daughter
-
‘నిఖిల్ కుమారస్వామి కంటే ఆమె 10 రెట్లు బెటర్’
నిఖిల్ కుమారస్వామి కంటే ఆమె 10 రెట్లు బెటర్ అంటున్నారు కన్నడిగులు. అంతేకాదు కర్ణాటకలో చాలా మంది రాజకీయ నాయకుల వారసుల కంటే ఆమె మెరుగ్గా ఉన్నారని కూడా ప్రశంసిస్తున్నారు. నెటిజనుల నుంచి కితాబు అందుకున్న ఆమె ఎవరు కాదో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తనయ ఐశ్వర్య డీకేఎస్హెగ్డె. ఆమెను ఎందుకు పొగుడుతున్నారంటే..?బెంగళూరులో గ్లోబల్ అకాడమి ఆఫ్ టెక్నాలజీ వేదికగా జరుగుతున్న వీటీయూ యూత్ ఫెస్ట్ 2025లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐశ్వర్య డీకేఎస్ హెగ్డె (Aisshwarya DKS Hegde) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆమెక మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఊహిస్తున్నారు.ఇంతకీ జరలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి?వీటీయూ యూత్ ఫెస్ట్ 2025కు (VTU Youth Fest 2025) సంబంధించిన పోస్టర్లను ఇంగ్లీషులో ప్రింట్ చేశారు. వీటిలో ఎక్కడా కన్నడ భాష కనిపించలేదు. ఇదే విషయాన్ని సదరు జర్నలిస్టు.. ఐశ్వర్య దృష్టికి తీసుకొచ్చాడు. ఈవెంట్ సైన్ బోర్డులపై కన్నడ లేకపోవడం గురించి ప్రశ్నించాడు. దీనికి ఆమె ఏమాత్రం తడుముకోకుండా, కాన్ఫిడెంట్గా సమాధానం ఇచ్చింది. ‘మా తప్పులను ఎత్తి చూపడానికే కదా మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు మా తప్పులను కనిపెడితేనే కదా మేము దిద్దుకోగలం. తప్పులు చేయడం మానవ సహజం. మేమూ మనుషులమే కదా’ అని ఐశ్వర్య జవాబిచ్చింది.ఈ వీడియో వైరల్ (Video Viral) కావడంలో నెటిజనులు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి, విమర్శలను స్వీకరించే తీరుకు నెటిజనులు ఫిదా అయ్యారు. ఐశ్వర్యకు సహజంగానే నాయకత్వ లక్షణాలు వచ్చాయని చాలా మంది కామెంట్ చేశారు. అంతేకాదు చాలా రాజకీయ నాయకుల వారసులతో పోలిస్తే ఆమె మెరుగ్గా ఉందని కితాబిచ్చారు కూడా.‘ఆమె రాజకీయాల్లో రారు’ ‘ఈ అమ్మాయి భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకురాలు కానుంది. ఆమెకు ఒక నియోజకవర్గం అవసరం. నిఖిల్ లేదా చాలా మంది బీజేపీ రాజకీయ నాయకుల పిల్లల కంటే 10 రెట్లు మెరుగ్గా ఉంది. కన్నడ బాగా మాట్లాడుతుంది, అత్యంత ఆత్మవిశ్వాసం కలిగి ఉంది. విమర్శలను ఎలా ఎదుర్కోవాలో తెలుసు’ అంటూ ఒక నెటిజన్ ప్రశంసించారు. అయితే ఆమె పాలిటిక్స్లోకి అడుగుపెట్టకపోవచ్చని ఒక యూజర్ ఊహించారు. ‘ఆమె ఆత్మవిశ్వాసం సాటిలేనిది, కానీ ఆమె రాజకీయాల్లో చేరదు. దీన్ని బుక్మార్క్ చేసుకోండి’ అని పేర్కొన్నారు. బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన ఐశ్వర్య తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తుందా, లేదా అనేది వేచి చూడాలి.ప్రదీప్ ఈశ్వర్ ‘ఫీమేల్ వెర్షన్’వ్యవహార శైలిలో చిక్కబల్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్, ఐశ్వర్య మధ్య సరూప్యం ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఐశ్వర్యను ప్రదీప్ ఈశ్వర్.. ‘ఫీమేల్ వెర్షన్’గా వర్ణించాడు. ‘ఒకే స్వరం, అదే శృతి - ఆమె అతని స్త్రీ రూపం!’ అని వ్యాఖ్యానించాడు. ఈ పోలిక ఆమె కమాండింగ్గా మాట్లాడే విధానాన్ని సూచించింది. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులకు మాత్రమే ఇది సాధ్యమని చాలా మంది నమ్ముతారు. అయితే తనకు విద్యావేత్తగా ఉండటమే ఇష్టమని గతంలో ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య చెప్పారు. కాబట్టి ఆమె రాజకీయాల్లోకి రాకపోవచ్చని కొందరు అంటున్నారు. కాగా, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను (Amartya Hegde) 2020లో ఆమె వివాహం చేసుకున్నారు. చదవండి: దక్షిణాదిపై వివక్ష మరింత పెరిగిందినిఖిల్కు కలిసిరాని అదృష్టంకాగా, నిఖిల్ కుమారస్వామి (Nikhil Kumaraswamy) జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తనయుడు. అతడు మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే హీరోగా రాణించకపోవడంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో మండ్య లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సుమలత చేతిలో పరాజయం పాలయ్యాడు. 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రామనగర నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2024 నవంబర్లో చన్నపట్న ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఆయనకు విజయం దక్కలేదు. #Karnataka #DKShivakumar daughter brilliantly responds to a reporter on the question why there is backdrop is not in kannada.pic.twitter.com/3oIlyO5pk7— Apurva Mirajkar (@apurvasays) March 23, 2025 -
కన్న తండ్రి కర్కశత్వం.. ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి..
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం నెలపర్తిపాడులో దారుణం జరిగింది. తండ్రి పిల్లి రాజు గణపతినగర్ లాకుల వద్ద తన ఇద్దరు పిల్లలు సందీప్, కారుణ్యలను కాలువలో పడేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో పదేళ్ల బాబు బయటపడ్డాడు. ఆరేళ్ళ పాప మృతదేహం లభ్యమైంది.తండ్రి పిల్లి రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. పిల్లల తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా పరారయ్యాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్.. స్పెషల్ అట్రాక్షన్గా తమన్నా!
-
పచ్చ కోకలో సుప్రీత.. అందాల అయస్కాంతంలా ఉందే! (ఫొటోలు)
-
30 ఏళ్ల తండ్లాట...అమ్మను చూడాలని !
తల్లిని కలిసేందుకు ఓ తనయ ఆరాటపడుతోంది. 30 ఏళ్లుగా ఆమెకు దూరమై తల్లడిల్లిపోయింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ ఠాణాలో మీ అమ్మ ఉందంటూ భవానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో భవాని ఆదివారం కోరుట్లలో ఉంటున్న తన బంధువులతో కలిసి అక్కడకు బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల రాంరెడ్డి 1979లో పీపుల్స్వార్లో చేరారు. అప్పుడే అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడాదిపాటు ఇంటి వద్దే ఉండగా, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంతతో వివాహం జరిగింది. ఏడాది వ్యవధిలోనే రాంరెడ్డి–వసంత దంపతులిద్దరూ పీపుల్స్వార్లోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉండగానే కూతురు జన్మించింది. ముంబైలో ఉండే తన అన్నసాయిబాబాకు కూతురు (భవాని)ని అప్పగించాడు రాంరెడ్డి. 2001లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పసుల రాంరెడ్డి హతమయ్యాడు. అయినా అజ్ఞాతం వీడని వసంత శాంతక్క, మమతక్క పేర్లతో దండకారణ్యంలోని బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!మోకాళ్ల నొప్పులు, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో 2024 నవంబర్లో వసంత కాంకేర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత కాంకేర్ పోలీసులు ఆమెతోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు 2025 జనవరిలో లొంగిపోయినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కాంకేర్లోనే పోలీసుల అదీనంలో ఉంటోంది. ఛత్తీస్గఢ్ పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు విషయం చెప్పారు. రెండురోజుల క్రితం తెలంగాణ పోలీసులు భవాని ఆచూకీ తెలుసుకున్నారు. ఆమెకు తల్లి సమాచారం చెప్పడంతో ఛత్తీస్గఢ్కు బయలుదేరింది. ఒకట్రెండుసార్లు అమ్మను కలిశాను ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా...చిన్నప్పుడు కోరుట్లలోనే ఓ చోట ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా. అప్పుడు అమ్మానాన్న ఇద్దరూ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళితే నన్ను అమ్మ తప్పకుండా గుర్తుపడుతుంది. ఇన్నాళ్లు పెద్దనాన్న దగ్గర దత్త పుత్రికగానే పెరిగాను. కొన్నేళ్ల క్రితమే పెద్దనాన్న దంపతులు ఇద్దరూ చనిపోయారు. అమ్మ వస్తుందంటే బంధువులంతా సంతోషపడుతున్నారు. – భవాని -
'గబ్బర్ సింగ్' విలన్ గ్యాంగ్ నటుడి కూతురి పెళ్లి (ఫొటోలు)
-
మోస్ట్ స్టైలీష్గా ఒకే ఫ్రేమ్లో తల్లి, కూతురు (ఫోటోలు)
-
మరణశయ్యపై తల్లి.. కూతురి దుర్మార్గంపై కోర్టు కన్నెర్ర
కన్నతల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ కూతురేమో దుర్మార్గంగా ఆలోచించింది. ఆస్తి కోసం బలవంతంగా ఆమెతో వీలునామాపై సంతకం చేయించుకుంది. అయితే సాక్ష్యంగా ఉంటుందని ఆ కూతురు తీయించుకున్న వీడియోనే.. ఈ బండారం మొత్తాన్ని బయట పెట్టింది. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది . యూకేలో ఓ వ్యక్తి మూడేళ్లపాటు చేసిన న్యాయ పోరాటం.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. సోదరుడిని మోసం చేసి ఆస్తి కొట్టేయాలని భావించిన ఓ మహిళకు పెద్ద షాకే తగిలింది. అతనికి 7 లక్షల పౌండ్ల విలువైన(మన కరెన్సీలో రూ.7 కోట్ల 86 లక్షల దాకా) విలువైన ఆస్తిపాస్తుల్లో సగం సోదరుడికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.కేసు ఇదే..మార్గరేట్ బేవర్స్టాక్(76) అనే మహిళ 2021 మార్చిలో కన్నుమూసింది. చనిపోయే టైంలో ఆమె తన ఆస్తి మొత్తం కూతురు లీసా పేరిట రాసింది. కొడుకు జాన్కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న తన తల్లి.. సోదరికి మాత్రమే ఆస్తి ఎలా రాయగలిగిందని అతనికి అనుమానం వచ్చింది. ఆస్తిలో వాటా కోరుతూ.. సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశాడు.తన తల్లి 2014 నుంచే మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని, ఆ వీలునామాపై అనుమానాలు ఉన్నాయని వాదించాడతను. అయితే తల్లి తన పేరిట రాసిన వీలుకు సంబంధించిన వీడియోను లీసా కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జేన్ ఇవాన్స్.. లీసాను గద్దించారు. అది బలవంతంగా చేయించుకున్నదేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టంగా మాట్లాడుతోంది. పైగా పెన్నును ఆమెతో బలవంతంగా పెట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వీలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన కాపీలా ఉంది అని జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.జడ్జి కన్నెర్ర చేయడంతో లీసా నిజం ఒప్పుకుంది. అది ఆమె చనిపోతున్న సమయంలో తీసిందని తెలిపింది. తల్లికి ఉన్న ఆ జబ్బును ఆసరా చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. సాక్ష్యంగా ఉండాలని ఆ టైంలో వీడియో కూడా తీయించుకున్నట్లు తెలిపింది. దీంతో ఆస్తిలో సగం వాటా.. సోదరుడు జాన్కు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. జాన్కు అయిన కోర్టు ఖర్చులను కూడా లీసానే భరించాలని ఆదేశించింది. -
డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె!
గౌహతి: ఓ ఆటోడ్రైవర్ను మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హై సెక్యూరిటీ మధ్య డ్రైవర్ను మొకాళ్లపై కూర్చొబెట్టి మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొడుతున్న దృశ్యాల్ని స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అస్సాం రాజధాని గౌహతిలోని శివారు ప్రాంతమైన డిస్పూర్లోని రాష్ట్ర ప్రజాప్రతినిధులు నివాసం ఉండే ఎమ్మెల్యే హాస్టల్లో మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ప్రజోయితా కశ్యప్ ఆటోడ్రైవర్ను దుర్భాషలాడుతూ చితక బాదారు.A video of an incident allegedly involving former Assam CM Prafulla Kumar Mahanta's daughter, has gone viral on social media.The footage purportedly shows her thrashing the driver and making him hold his ear, leading to accusations of mental harassment. The incident reportedly… pic.twitter.com/ibx9EKoReV— India Today NE (@IndiaTodayNE) March 3, 2025ఈ ఘటన వెలుగులోకి ప్రజోయితా కశ్యప్ స్పందించారు. బాధితుడు తన ఇంట్లో సుదీర్ఘకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. తాగిన ప్రతీసారి నా గురించి చెడుగా మాట్లాడేవాడు. ఇది సరైన పద్దతి కాదని పలు మార్లు చెప్పా.ఈ విషయం అందరికి తెలుసు.ఈ రోజు మద్యం మత్తులో మా ఇంటి బాదాడు. అందుకే కొట్టా’నని తెలిపారు. అయితే, అసభ్యంగా ప్రవర్తించే డ్రైవర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారా? బాధితుడు ప్రభుత్వ డ్రైవరా? ప్రైవేట్ డ్రైవరా? అని ప్రశ్నిస్తే ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్ మహంత రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు
జల్గావ్: తన కుమార్తెను వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్నగర్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను అక్కడ కొందరు యువకులు వేధించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.“ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ యాత్ర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు యాత్రకు వెళ్లింది. కొందరు యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు నేను పోలీస్ స్టేషన్కు వెళ్లాను' అని మీడియాకు కేంద్ర మంత్రి ఖడ్సే చెప్పారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే నా కుమార్తె ఈ విషయం చెప్పింది. కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ కేంద్ర మంత్రి ఖడ్సే వ్యాఖ్యానించారు.రక్షా ఖడ్సే మామ ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వారు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో నేరస్థులకు పోలీసులంటే భయమే లేదు. రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారు. వేరే మార్గం లేకనే ఫిర్యాదు చేశాం’’ అని ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు.పోలీస్ స్టేషన్కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారని.. అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలంటూ పోలీసులు మాకు సలహా ఇచ్చారు. వేధింపులకు పాల్పడ యువకులకు రాజకీయ నాయకుల అండ ఉంది. డీఎస్పీ, ఐజీతో కూడా చెప్పాను’’ అని ఖడ్సే తెలిపారు. -
మీడియా చానెల్స్ కి నారాయణ స్వామి కూతురు వార్నింగ్
-
40 ఏళ్ల తరువాత తల్లిని చేరిన కూతురు
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా! ఈ అంతులేని సంతోషానికి ఇటీవల వేదికయ్యింది చిలీలోని శాన్ ఆంటోనియో. వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్లకిందట.. శాన్ అంటోనియాకు చెందిన 24 ఏళ్ల ఎడిటా బిజామాకు అప్పటికే ఇద్దరమ్మాయిలు. మూడో సారి కుమార్తె పుట్టింది. పిల్లల్లో పేదరికాన్ని తగ్గించడానికి అప్పటి అగస్టో పినోచెట్ నాయకత్వంలోని సైనిక నియంతృత్వ ప్రభుత్వం అంతర్జాతీయ దత్తతలే మార్గమని భావించింది. అట్లా దాదాపు 20వేల మంది పిల్లలను బలవంతపు దత్తత ఇచ్చింది. బిడ్డ కడుపులో ఉండగా.. బిజామా సైతం దత్తతకు అంగీకరించింది. కానీ.. పాప పుట్టిన తరువాత పంపించడానికామె ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, స్థిరత్వం లేదు. పిల్లలను ఎలా పెంచుతావ్’అంటూ ప్రశ్నించిన ప్రభుత్వాధికారులు ఆమె ఐదు రోజుల కూతురిని తీసుకెళ్లిపోయారు. బిజామా కుటుంబంలోని చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. కానీ పేగు తెంచుకు పుట్టింది కదా.. బిజామా బిడ్డకోసం రోదిస్తూనే ఉంది. వెదకడానికి కనీసం పేరు తెలియదు. మార్గం కూడా లేదు. మరోవైపు.. ఆమె కూతురు అడామరీ గార్సియా ఫ్లోరిడాలో పెరిగింది. ఇప్పుడు ప్యూర్టో రికోలో నివసిస్తోంది. తనను దత్తత తీసుకున్నారని చిన్నతనం నుంచే తెలుసు. కానీ కన్న తల్లిదండ్రులను కలుసుకోవడమెలాగో తెలియదు. అలాంటి సమయంలో ఆమె ఫ్రెండ్ ఒకరు.. శిశువుగా దత్తతకు వచ్చి.. చిలీలోని తన సొంత కుటుంబాన్ని కలుసుకున్న టెక్సాస్ అగ్నిమాపక అధికారి టేలర్ గ్రాఫ్ గురించి చెప్పారు. అలాంటివారికోసం సాయం చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన ‘కనెక్టింగ్ రూట్స్’స్వచ్ఛంద సంస్థ గురించి వివరించారు. వెంటనే ఆ సంస్థను కలిసింది గార్సియా. కుటుంబం గురించి తెలుసుకోవడానికి గార్సియా తపన చూసి.. ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహమందించారు. సోదరి బర్త్ సరి్టఫికెట్ ద్వారా కుటుంబ వివరాలు తెలిసాయి. అయినా.. డీఎన్ఏ పరీక్షతో బిజామానే గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ నిర్ధారించింది. వెంటనే మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడుకున్నారు. గార్సియాది ప్యూర్టో రికన్ స్పానిష్, మయామీ యాస. కానీ తల్లి, అక్కలది విలక్షణమైన చిలీ యాస. మొదటిసారి సంభాషణ కష్టమే అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గతవారం కుటుంబం చెంతకు చేరుకుంది గార్సియా. 41 ఏళ్ల గార్సియాకు తల్లికి, ఇద్దరు అక్కలకు దగ్గరకు పోలికలున్నాయి. అంతేకాదు.. పెద్దక్కకు ఇష్టమున్నట్టే ఆమెకూ కుక్కలంటే చాలా ఇష్టం. ఇప్పుడు గార్సియా చిలీయాస, వంటకాలు, సంగీతం అన్నింటినీ నేర్చుకుంటోంది. అక్కలతో ఎక్కువకాలం గడపాలని నిర్ణయించుకుంది. కనెక్టింగ్ రూట్స్ ఈ ఏడాది చిలీకి తీసుకువచి్చన ఐదుగురు దత్తతదారుల్లో గార్సియా ఒకరు. ఇది ఆ ఎన్జీవో చేసిన నాలుగవ పునరేకీకరణ. ఎన్జీవో చర్యలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 40 ఏళ్ల కిందట దత్తతకు పోవడంతో ఇప్పుడు తల్లులు పెద్దవారవుతున్నారు. కొందరు చనిపోయారు. అందుకే ఆలస్యం కాకముందే సాధ్యమైనన్ని ఎక్కువ కుటుంబాలను తిరిగి కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టింగ్ రూట్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహం నేడు(ఆదివారం) ఎస్ఎస్ కన్వెన్షన్స్లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు.వైఎస్ జగన్కు మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వివాహ మండపం వద్దకు చేరుకున్న వైఎస్ జగన్.. వధూవరులు లక్ష్మీ చంద్రిక, తనికెళ్ల వేంకట సుబ్రహ్మణ్య సాయి కిరణ్లకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. -
‘అమ్మను నాన్నే...’’ గుండెలు పగిలే ఐదేళ్ల కుమార్తె మాటలు, డ్రాయింగ్స్
మహిళలు అనుభవించే గృహహింసకు, వేధింపులకు చాలావరకు చిన్నారులే మౌన సాక్షులుగా ఉంటారు. అమ్మను నాన్న నిరంతరం వేధిస్తూ, కొడుతుంటే.. బిక్కుబిక్కు మంటూ చూస్తారు. చూసీ, చూసీ కొంతమంది తిరగబడతారు. ‘ఖబడ్దార్.. అమ్మమీద చేయి వేస్తే..’ అంటూ అమ్మకు అండగా నిలబడతారు. అమ్మమీద దెబ్బ పడకుండా కాపాడు కుంటారు. అవసరమైతే నాలుగు దెబ్బలు కూడా తింటారు. ఈ విషయంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మరింత వేగంగా స్పందిస్తారు. కానీ చివరికి ఆ అమ్మ ఇక తనకు లేదని తెలిస్తే.. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోటి ఆశలతో కాపురానికి వచ్చిన కోడల్ని, బిడ్డ పుట్టిన తరువాత కూడా వేధింపులకు పాల్పడి, దారుణంగా హత్య చేసిందో కుటుంబం. కానీ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ ఐదేళ్ల చిన్నారి సాహసంతో వారి పథకం పారలేదు. ఉత్తర్ ప్రదేశ్లోని ఝాన్సీ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివపరివార్ కాలనీలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలు ..యూపీలోని ఝాన్సీలో ఒక వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించింది. సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషమంగా ఉన్న స్థితిలో ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకుచ్చారు. చికిత్స పొందుతూ మరణించింది. తమ కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ఐదేళ్ల కుమార్తె తన తండ్రి తన తల్లిని ఎలా చంపాడో వివరిస్తూ ఫోటో గీసి మరీ వివరించింది. ఒక బొమ్మను గీస్తూ తన తండ్రి తన తల్లిని బాగా కొట్టాడని వివరించింది. ఇంకో బొమ్మలొ నానమ్మ తన తల్లిని మెట్లపై నుండి తోసేసిందనీ, తండ్రి గొంతు నులిమినట్టు ఆమె తెలిపింది. ఇది చూసి పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పలువురి గుండెల్ని పిండేస్తున్న ఈ మాటలు వైరలవుతున్నాయి. కంటతడిపెట్టించే చిన్నారి మాటలు ‘నాన్నే అమ్మను తీవ్రంగా కొట్టాడు..ఆ తర్వాత ఉరేశాడు. ఇదేంటి అని అడిగినందుకు కావాలంటే నువ్వు చచ్చిపో అన్నాడు’ అని మీడియాకు చిన్నారి దర్శిత చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అనేకసార్లు తన తల్లిని చంపేస్తానంటూ నాన్న బెదిరించాడని తెలిపింది. అంతేకాదు ఇంకోసారి మా అమ్మను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని తాను ఒకసారి నాన్నను ఎదిరిస్తే.. మీ అమ్మ చచ్చాక నీకూ అదే గతి పడుతుంది అంటూ.. తనను కూడా కొట్టేవాడు అంటూ దీనంగా చిన్నారి చెప్పిన వైనం అందర్నీ కలచి వేసింది.భారీ కట్నం, అమ్మాయి పుట్టిందని మరింత వేధింపులుదీంతో తికామ్గఢ్ జిల్లాకు చెందిన మృతురాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు తన కుమార్తెను బాగా వేధించేవారని ఆరోపించారు. తన కుమార్తె సోనాలిని మెడికల్ రిప్రజంటేటివ్గా పని చేస్తున్న సందీప్తో వివాహం చేశారు. 2019లో వివాహం చేసుకున్నప్పటి నుండి అత్తమామలు కట్నం కోసం నిరంతరం మానసికంగా శారీరకంగా హింసకు గురిచేశారని వాపోయారు. రూ. 20 లక్షల కట్నం ఇచ్చినప్పటికీ, ఆమెను తీవ్రంగా వేధించేవారంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది, అతగాడికి మగపిల్లవాడు కావాలట, అందుకే ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల్ని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిల్లు తానే కట్టి ఇంటికి తీసుకెళ్లానని, ఒక నెల తర్వాత అల్లుడు వచ్చాడని చెప్పారు. దీనిపై సోనాలి భర్త సందీప్ బుధోలియాపై గతంలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది, కానీ ఆ తరువాత బాగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో అప్పట్లో రాజీ కుదిరింది.సర్కిల్ ఆఫీసర్ (CO) సిటీ రాంబీర్ సింగ్ ప్రకారం, సందీప్, అతని తల్లి వినీత, అతని అన్నయ్య కృష్ణ కుమార్, అతని వదిన మనీషా మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భర్త సందీప్ను అదుపులోకి తీసుకున్నారు. -
యాదమ్మరాజు కూతురి ఊయల ఫంక్షన్.. స్టెల్లా భావోద్వేగం (ఫోటోలు)
-
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఐశ్వర్య రజినీకాంత్ (ఫోటోలు)
-
సంగారెడ్డిలో దారుణం.. కూతురితో చనువుగా ఉంటున్నాడని..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో చనువుగా ఉంటున్నాడని యువకుడిని తండ్రి హత్య చేశాడు. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న తన కూతురితో చనువుగా ఉండటంతో దశరథ్(26)పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడిని హత్య చేసి నిజాంపేట మండల శివారు అటవీప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతదేహం కోసం దశరథ్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దశరథ్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
సారా టెండుల్కర్ స్టన్నింగ్ లుక్స్.. అదిరిపోయిన ఫొటోలు
-
కూతురి పెళ్లి... పెరుమాళ్ కోసం...!
అది తమిళనాడు రాష్ట్రం, రామేశ్వరం దగ్గరున్న ఓ చిన్న పల్లెటూరు. అక్కడ పెయింటింగ్ ని జీవనోపాధిగా చేసుకుని జీవించే ఓ పెయింటర్ ఉండేవాడు. అతడికి పెళ్ళి కావాల్సిన కూతురు ఉండేది. బి.ఏ., డిగ్రీ మాత్రమే చదివిన ఆ అమ్మాయి అందం కూడా అంతంత మాత్రమే. అయినా పెద్ద మొత్తాల్లో జీతం తీస్తున్న ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెళ్ళి చేసుకుంటామని ముందుకు వచ్చారు. పెళ్ళి కూతురు, ఆమె తల్లి వచ్చిన సంబంధాల పట్ల ఆసక్తి ప్రదర్శించినా పెయింటర్ ఒప్పుకోలేదు. ‘‘వయసైతోంది, మీరు బిడ్డకి పెళ్ళి చేయాలని ఉన్నారా, లేదా?’’ అని భర్తని గట్టిగా అడిగింది పెయింటర్ భార్య. అతడు నవ్వి ఊరకున్నాడు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పంపించేస్తున్నాడన్న విషయం తెలిసి బంధువులు అతడిని తిట్టిపోశారు. అయినా అతడు పట్టించుకోలేదు. చివరికి మిత్రుల ద్వారా తిరుపతి నుంచి ఓ సంబంధం వచ్చింది. పెళ్ళికుమారుడు చిన్న వ్యాపారి. ఆదాయం అంతంత మాత్రమే. అయినా దానికి వెంటనే అంగీకరించాడు పెయింటర్. ఆశ్చర్యపోయారు పెయింటర్ కుటుంబ సభ్యులు.‘ఇక్కడ పెళ్ళికుమారులు దొరక్కనా, పది గంటలకు పైగా ప్రయాణ దూరమున్న తిరుపతి సంబంధం చేసుకుంటున్నాడు’ అని బంధువులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెయింటర్ ఎవ్వరి మాటలకీ స్పందించ లేదు. పెళ్ళి పనుల్లో పడ్డాడు. పెళ్ళి కూడా తిరుపతిలోనే పెట్టుకున్నారు. పెళ్ళిరోజు రానే వచ్చింది. అమ్మగారి ఇంటినుంచి వెళ్ళిపోతున్నామనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ పెళ్ళికూతురు తండ్రిని ఇలా అడిగింది.‘‘నాన్నా... మన రామేశ్వరం పక్కనే ఎన్నో మంచిమంచి సంబంధాలు వచ్చాయి. వాటికి నువ్వు ఒప్పుకోలేదు. రాష్ట్రం కాని రాష్ట్రం. పరిచయం లేని ప్రాంతం, దూరాభారం. తెలియని భాష. అయినా ఈ కొత్త సంబంధానికి సుముఖత చూపావు, కారణమేమి?’’ అని. ఎదురుగా కనిపిస్తున్న శేషాచలం కొండల్ని చూపిస్తూ ఇలా చెప్పాడు అతడు– ‘‘ఏడాదికి ఒక్కసారైనా, పెరుమాళ్ ని చూడాలని ఉంటుంది నాకు. అయితే... నోట్లోకి నాలుగేళ్ళు పోయే సంపాదన నాది. ఆ సంపాన కోసమే నా సమయమంతా సరిపోయేది. ఉన్న ఊరు వదిలేదానికి కుదిరేది కాదు. స్వామి వారి దర్శనభాగ్యం వాయిదాలు పడేది. కూతురైన నువ్వు తిరుపతిలో ఉంటే నిన్ను చూడాలని అనిపించినప్పుడల్లా తిరుపతి వస్తాము. అలాగైనా అపుడప్పుడూ స్వామి దర్శన భాగ్యం చేసుకోవచ్చని నా ఆశ. అందుకే ఈ సంబంధం ఒప్పుకున్నాను’’అని. తండ్రికి స్వామివారి పట్ల ఉన్న భక్తికి ఆశ్చర్యపోయింది పెళ్ళికూతురు. అక్కడే ఉన్న బంధుమిత్రులందరూ శేషాచలం కొండల వైపు తిరిగి గోవిందలు పలికారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
మోహన్ బాబు యూనివర్సిటీని సందర్శించిన రజినీకాంత్, ఐశ్వర్య (ఫోటోలు)
-
సోదరుడి పెళ్లిలో ప్రియాంక చోప్రా.. కూతురిని ఎలా రెడీ చేసిందో చూశారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబయిలో బిజీబిజీగా ఉంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చేసింది. తాజాగా జరిగిన హల్దీ వేడుకలో ప్రియాంక డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అంతే తన ముద్దుల కూతురితో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. మామయ్య వివాహా వేడుకల్లో మాల్టీ మేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన లెహంగా ధరించి మెహందీ వేడుకలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్స్టాలో షేర్ చేసింది.కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి కోసమని ముంబయికి వెళ్లిపోయింది. సిద్దార్థ్ చోప్రా పెళ్లి కోసం ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ కూడా ఇవాళ ఇండియా చేరుకున్నారు. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టి మేరీతో కలిసి మెహందీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాహా కోసం ప్రియాంక అత్తమామలు డెనిస్ జోనాస్, కెవిన్ జోనాస్ కూడా భారతదేశానికి వచ్చేశారు. ఈ పెళ్లి వేడుకల్లో ప్రియాంక కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు. కాగా.. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నటి నీలం ఉపాధ్యాయను శుక్రవారం వివాహం చేసుకోబోతున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
ఘట్కేసర్ (మల్కాజ్గిరి జిల్లా) : కూతురును ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని ఓ తల్లి ఆడిన డ్రామాను ఘట్కేసర్ పోలీసులు ఛేదించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి (60) కూతురు ఆర్థిక సమస్యల్లో ఉంది. కూతురు పడుతున్న కష్టాలను గమనించిన తల్లి.. ఏదైనా సాయం చేయాలనుకుంది. తన దగ్గర డబ్బు లేకపోవడంతో పుస్తెల తాడు విక్రయించాలనుకుంది. బంగారం అమ్మితే కుమారుడికి తెలుస్తుందని భయపడి మిన్నకుండిపోయింది. ఎలాగైనా కూతురికి సాయం చేయాలని చైన్ స్నాచింగ్ డ్రామాకు తెరలేపింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకొని తన మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని ఏడ్వసాగింది. దీంతో పలువురు స్థానికులు అక్కడ గుమికూడారు. ఈ క్రమంలో వృద్ధురాలు డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు పోలీస్ సిబ్బందితో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వృద్ధురాలు పొంతన లేని సమాధానాలు చెప్పింది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగుల ఆచూకీ లభించలేదు. దీంతో వృద్ధురాలిని గట్టిగా నిలదీయడంతో.. కూతురిని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని డ్రామా ఆడినట్లు తెలిపింది. కూతురి ఆర్థిక సమస్యలు తీర్చాలని పోలీసులను తప్పుదోవ పట్టించిన వృద్ధురాలిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అత్యవసర సమయాల్లో వినియోగించే డయల్ 100ను దుర్వానియోగపర్చవద్దని పోలీసులు సూచించారు. -
ముద్దుల కూతురు నామకరణం వేడుక.. ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ (ఫోటోలు)
-
ఒకే ఒక్క మాటతో 94 నుంచి 71 కిలోలకు : ఏం చేసిందో తెలిస్తే ఫిదానే!
బరువు తగ్గే క్రమంలో ఒక్కొక్కరి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ వెయిట్ లాస్ జర్నీలో కేవలం స్లిమ్గా కనిపించడం కోసం మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్ష కూడ ఉంటుంది. అలాగఎలాగైనా బరువు తగ్గాలనే లక్ష్యంతో పట్టుదలగా, అంకితభావంతో వారు చేసే కృషి చాలా ప్రేరణగా ఉంటుంది. అలా తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతోపాటు, కుమార్తెకు రోల్ మోడల్గా ఉండేందుకు ఒక తల్లి చేసిన ప్రయత్నం, ఆమె సాధించిన విజయం తెలుసుకుంటే మీరు ఫిదా అవుతారు.ఐటీ ప్రొఫెషనల్, ఐదేళ్ల కుమార్తెకు తల్లి శుభశ్రీ రౌతరాయ్ పట్టుబట్టి 20 కిలోలకు పైగా బరువు తగ్గింది. ఆత్మవిశ్వాసం ,శక్తిని తిరిగి పొందింది. అయితే ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏమంటే.. చాలా అమాయకంగా, మామూలుగా కూతురు అన్న మాట తల్లిలో ఆలోచన రగిలించింది. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ, “అమ్మా, నేను పెద్దయ్యాక నువ్వు నా అక్కలా కనిపించాలి కాబట్టి మనం ఒకరి డ్రెస్లు వేసుకోవచ్చు.” అని ఆశగా చెప్పింది ఆమె కూతురు. ఈ మాటే ఆమెకు మేల్కొలుపులా పనిచేసింది. తన రూపాన్ని చూసుకుంది.. ఇంత చిన్న వయసులో ఆరోగ్యం కూడా గాడి తప్పినట్టు అర్థం చేసుకుంది. ఇంట్లో వండిన భోజనం, నడక, ఇంటి వ్యాయామాలుతో తన శరీర బరువును తగ్గించుకుంది. 2023, డిసెంబరులో శుభశ్రీ బరువు 94 కిలోలకు పైమాటే. ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటూ కుమార్తెకు రోల్ మోడల్గా, తనను తాను ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని భావించింది. ఇందుకోసం ఆరంభంలో జిమ్లో తెగ కసరత్తులు చేసింది. క్రాష్ డైట్ ఫాలో అయింది. అయినా ఫలితం లేదు. ఇక లాభం లేదనుకుని వేరే మార్గాన్ని ఎంచుకోవాలని గత ఏడాది జనవరిలో భావించింది. ఇంట్లో వండిన ఆహారం, క్రమం తపక్పకుండా, నిబద్ధతతో 30 నిమిషాల నడక , మరో 15 నిమిషాల ఇంట్లో వ్యాయామాలను ఎంచుకుంది. View this post on Instagram A post shared by 🅢🅤🅑🅗🅐🅢🅗🅡🅔🅔 (@subhashreefantasyworld)ఆమె పాటించిన కీలకమైన పద్దతులుగతంలో వచ్చిన అనుభవంతో జిమ్ జోలికిపోలేదుచిన్న మార్పులపై దృష్టి పెట్టింది.సమతుల్య, ఇంట్లో వండిన భోజనం, తక్కువ తినడం, తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్ప్రాసెస్ చేసిన ఆహారాలను మానేసింది.ప్రోటీన్ ,ఫైబర్ అధికంగా ఉండే భోజనాలకు ప్రాధాన్యత చక్కటి ఆహారం , చాలినంత నీళ్లుఇలా 2024 జూలై నాటికి కొద్దిగా బరువు తగ్గింది. ఆ తరువాత ఆమె జిమ్లో బలమైన వ్యాయమాలు చేసింది. దీంతో ఫలితాలు నెమ్మదిగా కనిపించినా, మూడు నెలల్లో అద్భుత విజయం సాధించింది. 94 కిలోల నుండి 71 కిలోలకు చేరింది. తన దుస్తులు XXXL నుండి లార్జ్/మీడియం (బ్రాండ్ను బట్టి)కి చేరడం ద్వారా తనకల నిజమైందని అంటుంది భావోద్వేగంతో శుభశ్రీ “ఇది కేవలం అందంగా కనిపించడం కోసం మాత్రమే కాదు. ఆరోగ్య సమస్యలను నివారించడం, కుటుంబానికి ఆదర్శంగా ఉండటం’’ అంటుంది శుభశ్రీ. ఈ ప్రయణంలో తాను కోల్పోయిన ప్రతి కిలో తనకు మరింత ఉత్సాహాన్నిచ్చింది అని చెబుతుంది. నిరాశ పడ కుండా పట్టుదలగా సాగడమే తన ఆయుధమని చెప్పింది. అంతేకాదు ఎత్తుకు తగిన బరువును సాధించాలనే ఆమె లక్ష్యం. ఈ జర్నీలో బరువు తగ్గడంతోపాటు, కండరాలను ఎముకలను బలోపేతం చేసుకోవడం దృష్టి పెట్టింది. తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా తనలాంటి స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో తన కథను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనలాగా ఆత్మవిశ్వాసంతో లక్ష్యాల వైపు తొలి అడుగు వేయాలని, తమ కలలను సాకారం చేసుకోవాలని సూచిస్తోంది. పెళ్లి, పిల్లలు తరువాత బరువు తగ్గడం కష్టం అని ఎంతమాత్రం అనుకోకండి.. కష్టపడితే సాధ్యమే అంటూ తనలాంటి తల్లులకు సలహా ఇస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ విందులో నీతా స్పెషల్ లుక్.. ఈ చీరకు 1900 గంటలు పట్టిందట! -
'ఆంటీ అన్నా ఫర్వాలేదు'.. స్టార్ కూతురితో మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి టాలీవుడ్ ప్రియులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో మొదలైట్టిన తమన్నా పలు సూపర్ హిట్ చిత్రాలో నటించింది. హ్యాపీ డేస్, అల్లు అర్జున్ బద్రీనాథ్, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, ఎఫ్2, రచ్చ లాంటి సినిమాలతో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. అయితే గతేడాది జైలర్, స్త్రీ-2 చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్లో మెరిసిన ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది.తాజాగా బాలీవుడ్లో ఓ థియేటర్ వద్ద మెరిసింది. రవీనా టాండన్ ముద్దుల కూతురు రషా తడానీ నటించిన తొలి చిత్రం ఆజాద్ చూసేందుకు తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి థియేటర్కు వచ్చింది. ఈ సందర్భంగా రషా తడానీ, తమన్నా మధ్య ఆసక్తకర సంభాషణ చోటు చేసుకుంది. తనను ఆంటీ అని పిలవచ్చని రషా తడానీతో సరదాగా మాట్లాడింది తమన్నా. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తమన్నా భాటియా- రషా తడానీ రిలేషన్..కాగా.. బాలీవుడ్ భామ రషా తడానీ (19), తమన్నా భాటియా (35) చాలా మంచి స్నేహితులు. గతంలో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తమన్నాను గురించి చెప్పమని రషాను అడిగినప్పుడు తాను నాకు మరో అమ్మలాంటి వ్యక్తి అని చెప్పింది. తమన్నా, విజయ్ వర్మ తనను దత్తత తీసుకున్నారంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. SHOCKINGLY #Tammana Says CALL ME AUNTY no issue #RashaTadani - Great Gesture From Tammu 😳😳😳😳😳pic.twitter.com/qJjC0iHLbh— GetsCinema (@GetsCinema) January 21, 2025 -
కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి.. పెళ్లి సమయంలో..
మగపిల్లలు లేని తల్లిదండ్రులు తమకున్న ఆడపిల్లలనే మగపిల్లలుగా భావిస్తూ పెంచుతుంటారు. ఈ క్రమంలో వారికి తగినంత స్వేచ్ఛనిస్తూ, సమస్తం సమకూరుస్తుంటారు. దీంతోవారు తమకు మగపిల్లలు లేరనే లోటును మరచిపోతుంటారు. ఇదిలా ఉంచితే నేటి కాలంలో ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వాకు చెందిన ఒక తండ్రి తన కుమార్తెలోనే కుమారుడిని చూసుకున్నాడు. సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు గుర్రపు స్వారీ చేయడాన్ని చూస్తుంటాం. కానీ ఖాండ్వాలో ఒక వధువు గుర్రపు స్వారీ చేసింది. దీనిని ఆమె తన తండ్రి కోరికను నెరవేర్చేందుకే చేసింది. ఖాండ్వాకు 8 కి.మీ. దూరంలో ఉన్న సుర్గావ్ జోషి గ్రామానికి చెందిన రైతు నానాజీ చౌదరి కుమార్తె వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.నానాజీ చౌదరి తన కుమార్తెను కొడుకులా భావించి పెంచిపెద్ద చేశాడు. ఇప్పుడు తన కుమార్తె పెళ్లిలోనూ తనకు కుమారుడు ఉన్న ముచ్చటను తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో తన కుమార్తెను గుర్రంపైకి ఎక్కించి, ఊరేగింపుగా వివాహ వేదికవద్దకు తీసుకువచ్చాడు. ఆమె వెనుక కుటుంబ సభ్యులు నృత్యాలు చేసుకుంటూ వచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. పెళ్లి కుమార్తె భాగ్యశ్రీ చౌదరి ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అజయ్ జిరాతిని వివాహం చేసుకున్నారు.ఈ సందర్భంగా వధువు బంధువు రవీంద్ర చౌదరి మాట్లాడుతూ భాగ్యశ్రీని ఆమె తండ్రి.. కుమారునిలా పెంచారని, పెళ్లిలో ఆమెను గుర్రంపైకి ఎక్కించాలని అనుకున్నారన్నారు. ఆయన కోరిన విధంగానే తామంతా గుర్రాన్ని తీసుకువచ్చి ఊరేగింపు వేడుక నిర్వహించామన్నారు. వధువు భాగ్యశ్రీ మాట్లాడుతూ తాను గుర్రంపై కూర్చుని ఊరేగింపుగా వివాహవేదిక వద్దకు చేరుకోవాలనేది తన తండ్రి కల అని, అది ఇప్పుడు నెరవేరిందన్నారు.ఇది కూడా చదవండి: ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం -
కూతురి ఫస్ట్ మూవీ.. ఏడ్చేసిన సుకుమార్ భార్య (ఫోటోలు)
-
పెళ్ళి ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?
ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది.కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నాఇంకేం కావాలి. ఇదీ చదవండి: గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!‘సీతారాముల్లా ఉండండి!‘ అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు! అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? ‘పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!‘ అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు. -
నాలుగు రోజుల్లో కూతురి పెళ్లి : అంతలోనే కన్నతండ్రి కర్కశం
అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. అనేక రకాల హింసలకు వ్యతిరేకంగా గొంతెత్తున్నారు. సమానత్వం కోసం అలుపెరుగని పోరు చేస్తూనే ఉన్నారు. అయినా చాలా విషయాల్లోనూ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆధిపత్య కత్తి మహిళలపై వేటు వేస్తూనే ఉంది. చెప్పిన మాట వినలేదన్న ఆగ్రహంతో పంచాయతీ పెద్దలు, పోలీసుల ఎదుటే కర్కశంగా కన్నబిడ్డనే కడతేర్చిన ఘటన కంట తడి పెట్టిస్తుంది.20 ఏళ్ల కుమార్తె ‘తను’ ను పోలీసు అధికారులు, కుల పెద్దల ముందే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడో తండ్రి. తాను కుదిర్చిన వివాహం నచ్చలేదని సోషల్ మీడియా ద్వారా చెప్పినందుకే ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దిగ్భ్రాంతికరమైన హత్య జరిగింది. మంగళవారం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. పెళ్లికి నాలుగు రోజుల ముందు కూతుర్ని నాటు తుపాకీతో కాల్చి చంపాడుతండ్రి మహేష్ గుర్జార్. బంధువు రాహుల్ మహేష్కు తోడుగా నిలిచి, బాధితురాలపై కాల్పులు జరిపాడు.పెద్దలు కుదర్చిన సంబంధాన్ని కాదని తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడమే ఆమె చేసిన నేరం. జనవరి 18న పెద్దలు కుదిర్చిన వివాహానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఇది ఇలా ఉంటే.. హత్యకు కొన్ని గంటల ముందు, తను ఒక వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిందిబాధితురాలు తను. తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకోవాలని బలవంతం చేసిందని ఆమె ఆరోపించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తనకేదైనా అయితే తన తండ్రి మహేష్, ఇతర కుటుంబ సభ్యులతే బాధ్యత అని కూడా పేర్కొంది. (డార్క్ గ్రీన్ గౌనులో స్టైలిష్గా,ఫ్యాషన్ క్వీన్లా శోభిత ధూళిపాళ)52 సెకన్ల వీడియోలో ఇంకా ఇలా చెప్పింది. "నేను నా ఫ్రెండ్ విక్కీని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబం మొదట్లో అంగీకరించింది కానీ తరువాత నిరాకరించింది. వారు నన్ను రోజూ కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది". అని తెలిపింది. దీంతో వీడియో వైరల్ అయింది. సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఇద్దిర మధ్యా రాజీ కుదిర్చేందుకు మాట్లాడుతున్నారు. కమ్యూనిటీ పంచాయితీ పెద్దలు కూడా అక్కడే ఉన్నారు.ఈ సమయంలో తను ఇంట్లో ఉండటానికి తను నిరాకరించింది, తనను వన్-స్టాప్ సెంటర్ ( హింసకు గురైన మహిళలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్)కు తీసుకెళ్లమని కోరింది. ఇంతలో ఆమె తండ్రి ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని పట్టుబట్టి, ఆమెను ఒప్పిస్తానని నమ్మబలికాడు. నాటు తుపాకీతో ఉన్న మహేష్, తన కుమార్తె ఛాతీపై కాల్చాడు. అదే సమయంలో, అక్కడే ఉన్న రాహుల్ కూడా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. (‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!)కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్ను అరెస్టు చేశారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ రాహుల్ పిస్టల్తో తప్పించుకున్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా తను ప్రేమిస్తున్న వ్యక్తి "విక్కీ" ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నివాసి, గత ఆరేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. -
నటుడు అంబటి అర్జున్ కూతురి ఫస్ట్ బర్త్డే (ఫోటోలు)
-
కూతురి పేరును రివీల్ చేసిన ప్రముఖ నటి.. అర్థం అదేనట!
ప్రముఖ బాలీవుడ్ నటి మసాబా గుప్తా (Masaba Gupta) గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2024 అక్టోబర్లో కుమార్తెకు(daughter) స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాజాగా తన ముద్దుల కూతురి పేరును రివీల్ చేసింది. మతారా అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించింది మసాబా. తన చేతికి ధరించిన గాజును కూతురి పేరు కనిపించేలా డిజైనా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.మసాబా తన ఇన్స్టాలో రాస్తూ..'నా ముద్దుల కూతురు మాతారకు అప్పుడే 3 నెలలు. తన పేరు 9 మంది హిందూ దేవతల స్త్రీ శక్తులను కలిగి ఉంది. తన కూతురికి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అంతేకాదు మా కళ్లకు నక్షత్రం లాంటిది." అంటూ పోస్ట్ చేసింది.2023లో పెళ్లి..కాగా.. మసాబా గుప్తా (Masaba Gupta), సత్యదీప్ మిశ్రా (Satyadeep Mishra) జనవరి 27, 2023న వివాహం చేసుకున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. అక్టోబర్ 10, 2024న కూతురికి జన్మనిచ్చింది.ఎవరీ మసాబా గుప్తా..?కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా అనే సిరీస్లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తనయ
మల్కాపురం: మృతి చెందిన కన్నతండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మల్కాపురంలో జరిగింది. గాంధీజివీధికి చెందిన చొప్పా సూరిబాబు (60) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటం, అల్లుళ్లు ముందుకు రాకపోవడంతో దుఃఖాన్ని దిగమింగుకొని కన్నకూతురే దహన సంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్టీసీ అద్దె బస్సుకు సూరిబాబు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. చిన్న బాస్ క్లాస్మేట్.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను -
కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సురేఖవాణి (ఫొటోలు)
-
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్, తండ్రి సంతోష్ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు -
అనురాగ్ కశ్యప్ కూతురి హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
నవిష్క బర్త్డే.. కూతురి కోసం కల్యాణ్ దేవ్ సర్ప్రైజ్(ఫోటోలు)
-
ఘనంగా ప్రముఖ నటుడు చిన్నా రెండో కూతురి పెళ్లి (ఫోటోలు)
-
మా అమ్మలా పెంచాలనుకుంటున్నాను: దీపికా పదుకోన్
‘‘మా అమ్మగారు నన్ను ఎలా పెంచారో నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలనుకుంటున్నాను’’ అంటున్నారు హీరోయిన్ దీపికా పదుకోన్. ప్రభాస్ హీరోగా నటించినపాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతరపాత్రలుపోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్గా ‘కల్కి 2’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.తొలి భాగం బ్లాక్బస్టర్ కావడంతో ద్వితీయ భాగంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ‘కల్కి 2’ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. 2025లో ఈ మూవీ సెట్స్పైకి వెళుతుందని టాక్. ‘కల్కి 2898 ఏడీ’తో టాలీవుడ్లో అడుగుపెట్టారు దీపికా పదుకొనే. ఈ మూవీలో ఆమె చేసిన సుమతిపాత్ర నిడివి తక్కువగా ఉందనే మాటలు వినిపించాయి. అయితే ‘కల్కి 2’లో ఆమెపాత్ర చాలా కీలకమని, ఆమె కూడా త్వరలోనే షూటింగ్లోపాల్గొంటారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఏర్పాటు చేసిన ఓ గెట్ టు గెదర్పార్టీలోపాల్గొన్న దీపికకి ‘కల్కి 2’ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆమె బదులిస్తూ..‘‘నేను కూడా ‘కల్కి 2’ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు నా తొలి ప్రాధాన్యం నా కుమార్తె దువా. నా కూతురు పెంపకం కోసం కేర్ టేకర్ని నియమించుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మా అమ్మగారు ఎలా అయితే పెంచారో.. నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలని, తన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే... హీరో రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్లకు 2018 నవంబరు 14న వివాహం కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వారికి కుమార్తె (దువా) జన్మించిన సంగతి తెలిసిందే. -
నిహారిక బర్త్డే సెలబ్రేషన్స్ .. దగ్గరుండి కేక్ కట్ చేయించిన అన్నావదిన (ఫోటోలు)
-
YSRCP నేత తెర్నేకల్ సురేందర్ రెడ్డి కూతురి వివాహ రిసెప్షన్లో YS జగన్
-
వైభవంగా జరిగిన నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం - హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తెచ్చిన రవితేజ!?
తెలుగు హీరోలు చాలామంది తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేస్తారు గానీ కూతుళ్లని హీరోయిన్లని చేయడానికి ఇష్టపడరు. మిగతా విభాగాల్లో పనిచేసే విషయమై కూడా పెద్దగా ప్రోత్సహించారు. కానీ రవితేజ మాత్రం అలా కాదని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఇతడి కూతురు దర్శకత్వం నేర్చుకుంటోందట.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు కూడా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తోందట.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తీస్తున్న ఓ సినిమాకు రవితేజ కూతురు మోక్షద.. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుందట. గతంలో రవితేజ కూడా ఇలానే సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత నటుడు అయ్యాడు. బహుశా మోక్షద కూడా ఇలా మొదట దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని, నటి అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ') -
అనురాగ్ కశ్యప్ కూతురి సంగీత్ వేడుక..ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
రూ.508 కోట్లకు బంగ్లా అమ్మేసిన ఇషా అంబానీ - సొంతం చేసుకున్న హాలీవుడ్ జంట (ఫోటోలు)
-
సారా టెండుల్కర్కు కొత్త బాధ్యతలు.. సచిన్ ట్వీట్ వైరల్ (ఫొటోలు)
-
పేరు మార్చుకుని పుతిన్ కూతురు రహస్య జీవనం.. ఎక్కడ ఉన్నారంటే?
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న నాటి నుంచి వ్లాదిమిన్ పుతిన్ ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే సమయంలో పుతిన్.. కుటుంబ సభ్యు గురించి కూడా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక, తాజాగా పుతిన్ రహస్య కుమార్తె తన పేరు మార్చుకుని పారిస్ లో ఉంటున్నారని సమాచారం. ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి మరో విషయం బయటకు వచ్చింది. పుతిన్, సెత్వాన్ క్రివోనోగిఖ్ కుమార్తె ఎలిజావేటా క్రివోనోగిఖ్ పేరు బయటకు వచ్చింది. ఎలిజావేటా ప్రస్తుతం తన పేరు మార్చుకుని లాయిజా రోజోవా అనే పేరుతో పారిస్ లో ఉంటున్నారని ఉక్రెయిన్ కు సంబంధించిన మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రోజోవా రహస్యంగా పారిస్ లో ఉంటున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. వ్యాపారవేత్త అయిన సెత్వాన్ క్రివోనోగిఖ్(49) పుతిన్ భాగస్వామిగా ఉన్నారని మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి. ఇక, అంతకుముందు కూడా పుతిన్ మరో కూతురు కేథరిన్ టిఖోనోవా గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. కేథరినా ఒక డ్యాన్సర్(జిమ్నాస్టిక్). ఆమె రష్యాకు చెందిన బిలియనీర్ ను వివాహం చేసుకుంది. వారిద్దరూ 2017లో విడిపోయారు.🚨 Vladimir Putin has an illegitimate daughter living under a pseudonym in Paris where she works as a DJ: pic.twitter.com/twtwfxWqyM— Emmanuel Rincón (@EmmaRincon) November 29, 2024 -
యూట్యూబర్గా సక్సెస్ అయ్యి..ఏకంగా బాలీవుడ్ మూవీ..!
పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘అరోవిల్’నురహస్య నగరం అంటారు. కులం, మతం, డబ్బు లేకుండా కొంతమంది జీవించే ఇక్కడి నుంచే పెరిగి పెద్దదయ్యింది అహిల్య బామ్రూ. వ్యంగ్య వీడియోలు చేసే యూట్యూబర్గా ఈమె చేసిన ‘ప్రయోగం’ సక్సెస్ అయ్యి బాలీవుడ్ దాకా చేర్చింది. ఇటీవల విడుదలయ్యి ప్రశంసలు పొందుతున్న‘ఐ వాంట్ టు టాక్’లో అభిషేక్ బచ్చన్ కుమార్తెగా నటించింది. ‘అరోవిల్’లో నాకు దొరికిన స్వేచ్ఛ నన్ను తీర్చిదిద్దింది అంటున్న అహిల్య జీవితం ఆసక్తికరం.‘నేను ముంబైలో పెరిగి ఉంటే ఇలా ఉండేదాన్ని కానేమో. ఆరోవిల్లో పెరగడం వల్ల నేను ఒక భిన్నమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగాను’ అంటుంది అహిల్యా అమ్రూ. అహిల్యా గురించి చె΄్పాలంటే ఒక విజిటింగ్ కార్డు ఆ అమ్మాయికి చాలదు. ఆ అమ్మాయి గాయని, చిత్రకారిణి, డాన్సర్, నటి, వాయిస్ఓవర్ ఆర్టిస్ట్, డిజిటల్ క్రియేటర్...‘ఇవన్నీ నేను ఆరోవిల్లో ఉచితంగా నేర్చుకున్నాను. ఉచితంగా నేర్పించేవారు అక్కడ ఉన్నారు. బయట ఇది ఏ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతిదానికీ డబ్బు కావాలి’ అంటుంది అహిల్య.ఇంతకీ ఆరోవిల్ అంటే? అదొక రహస్య నగరి. ఆధ్యాత్మిక కేంద్రం. లేదా భిన్న జీవన స్థావరం. ఇది పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ 42 దేశాలకు చెందిన 3000 మంది పౌరులు జీవిస్తున్నారు. వారి పని? డబ్బు ప్రస్తావన లేకుండా జీవించడం. పండించుకోవడం, తినడం, పుస్తకాలు చదువుకోవడం, తమకు వచ్చింది మరొకరికి నేర్పించడం, మెడిటేషన్. వీరు చేసేవాటిని ‘గ్రీన్ ప్రాక్టిసెస్’. అంటే పృథ్వికీ, పర్యావరణానికీ ద్రోహం చేయనివి. అక్కడే అహిల్య పెరిగింది.స్వేచ్ఛ ఉంటుంది‘మాది ముంబై. నేను అక్కడే పుట్టా. ఆ తర్వాత మా అమ్మానాన్నలు పాండిచ్చేరి వచ్చారు. అక్కడ నేను ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆరోవిల్కు మారాము. అక్కడ విశేషం ఏమిటంటే చదువులో, జీవితంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది.ఏది ఇష్టమో అది నేర్చుకుంటూపోవచ్చు. విసుగు పుడితే మానేయవచ్చు. బయట ప్రపంచానికి సంబంధం లేని పోటీతో జీవన శైలితో ఉండవచ్చు. ఇది అందరికీ సెట్ అవదు. కాని నాకు సెట్ అయ్యింది. నేను ఇక్కడ ఎన్నెన్ని నేర్చుకున్నానో చెప్పలేను. ఇక్కడ పెరగడం వల్ల నాకు ఆధ్యాత్మిక భావన అంటే ఏమిటో తెలిసింది. ప్రకృతితో ముడిపడి ఉండటం అంటే ఏమిటో తెలిసింది. భిన్న సంస్కృతులు, జీవితాలు తెలిశాయి. ఆరోవిల్ లక్ష్యం విశ్వమానవులను ఏకం చేయడం. ఇది చిన్న లక్ష్యం కాదు. మనుషులందరూ ఒకటే అని చాటాలి. బయట ఉన్న రొడ్డకొట్టుడు జీవితంతో, ΄ోటీతో విసుగుపుట్టి ఎందరో ఇక్కడకొచ్చి ఏదైనా కొత్తది చేద్దాం అని జీవిస్తున్నారు. ఆరోవిల్ మీద విమర్శలు ఉన్నాయి. ఉండదగ్గవే. కాని ఇది ప్రతిపాదిస్తున్న జీవనశైలి నచ్చేవారికి నచ్చుతుంది’ అంటుంది అహిల్య.రీల్స్తో మొదలుపెట్టి...వ్యంగ్యం, హాస్యం ఇష్టం అ«ధికంగా ఉన్న అహిల్య సరదాగా రీల్స్తో మొదలుపెట్టి డిజిటల్ క్రియేటర్గా మారింది. మన దేశానికి వచ్చిన విదేశీయులు ఆవును చూసి, గేదెను చూసి ఎంత ఆశ్చర్యపోతుంటారో అహిల్య చాలా సరదాగా చేసి చూపిస్తుంది. అందరి యాక్సెంట్, బాడి లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తూ ఆమె చేసే వీడియోలకు ఫ్యాన్స్ కొల్ల. అందుకే అభిషేక్ బచ్చన్ ముఖ్యపాత్రలో నవంబర్ 22న విడుదలైన ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాలో మొదటిసారిగా బాలీవుడ్ నటిగా మొదటి అడుగు వేయగలిగింది అహిల్య. ఈ సినిమాలో కేన్సర్ పేషంట్ అయిన సింగిల్ పేరెంట్ అభిషేక్ తన కూతురితో అంత సజావుగా లేని అనుబంధాన్ని సరి చేసుకోవడానికి పడే కష్టం, కూతురుగా అహిల్య పడే తాపత్రయం అందరి ప్రశంసలు పొదేలా చేశాయి. (చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!) -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
ఐశ్వర్యారాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య బర్త్ డే స్పెషల్.. అరుదైన ఫోటోలు
-
ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -16 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోలో ఆయన కుమారుడ్ అభిషేక్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన రాబోయే చిత్రం ఐ వాంట్ టూ టాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దర్శకుడు సుజిత్ సిర్కార్, రచయిత అర్జున్ సేన్ ఈ ఎపిసోడ్లో భాగమయ్యారు.ఈ సందర్భంగా అభిషేక్ తన మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుజిత్ ఐ వాంట్ టు టాక్ పూర్తి కథను చెప్పలేదని.. అర్జున్ జీవితం, అతని ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారని.. అదే తనకు నచ్చిందని తెలిపారు. ఈ కథలో కేవలం వంద రోజులు మాత్రమే తండ్రి బతుకుతాడని తెలిసిన ఆయన కూతురు ఏంటీ చచ్చిపోతున్నావా? నా పెళ్ళిలో డాన్స్ చేస్తావా? అని అమాయకంగా అడుగుతుంది. ఆ బాధను దిగమింది తాను చనిపోనని.. పెళ్లిలో నృత్యం చేస్తానని తన కూతురికి మాట ఇస్తాడు తండ్రి.. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యం.. ఈ స్టోరీనే ఐ వాంట్ టూ టాక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఒక తండ్రిగా కుమార్తెతో ఉండే ప్రేమ, అను బంధాన్ని అభిషేక్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ఈ కథ నిజంగా నా హృదయాన్ని తాకిందని.. తండ్రి మాత్రమే కుమార్తె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని అభిషేక్ అన్నారు. ఆరాధ్య నా కుమార్తె, షూజిత్కు ఇద్దరు కుమార్తెలు.. మేమంతా 'గర్ల్ డాడ్స్'.. అందుకే ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నామని తెలిపారు. అర్జున్ తన కూతురికి చేసిన వాగ్దానం కోసం ఆ తండ్రి చేసే పోరాటం గొప్పదన్నారు. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కథను విని అభిషేక్ ఎమోషనలయ్యారు. -
బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ బర్త్ డే.. స్పెషల్ పిక్స్ (ఫోటోలు)
-
కూతురితో ప్రియాంక విహారం.. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో అలా!
-
కూతురు బర్త్ డే.. తెగ మురిసిపోతున్నహీరోయిన్ (ఫొటోలు)
-
పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో అంతగా సినిమాలు చేయడం లేదు శ్రియ. ఒకట్రెండు సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో తన కుమార్తె రాధతో కలిసి సమయాన్ని గడుపుతున్నారు. కూతురికి ఆట పాటలు నేర్పడంతో పాటు ఇంకా బోలెడన్ని విషయాలు నేర్పుతున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాధను ఆమె పొలానికి తీసుకెళ్లి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. పంట నూర్పిళ్ల విధానాన్ని తన కూతురుకి తెలియజేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పొలాలంటే ఏంటో నేటితరానికి పెద్దగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో శ్రియ తన కుమార్తెను ఇలా పొలానికి తీసుకెళ్లడం, నూర్పిళ్లు ఎలా చేస్తారో తానే స్వయంగా చేసి చూపంచడం హాట్టాపిక్గా మారింది.సెల్ఫోన్లతో పిల్లలు బిజీగా ఉంటున్న ఈ కాలంలో శ్రియ ఇలా చేయడం అభినందనీయమని పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే.. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య 44’(వర్కింగ్ టైటిల్) సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
అమెరికా నుంచి వెళ్లిపోతా.. ఎలన్ మస్క్ కుమార్తె
వాషింగ్టన్: అమెరికాలో భవిష్యత్ కనిపించడం లేదని, దేశాన్ని వీడి వెళ్తానని ఎలన్ మస్క్ ట్రాన్స్జెండర్ కుమార్తె వివియన్ విల్సన్ ప్రకటించారు. 2022 నుంచి తండ్రికి దూరంగా ఉంటున్న వివియన్.. ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత మెటా థ్రెడ్స్లో తన ఆలోచనలను పంచుకున్నారు. ‘‘నేను కొంతకాలంగా ఈ విషయం మీద ఆలోచిస్తున్నా. నిన్నటిరోజును చూశాక నిర్ణయం తీసుకున్నాను. నేను అమెరికాలో ఉండేలా భవిష్యత్ కనిపించడం లేదు’’అని రాసుకొచ్చారు. దీనిపై మస్క్ స్పందించారు. ‘‘మైండ్ వైరస్ నా కొడుకును చంపేసింది’’అని మరోసారి ట్వీట్ చేశారు. నేను అలసిపోయాను.. మళ్లీ.. తన తండ్రి పోస్ట్ స్క్రీన్ షాట్ను థ్రెడ్స్లో షేర్ చేస్తూ.. ‘‘మీరు ఇప్పటికీ నా బిడ్డ ఏదో ఒక వ్యాధి బారిన పడ్డారంటున్నారు. మీరు నన్ను ద్వేషించడానికి పూర్తిగా కారణం అదే. దయచేసి దాని జోలికి పోవద్దు. ప్రతి సన్నివేశంలో నేను బాధితురాలిని తప్ప మరేమి కాదు. నేను అలసిపోయాను. నాకు విసుగ్గా ఉంది’’అని ఆమె జత చేశారు. ఆ తరువాత మరోపోస్ట్లో... ఒకరిపై అధికారం కోల్పోయాననే తన తండ్రి అలా పిచి్చగా మాట్లాడుతున్నారని వివియన్ పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగా పరిణితి చెందని మీరు భ్రమలో ఉన్నారు, ఒకరి మీద నియంత్రణ కోల్పోయాననే కలతతో ఉన్నారు. మీరెలాంటివారో మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికీ తెలుసు. అది నా సమస్య కాదు’’అని ఆమె తెలిపారు. -
'ఇటు రావే నా గాజు బొమ్మ'.. ఆ పాటతో తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక!
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలుస వీడియోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన మరో వీడియోను అలేఖ్య తన ఇన్స్టాలో షేర్ చేశారు. 'ఇటు రావే నా గాజు బొమ్మ' అనే సాంగ్ను ఈ వీడియోకు జతచేశారు. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలోని ఈ పాట తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమను తెలిపేలా ఉంది. తన కూతురి కోసం ఒక తండ్రి పడే తపనను ఈ ఒక్క పాటలో చూపించారు. తన ముద్దుల కూతురిని తలచుకుని అలేఖ్య ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కుమార్తెను ముద్దాడింది.తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుకకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.తారకరత్న జర్నీకాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది
‘ఆలియా భట్ నటి మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా’... ఈ వాక్యానికి కొనసాగింపుగా ‘చక్కని స్టోరీ టెల్లర్’ అనే ప్రశంసను కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆలియా ప్రతి రాత్రి తన కూతురు రాహాకు ఏదో ఒక పిల్లల పుస్తకం చదివి వినిపిస్తుంది. రాహా ‘ఆహా’ అంటూ వింటుంది.‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు చదవడం అనేది వారి భవిష్యత్కు పెట్టుబడి పెట్టడంలాంటిది’ అంటుది ఆలియాభట్. ‘ఎడ్–ఏ–మమ్మా’ అనే చిల్డ్రన్ బ్రాండ్ (ప్లేవేర్, స్టోరీ బుక్స్, టాయ్స్ అండ్ మోర్) వోనర్ అయినా ఆలియా తన బ్రాండ్లో కొత్త చిల్డ్రన్ బుక్ సిరీస్ను లాంచ్ చేసింది. ‘పిల్లల కోసం తల్లులు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించడం అనేది మంచి విధానం’ అంటున్నారు మానసిక నిపుణులు. ‘బెడ్ మీద పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం అనేది వారి మానసిక వికాసంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉచ్చారణలను, కొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలకు కొత్త విషయాలు తెలియజేయడానికి ఇదొక అద్భుత సాధనం. ఇది పిల్లలతో తల్లిదండ్రుల భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది. రోజువారీ షెడ్యూల్లో ప్రతి రాత్రి పుస్తక పఠనాన్ని తప్పనిసరి చేయడం పిల్లల్లో క్రమశిక్షణను పెంచుతుంది’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శృతి వస్త. -
నటి ఝాన్సీకి ఇంత పెద్ద కూతురు ఉందా? డ్యాన్సర్ కూడా! (ఫొటోలు)
-
తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక.. ఇంత అద్భుతంగా చేశారా?
-
తారకరత్న కూతురి హాఫ్ శారీ వేడుక.. ఇంత అద్భుతంగా చేశారా?
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న నందమూరి హీరో తారకరత్న. అంతలా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఇటీవల ఆయన పెద్దకూతురు నిష్కా తారకరత్న హాఫ్ శారీ వేడుక ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఆయన సతీమణి అలేఖ్య. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం నాన్న పోలికే అంటూ సంతోషం వ్యక్తం చేశారు.తాజాగా ఈ వేడుకకు సంబంధించిన వీడియోను అలేఖ్య తన ఇన్స్టాలో షేర్ చేసింది. తారకరత్న నివాసంలో జరిగిన ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సందడి చేశారు. ఇంటిని అలంకరించిన తీరు అభిమానులను కట్టిపడేస్తోంది. (ఇది చదవండి: తారకరత్న కూతురు బర్త్ డే.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!)కాగా.. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న అకాల మరణం చెందారు. గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. View this post on Instagram A post shared by Nishka Nandamuri (@nishkatarakratna) -
నాన్న కూచులు
వెనకటి తరంలో పిల్లలకు తండ్రి దగ్గర అంత చనువుండేది కాదు. వారికి ఏం కావాలన్నా అమ్మతో రికమెండ్ చేయించుకోవాల్సిందే. నాన్న వస్తున్నాడంటే ఎక్కడి ఆటలు అక్కడ ఆపేసి వచ్చి పుస్తకాలు ముందరేసుకుని చదువుతున్నట్టు యాక్షన్ చేసేవాళ్లు. అయితే ఆ తరం మారిపోయింది. ఇప్పుడు పిల్లలు అమ్మ కన్నా నాన్నతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. తమకు కావలసిన వాటిని నాన్నతోనే అమ్మకు రికమెండ్ చేయించుకుంటున్నారు. మీ పిల్లలు కూడా అలాగే చేస్తుంటారా?నాన్నలుప్రాక్టికల్చాలా విషయాలలో అమ్మలకన్నా నాన్నలు ఎక్కువ ప్రాక్టికల్గా ఉంటారు.ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. చిన్నారుల చిన్ని జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలు, సవాళ్లనుప్రాక్టికల్గా ఏ విధంగా చూడాలో వివరిస్తూనే, వాటిని అధిగమించేందుకు సాయం చేస్తారు. అంతేకాదు, దేనినైనా రెండు వైపుల నుంచి ఏ విధంగా ఆలోచించాలో తండ్రులే పిల్లలకు నేర్పుతారు. నాన్న దగ్గరుంటే నిశ్చింతపిల్లలకు ఏమైనా సమస్య అంటే తోటి పిల్లల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ‘మా నాన్నతో చెబుతా’ అని వారికి వార్నింగిస్తుంటారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో నాన్నే హీరో. సర్వశక్తిమంతుడు. నాన్నకు చెబితే ఏ పని అయినా తేలిగ్గా అయిపోతుందని, దానికి తిరుగుండదని వాళ్ల భావన. అందుకే నాన్న వాళ్లకొక నిశ్చింత.ఆటలు... పాటలుచాలామంది నాన్నలు ... పిల్లలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చాలా సరదాగా ఉంటారు. కొత్త కొత్త ఇండోర్, ఔట్డోర్ గేమ్స్ ఆడడంలో మెలకువలు చెప్పి సాయం చేస్తుంటారు. అమ్మలతో పోల్చితే ఆటల విషయంలో ఆంక్షలు తక్కువ. తమని ఒంటరిగా పంపడానికి భయపడుతుంటే స్కూల్లో టీచర్లు ప్లాన్ చేసే టూర్లకు, ఎక్స్కర్షన్లకు అమ్మలకు నచ్చజెప్పి ఒప్పించి మరీ వాళ్లకు కావలసినంత పాకెట్ మనీ ఇచ్చి సాగనంపుతారు. ఆంక్షలు తక్కువఅమ్మతో పోల్చితే నాన్న దగ్గర ఆంక్షలు తక్కువ... ఉదాహరణకు అబ్బబ్బా.. ఆ షూస్ విప్పకుండా అలా లోపలికి వచ్చేస్తావెందుకు... ఛీ.. యూనిఫారమంతా ఇంకు పూసేసుకున్నావు... దీనిని బాగు చేసేదెలా? తీసుకెళ్లిన ఫుడ్డంతా బుద్ధిగా తినకపోయావో.... ఇంకేం లేదు.. ఈ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తే ఊరుకోను... ఇటువంటి ఆంక్షలు నాన్నల దగ్గర ఉండవు.నాన్నంటే ఓ సాహసంపిల్లలకు నాన్నంటే నిజంగా ఓ అడ్వెంచర్. గోడలెక్కడం, చెట్లెక్కడం, గంతులు పెట్టడం... సైకిల్ మీద సవారీలు, కారు, బైకు డ్రైవింగ్ నేర్పించడం... ఇలా కొత్తగా ఏదైనా చెయ్యడం... లాంటివాటికి నో చెప్పక సై అంటారు. తండ్రితో తీపి జ్ఞాపకాలుసెలవులొస్తే బయటికి తీసుకెళ్లడం, ఆటలు ఆడించడం, సినిమాలకు, జూలకి తీసుకెళ్లడం, కోరిన చోటుకు తీసుకెళ్లి దిగబెట్టి రావడం... ఇలాంటి జ్ఞాపకాలెన్నో తండ్రులతో బిడ్డలకు ముడిపడి ఉంటాయి. అందువల్ల నాన్నంటే వాళ్లకు చాలా ఇష్టం.నాన్న... నవ్వురస భరితంచాలామంది తండ్రులు పిల్లలతో హాయిగా జోకులు వేస్తుంటారు. లేదంటే చిన్న చిన్న కామెడీ సీన్లు కూడా సృష్టిస్తుంటారు. ఏం చేసినా, పిల్లలు హాయిగా నవ్వుకునేలా చేస్తారు. గంభీరంగా ఉన్న ఇంటి వాతావరణాన్ని తమ జోకులు, కామెడీ సీన్లతో తేలిగ్గా మార్చేసి, నవ్వుల పువ్వులు విసురుతారు. రోల్ మోడల్స్పిల్లలందరికీ నాన్నలే వాళ్ల రోల్ మోడల్. జీవితంలో ఎదురయే సమస్యలు, సవాళ్లను తట్టుకుని దృఢంగా ఎదిగే నాన్నలు తమను తాము రోల్మోడల్స్గా మలచుకుంటారు. పిల్లలతో గాఢానుబంధాన్ని ఏర్పరుచుకుంటూనే, బాధ్యతలను సక్రమంగా ఎలా నెరవేర్చుకోవాలో పిల్లలకు నేర్పకనే నేర్పుతారు. ఇక్కడ మనం నాన్న గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం... అలా అని అందరి నాన్నలూ అలా ఉండకపోవచ్చు. ఉండాలనీ ఏం లేదు. కాకపోతే పూర్వం కన్నా పరిస్థితులలో మార్పులు వచ్చాయి. ఇప్పటికాలం పిల్లలు నాన్నలతో ఫ్రీగా ఉంటున్నారు. నాన్నలు కూడా గాంభీర్యాన్ని విడిచిపెట్టేశారు. నాన్నలతో గాఢమైన బంధం ఉండే కూతుళ్లు ఎందరో ఉన్నారు. అలాగే అమ్మలను రోల్మోడల్స్లా తీసుకునే కొడుకులూ ఉన్నారు. తండ్రి వస్తుంటే... చేస్తున్న చిలిపి పనులు ఆపేసి తటాలున తలుపు చాటున దాక్కునే పిల్లలు ఇప్పుడు దాదాపు ఎక్కడా కనిపించట్లేదు. తండ్రులు కూడా పిల్లలకేసి ఉరిమి చూడటం లేదు. పిల్లల అల్లరిని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమతో ్రపోత్సహిస్తున్నారుభారతీయ యోగాకు పెద్దపీట అమెరికా వ్యాప్తంగా దాదాపు 6,000 భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. గత ఏడాది ఇవి అమెరికా సంయుక్త దేశాల రెస్టారెంట్ మార్కెట్లో దాదాపు 1 శాతం వాటాను ఆక్రమించడం విశేషం. ఇక మిషెలిన్ గైడ్ రెస్టారెంట్లలో భారతీయ రుచులను కోరుకుంటున్న వారు మూడు శాతంపైనే ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారతీయ యోగా... యోగులు, రుషులు మనకందించిన అపూర్వ విజ్ఞానమిది. ఇప్పుడీ విజ్ఞానం విదేశీయులను విస్మయపరుస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యాల సాధనకు దీన్ని మించిన సాధనం లేదని పాశ్చాత్యులు భావిస్తున్నారు. 2023 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న మొత్తం యోగా స్టూడియోల సంఖ్య 36,000 పైమాటే!అమెరికాలో లాయర్లో 1.3 శాతం మంది, జర్నలిస్టుల్లో దాదాపు మూడుశాతం మంది భారతీయ సంతతికి చెందినవారే.డాలర్లు కురిపిస్తున్న ఇండియన్ సినిమాలు2015 నుంచి 2023 మధ్య వివిధ బాషలకు చెందిన 96 భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలయ్యాయి. నార్త్కరోలినాప్రాంతంలో ఇండియన్ సినిమాకు మంచి మార్కెట్ ఉంది. ఈ కారణంగానే ఇక్కడ విడుదలైన ఒక్కో సినిమా దాదాపు ఒక మిలియన్ డాలర్లకు తక్కువ వసూళ్లను రాబట్టలేదు. మొత్తంగా చూస్తే వీటివిలువ 340 మిలియన్ల అమెరికన్ డాలర్లుస్పెల్ బీ లోనూ మన కూనలదే హవాస్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో భారతీయ సంతతి విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఆ ఏడాది విజేత బృహత్ సోమ సహా భారతీయ సంతతి విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. ఈ పోటీల్లో 2000 నుంచి 2023 వరకూ మొత్తం 34 మంది విజేతలుగా నిలవగా వారిలో 28 మంది మన విద్యార్థులే కావడం మనందరికీ గర్వకారణం. -
#NimratKaur 30 ఏళ్ల కల నెరవేరింది : నటి నిమ్రత్ కౌర్ (ఫొటోలు)
-
హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
అలీరెజా కూతురు ఎంత క్యూట్గా ఉందో.. బర్త్డే పిక్స్ వైరల్
-
ప్రభాస్ 'కల్కి' విలన్కి ఇంత పెద్ద కూతురు ఉందా? (ఫొటోలు)
-
కూతురంటే ఎంత ప్రేమో.. 70ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్ : ఉద్యోగ విరమణకాగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలం గడపాలనుకునేవాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. కన్నబిడ్డ దూరమై మిగిల్చిన విషాదం ముందు.. వయసు మీదపడి ఓపిక తగ్గే తరుణంలో ఉరకలేసే ఉత్సాహంతో నీట్ యూజీ 2020 ఫలితాల్లో ర్యాంక్ను సాధించారు. ఎంబీబీఎస్ విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలో డాక్టర్గా విధులు నిర్వహించనున్నారు.ఒడిశాకు చెందిన 64ఏళ్ల జే కిషోర్ ప్రధాన్ ఎస్బీఐ బ్యాంక్లో ఉన్నత ఉద్యోగం. ఇద్దరు కవలలు. అందమైన కుటుంబం. ఏచీకూ చింతాలేదు. ఎందుకో ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.మలిదశలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న కుమార్తెను దూరం చేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది.అదుగో అప్పుడే తనలాగే మరో ఆడబిడ్డ తండ్రికి గుండె కోత మిగిల్చకూడదనుకున్నారు. డాక్టర్గా సేవలందించాలని దీక్షబూనారు. ఎస్బీఐ అసిస్టెంబ్ బ్యాంక్ మేనేజర్గా పదవీ విరమణ చేసినా డాక్టర్గా సేవలందించాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. దృఢ సంకల్పంతో ఓ వైపు విద్యార్థి, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే పెద్దగా ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత కఠినమైన నీట్ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాలనే లక్ష్యం ముందు అవి చిన్నవిగా కనిపించాయి. ముందుగా నీట్ యూజీ 2020 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పోటీ పడ్డారు. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యారు. మొక్కవోని దీక్షతో అనేక సవాళ్లను అధిగమించారు. చివరికి అనుకున్నది సాధించారు.నీట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వచ్చే ఏడాది డాక్టర్గా ప్రజా సేవ చేయనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు మీద ఆశలేదు. దూరమైన నా కుమార్తె కోసం నేను బతికి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. ‘దేశ వైద్య విద్యా చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఇంత వయస్సులో వైద్య విద్యార్థిగా అర్హత సాధించి ప్రధాన్ ఆదర్శంగా నిలిచారు’ అని విమ్స్ఆర్ డైరెక్టర్ లలిత్ మెహెర్ ప్రధాన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.👉చదవండి : ‘మేం ఏపీకి వెళ్లలేం’ -
రాజేంద్రప్రసాద్ను పరామర్శించిన రెబల్ స్టార్.. గాయత్రికి నివాళి
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్పల్లిలోని ఇందు విల్లాస్లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో రాజేంద్రప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురిపై ప్రేమతో తానే స్వయంగా రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించి ఇచ్చారాయన. -
నా ఓటమికి ఎన్నో కారణాలు: ఇల్తిజా ముఫ్తీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ అనూహ్యంగా ఓడిపోయారు. ఆమె దక్షిణ కశీ్మర్లోని బిజ్బెహరా స్థానం నుంచి పోటీచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ అహ్మద్ వీరీ చేతిలో పరాజయం చవిచూశారు. తన ఓటమిపై ఇల్తిజా ముఫ్తీ మంగళవారం స్పందించారు. బీజేపీతో గతంలో పీడీపీ పొత్తు పెట్టుకోవడం ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. తన పరాజయానికి బీజేపీతో అప్పటి స్నేహం కారణం కాదని స్పష్టంచేశారు. తాను ఆశించిన ఫలితం రాలేదని, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్కు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే ఆ పార్టీకి ఓటు వేశారని తెలిపారు. తమ నాయకులు, కార్యకర్తలు చాలామంది పీడీపీకి దూరమయ్యారని, దీనివల్ల పార్టీ కొంత బలహీన పడిందని అంగీకరించారు. బిజ్బెహరా నుంచి గెలిచే అవకాశం తక్కువగా ఉందని తెలిసినప్పటికీ రిస్క్ చేశానని ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. రిస్క్ చేసినప్పటికీ తగిన ఫలితం రాలేదన్నారు. సురక్షితమైన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే గొప్పేం ఉంటుందని ప్రశ్నించారు. పరాజయం ఎదురైనా కుంగిపోనని, పోరాటం సాగిస్తూనే ఉంటానని తేలి్చచెప్పారు. ఐదేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. -
బజాజ్ కుటుంబంలో విషాదం..
ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కుమార్తె, కమల్నయన్ బజాజ్ హాల్ అండ్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ సునైనా కేజ్రీవాల్ (53) మృతి చెందారు. క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటం తర్వాత శనివారం ఆమె ముంబైలో కన్నుమూశారు.సునైనాకు ఆమె భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. సునైనా భర్త మనీష్ కేజ్రీవాల్ కేదారా క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్నర్. సునైనా గత మూడేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతోంది. దాతృత్వం, కళల పట్ల ఆసక్తి ఉన్న ఆమె కమల్నయన్ బజాజ్ హాల్, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా దేశ ఆర్థిక రాజధానిలో కళారంగాన్ని సుసంపన్నం చేయడంలో కృషి చేశారు.బజాజ్ కుటుంబం ఇప్పటికే దాతృత్వంలో ఉంది. అనేక ఛారిటబుల్ ట్రస్ట్లను కలిగి ఉంది. తన భర్త మనీష్తో కలిసి సునైనా కేదారా క్యాపిటల్ను స్థాపించారు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిర్వహణలో ఆస్తులను కలిగి ఉంది. -
ముగిసిన నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి అంత్యక్రియలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. శనివారం అర్ధరాత్రి ఆమె మరణించారు. అయితే, కొంత సమయం క్రితం హైదరాబాద్లో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గాయత్రికి మొదట ఛాతీ వద్ద నొప్పి రావడంతో వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆమె మరణించారు.కేపీహెచ్బీ ఏడో ఫేజ్ వద్ద ఇందూ విల్లాస్లో ఉంటున్న రాజేంద్రప్రసాద్ నివాసంలో గాయత్రి భౌతికకాయాన్ని ఉంచారు. ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలిపిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం గాయత్రి అంత్యక్రియలు జరిగాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్ కైలాస వాసంలో కుటుంబ సభ్యుల మధ్య గాయత్రి అంత్యక్రియలు ముగిశాయి. అక్కడ కూతురు భౌతికకాయాన్ని చూసి రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. -
రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత.. సెలబ్రిటీల సంతాపం (ఫోటోలు)
-
రాజేంద్ర ప్రసాద్ కూతురు కన్నుమూత
-
కూతురు అరెస్టైనట్లు ఫేక్ కాల్.. గుండెపోటుతో తల్లి మృతి
లక్నో: ఓ ఫేక్ కాల్ మహిళ ప్రాణాలు తీసింది. కూతురు వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని నకిలీ ఫోలీస్ అధికారి ఫోన్ చేయడంతో.. తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఆగ్రాలో నివాసం ఉంటున్న మహిళ మల్తీ వర్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సెప్టెంబర్ 30న పోలీస్ అధికారి పేరుతో ఆమెకు ఓ వాట్పాప్ కాల్ వచ్చింది. ఆమె కుమార్తె సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు చేసినట్లు అతడు తెలిపాడు. ఆ వీడియోలు లీక్ చేయకుండా ఉండాలని వెంటనే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అయితే ఆందోళన చెందిన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే తన కుమారుడు దివ్యాన్షుకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. కానీ కుమారుడు తెలివిగా వ్యవహరించి, ఆ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిన ఫేక్ వాట్సాప్ కాల్గా గుర్తించాడు. అంతేగాక వెంటనే తన సోదరికి ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు ఆమె చెప్పింది.మరోవైపు ఈ ఘటన మహిళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా ఆందోళన చెందిన టీచర్ మల్తీ వర్మ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే కుప్పకూలి గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రంభ కూతురిని చూశారా? అందంలో తల్లిని మించిపోయేలా! (ఫొటోలు)
-
National Daughter’s Day 2024: వందే భారత్ను పరుగులు పెట్టిస్తున్న రితికా టిర్కీ
జంషెడ్పూర్: నేడు (సెప్టెంబర్ 22) జాతీయ కుమార్తెల దినోత్సవం. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ లక్ష్యం. అంతేకాదు కూతుళ్లు కొడుకుల కంటే ఏమాత్రం తక్కువ కాదన్న సందేశాన్ని అందించేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన రితికా టిర్కీ టాటా-పట్నా వందే భారత్ను నడిపి తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు.జంషెడ్పూర్లోని జుగ్సలై నివాసి రితికా టిర్కీ(27) టాటా-పట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపి వందేభారత్ను నడిపిన దేశంలోనే తొలి మహిళా లోకో పైలట్గా గుర్తింపు పొందారు. రితికా తండ్రి లూటియా భగత్ రిటైర్డ్ ఫారెస్ట్ గార్డు. వెనుకబడిన గిరిజన కుటుంబానికి చెందినప్పటికీ రితిక చదువులో ఎంతో ప్రతిభ చూపారు. రాంచీలో పాఠశాల విద్యను పూర్తి చేశాక,మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ అందుకున్నారు. 2019లో రైల్వేలో లోకో పైలట్గా నియమితురాలయ్యారు. మొదట చంద్రపురలో పోస్ట్ అయిన ఆమె ఆ తర్వాత 2021లో టాటానగర్కు బదిలీ అయ్యారు. రితికా భర్త బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి.రితికా మీడియాతో మాట్లాడుతూ కూతుళ్లు.. కుమారులతో సమానమేనని, వారు ఏ రంగంలోనూ వెనుకబడరని తెలిపారు. లోకో పైలట్గా రైలు నడపడం సవాలుతో కూడుకున్న పని అని, అయితే దీనినే కెరీర్గా మార్చుకుని ఈరోజు ఈ స్థానాన్ని సంపాదించానన్నారు. వందేభారత్ రైలును నడిపిన మొదటి మహిళా లోకో పైలట్గా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు, యువతులకు అనేక అవకాశాలు అందించేందుకు ప్రపంచం తలుపులు తెరిచిందన్నారు. ఇది కూడా చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! -
ఎంఎస్ ధోని కూతురు జివా స్కూల్ ఫీజు ఎంతో తెలుసా? (ఫొటోలు)
-
తల్లిని కెమెరాలో బంధిస్తున్న ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య (ఫోటోలు)
-
పుట్టిన మూడు నెలలకే కూతురు చనిపోయింది: స్టార్ హీరో భార్య
బాలీవుడ్ నటుడు గోవిందా బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. లవ్ 86 మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తన సినీ కెరీర్లో పలు అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గోవిందా.. 1987లోనే సునీత అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా భార్య సునీతా అహుజా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అయితే తమకు పెళ్లైన ఏడాదికే టీనా జన్మించిందని వెల్లడించింది. కానీ.. టీనా తర్వాత మరో కూతురు కూడా పుట్టిందని సునీత తెలిపింది. కానీ నెలలు నిండకముందే బిడ్డ జన్మించడంతో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక మూడు నెలలకే చనిపోయిందని బాధాకర సంఘటనను గుర్తు చేసుకుంది.అందువల్లే తన కొడుకు యశ్వర్ధన్ను చాలా జాగ్రత్తగా పెంచుకున్నట్లు సునీత వెల్లడించింది. అంతే కాదు తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని వివరించింది. టీనా కంటే యశ్ ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో చాలా గారాబంగా పెంచుకుంటున్నట్లు పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన పిల్లలను పాఠశాల నుంచి నేనే తీసుకువస్తానని సునీత తెలిపింది. -
ప్రియుని మోజులో.. కన్నతల్లి హత్య
బొమ్మనహళ్లి: పెళ్లయి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ పక్క దారి పట్టింది. ఓ యువకునితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇంట్లో ప్రియునితో కలిసి ఉన్న సమయంలో తల్లికి దొరికిపోయి, తమ రహస్యం బయటపడరాదని ఆమెను మట్టుబెట్టిన కిరాతకురాలి ఉదంతమిది. ఈ సంఘటన బెంగళూరులోని బొమ్మనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.చంపి. ఆస్పత్రికి తీసుకెళ్లి..బొమ్మనహళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు జయలక్ష్మి (62) అనే మహిళ ఇంటిలో చనిపోయింది. తల్లికి రుతుచక్రం సమయంలో తీవ్ర రక్తస్రావమై చనిపోయిందని కూతురు పవిత్ర (34) చెప్పింది. చికిత్స చేయాలంటూ హొంగసంద్రలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరిశీలించి ఆమె చనిపోయిందని, ఏదో అనుమానం ఉందంటూ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పవిత్రను ప్రశ్నించగా అదే కథ చెప్పింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. ఆమె గొంతు పిసకడం వల్ల చనిపోయిందని, గొంతుపై చిన్న గాయాలు ఉన్నాయని రిపోర్టులో ఉంది. దీంతో సీఐ ప్రీతం అనుమానం పెరిగి పవిత్రను పిలిపించి గట్టిగా ప్రశ్నించారు. మా అమ్మ చనిపోయిన బాధలో మేము ఉంటే, మీరు విచారణ అని అనుమానిస్తారా? అని ఎదురు ప్రశ్నించింది. కానీ పోలీసులు పట్టువీడకుండా విచారణ సాగించడంతో చివరకు నిజం చెప్పింది. తాను, ప్రియుడు లవనీత్తో కలిసి ఉండటం చూసి మా అమ్మ చాలాసార్లు మందలించింది, ఓ రోజు ఇద్దరూ బాత్రూం నుంచి బయటకు వస్తుండగా చూసి తీవ్రంగా హెచ్చరించింది. మీ గురించి అందరికీ చెబుతానని బెదిరించింది. లవనీశ్ని ఇల్లు ఖాళీ చేయించింది. తమ విషయం బయటకు తెలిస్తే పరువు పోవడంతో పాటు తమ ఆనందానికి అడ్డుగా ఉన్న తల్లిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పవిత్ర చెప్పింది. ఆరోజు ఇద్దరూ కలిసి టవల్తో ఆమె గొంతుకు చుట్టి హత్య చేశామని తెలిపింది.కుటుంబం ఛిన్నాభిన్నంపవిత్ర భర్త సురేష్ సొంత మేనమామే. 10 ఏళ్ల కూతురు, 6 ఏళ్ల కొడుకు ఉన్నారు. ఆయన కష్టపడి పనిచేసి స్థానికంగా 3 భవనాలు కట్టుకున్నాడు. వాటి బాడుగలే నెలకు రూ.3 లక్షల వరకు వస్తాయి. కుటుంబంతో మైకో లేఔట్లో ఉండేవారు. అద్దె ఇంటిలో లవనీశ్తో పవిత్రకు పరిచయం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసినట్లు తెలిపింది. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
మంచు మనోజ్- మౌనికల కూతురి అన్నప్రాసన.. అత్త లేకపోతే ఎలా? (ఫోటోలు)
-
‘‘గన్నూ రాజాకు బై..బై..!’’ ముద్దుల తనయతో శిల్పాశెట్టి డ్యాన్స్ అదుర్స్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ సారి తన ముద్దుల తనయతో కలిసి చేసిన నృత్యం హృద్యంగా నిలిచింది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి విసర్జన ఆచారాలను నిర్వహించి, ధోల్ దరువులకు ఆనందంగా నృత్యం చేశారు.దీనికి సంబంధించిన వీడియో గణపతి భక్తులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కుమార్తె సమీషాతో కలిసి విసర్జన్ పూజ కోసం ట్విన్నింగ్ లెహంగా-చోలీలో ఉత్సాహంతా డ్యాన్స్ చేసి అలరించారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)అంతకుముందు గణపతి బప్పాకు ఇంటికి సాదరంగా ఆహ్వానించి, భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు శిల్పాశెట్టి దంపతులు. ఆ తరువాత అందమైన సాంప్రదాయ దుస్తుల్లో గణపతికి వీడ్కోలు పలికారు. భర్త రాజ్ కుంద్రా, పిల్లలు వియాన్, సమీషా, సోదరి షమితా శెట్టి, తల్లి సునందతో కలిసి ఇష్టదైవం హారతి ఇచ్చి, గణపతిబప్పా మోరియా అంటూ ఆనందోత్సాహాల మధ్య వీడ్కోలు పలికారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) "మా గన్ను రాజాకు వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదు, అత్యంతభక్తి, ప్రేమతో నిండి ఉన్నాం. కానీ భారమైన హృదయాలతో వీడ్కోలుపలుకుతున్నాం, వచ్చే ఏడాది మిమ్మల్ని స్వాగతించేందుకు ఎదురు చూస్తూ..’’ అంటూ శిల్పా ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్శిల్పాశెట్టి ఘనంగా నిర్వహించిన గణపతి వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్,ఆమె భర్త జాకీ భగ్నానీ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
19 ఏళ్లకే గుండెపోటు? ఐపీఎస్ అధికారి కుమార్తె అనుమానాస్పద మరణం
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో శనివారం రాత్రి 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో విద్యార్థిని అనికా రస్తోగి అపస్మారక స్థితిలో గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. దీంతో అనికా కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె గుండెపోటుతో మరణించినట్టు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. దీంతో అనికా హఠాన్మరణంపై గుండెపోటు టీనేజర్ల పాలిట శాపంగా మారుతోందా? చదువుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? అసలేమైంది లాంటి అనేక సందేహాలు వెల్లువెత్తాయి.మృతురాలు మహారాష్ట్ర కేడర్కు చెందిన 1998 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి సంజయ్ రస్తోగి కుమార్తె. ప్రస్తుతం ఈయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అనికా బీఏ ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి ఆమె హాస్టల్ రూమ్లోని అపస్మారక స్థితిలో పడి ఉండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, హాస్టల్ గదికి లోపలి నుంచి తాళం వేసి ఉందని, లోపల అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు ప్రకటించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆషియానా పోలీసులు తెలిపారు. -
మెహబూబా వారసురాలు...కంచుకోటను నిలబెట్టేనా?
కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది. మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్కు బిజ్బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచారు. తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.ఎన్సీ ప్రత్యేక దృష్టి పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్గనీ షా 1977–1990 దాకా బిజ్బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్సీ ఇక్కడ బషీర్నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కూతురి కోసం ప్రియాంక చోప్రా ఏం చేసిందంటే?
బాలీవుడ్ నటి, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల తన సోదరుడి ఎంగేజ్మెంట్ వేడుకలకు హాజరైంది. ముంబయిలో జరిగిన సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థ వేడుకలో సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేసింది.అయితే హాలీవుడ్ సింగర్ నిక్జోనాస్ను పెళ్లాడిన ప్రియాంక చోప్రాకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. ఇండియా పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన కూతురి ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా తన కూతురి పేరుతో ఇన్స్టా అకౌంట్ పేరును పంచుకుంది.తన కుమార్తె మాల్టీ మేరీతో ఇన్స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. కూతురి పేరుతో ఖాతాను ఓపెన్ చేసిన ప్రియాంక చోప్రా తన ఇన్స్టా స్టోరీలో పంచుకుంది.కాగా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం పానీ అనే మరాఠీ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా హెడ్స్ ఆఫ్ స్టేట్లో అనే మూవీలో నటిస్తున్నారు. ఆ తర్వాత యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న ది బ్లఫ్ మూవీలో ప్రియాంక కనిపించనున్నారు. -
చిట్టితల్లి చేతికి చితికుండ
మిరుదొడ్డి(దుబ్బాక): ఆరేళ్ల ప్రాయం.. లోకమేమిటో తెలియని చిన్నారి.. చితి కుండ పట్టుకుంది. తండ్రికి తలకొరివి పెట్టింది. వివరాలివి. మండల కేంద్రమైన మిరుదొడ్డికి చెందిన బోయిని నాగరాజు (28)గురువారం గుండె పోటుతో మృతి చెందాడు. అతనికి భార్య నవ్య, ఆరేళ్ల కూతురు శివాని ఉన్నారు. కొడుకుల్లేక పోవడంతో శుక్రవారం నిర్వహించిన అంత్యక్రియల్లో కూతురు శివాని తలకొరివి పెట్టింది. తండ్రి శవయాత్రలో చితికుండతో నడుస్తున్న ఆమెను చూసినవారు కంటతడి పెట్టారు. -
Daughter Save Father: సాయుధులతో ఒంటరిగా పోరాడి..
పదిహేడేళ్ల అమ్మాయి. ఏడో తరగతితోనే చదువు ఆపేసింది. పనికిమాలిన పిల్ల అంటూ ఊర్లో అంతా హేళన చేశారు. తనను ఎవరు ఏమన్నా నవ్వుతూ భరించింది. కానీ, కన్నవాళ్లకు ఆపదొస్తే చూస్తూ ఊరుకుంటుందా?. శివంగిల దూకి రక్షించుకుంది.ఛత్తీస్గఢ్ జారా గ్రామంలో ఆగష్టు 7వ తేదీ సాయంత్రం.. సోమ్దర్ కొర్రం అనే వ్యక్తి ఇంటిపైకి ఆయుధాలతో ఎనిమిది మంది వచ్చారు. పదునైన ఆయుధాలతో మెడ మీద వేటు వేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయన తప్పించుకోవడంతో అది ఛాతీలో దిగబడింది. ఆ వెంటనే మరో దెబ్బతో ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నించారు. అయితే..ఇంట్లో తండ్రికి భోజనం వడ్డిస్తూ ఆ అలికిడి విన్న కొర్రం కూతురు సుశీల.. ఒక్క దూటున వాళ్ల మధ్యకు చేరింది. తండ్రిని చుట్టుముట్టిన నలుగురు ఆగంతకులపై పిడిగుద్దులు గుప్పించింది. ఆ పెనుగులాటలో ఒకరి చేతిలో గొడ్డలి లాక్కుని.. కింద రక్తపు మడుగులో ఉన్న తండ్రికి రక్షణ కవచంలా నిలిచింది. అయితే..బయట నలుగురు కాపలా.. లోపల నలుగురు. వాళ్లతో ఎక్కువసేపు ఒంటరిగా పోరాడలేనని ఆమెకు అర్థమైంది. సాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరారు. అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సాయంతో జగదల్పూర్లోని దిమ్రాపాల్ ఆస్పత్రికి తీవ్రంగా గాయపడ్డ తండ్రిని తీసుకెళ్లింది. సకాలంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో.. ఇది మావోయిస్టుల పనని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పోలీస్ విచారణలో కాదని తేలింది. భూ తగాదాలతో ఆయన చిన్న తమ్ముడే ఈ దాడి చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.अपने पिता की जान बचाने के लिए एक बेटी 8 हथियार बंद नक्सलियों से भिड़ गई... बहादुर बेटी की कहानी देख लीजिए @gyanendrat1#Chhattisgarh #Narayanpur #NaxalAttack #CGNews #SeedheMuddeKiBaat #GyanendraTiwari #VistaarNews pic.twitter.com/d6PFOlsOnf— Vistaar News (@VistaarNews) August 6, 2024 Video Credits: Vistaar News -
టాలీవుడ్ విలన్కి ఇంత అందమైన కూతురు.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
భార్యాబిడ్డల కోసం చిరుతకే పంజా విసిరిన మొనగాడు
చిరుత పులి లేదా మచ్చలపులి ఉన్నట్టుండి మనకు ఎదురుపడితే.. దాడి చేస్తే. అమ్మో, అసలు ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం తన భార్యా బిడ్డల్ని కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులిపైనే పంజా విసిరాడు. చేతిలో ఎలాంటి ఆయధం లేకుండానే దాని ఎదుర్కొన్నాడు. పిడిగుద్దులతో దానికి చుక్కలు చూపించాడు. శరీరం రక్తమోడుతున్నా ఏ మాత్రం భయపడలేదు. ప్రాణానికి ప్రాణమైన తన బిడ్డను, భార్యను కాపాడుకోవడమే లక్ష్యం. అందుకే ప్రాణాలకు తెగించి మరీ పోరాడి దాన్ని మట్టి కరిపించి హీరోగా నిలిచాడు కర్ణాటకకు చెందిన గోపాల్ నాయక్. వాస్తవానికి ఈ సంఘటన 2021లో జరిగింది. కర్ణాటకలోని బెంగళూరుకు 200 కి.మీ దూరంలోని అరసికెరె సమీపంలోని బెండేకెరె గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ స్టోరీ మరోసారి రౌండ్లు కొడుతుంది. మిక్కు అనే ఎక్స్ యూజర్ ఈ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.-Leopard attacks his daughter -He comes to the rescue -KiIIs leopard with bare hands Not a textbook hero, but a real brave 👑 pic.twitter.com/PuUpLGLDzn— Mikku 🐼 (@effucktivehumor) July 29, 2024 -
మద్యం మత్తులో.. కూతురికే ఉరి
రొంపిచెర్ల: మద్యం మత్తులో ఓ తండ్రి కన్న బిడ్డనే ఉరేసి చంపిన సంఘటన మండలంలోని పెద్దమల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలు మేనమామ జయరాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నడింపల్లెకు చెందిన కె.మునిరత్నం(35), రెడ్డెమ్మ దంపతులకు ఒక కుమార్తె గౌతమి(14) ఉంది. పదేళ్ల క్రితం రెడ్డెమ్మ మృతి చెందారు. అప్పటి నుంచి గౌతమి తన తండ్రి, అవ్వతో కలసి ఉంటోంది.గౌతమి పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే మునిరత్నం తల్లి ఐదు నెలల క్రితం మృతి చెందింది. అప్పుటి నుంచి ఆ ఇంట్లో తండ్రి, కుమారై జీవిస్తున్నారు. మునిరత్నం ఆదివారం రాత్రి తాగొచ్చి ఇంట్లో పడుకుని ఉన్న కుమారైను ఏమీ పని చేయడం లేదని మందలించాడు. దీంతో గౌతమి కూడా గట్టిగా బదులిచ్చింది. వెంటనే కోపంతో సెల్ చార్జింగ్ వైర్ను మెడకు వేసి చంపివేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకుని మృతి చెందిందంటూ ఉదయాన్నే చుట్టుపక్కల వారికి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు తండ్రి మీద అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో తన బిడ్డను చార్జింగ్ వైరుతో చంపివేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే నిందితుడు మునిరత్నం పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కల్లూరు సీఐ శ్రీనివాసులు, ఇన్చార్జి ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి, సంఘటన స్థలాన్ని సందర్శించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మునిరత్నం కోసం రొంపిచెర్ల పోలీసులు గాలిస్తున్నారు. రెండు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.ఎన్నో అనుమానాలు కుమారై గౌతమి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి తాను చనిపోతున్నానని తన చావుకు తన స్నేహితులను పిలవాలని రాసిన ఒక లేఖ సోమవారం బయటపడింది. అయితే మరోపక్క మునిరత్నమే తన కుమార్తెను చంపేశాడని ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తండ్రి కుమార్తెపై లైంగిక దాడికి యతి్నంచి, చంపేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోస్టుమాస్టరం నివేదికలో వాస్తవం బయటపడుతుందని భావిస్తున్నారు. -
నేతాజీ అస్తికలు తెప్పించండి: ప్రధానికి బోస్ కుమార్తె లేఖ
కోల్కతా: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలను జపాన్లోని రెంకోజీ ఆలయం నుంచి భారత్కు తీసుకురావాలని అతని కుమార్తె అనితా బోస్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18 నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్థంతి అని, ఈ సందర్భంగా ఆయన అస్తికలను భారత్కు తీసుకురావాలని కోరుతున్నానంటూ ఆమె ప్రధానికి లేఖ రాశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకైక కుమార్తె అనితా బోస్ ప్రధానికి రాసిన లేఖలో తన తండ్రి అస్తికలను భారతదేశానికి తీసుకువచ్చి, తమకు అందించాలని వాటితో తాను తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నట్లు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘మా తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులు అర్పించే సమయం ఇది. అతని అస్తికలను భారతదేశానికి తీసుకురావాలి. నేను నా తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలి. ఇది నా తండ్రి చివరి కోరిక. అందుకే నేను ఈ లేఖ రాస్తున్నాను. నేతాజీకి సంబంధించిన అన్ని రహస్య పత్రాలను బయటపెట్టడానికి ప్రధాని చేసిన ప్రయత్నాన్ని మేమంతా మెచ్చుకుంటున్నాం.నేతాజీ 1945, ఆగస్టు 18న మరణించారని, ఆయన అస్తికలను జపాన్లోని రెంకోజీ ఆలయంలో ఉంచారని దర్యాప్తు నివేదికల్లో వెల్లడయ్యింది. నేతాజీ భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు నా వినయపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటంటే.. ఆగస్టు 18న నేతాజీ వర్థంతి. ఆరోజు నాటికి ఆయన అస్తికలను భారతదేశానికి తిరిగి తీసుకురావాలి. నేతాజీ అస్తికలను ఇంకా జపాన్లో ఉంచడం అవమానకరం’ అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.మీడియాతో నేతాజీ మనుమడు చంద్రకుమార్ బోస్ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న మన దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. నేతాజీ అస్తికలను జపాన్లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని, స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్న నేతాజీ అస్తికలను మన దేశంలో ఉంచడం శ్రేయస్కరమన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం నేతాజీ కుమార్తె అనితా బోస్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నారని చంద్ర కుమార్ బోస్ తెలిపారు.కాగా రెంకోజీ టెంపుల్ అథారిటీ నేతాజీ అస్తికలను భారత ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉంది. 1945, ఆగష్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మృతి చెందారు. అయితే దీనిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2017లో ఆర్టీఐ (సమాచార హక్కు)కింద నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించింది. -
కమలా హారిస్, ‘లవ్లీ స్టెప్ డాటర్’ ఎల్లా ఎమ్హాఫ్ గురించి తెలుసా? (ఫొటోలు)
-
సితార బర్త్డే.. మరోసారి మంచి మనసు చాటుకున్న మహేశ్బాబు (ఫోటోలు)
-
Sitara Ghattamaneni: సితార బర్త్డే స్పెషల్.. అందంలో తండ్రిని మించిపోతుందేమో! (ఫొటోలు)
-
ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ఎంత ఎదిగిపోయిందో! (ఫోటోలు)
-
బుల్లితెర నటి అంజలి కూతురు చందమామ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ట్రంప్పై దాడి.. రీగన్ను గుర్తుచేసుకున్న కుమార్తె
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ను అతని కుమార్తె పాటీ డేవిస్ గుర్తు చేసుకుని, తన తండ్రి విషయంలోనూ ఇలాగే జరిగిందంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రోనాల్డ్ రీగన్ 1981లో ఒకరోజు వాషింగ్టన్లో తన ప్రసంగం ముగించుకుని తన నివాసానికి వెళుతుండగా జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి రీగన్పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రీగన్ కొన్నాళ్లకు కోలుకున్నప్పటికీ, పాక్షికంగా పక్షవాతానికి గురయ్యడు. రోనాల్డ్ రీగన్ కుమార్తె పాటీ డేవిస్ నటి, రచయిత్రి. ఆమె న్యూయార్క్ టైమ్స్లో ఓ కథనం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.‘అది 1981, మార్చి 30.. నేను నా ఆస్పత్రి కార్యాలయంలో కూర్చున్నాను. ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మా ఆఫీసు తలుపును తోసుకుంటూ లోనికి వచ్చాడు. దీంతో అతని మీద నాకు మొదట నాకు కోపం వచ్చింది. అయితే ఏదో జరగరానిది జరిగిందన్న భావన అతని ముఖంలో కనిపించింది. ఇంతలో అతను పాటీ.. అక్కడ కాల్పులు జరిగాయన్నాడు. ఆ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజులలో ఒకటి. నా తండ్రి రోనాల్డ్ రీగన్ బతికి ఉంటారో ఉండరో తెలియదు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా ఈ విషయం తెలియదు. మా అమ్మ.. మా నాన్నను తలచుకుంటూ రోదిస్తోంది. మా నాన్న హాస్పిటల్ బెడ్పై కదలలేని పరిస్థితిలో ఉన్నాడు.డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. వారు అనుభవిస్తున్న వేదన ఎటువంటిదో నాకు తెలుసు. అధ్యక్షుడు లేదా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థి జీవితం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అమెరికాలో ప్రస్తుతం 1981కి మించిన హింసాత్మక స్థితి ఉంది. ఈ అనుభవం ట్రంప్ను ఎలా మారుస్తుందో నేను ఊహించలేను. సోవియట్ యూనియన్తో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికి, అణ్వాయుధాలపై ఒప్పందాన్ని చేసుకునేందుకు దేవుడు తనను భూమిపైకి పంపాడని నా తండ్రి నమ్మాడు. సమయం అమూల్యమైనది. ఈ బహుమతిని అర్థవంతంగా ఉపయోగించడం అందరికీ తప్పనిసరి అని నాన్న గుర్తు చేసేవారని’ పాటీ డేవిస్ పేర్కొన్నారు. This is how the Secret Service reacted in 1981 when Ronald Reagan was shot.pic.twitter.com/N4GBoHqMWZ— Keith Boykin (@keithboykin) July 13, 2024 -
హాలీవుడ్ నటితో మహేశ్ బాబు కూతురు.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లి ముంబయిలో గ్రాండ్గా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీతారలు హాజరై సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్ష్న్ సెంటర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తన ముద్దుల కూతురు సితార, భార్య నమ్రతా శిరోద్కర్తో కలిసి పెళ్లి వేడుకల్లో మెరిశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో సితార ప్రముఖులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. హాలీవుడ్ భామ కిమ్ కర్దాసియాన్తో సెల్ఫీలు తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతే కాకుండా బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, రాధ, ఐశ్వర్యరాయ్, రణ్వీర్సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ లాంటి బాలీవుడ్ స్టార్స్తోనూ ఫోటోలు దిగింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) -
'నా బిడ్డ ప్రమాదానికి గురైంది.. ఐసీయూలో ఉంది': పేటీఎం ఫౌండర్
పేటీఎం సంక్షోభం గురించి జేఐఐఎఫ్ ఫౌండేషన్ డే ఈవెంట్లో సంస్థ ఫౌండర్ అండ్ ఎండీ 'విజయ్ శేఖర్ శర్మ' కీలక వ్యాఖ్యలు చేశారు. పేటీఎం ప్రమాదంలో పడి ఇప్పుడు ఐసీయూలో ఉన్న నా కుమార్తె లాంటిదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.పేటీఎం నాకు బిడ్డ లాంటిది. మేము కలిసి ఎదిగాము, లాభాలను చవిచూసాము, ఫ్రీ క్యాష్ కూడా జనరేట్ చేశాము. జీవితంలో నా బిడ్డ ఉన్నతమైన స్థానానికి చేరుతుందని భావించాను, కానీ ఒక ముఖ్యమైన ప్రవేశ పరీక్ష కోసం వెళుతున్నప్పుడు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఐసీయూలో ఉందని అన్నారు.ఈ ఏడాది ప్రారంభంలో.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కేవైసీ నిబంధనలను పాటించలేదని, తద్వారా మనీ ల్యాండరింగ్ జరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావించింది. దీంతో 2024 ఫిబ్రవరి 29 తరువాత కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. డిపాజిట్, క్రెడిట్ సౌకర్యాలు, ప్రీపెయిడ్ అండ్ పోస్ట్-పెయిడ్ ఖాతాలపై టాప్ అప్ చేయకూడదని, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ & యూపీఐ లావాదేవీలు వంటి వాటిని కూడా ఆర్బీఐ నిషేదించింది.పేటీఎంపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది కంపెనీ హోల్డర్లకు కూడా నష్టాన్నే మిగిల్చింది. ఐపీఓలోనే ఈ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. ఆ తరువాత క్రమంగా నష్టాల్లోనే పయనిస్తున్న పేటీఎం ఇప్పుడు కూడా సంక్షోభంలోనే నడుస్తోంది. -
పరువుకు భయపడి దారుణం.. పది నెలల తర్వాత?
దేశంలో పలు గ్రామాల్లో నేటికీ అప్పుడప్పుడూ పరువు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. సమాజంలో పరువును కాపాడుకునే ప్రయత్నంలో కొందరు పెద్దలు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా అటువంటి ఉదంతం హర్యానాలో వెలుగు చూసింది.ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఇంటిలో 10 నెలల క్రితం ఒక యువతి మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే మృతురాలి తండ్రి ఫిర్యాదుతో ఆ యువతి అస్తిపంజరాన్ని పోలీసులు వెలికి తీసి, స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న బాలిక తండ్రి మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఆ యువతి తల్లిని విచారించగా అసలు విషయం బయటపడింది.10 నెలల క్రితం తన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టింది. తమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకునితో వెళ్లిపోయి, తరువాత ఇంటికి వచ్చిందని, అయితే చుట్టుపక్కలవారి మాటలు విని, అవమానంగా భావించి ఉరివేసుకున్నదని తెలిపింది. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే, పరువుపోతుందని భావించి, తన సోదరుని సాయంతో కుమార్తె మృతదేహాన్ని ఇంటిలోనే పాతిపెట్టామని తల్లి పోలీసులకు వివరించింది.విషయమంతా తెలియడంతో పోలీసులు పోలీసులు తహసీల్దార్, ఏసీపీ సమక్షంలో మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి తండ్రి తాహిర్ గత పదేళ్లుగా సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. అతని ఎనిమిదిమంది సంతానం తల్లి దగ్గర ఫరీదాబాద్లో ఉంటున్నారు. తన కుమార్తె హత్యకు గురై ఉండవచ్చునని తాహిర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ చలాకీ చిన్నారి.. పెళ్లి కూతురైంది.. బంగారు బొమ్మలా! (ఫోటోలు)
-
కుటుంబాన్ని మింగేసిన అగ్ని కీలలు
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. మంటలు భారీగా చెలరేగడంతో 13 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలకు అదుపులోనికి తీసుకువచ్చాయి. ఈ ఘటన గ్వాలియర్లోని బహోదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్నగర్లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో విజయ్ అలియాస్ బంటీ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు దీనిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే విజయ్, అతని కూతుళ్లు అన్షిక అలియాస్ మినీ (15), యాషిక అలియాస్ జీసస్ (14) సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగిన భవనంలో కింది అంతస్తులో ఒక ప్రవేశ ద్వారం మాత్రమే ఉంది. దీంతో వారు ఇంటిలో నుంచి బయటకు రాలేకపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపుచేసింది. ఈ భవనపు కింది భాగంలో డ్రై ఫ్రూట్స్ దుకాణం, రెండవ అంతస్తులో ఒక గొడౌన్ ఉంది. -
IPL: వేల కోట్లకు వారసురాలు.. ఇంతకీ ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)
-
మంచు లక్ష్మి కూతురు యాపిల్కు 10 ఏళ్లు.. గ్రాండ్గా సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ట్రైనీ ఐఏఎస్గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు.. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి.. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Proud father, who is SP rank police officer, salutes his trainee IAS daughter N Uma Harathi when she visited #Telangana Police Academy #TGPA today. N Venkateshwarlu works as Deputy Director, TGPA, while his daughter topped #UPSC civils exam 2022 securing All India 3rd rank. pic.twitter.com/xM1haCHO2m— L Venkat Ram Reddy (@LVReddy73) June 15, 2024 -
ఇద్దరితో సహజీవనం.. అడ్డుకున్న తండ్రిని హత్య చేసిన కూతురు
-
USA: కూతురితో కలిసి ఇసుక గూళ్లు కట్టిన రోహిత్ శర్మ (ఫొటోలు)
-
హీరోను పెళ్లాడిన అర్జున్ కూతురు.. ఫోటోలు వైరల్!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతిని ఆమె పెళ్లి చేసుకుంది. చెన్నైలో హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వివాహా వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. ఐశ్వర్య- ఉమాపతిల ఎంగేజ్మెంట్ వేడుక గతేడాది అక్టోబర్లో జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితోనే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్ఫుల్గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్లో అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి సినిమాల్లో హీరోగా నటించాడు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
అర్జున్ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్గా హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం : చందమామలాంటి కుమార్తె తిరిగి రాని లోకాలకు
భార్యభర్తలిద్దరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వీరికి అందమైన కుమార్తె. చదువులో కూడా బాగా రాణిస్తోంది. ఇంతలోనే అనూహ్య పరిణామం వారి జీవితాల్లో తీరని అగాథాన్ని నింపింది. ఉన్నత చదువులు చదువుకుని తమకు మంచి పేరు తెస్తుందనుకున్న కుమార్తె అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం మహారాష్ట్రలో ఉన్నత పదవుల్లో ఉన్నారు వికాస్రస్తోగి, ఆయన భార్య రాధికా రస్తోగి. వికాస్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీరికి లిపి రస్తోగి (27)అనే కుమార్తె ఉంది. ఈమె హర్యానాలోని సోనేపట్లో న్యాయశాస్త్రం చదువుతోంది అయితే పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ముంబైలోని అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు నుంచి దూకింది. లిపిని వెంటనే జిటి ఆసుపత్రికి తరలించి నప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని మృతికి ఎవరినీ నిందించవద్దంటూ పేర్కొన్న సూసైడ్ నోట్ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు కాగా 2017లో ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్ జంట 18 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు. -
Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
Geetha Madhuri: సింగర్ గీతామాధురి కూతురు... ఎంత పెద్దదైంది, దిష్టితగిలేను! (ఫోటోలు)
-
హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు. -
నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉంది: సుకుమార్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2: ది రూల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే పుష్ప పుష్ప అంటూ ఫ్యాన్స్ను ఊపేసే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ సాంగ్లో అల్లు అర్జున్ షూ స్టెప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప-2 త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే సుకుమార్- తబిత దంపతులకు సుకృతి వేణి అనే ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమెకు ఉత్తమ బాలనటిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు. గాంధీ తాత చెట్టు అనే చిత్రానికి ఈ అవార్డ్ దక్కించుకున్నారు. అయితే సుకృతి సింగర్ కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆమె ఓ మ్యూజిక్ కన్సర్ట్లో సాంగ్ పాడిన వీడియోను సుకుమార్ తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకున్నారు. నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ సుకుమార్ పోస్ట్ చేశారు. అంతే కాకుండా సుకృతి పాడిన యూట్యూబ్ లింక్ను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం సుకృతి పాడిన సాంగ్ సంగీత ప్రియులను అలరిస్తోంది. కాగా.. పుష్ప 2: ది రూల్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. -
తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు కలకలం సృష్టించాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ యువతిని అగంతకుడు బెదిరించాడు. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్చేసి కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.+92 కోడ్తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్న సైబర్ పోలీసులు.. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
Indraja Sankar Birthday Photos: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
-
‘సర్.. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)
-
‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
వార్తా పత్రికల్లో వివాహాలకు సంబంధించిన ఆసక్తికర ప్రకటనలను చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రకటన గురించి గతంలో ఎప్పుడూ వినివుండం. ఒక జంట 30 ఏళ్ల క్రితం మృతి చెందిన తమ కుమార్తెకు వరుణ్ణి వెదుతున్నట్లు ఒక ప్రకటన ఇచ్చింది. ఇది చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళితే దక్షిణ కన్నడ జిల్లాలో 30 ఏళ్ల క్రితం మృతిచెందిన ఓ పసికందు (ఇప్పుడు యువతి అయి ఉండేది) కోసం తగిన వరుడిని వెతుకుతున్నట్లు ఇటీవల ఒక వార్తాపత్రిలో ప్రకటన వెలువడింది. పుత్తూరుకు చెందిన ఒక కుటుంబం ఈ ప్రకటన ఇచ్చింది. 30 ఏళ్ల క్రితం మృతి చెందిన తమ కుమార్తెకు ఎలాగైనా వివాహం చేయాలని ఆ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారు. తమ కుమార్తె అవివాహితగా మృతి చెందిన కారణంగా తమను దురదృష్టం వెంటాడుతున్నదని ఆ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.30 ఏళ్ల క్రితం ఆ దంపతుల కుమార్తె పసికందుగా ఉన్నప్పుడే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అప్పటి నుండి వారికి కష్టాలు ఎదురవుతున్నాయట. తమ కుమార్తె వివాహం కాకుండా మృతి చెందడమే తమ కష్టాలకు కారణమని ఆ కుటుంబ నమ్ముతోంది. దీంతో తమ కుమార్తె ఆత్మకు శాంతి కలిగింపజేయాలనే భావనతో ఆ కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇందుకోసం ఒక దినపత్రికలో ప్రకటన ఇచ్చారు.‘30 ఏళ్ల క్రితం మరణించిన యువతికి.. 30 ఏళ్ల క్రితం మృతి చెందిన వరుడు కావలెను. దయచేసి ఇటువంటి వరుడు కలిగిన వారు ఇరు ఆత్మల వివాహానికి సహకరించండి. ఇందుకోసం ఫలానా నంబరుకు ఫోన్ చేయండి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఎంతగా ప్రయత్నించినా అటువంటి వరుడు దొరకడం లేదని, అందుకే ఈ ప్రకటన ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. -
Lok Sabha Election 2024: మట్టిమనిషి!
జహనారా ఖాన్. పశి్చమబెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానంలో సీపీఎం అభ్యర్థి. బొగ్గు గని కార్మికుని కూతురు. రాజకీయాల్లో స్వశక్తితో ఎదిగిన సాదాసీదా మహిళ. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మట్టి బిడ్డ. జమూరియా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా, ఎస్ఎస్ అహ్లువాలియా వంటి దిగ్గజాలకు గట్టిపోటీ ఇస్తున్నారు... చిన్న స్థాయి నుంచి... జహనారా తండ్రి మైనింగ్ కార్మికుడు. సీపీఎం నాయకుడు. ఆమె జమూరియాలోని రాణిగంజ్ మహిళా కాలేజీలో చదువుకున్నారు. 1990లో డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పటికీ ఈసీఎల్లో ఒక చిన్న పాత ఇంట్లో తోబుట్టువులతో కలసి ఉంటారామె. జహనారా వృత్తి రీత్యా టీచర్. వెనకబడిన కుటుంబాల్లోని చిన్నారులు, యువత జీవితాల్లో వెలుగు నింపేందుకు పాతికేళ్ల కిందే బాల్ బోధన్ శిక్షా నికేతన్ పేరిట హిందీ మీడియం స్కూలు ప్రారంభించారు. జమురియాలోని దక్షిణ పరాసియా మైనింగ్ ప్రాంతంలో ఉందీ స్కూలు. ఇందులో చదువుకున్న వాళ్లే ఇప్పుడు టీచర్లుగా స్వచ్ఛందంగా పని చేస్తుండటం విశేషం. అనంతరం తండ్రి రాజకీయ బాటలో నడిచి తొలుత సీపీఎం యువజన సంఘంలో పని చేశారు. జమూరియా మహిళా సంఘ నాయకురాలిగా ఎదిగారు. జమూరియా పంచాయతీ ప్రధాన్గా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2008లో జమురియా పంచాయతీ అధ్యక్షురాలయ్యారు. తృణమూల్ హవా సాగుతున్న 2011, 2016ల్లో వరుసగా రెండుసార్లు జమురియా నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ఆమెకున్న ఆదరణకు నిదర్శనం. స్థానికంగానూ అత్యంత శక్తిమంతురాలైన నాయకురాలిగా ఎదిగారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జమూరియా నుంచి విద్యార్థి నాయకురాలు అయిషీ ఘోష్కు సీపీఎం టికెటిచి్చంది. దాంతో జహనారా పార్టీ కార్యకలాపాలపై, పాఠశాలపై దృష్టి సారించారు. తొలిసారిగా ఇప్పుడు లోక్సభ బరిలో దిగుతున్నారామె. కారి్మకుల కుటుంబాలు అధికంగా ఉండే అసన్సోల్లో ఆమె గెలుపు తథ్యమని సీపీఎం భావిస్తోంది. పోరాడేవారే గెలుస్తారు... నటులు, గాయకులతో ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పు రాదంటారు జహనారా. కారి్మకులు, ప్రజల పక్షాన పోరాడే సీపీఎం తప్పక విజయం సాధిస్తుందని ఆమె నమ్ముతున్నారు. ‘‘రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోంది. మహిళలు సురక్షితంగా లేరు. 2011 పార్క్ స్ట్రీట్ సంఘటన నుంచి, నేటి సందేశ్ఖాలీ వరకూ మహిళలు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నారు. బెంగాల్ ఆడపిల్లలను తృణమూల్ ప్రభుత్వం సరుకులుగా మార్చింది. రాష్ట్రమంతటా మహిళలపై జరుగుతున్న అణచివేతపై నిరసన, ప్రతిఘటన అగి్నజ్వాలగా మారుతోంది. సమస్యల పరిష్కారంలో తృణమూల్, బీజేపీలు విఫలమయ్యాయి’’ అని విమర్శిస్తున్నారు. పదేళ్లుగా కోల్పోయిన అసన్సోల్ ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టడం తన బాధ్యత అని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముద్రగడ కూతురు వీడియోపై సంచలన నిజాలు బయటపెట్టిన అడ్వకేట్ రామానుజం
-
సమస్తిపూర్ కుస్తీ.. మంత్రుల వారసుల ఫైట్
పాట్నా: బిహార్లోని సమస్తిపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల వారసులు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.సమస్తిపూర్ ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఈ నియోజకవర్గం దివంగత సోషలిస్ట్ నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జన్మస్థలం. సోషల్ ఇంజనీరింగ్ మాస్టర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్కు భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్న అవార్డును ప్రకటించింది. ఠాకూర్ 1977లో సమస్తిపూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.బీహార్ గ్రామీణ పనుల శాఖ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె 25 ఏళ్ల శాంభవి చౌదరి లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్) -LJP (RV) నామినేషన్పై ఎన్డీఏ అభ్యర్థిగా సమస్తిపూర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషియాలజీలో ఎంఏ పట్టా పొందిన శాంభవి.. ఈసారి పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థుల్లో ఈమే అత్యంత పిన్న వయస్కురాలు.ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా 33 ఏళ్ల సన్నీ హజారీ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా నితీష్ కుమార్ ప్రభుత్వంలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా ఉన్న మహేశ్వర్ హజారీ కుమారుడు. ఎన్ఐటీ పాట్నా నుంచి బీటెక్ పూర్తి చేసిన సన్నీ సమస్తిపూర్లో సొంత వ్యాపారాన్ని నడుపుతున్నారు.అభ్యర్థులిద్దరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోడ్షోలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తన కూతురి గెలుపు కోసం శాంభవి తండ్రి, రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి శ్రమిస్తుండగా సన్నీ తండ్రి, బీహార్ మంత్రి మహేశ్వర్ హజారీ ఇంకా తన కుమారుడికి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. సమస్తీపూర్ నియోజకవర్గంలో మే 13న పోలింగ్ జరగనుంది. -
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.కొచ్చిలోని ప్రముఖ హోటల్లో మాళవిక-నవనీత్ రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. .@mammukka #yusufAli @PrithviOfficial #Supriya @ #Jayaram’s daughter Malavika’s wedding reception in Kochi pic.twitter.com/ff1VoT9mVk— sridevi sreedhar (@sridevisreedhar) May 5, 2024 -
Geetha Shivarajkumar: ‘గీత’ దాటినా... గీత మారేనా!
గీతా శివరాజ్కుమార్. కన్నడ ప్రజలకు చిరపరిచితమైన పేరు. కన్నడ కంఠీరవ రాజ్కుమార్ కోడలు. ప్రముఖ నటుడు శివరాజ్కుమార్ భార్య. అంతేనా...? కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు! రాజకీయ కుటుంబంలో పుట్టి కన్నడ సినీ పరిశ్రమకు దిగ్గజాల వంటి తారలను అందించిన ఇంటికి కోడలిగా వెళ్లారు. అయినా పుట్టింటి వారసత్వం ఆమెను చివరికి రాజకీయాల వైపు నడిపించింది. 2014లోనే రాజకీయ అరంగేట్రం చేసిన గీత ఇప్పుడు శివమొగ్గ లోక్సభ స్థానంలో బీజేపీ దిగ్గజం యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రతో పోటీ పడుతున్నారు...నిషేధాన్ని ఉల్లంఘించి.. గీతకు 1986లో శివరాజ్కుమార్తో పెళ్లయ్యింది. తర్వాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యారు. తల్లి మరణానంతరం ఆమె నిర్వహించిన మైసూరులోని ‘శక్తిధామ్’ స్వచ్ఛంద సంస్థ బాధ్యతలు చూస్తున్నారు. చాలాకాలం భర్తకు స్టయిలిస్ట్గా కూడా చేశారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి వెళ్లొద్దని రాజ్కుమార్ లక్ష్మణరేఖ గీశారు. దాంతో సినిమాల్లో ఎంత పాపులారిటీ సాధించినా ఆయన కొడుకులెవ్వరూ రాజకీయాల వైపే చూడలేదు. కానీ బాల్యం నుంచి ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం చూసిన గీతకు రాజకీయాలంటే మహా ఆసక్తి. ఆమెకు రెండేళ్లప్పుడు తండ్రి బంగారప్ప ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ స్ఫూర్తితో 2014లో గీత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నిర్ణయాన్ని రాజ్కుమార్ భార్య పార్వతమ్మ వ్యతిరేకించారంటారు. తటస్థంగా ఉన్న కుటుంబాన్ని శివ రాజ్కుమార్, గీత వారి ఆకాంక్షల కోసం రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ఆమె ఆవేదన చెందినట్టు వార్తలొచ్చాయి. అయినా గీత పట్టించుకోలేదు. శివమొగ్గ లోక్సభ స్థానంలో జేడీ(ఎస్) అభ్యరి్థగా యడ్యూరప్పపై పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓటమితో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. సోదరుడు మధు బంగారప్ప కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు శివమొగ్గ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడ రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ రాఘవేంద్రతో తలపడుతున్నారు. ఆయన విజయ పరంపరకు బ్రేకులు వేస్తానని ధీమాగా చెబుతున్నారు!నీటి సమస్య పరిష్కారం తొలి ప్రాధాన్యత.. శివమొగ్గలో నీటి కొరత తీర్చడమే తన మొదటి ప్రాథమ్యమని చెబుతున్నారు గీత. ‘‘నా సోదరుడు, ఇతర ఎమ్మెల్యేల సహకారంతో అనేక సమస్యలను పరిష్కరిస్తా. కాంగ్రెస్ పథకాలు నా విజయానికి దోహదపడతాయి. ‘‘గెలవగానే బెంగళూరు వెళ్లిపోతానన్న బీజేపీ ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తా. శివమొగ్గలో నాకు ఇల్లుంది. ఇక్కడ ఉండకుండా ఎక్కడకు పోతాను? బీజేపీ ఇకనైనా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు మాని రైతులు, వెనకబడ్డ తరగతులు, ప్రజల కష్టాలపై మాట్లాడితే బాగుంటుంది. నేనెప్పుడూ నా బాధ్యతల నుంచి వెనక్కు తగ్గలేదు. శక్తిధామ్ సంస్థను చూసుకుంటున్నట్టుగానే శివమొగ్గ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తా. క్షేత్రస్థాయిలో వారికి అందుబాటులో ఉంటా’’ అని చెబుతున్నారు. భర్త శివరాజ్కుమార్ ప్రతిష్ట, తండ్రి బంగారప్ప మంచితనం, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన శివమొగ్గలో తనను గెలిపిస్తాయని నమ్మకముందంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
-
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
-
మనల్ని గెలిపించిన ప్రజలకు మంచి చేస్తే ఆ కిక్కే వేరు..
-
ప్రముఖ నటుడి కుమార్తె పెళ్లి.. మెరిసిన సినీతారలు!
ప్రముఖ మలయాళ నటుడు కుంజన్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న స్వాతి కుంజన్ అభినంద్ బసంత్ను పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వివాహానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్లాల్ కూడా హాజరయ్యారు. కాగా.. కుంజన్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. స్వాతి రెండో అమ్మాయి.మమ్ముట్టికి కుటుంబం కుంజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లికి మమ్ముట్టి తన భార్య సుల్ఫత్, దుల్కర్, కుమార్తె సురుమి కుటుంబంతో సహా వివాహానికి హాజరయ్యారు. కాగా.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్వాతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతికి నీతా అంబానీ హర్ సర్కిల్, ఫెమినాతో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్లపాటు దుబాయ్లో ఫ్యాషన్ షోలలో పనిచేశారు. అంతే కాకుండా నీతా అంబానీ, దీపికా పదుకొనే, అదితి రావ్ హైదరీ, సుస్సానే ఖాన్లతో కలిసి పనిచేశారు. -
ప్రముఖ నటుడి కుమార్తె పెళ్లి.. మెరిసిన సినీతారలు!
ప్రముఖ మలయాళ నటుడు కుంజన్ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తున్న స్వాతి కుంజన్ అభినంద్ బసంత్ను పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుకలో మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వివాహానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్లాల్ కూడా హాజరయ్యారు. కాగా.. కుంజన్ ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా.. స్వాతి రెండో అమ్మాయి.మమ్ముట్టికి కుటుంబం కుంజన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరి పెళ్లికి మమ్ముట్టి తన భార్య సుల్ఫత్, దుల్కర్, కుమార్తె సురుమి కుటుంబంతో సహా వివాహానికి హాజరయ్యారు. కాగా.. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో స్వాతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. స్వాతికి నీతా అంబానీ హర్ సర్కిల్, ఫెమినాతో పనిచేసిన అనుభవం ఉంది. రెండేళ్లపాటు దుబాయ్లో ఫ్యాషన్ షోలలో పనిచేశారు. అంతే కాకుండా నీతా అంబానీ, దీపికా పదుకొనే, అదితి రావ్ హైదరీ, సుస్సానే ఖాన్లతో కలిసి పనిచేశారు. -
పొలిటికల్ ఎంట్రీపై డీకేశివకుమార్ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: రాజకీయ రంగ ప్రవేశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య స్పందించారు. లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్లో భాగంగా ఐశ్వర్య శుక్రవారం(ఏప్రిల్26) బెంగళూరులో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు ఐశ్వర్య. ‘నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదు. నేను విద్యాసంస్థలు నడుపుతున్నాను. దేశం గర్వపడేలా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు వారి వారి రంగాల్లో పనిచేయాలి.బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన బాబాయి డీకే సురేష్కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. కాగా, 2019 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచింది డీకే సురేష్ ఒక్కరే కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 ఎంపీ సీట్లలో బీజేపీ ఏకంగా 25 సీట్లు గెలుచుకుంది. -
నాడు సుష్మా.. నేడు బన్సూరి.. 1996 తిరిగొచ్చిందా?
దేశంలో 18వ లోక్సభకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ ఓటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు అందరి దృష్టి రెండో దశ ఓటింగ్పైనే నిలిచింది. 12 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. అదే సమయంలో పలు లోక్సభ సీట్లకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే కోవలో న్యూఢిల్లీ సీటుకు జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారింది. సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి బీజేపీ తరపున ఈ సీటు నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె 1996లో తన తల్లి ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు చూస్తున్నారు.ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఈ స్థానాల్లో ఎవరు గెలుస్తారో వెల్లడికానుంది. ఈసారి బీజేపీ ఢిల్లీ నుంచి పోటీకి అవకాశం కల్పించిన కొత్త వారిలో మాజీ విదేశాంగ మంత్రి , బీజేపీ సీనియర్ మహిళా నేత, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఒకరు. న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలు న్యూఢిల్లీ నియోజకవర్గానికి అనుబంధంగా ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ స్థానానికి చెందిన ఎమ్మెల్యే. న్యాయవాది అయిన సుష్మా స్వరాజ్ తన తొలి లోక్సభ ఎన్నికల్లో ఓ లాయర్పై పోటీకి దిగారు. 1996లో దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి సుష్మా స్వరాజ్ బీజేపీ తరపున పోటీకి దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికల రంగంలోకి దూకారు. సుష్మా కుమార్తె బన్సూరి స్వరాజ్ కూడా వృత్తి రీత్యా న్యాయవాది. ఆప్ నుంచి ఎన్నికల బరిలో దిగిన న్యాయవాది సోమనాథ్ భారతితో ఆమె పోరుకు సిద్దమయ్యారు. సుష్మా స్వరాజ్ తొలిసారి లోక్సభ ఎన్నికల్లో ఎదుర్కొన్న పరిస్థితులనే ఇప్పుడు ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్కు ఎదురుకావడం యాదృచ్ఛికంగా జరిగింది. మరోవైపు నాడు సుష్మాపై కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన కపిల్ సిబల్కు అవే మొదటి ఎన్నికలు. ఇప్పుడు బస్సూరి స్వరాజ్పై ఆప్ తరపున పోటీ చేస్తున్న సోమనాథ్ భారతికి కూడా ఇవే తొలి లోక్సభ ఎన్నికలు కావడం విశేషం. -
నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే..
-
ప్రచారం లో దూసుకుపోతున్న కేశినేని నాని కూతురు
-
Shankar Daughter Reception Photos: శంకర్ కుమార్తె రిసెప్షన్ హైలైట్స్.. దిల్రాజు, సిద్దార్థ్, బేబమ్మ సహా ఎందరో.. (ఫోటోలు)
-
Hero Arjun Daughter Photos: వ్యాపారవేత్తగా రాణిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో కూతురు (ఫోటోలు)
-
కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు
డాక్టర్ ప్రిస్కిప్షన్ రాస్తూ... ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ, టీ లతో రోజును మొదలు పెట్టకండి’ అని చెబితే ఆ కఠోరమైన సూచనను జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. డాక్టర్ ముందు బుద్ధిగా తలూపుతాం. పాటిస్తామని గొంతులో నిజాయితీని ధ్వనింపచేస్తూ బదులిస్తాం. మరునాడు తెల్లవారి కాఫీ–టీలు తాగిన తర్వాతగానీ ముందురోజు డాక్టర్కు ఇచ్చిన మాట గుర్తు రాదు. ఇదంతా మన బ్రెయిన్ మనతో ఆడుకునే ఆటలో భాగం. అయితే ఈ డాక్టర్ మాత్రం టీ వద్దనే వద్దని చెప్పనే చెప్పరు. ‘హాయిగా టీ తాగండి. దేహానికి హాయినిచ్చే తాజా ఔషధ ఆకులతో చేసిన టీని తాగండి’ అంటూ ఒక పెద్ద జాబితానే సూచిస్తారు. అవన్నీ ఇంట్లో సాధ్యమే అంటూ తన ఇంటి టెర్రస్ను చూపిస్తారీ ఉత్తరాఖండ్ డాక్టర్ అన్షు రాఠీ. ఆమె టెర్రస్ మీద 1500 అడుగుల విస్తీర్ణం కలిగిన టెర్రస్ మీద మిరియాలు, యాలకుల చెట్లతో సహా 400 మొక్కలను పెంచుతున్నారు. అందులో పండ్లు, కూరగాయలతో పాటు అశ్వగంధ, తులసి, ఆరెగానో, పసుపు, మిరియాలు, కుంకుమ పువ్వు, లవంగాలు, జాజికాయ, సోంఫు, మెంతులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంగువ, మిర్చి, కొత్తిమీర, కలోంజి (నల్ల జీలకర్ర) వంటి 15 రకాల ఔషధ మూలికల మొక్కలున్నాయి. ఏడాదంతా సీజనల్గా వచ్చే అనేక అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే... ఆయా కాలాల్లో ప్రకృతి ఇచ్చిన ఔషధాలను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు 36 ఏళ్ల అన్షురాఠీ. నేర్చుకోండి... పచ్చగా పెంచుకోండి! ‘‘మనదేశంలో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది. ప్రదేశాలు, కాలాలను బట్టి ఆయా నేలల్లో కొన్ని ప్రత్యేకమైన జాతులు విస్తరిస్తుంటాయి. వాటికి అనువైన పరిస్థితులను అంచనా వేయగలిగితే వాటన్నింటినీ ఒకే చోట పెంచవచ్చు. కొత్తిమీర, మిరియాలు, జీలకర్రలను పెంచాలంటే అక్టోబర్-నవంబర్ నెలల్లో నారు పోయాలి. పసుపును మే-జూన్ నెలల్లో నాటాలి. నాటడం నుంచి ప్రతి దశనూ ఆస్వాదించాలంటే అలా చేయవచ్చు. గార్డెనింగ్లో అనుభవం లేని వాళ్లు మాత్రం నారుమడిలో గింజలు చల్లడం నుంచి మొదలు పెట్టకుండా నర్సరీ నుంచి నారు మొలకలను కొనుక్కోవడం మంచిది. మిరియాలు, యాలకుల వంటి వాటిని నాటేముందు రాత్రంతా నానబెట్టాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలను నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నాటే పంటల కాల వ్యవధిని కూడా గమనించుకోవాలి. కొత్తిమీర రెండు వారాల్లో చేతికొస్తుంది, మెంతికి నాలుగు రోజులు చాలు. జీలకర్ర నారు 45 రోజులు తీసుకుంటుంది. ముందుగా ఒక కప్పులో నారు పోసి మొలకలు వచ్చిన తర్వాత ఆ నారు తీసి పెద్ద కుండీలు లేదా ట్రేలలో నాటాలి. ఈ ట్రేలను ఓ వారం రోజుల పోటు నీరెండలో ఉంచి ఆ తర్వాత ఎండలోకి మార్చాలి. View this post on Instagram A post shared by 🦋Dr. Rathi Anshu / Sustainability/Plant care tips , DIY, Decor (@myplantsmygarden) జీలకర్ర, కొత్తిమీర (ధనియాలు రావడానికి) పంట రావడానికి ఐదు నెలలు పడుతుంది. మిరియాలు మూడేళ్లు, యాలకులు ఐదేళ్ల సమయం తీసుకుంటాయి. మొక్కలు పెంచడంలో మట్టిని పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. మనం ఉన్న ప్రదేశంలో లభించే మట్టి స్వభావాన్ని గమనించుకోవాలి. మట్టిని పట్టుకుని ముద్ద చేసినప్పుడు సులభంగా బంతి ఆకారం వస్తే ఆ మట్టి జిగురుగా ఉన్నట్లు. అందులో 20 శాతం ఇసుక, 30 శాతం ఆవుపేడ, వేప పిప్పి కల΄ాలి. ఇలా తయారు చేసుకున్న మట్టిలో నాటిన మొక్కలకు తరచు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పంటకోతకు రావడానికి రెండువారాల ముందు వర్మీ–కంపోస్టు వేస్తే సరిపోతుంది. నేనున్నది గంగా నది–యమునా నదికి మధ్య విస్తరించిన నేల. ఇక్కడ మట్టి... మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలేవీ అవసరం లేదు. వంటగది వ్యర్థాలనే ఎరువుగా వేస్తున్నాను. వీటన్నింటినీ సొంతంగా పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంత సమయం, మరికొంత శ్రద్ధ ఉంటే చాలు. ఉదయాన్నే అరలీటరు నీటిలో తులసి, మెంతితోపాటు నచ్చిన తాజాఆకులను వేసుకుని పావు లీటరు అయ్యే వరకు మరిగించి రుచి కోసం తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కోసం ప్రయాస పడాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ఫార్మసీ, మీరే వైద్యులు’’ అని ఆరోగ్యం కోసం ఔషధాలను కప్పులో పోసి ఇస్తున్నారు డాక్టర్ అన్షు రాఠీ. -
Aishwarya Wedding Reception: డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి రిసెప్షన్లో సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావ్: సింగర్ చిత్ర ఎమోషనల్
ప్రముఖ సింగర్ చిత్ర తన కుమార్తె నందన వర్ధంతి సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా తన కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నువ్వు నాతో భౌతికంగా లేనప్పటికీ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావని ఎమోషనలైంది. నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటావంటూ ట్వీట్ చేసింది. కాగా సింగర్ కేఎస్ చిత్ర ప్రముఖ సింగర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోను పాటలు పాడారు. నాలుగు దశాబ్దాల సినీ సంగీత ప్రయాణంలో దాదాపు 25 వేలకు పైగా పాటలు ఆలపించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో ఆమె పనిచేశారు. సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్ర విజయ్ శంకర్ అనే ఒక ఇంజినీర్ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 18 డిసెంబర్ 2002లో వీరికి నందన అనే అమ్మాయి జన్మించింది. నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు 2011లో ఓ కచేరిలో పాల్గొనేందుకు చిత్ర దుబాయ్ వెళ్లారు. అదే సమయంలో నందన స్విమ్మింగ్ పూల్లో పడి మరణించింది. #Nandana pic.twitter.com/mImedLHMdv — K S Chithra (@KSChithra) April 14, 2024 -
త్రయంబకేశ్వర్ శివాలయం లో రవీనా టాండన్, కూతురు రాషా తడాని (ఫొటోలు)
-
కసాయి తల్లి.. కన్న పిల్లల్నే చంపేసి..
కర్ణాటక: నవమాసాలు మోసి కని పెంచిన పిల్లలను ఓ తల్లి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటన బెంగళూరు జాలహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంగాదేవి తన ఇద్దరు పిల్లలైన లక్ష్మీ (9), గౌతమ్ (7)లను చంపేసి పోలీస్ సహాయవాణికి ఫోన్ చేసి చెప్పింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్కు చెందిన గంగాదేవి కుటుంబం కొన్నేళ్ల క్రితం వలసవచ్చి జాలహళ్లిలో నివాసం ఉంటుంది. ఆమె ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేసేది, ఆమె భర్త బీబీఎంపీ కాంట్రాక్టు పౌర కార్మికుడు. గత నెలలో భర్తపై గంగాదేవి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కిందకేసు నమోదు చేసి అరెస్ట్చేశారు. ఇద్దరు పిల్లలతో మంగళవారం ఉగాది పండుగ చేసుకున్న గంగాదేవి అర్ధరాత్రి ఇద్దరు పిల్లలను దిండుతో ఉపిరాడకుండా చేసి హత్యచేసింది. రాత్రి 1 గంట సమయంలో పోలీస్ సహాయవాణికి ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతోంది, రావాలని కోరింది. జాలహళ్లి పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా, పిల్లలను తానే చంపానని ఆమె చెప్పిందని ఉత్తర విభాగం డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. భర్తతో గొడవలు, ఆర్థిక సమస్యల వల్ల మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహిళను జాలహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
Hariteja: హరితేజ కూతురు ఎంత క్యూట్గా ఉందో! (ఫోటోలు)
-
ఉగాది వేడుకల్లో మెగాస్టార్ మనవరాలు నవిష్క (ఫొటోలు)
-
ప్రముఖ నటుడి ఇంట పెళ్లి.. డాక్టర్ వెడ్స్ ఇంజనీర్!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్ కూతురు, డాక్టర్ ఐశ్వర్వ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో ఇంజనీర్గా పనిచేస్తున్న రోహిత్ను పెళ్లాడింది. తిరువనంతపురంలోని ప్రముఖ క్లబ్లో ఐశ్వర్య, రోహిత్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు మలయాళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఐశ్వర్య. తమది ప్రేమ వివాహం కాదని.. రోహిత్ను మ్యాట్రిమోనీ సైట్లో చూసి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అతని తల్లిదండ్రులు కేరళలోని పాతానంతిట్టకు చెందినవారు కాగా.. రోహిత్ పంజాబ్లో పుట్టి పెరిగారని తెలిపింది. నేను అతనితో ఒక్కసారి మాట్లాడాక.. నన్ను అర్థం చేసుకోగలడని అనిపించిందని ఐశ్వర్య పేర్కొంది. మరోవైపు పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె మలయాళంలో పేరున్న నటుడి కూతురన్న విషయం తనకు తెలియదని రోహిత్ చెబుతున్నాడు. ఐశ్వర్య- రోహిత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బైజు సంతోష్కు ఐశ్వర్య పెద్దకూతురు. ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె పెళ్లికి ప్రియదర్శన్, షాజీ కైలాస్, అన్నీ, మేనక, సోనా నాయర్, కలడి ఓమన, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. కాగా.. బైజు సంతోష్ మలయాళంలో మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ లూసిఫర్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్గా రీమేక్ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించారు. View this post on Instagram A post shared by Binzu Gopalan - Makeupartist (@binzugopalan) View this post on Instagram A post shared by MoonWedlock Wedding Company (@moonwedlock) -
అప్పుడే రెండేళ్లు.. ‘బాపూ బొమ్మ’ కూతురు ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
బాధంతా నీ ఒక్కదానిదే కాదమ్మా..నేనూ నీతోనే : కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
కేన్సర్ పేషెంట్ల చికిత్స చాలా క్లిష్టం. ఈ వ్యాధిని ఎదుర్కోవడం ఎలా అనేది ఒక ఎత్తు అయితే, కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ను భరించడం మరో ఎత్తు. ఒక విధంగా చెప్పాలంటే మామూలు వారు ఈ ఆలోచన భరించడమే కష్టం. కానీ కేన్సర్ సోకిన వారు కచ్చితంగా ఫేస్ చేయాలి. అనేక శారీరక బాధలను భరించాలి. ధైర్యంగా నిలడాల్సిందే. ముఖ్యంగా ఎంత పెద్ద జుట్టు అయినా, కుచ్చులుగా కుచ్చులుగా ఊడిపోతోంది. బోడిగుండు అయిపోతుంది. వీటి అన్నింటినీ తట్టుకోని బైటపడాలంటే చాలా మానసిక స్థయిర్యం కావాలి. ఈ మొత్తం ప్రక్రియలో చికిత్సం అందించే వైద్యులు, నర్సులుతో, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు అందించే సపోర్ట్ చాలా కీలకం. దీనికి సంబంధించిన ఒకటి ట్విటర్లో ఒకటి నెటిజన్ల కంట తడి పెట్టిస్తోంది. (సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!) ముఖ్యంగా కీమోథెరపీ తరువాత జుట్టు ఊడిపోతున్న క్రమంలో చాలామంది రోగులు ముందుగానే తమ హెడ్ షేవ్ చేసుకుంటా ఉంటారు. ఈ క్రమంలో కేన్సర్ బారిన పడి తల్లి తన జుట్టును మొత్తం తీసివేయించుకనేందుకు పార్లర్కు వెళ్లింది. అంతా సిద్దమైన తరువాత ఆమె కుమార్తె వచ్చి అనూహ్యంగా హెయిర్కటింగ్ టూల్ను తీసుకొని తన జుట్టును కట్ చేసుకుటుంది. దీన్ని గమనించిన తల్లి కన్నీంటి పర్యంతమవుతుంది. ‘‘నేను నీతోనే.. అమ్మా... నువ్వు ఒంటరివి కాదు’’ అన్నట్టు తల్లిని హత్తుకుంటుంది. ట్విటర్లో షేర్ అయిన ఈ వీడియో మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. (అన్నీ ఎదురుదెబ్బలే, 4 సార్లు ఫెయిల్ : సక్సెస్ చేయి అందుకుంది) “Mom, you don’t have to go through this alone”🥺❤️ pic.twitter.com/fsdTasZAWt — non aesthetic things (@PicturesFoIder) March 29, 2024 -
Actor Vivek Daughter Marriage: దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి (ఫొటోలు)
-
బాలీవుడ్లో రిచెస్ట్ స్టార్ కిడ్.. ఏకంగా షారుక్, అమితాబ్ను మించి!
గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన హీరో రణ్బీర్ కపూర్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే రణ్బీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు రాహా కపూర్ అనే ముద్దుల కూతుకు కూడా ఉన్నారు. అయితే ఈ జంట తమ ముద్దుల కూతురి ఖరీదైన గిఫ్ట్ను ఇచ్చినట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఓ నివేదిక ప్రకారం లగ్జరీ బంగ్లాను నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. అది పూర్తయితే ముంబైలోనే అత్యంత ఖరీదైన బంగ్లాగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నారు. ఇది పూర్తయితే షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాలతో పోలిస్తే అత్యంత ఖరీదైన సౌధంగా నిలవనుంది. రిచెస్ట్ స్టార్ కిడ్.. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ బంగ్లాలో బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్, అలియా భట్తోపాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు. ఆ బంగ్లాకు రణ్ బీర్ తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఏడాది వయసులోనే రాహా కపూర్ బాలీవుడ్లో అత్యంత పిన్న వయసులో ధనవంతురాలిగా గుర్తింపు దక్కించుకోనుంది. రణ్బీర్, ఆలియా తమ కూతురి కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు వీరికి ముంబైలో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటి విలువ రూ. 60 కోట్లకు పైగానే ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ బంగ్లాకు రాహా నానమ్మ నీతూ కపూర్ సహ-యజమానిగా ఉంటారని తెలుస్తోంది. ఆమె ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బంగ్లా పూర్తయిన తరువాత నీతూ కపూర్తో సహా ఫ్యామిలీ మొత్తం ఇదే బంగ్లాలో ఉండనున్నారని సమాచారం. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు అనే ప్రాంతంలో ఉంటున్నారు. -
శ్రీవారి సేవలో వెంకటేశ్ కూతురు.. భర్తతో కలిసి తొలిసారి!
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లో రామానాయుడులో జరిగిన పెళ్లికి బంధువులు, సన్నిహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరిని ఆమె పెళ్లాడారు. తాజాగా కొత్త జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి తర్వాత తొలిసారిగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త జంటకు వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదంతో పాటు నూతన దంపతులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రపతి కూతురు.!
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఏ క్షణంలోనైనా జాబితా వెలువడుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మయూర్భంజ్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఈసారి తన అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బిశ్వేశ్వర్ టుడుని బీజేపీ ఈసారి బరిలోకి దింపే అవకాశం లేనట్లు సమాచారం. మళ్లీ నామినేట్ చేసే అవకాశం లేదు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల ఇతిశ్రీని పోటీకి దింపాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ నేతలు ఈ విషయమై గుంభనం ప్రదర్శిస్తున్నారు. ఇతిశ్రీ తన తల్లి ద్రౌపది ముర్ము అత్యున్నత పదవిని చేపట్టినప్పటి నుంచి తరచూ ఒడిశా పర్యటనలు చేస్తున్నారు. తల్లి పరపతి, పలుకుబడి కుమార్తె అభ్యర్థిత్వానికి పట్టం గట్టే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికల పోరులో ఇతిశ్రీ ఆరంగేట్రం చేయడం రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఓటర్లకు ప్రత్యేక సందేశం ఇస్తుందని భావిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో గిరిజన వర్గం ఓటర్లు 22 శాతానికి పైబడి ఉన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత ఒడిశాలో గిరిజనుల జనాభా అధికంగా ఉంది. ద్రౌపది ముర్ముకు సర్వోన్నత రాష్ట్రపతి పట్టం గట్టడం ద్వారా గిరిజనుల సాధికారత పట్ల బీజేపీ ఇప్పటికే తన నిబద్ధతను ప్రదర్శించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బిశ్వేశ్వర్ టుడు 25,256 ఓట్ల ఆధిక్యతతో బిజూ జనతా దళ్ (బీజేడీ) అభ్యర్థి దేబాషిస్ మరాండిపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. జయపురం: అధికార బీజేడీ తరఫున పోటీచేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎలాగైనా టికెట్ పొందేందుకు పైరవీ ప్రారంభించారు. జయపురం సబ్ డివిజన్లో ఎస్టీలకు కేటాయించి కొట్పాడ్ నియోజకవర్గంలో అధికార బీజేడీ తరఫున టికెట్ పొందేందుకు సిటింగ్ ఎమ్మెల్యే పద్మిణీ ధియాన్, మాజీ ఎమ్మెల్యే, జిల్లా స్వతంత్ర పరిషత్ అధ్యక్షుడు చంద్రశేఖర మఝి పోటీపడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేడీ తరఫున పోటీలోకి దిగిన పద్మిణీ దియాన్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర మఝిపై 2631 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సీఎం నవీన్ పట్నాయక్ మంత్రి మండలిలో కొలువు సాధించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కొట్పాడ్లో ఆమె విజయం సాధించడం వల్లే ఆమెను మంత్రి పదవి వరించినట్లు పరిశీలకులు చెబుతారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి 31,321 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన చంద్రశేఖర మఝి.. 2019లో కేవలం 2631 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేడీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో బీజేడీ తరఫున టికెట్ ఇస్తామనే హామీ ఉండటం వల్లే పార్టీలో చేరినట్లు కొందరి మాట. తన మాదిరిగానే కాంగ్రెస్ను వీడి బీజేడీలో చేరిన మాజీ ఎంపీ ప్రదీప్ మఝిఎంపీ టికెట్ ఇస్తారని, ఈసారి సిటింగ్ ఎంపీ రమేష్ మఝి మొండిచెయ్యి తప్పదనే ప్రచారం జరగుతోంది. అయితే సిటింగ్ ఎమ్మెల్యే అయిన తనకే కచ్చితంగా టికెట్ వస్తుందని పద్మిణీ దియాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరిలో టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె!
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా రాణి ఏప్రిల్ 19న తమిళనాడులో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి (ఎన్టీసీ) టికెట్పై ఆమె కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి జూలై 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గానూ పనిచేశారు. ఇటీవల ఆమె నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే పార్టీలో చేరారు తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 40 మంది అభ్యర్థులను ఎన్టీకే నేత సీమాన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణగిరి నుంచి ఎన్టీకే అభ్యర్థిగా విద్యా రాణి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మొత్తం 40 మంది ఎన్టీకే అభ్యర్థుల్లో సగం మంది మహిళలేని తెలిపారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి కృష్ణగిరిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు. ఆమె తన తండ్రి వీరప్పన్ను ఒకే ఒక్కసారి కలిశారట. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యా రాణి తెలిపారు. తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్లోని తాతయ్య ఇంట్లో తన తండ్రిని మొదటిసారిగా, చివరిసారిగా చూశానని తెలిపారు. -
అలసిపోయిన అమ్మకు ఇలాంటి బిడ్డ ఒక్కరుంటే చాలు
కుంచమంత కూతురు ఉంటే..మంచం దగ్గరికే అన్నీ చేరతాయనేది సామెత. నిజంగా ఒక ఇంట్లో ఆడపిల్ల ఉంటే తల్లికి, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. బుడ్జి బుడ్జి చేతులతో చిన్ని చిన్ని పనులు చేస్తూ అమ్మల్ని మురిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. డాటర్స్ ఆర్ బెస్ట్ అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. చిన్న బిడ్డతో, ఇతర పనులతో అలిసిపోయి నిద్రలోకి జారుకున్న అమ్మను చూసిన ఓ చిన్నారి వెంటనే రంగంలోకి దిగిపోయింది. తల్లి నిద్ర చెడకుండా, చిందరవందరగా ఉన్న ఇల్లంతా చక్కగా సర్దేస్తుంది. అంతేకాదు ఉయ్యాలలో ఉన్న పాపాయిని కూడా ఒళ్లోకి తీసుకొని కూచుంటుంది. కాసేపటికి మెలకువ వచ్చి ఆ తల్లి, బిడ్డ చేసిన పనికి పరవశురాలై, ఆత్మీయంగా హత్తుకుని, ముద్దు పెట్టుకోవడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. What a wonderful daughter. ❤️pic.twitter.com/fCDRi8j1mS — मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) March 18, 2024 నిజానికి ముద్దార నేర్పించాలే గానీ, ఆడ,మగా అనే తేడా లేకుండా అన్ని పనుల్లో అమ్మానాన్నలకు తోడుగా ఉంటారు పిల్లలు. ప్రస్తుతం సమాజంలో ఇది చాలా అవసరం కూడా. పనులు పంచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత చిన్నతనంలోనే ఆ విలువ తెలుసుకుంటే.. ఆ ఇల్లు ఆనంద హరివిల్లు అవుతుంది. -
ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ కుమార్తె
రాబోయే లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య, సమాజ్వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ మెయిన్పురిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిలేష్, డింపుల్ల కుమార్తె అదితి యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మెయిన్పురి నుంచి డింపుల్ యాదవ్కు సమాజ్వాదీ పార్టీ లోక్సభ టిక్కెట్ కేటాయించింది. ములాయం సింగ్ యాదవ్ వారసత్వాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు డింపుల్ తీసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు ములాయం సింగ్ను ‘దాదా’ అని పిలిచేవారు. మెయిన్పురి సీటు 1996 నుంచి సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. మెయిన్పురిలో డింపుల్ యాదవ్తో కలిసి అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ కనిపించారు. సమాజ్వాదీ పార్టీ డింపుల్ యాదవ్కు మెయిన్పురి స్థానం నుంచి మరోమారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ములాయం సింగ్ మరణానంతరం డింపుల్ ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మెయిన్పురి ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు డింపుల్ గెలుపు అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. యూపీలో నూతన రామాలయం ప్రారంభమైన నేపధ్యంలో ఇది సమాజ్వాదీ పార్టీ ఓటు బ్యాంకును తగ్గిస్తుందని పలువురు అంటున్నారు. ములాయంను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మెయిన్పురి ప్రజలకే దక్కుతుంది. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు. తేజ్ ప్రతాప్, ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంటు సభ్యులయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మెయిన్పురి జిల్లాలో 93.48 శాతం హిందూ జనాభా ఉంది. ఇక్కడ యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. 2019లో ఇక్కడ 17.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యూపీలో ముస్లిం, యాదవ్ వర్గాలను సమాజ్వాదీ పార్టీ సంప్రదాయ ఓటర్లుగా పరిగణిస్తారు. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయం సింగ్ ప్రభావం కారణంగా సమాజ్ వాదీ పార్టీ రెండు దశాబ్దాలుగా ఈ స్థానంలో తన హవా చాటుతోంది.