచ్చింది.ఆమె మహిళ అని ఆమెకు ఒక పాప ఉందని కొంతమంది సమీప బంధువులకు మాత్రమే నిజం తెలుసు. బయట పడిపోతాననే భయం నిరంతరం ఉండేది, కానీ ఆమె కూతురు షణ్ముగసుందరి భవిష్యత్తు కోసం దాన్ని భరించే శక్తిని కూడగట్టుకుంది. పరోటా షాపుల్లో పనిచేస్తూ ‘‘ముత్తు మాస్టర్’’గా పాపులర్ అయింది. ఆధార్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతాలో కూడా అదే పేరు పెట్టుకుంది. ఒంటరిగా మహిళగా, దయా దాక్షిణ్యంలేని సమాజంలో ప్రతి పైసా బిడ్డ కోసం ఆదా చేశానని చెప్పుకొచ్చిందామె. చివరికి ఆమె కలలు, ఆమె త్యాగాలు ఫలించాయి. ఆమె కుమార్తె పెరిగి పెద్దదై, విద్యను అభ్యసించి,వివాహం చేసుకుంది. అలా ముత్తు లక్ష్యం నెరవేరింది. పెచ్చియమ్మాళ్గా మళ్లీ మహిళగా జీవిస్తారా అని అడిగినప్పుడు, ఆమె సమాధానం విన్నవారు ఆశ్చర్య పోయారు ముత్తు మాస్టర్గానే ఉండాలని నిర్ణయించుకుంది. అవసరం నుండి పుట్టిన ఈ గుర్తింపు, ఆమె పట్టుదలకు , విజయానికి ప్రతీకగా మారింది. ఇది తన కుమార్తె భద్రతను, తనకు గౌరవాన్నిచ్చిన గుర్తంపుతోనే తన చివరి శ్వాస వరకు ఉంటానని చెప్పింది. -
‘నా చితికి నా మూడేళ్ల కూతురే నిప్పు పెట్టాలి’
పాట్నా: ‘అమ్మా,నాన్న. నన్ను క్షమించండి. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చితికి నిప్పు నా భర్తతో కాదు.. నా మూడేళ్ల కూతురితో పెట్టించండి’అంటూ ఓ మహిళా ఉపాధ్యాయురాలు బలవన్మరణం చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిహార్ రాష్ట్రం వైశాలీ జిల్లాకు చెందిన ప్రియా భారతి ప్రభుత్వ స్కూల్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భారతి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఇలా ఉంది.‘అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నేను చనిపోతున్నాను. అనారోగ్య సమస్యల వల్ల ప్రాణం తీసుకుంటున్నాను. నా మరణానికి ఎవరూ కారణంగా కాదు.నాకు నచ్చినట్లు నా అంత్యక్రియలు నిర్వహించండి. నేను మరణించిన నా భౌతిక కాయాన్ని నా స్వగ్రామానికి తీసుకుని వెళ్లొద్దు. నా చితికి నా కుమార్తెతో నిప్పుపెట్టించండి.నా భర్తతో వద్దు. 5.5లీటర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. నా పర్సులో నుంచి తీసుకోండి. నా ఫోన్ని నాభర్తకు ఇవ్వండి. అందులో కొన్ని ఆడియో,వీడియో ఫైల్స్ ఉన్నాయి. ఫోన్ పాస్వర్డ్ ఏంటో నా భర్తకు తెలుసు.నా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వారందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను. పోస్టుమార్టం నిర్వహించవద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నాను. నా భర్త, కుటుంబంపై ఎటువంటి కేసు నమోదు చేయద్దు. ఈ చర్య నా వ్యక్తిగత నిర్ణయం. అమ్మా, నాన్న, మీ కూతురు ఓడిపోయింది. క్షమించండి అమ్మా’అని నోట్లో రాశారు.అయితే, భారతి కుటుంబ సభ్యులు అత్తింటి వారిపై ఆరోపణలు చేస్తున్నారు. భారతి తన భర్త దీపక్ రాజ్, అత్తింటివారి వేధింపులకు గురయ్యిందని, ఈ విషయాన్ని ఆమె తన తల్లికి కూడా చెప్పిందని తెలిపారు. కాగా, బాధితురాలి తల్లి తండ్రుల ఆరోపణలకు.. ఆత్మహత్యా లేఖలోని మాటలకు విరుద్ధంగా ఉండటం వల్ల కేసు మరింత క్లిష్టంగా మారింది. -
'బిగ్బాస్' సోనియా కుమార్తె బారసాల వేడుక (ఫొటోలు)
-
తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)
-
ఒకటి నుంచి 50 వరకూ రాయలేదని..
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగు చూసింది. కేవలం హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో ఓ కసాయి తండ్రి తన నాలుగేళ్ల కూతురిని అతి కిరాతకంగా హతమార్చాడు. బల్లబ్గఢ్కు చెందిన కృష్ణ జైస్వాల్ (31) తన కుమార్తె వంశిక (4) హోంవర్క్లో ఒకటి నుండి 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో విచక్షణ కోల్పోయాడు. చపాతీలు చేసే కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆ చిన్నారి కుప్పకూలిపోయింది.అనంతరం, నిందితుడు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను బల్లబ్గఢ్లోని సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి, మెట్లపై నుంచి జారిపడిందని వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె శరీరంపై పలు గాయాలు, ఫ్రాక్చర్లు, తలకు తీవ్రమైన దెబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ మార్చురీకి తరలించారు.ఈ ఘాతుకం జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న నిందితుని ఆరేళ్ల కుమారుడు నిజాన్ని బయటపెట్టాడు. తన సోదరి అంకెలు రాయలేకపోయినందుకు తండ్రి ఎలా కొట్టాడో ఆ బాలుడు తన తల్లికి, ఆపై పోలీసులకు వివరించాడు. భార్య ఫిర్యాదు, బాలుని వాంగ్మూలం ఆధారంగా నిందితుడు కృష్ణ జైస్వాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన పోలీసులు అతనిని ఫరీదాబాద్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అతడిని ఒక రోజు పోలీస్ రిమాండ్కు పంపింది. -
తల్లిదండ్రుల దశదిన కర్మ రోజే కూతురు జన్మదినం
పెద్దపల్లి జిల్లా: లింగాపూర్ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతుల మధ్య వచ్చిన స్వల్ప ఘర్షణతో క్షణికావేశంలో దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడారు. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా 15ఏళ్ల ఏకైక కూతురు శివాణి ఉంది. ఈక్రమంలో బుధవారం తల్లిదండ్రుల దశదినకర్మ రోజే కూతురు శివాణి జన్మదినం కావడంతో బంధువులు, గ్రామస్తుల ప్రోత్సాహంతో బాధ నుంచి మరల్చేందుకు తల్లిదండ్రుల చిత్రపటం ఎదుట కేక్ కట్ చేయించారు. కాగా ఉద్విగ్న క్షణాలతో కన్నీటిని ఆపుకుంటూ బాధను అదిమి పట్టి అతికష్టంగా ముఖంపై చిరునవ్వును చిందినట్లుగా శివాణి కేక్ కట్ చేసిన తర్వాత పక్కకు వచ్చి ఒక్కసారిగా కన్నీంటిపర్యంతమైంది. బాలిక రోధనను చూసిన బంధువులు, గ్రామస్తులు మరోసారి కంటతడిపెట్టారు. గ్రామస్తులంతా చిన్నారికి అండగా నిలుస్తూ భరోసా కల్పించారు. -
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
కూతురి బర్త్డేకి... తల్లి సర్ప్రైజ్
బర్త్డే అంటే వయసుతో నిమిత్తం లేకుండా అందరమూ చిన్నపిల్లలైపోతాం. చిన్న వయసులో బర్త్డే అంటే ఎదుగుతున్నామన్న సంతోషం అటు తల్లిదండ్రుల్లోనూ, ఇటు పిల్లల్లోనూ ఉండటం సహజం. ఒక సంవత్సరం వయసు పెరుగుతోందన్న బెంగ లేకుండా పెద్దలు కూడా ఈ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. అంత స్పెషల్ పుట్టిన రోజు. ఈ వేడుకల్లో ఇష్టమైన బట్టలు, ప్రదేశాలు, కోరికలు ఇలా చిట్టా చాలానే ఉంటాయి. కానీ మనకిష్టమైన వాళ్లు, మనకిష్టమైన వంటకాలను అదీ ఇంట్లో వండితే బాగా గుర్తుండిపోతాయి. దీన్నేకంటెంట్ క్రియేటర్ బర్త్డేని ఆమె తల్లి ఫుడీగా నిర్వహించింది. అదేంటో చూద్దాం.కంటెంట్ క్రియేటర్ సారా సరోష్ 27వ పుట్టినరోజును ఆమె కుటుంబంగా వినూత్నంగా జరుపుకుంది. ఆమె 27 ఏళ్లను గుర్తు చేసుకుంటూ ఆమె తల్లి ఒకటీ రెండు కాదు, ఏకంగా 27 రకాల వంటకాలను తయారు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. ఈ క్లిప్ పుట్టినరోజు అమ్మాయి తన ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది, ఈ రూమ్ అంతా అద్భుతమైన అలంకరణలతోపాటు, టేబుల్పై అమర్చిన పదార్థాలు చూసి ఆశ్చర్యపోవడం బర్త్డే గార్ల్ వంతైంది.అలాగే కుటుంబ సభ్యులందరూ రకరకాల ఆహార పదార్థాలు టేబుల్పై అమర్చడానికి ముందు వాటిని తయారు చేయడం, చివరి నిమిషంలో కొన్ని వంటకాలను, తల్లి తయారు చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. వావ్.. 27 ఏళ్లకు 27 వంటకాలు, నా బర్త్డేకి బెస్ట్ గిఫ్ట్ థ్యాంక్యూ అమ్మా...ఎప్పటికీ నువ్వే మా అమ్మ అంటూ సారా తన సంతోషాన్ని వెలిబుచ్చింది. View this post on Instagram A post shared by Sylvia D'costa (@maa.madeit) ఈ విందులో వివిధ రకాల ఫ్రైడ్ చికెన్ ముక్కలు, వింగ్స్, చిన్న సమోసాలు, పినా కోలాడా,రస్నా గ్లాసులు ఉన్నాయి. సలాడ్లు, పాస్తాలు, ఇతర డిషెస్ ఉన్నాయి. టేబుల్ మధ్యలో ఫ్రాస్టింగ్తో కూడిన గుండ్రని చాక్లెట్ కేక్ ఉంది, దాని పక్కనే ప్రాన్ సుషీ, ప్రాన్ ఫ్రై, దహీ కే కబాబ్, స్టఫ్డ్ పొటాటోస్, తందూరి ప్రాన్స్ , చికెన్ షెజ్వాన్ వంటి వంటకాలు ఉన్నాయి.ఇదీ చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్ వీడియోదీనిపై నెటిజన్లు కూడా తమ ఆనందాన్ని ప్రకటించారు. ఇంత అద్భుతమైన తల్లిదండ్రులున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతు రాలివి అంటూ సారాను దీవించారు. తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది. ఈ వంటకాల గురించి తెలుసుకోవాలని ఉంది అని ఒకరు, ఇది ఏఐ పిక్లా ఉంది అని మరొకరు చమత్కరించారు. ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్ -
‘బిడ్డా.. మీ అయ్య చూస్తే ఊకోడు’
కృత్రిమ మేధస్సు (AI)తో సృష్టించే కంటెంట్ను ఈ మధ్యకాలంలో ఎందుకూ పనికి రాని విషయంగా(AI slop) చాలామంది తిడుతున్నారు. అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా.. అందునా అశ్లీలమైన కంటెంట్ వైరల్ అవుతుండడమే అందుకు కారణం. పైగా ఒరిజినాలిటీని దెబ్బ తిస్తోందని విమర్శిస్తున్నారు. కానీ అదే సాంకేతికతను వినోదం కోసం ఉపయోగిస్తే ఆ కిక్కే వేరప్పా. ఏఐ కంటెంట్ను ఇప్పుడున్న యూత్ ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలూ వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అయితే.. ఇక్కడ మాత్రం ఓ కూతురు తన తల్లిని ఆటపట్టించింది. లేని బాయ్ఫ్రెండ్ను సృష్టించి.. తల్లికి పిచ్చి కోపం తెప్పించింది. అలా నెట్టింట నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళ్తే.. యూపీ లక్నోకు చెందిన పావని అవస్థి తన తల్లిని సరదాగా మోసం చేసింది. చాట్జీపీటీ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోను తల్లికి చూపించి బిత్తర పోయేలా చేసింది. ఆపై వాళ్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు అని తల్లి ప్రశ్నించగా.. తన బాయ్ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. అవునా.. అతను నీ స్నేహితుడా?.. ఎప్పటి నుంచి మీరు స్నేహితులు? అంటూ ఆందోళనలతో ప్రశ్నలు గుప్పించి.. చాలాకాలంగా తెలుసని, మంచోడు అని, ఇంకా కొన్నిరోజుల్లో ఇంటికి వస్తాడు కదా అంటూ పావని సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయం నీ తండ్రికి తెలిస్తే బాగోదని.. ఆయన ఏమాత్రం సంతోషించరని కోపంగా మాట్లాడి లాగిపెట్టి కొట్టింది. ఫోన్ విసిరేయబోతుండగా.. సీన్ కట్ అయ్యింది. View this post on Instagram A post shared by Pawani (@pawani_awasthi_)తన తల్లిని ఏఐతో ఎలా బురిడీ కొట్టించిందో తెలియజేస్తూ పావని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకు ఇన్స్టాగ్రామ్లో దగ్గర దగ్గర 4 మిలియన్ల(4M) వ్యూస్ వచ్చాయి. ఈ ప్రాంక్ను ఆస్వాదించిన వాళ్లంతా.. సరాదాగా కామెంట్లు పెడుతున్నారు. నేను AIని అసహ్యించుకునే వాడిని. కానీ ఇది అద్భుతమైన వినియోగం అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ఒక మనవడు తన తాతయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా AI సాంకేతికతను వినియోగించి ప్రత్యేకమైన వీడియోను రూపొందించాడు. పాత కుటుంబ ఫోటోలను ఉపయోగించి, వాటిని కదిలే జ్ఞాపకాలుగా మార్చి తాతయ్య జీవితకథను చూపించాడు. ఆ వీడియో చూసిన తాతయ్య మాటలు రానంతగా భావోద్వేగానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. AIని కేవలం నిరుపయోగమైన కంటెంట్ సృష్టించే సాధనంగా కాకుండా, సరదా, భావోద్వేగం, కుటుంబ బంధాలను మరింత బలపరచే సాధనంగా కూడా ఉపయోగించవచ్చని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Generative AI | Discover, Learn & Grow (@generativeai_official) -
ఎమ్మెల్యే ధూళిపాళ్ల అండతో నా కుమార్తెకు చిత్రహింసలు
గుంటూరు: ‘‘నా కుమార్తె వారం రోజులుగా కనిపించడం లేదు..అసలు బతికే ఉందో..చనిపోయిందో తెలియడం లేదు...అల్లుడిని అడిగితే బెదిరిస్తున్నాడు..నా బిడ్డ ప్రాణాలతో కావాలంటూ’’ ఓ తల్లి సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తున్న ఆమె భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో కావాలి అంటూ ఫ్లెక్సీ చేతపట్టుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. వివరాలు ఇలా... బాపట్ల జిల్లా కూనపద్మావతినగర్ జగన్ కాలనీకి చెందిన నంబూరు లక్ష్మి కుమార్తె వెంకటేశ్వరమ్మ, పౌలురాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన దగ్గర్నుంచి భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఐదు సవర్ల బంగారు గొలుసు తీసుకుని బ్యాంక్లో తనఖా పెట్టాడు. ఇటీవల మరో ఎకరం పొలం రాసివ్వాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. వారం రోజులుగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదు. నా బిడ్డ బతికే ఉందో.. చనిపోయిందో తెలియడంలేదని లక్ష్మి వాపోయింది. కుమార్తె విషయమై అల్లుడ్ని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త చిత్రహింసలు భరించలేక గతంలో కుమార్తె పలుమార్లు జిల్లా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. పౌలురాజుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు ఉందని, ఆయన అండదండలతోనే తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించింది. -
కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)
-
అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)
-
ఉన్నావ్ కేసు.. సెంగార్ కూతురి ఎమోషనల్ పోస్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిందిఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్లైన్లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు. నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె. ToThe Hon’ble Authorities of the Republic of India,I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 2017లో యూపీ ఉన్నావ్కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు.. బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది. -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్ను తీసుకొచ్చిన ఆయన రేంజ్కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్ను సైతం కన్నీళ్లు పెట్టించింది.మారుతి కూతురు ఎమోషనల్ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU— Rebel Star (@Pranay___Varma) December 28, 2025 -
ఘోరం.. ఆడపిల్లని కోపంతో ఆరేళ్ల చిన్నారిని
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆడపిల్ల అనే కోపంతో ఆరు సంవత్సరాల పసికందును సుప్రియ అనే ఓ కిరాతక తల్లి పొట్టన బెట్టకుంది. అనంతరం గుండెపోటుతో పాప మృతి చెందిందని కట్టుకథ అల్లింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.మహారాష్ట్ర నావీ ముంబై కళంబోళిలో మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం చిన్నారి తండ్రి ఎప్పటిలాగా విధులు ముగించుకొని ఇంటికి వచ్చారు. అయితే రావడంతోనే పాప అపస్మారక స్థితిలో పడి ఉండడం చూశారు. దీంతో వెంటనే తనను ఆసుపత్రికి తరలిచంగా అప్పటికే తను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.అయితే దీనిని గుండెపోటుగా చిత్రీకరించడానికి సుప్రియ ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు శవపరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో తనకు బాబు కావాలని ఉండేదని దానికి తోడు చిన్నారి మరాఠీ మట్లాడకపోవడంతో ఇంకా పగ పెంచుకుందని పోలీసులు తెలిపారు. గతంలోనూ సుప్రియ తన కూతురుకు పలుమార్లు హానీ కలిగించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
జగపతిబాబు ఇంట శుభకార్యం.. ఇలా రివీల్ చేశాడేంటి?
టాలీవుడ్ నటుడు జగపతిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తన రెండో కూతురి పెళ్లి అయిపోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఏఐతో రూపొందించిన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కుమార్తె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు రివీల్ చేయకపోవడం గమనార్హం.కాగా.. జగపతిబాబు తెలుగులో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్లో దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ టాక్ షో హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ప్రసారం అవుతోన్న షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిరాయి చిత్రంతో అలరించిన జగ్గుభాయ్..ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా
ఓ వ్యక్తి స్నేహితుడి కూతురు కోసం అందమైన గిఫ్ట్ని స్వయంగా తన చేతులతో సిద్ధం చేశాడు. తీరిగ్గా చేసింది కాదు. బిజీ షెడ్యూల్లో రెండు విమానాల జర్నీలో అలవొకగా తయారు చేశాడు. నిజంగా అది అతడి నైపుణ్యం, విలువైన గిఫ్ట్ ఇవ్వాలన్నా అతడి ఆలోచనకు నిదర్శనం. ఆ గిఫ్ట్ నెటిజన్ల మనసుని అమితంగా దోచుకోవడమే కాదు..అతని క్రియేటివిటీకి ఫిదా అయ్యారు కూడా.వెల్లూరు మెడికల్ కాలేజీలో సైక్రియాట్రిక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ధీరజ్ తన బిజీ విమానాల షెడ్యూల్లో తన స్నేహితుడి కూతురు కోసం గిఫ్ట్ తయారు చేశాడు. లేత గులాబీ వూల్తో అల్లిన ఆ టోపీ ఎంత అందంగా ఉందంటే..అతడు అల్లికల్లో కూడా డాక్టర్ అని అనొచ్చేమో అన్నంత అందంగా కుట్టేశాడు. చేతితో తయారు చేసిన ఈ గిఫ్ట్ అతడి క్రియేటివిటీకి, శ్రమకు నిదర్శనం.జస్ట్ మూడు రోజుల్లో రెండు విమానాల ప్రయాణాల వ్యవధిలో ఈ టోపిని అల్లేయడం విశేషం.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేస్తూ..మూడే మూడు రోజుల్లో రెండు విమాన జర్నీలలో స్నేహితుడి కుమార్తె కోసం తయారు చేసిన టోపీ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు దొరికిన ఖాళీ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా క్రియేటివిటీగా చేతితో తయారు చేసిన గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇది వెలకట్టలేని అమూల్యమైన గిఫ్ట్. అన్ని డబ్బులతో కొనలేం అనేందుకు ఈ గిఫ్టే ఉదాహరణ అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.Two flight trips in three days. Finished a beanie for friend's daughter. pic.twitter.com/SVM7tmRUjt— Dr Dheeraj K, MD, DM, 🇮🇳🇬🇧🇦🇺 (@askdheeraj) December 16, 2025 (చదవండి: Sobhita Dhulipala: గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!) -
అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్సై రాజేష్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
అమ్మకు బదులు అమ్మాయి
ఓస్లో: వెనెజులాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సాహసి, ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో.. ఆ నిప్పుకణిక లేకుండానే.. నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం బుధవారం ఓస్లోలో జరిగింది. భయంకరమైన పరిస్థితుల నడుమ రాలేకపోయినప్పటికీ, ఆమె కూతురు అనా కొరినా సోసా.. వేదికపై తల్లి తరపున ఆ చారిత్రక గౌరవాన్ని స్వీకరించారు. మచాడో ఈ ఏడాది జనవరి 9 నుండి అజ్ఞాతంలో ఉన్నారు. అదేరోజు, ఆమె వెనెజులా రాజధాని కారకాస్లో తన మద్దతుదారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. త్వరలో మనతో మారియా.. నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్, జోర్జెన్ వాట్నే ఫ్రైడ్నెస్ సభలో చేసిన వ్యాఖ్యలు ఆహూతులను కదిలించాయి. ‘మారియా కొరినా మచాడో ఈ రోజు వేడుకకు హాజరయ్యేందుకు తన శక్తి మేరకు ప్రయతి్నంచారు. ఆమె రాలేకపోయినా, సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించడానికి ఎంతో సంతోíÙస్తున్నాం. ఆమె త్వరలోనే ఓస్లోలో మనతో ఉంటారు’.. అని ప్రకటించగానే సభ చప్పట్లతో దద్దరిల్లింది. ముందుగా నోబెల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, మచాడో ప్రతినిధి ఆమె రాలేకపోతున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా మచాడో కుమార్తె అనా కొరినా సోసా.. తన తల్లి స్థానాన్ని అలంకరించారు. ఈ బహుమతి వెనెజులా ప్రజలందరిది నోబెల్ వెబ్సైట్లో విడుదలైన మచాడో ప్రసంగం ఆద్యంతం ఉద్వేగాన్ని నింపింది. ‘నేను ఓస్లో చేరుకోవడానికి ఎందరో ప్రాణాలను పణంగా పెట్టారు. వారికి నేను కృతజ్ఞురాలిని. ఈ గుర్తింపు వెనెజులా ప్రజలకు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది’.. అన్న ఆమె గొంతులో పోరాట స్ఫూర్తి ప్రతిధ్వనించింది. ‘ఈ బహుమతి మొత్తం వెనెజులా ప్రజలందరిది. నేను రాగానే, రెండేళ్లుగా చూడని నా కుటుంబ సభ్యులను, నా పిల్లలను కౌగిలించుకుంటాను’.. అని ఉద్వేగంతో ఆమె చెప్పారు. ఐదుగురూ నిర్బంధంలోనే.. గతంలో కూడా ఐదుగురు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు (నర్గెస్ మొహమ్మది–2023, అలెస్ బియాలియాట్సి్క–2022, లియు జియాబో–2010, ఆంగ్ సాన్ సూ కీ–1991, కార్ల్ వాన్ ఒసియెట్జీ్క–1935) నోబెల్ అవార్డు ప్రకటించే సమయానికి జైలులో లేదా నిర్బంధంలో ఉండటం గమనార్హం. -
Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)
-
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత, కుమార్తె భావోద్వేగం
న్యూఢిల్లీ : మిజోరం మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్ (డిసెంబర్ 4 శుక్రవారం) కన్నుమూశారు ఆయనకు 73 సంవత్సరాలు. స్వరాజ్ కౌశల్ మాజీ విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ భర్త . అలాగే బీజేపీ ఎంపి బన్సూరి స్వరాజ్ తండ్రి. లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ విభాగం ప్రకటించింది. కౌశల్కు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా, పలువురు బీజేపీ నేతలు ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు.VIDEO | Delhi: Swaraj Kaushal, senior BJP leader and husband of the late former External Affairs Minister Sushma Swaraj, passed away on Thursday. Visuals from the cremation ground show his daughter and BJP MP Bansuri Swaraj performing rituals.(Full video available on PTI Videos… pic.twitter.com/bMzs5Nxaz8— Press Trust of India (@PTI_News) December 4, 2025తిరిగి అమ్మ దగ్గరికేబన్సూరి స్వరాజ్ తన తండ్రి మరణంపై ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు. తండ్రిగారు ఇక లేరని చెప్పడానికి చింతిస్తున్నాను అంటూ ఇలా రాశారు ‘‘ మీ నిష్క్రమణ చాలా బాధిస్తోంది. మీరు ఇప్పుడు దేవుని సన్నిధిలో, శాశ్వత శాంతితో తల్లితో తిరిగి కలిశారనే ఈ నమ్మకం. అపరిమితమైన ఓర్పు నా జీవితానికి వెలుగు మీ కుమార్తె కావడం నా జీవితంలో గొప్ప గర్వం,, మీ వారసత్వం, మీ విలువలు , మీ ఆశీర్వాదాలు ముందుకు సాగే ప్రతి ప్రయాణానికి పునాదిగా ఉంటాయి." అంటూ బన్సూరి స్వరాజ్ తన తండ్రికి నివాళులర్పించారు.पापा स्वराज कौशल जी, आपका स्नेह, आपका अनुशासन, आपकी सरलता, आपका राष्ट्रप्रेम और आपका अपार धैर्य मेरे जीवन की वह रोशनी हैं जो कभी मंद नहीं होगी।आपका जाना हृदय की सबसे गहरी पीड़ा बनकर उतरा है, पर मन यही विश्वास थामे हुए है कि आप अब माँ के साथ पुनः मिल चुके हैं, ईश्वर के सान्निध्य… pic.twitter.com/imqpUb2DMS— Bansuri Swaraj (@BansuriSwaraj) December 4, 2025ఎవరీ స్వరాజ్ కౌశల్ జూలై 12, 1952న సోలన్లో జన్మించిన స్వరాజ్ కౌశల్ 1990లో 37 సంవత్సరాల వయసులో మిజోరాం గవర్నర్గా నియమితులయ్యారు. భారతదేశంలో నియమితులైన అతి పిన్న వయస్కుడైన గవర్నర్గా నిలిచారు. సుప్రీంకోర్టు ఆయనను కేవలం 34 ఏళ్ల వయసులో సీనియర్ న్యాయవాదిగా నియమించింది. స్వరాజ్ కౌశల్ - సుష్మా స్వరాజ్ 1975లో వివాహం చేసుకున్నారు. కౌశల్ పార్లమెంటులో హర్యానాకు ప్రాతినిధ్యం వహించారు. 1998 నుండి 2004 వరకు హర్యానా వికాస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. -
రంగా కూతురు ఎంట్రీ.. పవన్ కు కాపుల షాక్
-
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
కామారెడ్డి క్రైం: మగ సంతానం లేకపోతే ఏంటి నేను లేనా అంటూ ఓ కుమార్తె తన తండ్రికి తలకొరివిపెట్టింది. ఈ ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో జరిగింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అలకుంట్ల సుదర్శన్కు భార్య, ముగురు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజులుగా తన కుటుంబంతో కలిసి జిల్లాకేంద్రంలోని స్నేహపురి కాలనీలో అద్దెకు ఉంటున్నాడు.స్వగ్రామంలో తనకు ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో సుదర్శన్ మృతి చెందగా సోమవారం పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తలకొరివి పెట్టడానికి వారసుడు లేకపోవడంతో పెద్ద కూతురు దేవిజ్ఞ తన తండ్రికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు వచ్చింది. కొడుకులు లేక కూతురే అంత్యక్రియలు నిర్వహించడం అక్కడున్న అందర్నీ కంటతడి పెట్టించింది. -
ఉరేసుకుని ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
తాడేపల్లి రూరల్/నంద్యాల: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న ఓ ఐఏఎస్ కుమార్తె భర్త వేధింపులు తాళలేక పుట్టింట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్ అధికారి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్న రాముడు తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం ఆయన కుమార్తె మాధురి సాహితి బాయి (27) ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెద్ద మనసుతో చిన్న రాముడు కుటుంబం ఈ పెళ్లి అంగీకరించింది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు నెలల క్రితం మాధురి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.ఈ క్రమంలో ఆదివారం మాధురి బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మాధురి మృతదేహాన్ని ఎయిమ్స్కు తరలించారు. అనంతరం చిన్న రాముడు మీడియాతో మాట్లాడుతూ కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం రాజేష్ వేధిస్తున్నట్టు తన కుమార్తె చెప్పిందన్నారు. భర్తతో విడిపోయి రెండు నెలలుగా తమవద్దే ఉంటోందని, మానసికంగా బాధపడుతోందని చెప్పారు. తన కుమార్తె మృతికి రాజేష్ నాయుడే కారణమని వాపోయారు. అత్తింటి వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉండలేకపోతున్నానని, వచ్చి తీసుకెళ్లమని మాధురి చెప్పిందని, కూతుర్ని తీసుకువచ్చేందుకు రాజేష్ నాయుడు ఇంటికి వెళ్లగా, అక్కడ వారు గొడవ చేశారన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మాధురి ఇష్ట్రపకారం తాడేపల్లికి తీసుకొచ్చామని చెప్పారు. తమ కుమార్తెమృతికి కారణమైన రాజేష్ నాయుడిని చట్టప్రకారం శిక్షించాలని చిన్నరాముడు దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మాధురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె గర్భవతిగా ఉందని, మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని భర్త రాజేష్ నాయుడు ఆరోపిస్తున్నాడు. తన భార్య ఉరివేసుకొని చనిపోయేంత పిరికిది కాదనీ, వారి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని చెబుతున్నాడు.తన భార్య మృతదేహాన్ని అప్పగిస్తే, అంత్యక్రియలు తానే చేసుకుంటానని, మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని, తాను వెళ్లేంత వరకు పోస్టుమార్టం జరగకుండా చూడాలని కోరుతున్నాడు. తన భార్య తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్కు వాల్మీకి సంఘం నాయకులతో కలిసి రాజేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు. -
గ్రాండ్గా నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి పెళ్లి
ఎన్నో తెలుగు సినిమాలు తీసిన నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో పెళ్లి సందడి. ఈయన మూడో కూతురు స్రవంతి, విక్రమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. హైదరాబాద్లో శనివారం రాత్రి ఈ శుభకార్యం జరిగింది. నాగార్జునతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. హడావుడి లేకపోవడంతో వివాహానికి సంబంధించిన ఫొటోలు పెద్దగా బయటకు రాలేదు.(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)అక్టోబరు 1వ తేదీన స్రవంతి-విక్రమ్ నిశ్చితార్థం జరగ్గా.. తర్వాత రోజు ఈమె సోదరి స్వప్న తన సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు అలానే పెళ్లి ఫొటోలని పోస్ట్ చేస్తారేమో చూడాలి? వైజయంతి మూవీస్ తరఫున చాన్నాళ్లుగా అశ్వనీదత్ మూవీస్ తీస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం పూర్తిగా తగ్గించేశారు. ఈయన కూమార్తెలు స్వప్న, ప్రియాంక.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. గతేడాది ప్రభాస్తో 'కల్కి' తీసి పాన్ ఇండియా హిట్ కొట్టారు.అశ్వనీదత్ ఇద్దరు కుమార్తెలు స్నప్న, ప్రియాంకతో పాటు అల్లుడు నాగ్ అశ్విన్.. ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ ఈయన మూడో కూతురు స్రవంతికి మాత్రం సినీ పరిశ్రమతో సంబంధం లేదు. అందుకే పెళ్లి హడావుడి ఎక్కడా కనిపించలేదు.(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్) -
భర్త మరణంతో ఆ రంగునే దరిచేరనివ్వలేదు..! కానీ కూతురు.
భర్తను కోల్పోయిన స్త్రీలు..ఒక్కసారిగా తమ జీవితంలోకి తొగ్గి చూసిన శూన్యం మాదిరిగా నిస్తారంగా తమ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. అది వారి వేషధారణలో సైతం ప్రస్పుటంగా కనిపిస్తుంది. కొందరూ ఆత్మవిశ్వాసంతో లేచి పుంజుకుంటారు. కొందరు సమాజం, కట్టుబాట్లకు తలొగ్గి తమ ఆశలను, కలల్ని చంపుకుని నిర్లిప్తంగా గడుపుతుంటారు. అలానే అన్నింటిని వదిలేసి..బతుకుతున్న ఆమె జీవితంలోకి మళ్లీ కాంతులు వచ్చేలా రంగులతో నింపింది కూతురు. సంతోషంగా ఇదివరకటి స్త్రీలా త్రుళ్లిపడుతూ ఉన్న ఆ దృశ్యం.. దూరమైన ఆమె భర్త సైతం ముచ్చటపడేలా అందంగా ఉంది.ప్రగతి అనే సోషల్ మీడియా వినియోగదారు నెట్టింట ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను వ్యక్తిగత విషయాలను పోస్ట్చేసే వ్యక్తిని కానని, ఈ రీల్ తన తల్లి కోసం అని పేర్కొంది. తన తల్లి నాన్న మరణంతో ఎరుపు రంగుకి పూర్తిగా దూరమైందని, ఎరుపు రంగు చీర గానీ డ్రెస్లుగానీ ధరించటమే మానేసిందని చెప్పుకొచ్చింది. అయితే తాను ఈసారి తన తల్లి కోసం ఎరుపు రంగు చీరను కొని, కట్టుకోమని ఫోర్స్ చేసినట్లు వెల్లడించి. అయితే ప్రగతి ఎంతో బతిమాలాడగా ఆమె ఒప్పుకుంది. అందువల్లే ఈ రీల్ని పోస్ట్చేశానని వివరణ ఇచ్చింది. ఎందుకంటే చాల ఏళ్ల తర్వాత ఎరుపు రంగు చీరలో తాను ఎలా ఉన్నానే అనేది గుర్తుండిపోవాలి, ఆ బాధకరమైన రోజులు కళ్లముందు కానరాకూడదని ఇలా చేశానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. ఆమె తాను కొన్న ఎరుపు రంగులో అద్భుతంగా కనిపించడమే కాదు..ఆమె చేసిన ర్యాంపు వాక్ కూడా అదుర్స్ అని సంబరపడింది. విచిత్రం ఏంటంటే ఆ వీడియోలో పక్కనే ఓ ఫోటోఫ్రేమలో ఉన్న ప్రగతి తండ్రి కూడా ఈ దృశ్యాన్ని సంతోషిస్తున్నాడేమా అన్నట్లుగా ఉంద . అంతేగాదు ఆ వీడియోలో చివరగా..అయినా స్వేచ్ఛను అనుమతి కింద పరిగణించకండి, ముఖ్యంగా మహిళలో విషయం అంటూ ప్రగతి విజ్ఞిప్తి చేయడం అందరీ హృదయాలను తాకింది. ఆ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు..మళ్లీ ఆమె తనకిష్టమైన ఎరుపు రంగుని స్వీకరించాక ఎంత అందంగానో కనిపిస్తోంది అని మెచ్చుకుంటూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by PRAGATI (@pragatipatil440) (చదవండి: బొద్దింక కాఫీ ..! ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదట..) -
అలనాటి హీరోయిన్ రాధ కూతురు.. పెళ్లయి రెండేళ్లయిపోయిందా? (ఫొటోలు)
-
శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)
-
కూతుర్ని రూ. 20 లక్షలకు తెగనమ్మి.. తండ్రి జల్సాలు
ఎన్టీఆర్ జిల్లా: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతురినే బేరానికి పెట్టిన ఘటన గణపవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి భార్యతో విడాకులు తీసుకుని మద్యానికి బానిసయ్యాడు. తనకున్న పొలాన్ని కూడా అమ్ముకుని వచ్చిన సొమ్ముతో తాగి జల్సాలు చేస్తున్నాడు. తన స్నేహితుడైన బెల్లంకొండ నాగరాజును బావమర్ది అని సంబోధిస్తూ.. ఇద్దరూ కలిసి తాగుతూ, తిరుగుతూ ఉండేవారు. ఈ క్రమంలో నాగరాజు తన 15ఏళ్ల కుమార్తెతో వివాహం జరిపిస్తానని చెప్పి పలు దఫాలుగా జమలారెడ్డి వద్ద నుంచి రూ.20లక్షలు వరకు దండుకుని కారు తదితరాలు కొనుక్కున్నాడు. ఆ విధంగానే ఎవరికీ తెలియకుండా జమలారెడ్డికి ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. అయితే ఆ మైనర్ బాలిక కాపురానికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ రాత్రి నాగరాజు మరోసారి తనకు డబ్బు కావాలని జమలారెడ్డిని అడగడంతో కుమార్తెను కాపురానికి తీసుకొస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో నాగరాజు తన కుమార్తెను జమలారెడ్డి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిపోయాడు. జమలారెడ్డి మైనర్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలిక తండ్రి నాగరాజు, జమలారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో కేసు నమోదు చేశారు. ఇరువురిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
లాలూ ఫ్యామిలీలో లుకలుకలు.. ఇంటిని వీడిన కుమార్తెలు
-
కరీంనగర్లో దారుణం.. తండ్రి ఎంత పనిచేశాడంటే?
సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు(17), కూతురు(15)ను గొంతు నులిమి చంపేందుకు తండ్రి యత్నించాడు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా.. కుమారుడు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి మల్లేశం పరారయ్యాడు.పని మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ గమనించిన తల్లి పోచమ్మ ఆసుపత్రిలో చేర్పించింది. వీళ్ళిద్దరికీ మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటరావుపేట కాగా.. గత ఏడేళ్ల నుంచి కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం కుటుంబం కిరాయికి ఉంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఘోరం.. కన్న కుమార్తెను చంపి కుమారుడిపై దాడి చేసి
కరీంనగర్ సాక్షి. వావిలాల పల్లిలో బాలిక అర్చన మృతిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికను తన తండ్రి మల్లేశమే దాడి చేసి చంపినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. తన కుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నించగా తన భార్య పోశవ్వ అడ్డకుందని తెలిపారు. పిల్లలని ఎందుకు చంపాలనుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. వివరాలు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న అర్చన అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఆమె సోదరుడు ఆశ్రిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించగా వారి తల్లి పోశవ్వ కూలీ పనికి వెళ్లివచ్చేసరికి ఇద్దరు పిల్లలు అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారని తెలిపారు. దీంతో స్థానికులసాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అర్చన మృతిచెందినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసు విచారణలో వారి తండ్రే కుమార్తె అర్చనని చంపి, కుమారుడిపై దాడి చేశారని తేలింది. తండ్రి దాడి చేసిన ఇద్దరు పిల్లలు మానసిక దివ్యాంగులని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం– పోశవ్వ దంపతులు ఏడేళ్లక్రితం కరీంనగర్ వచ్చారు. వాలివాలపల్లిలో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. -
జమ్ముకశ్మీర్ పేలుడు: నాన్నా వెళ్లొద్దు.. కొద్ది నిమిషాల్లోనే
జమ్ము కశ్మీర్లోని నౌగం పోలీసు స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో దర్జీ మరణంతో ఆయన కుటుంబం ఏకాకిగా మారింది. ఆ కుటుంబానికి ఆయన ఒక్కరే ఆధారం. పోలీస్స్టేషన్లో చిన్న ప్యాకింగ్ పని ఉందని రమ్మంటే వెళ్లిన స్థానిక టైలర్ మొహమ్మద్ షఫీ పారీ మళ్లీ తిరిగిరాలేదు. పేలుడు ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం అనాథగా మారింది. 47 ఏళ్ల షఫీకి స్థానికంగా ఎంతో మంచి పేరుంది. మసీదులో కార్యక్రమాల కోసం విరాళాలు సేకరిస్తారు. చుట్టుపక్కల వాళ్లను ప్రేమగా పలకరిస్తాడు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో తండ్రి భోజనం కోసం ఇంటికి వచ్చినప్పుడు.. చలి కారణంగా ఇంట్లోనే ఉండాలని కుమార్తె వేడుకుంది. నాన్నా.. వెళ్లొద్దంటూ ఆమె ఎంతగానో వారించింది. కానీ ఆయన పోలీస్స్టేషన్కి వెళ్లి పని పూర్తి చేయాల్సి ఉందని వెళ్లిపోయారు. రాత్రి 11.20గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. పని పూర్తి చేసి తిరిగి వస్తానని ఆయన చెప్పిన చివరి మాటలు తలచుకుంటూ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా, టైలర్ మొహమ్మద్ షఫీ పారీని పోలీసులు.. పేలుడు పదార్థాల ప్యాకెట్ల కోసం సంచులు కుట్టించడానికి స్టేషన్కి తీసుకెళ్లారు. ఇటీవల హర్యానా ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాల నుండి నమూనాలు సేకరిస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. నిబంధనావళి ప్రకారం పేలుడు పదార్థాల నుంచి కొంతమేర శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపేందుకు ప్రయత్నిస్తుండగా అవి ఒక్కసారిగా పేలిపోయి 9 మంది ప్రాణాలను బలిగొంది. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ టీమ్లోని ముగ్గురు, ఇద్దరు క్రైమ్ ఫొటోగ్రాఫర్లు, మేజి స్ట్రేట్ బృందంలోని ఇద్దరు రెవెన్యూ శాఖ అధికారులు, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారి, ఒక టైలర్ చనిపోయారు. ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు సహా 27 మంది గాయపడ్డారు. -
'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...
కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. "ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్ కథేంటో చూసేద్దామా..!చైనాకు చెందిన లీ బింగ్డ్ అనే టీనేజర్ జిలిన్ ప్రావిన్స్లో జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్ తన యూనివర్సిటీ క్యాంటిన్లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపన్ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్ ట్యూటర్గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్మీడియాలో షేర్ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్లో జోడించింది. వెంటనే ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్స్టాల్ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.లాభం కంటే కూతుర చెంత చాలు..స్టాల్ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది కూతురు బింగ్డ్.(చదవండి: హాట్టాపిక్గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?) -
గ్రాండ్గా దిల్ రాజు సోదరుడి కూతురి పెళ్లి.. హాజరైన టాలీవుడ్ సినీతారలు (ఫొటోలు)
-
‘నా కుమార్తె చనిపోయిందన్న కనికరంలేదు వీళ్లకి.. లంచం పేరుతో కాల్చుకు తిన్నారు’!
సాక్షి,బెంగళూరు: గుండెను మెలిపెట్టే ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషాద ఘటనలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉన్నత ఉద్యోగి ఒక్కగానొక్క కుమార్తె మరణించిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు లంచాలు ఇచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారి వరకు ఎలా లంచాలు అడిగారో? అందుకు తాను లంచాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో?లింక్డిన్ పోస్టులో సుదీర్ఘంగా వివరించారు. ఆ పోస్టును కొద్దిసేపటికే డిలీట్ చేశారు. అప్పటికే ఆ పోస్టు వైరల్గా మారింది.ఆ లింక్డిన్ పోస్టులో..బెంగళూరులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)కె.శివకుమార్ కుమార్తె అక్షయ శివకుమార్(34). కంప్యూటర్ సైన్స్లో బీటెక్, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ పెట్టుబడుల సంస్థ గోల్డ్మన్ సాచ్స్ ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇతర సంస్థల్లో మూడేళ్లు పనిచేశారు.అయితే ఈ క్రమంలో వర్క్ఫ్రమ్ హోమ్లో విధులు నిర్వహిస్తున్న అక్షయ గతనెల సెప్టెంబర్ 18 మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించారు. అక్షయ మరణించిన తర్వాత అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. ఆ సమయంలో పలువురు తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారని, మరికొందరు తనపట్ల దారుణంగా వ్యవహరించారని వాపోయారు. https://t.co/yJRWH989TU— DCP Whitefield Bengaluru (@dcpwhitefield) October 30, 2025 ‘నా కుమార్తె మరణం తర్వాత..అవసరమైన ఫార్మాలటీస్లను పూర్తిచేసేందుకు అవసరమైన పత్రాలను పొందడానికి అంబులెన్స్ ఆపరేటర్ నుంచి పోలీసు అధికారుల వరకు..శ్మశానవాటిక నుంచి బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కార్యాలయ సిబ్బంది వరకు దాదాపు అందరికీ లంచాలు చెల్లించాల్సి వచ్చింది.పోలీస్ స్టేషన్లో కూడా తనను నగదు రూపంలో చెల్లించమని బలవంతం చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్,పోస్టుమార్టం నివేదిక కాపీని ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పోలిస్స్టేషన్ చుట్టూ నాలుగు రోజులు తిరిగాం. పనికాలేదు. పోలీసులు స్టేషన్లోని బహిరంగంగా నన్ను లంచం డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని కూడా పోలిస్ స్టేషన్లోనే ఇచ్చారు. నేను నా ఏకైక బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉంటే.. ఈ సమాజం సానుభూతి లేకుండా నన్ను లంచం పేరుతో కాల్చుకు తిన్నది. ఇది దారుణం. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించాను. మరి పేదల పరిస్థితి ఏంటి?నా కుమార్తె భౌతికకాయాన్ని కసవనహళ్లిలోని ఓ ఆస్పత్రి నుంచి కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం అంబులెన్స్ డ్రైవర్ రూ.3వేలు డిమాండ్ చేశాడు. పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాపట్ల కుమార్తె చనిపోయిందన్న కనికరం కూడా చూపించలేదు పోలీసు అధికారులు లంచం అడిగారు. అసభ్యంగా మాట్లాడారు. ‘(తన గురించి మాట్లాడుతూ..)ఒక వ్యక్తి ఇప్పటికే మానసికంగా కుంగిపోయి, భావోద్వేగంగా తల్లడిల్లుతున్న సమయంలో పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడం,నిర్లక్క్ష్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. వాళ్లకు కుటుంబం లేదా? వారికి బావోద్వేగాలు ఉండవా? ఇది అక్కడితో ఆగలేదు. బీబీఎంపీ నుంచి డెత్ సర్టిఫికెట్ పొందడానికి చాలా ఇబ్బంది పడ్డా. డెత్ సర్టిఫికెట్ కోసం బీబీఎంపీ కార్యాలయానికి ఐదురోజుల పాటు కాళ్లరిగేలా తిరగా. కొనసాగుతున్న ‘కుల సర్వే’ కారణంగా ఎవరూ అందుబాటులో లేరు. చివరికి బీబీఎంపీ సీనియర్ అధికారిని సంప్రదించిన తర్వాతే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందుకోసం సదరు అధికారి నా వద్ద నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిలో.. ఈ అరాచకం నుంచి బెంగళూరును రక్షించగలరా? నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్జీ, మజుందార్ షాలు బిలియన్ల కొద్దీ డబ్బున్న పెద్దలు ఈ నగరాన్ని రక్షించగలరా? వారు చాలా మాట్లాడతారు కానీ...అని ముగించారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు వైట్ఫీల్డ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శివకుమార్ ట్వీట్లో పేర్కొన్న సంఘటనకు సంబంధించి, బెల్లందూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ పీఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అసభ్యకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను సహించదు’అని పోలీసులు తెలిపారు. -
కజిన్ సిస్టర్ కూతురి పెళ్లిలో అనసూయ సందడి (ఫోటోలు)
-
అన్న కూతురి పెళ్లిలో రాజీవ్ కనకాల- యాంకర్ సుమ సందడి (ఫోటోలు)
-
ఇట్స్ ఫ్యామిలీ టైమ్ అంటున్న ప్రియాంక చోప్రా (ఫోటోలు)
-
నిర్మాత దిల్రాజు ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)
-
బిగ్బాస్ ఆదిరెడ్డి కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్... (ఫోటోలు)
-
నా బిడ్డ పుట్టి పదేళ్లు.. యాంకర్ రవి ఎమోషనల్ (ఫోటోలు)
-
కూతురితో తిరుమలలో సురేఖ వాణి (ఫోటోలు)
-
ఎంఎస్ ధోనీ కుమార్తె జివా ఏం కావాలనుకుంటుందో తెలుసా? వైరల్ వీడియో
డాక్టర్ బిడ్డ డాక్టర్ కావాలని, యాక్టర్ బిడ్డ యాక్టర్, వ్యాపారి బిడ్డ వ్యాపరే అవుతుందని సాధారణంగా భావిస్తుంటాం. తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకుని కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టనవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే టీమీండియా స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిగా ఆయన కుమార్తె క్రికెటర్గా రాణించాలనుకుంటున్నారా? మెరుపువేగంతో సెంచరీలు చేస్తూ, క్రికెట్ గ్రౌండ్లో తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలనుకుంటున్నారా? అయితే మీకో ఇంట్రస్టింగ్ న్యూస్. ధోని ముద్దుల తనయ పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటోందో తెలుసా?ఎంఎస్ ధోనీ, సాక్షిల ఏకైక కుమార్తె జీవా. ఈ జంటకు 2010లో వివాహం జరగ్గా.. 2015లో జీవా జన్మించింది. భవిష్యత్తులో ఏం చేస్తావు అంటే పిల్లలు సాధారణంగా, డాక్టర్, యాక్టర్, టీచర్, పైలట్ ఇలాంటి సమాధానాలే చెబుతారు. కానీ ప్రకృతిని ప్రేమించి, ప్రకృతి శాస్త్రవేత్తను అవుతాను ధోనీ కుమార్తె చెప్పడం విశేషంగా నిలిచింది.(రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)శుక్రవారం నాడు ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన ఒక రాజకీయ నాయకుడితో జరిగిన సంభాషణలో, తాను పెద్దయ్యాక ప్రకృతి శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని ఎంఎస్ ధోని కుమార్తె జీవా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ధోని భార్య సాక్షీ, జీవా కాశీ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. హర్ కి పౌరి ప్రాంతం సమీపంలోని మరొక వీడియోలో, సాక్షి మరియు ఇతరులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్థానికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు చూపించారు. వారి సందర్శనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగా సభ కార్యదర్శి తన్మయ్ వశిష్ఠ ఈ వీడియోను అప్లోడ్ చేశారు. 10 ఏళ్ల చిన్నారికి ఇలాంటి కోరిక ఉండటం చాలా ఆనందం అంటూ ప్రశంసించారు.భవిష్యతుల్లో మంచి మనిషిగా రాణిస్తుంది అంటూ దీవించారు నెటిజన్లు.I want to become Naturalist : Ziva Dhoni #MSDhoni pic.twitter.com/r0gqRiLrEu— Chakri (@ChakriDhonii) October 25, 2025 -
బిగ్బాస్ ఆదిరెడ్డి కూతురి బారసాల వేడుక (ఫొటోలు)
-
కర్నూలు బస్సు ప్రమాదంలో తల్లీ కూతుళ్ల మృతి
సాక్షి, మెదక్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు మృతి చెందారు. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన తల్లి సంధ్యారాణి కూతురు చందన మృతి చెందారు. సంధ్యారాణి తన కూతురు చందనను బెంగుళూరులో డ్రాప్ చేయడానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సంధ్యారాణి భర్త ఆనంద్ గౌడ్ దుబాయ్లో ఓ ప్రైవేటు కంపనీలో ఉద్యోగం చేస్తుండగా.. సంధారాణి భర్తతో కలిసి దుబాయ్లో ఉంటున్నారు.కూతురు చందన బెంగళూర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దీపావళీ పండగకు ముందు తల్లి సంధ్యారాణి దుబాయ్ నుండి రావడంతో కూతురు చందన కూడా తల్లి వద్దకు వచ్చి పండగకు పెద్దమ్మ ఇంటి వద్ద ఉన్నారు. నిన్న కూతురు చందన తిరిగి బెంగళూరు వెళ్తుండగా తల్లి సంధ్యారాణి కూడా వెళ్లారు. నిన్న సాయంత్రం 6 గంటలకు కావేరీ ట్రావెల్స్ బస్సులో సీట్ నెంబర్ L-14 , l-15 సీట్లు బుక్ చేసుకున్నారు. మూసాపేట్ బోర్డింగ్ పాయింట్లో తల్లి కూతుళ్లు బస్ ఎక్కినట్టుగా బంధువులు చెబుతున్నారు. -
కూతురికి ప్రేమతో..
-
నాణేల సంచితో షోరూమ్కి రైతు.. కూతురి కోసం ఎంత తాపత్రయం!
ఓ త్రండి ఆర్థిక సామర్థ్యానికి మించి కుమార్తె ఓ కోరిక కోరితే.. నా వల్ల అవుతుందా అని నిస్సహాయతను వ్యక్తం చేయలేదాయన. నా రాకుమారి కోసం ఎలాగైనా చేయాలి అనుకున్నాడు ఆ నాన్నా. అది తన తాహతుకు, శక్తికి మించిన పని అని తెలిసినా.. అజేయమైన దృఢ సంకల్పంతో తీర్చేందుకు ప్రయత్నించిన అతడి కథ ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది.ఈ ఘటన చత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. బజరంగ్ రామ్ అనే రైతు కూతురు లక్షరూపాయ ఖరీదు చేసే స్కూటర్ కావాలని కోరింది. అది అతడి ఆర్థిక పరిస్థితికి మించింది. ఆ కోరిక నెరవేర్చడం అతడికి అనితరసాధ్యమైనది కూడా. అయినా సరే ప్రతి రూపాయి వెనకేస్తూ.. ఏదోనాటికి కూతురి కల నెరవేర్చాలంటూ తనకు చేతనైనంతా చేయడం ప్రారంభించాడు. తన సంపాదనలో మిగిలిని నాణేలన్నీ బాక్స్లో వేస్తూ..కొంత సొమ్ము పోగుచేసుకుంటూ వచ్చాడు. చివరికి హోండా షోరూం వద్దకు వెళ్లి..తాను స్కూటర్ కొనాలనుకుంటున్నా అంటూ..ఆ నాణేల సంచిని వారిముందు కుమ్మరించాడు. తాను ఓ చిన్నపాటి రైతునని, తన కూతురు తన ఆర్థిక స్థితికి మించిన కోరిక కోరిందటూ ఆ నాణేల సంచి వెనుకున్న కథంతా వివరించాడు. అది ఆ షోరూమ్ డైరెక్టర్ ఆనంద్ గుప్తాను మనసుని కదిలించింది. కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టేవారికి తగిన గౌరవం, సేవ లభించాలని భావించి..ఆ సంచిలోని నాణేలన్నింటిని తన సిబ్బందితో లెక్కించారు. అవి మొత్తం రూ. 40,000 అని చెప్పగా. మిగిలిన మొత్తానికి రుణంపై ఈఎంఐ ద్వారా స్కూటర్ తీసుకుంటానని అన్నాడు బజరంగా రామ్. అందుకు సంబంధించిన ఆ పేపర్ పని పూర్తిచేశాడు. ఆ తర్వాత షోరూం డైరెక్టర్ గుప్తా బజరంగ్ రామ్ కుటుంబానికి ఆహ్వానం పలికి. టీ సర్వ్ చేసి మరి సరికొత్త హోండా యాక్టివా కీను అందజేశారు. బజరంగ్ బండిని స్టార్ట్ చేసినప్పుడూ కూతురు చంపా కళ్లు ఆనందంతో మెరిశాయి. ఆమె కన్నీళ్లతో ఇది కేవలం స్కూటర్ కాదని, తన తండ్రి కష్టం, అచంచలమైన ప్రేమ అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అంటూ ఆ కీని ఓ నిధి దొరికినట్లుగా అత్యంత అపురూపంగా పట్టుకుందామె.(చదవండి: ఆ ప్రొఫెసర్కు 150 ప్లస్ డిగ్రీలు..అమ్మ చెప్పిందని..!) -
పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో..
పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు.. నిర్లక్ష్యంతో, ఏమరుపాటుతో వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనలెన్నో చూశాం. అయితే ఇక్కడో జంట ప్రమాదం అని తెలిసి కూడా తమ నెలల పసికందుతో సాహసానికి సిద్ధపడింది. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే!.. లిథువేనియాకు చెందిన ఓ జంట.. పోలాండ్లోని మంచుతో కప్పబడిన మౌంట్ రైసీ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధపడింది. అయితే తమ 9 నెలల బిడ్డతో కలిసి ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండానే ముందుకు వెళ్లింది. తల్లిని ముందు భాగంలో క్యారీ చేస్తూ ఆ తల్లి పైకి ఎక్కడం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు అలా చేయొద్దని వారించినా వినలేదు. అయినా వినకుండా ఆ పేరెంట్స్ మొండిగా ముందుకు వెళ్లారు. అయితే.. కాస్త దూరం వెళ్లాక ఆ బిడ్డ తండ్రి ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఆ సమయంలో క్రాంపాన్(మంచులో జారకుండా షూలకు బిగించే పరికరాలు) కోసం ఓ మౌంట్ గైడ్ను సంప్రదించాడు. బిడ్డకు ప్రమాదం అని భావించిన ఆ మౌంట్గైడ్.. వాళ్లు సర్దిచెప్పి కిందకు తీసుకొచ్చారు. ఆ బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. చిన్నారిని ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. మౌంట్ రైసీ (Mount Rysy) అనేది పోలాండ్లోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారు 2,501 మీటర్లు (8,205 అడుగులు). పోలాండ్- స్లోవేకియా సరిహద్దులో ఉన్న హై టాట్రాస్ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది.“No words.” A couple climbed Poland’s highest mountain with a baby — and sparked outrageA Lithuanian couple attempted to ascend Mount Rysy while carrying their nine-month-old child, Delfi reports.Conditions were extremely dangerous. Guides and rescuers warned them repeatedly,… pic.twitter.com/jgN8l6mPEg— NEXTA (@nexta_tv) October 21, 2025 -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్
బాలీవుడ్ జంట్ దీపికా పదుకొనే (Deepika Padukone), రణ్వీర్(Ranveer Singh) దివాలీ సందర్భంగా తమ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు తమ ముద్దుల తనయ ముఖాన్ని సోషల్ మీడియా కంటపడకుండా జాగ్రత్త పడిన దీపికా, రణ్వీర్ దంపతులు ఎట్టకేలకుల తమ గారాలపట్టి దువాను ఫ్యాన్స్కు పరిచయం చేశారు. ముద్దుగా రెండు పిలకలు, నోట్లో వేలు, అమ్మ ఒడిలో కూర్చొని రెండు చేతులూ జోడించి దణ్నం పెట్టడం ఇలా ప్రతీ ఫోటో చాలా అందంగా ఉన్నాయి. దీంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మహారాణిలా ఉంది, ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తుంది అంటూ ప్రశంసిస్తున్నారు. డిటో రణవీర్, దీపికా డింపుల్స్ వచ్చేశాయి అంటూ కమెంట్స్ చేస్తున్నారు. కుమార్తె దువా దీపావళి పూజ ఫోటోలను దీపికా పంచుకోవడంపై చాలా మంది సెలబ్రిటీలు, సహనటీనటులు స్పందించారు. డార్క్ మెరూన్ కలర్ డ్రెస్సు, రెండు చిన్ని పిలకలతో పాపాయి అందంగా ఉంది అంటూ నెటిజనులు, సో క్యూట్ అంటూ హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ మురిసిపోగా, దీపికా పదుకొనే కూతురు దువా ఫోటోలకు అలియా భట్ స్పందన విశేషంగా నిలిచింది. పాప ఫోటోలకు లవ్ ఎమోజీతో తన ప్రేమను ప్రకటించింది అలియా.సబ్యసాచి దుస్తుల్లో మెరిసిన యువరాణిక్లాసిక్ గ్రేస్ కు పేరుగాంచిన దీపికా పదుకొనే, కస్టమ్ క్రిమ్సన్ సబ్యసాచి డిజైన్ దుస్తుల్లో అందంగా కనిపించారు. గోల్డ్ జర్దోజీతో ఎంబ్రాయిడరీ చేయబడిన కస్టమ్ కుర్తా సెట్,మ్యాచింగ్ దుపట్టాతో పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా మెరిసారు. తన లుక్కు సరిపోయేలా, పచ్చలతో కూడిన పోల్కి చైన్ చెవిపోగులు , గాజులను ఎంపిక చేసుకున్నారు. ఇక దీపికతో పాటు, ఆచిన్న యువరాణి దువా కూడా సబ్యసాచి క్రియేషన్కు సరిపోయే చిన్న క్రిమ్సన్ కుర్తా, చేతితో తయారు చేసిన గోటా-పట్టి బార్డర్లతో ధరించింది. ఎర్రటి చిన్న బొట్టు, పిలకలో జంట తోకల సుందరిగా మెరిసింది. అలాగే రణ్వీర్ సింగ్ తెల్లటి కుర్తా సెట్లో నెహ్రూ జాకెట్,పసుపు రంగు షేడ్స్ ఉన్న అందమైన, పొడవైన బంగారు నెక్లెస్లో అందంగా కనిపించారు. కాగా దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ల లవ్ స్టోరీ సినీ అభిమానులకు తెలియందికాదు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ తమ ఇనీషియల్స్ను టాటూ కూడా వేయించుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని, వారి వారి కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. రణబీర్, అలియాభట్ను పెళ్లి చేసుకోగా, వీరికి ఒక పాప ఉంది. -
కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు
-
నాన్నా.. నువ్వు లేని లోకం వద్దు
కర్ణాటక: తండ్రి లేని లోకంలో ఉండలేనంటూ ఓ కూతురు తనువు చాలించింది. వివరాలు.. నగరానికి సమీపంలో ఉన్న నాగయ్యరెడ్డి కాలనీలో నివాసముంటున్న స్వర్ణ (22) బెంగళూరులోని మహారాణి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. పలు సమస్యల వల్ల ఆమె తండ్రి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వర్ణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనను తలచుకుంటూ బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం బెంగళూరులోని హాస్టల్లో పురుగుల మందును తాగి, ఇంటికి వచ్చింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికాగా తల్లి ఈమెను చిక్కబళ్ళాపురం ఆస్పత్రిలో చేరి్పంచగా అక్కడ మరణించింది. కొన్నినెలల్లోనే భర్త, కుమార్తె దూరం కావడంతో తల్లి హృదయ విదారకంగా విలపించింది. బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కేసు దాఖలు చేసుకొని దర్యాప్తు చేబట్టారు.మరో యువతి... మైసూరు: జీవితంపైన విరక్తి కలిగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల పట్టణం మంజునాథ్ నగరలో జరిగింది. యువతి రక్షిత (19) మృతురాలు. ఆమె తండ్రి బెంగళూరులో పని చేస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న యువతి అవ్వ తాత వద్ద ఉంటోంది. బీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.కులగణనలో టీచర్కు గుండెపోటు బనశంకరి: బెంగళూరులో కులగణనలో ఉపాధ్యాయురాలు గుండెపోటుకు గురైంది. ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో ఆదివారం యశోద అనే టీచర్ కులగణన సర్వేలో ఉండగా గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే కొందరు సమీప హెల్త్సిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి స్టంట్ను అమర్చారు. యశోద బొమ్మసంద్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తోంది. -
కమెడియన్ కూతురి 'హాఫ్ ఇయర్' బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కోన వెంకట్ కూతురి పెళ్లి రిసెప్షన్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
నా కుమార్తె న్యూడ్ ఫోటోలు పంపాలని బెదిరించారు
-
తల్లి సురేఖావాణితో కలిసి సుప్రీత దసరా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
విషాదం: తల్లీ కూతుళ్ల అనుమానాస్పద మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శివమొగ్గలోని ప్రభుత్వ ఆసుపత్రి నర్సుల క్వార్టర్స్లో జరిగింది. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న శ్రుతి(38) తన కూతురు పూర్విక(12)ని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శృతి భర్త రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి రాగా, తలుపు లోపల గడియ పెట్టి ఉంది.దీంతో అతను పొరుగువారి సాయంతో తలుపును పగలగొట్టి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది. ఆరో తరగతి చదువుతున్న కూతురు పూర్విక తలకు గాయాలతో పడి ఉంది. పూర్విక మృతదేహం పక్కనే శృతి ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం శృతి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం
టాలీవుడ్లో సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన మూడో కూతురు స్రవంతి నిశ్చితార్థం.. హైదరాబాద్లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాకపోతే సోషల్ మీడియాలో ఎక్కడా ఈ విషయం పెద్దగా కనిపించలేదు. ఒకటి రెండు ఫొటోలు బయటకు రావడంతో దీని గురించి అంతా తెలిసింది.(ఇదీ చదవండి: త్వరలో అల్లు శిరీష్ నిశ్చితార్థం.. అధికారిక ప్రకటన)వైజయంతి ప్రొడక్షన్ తరఫున సినిమాలు తీస్తూ వచ్చిన అశ్వనీదత్.. కొన్నేళ్ల క్రితం సైలెంట్ అయిపోయారు. తర్వాత ఈయన కూతుళ్లు స్వప్న, ప్రియాంక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర చిత్రాలతో మళ్లీ తండ్రి నిర్మాణ సంస్థని రేసులోకి తీసుకొచ్చారు. గతేడాది వచ్చిన 'కల్కి'తో పాన్ ఇండియా లెవల్లోనూ హిట్ కొట్టారు.అయితే అశ్వనీదత్ పెద్ద కూతురు స్నప్న, రెండో కూతురు ప్రియాంక, అల్లుడు నాగ్ అశ్విన్ గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అయితే ఈయన మూడో కూతురు స్రవంతి గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలీదు. తండ్రి అక్కలు నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ ఈమెకు ఇండస్ట్రీతో సంబంధం లేనట్లే కనిపిస్తుంది. ఇప్పుడు నిశ్చితార్థం జరగడంతో ఈమె గురించి తెలిసింది. మరి పెళ్లి కూడా ఈ ఏడాదిలో ఉంటుందేమో!(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ) -
మస్క్ కుమార్తె వద్ద డబ్బు లేదంటా..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కుమార్తె అంటే వెంటనే గుర్తొచ్చేది.. ఆమె విలాసాలు, లగ్జరీ కార్లు, హంగులు, ఆర్భాటాలు, పార్టీలు.. కానీ అలాంటివేవీ లేకుండా ముగ్గురు స్నేహితులతో ఓ చిన్న అపార్ట్మెంట్లో కాలం వెళ్లదీస్తున్నారు వివియన్ జెన్నా విల్సన్. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్ కుమార్తె జెన్నా విల్సన్(జేవియర్ మస్క్) ఇటీవల న్యూయార్క్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఇంటర్వ్యూలో జెన్నా విల్సన్(21) తెలిపిన వివరాల ప్రకారం..‘నా వద్ద వందలు, వేల డాలర్లు లేవు. లాస్ ఏంజిల్స్లోని ఒక షేరింగ్ అపార్ట్మెంట్లో ముగ్గురు రూమ్మేట్స్తో ఉంటున్నాను. ఈ పరిస్థితులను నేను భరించగలను. నాకు జన్మనిచ్చిన తండ్రితో ఏ విధంగానూ సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడను’ అని చెప్పుకొచ్చారు. విల్సన్ 16 ఏళ్ల వయస్సులో ట్రాన్స్జెండర్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. 2022లో చట్టబద్ధంగా తన పేరును, జెండర్ను మార్చుకుంది. ఈ సందర్భంగా కోర్టు ద్వారా తన తండ్రితో బహిరంగంగా సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగానే ఉంటోంది.ఎవరి సాయం అవసరం లేదు..కోర్టు ద్వారా తండ్రి, కుటుంబం నుంచి విడిపోతున్న సమయంలో మస్క్ నుంచి లభించే ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని ఆమె తిరస్కరించారు. తనను తాను పోషించుకోవడానికి సరళంగా జీవించేందుకు ఎవరి సహాయం అవసరం లేదని తేల్చిచెప్పారు. మస్క్ భార్యలకు పుట్టినవారిలో వివియన్ తొలి సంతానం.ఇదీ చదవండి: సమస్యగా కాదు... సదవకాశంగా చూద్దాం! -
సూర్యాపేటలో దారుణం .. మద్యం మత్తులో కసాయి తండ్రి ఘాతుకం
సూర్యాపేట జిల్లా: మద్యం మత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞని తండ్రి (వెంకటేష్) నేలకేసి కొట్టిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో ఓ కసాయి తండ్రి 12 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన సంఘటన కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం సేవించి వచ్చిన భర్తను భార్య మందలిస్తున్న క్రమంలో చిన్నారి ఏడుస్తుండగా ఆగ్రహానికి గురైన తండ్రి వెంకటేష్ చిన్నారి భవిజ్ఞను రెండు కాళ్లు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అపస్మారక చితికి చేరుకుంది. ఇక కొన ఊపిరిలో ఉన్న పాపను తల్లి, ఆమె బంధువులు ఆసుపత్రికి తీసుకపోగా చికిత్స పొందుతున్న చిన్నారి ఆసుపత్రిలో మృతి చెందింది. హత్య చేసి పరారైన కసాయి తండ్రిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు. మద్యం మత్తులో 12 నెలల చిన్నారి (భవిజ్ఞ) మృతి చెందడంతో బంధువులు విలపిస్తున్న తీరు నలుగురిని కలిచివేసింది. -
ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే.. కూలీ కూతురు IAS
-
బిగ్బాస్ ఫేమ్ మెరీనా-రోహిత్ కూతురి ఫస్ట్ ఫోటోషూట్ (ఫోటోలు)
-
రోజా కుమార్తెకు మౌరీన్ బిగ్గర్స్ అవార్డు
నగరి: యునైటెడ్ స్టేట్స్ బ్లూమింగ్టన్లోని ఇండియానా వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ కోర్సు చదువుతోన్న వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షుమాలిక అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025–26ను అందుకున్నారు. ఇండియానా వర్సిటీ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరిన్ బిగ్గర్స్.. టెక్నాలజీలో ఈక్విటీని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలను కలుపుకొని వారి సాంకేతిక అవకాశాలపై అధ్యయనం చేయడం, నమీబియా, నైజీరియా, భారత్ వంటి దేశాల్లో వెనుకబడిన వర్గాల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ, మాధ్యమాల ద్వారా పేదవర్గాలకు సమగ్రమైన సాంకేతిక విద్యను అందించడానికి కృషిచేసినందుకుగాను ఈ అవార్డును ప్రకటించినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. -
అరుణాచలంలో కాశీపాలెంవాసి హత్య!
విశాఖపట్నం: పొరుగు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో దేవరాపల్లి మండలం కాశీపాలెం గ్రామానికి చెందిన డెక్క నవీన్ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ధ్రువీకరించనప్పటికీ ఈ దుర్ఘటన జరిగినట్టు శుక్రవారం రాత్రి విస్తృతంగా ప్రచారమైంది. నవీన్ రాంబిల్లి మండలం చిన్నపూడి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమార్తెతో పదో తరగతి, ఇంటర్ నుంచి అతడికి స్నేహం ఏర్పడింది. వీరి సాన్నిహిత్యం గురించి తెలిసి యువతిని చెన్నైలో చదివిస్తున్నారని, అయినా వీరి మధ్య పరిచయం కొనసాగిందని, అదే అమ్మాయి తరపు వారికి కంటగింపుగా మారిందని సమాచారం. నవీన్ వేరే కులానికి చెందినవాడు కావడం, పెద్దగా చదువుకోకపోవడం, ఆస్తి లేకపోవడంతో అమ్మాయి తల్లికి ఇష్టం లేదు. మూడు రోజుల క్రితమే అమ్మాయిని తీసుకొని తల్లి అరుణాచలం వెళ్లింది. నవీన్కి ఫోన్ చేసి వారు ఉన్న చోటుకు రప్పించారు. అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకొని ఉన్నారు. నవీన్ ఫోన్లో అసభ్యకరమైన ఫొటోలు ఉన్నట్లు గమనించి లాక్కొని చితకొట్టేశారు. అనంతరం తమతో వచ్చిన ఇద్దరు వ్యక్తులతో నవీన్ను హత్య చేసినట్లు సమాచారం. అమ్మాయిని, ఆమె తల్లిని అరుణాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ప్రస్తుతం ఇద్దరూ అక్కడ జైల్లో ఉన్నట్లు భోగట్టా. -
సినిమాను మించి ట్విస్టులు.. చంపేసి.. విసిరి పారేసి..
ఎన్టీఆర్ జిల్లా: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు.రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు.ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు.ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
మా బంగారు తల్లి ఊయల ఫంక్షన్.. ఫోటోలు షేర్ చేసిన గౌతమ్ (ఫోటోలు)
-
మా అమ్మతో ఆరు నెలలే ఉన్న మాజీ బాయ్ ఫ్రెండ్
కొన్ని బంధాలు ఎలా బలపడతాయో ఎలా రూపుమారతాయో ఎవరూ చెప్పలేరు. అవ్యాజ్యమైన అనుబంధాలు అనుభూతించిన వాళ్లు మాత్రమే ఆ అనుభూతిని వర్ణించగలరు. ఒంటరి తల్లికి బాయ్ ఫ్రెండ్గా తండ్రి స్థానంలోకి వచ్చిన ఓ వ్యక్తి కేవలం ఆర్నెళ్లలోనే ఆమెతో బ్రేకప్ అయి విడిపోతే... కూతురు స్థానంలో ఉన్న చిన్నారితో... జీవిత కాలపు బంధం అల్లుకోవడం నిజంగా ఆశ్చర్యకరం మాత్రమే కాదు అపురూపం కూడా. దక్షిణాఫ్రికాలో నివసించే లారెన్ మెల్నిక్ ఈ తరహా అనుబంధాన్ని ఆస్వాదించారు. ఒక అంతర్జాతీయ మేగ్జైన్ కోసం ఆమె తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...నాకు నాలుగు సంవత్సరాల వయసులో చార్లెస్ మా అమ్మతో ఆరు నెలల పాటు డేటింగ్ చేశాడు, ఆమెను విడిచిపెట్టినా ఆ తర్వాత కూడా నా జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. బ్రేకప్ అనంతరం కూడా అతను అమ్మ స్నేహం గానే ఉన్నారు. దీని వల్ల అతను ఎక్కడ ఉంటున్నా అప్పుడప్పుడు ఇంటికి రావడం వచ్చినప్పుడల్లా నాకు చిన్న చిన్న బహుమతులు తీసుకువస్తుండేవాడు. , అతను (మేం నివసించిన) జోహన్నెస్బర్గ్ నుంచి ఆస్ట్రేలియాకు మారిన తర్వాత కూడా నాతో టచ్లో ఉండటానికి ఫోన్ కాల్స్ చేసేవాడు.మా బంధం గురించి మా అమ్మకు ఎప్పుడూ మిశ్రమ భావాలు ఉండేవి, నేను టీనేజర్గా ఉన్నప్పుడు అమ్మతో ఏదైనా గొడవ పడినప్పుడు, నేను ఫోన్ తీసుకుని, చార్లెస్కు ఫోన్ చేసి, సరదాగా అరిచేదాన్ని ‘నా తల్లితో మాట్లాడండి ఆమె సరిగా లేదు!‘ అంటూ చెబుతుంటే ఆమె నన్ను నెట్టేసేది. ఈ రోజుల్లో, చార్లెస్ నేను మా గ్రూప్ కాల్స్లో పరిహాసాలతో ఆమెను నిత్యం ఆటపట్టించేవాళ్లం. మా బంధాన్ని చార్లెస్ నాకు చూపించిన ఊహించని మార్గాలను కూడా అమ్మ అర్ధం చేసుకుంది. అతను నాకు డ్రైవింగ్ స్కూల్ పాఠాలు కూడా కొని పెట్టాడు నా విద్యార్థి రుణంలో మిగిలిన భాగాన్ని తను తీర్చడం ద్వారా మా ఇద్దరినీ ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత నేను ఉద్యోగినై సంపాదించడం ప్రారంభించినప్పుడు, అతను నా అత్యంత తరచుగా గడిపే ప్రయాణ స్నేహితులలో ఒకడు గా మారాడు.మేం కలిసి ప్రయాణించేటప్పుడు, అపరిచితులు తరచుగా ఆయన నా తండ్రి అని అనుకుంటారు ఎందుకంటే మా సంబంధంలో సాంప్రదాయ తండ్రి–కూతురు సంబంధం లోని అన్ని లక్షణాలు ఉన్నాయి – అది నిజం కాదు అనేది తప్ప. ఇలాంటి క్షణాలు మా బంధం ఎంత అసాధారణమైనదో నాకు తరచు గుర్తు చేస్తాయి.నేను పసిబిడ్డగా అతని ఒడిలో కూర్చోనివ్వమని అడిగినప్పుడు చార్లెస్ తక్షణమే బంధాన్ని అనుభవించానని చెప్పాడు. నాకు తెలిసినది ఏమిటంటే, నా తల్లి (నా తండ్రి కాకుండా) మా ఇంటికి తీసుకువచ్చిన వారిలో నేను ఇష్టపడిన అంగీకరించిన ఏకైక వ్యక్తి ఆయనే. నా జీవితంలో ఆయన ఉండాలనే ఆలోచన ప్రణాళికా బద్ధంగా జరగనప్పటికీ... విధికి మాత్రం తన ప్లాన్స్ తనకు ఉన్నాయి.అందుకే నేను చార్లెస్ను ‘రెండవ తండ్రి‘ అనే పేరుకు స్థిరపడ్డాను. ఎల్లప్పుడూ షరతులు లేని మద్దతు, మార్గదర్శకత్వం ప్రేమను అందించే వ్యక్తిని మీరు అలా కాక ఇంకా ఏమని పిలుస్తారు? డిఎన్ఎ బంధం కాకపోవచ్చు కానీ అతను తండ్రికి సిసలైన నిర్వచనం.తన లాంటి డైనమిక్ పర్సన్ని మరెవరినీ నేను ఎప్పుడూ కలవలేదు. ఖచ్చితంగా, కొందరు సవతి నాన్నలతో చక్కని బంధాలను ఏర్పరుచుకుంటారు, కానీ అమ్మ మాజీ ప్రియుడితోనా? అంటే... అవును ఇది అసాధారణమైనది, వింతైనది కుటుంబం అంటే మీ ఇంటిపేరు పంచుకునే వ్యక్తుల కంటే ఎక్కువ అని చార్లెస్ నాకు అర్థమయ్యేలా చేశాడు – అది మీరు నిర్మించేది. నిజమైన నిబద్ధత లేబుల్స్ రూపంలో రాదు అని ఆయన నాకు నేర్పించారు. ఇది ఉద్దేశపూర్వకంగా ఒకరి జీవితంలో కనిపించడానికి మీరు ప్రతిరోజూ చేసే పని. మనలో చాలా మందికి సంక్లిష్టమైన కుటుంబ బంధాలు ఉన్నాయి, కానీ మా సంబంధం ద్వారా నేను నేర్చుకున్నది... మిమ్మల్ని నిస్సందేహంగా కావాలని ఎంచుకునే వ్యక్తులే మిమ్మల్ని ఎక్కువగా అనుభూతి చెందేలా చేస్తారు. అది మీ రక్తం అయినా లేదా మీరు కనుగొన్న కుటుంబం అయినా సరే. -
కూతురి పుట్టినరోజు వేడుకల్లో హీరోహీరోయిన్ జోడీ (ఫొటోలు)
-
హీరోయిన్ గా మహేష్ కూతురు ఎంట్రీ..!
-
బతికి ఉన్న కుమార్తెకు శ్రద్ధాంజలి
ఇల్లెందు రూరల్: కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో యువతి బతికి ఉండగానే కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు కట్టారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొజ్జాయిగూడెంకు చెందిన కొచ్చర్ల వెంకటేశ్, కుంజ సింధు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికీ తండ్రులు లేరు. వెంకటేశ్, సింధు వారం క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆపై కుటుంబీకుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపై వెంకటేశ్, సింధు గ్రామంలోని సమీప బంధువుల ఇంట్లో ఆశ్రయం తీసుకుంటున్నారు. వెంకటేశ్పై పోలీసు కేసు ఉన్న విషయం తెలియడంతో సింధు తల్లి నాగమణి కుమారులతో కలిసి భర్త లేని సమయంలో సింధుకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సింధును ప్రశ్నించడంతో తల్లితోనే ఉంటానని చెప్పింది. వెంకటేశ్ మాత్రం అదే విషయం సింధు తన ముందు చెప్పాలని పేర్కొనగా గ్రామ పెద్దమనిషి ఒకరు సింధును వెంకటేశ్ వద్దకు తీసుకెళ్లగానే ఆమె భర్తతోనే ఉంటానని చెప్పడంతో సింధును పోలీసులు వెంకటేశ్కు అప్పగించారు. దీంతో సింధు తల్లి, సోదరులు మనోవేదనకు గురై ఆమె చనిపోయినట్లుగా పేర్కొంటూ శనివారం గ్రామంలోని వీధుల్లో శ్రద్ధాంజలి ఫెక్ల్సీలు ఏర్పాటు చేశారు. -
‘నా భర్తను కాపాడండి.. నా చివరి కోరిక తీర్చండి’
సాక్షి,మహబూబ్ నగర్: యశోద అనే మహిళ రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తాను పడుతున్న మనోవేధనను, చివరి కోరికను ఇంట్లో బ్లాక్ బోర్డుపై రాసింది.నా భర్తను కాపాడండి.. రేబిస్ ఉంది. వ్యాక్సిన్కు తగ్గదు. చెట్టు మందు తినిపించండి. మీరు చేయించండిలక్కీని ఆస్పత్రిలో చూపించు వాడికి రేబిస్ ఉంది.నా చివరి కోరి ధారూర్(వికారాబాద్)లో చెట్టు మందు తాగు.. లేట్ చేయకు.. అంటూ బాధితురాలు తన చివరి క్షణాల్లో కుటుంబం గురించి ఆలోచించి తనువు చాలించింది. మహబూబ్ నగర్ జిల్లా మొనప్పగుట్టలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. యశోద అనే మహిళ రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది.పోలీసుల వివరాల మేరకు..యశోద గత జూన్ నెలలో తన ఇంటి ఆవరణలో పల్లీలు,డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టింది. అవే పల్లీలు,డ్రై ఫ్రూట్స్ను వంటకాల్లో వాడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులకు రేబిస్ సోకిందని అనుమానం పెట్టుకుంది.ఆ అనుమానంతోనే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ యాంటీ రేబిస్ ఇంజక్షన్ చేయించింది. నాటు వైద్యం చేయించుకునేలా బలవంతం చేసింది. కుటుంబ సభ్యులందరికీ రేబిస్ సోకిందని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది.ఘటన జరిగిన సమయంలో ఆఫీస్కు వెల్లిన యశోద భర్త.. ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మ బెడ్రూంలోకి వెళ్లి డోర్ తీయడం లేదని చెప్పాడు. దీంతో భయపడిపోయిన నరేష్ పక్కింటి వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో పక్కింటి వారు బెడ్రూం రూమ్ బలవంతంగా ఓపెన్ చేసి చూడగా.. తల్లి,కుమార్తె విగతజీవులుగా కనిపించారు. కాగా, భర్త, కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని ఆత్మహత్య చేసుకునే ముందు యశోద గోడపై రాయడం గమనార్హం. యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు
అశ్వారావుపేట: రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం అశ్వారావుపేటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు రింగ్ సెంటర్ నుంచి మృతురాలు నివాసమున్న ఆమె ఆడపడుచు ఇంటివరకు పోగైన సుమారు 200 మంది.. అంబులెన్స్ రాగానే మృతురాలి భర్త నరేష్, ఆయ న బావ దాసరి శ్రీనివాస్, రాజమండ్రికి చెందిన అంబులెన్స్ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో పోలీసులుఅప్రమత్తమై నరేష్నుఅంబులెన్స్తో సహా స్టేషన్కు తరలించగా.. మరికొందరు ఇంటి వద్ద ఉన్న మృతురాలి ఆడపడుచుపై దాడిచేశారు. నరేష్బావ శ్రీనివాస్ పోలీస్వాహనంలో తలదాచుకు న్నా వాహనం డోర్ పెకిలించి మరీ దాడికి పాల్పడ్డారు.పీఎస్ పక్కనే ధర్నా, దాడి..ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు, అదే మండలంలోని ఖాన్ఖాన్ పేటకు చెందిన నరేష్బాబుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వారు అశ్వారావుపేటలోని నరేష్ సోదరి ఇంట్లో ఉంటుండగా లక్ష్మీప్రసన్న రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందింది. అయితే, భర్త, ఆయన కుటుంబసభ్యుల వేధింపులతో పాటు సరిగా భోజనం కూడా పెట్టకపోవడంతో తమ కూతురు చిక్కి శల్యమై మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు మృతదేహాన్ని సోమవారం అశ్వారావుపేటకు తీసుకురాగా, లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ పక్క ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో సీఐ పింగళి నాగరాజు, ఎస్ఐ యయాతిరాజు, దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్రెడ్డి మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. విచారణతో పాటు పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక హత్య కేసుగా మారుస్తామే తప్ప ఫిర్యాదుతో చేయలేమని వివరించారు. దీంతో మృతురాలి తరఫు పెద్దమనుషులు ధర్నాను విరమింపజేయగా లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని ఇంటికి తరలించేసరికి అక్కడ ఇంట్లో వారిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు కుటుంబీకులంతా పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందగా, ఇల్లు, కారుపై రాళ్లు రువ్వారు.తలకొరివి పెట్టిన కుమార్తె‘అంత్యక్రియలు చేసేందుకు భర్త భయపడుతున్నాడు.. వారి బంధువులను మీరు కొడుతున్నారు.. మృతదేహాన్ని మీరే తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారా’ అని సీఐ నాగరాజు ప్రశ్నించగా ‘మృతదేహాన్ని తీసుకెళ్లం.. అంత్యక్రియల్లోనూ పాల్గొనబోం’ అంటూ లక్ష్మీప్రసన్న బంధువులు స్పష్టం చేశారు. చివరకు మున్నూ రు కాపు సంఘం అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు, స్థానికులు కొల్లి రవికిరణ్, పమిడి లక్ష్మణరావు జోక్యం చేసుకుని మృతురాలి కూతురు ఇన్మితానాయుడుతో తలకొరివి పెట్టించి అంత్యక్రియలు పూర్తి చేశారు.నాపై అభాండాలు వేస్తున్నారు..‘నా భార్య చనిపోవడానికి నేనే కారణమని ఆరోపిస్తున్నారు. నా భార్య మాట్లాడితే నిజాలు చెప్పేది. గతంలో అసలు లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు వచ్చేవారు కాదు. ఈరోజు వారే లేనిపోని అభాండాలు వేస్తూ తిండి పెట్టకుండా చంపారని చెబుతున్నారు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి..’ అంటూ నరేష్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అయితే, ఆమె బంధువులు మాత్రం లక్ష్మీప్రసన్నకు అన్నం పెట్టకుండా మాడ్చారని, చుటుపక్కల వాళ్లు పడేసిన ఎంగిలి ఆకుల్లో ఏరుకుని తినేదంటూ చుట్టుపక్కల వారు చెప్పారని అంటున్నారు. ఆస్తికోసం చంపేసి, జబ్బు అంటగట్టారని ఆరోపించారు. రెండేళ్లుగా తాము ఇంటికి వస్తే తలుపు తీయకపోగా, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి తాము వస్తే కుక్కలను వదిలేవారని వాపోయారు. -
కమెడియన్ రాకేశ్ కూతురి 1st బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఫోటోగ్రఫీతో సత్తా చాటుతున్న వనితలు..!
కేరళలోని కోజికోడ్కు చెందిన కీర్తన కున్నాత్ లండన్లో స్థిరపడింది. జెండర్ నుంచి మెంటల్ హెల్త్ వరకు ఎన్నో అంశాలపై ఫొటోసిరీస్ చేస్తుంటుంది కీర్తన. ఆమె తాజా ఫొటోసిరీస్... నాట్ వాట్ యూ సా. దక్షిణ భారత మహిళా బాడీబిల్డర్లపై చేసిన ఫొటోసిరీస్ ఇది. ఈ సిరీస్కు ‘అండర్ 30’ విభాగంలో ది రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ అవార్డ్ గెలుచుకుంది. ‘ఆత్మవిశ్వాసం మూర్తీభవించేలా ఈ మహిళలను చూపాలనుకున్నాను’ అని తన ఫొటో ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కీర్తన. ‘నాట్ వాట్ యూ సా’ ఫొటో ప్రాజెక్ట్ కోసం అనలాగ్ మీడియం ఫార్మట్ కెమెరా మమియ 67 ఉపయోగించి కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఫొటో షూట్ చేసింది. డాటర్ ఆఫ్ రఘు రాయ్చిన్నప్పుడు గిఫ్ట్గా కెమెరా అందుకున్న అవనీ రాయ్ అప్పటి నుంచి కెమెరాతో సుదీర్ఘ స్నేహం చేస్తూనే ఉంది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ కుమార్తెగా ఆమె ‘ఫొటోగ్రఫీ’ అనే ప్రపంచంలో పెరిగింది. ఎంతోమంది ఛాయాచిత్రకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘తండ్రి స్టైల్లోనే’ అని అనిపించుకోవాలని అవనికి ఉండేది కాదు. అందుకే తనదైన దృశ్యభాషను రూపొందించుకుంది. కశ్మీర్ సమస్య నుంచి చెన్నై ప్రజల తాగునీటి కష్టాల వరకు ఎన్నో సామాజిక సమస్యలను డాక్యుమెంట్ చేసింది. కశ్మీర్కు సంబంధించి సబ్జెక్ట్, ఎమోషన్లను ‘ఉమెన్ ఆఫ్ కశ్మీర్’ ఫొటోసీరిస్లో హైలెట్ చేయడానికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంది. (చదవండి: అమ్మాయిలు చిన్న వయసు అబ్బాయిలనే ఇష్టపడటానికి రీజనే అదే..! సర్వేలో షాకింగ్ విషయాలు..) -
స్టార్ కమెడియన్ కూతురు ఊయల వేడుక (ఫొటోలు)
-
అమ్మతో కలిసి సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘నాకు కొడుకే కావాలి’.. ఏడాది కుమార్తెకు విషమిచ్చి ప్రాణం తీసిన తండ్రి
అగర్తల: కొడుకులకన్నా కూతురు నయం అనుకునే ఈ రోజుల్లో ఆడపిల్లలపై ఇంకా వివక్ష ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఓ తండ్రి తన కుమార్తెకు విషం ఇచ్చి హత్య చేసిన ఘటన.. విషాద వాస్తవానికి నిదర్శనంగా నిలుస్తోంది.త్రిపుర రాష్ట్రం ఖోవై జిల్లా బేహలాబారి గ్రామంలో దారుణం జరిగింది. త్రిపురా స్టేట్ రైఫిల్స్కు చెందిన జవాన్ రతీంద్ర దేవ్బర్మా తన ఏడాది కుమార్తెను విషమిచ్చి హత్య చేశారు. అయితే,తండ్రి విషం ఇవ్వడంతో చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం త్రిపురా రాజధాని అగర్తల జీబీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు రతీంద్ర దేవ్ బర్మా త్రిపురా స్టేట్ రైఫిల్స్ పదోవ బెటాలియన్ తరుఫున ఏడీసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రతీంద్రదేవ్ను కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది.కుమార్తె మరణంపై గుండెలవిసేలా రోధిస్తున్న తల్లి మిథాలీ.. తన భర్త రతీంద్రదేవ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కుమార్తెకు బిస్కెట్లు కొనుక్కునే నెపంతో తమ కూతురు సుహాని దేవ్ బర్మా విషం తినిపించాడని ఆరోపించింది. తన భర్తకి ఎప్పుడూ కుమారులే కావాలి. ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చినందుకు తనను నిరంతరం ద్వేషిస్తుండేవారని వాపోయింది. మేం బెహలబరిలోని నా సోదరి ఇంటికి వెళ్తున్నాము. అప్పుడు నా భర్త.. నా కుమార్తెను, నా సోదరి కొడుకుకు బిస్కెట్లు కొనిచ్చేందుకు సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లాడు. వెంటనే, నా సోదరి కొడుకు, నా కుమార్తె వాంతులు,విరోచనాలు చేసుకున్నారు. నా కుమార్తె నోటి వెంట క్రిమిసంహారక మందు వాసన రావడాన్ని గమనించా. ఆస్పత్రికి తరలించా. కుమార్తెకు.. నా భర్త హాని తలపెట్టి ఉంటాడని అనుమానించా. అతడిని నిలదీశా. కుమార్తెకు విషం ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భర్తే తన కుమార్తె సుహాని ప్రాణాలు తీశాడని, అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. -
అరుణాచలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
జగ్గారెడ్డి కూతురి పెళ్లిలో ప్రముఖుల సందడి (చిత్రాలు)
-
‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’
పాట్నా: కులాంతర వివాహం డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రికుడైన తండ్రి… అల్లుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల మేరకు.. బీహార్లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఘోరం జరిగింది. దర్భంగ మెడికల్ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్)రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్ను కాలేజీ ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవల రాహుల్ కుమార్కు అదే కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్ను ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే, ఈ క్రమంలో కాలేజీ క్యాంపస్లో ఉండగా.. తన్ను ప్రియా చూస్తుండగానే ఆమె తండ్రి ప్రేమశంకర్.. అల్లుడు రాహుల్ను కాల్చి చంపాడు. అప్రమత్తమైన విద్యార్థులు, సిబ్బంది రాహుల్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రేమ్శంకర్కు దేహశుద్ధి చేశారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియా గుండెలవిసేలా రోదించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు. అతను నా ఒడిలోనే కుప్పకూలిపోయాడు’ అని కన్నీటీ పర్యంతరమయ్యారు. రాహుల్, తన్ను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఒకే హాస్టల్ భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘మేం కాలేజీలో ఉండగా.. హూడీ ధరించిన ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమ్శంకర్ ఝానే. నా తండ్రి ప్రేమ్శంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. కులాంతర వివాహ చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాం. నాకు నా భర్తకు.. నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని చెప్పాం. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతరమయ్యారుకాల్పుల తర్వాత, రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్ సిబ్బంది నిందితుడు శంకర్పై దాడికి దిగారు. రాహుల్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భాంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎస్పీ జగన్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత, అతను, అతని తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారని మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఝాకు చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము’అని హామీ ఇచ్చారు. दरभंगा जिला के बेंता थाना क्षेत्र अंतर्गत DMCH में घटित घटना के संदर्भ में अद्यतन घटना का संक्षिप्त विवरण :-दिनांक - 05.08.25 को समय करीब 04:40 PM बजे सूचना मिली कि बेंता थाना क्षेत्र अंतर्गत एक छात्र की गोली मारकर हत्या कर दी गई है। sho and sdpo visited spot and enquired— Darbhanga Police (@DarbhangaPolice) August 5, 2025 -
‘నన్ను నాశనం చేసి.. లక్షలమందిని చంపి..’:పుతిన్ రహస్య కుమార్తె సంచలన వ్యాఖ్యలు
మాస్కో: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అతని రహస్య కుమార్తె ఎలిజవేటా క్రివోనోగిఖ్(22) పలు సంచలన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అతను తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్నాడని ఎవరిపేరు చెప్పకుండానే వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలు క్రెమ్లిన్(రష్యాన్ ప్రభుత్వ అధికార నివాసం) అధినేతపైనే అని మీడియా చెబుతోంది.జర్మన్ వార్తాపత్రిక బిల్డ్ టెలిగ్రామ్ చానల్లో ఎలిజవేటా క్రివోనోగిఖ్ వరుస పోస్ట్లను ఉంచారు. వాటిలో ఆమె ‘నా ముఖాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించడం అనేది నాకు విముక్తినిస్తుంది. నేను ఎవరో.. నా జీవితాన్ని ఎవరు నాశనం చేశారనేది నాకు గుర్తు చేస్తుంది’ అని పేర్కొంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఆమె ఖాతా మాయమయ్యింది. 2003లో సెయింట్ పీటర్స్బర్గ్లో జన్మించిన క్రివోనోగిఖ్, పుతిన్, అతని మాజీ ఉద్యోగి స్వెత్లానా క్రివోనోగిఖ్ కుమార్తె అనే వాదన వినిపిస్తుంటుంది.2020లో రష్యన్ మిలియనీర్ స్వెత్లానా క్రివోనోగిఖ్ ఆస్తులపై దర్యాప్తు చేసిన సమయంలో ఎలిజవేటా క్రివోనోగిఖ్ రష్యన్ అధ్యక్షుడి రహస్య కుమార్తె అని కనుగొన్నట్లు స్వతంత్ర మీడియా సంస్థ ప్రోక్ట్ పేర్కొంది. స్వెత్లానా క్రివోనోగిఖ్ ఈ సంపదను రష్యన్ నాయకుని ద్వారా పొందారనే ఆరోపణలున్నాయి. స్వెత్లానా కుమార్తెకు పుతిన్ పోలికలున్నాయని ప్రోక్ట్ పేర్కొంది. అయితే, క్రెమ్లిన్ ఈ వాదనను తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. ఎలిజవేటా క్రివోనోగిఖ్ జనన ధృవీకరణ పత్రంలో ఆమె తండ్రి పేరు లేదు. 2021లో జరిగిన ఒక ఆడియో ఇంటర్వ్యూలో, ఎలిజవేటా క్రివోనోగిఖ్.. పుతిన్తో తనకున్న పోలికలను ధృవీకరించలేదు. తిరస్కరించనూలేదు. -
భర్తను కడతేర్చిన భార్య.. పోలీసులే షాకయ్యేలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు
దిస్పూర్: ముందు గుండెపోటన్నారు. ఆ తర్వాత దొంగతనమన్నారు. ఏం జరిగిందో తెలియక పోలీసులు కంగుతిన్నారు. చివరకు తమ్ముడొచ్చి తన అన్నది సహజ మరణం కాదని, హత్య జరిగిందనే ఆధారాలు బయటపెట్టడంతో అస్సాం వ్యాపారవేత్త హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఉత్తమ్ గోగోయ్ హత్య కేసులో అయన భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె, ఇద్దరు మైనర్ యువకులు అరెస్టు అయ్యారు.అస్సాంలోని లాహన్ గావ్ ప్రాంతంలో 38 ఏళ్ల వ్యాపారవేత్త ఉత్తమ్ గొగోయ్ అలియాస్ శంకై తన నివాసంలో మృతదేహంగా కనిపించిన కేసులో అతని భార్య, మైనర్ కుమార్తెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు దీబ్రుగఢ్ జిల్లా సీనియర్ ఎస్పీ వీవి రాకేశ్ రెడ్డి తెలిపారు. గొగోయ్ కుమార్తె 9వ తరగతి విద్యార్థిని. తండ్రి హత్యలో తన పాత్ర ఉన్నదని నేరం అంగీకరించిందని చెప్పారు. మరో సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. గొగొయ్ను హత్య చేసేందుకు అతని భార్య,కుమార్తె గతంలో పలు మార్లు ప్రయత్నించారు. తాజాగా, అతని ప్రాణాలు తీశారు. ఈ ఘటన వెనుక అసలు మోటీవ్ ఏమిటన్నది ఇంకా దర్యాప్తులో ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, హత్య చేయడానికి ఇద్దరు మైనర్ కాంట్రాక్ట్ కిల్లర్లకు భార్య, కుమార్తె కలిసి లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.గొగొయ్ హత్య జూలై 25 ఉదయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే కుటుంబ సభ్యులు గుండెపోటుతో గొగోయ్ మరణించాడని పేర్కొన్నారు. కానీ, మృతదేహంపై గాయాలు ఉందని మృతుని సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. గొగోయ్ సోదరుడు మాట్లాడుతూ.. ఉదయం 8:30 ప్రాంతంలో ఇంటికి వెళ్లాను. అప్పటికే ఉత్తమ్ చనిపోయి ఉన్నాడు. చెవిపై గాయాలున్నాయి. మొదట దొంగతనంగా భావించాం. గుండెపోటుతో మరణిస్తే ఈ గాయాలు ఎలా వస్తాయి? ఇది ముందుగా పథకం వేసిన హత్యే. దోషులకు కఠిన శిక్ష వేయాలి" అని చెప్పారు.ఈ అరెస్టుల నేపథ్యంలో బర్బరూ ప్రాంతంలో ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం చేయాలని, హత్యకేసులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
శ్రావణ శుక్రవారం పూజలు చేసిన సురేఖవాణి, సుప్రీత (ఫొటోలు)
-
ముద్దుల తనయకు గణపతి బప్పా ఆశీర్వాదం : న్యూ డాడ్ సిద్ధార్థ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ముద్దుల కుమార్తె కోసం ఆదివారం ఆలయంలో ప్రార్థనలు చేసి గణపతి బప్పా ఆశీర్వాదం తీసుకున్నారట. తన తల్లి రిమ్మా మల్హోత్రాతో సిద్ధి వినాయకుణ్ణి సందర్శించారు. దీనికి సంబంధించినొకవీడియో నెట్టింట ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.ఆలయ సందర్శనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్లైన్లో కనిపించాయి. ఒక ఛాయాచిత్రకారుడు షేర్ చేసిన క్లిప్లో, సిద్ధార్థ్ నీలిరంగు కుర్తా ,బ్లాక్డెనిమ్ ధరించి సిద్దార్థ్, పింక్ సూట్లో తల్లి రిమ్మా గణపతిని దర్శించుకున్నారు. భక్తితో చేతులు జోడించి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పూజారి దేవుని పాదాల దగ్గరి పూమాలను వారికి ఇచ్చారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)s="text-align-justify"> కాగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో కనిపించిన కియారా, ఇటలీలోని రోమ్లో సిద్ధార్థ్ మల్హోత్రా తనకు ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. షేర్షా సినిమా షూటింగ్ సమయంలో డేటింగ్లో ఉన్న వీరిద్దరూ 2023, ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వివాహం జరిగింది. ఈ జంట జూలై 16న తమ తొలి సంతానానికి (ఆడబిడ్డ) జన్మనిచ్చారు. -
నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
మహబూబ్ నగర్ జిల్లా: ‘నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చెయ్యొద్దంటూ ప్రాథేయపడినా ఆ తండ్రి కనికరించలేదు. సభ్యసమాజం తల దించుకునేలా మృగంలా మారి కన్న కూతురిపైనే దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాము కథనం ప్రకారం.. కుర్వ కుర్మయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు మక్తల్లోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే చిన్న కూతురు (10)కు రెండు నెలల క్రితం కుక్క కరవటంతో చికిత్స చేయించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే 5వ తరగతి చదివిస్తున్నారు. ఈ నెల 25న తల్లి కూలీ పనులకు, తండ్రి మేకల దగ్గరకు వెళ్లాడు. చిన్న కూతురు పాఠశాల నుంచి వచ్చి సాయంత్రం ఇంట్లో చదువుకుంటుండగా ఇంటికి వచ్చిన తండ్రి కుర్మయ్య.. ఒంటరిగా ఉన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయొద్దని ప్రాథేయపడినా కనికరించలేదు. ఇంట్లో నుంచి బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కాపాడారు. అప్పటికే బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పగా.. గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆర్ఎంపీ చెప్పగా.. భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కుర్మయ్య భార్యను కొట్టి గ్రామం నుంచి పరారయ్యాడు. బాలిక పరిస్థితి మరింత విషమంగా మారడంతో అదే రోజు రాత్రి మరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబ్నగర్కు తీసుకెళ్లాలని చెప్పగా.. కుటుంబ సభ్యులు మరుసటి రోజు శనివారం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పోలీసు కేసు అయితేనే చికిత్స చేస్తామని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
షాద్ నగర్ చౌరస్తాలో ఘోర ప్రమాదం
రంగారెడ్డి: షాద్ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను షాద్ నగర్కు చెందిన తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రిగా గుర్తించారు.శనివారం ఉదయం తండ్రీకూతురు బైక్పై వెళ్తున్నారు. షాద్ నగర్ చౌరస్తాకు చేరుకోగానే.. వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ వీళ్లను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. -
Jamie Lever: వీడియో కాల్ ఆడిషన్.. అలా చేసి ఉంటే బుక్కయ్యేదాన్ని
పాపులర్ కమెడియన్ జానీ లివర్ కుమార్తె జామీ లివర్ బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా టాలీవుడ్లోనూ ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. హిందీలో 'కిస్ కిస్కో ప్యార్ కరూన్', 'హౌస్ఫుల్ 4' లాంటి చిత్రాల్లో కనిపించిన జామీ లివర్..ప్రస్తుతం స్టాండప్ కామెడీ టూర్లో పాల్గొననుంది. 'ది జామీ లివర్ షో' పేరుతో ఆగస్టు 1న యూఎస్లోని సీటెల్లో ప్రారంభించనుంది. ఆ తర్వాత దాదాపు 15 నగరాల్లో ఈ కామెడీ షో జరగనుంది. ఆగస్టు 31న బోస్టన్లో ముగియనుంది.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జామీ లివర్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ ఆడిషన్ తనకు భయానికి గురి చేసిందని తెలిపింది. తనను ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్ కోసం కొందరు సంప్రదించారని వెల్లడించింది. అయితే ఈ పాత్ర బోల్డ్గా ఉంటుందని ముందే సమాచారం ఇచ్చారని వివరించింది.ఆడిషన్లో భాగంగా తనను వీడియో కాల్ ద్వారా సంప్రదించారని జామీ లివర్ తెలిపింది. 'మీ ముందు ఓ 50 ఏళ్ల వ్యక్తిని ఊహించుకుని.. అతన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించండి' అని అడిగారని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత స్క్రిప్ట్ ప్రకారం న్యూడ్గా కనిపించాలని అవతలి వ్యక్తి తనతో అన్నారు. దీంతో తనకు అసౌకర్యంగా, అనుచితంగా అనిపించిందని జామీ లివర్ పేర్కొంది. అవతలి వ్యక్తి వీడియో ఆన్ చేయలేదని.. అప్పుడే ఆడిషన్పై తనకు డౌట్ వచ్చిందని.. వెంటనే వీడియో కాల్ కట్ చేశానని జామీ లివర్ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.ఇదంతా ఓ స్కామ్ అని త్వరగా గ్రహించి తాను బయటపడ్డానని జామీ లివర్ భయానక అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఒకవేళ నేను అలానే ఆడిషన్ చేసి ఉంటే ఇబ్బంది పడేదాన్ని.. అలాగా జరగనందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని తెలిపింది. కాస్టింగ్ పేరుతో ఇలా చాలామంది మోసపోయారని జామీ లివర్ చెప్పుకొచ్చింది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కావడంతో చాలా భయపడ్డానని ఆమె విచారం వ్యక్తం చేసింది. -
కూతురితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో హీరోయిన్ ప్రణీత చిల్ (ఫొటోలు)
-
రష్యా మహిళ, చిన్నారి జాడ తక్షణమే కనిపెట్టండి
న్యూఢిల్లీ: రష్యా మహిళ, ఆమె కుమార్తె కనిపించకుండా పోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా ఆమెకు ఎవరో సాయం చేసి ఉండొచ్చని పేర్కొంది. లుకౌట్ నోటీసు జారీ చేసి, తల్లి, కుమార్తె జాడను త్వరగా తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సైకత్ బసు అనే వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చిల ధర్మాసనం పైవిధంగా స్పందించింది. రష్యా పౌరురాలైన తన మాజీ భార్య విక్టోరియా బసు, నాలుగున్నరేళ్ల చిన్నారి ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ సైకత్ బసు పేర్కొన్నారు. పోలీసులు లుఔట్ నోటీసు జారీ చేశారని, రష్యా ఎంబసీతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి ధర్మాసనానికి నివేదించారు. ఈ నెల 6న ఆమెకున్న కెనరా బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.169 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమె దేశం విడిచి వెళ్లినట్లు ఎయిర్పోర్టుల్లో నమోదు కాలేదని వివరించారు. స్పందించిన ధర్మాసనం..విక్టోరియా బసు వేరే మార్గాల ద్వారా దేశం దాటి వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడింది. అన్ని రైల్వే స్టేషన్లు, ఇతర రవాణా వ్యవస్థల నుంచి సమాచారం సేకరించాలని, ఢిల్లీని విడిచారా లేదా నిర్థారించాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే వారి జాడ కనుగొనాలంది. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు సైకత్, విక్టోరియా దంపతులు చిన్నారి సంరక్షణను వారంలో చెరో మూడు, నాలుగు రోజులు తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ నెలారంభంలో ఢిల్లీలోని రష్యా ఎంబసీ వెనుక వైపు నుంచి ఓ దౌత్యాధికారి వెంట కూతురిని తీసుకుని వెళ్లిన విక్టోరియా జాడ మళ్లీ కనిపించలేదని సైకత్ పేర్కొన్నారు. కుమార్తె సహా ఆమె భారత్ విడిచి వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
తండ్రికి తలకొరివిపెట్టిన తనయ
హిరమండలం: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అకస్మాత్తుగా కన్నుమూయడం తీరని విషాదాన్ని నింపింది. కొడుకు అయినా, కూతురైనా తానే అనుకుంటూ పుట్టెడు దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. అలా తన తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఆ కుమార్తె. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం శ్యామలాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి జగదీష్ (49) కోళ్లఫారం నడుపుతున్నారు. కోళ్లఫారంలో ఉండగా ఆదివారం రాత్రి పాముకాటు వేయడంతో మృతి చెందారు. ఈయన కుమారుడు రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమార్తె లావణ్య లండన్లో ఉంటోంది. తండ్రి మరణంతో హుటాహుటిన బయలుదేరి స్వగ్రామానికి మంగళవారం చేరుకుంది. అన్నీ తానై అంత్యక్రియలు పూర్తి చేసింది. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులుబెల్ట్ షాపులపై గిరిజన మహిళల దాడి కొరాపుట్: బెల్ట్ షాపులపై గిరిజన మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ సమితి బెనరా గ్రామ పంచాయతీ కాలిబెడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని స్థానిక మహిళలు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో విసుగెత్తిపోయిన మహిళలు భారీ సంఖ్యలో వెళ్లి ఆ గ్రామంలోని బెల్టుషాపులు తనిఖీ చేసి మద్యం సీసాలు పగలగొట్టారు. -
చిక్కుల్లో షేక్ హసీనా కూతురు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూతురు డాక్టర్ సైమా వాజెద్(Saima Wazed) చిక్కుల్లో పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్-ఈస్ట్ ఏషియా ప్రాంతానికి(SEARO) ఆమె రీజియనల్ డైరెక్టర్గా కొనసాగుతున్న సంగతి తెతలిసిందే. అయితే సొంత దేశంలో అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడంతో.. డబ్ల్యూహెచ్వో ఆమెను నిరవధిక సెలవులపై పంపింది.ఇప్పటికే భారత్లో ఆశ్రయం పొందిన షేక్ హసీనాపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలు అభియోగాలను నమోదు చేసింది. అయితే తాజాగా ఆమె తనయ సైమా వాజెద్పైనా అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆమెను సెలవులపై పంపించిన డబ్ల్యూహెచ్వో.. సైమా స్థానంలో డాక్టర్ కాథరినా బూమీ ఇన్ఛార్జిగా కొనసాగుతారని వెల్లడించింది. అయితే ఆమె సెలవుల వ్యవహారంపై ప్రశ్న ఎదురుకాగా.. అదనంగా స్పందించేందుకు డబ్ల్యూహెచ్వో నిరాకరించింది. డబ్ల్యూహెచ్వో నిర్ణయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిసిన ఓ అధికారి.. ఆమెను శాశ్వతంగా తప్పించాలని ఐక్యరాజ్య సమితి విభాగానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూహెచ్వో రీజీయనల్ ఆఫీస్ న్యూఢిల్లీలోనే ఉంది. కాథరినా జులై 15వ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. సైమా వాజెద్పై అధికార దుర్వినియోగం, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులను బంగ్లాదేశ్ యాంటీ కరప్షన్ కమిషన్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.1972 డిసెంబర్ 9న డా. ఎం.ఎ. వాజేద్ మియా (న్యూక్లియర్ సైంటిస్ట్), షేక్ హసీనా దంపతులకు సైమా వాజెద్ జన్మించారు. ఫ్లోరిడా(అమెరికా) బ్యారీ యూనివర్సిటీలో ఆమె సైకాలజీలో డిగ్రీ, పీజీ చేశారు. ఆర్గనైజేషనల్ లీడర్షిప్లో డాక్టరల్ చేశారు. స్కూల్ సైకాలజీలో స్పెషలిస్ట్ అయిన ఆమె.. ఆటిజం, మానసిక ఆరోగ్యంపై ఆమె చేసిన ప్రచారాలు అంతర్జాతీయ స్థాయిలో మార్పులకు దారితీశాయి. డబ్ల్యూహెచ్వో ఆమె నేతృత్వంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఆమె భర్త ఖండకర్ మస్రూర్ హుస్సేన్ మితు. ఈయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈ జంటకు నలుగురు పిల్లలు. అయితే వీళ్లు విడిపోయారంటూ ఆ మధ్య ప్రచారం జరిగినా.. అధికారికంగా ఇద్దరిలో ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: టారిఫ్ వార్లో వెనక్కి తగ్గిన ఈయూ? -
ఒక్క మార్కుతో ఓటమి.. అయినా ఆగని కలల ప్రయాణం
ఒక్క మార్కుతోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికవలేదని కుంగిపోలేదా యువతి.. చదువు, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు.. తండ్రికి సాయంగా మేకలు కాసేందుకు రోజూ అడవిబాట పడుతోంది. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామానికి చెందిన నూనె నర్సయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. చదువుల్లో రాణిస్తూనే కూతురు కల్యాణి తండ్రికి సాయంగా మేకలతో ఊరి పొలిమేరల్లోని గుట్టల్లోకి వెళ్తోంది. ఆర్మీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని, ఈసారి ఉద్యోగం తనదేనని ధీమాగా చెప్పింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ట్రాక్టర్పై సీతక్క ప్రయాణం ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఎలిశెట్టిపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించింది. కానీ ఎలిశెట్టిపల్లి గ్రామానికి రోడ్డు మార్గం లేదు. దీంతో పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి.. మంత్రి సీతక్క ట్రాక్టర్పై కూర్చొని జంపన్నవాగు దాటి వెళ్లారు. ఈ వాగుపై వంతెన నిర్మించాలని అక్కడి ప్రజలు మంత్రిని వేడుకున్నారు. వంతెన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. -
‘కూతురు సంపాదన మీద బతుకుతున్నావా?ఎందుకా బతుకు?’
ఢిల్లీ: కూతురు సంపాదన మీద బతుకుతున్నావా? ఏందుకా? బతుకు? అనే ఇతరుల సూటిపోటి మాటలు తండ్రిలోని రాక్షసత్వాన్ని నిద్ర లేపాయి. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కూతురు ప్రాణాలు తీసేలా చేశాయి. గురుగ్రామ్లో తండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన రాష్ట్ర స్థాయి టెన్నీస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్యకేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.గురువారం రాత్రి గురుగ్రామ్లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణిని రాధికా యాదవ్ (25)ను ఆమె త్రండి దీపక్ యాదవ్ (49) తుపాకీతో కాల్చి చంపాడు. అయితే, ఈ దారుణం జరగడానికి కారణం రాధికా యాదవ్ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తుంటుంది. ఇదే విషయంలో దీపక్ యాదవ్.. రాధికాను మందలించారు. పట్టించుకోకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తూ కూతురు తన పరువు తీస్తోందని భావించే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తేలింది. ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో రాధికా యాదవ్ మరణానికి అసలు కారణంగా ఆమె ఇన్ స్టా రీల్స్ చేయడం కాదని నిర్ధారించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తేలింది. రాధికా యాదవ్కు టెన్నిస్ అంటే ప్రాణం. ఓ సానియా మిర్జా, సెరెనా విలియమ్స్లా రాణించాలని అనుకుంది. అందుకు తగ్గట్లుగానే చిన్ననాటి నుంచి టెన్నీస్లో తర్ఫీదు పొందింది. రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు టెన్నీస్ మ్యాచ్లలో అసాధారణమైన ఆటతీరుతో తనకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉందని నిరూపించింది. కానీ, అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.కొద్ది కాలం క్రితం జరిగిన రాష్ట్రస్థాయి టెన్నీస్ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్కు తీవ్ర గాయమైంది. దీంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్కు దూరం కావడంతో మానసికంగా కృంగి పోయింది. అప్పుడే నేను ఆటకు దూరమైతేనేం. నాలాగా టెన్నీస్లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహిస్తే సరిపోతుంది కదా అని అనుకుంది. అనుకున్నదే తడవుగా కుటుంబసభ్యులు,గురువుల సహకారంతో టెన్నీస్ అకాడమనీ ప్రారంభించింది. అనతికాలంలో తన కోచింగ్తో రాధికా యాదవ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తండ్రి దీపక్ యాదవ్ కూడా తనకు చేదోడు వాదోడుగా నిలిచారు. అదిగో అప్పుడే.. మనం కష్టాల్లో ఉంటే సంతోష పడేవాళ్లు.. సంతోషంగా ఉంటే ఈర్ష, అసూయతో కుళ్లుకునే వాళ్లు ఉంటారనే నానుడిని నిజం చేశారు దీపక్ యాదవ్ ఇరుగు పొరుగు వారు.దీపక్ యాదవ్ కుటుంబానికి పేరు, ప్రతిష్టలు రావడం ఇష్టం లేని ఇతరులు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. ఆ మాటలు తట్టుకోలేక కూతురి ప్రాణం తీసినట్లు తండ్రి దీపక్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు. ‘నేను ఇంట్లో నిత్యవసర వస్తువుల కోసం, లేదంటే ఇతర పనుల నిమిత్తం బయటకు వెళుతుంటాను. అలా నేను బయటకు వెళ్లిన ప్రతీసారి ఇతరులు నన్ను సూటిపోటి మాటలతో హింసించేవారు. కూతురు సంపాదన మీద బ్రతుకుతున్నావా?. ఎందుకా బతుకు? అనే మాటలు నన్ను ఎంతగానో బాధించేవి. వాటిని నేను పట్టించుకునే వాడిని కాదు. కొందరు నా కూతురి వ్యక్తిత్వంపై అనుచితంగా మాట్లాడారు. ఈ వరుస సంఘటనలు నన్ను మానసికంగా కుంగదీసాయి. నా కూతుర్ని టెన్నిస్ అకాడమీని మూసేయమని చెప్పాను. కానీ ఆమె తిరస్కరించింది. నాలో సహనం నశించింది. ఆమె వంటచేస్తున్నపుడు వెనుక నుండి నా లైసెన్స్డ్ రివాల్వర్తో మూడు రౌండు కాల్పులు జరిపాను. నా కూతురిని నేనే హత్య చేశాను’ అని దీపక్ యాదవ్ పోలీసుల ఎదుట కన్నీరుమున్నీగా విలపించారు. పోలీసుల ప్రకారం.. మృతురాలు రాధికా యాదవ్ మామ కుల్దీప్ యాదవ్ దారుణం ఎలా జరిగిందో పోలీసులకు కళ్లకు కట్టిన వివరించారు. గురువారం ఉదయం 10:30కు గట్టి శబ్దం వినిపించడంతో, ఆయన దీపక్ నివసించే మొదటి అంతస్థుకు పరుగెత్తారు. నాకు గన్ను పేలిన శబ్ధం వినిపించింది. మొదటి ఫ్లోర్కి వెళ్లగా నా మేనకోడలు రాధికా వంటగదిలో రక్తపు మడుగులో పడి ఉంది. డ్రాయింగ్ రూమ్లో రివాల్వర్ కనిపించింది. ఆ తర్వాత నా కుమారుడు పీయూష్ యాదవ్తో కలిసి మేము ఆమెను కారులో తీసుకుని ఆస్పత్రికి తరలించాం. వైద్యుడు ఆమెను పరీక్షించిన తర్వాత ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఆమె గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి… చాలా ట్రోఫీలు గెలుచుకుంది. ఆమె హత్యకు కారణం నాకు అర్థం కావడం లేదు.ఆమె మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎందుకు హత్య జరిగింది అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను మొదటి అంతస్థు (ఫ్లోర్)కి వెళ్లినప్పుడు దీపక్, మంజు యాదవ్, రాధికా మాత్రమే అక్కడ ఉన్నారు ’అని కుల్దీప్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
విష్ణువిశాల్- గుత్తా జ్వాలా కూతురి నామకరణ వేడుక (ఫోటోలు)
-
తండ్రిని దారుణంగా చంపిన కూతురు
-
తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లి..
మల్కాజ్గిరి జిల్లా: భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి, ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యతి్నంచి కటకటాలపాలైంది. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరి«ధిలో జరిగింది. హత్య వివరాలను బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలి్పన మేరకు..ముషిరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తుండగా, శారద జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుడ్ని తండ్రిగా గుర్తించి..తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతకోసి చంపారని శారద పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ముగ్గురూ కలిసి ... లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లింగం కోపగించి..అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహ్మద్ జావీద్ సహకరించారు. ఈమేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు.కల్లులో నిద్ర మాత్రలు కలిపి... లింగంకు కల్లు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ నెల 5న శారదకు టాబ్లెట్లు అందించాడు. లింగం కల్లు తాగి ఇంట్లో పడుకోగా.. విషయాన్ని శారద..కుమార్తె మనీషా, జావీద్లకు సమాచారం ఇచి్చంది. మనీషా సమీపంలోని వైన్స్లో మద్యం కొనుగోలు చేసి వచి్చ..మరోసారి లింగంకు తాగించారు. అనంతరం శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్లు చేతులు కట్టేసిన జావీద్..అతడి ముఖంపై దిండుతో అదిమి..పిడికిలితో గుండెపై మోది, గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు. సినిమాకు వెళ్లి..క్యాబ్లో శవాన్ని తరలించి.. హత్య అనంతరం ముగ్గురు జావీద్ ఉండే ఇంటికి బైక్పై వెళ్లి.. అటునుంచి సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఎదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఎదులాబాద్లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా..జావీద్ బైక్పై వెనుక అనుసరించి.. శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యుల పైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
రీల్ కోసం పాకులాట
జైపూర్: రాజస్తాన్కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టి రీల్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిండుగా తొణికిసలాడుతున్న భరత్పూర్ జిల్లాలోని బంధ్ బరైతా రిజర్వాయర్పై ఉన్న ఇనుప ఫ్రేమ్పై భయపడుతున్న తన కూతురిని బలవంతంగా అతడు కూర్చోబెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ నెల 4న ఉమా శంకర్ తన భార్య, కుమార్తెతో జలాశయం వద్దకు వెళ్లాడు. వీడియో చిత్రీకరించేందుకు గాను ప్రమాదకరంగా ఉన్న ఇనుప ఫ్రేమ్పై తీవ్రంగా భయపడుతున్న తన కుమార్తెను గద్దించి కూర్చోబెట్టాడు. అక్కడ ఆమె కిందపడకుండా పట్టుకునేందుకు సైతం ఎలాంటి రక్షణ ఏర్పాటూ లేకపోవడం గమనార్హం. ఆ రిజర్వాయర్ ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఇటీవల వర్షాలకు జలకళ సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితులు ఉమా శంకర్ తీసి, సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం కూతురు పట్ల ఇంత బాధ్యత లేకుండా వ్యవహరించే తల్లిదండ్రులు కూడా ఉంటారా అని నిలదీశారు. దీంతో, ఉమా శంకర్ తన ఇన్స్టా అకౌంట్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశాడు. పోలీసులు దీనిపై ఇంకా స్పందించలేదు. -
విష్ణు విశాల్- గుత్తా జ్వాలా కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్.. ఫోటోలు
-
కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియో
బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడితే..ఏ తండ్రి అయినా చూస్తూ ఉరుకుంటాడా..? తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు దూకేస్తాడు. సరిగ్గా అదే చేశాడో తండ్రి. తన కళ్లముందే బిడ్డ సముద్రంలో పడిపోవడాన్ని చూసి క్షణం ఆలోచించకుండా దూకేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. డిస్నీ క్రూయిజ్ షిప్ లోని 4వ డెక్ నుంచి ఒక పాప పొరపాటున జారి పడబోయింది. ఇది చూసిన తండ్రి క్షణం ఆలోచించుండా ఆమెను కాపాడటానికి సముద్రంలోకి దూకాడు. జూన్ 29న బహామాస్ - ఫోర్ట్ లాడర్డేల్ మధ్య ఓడ ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. బహామాస్ చుట్టూ నాలుగు రాత్రుల షిప్లో గడిపిన తరువాత ఓడ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్కు తిరిగి వస్తోంది. చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్"ఓడ వేగంగా కదులుతోంది. సముద్రపు హోరును, నీటి మెరుపులను చూస్తూ ప్రయాణికులుఎంజాయ్ చేస్తున్నారు. తన అయిదేళ్ల కమార్తెకు తండ్రి రైలింగ్ దగ్గర ఫోటో తీస్తున్నాడు. ఇంతలోనే ఆ పాప పడిపోయింది. వెంటనే తండ్రి కూడా దూకేశాడు. దీంతో ఓడ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. కెప్టెన్ వెంటనే ఓడను స్లో చేశాడు. ఇంతలో క్రూ సభ్యులు లైఫ్సేవర్లను నీటిలోకి విసిరారు. క్రూయిజ్ షిప్ నుంచి రెస్క్యూ బోట్ ద్వారా తండ్రీ కూతుళ్లను రక్షించారు. ఇది కళ్లప్పగించి చూస్తున్న ప్రయాణికులు బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. అటు ప్రయాణీకులు, ఇటు డిస్నీ సిబ్బంది తండ్రి ధైర్యాన్ని ప్రశంసించారు.హీరో అంటూ నెటిజనులు కూడా తండ్రిని అభినందనల్లో ముంచెత్తారు. ఈ సంఘటనను రికార్డ్ చేసిన ట్రేసీ రాబిన్సన్-హ్యూస్, "బిడ్డను కాపాడటానికి దూకిన ఒక హీరో’’ అంటూ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్లో వైరల్గా మారింది. NEW: Father jumps overboard to save his 5-year-old daughter, who fell off a Disney cruise ship from the 4th deck into the ocean.The ship was heading back to South Florida when the intense rescue was made."The ship was moving quickly, so quickly, it's crazy how quickly the… pic.twitter.com/PTGmAzZJ7O— Collin Rugg (@CollinRugg) June 30, 2025మరోవైపు డిస్నీ క్రూయిజ్ లైన్ తమ సిబ్బంది స్పందించిన తీరు, ప్రయాణీకులను రక్షించిన తీరును ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం తెల్లవారుజామున ఆ ఓడ సురక్షితంగా పోర్ట్ ఎవర్గ్లేడ్స్కు తిరిగి వచ్చింది.ఇదీ చదవండి: 5 వేల కిలోమీటర్ల దూరంనుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు -
మనవడిని అమ్మేసిన తాత
తాటిచెట్లపాలెం(విశాఖపట్నం): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి, తన కుమార్తెకు పుట్టిన మగబిడ్డను ఆమెకు తెలియకుండానే దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నేరుగా పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. అరకు ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్య (23) అదే ప్రాంతానికి చెందిన జాన్బాబును ప్రేమించి వివాహం చేసుకుంది. దివ్య తండ్రి పి. శుక్రకు ఈ వివాహం మొదటి నుంచి ఇష్టం లేదు. వారిద్దరినీ విడదీయడానికి అతను పలు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో దివ్య, జాన్బాబు మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ సమయంలో దివ్య గర్భవతి కావడంతో, ప్రసవం కోసం ఆమె తండ్రి శుక్ర విశాఖలోని కై లాసపురం ప్రాంతానికి తీసుకువచ్చి, అద్దె ఇంట్లో ఉంచాడు. దివ్యకు కేజీహెచ్లో మగబిడ్డ జన్మించాడు. బిడ్డకు పచ్చకామెర్లు ఉన్నాయని, అనారోగ్యంగా ఉన్నాడని, వైద్యం చేయించాలని చెప్పి, దివ్యతో పలు పత్రాలపై సంతకాలు చేయించాడు. అనంతరం తల్లికి తెలియకుండా ఆ బిడ్డను దత్తత పేరుతో విక్రయించాడు. రెండు నెలలు గడిచినా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో దివ్య తన తండ్రిని నిలదీసింది. సరైన సమాధానం రాకపోవడంతో, దివ్య మొదట కంచరపాలెం పోలీస్స్టేషన్లో, ఆపై నేరుగా పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి బిడ్డ ఆచూకీని కనుగొన్నాయి. బిడ్డను మొదట ఆర్అండ్బీ వద్ద గల శిశుగృహకు అప్పగించారు. సోమవారం పోలీసుల సమక్షంలో ఆ బిడ్డను తల్లిదండ్రులైన దివ్య, జాన్బాబులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
లయ కూతుర్ని చూశారా?.. అచ్చం హీరోయిన్లాగే ఉందిగా! (ఫొటోలు)
-
అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి
జీడిమెట్ల(హైదరాబాద్): ప్రియుడు, అతని సోదరుడితో కలిసి పదో తరగతి బాలిక కన్నతల్లిని చంపించిన కేసులో పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. బుధవారం షాపూర్నగర్లో బాలానగర్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ నరే‹Ùరెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్ డీఐ కనకయ్యలతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39) తెలంగాణ సాంస్కృతిక శాఖలో కళాకారిణి. అంజలి తన ఇద్దరు కుమార్తెలు (16), (12)లతో కలిసి షాపూర్నగర్లోని హెచ్ఎంటీ సొసైటీలో నివసిస్తోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఎనిమిది నెలల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శివ (18)తో ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమను బాలిక తల్లి అంజలి తొలుత అంగీకరించినా.. ఆ తర్వాత వ్యతిరేకించసాగింది. బాగా చదువుకోవాలని కుమార్తెకు చెబుతూనే ప్రేమ విషయంలో మందలించేది. తల్లి మందలించడంతో ప్రియుడి చెంతకు.. ఈ క్రమంలో ఈ నెల 8న బాలిక తన సోదరిని తీసుకుని కట్టంగూర్కు వెళ్లి నాలుగు రోజులు ఉండి వచి్చంది. ఇది నచ్చని తల్లి కుమార్తెను తీవ్రంగా మందలించింది. తనను మందలించడంతో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఈ నెల 19న కట్టంగూర్లోని ప్రియుడు శివ వద్దకు వెళ్లిపోయింది. మరునాడు బాలిక తల్లి అంజలి తన కూతురుని శివ కిడ్నాప్ చేశాడంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శివపై కేసు నమోదు చేసి బాలికను తల్లి అంజలికి అప్పగించారు. అంజలికి అదే శాపమైంది.. ఈ నెల 22న తన చెంతకు చేరిన కుమార్తెను తల్లి అంజలి గట్టిగా మందలించడంతో పాటు చేయి చేసుకుంది. శివను జైలుకు పంపిస్తానని భయపెట్టింది. దీంతో తన ఇష్టానికి అడ్డుగా వస్తున్న తల్లిని ఎలాగైనా చంపాలని బాలిక గట్టిగా నిర్ణయించుకుంది. 23న సాయంత్రం శివను షాపూర్నగర్ వచ్చి తన తల్లిని హత్య చేయాలని కోరింది. దీనికి శివ అభ్యంతరం చెప్పడంతో.. అయితే తానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో శివ... పదో తరగతి చదువుతున్న తన తమ్ముడి (16)ని తీసుకుని గత సోమవారం సాయంత్రం షాపూర్నగర్ వచ్చాడు. బాలిక ఇంటి బయట కాపలా కాయగా.. శివ, అతని సోదరుడు లోపలికి వెళ్లి అంజలి మెడకు చున్నీతో గట్టిగా ఉరి బిగించి హత్య చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో మంగళవారం తెల్లవారుజామున శివను కట్టంగూర్లో, అతని సోదరుడిని, బాలికను నగరంలో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అంజలిని తామే చంపినట్లు ఒప్పుకొన్నారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. మొదటి నుంచీ తల్లి అంటే కుమార్తెకు గిట్టేది కాదు.. నిందితురాలు బాలిక (16)కు తల్లి అంజలి అంటే గిట్టేది కాదు. 7వ తరగతిలోనే తల్లి వద్ద ఉండను అంటూ అప్పట్లోనే పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అంజలి తన కూతురును రెండేళ్ల పాటు గుండ్లపోచంపల్లిలోని సోదరి ఇంట్లో ఉంచింది. మూడు నెలల క్రితమే బాలిక తల్లి వద్దకు వచి్చనట్లు తెలుస్తోంది. బాలికకు మొదటి నుంచీ తల్లితో శత్రుత్వమే అని.. తరచూ తల్లి తరచూ తనపై చేయి చేసుకొంటోందని బాలిక తన గోడును స్నేహితులతో వెళ్లబోసుకునేదని తెలిసింది. కేసును కొన్ని గంటల్లోనే ఛేదించిన జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లే‹Ù, డీఐ కనకయ్య, సిబ్బందిని డీసీపీ అభినందించారు.అంజలిని హత్య చేయడంలో తప్పులేదు: నిందితుడి తల్లి జీడిమెట్లలో అంజలి హత్యోదంతం కేసులో నిందితుడు శివ తల్లి ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలిక తల్లి అంజలిని తన కుమారులు హత్య చేయడాన్ని ఆమె సమరి్థంచుకుంది. మొదట్లో శివ ప్రేమకు అంగీకారం తెలిపిన అంజలి.. ఆ తర్వాత ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను తన కొడుకులు హత్య చేశారని చెప్పుకొచి్చంది. తల్లికి తలకొరివి పెట్టిన చిన్నకూతురు కేసముద్రం: జీడిమెట్లలో హత్యకు గురైన అంజలి అంత్యక్రియలు బుధవారం ఆమె స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో జరిగాయి. ఆమె మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్తో పాటు, వివిధ పారీ్టలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు సందర్శించి నివాళులరి్పంచారు. అనంతరం తల్లి మృతదేహానికి చిన్న కుమార్తె మనస్విని తలకొరివి పెట్టింది. -
జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా....అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. -
జీడిమెట్ల: తల్లిని కడతేర్చిన కూతురు.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మేడ్చల్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చింది ఓ బాలిక.. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. తల్లి ప్రేమను మరిచిది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశం గా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జిడీమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్స్టాలో శివ పరిచయమయ్యాడు. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ బాలిక.. తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని.. గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరుమున్నీరైంది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్ చేసి.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది. -
కుమార్తె ‘నీట్’ స్కోర్ తగ్గిందని.. విచక్షణ మరచి..
సాంగ్లి: మహారాష్ట్రంలో మరో విద్యాకుసుమం నేలరాలింది. సాంగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కుమార్తెను డాక్టర్గా చూడాలనుకున్న ఒక తండ్రి చేసిన పని అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుమార్తె మరణానికి ప్రధానోపాధ్యాయుడైన ఆ తండ్రే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో మంచి మార్కులు సాధించలేదని తన 17 ఏళ్ల కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఉదంతం వెలుగు చూసింది. సాంగ్లి జిల్లాలోని నెల్కరంజి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన విద్యార్ధినిని సాధన భోస్లేగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. సాధన తండ్రి ధోండిరామ్ భోస్లే కుమార్తె చదువుతున్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నారు.కుమార్తె నీట్ మాక్ టెస్ట్లో తక్కువ మార్కులు సాధించడంతో ఆమెను తండ్రి మందలించారు. అయితే సాధన తండ్రితో వాగ్వాదానికి దిగింది. కుమార్తె మాటలు ధోండిరామ్ భోస్లేకు ఆగ్రహం తెప్పించాయి. వెంటనే ఆయన ఒక కర్రతో కుమార్తెపై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన సాధనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, అలానే వదిలివేశాడు. మర్నాడు కూడా కుమార్తెను పట్టించుకోకుండా, యధావిధిగా తన స్కూలుకు వెళ్లిపోయాడు. ధోండిరామ్ భోస్లే పాఠశాల నుంచి తిరిగి వచ్చేసరికి, ఇంటిలో సాధన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స ప్రారంభించేలోపే సాధన మృతిచెందింది. పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్? -
'కుబేర'కు రివ్యూ ఇచ్చిన శేఖర్ కమ్ముల కూతురు
ఈ వీకెండ్ రెండు కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వీటిలో 'కుబేర' ఒకటి. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. సాధారణంగా ఈ డైరెక్టర్ ఇంత పెద్ద మూవీస్ చేయడు. స్టార్స్ లేకుండా సింపుల్ బడ్జెట్తో సినిమా తీస్తుంటారు. అలాంటిది ఈసారి భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ తీశారు. థియేటర్లలో చూసిన ప్రతిఒక్కరూ పాజిటివ్గానే స్పందిస్తున్నారు.(ఇదీ చదవండి: కొత్త కారు కొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రేటు ఎంతో తెలుసా?)'కుబేర' చూసినవాళ్లు శేఖర్ కమ్ముల విజన్ని మెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసేందుకు ఈయన కూతురు కూడా వచ్చింది. బయటకొచ్చి తనదైన రివ్యూ కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'టీమ్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మేం చాలా చాలా చెప్పాం. దానికి మించి ఉంది సినిమా' అని శేఖర్ కమ్ముల కూతురు వందన చెప్పింది.దాదాపు 25 ఏళ్లుగా శేఖర్ కమ్ముల సినిమాలు తీస్తున్నాడు. కాకపోతే మిగతా దర్శకుల్లా కాకుండా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్గా ఉండరు. దీంతో ఈయన కుటుంబం గురించి బయటవాళ్లకు తక్కువగానే తెలుసు. అలాంటిది శేఖర్ కమ్ముల కూతురు వందన.. అప్పుడప్పు కనిపిస్తోంది. మొన్నీమధ్య హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఇప్పుడు తండ్రి సినిమాకు రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు.. శేఖర్ కమ్ములకు ఇంత పెద్ద కూతురుందా అని ఆశ్చర్యపోతున్నారు. చూస్తుంటే తండ్రిలానే సినిమాల్లోకి వస్తుందేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: Kuberaa Review: ‘కుబేర’ మూవీ రివ్యూ) -
కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం.


