district court
-
అమెరికా జన్మతః పౌరసత్వంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు
వాషింగ్టన్: వలసవచ్చిన వారికి అమెరికా గడ్డపై పుడితే వచ్చే జన్మతః పౌరసత్వ హక్కును ట్రంప్ ఒక్క ఉత్తర్వుతో తొలగించడాన్ని విపక్షపాలిత రాష్ట్రాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ విషయంపై 22 రాష్ట్రాలు మంగళవారం కోర్టును ఆశ్రయించాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. విపక్ష డెమొక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఫెడరల్ జిల్లా కోర్టుల్లో వేర్వేరుగా రెండు దావాలు వేశాయి. 22 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ నగరాలు కలిపి మసాచుసెట్స్లోని ఫెడరల్ డిస్టిక్ట్ర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణప్రకారం జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్గా అమలవుతుందని వాదించాయి. అధ్యక్షుడిగానీ పార్లమెంట్లోని ప్రజా ప్రతినిధులసభ(దిగువ సభ) లేదంటే సెనేట్(ఎగువ సభ)కు కూడా ఈ హక్కు విషయంలో సవరణలు చేసే అధికారం లేదని వాదించాయి. మిగతా నాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్లోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. మీకు ఉన్న ‘తాత్కాలిక నిలుపుదల’, ‘ముందస్తు ఆదేశం’అధికారాలను ఉపయోగించి అధ్యక్షుడి ఉత్తర్వు అమలుకాకుండా అడ్డుకోండి’’అని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ష్ట్రాలు అభ్యర్థించారు. ‘‘పుట్టగానే పౌరసత్వం రాదు అని ప్రకటించడమంటే మీరంతా అమెరికన్లు కాబోరు అని వివక్షచూపడమే’’అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా వాదించారు. ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావంచూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం’’అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ‘‘ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే’’అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ట్రంప్ ఉత్తర్వుపై వలసదారుల హక్కుల సంఘాల కూటమి కోర్టులో దావావేసింది. -
వివేకా హత్యపై దుష్ప్రచారం ఆపండి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిలపైన దుష్ప్రచారం చేయొద్దని కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తదితరులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్రెడ్డిల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తేల్చిచెప్పింది. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే మాట్లాడాలని కుండబద్దలు కొట్టింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, షర్మిల, సునీత తదితరులు తాము చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది. వీరు సీఎం వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్రెడ్డిలపై దుష్ప్రచారం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. రాజకీయంగా మైలేజీ కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు, మీడియా పబ్లిక్ కోర్టుగా అవతరించి న్యాయపాలనలో జోక్యం చేసుకుంటున్నాయని కడప జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి రెండు రోజుల క్రితం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు, వక్రీకరణలు ఆపండి.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ధ్రువీకరణ కాని ఆరోపణలతో, వక్రీకరణలతో వ్యక్తిగత దాడులు, విమర్శలు చేయడం మానాలని కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలను, వారి పార్టీల క్యాడర్ను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్లో ఉందని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాశ్రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయా పార్టీల అధినేతలను, అనుచరులకు కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్రెడ్డిని వైఎస్ జగన్ రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేల్చిచెప్పింది. వ్యక్తిగత విమర్శలు మాని తమ పార్టీల ఎజెండాలపైన, ఇతర పార్టీల వైఫల్యాలపైన దృష్టి సారించాలని వారికి కోర్టు హితవు పలికింది. వివేకా హత్య కేసులో జగన్ నిందితుడు కాదన్న విషయాన్ని గుర్తెరగాలంది. రాజకీయ మైలేజీ కోసమే జగన్, అవినాశ్లపై.. షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు వ్యాఖ్యలు చేశారంది. ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా పరువు నష్టం కలిగించేవేనని తేల్చిచెప్పింది. అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి.. వాదనలు విన్న జిల్లా జడ్జి శ్రీదేవి పిటిషనర్ వాదనలతో ఏకీభవించారు. వాక్ స్వాతంత్య్రం సహేతుక పరిమితులకు లోబడి ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఓ వ్యక్తి ప్రతిష్టను, మంచితనాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం ఆ స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ‘వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్లో ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా షర్మిల, చంద్రబాబు, లోకేశ్ ప్రజల ముందు వైఎస్సార్సీపీ, దాని అధినేత వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తదితరులపై తప్పుడు, పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారనేందుకు, అసభ్యంగా పరిహాసం చేస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. వారి మాటలను, వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు పదే పదే ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ముఖ్యంగా అవినాశ్రెడ్డిని హంతకుడిగా పేర్కొన్నారు. ఆయనను సీఎం జగన్ రక్షిస్తున్నారని పేర్కొన్నాయి.’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతరులు సొంత తీర్పులివ్వరాదు.. ‘పౌర హక్కుల దురాక్రమణను నిరోధించడానికి, నిందితుల హక్కులను కాపాడేందుకు, మీడియా ప్రవర్తనకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే విషయంలో సరైన నిబంధనలు లేవు. ఓ వ్యక్తి అరెస్ట్ సమయంలో అతడిని దోషిగా నిర్ధారించే ట్రెండే ప్రస్తుతం కొనసాగుతోంది. రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు, మీడియా ఉన్నది ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే తప్ప, తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా తీర్పులు ఇచ్చేందుకు ఎంతమాత్రం కాదు. ప్రస్తుత కేసులో ఈ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, వీడియోలు, పత్రికా కథనాలను విశ్లేషిస్తే.. బహిరంగంగా వైఎస్ అవినాశ్రెడ్డిని హంతకుడిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆయనను వైఎస్ జగన్ రక్షిస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఓ కేసు కోర్టు ముందు పెండింగ్లో ఉన్నప్పుడు.. ఎవరూ కూడా తమ సొంత తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. ఆ అధికారం ఎవరికీ లేదు. అలాంటి కేసులో ఉన్న వ్యక్తిని తమ ఇష్టానుసారం హంతకుడిగా, దోషిగా ప్రకటించడానికి వీల్లేదు. నిష్పాక్షిక ట్రయల్ నిర్వహించి నిందితుడిని దోషిగా నిర్ధారించేంత వరకు ఆ వ్యక్తి అమాయకుడే అన్నది న్యాయ సూత్రం. ఓ వ్యక్తి నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పైన మాత్రమే ఉంది. పెండింగ్లో ఉన్న కేసు గురించి మూడో వ్యక్తి ఎవరూ కూడా తమ తప్పుడు ప్రయోజనాల కోసం బహిరంగంగా మాట్లాడటం, వ్యాఖ్యలు చేయడం, తీర్పులిచ్చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని జడ్జి శ్రీదేవి తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చంద్రబాబు ప్రోద్భలంతో వైఎస్ వివేకా హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, సునీత తదితరుల దుష్ప్రచారంపై విసిగిపోయిన వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. తమ పార్టీతో పాటు సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్రెడ్డి, తదితరులపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతలను నిరోధించాలంటూ కడప జిల్లా కోర్టులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున ఎం.నాగిరెడ్డి, కె.ఎస్.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరులు చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను, తప్పుడు ఆరోపణల వీడియోలను న్యాయవాదులు కోర్టు ముందుంచారు. కోర్టు ప్రొసీడింగ్స్లో మీడియా, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి ‘రాజకీయ పార్టీలు మీడియా ద్వారా పబ్లిక్ కోర్టుగా అవతరించాయి. అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు సొంతంగా దర్యాప్తు చేసేస్తున్నాయి. తద్వారా కోర్టు ప్రొసీడింగ్స్లో జోక్యం చేసుకుంటున్నాయి. నిందితుడు, దోషికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించాయి. దోషిగా నిర్ధారణ అయ్యేవరకు నిరపరాధే అనే సూత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కోర్టులు కేసును విచారణకు స్వీకరించడానికి ముందే నిందితులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలుస్తున్నాయి. ఇది ప్రజలపై, జడ్జీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తత్ఫలితంగా అమాయకుడైన నిందితుడిని నేరస్తుడిగా చూడాల్సి వస్తోంది. నిందితుల హక్కులు, స్వేచ్ఛను పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ట్రయల్కు ముందు ఓ అనుమానితుడు, నిందితుడు విషయంలో మీడియా సాగించే పరిమితికి మించిన ప్రతికూల ప్రచారం ట్రయల్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తద్వారా అతడే నేరం చేశాడని భావించాల్సి వస్తోంది. ఇలా చేయడం న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని ఆపండి.. ఎన్నికల ప్రచారంలో షర్మిల తదితరులు వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అవినాశ్రెడ్డిని ఏకంగా హంతకుడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. చంద్రబాబు కూడా ప్రొద్దుటూరు సభలో వివేకాను హత్య చేసిన వ్యక్తిని ఎంపీగా నిలబెట్టారంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇక లోకేశ్ అయితే నేరుగా ముఖ్యమంత్రి జగనే తన బాబాయి వివేకాను హత్య చేశారని ఆరోపించారన్నారు. పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జగన్, అవినాశ్, వైఎస్సార్సీపీపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయా పార్టీల అధినేతలను, క్యాడర్ను నిరోధించాలన్నారు. రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్, అవినాశ్పై వ్యాఖ్యలు.. ‘ప్రస్తుత కేసులో షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, బీటెక్ రవి వారి రాజకీయ మైలేజీ కోసం వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్ ఎన్నడూ కూడా నిందితుడు కాదు. కాబట్టి వివేకాను జగన్ చంపారంటూ ప్రజలందరి ముందు లోకేశ్ చేసిన ప్రకటన పరువు నష్టం కలిగించేదే. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కోర్టు ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వుల వల్ల షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే వైఎస్సార్సీపీ, జగన్, అవినాశ్ రెడ్డిలకు తీరని నష్టం కలుగుతుంది. ఇదే సమయంలో షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు పదే పదే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల వేళ ఇది వైఎస్సార్సీపీ, ఎన్నికల్లో పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు తీరని నష్టం కలిగిస్తుంది. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించా’ అని జిల్లా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
Gyanvapi: కోర్టుకు చేరిన జ్ఞానవాపి సర్వే నివేదిక
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను సోమవారం ఏఎస్ఐ(ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు సీల్డు కవర్లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈ నెల 21న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న 17వ శతాబ్ధం నాటి మసీదును అప్పట్లో ఉన్న ఆలయంపైనే నిర్మించారంటూ అందిన పలు పిటిషన్లపై కోర్టు సర్వే చేపట్టాలని జూలైలో ఆదేశించిన విషయం తెలిసిందే. సర్వే నివేదిక ప్రతులను ముస్లిం పక్షం వారికి కూడా ఏఎస్ఐ అధికారులు అందజేసినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. తదుపరి విచారణ 21న ఉంటుందని కోర్టు పేర్కొందని తెలిపారు. సర్వే నివేదిక వివరాలను బహిర్గతం చేయరాదంటూ ముస్లిం పక్షం కోర్టులో వేసిన పిటిషన్ను తాము సవాల్ చేస్తామన్నారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల శిల్పాల వద్ద పూజలు చేసేందుకు అనుమతించాలంటూ కొందరు మహిళలు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జూలై 21న జిల్లా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నిర్మాణాలకు ఎటువంటి నష్టం కలగని రీతిలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని ఏఎస్ఐకి పురమాయించింది. ‘మసీదు గోపురాలు, సెల్లార్లు, పశ్చిమ దిక్కు గోడ కింద సర్వే చేయాలి. పిల్లర్ల వయస్సును నిర్ధారించాలి. భవనం రీతిని విశ్లేషించాలి’అని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా చుక్కెదురైంది. ఏఎస్ఐ అధికారులు సకాలంలో సర్వేను పూర్తి చేయలేకపోవడంతో కోర్టు ఆరు పర్యాయాలు గడువును పొడిగించింది. కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా కేసు విచారణ వాయిదా ప్రయాగ్రాజ్: మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై వచ్చే జనవరి 9వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. దీంతో, సర్వే కమిషన్ విధివిధానాలు, కూర్పుపై సోమవారం జరగాల్సిన విచారణను హైకోర్టు వాయిదా వేసింది. హిందూ ఆలయంపైనే మసీదును నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయంటూ కొందరు వేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. మసీదు సర్వేను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించేందుకు అంగీకరించింది. -
Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు
వారణాసి(యూపీ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజుల గడువును వారణాసి జిల్లా కోర్టు మంజూరుచేసింది. నవంబర్ 17(శుక్రవారం)లోగా సర్వే వివరాలను నివేదించాలని గతంలో ఆదేశించగా మరో 15 రోజుల గడువుకావాలంటూ శుక్రవారం కోర్టును ఏఎస్ఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు. టెక్నికల్ రిపోర్ట్ ఇంకా అందుబాటులో లేని కారణంగా గడువును పెంచాలని ఏఎస్ఐ కోరడంతో జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నవంబర్ 28 వరకు గడువు ఇచ్చారని హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. ఆలయ పురాతన పునాదులపైనే 17వ శతాబ్దంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే చేపట్టిన విషయం తెల్సిందే. ఆగస్టు నాలుగో తేదీన నివేదిక సమర్పించాలని మొట్టమొదటిసారిగా కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణల సందర్భంగా గడువు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా గడువును జిల్లా కోర్టు నవంబర్ 28గా నిర్దేశించింది. ‘న్యాయం జరగాలంటే సర్వే జరగాల్సిందే’ అంటూ వారణాసి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో ఈ సర్వే ప్రక్రియకు తొలి అడుగు పడింది. -
జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వే పూర్తి
లక్నో: వారణాసి జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు సర్వే(ఏఎస్ఐ Archaeological Survey of India) చేపట్టిన సర్వే పూర్తైంది. అయితే.. నివేదికను సమర్పించేందుకు ఏఎస్ఐ గడువు కోరడంతో నవంబర్ 17వ తేదీదాకా వారణాసి కోర్టు సమయం ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వడానికి భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ)కు వారణాసి కోర్టు మరింత గడువిచ్చింది. ఈ నెల 17 వరకు సమయమిస్తూ జిల్లా న్యాయమూర్తి కే విశ్వేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేకు ఉపయోగించిన పరికరాల వివరాలతో పాటు సర్వే నివేదికను పూర్తిస్థాయిలో సిద్దం చేసేందుకు టైం కోరిందని, అందుకు కోర్టు అంగీకరించిందని ప్రభుత్వ న్యాయవాది అమిత్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 5వ తేదీన జ్ఞానవాపి సర్వే కోసం నాలుగు వారాల గడువు ఇచ్చిన వారణాసి కోర్టు.. తర్వాత ఎలాంటి గడువు ఉండబోదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్ సర్వేపై సుప్రీం కోర్టు -
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది, కాగా 2020 అక్టోబర్18న మహబూబాబాద్కు చెందిన కుసుమ వసంత, రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డిని మందసాగర్ డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి కేసముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపై తీసుకెళ్లా.. బాలుడిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అదే రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇది జరిగిన మూడురోజుల అనంతరం తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన ఉదంతం కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మంద సాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు తేలింది. మళ్లీ దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్ను చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అరెస్టైన సాగర్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.. మూడేళ్లుగా సాగిన విచారణలో తాజాగా ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. చదవండి: హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి -
సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు భారీ ఊరట
లక్నో: సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్కు భారీ ఊరట లభించింది. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఉత్తరప్రదేశ్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లను ఉద్దేశించి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గత ఏడాది సమాజ్వాదీ నేతను దోషిగా నిర్ధారించిన కింది కోర్టు తీర్పును రాంపూర్ కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో ఆజం ఖాన్ను దోషిగా తేలుస్తూ 2022 అక్టోబర్ 27న ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు అనంతరం ఆయన్ను ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతో.. తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అనంతరం రాంపూర్ సదర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా ఓటమి చెందారు. అయితే తన శిక్షపై వ్యతిరేకంగా ఆజం ఖాన్ రాంపూర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాంపూర్ కోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన వివిధ తీర్పులను ప్రస్తావిస్తూ.. బుధవారం తుదితీర్పు వెల్లడించింది. కాగా 2019 ఎప్రిల్ 9న అజాం ఖాన్పై రాంపూర్లోని మిలక్ కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి మోదీతో సహా ప్రముఖ బీజేపీ నేతలు, ఐఎఎస్ అధికారి ఆంజనేయ కుమార్ను ఉద్ధేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నేత, అడ్వకేట్ ఆకాష్ సక్సేనా కేసు నమోదు చేశారు. దీంతో ఆజంపై ఐపీఎస్ సెక్షన్ 153-A, 505-1, 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదయ్యాయి. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సమాజ్ వాదీ నేత అయిన ఆజం ఖాన్పై 87 కేసులు నమోదయ్యాయి. వీటిలో అనితీతి, దొంగతనం, భూకబ్జాలతోసహా అనేక నేరారోపణలు ఉన్నాయి. ఇక తాజా తీర్పుతో ఆజంకు ఉపశమనం లభించిప్పటికీ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్దరించడం సాధ్యం కాదు. మొరాదాబాద్ కోర్టు అతన్ని మరొక కేసులో ఈఏడాది ప్రారంభంలో దోషిగా నిర్ధారించింది. చదవండి: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై 19 ప్రతిపక్ష పార్టీల కీలక నిర్ణయం -
మసీదు కాంప్లెక్స్లో సర్వే
మథుర: వివాదాస్పద కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా వివాదంలో మథుర జిల్లా కోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మసీదు కాంప్లెక్స్లో సర్వే చేపట్టాలని జిల్లా సీనియర్ డివిజన్(3) సివిల్ జడ్జీ సోనికా వర్మ ఉత్తర్వులిచ్చారు. జనవరి 20వ తేదీలోగా సర్వే నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇక్కడి ఖాత్రా కేశవ్ దేవ్ ఆలయాన్ని ఔరంగజేబు నేలమట్టంచేసి ఈద్గాను నిర్మించారంటూ పిటిషనర్లు ఈ దావా వేశారు. శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్టు అధీనంలోని 13.37 ఎకరాల స్థలంలోనే ఈ ఈద్గాను నిర్మించారని దీనిని వేరే చోటుకు తరలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే, ఈ వివాదంపై శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ మసీద్ ఈద్గాల మధ్య 1968 ఏడాదిలో కుదిరిన రాజీ ఒప్పందాన్నీ వారు సవాల్చేస్తున్నట్లు వారి లాయర్ శైలేశ్ దూబే చెప్పారు. -
కోర్టులో కేఏ పాల్ హల్చల్..
విశాఖ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేశారు. విశాఖలోని 4వ అదనపు జిల్లా కోర్టుకు ఒక కేసులో ప్రతివాదిగా వచ్చిన ఆయన న్యాయమూర్తితో స్వయంగా మాట్లాడేందుకు ప్రయత్నంచారు. అందుకు న్యాయమూర్తి సున్నితంగా తిరస్కరించారు. వ్యక్తిగత న్యాయవాదితో రావాలని న్యాయమూర్తి పాల్కు సూచించారు. కేఏ పాల్కు సంబంధించిన కేసును న్యాయమూర్తి విచారించి, వాయిదా వేశారు. అనంతరం కేఏ పాల్ కోర్టు బయట విలేకర్లతో మాట్లాడారు. దేశం అవినీతిమయంగా మారిందన్నారు. 2007 నుంచి తన కేసు నడుస్తున్నా వాయిదాలు తప్ప పురోగతి లేదన్నారు. కేసును కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానాలు 2014లో చెప్పినా స్పందన లేదన్నారు. గత 16 ఏళ్ల నుంచి 700 సార్లు కేసును వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. కేసు తీర్పు రాకపోవడంతో తాను వితంతువులకు, అనాథలకు సేవ చేయలేక పోతున్నానన్నారు. అవినీతికి మద్దతు పలుకుతున్న న్యాయవాదులు తీరు మార్చుకోవాలన్నారు. ఈవీఎంలు మార్చి టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని తెలిపారు. ప్రజాపాలన కావాలంటే ప్రజాశాంతి పాలన రావాలన్నారు. -
జ్ఞానవాపి ‘శివలింగం’ వయసు నిర్ధారణకు ఓకే
వారణాసి: వారణాసిలో కాశీ విశ్వనాథ్ ప్రధానాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో లభించిన శివలింగాకృతి శిల వయసు నిర్ధారణకు వారణాసి జిల్లా కోర్టు అనుమతిని ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రధాన కట్టడం వెనకవైపు గోడకు ఉన్న దేవతా విగ్రహాల నిత్య ఆరాధనకు అనుమతించాలంటూ మహిళా భక్తులు వేసిన పిటిషన్ను గురువారం వారణాసి జిల్లా కోర్టు విచారించింది. శిల కార్భన్–డేటింగ్ ప్రక్రియకు అనుమతించాలని భక్తుల తరఫున హాజరైన న్యాయవాది విష్ణు .. జడ్జి విశేష్ను కోరారు. అందుకు అంగీకరిస్తూ జడ్జి ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణ తేదీ 29కల్లా అభ్యంతరాలు ఉంటే తెలపాలని మసీదు మేనేజ్మెంట్కు సూచించారు. కేసులో భాగస్వామ్య పక్షాలుగా చేరుతామంటూ 15 మంది కోర్టు ముందుకొచ్చారు. -
జ్ఞానవాపి మసీదు: కీలక తీర్పుపై ఉత్కంఠ
వారణాసి: ఉత్తర ప్రదేశ్లోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ(సెప్టెంబర్ 12) కీలక తీర్పును వెలువరించనుంది. మసీదుకాంప్లెక్స్లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కీలక తీర్పు నేపథ్యంలో పోలీసులు వారణాసిలో 144 సెక్షన్ విధించి.. హైఅలర్ట్ ప్రకటించారు. సోమవారం కావడంతో.. కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఈ పిటిషన్-అభ్యంతరాలపై ఇప్పటికే వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి అజయ్ కృష్ణ.. ఆగష్టు 24వ తేదీనే తీర్పును సిద్ధం చేసి వాయిదా వేశారు. అయితే.. ఇవాళ ఆ తీర్పును ప్రకటించనున్నారు. మసీదు కాంప్లెక్స్లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది కూడా. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది. ఆపై సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం.. తిరిగి వారణాసి కోర్టుకే చేరింది. కమిటీ రిపోర్ట్ సీల్డ్ కవర్లో వారణాసి కోర్టుకు చేరగా.. అదీ, వీడియో రికార్డింగ్కు సంబంధించిన ఫుటేజీలు బయటకు రావడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ తీర్పు గనుక వ్యతిరేకంగా వస్తే అలహాబాద్ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్తామని పిటిషనర్లు చెప్తున్నారు. ఇదీ చదవండి: ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద శివైక్యం -
జిల్లా కోర్టులో కాల్పుల కలకలం.. అండర్ ట్రయల్ ఖైదీ మృతి!
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని హాపుర్ జిల్లా కోర్టు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం అండర్ ట్రయల్ ఖైదీపై కాల్పులు జరిపారు. దీంతో తూటాలు తగిలి ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, అండర్ ట్రయల్ ఖైదీ లఖన్పాల్ను కోర్టులో హాజరుపరిచేందుకు హర్యానా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ సంఘటనలో అండర్ ట్రయల్ ఖైదీతో ఉన్న హర్యానా పోలీసు అధికారికి సైతం గాయలయ్యాయి. అయితే, కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అండర్ ట్రయల్ ఖైదీనే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. గాయపడిన పోలీసు అధికారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడే ఉన్న పోలీసులు సైతం వారిని పట్టుకునే ప్రయత్నం చేయకపోవటం వల్ల దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. ఇదీ చదవండి: బీజేపీ కార్యాలయం ఎదుట కారు కలకలం.. బాంబు స్క్వాడ్కు సమాచారం! -
జ్ఞానవాపి మసీదు కేసు: విచారణ సోమవారానికి వాయిదా
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణను వారాణాసి జిల్లా కోర్టు సోమవారానికి(మే30) వాయిదా వేసింది. కాశీ విశ్వనాథ్- జ్ఞానవాపి కాంప్లెక్స్లో శిృంగార్ గౌరి కాంప్లెక్స్లోని దేవతామూర్తులకు నిత్య పూజలకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగాన్ని సంబంధించిన సర్వే కొనసాగించాలంటూ హిందూ వర్గం నుంచి రెండు పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేసు మెయింటెనబుల్గా లేదని చెబుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం హిందువుల తరపు పిటిషన్ను కొట్టివేయాలని మసీదు కమిటీ తరఫు న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ వాదనలు వినిపించారు. 1991 ప్రార్థనాస్థలాల చట్టం ప్రకారం జ్ఞానవాపి మసీదుపై దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ప్రజల మనోభావాలను దెబ్బతిసేందుకే శివలింగం పేరుతో పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు, లాయర్లు, ప్రతివాదులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. రెండురోజులపాటు ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా జడ్జి అజయ్కృష్ణ విశ్వేశ్.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు. చదవండి: మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
జ్ఞానవాపి మసీదు కేసు: వారణాసి కోర్టులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వ్
లక్నో: జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి (మంగళవారం) రిజర్వ్ చేసింది. హిందూ వర్గం దాఖలుచేసిన రెండు పిటిషన్లతోపాటు ముస్లిం కమిటీ వేసిన ఒక పిటిషన్ను జిల్లా జడ్జ్ అజయ్కృష్ణ విశ్వేష విచారించారు. విచారణ సందర్భంగా కోర్టు హాలులోకి 23 మందిని మాత్రమే అనుమతించారు. వీరిలో 19 మంది లాయర్లు కాగా, నలుగురు పిటిషనర్లు. జ్ఞాన్వాపి ప్రాంగణంలోని శృంగార గౌరి కాంప్లెక్స్లో నిత్యపూజలకు, వజుఖానాలో వెలుగుచూసిన శివలింగాన్ని ఆరాధించేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగం లోతు ఎత్తు తెలుసుకునేందుకు సర్వే కొనసాగించాలని హిందూవర్గం కోరుతోంది. వజుఖానా మూసేయవద్దని ముస్లిం కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద జ్ఞానవాపి సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. చదవండి: Vismaya Case: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది -
చెక్ బౌన్స్ కేసులో విశాఖ జిల్లా కోర్టుకు టీడీపీ నేత అనిత
సాక్షి, విశాఖపట్నం: చెక్ బౌన్స్ కేసులో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2015 వేగి శ్రీనివాసరావు అనే టీడీపీ నేత నుంచి అనిత రూ. 70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే తీసుకున్న డబ్బుకు 2018 సంవత్సరంలో అనిత చెక్ ఇచ్చారు. కాగా చెక్ బౌన్స్ కావడంతో 2019లో శ్రీనివాస్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు విచారణకు రావడంతో అనిత కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్ని సార్లు డబ్బులు అడిగినా అనిత ఏదో ఒక వంక పెట్టి తప్పించుకున్నారని ఆరోపించారు. అవసరం ఉందని చెప్పి డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. సొంత పార్టీ నేతలే మోసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని అన్నారు. టీడీపీలో ఉన్నత స్థానంలో ఉన్న అనిత ఇలా చేయడం దుర్మార్గమని వాపోయారు. ఇప్పటికైనా అనిత తన డబ్బులు ఇచ్చేస్తే కోర్టులో ఉన్న కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పారు. చదవండి: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు -
ర్యాగింగ్తో విద్యార్థిని మృతి.. కోర్టు సంచలన తీర్పు
భోపాల్ : ర్యాంగింగ్ కేసులో నలుగురు యువతులకు అయిదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పును వెల్లడించింది. 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసులో ఓ విద్యార్థినిని సదరు యువతులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు రుజువు కావడంతో జిల్లా న్యాయస్థానం ఈ తీర్పిచ్చింది. వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు కళాశాలలో అనిత అనే విద్యార్థి బీఫార్మసీ స్టూడెంగ్గా చేరింది. అయితే అదే కళాశాలకు చెందిన నలుగురు సీనియర్లు విద్యార్థినిలు తమ కళాశాలలోకి జూనియర్గా వచ్చిన అనితపై ర్యాంగింగ్కు పాల్పడ్డారు. ఏడాది వరకు ఇదే తంతు కొనసాగడంతో విసిగిపోయిన విద్యార్థిని ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధిత యువతి సుసైడ్ లేఖ రాసి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ లేఖలో నలుగురు యువతుల పేర్లు రాసి, తన చావుకు వాళ్లే కారణమని ఆరోపణలు చేసింది. (రేప్’ సవాల్పై క్యాంపస్లో కలకలం!) బాధిత యువతి లేఖలో ఈ విధంగా పేర్కొంది ‘నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఈ నలుగురు అమ్మాయిలు నన్ను ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. ర్యాగింగ్ను నేను ఇప్పటి వరకు ఎలా అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కాలేజీలో సీనియర్లకు ఫిర్యాదు చేస్తే, సీనియర్లు కూడా అది సహజం అని నాకు చెప్పారు. కాలేజీ యాజమాన్యం కూడా స్పందించలేదు. చనిపోయాక సోదరుడు, తల్లిదండ్రులు నన్ను మిస్ కావొద్దు.’ అని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తర్వాత ఆ నలుగురు యువతులపై ఐపీసీ 306 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై తుది తీర్పును వెలువరించిన న్యాయస్థానం ర్యాగింగ్కు పాల్పడిన నలుగురు విద్యార్థినులకు జైలుశిక్షను ఖరారు చేసింది. కోర్టు తీసుకున్న నిర్ణయం కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ఘటనలు జరగకుండా నిరోధించేందుకు కృషి చేయవచ్చు. -
పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్కు షాక్
వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన పెన్సిల్వేనియాలో పోలింగ్లో అక్రమాలు జరిగాయనీ, రీకౌంటింగ్ చేపట్టా లంటూ ట్రంప్ బృందం వేసిన పిటిషన్లను పెన్సిల్వేనియా మిడిల్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టేసింది. పోలింగ్లో అక్రమాలంటూ చేసిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని జడ్జి మాథ్యూ బ్రాన్ పేర్కొన్నారు. దాదాపు 70 లక్షల ఓట్లను చెల్లనివంటూ ప్రకటించాలని కోరడం తగదంటూ పిటిషన్ను తోసి పుచ్చారు. ఈ పరిణామంపై అధ్యక్షుడు ట్రంప్ అటార్నీ రూడీ గిలియానీ స్పందిం చారు. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టుకు త్వరగా వెళ్లేందుకు పెన్సిల్వేనియా కోర్టు తీర్పు దోహదపడుతుందన్నారు. ఆధారాలను పరిశీ లించకుండానే, ఒబామా హయాంలో నియమించిన ఈ జడ్జి పిటిషన్ను కొట్టేశారని ఆరోపించారు. ఈ తీర్పుపై త్వరలోనే థర్డ్ సర్క్యూట్ కోర్టుకు వెళతామన్నారు. -
మసీదు తొలగింపు పిటిషన్ను స్వీకరించిన కోర్టు
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి దగ్గరున్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మధుర జిల్లా కోర్టు శుక్రవారం స్వీకరించింది. ఇదే అంశంపై గత నెలలో విచారణకు మధురలోని సివిల్ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపేందుకు జిల్లా జడ్జి సాధనా రాణి థాకూర్ అంగీకరించారు. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేశారు. కాగా మధుర శ్రీ కృష్ణుడి జన్మస్థలంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రదేశంలో కట్ర కేశవ్ దేవ్ దేవాలయానికి చెందిన 13 ఎకరాల స్థలంలో 17వ శతాబ్దంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారు. చదవండి: ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’ అయితే శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని 1968లో మధుర కోర్టు ఆమోదించింది. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్.. ఈద్గా ట్రస్టు మేనేజ్మెంట్ కమిటీతో మోసపూరితంగా రాజీ కుదుర్చుకుందని పిటీషన్లో ఆరోపించారు. మొగల్ రాజు ఔరంగజేబు మధురలోని కృష్ణ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆరోపించారు. కాగా శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి షాహీ ఈద్గాహ్ మసీదు ఆక్రమణను తొలగించాలనే అంశంపై మధురలోని సివిల్ జడ్జి కోర్టులో సెప్టెంబర్ 30న పిటిషనర్ విష్ణు జైన్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కానీ కేవలం భక్తుడైనంత మాత్రాన భగవంతుడి తరపున కోర్టులో కేసు వేయడానికి అధికారం లేదని చెబుతూ పిటీషన్ను కొట్టివేసింది. -
హత్య కేసు: కొల్లు రవీంద్రకు షాక్
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ సీనీయర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ను జిల్లా కోర్టు గురువారం కొట్టేసింది. ఆయన బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అతనికి బెయిల్ ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. గత నెల 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద పట్టపగలు వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కరరావును దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కుట్ర దారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ
న్యూయార్క్: ఆన్లైన్ క్లాస్లకు మారిన విద్యా సంస్థలకు చెందిన విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న అమెరికా ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలపై ఈ రెండు ప్రఖ్యాత విద్యా సంస్థలు బుధవారం బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ నిబంధనలను తక్షణమే తాత్కాలికంగా నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి. ‘ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణం. ఈ ఆదేశాలు చట్ట వ్యతిరేకం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లారెన్స్ బేకో పేర్కొన్నారు. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు న్యాయం జరిగేలా తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆన్లైన్ క్లాసెస్కు మారిన విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న ఆదేశాల వల్ల విద్యాసంస్థలు త్వరగా పునఃప్రారంభమయ్యే అవకాశముందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డెప్యూటీ సెక్రటరీ కుసినెలీ అన్నారు. ట్రంప్ ఆగ్రహం: ఫాల్ అకడమిక్ సెషన్కి విద్యా సంస్థలను పునఃప్రారంభినట్లయితే, వారికి ఫెడరల్ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. విద్యాసంస్థల పునః ప్రారంభానికి సంబంధించి అరోగ్య విభాగం జారీ చేసిన మార్గదర్శకాలను ఆచరణ సాధ్యం కాదని మండిపడ్డారు. -
అనంత ఫ్యాక్షన్.. నలుగురికి యావజ్జీవం
సాక్షి, అనంతపురం : తిప్పేపల్లి ఫ్యాక్షన్ హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కర్నూలు సీబీసీఐడీ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు పూర్వాపరాలు ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఇలా ఉన్నాయి. ధర్మవరం రూరల్ మండలం తిప్పేపల్లిలో దేవరపల్లి వర్గం, ముక్తాపురం వర్గం నడుమ దశాబ్దాల తరబడి ఫ్యాక్షన్ గొడవలున్నాయి. కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దేవరపల్లి వర్గానికి దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి, ముక్తాపురం వర్గానికి ముక్తాపురం రామకృష్ణారెడ్డి (70) నాయకత్వం వహించేవారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం తిప్పేపల్లి కాగా అనంతపురంలో సంపూర్ణ లాడ్జి నడుపుతున్నాడు. వీరిద్దరి నడుమ వర్గపోరుతో పాటు రాజకీయ విభేదాలు ఉన్నాయి. ►తిప్పేపల్లి నుంచి సంగాలకు రోడ్డు మార్గం దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి తోటలోంచి వెళ్లే ప్రతిపాదన ఏడేళ్ల కిందట వచ్చింది. అయితే రోడ్డు వేయకుండా లక్ష్మినారాయణరెడ్డి జిల్లా కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకొచ్చేవాడు. ఇది ముక్తాపురం వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదను చూసి హత్యకు కుట్రపన్నారు. 2013 ఏప్రిల్ 12 నుంచి మొదలుపెట్టి పలు దఫాలు లక్ష్మినారాయణరెడ్డిని హత్య చేయటానికి పన్నాగం పన్నారు. లక్ష్మినారాయణరెడ్డి తోటలోనే మారణాయుధాలు దాచివుంచి అదను కోసం వేచి ఉన్నారు. చదవండి: జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్ ఎట్టకేలకు మే 5వ తేదీన లక్ష్మినారాయణరెడ్డి ఒంటరిగా బైక్ మీద వస్తున్న విషయం తెలిసి అతను ఇంకా బండి దిగకమునుపే దాడిచేసి హతమార్చారు. అటునుంచి మారణాయుధాలను వెంకటరెడ్డి పొలంలో పారవేసి శివలింగారెడ్డి ఇంటికి చేరారు. హత్యజరిగిన వెంటనే ప్రత్యక్షసాక్షిగా హతుడి భార్య దేవరపల్లి రామకృష్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం రూరల్ పోలీసులు తిప్పేపల్లికి చెందిన ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై కేసు నమోదు చేశారు. ►ఫ్యాక్షన్ కేసు కావటంతో సీఐడీ పోలీసులు రంగంలో దిగారు. దర్యాప్తు అనంతరం ఆ నలుగురితో పాటు కసిరెడ్డి రాజారెడ్డి, తిప్పేపల్లికి చెంది, అనంతపురంలో సంపూర్ణలాడ్జి నడుపుతున్న ముక్తాపురం రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో స్థిరపడిన ముక్తాపురం అనిల్కుమార్రెడ్డి, బత్తలపల్లి మండలం సంగాలకు చెందిన కొడకండ్ల నరసింహారెడ్డి, ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన గొర్ల వెంకటలింగారెడ్డి, గొర్ల రామలింగారెడ్డి, తాడిమర్రి మండలం ఆత్మకూరుకు చెందిన పొడెమల ఓబిరెడ్డి, వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఎగువ పల్లికి చెందిన శివలింగారెడ్డిలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తొలుత ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులు ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై సాక్ష్యాధారాలు నిరూపణ కావటంతో ఆ నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.సునీత తీర్పు చెప్పారు. మిగిలినవారిపై నేరారోపణలు రుజువుకాక పోవటంతో నిర్దోషులుగా విడుదల చేశారు. దర్యాప్తు అధికారిగా సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ ఉపేంద్రబాబు వ్యవహరించగా, కోర్టులో సాకు‡్ష్యల హాజరుకు సహకరించిన కోర్టు కానిస్టేబుళ్లు బత్తలపల్లి పోలీసుస్టేషన్కు చెందిన రామాంజి, సీబీసీఐడీకి చెందిన జాఫర్షావలిని పోలీసు అధికారులు అభినందించారు. చదవండి: తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం -
యూనిఫామ్లో ఉన్నానన్న విషయం మరచి..
సాక్షి, ఖమ్మం : కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగడంతోపాటు చేయి చేసుకున్నారన్న సమాచారం ఆ కానిస్టేబుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యూనిఫామ్లో ఉన్నానన్న విషయాన్ని సైతం మర్చిపోయి సాక్షాత్తు జిల్లా కోర్టు ఎదురుగా లాఠీతో వీరంగం సృష్టించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక టూటౌన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కుమారుడు భాస్కరాచారితో గంగాభవానికి గత సంవత్సరం వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ కోర్టులో కేసు వేసింది. అలాగే తనకు నెలవారీ మెయింటెనెన్స్ ఇవ్వాలంటూ మరో కేసు వేసింది. ఈ కేసుల విచారణ కోసం గంగాభవానితోపాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు.. విజయభాస్కరాచారి కుటుంబ సభ్యులు హాజరయ్యేందుకు సోమవారం జిల్లా కోర్టుకు వచ్చారు. ఆ సమయంలో గంగాభవాని కుటుంబ సభ్యులకు, విజయ భాస్కరాచారి కుటుంబ సభ్యులకు మధ్య తలెత్తిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. ఒకరిని ఒకరు దూషించుకోవడంతో పాటు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు హుటాహుటిన కోర్టు వద్దకు వచ్చి కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగిన వారిపై లాఠీ ఝుళిపించడం.. దీంతో ఒకరికి గాయాలు కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమపై హెడ్కానిస్టేబుల్ దాడి చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు పూర్వాపరాలిలా.. ఖమ్మం రెండో పట్టణ హెడ్ కానిస్టేబుల్ తవుడోజు వెంకటేశ్వర్లు, అతని భార్య, కుమారుడు విజయభాస్కరాచారిపై కోర్టు వద్ద జరిగిన ఘర్షణ సంఘటనపై స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వెంకటేశ్వర్లు కుమారుడైన విజయభాస్కరాచారికి, నగరంలోని వీడీవోస్ కాలనీలో నివాసం ఉంటున్న గంగాభవానితో 2018, మే 6న టీఎన్జీవోస్ కాలనీలో వివాహం జరిగింది. వివాహం సమయంలో రూ.30 లక్షలు కట్నంగా ఇచ్చినట్లు.. కొంతకాలం బాగానే చూసుకున్నారని, ఆ తర్వాత మామ, అత్త, కుమారుడు అదనపు కట్నంతోపాటు 2 ఎకరాల పొలం రిజిస్టర్ చేయాలని ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారని ఖమ్మం కుటుంబ న్యాయస్థానంలో మెయింటెనెన్స్ కేసు, అదే కోర్టులో గృహహింస చట్టం కింది డీవీసీ కేసులను వేశారు. ఆమె భర్త విజయ భాస్కరాచారి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులు సోమవారం ఉండటంతో ఇరు వర్గాలు వాయిదాకు హాజరయ్యేందుకు న్యాయస్థానానికి రాగా.. కోర్టు సమీపంలో ఇరువురూ ఘర్షణ పడి బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, అతని భార్య, కుమారుడిపై బాధితులు ఫిర్యాదుచేయగా టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. -
‘పెండింగ్’ పరేషాన్ !
నగరపాలక సంస్థ పరిపాలన పరంగా, పన్నుల వసూళ్ల పరంగా, అనుమతులు, లీజుల వ్యవహారంలో నెలకొన్న వివాదాలపై ఇటీవల న్యాయ సమస్యలు చుట్టుముడుతున్నాయి. హైకోర్టు, స్థానిక కోర్టులు, ట్రిబ్యునల్ కేసుల తాకిడి నానాటికీ పెరుగుతుంది. వీఎంసీ ఒంటెత్తు పోకడ వల్లే కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయని, వీటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు... సాక్షి, అమరావతి బ్యూరో: అధికారుల అవగాహన లోపం.. పాలనపరంగా నెలకొన్న లొసుగులు.. అధికారుల ఏకపక్షతీరుతో ఎదుర్కొంటున్న ట్రిబ్యునల్ కేసులు ఇప్పుడు నగర పాలక సంస్థకు గుదిబండగా మారాయి. పిటిషనర్లు దాఖలు చేసిన అర్జీలు, ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకోకపోవటం, రూల్స్ అమలు చేసే విధానంలో ఏకపక్షంగా వ్యవహరించటం, రికార్డుల నిర్వాహణలో లోపాలు, చట్టం నిర్ధేశించిన పద్ధతి కాదని అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించటం వంటి కారణాలతో ఇప్పుడు నగరపాలక సంస్థ ఆయా కోర్టుల్లో 904 కేసులు ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించి లీగల్సెల్ ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ ఆయా కేసులకు సంబంధించిన వివరాలను సంబంధిత విభాగ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవటం, నివేదికలు అందించకపోవటం, రికార్డులు పంపిణీ చేయటంలో విఫలమవ్వడంతో కేసులు ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్నాయని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికారులు నిబంధనలను అమలు చేయటంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. న్యాయ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నచోట స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తే కేసును కోర్టువరకు కాకుండా మధ్యవర్తుల వద్దే పరిష్కరించుకునే వెసులుబాటు ఉన్నా, అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించి కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆయా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల వల్ల కార్పొరేషన్కు సమకూరాల్సిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. టౌన్ప్లానింగ్ నుంచే అత్యధికం.. వీఎంసీలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగం నుంచే కేసులు అధికంగా దాఖలవుతున్నాయి. భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతుల్లో జాప్యం, అక్రమకట్టడాలు, అక్రమ కట్టడాల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులు స్వీకరించటంలో విఫలమవ్వడం, రోడ్డు విస్తరణలు, మాస్టర్ప్లాన్ అమలు, ఆక్రమణలు క్రమబద్ధీకరణ వంటి కారణాలతో వీఎంసీ న్యాయ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ విభాగంపై రాష్ట్ర హైకోర్టులో 327 కేసులు, ఏపీ ట్రిబ్యునల్లో ఒకటి, స్థానిక కోర్టుల్లో 105 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో ఖాళీ స్థలాలకు పన్నులు వేసే సమయంలో జాగ్రత్తలు పాటింకచకోవటం, రాయితీలు, ఆస్తిపన్నుల వ్యవహారంలో జోన్ కేటగిరీల్లో మార్పులు, రాయితీల వ్యవహరంలో నిర్లక్ష్యంగా ఉండటం తదితర కారణాలతో హైకోర్టులో 208 కేసులు నమోదయ్యాయి, స్థానిక కోర్టుల్లో 29 కేసులు పెండింగ్లో ఉన్నాయి. నగరపాలక సంస్థ ఆస్తుల పరిరక్షణ, లీజులు, అద్దెలు, లీజుల పునరుద్ధరణ తదితర అంశాలకు సంబంధించి హైకోర్టులో 51 కేసులు, స్థానిక కోర్టులో 27 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో వివిధ రకాల నిర్మాణాల సమయంలో స్థల యజమాన్యాల హక్కుల వివాదం, సౌకర్యాల కల్పనలో వివాదాలు, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తదితర కారణాలతో హైకోర్టులో 48 కేసులు, స్థానిక కోర్టులో 7 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రజారోగ్య విభాగంలో శానిటేషన్ కాల్వల నిర్వాహణపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పరిష్కరించకపోవటం, డీఅండ్ఓ ట్రేడ్లైసెన్స్లు ఇచ్చే వివాదంలో కేసులు, న్యూసెన్స్, పొల్యూషన్, ఆరోగ్యపరమైన అంశాల్లో హైకోర్టులో 54 కేసులు, ఏపీ ట్రిబ్యునల్ల్లో ఒకకేసు, స్థానిక కోర్టులో 5 కేసులు పెండింగ్లో ఉన్నాయ. అడ్మినిస్ట్రేషన్–ఎడ్యుకేషన్ విభాగంలో ఉద్యోగులు, అధికారులు ఉద్యోగపరమైన సమస్యలు, సీనియారిటీ, ప్రమోషన్లు, క్రమ శిక్షణ చర్యలు వంటి వాటిపై సిబ్బంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వీటిపై హైకోర్టులో 14 కేసులు ఉండగా, ట్రిబ్యునల్లో ఆరు కేసులు, స్థానిక కోర్టులో నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటితోపాటు ఇతర కేసులు 9 కేసులు పెండింగ్లో ఉన్నాయి. లీగల్సెల్పై సమీక్ష పటమట(విజయవాడ తూర్పు): నగర పాలక సంస్థపై వివిధ విభాగాల అధికారులను సమన్వయపరచి కేసుల పరిష్కరించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. శనివారం వీఎంసీ కౌన్సిల్ హాల్లో లీగల్సెల్పై సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో నగరపాలక సంస్థపై దీర్ఘకాలికంగా ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు అధికారులు, ఎంఎస్సీలు కలిసి సమన్వయంతో పనిచేయాలని మేయర్ సూచించారు. కార్పొరేటర్లు పలు సూచనలు చేశారు. -
సాక్ష్యాలు రుజువు చేయాల్సిందే..
జగిత్యాలజోన్: చాలామం దివివిధ సమస్యలపై కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. కానీ ఆ సమస్యకు సంబంధించిన సరైన సాక్ష్యం సమర్పించలేకపోవడంతో కేసులు కొట్టుడుపోతుంటాయి. ఈ నేపథ్యంలో సాక్ష్యానికి సంబంధించిన విషయాల గురిం చి జగిత్యాల బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది కటుకం చంద్రమోహన్(94400 08494) ఇలా వివరించారు. రుజువు చేసుకోవాల్సిందే ఒక వ్యక్తి తనకు అందాల్సిన చట్టబద్ధమైన హక్కులు లేక బాధ్యతల గురించి తీర్పును ఇవ్వవలసిందిగా కోర్టును కోరినప్పుడు, ఆ వ్యక్తి సదరు విషయాలకు సంబంధించిన సాక్ష్యాలను రుజువు చేయవలసి ఉంటుంది. సాక్ష్యాన్ని రుజువు చేయడమనేది సివిల్, క్రిమినల్ కేసులకు వర్తిస్తుంది. అయితే ఒకే విధంగా ఉండదు. ఒక విషయం వాస్తవమేనని రుజువు చేయడమే రుజువుభారం(బర్డెన్ ఆఫ్ ప్రూప్)గా పిలుస్తారు. ఎవరు ముందుగా కోర్టును ఆశ్రయిస్తారో.. తాను న్యా యాన్ని పొందుటకు అర్హుడనని సదరు వ్యక్తి రు జువు చేసుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసుల్లో రుజువుభారం పూర్తిగా ప్రాసిక్యూషన్పైనే ఆధారపడి ఉంటుంది. కానీ వరకట్నపు హింస, వరకట్నం హత్య మొదలగుకేసుల్లో తాము నిర్దోషులమని నిరూపించుకోవలసిన బాధ్యత ముద్దాయిలపై ఉంటుంది. సివిల్ కేసుల్లో వాది దాఖలు చేసిన కేసు చెల్లదని రుజువు చేయవలసిన భారం ప్రతివాదిపై ఉంటుంది. రుజువుభారం అంటే కేసు లోని ప్రతి అంశాన్ని రుజువు చేయాలని కాదు. ఇరువర్గాలు అంగీకరిస్తే.. ఉభయ పార్టీలు అంగీకరించిన అంశాలను రుజు వు చేయాల్సిన అవసరం లేదు. ఒక విషయాన్ని కక్షిదారుడు ప్రస్తావించినప్పుడు, దానిని ప్రత్యర్థి నిరాకరిస్తే.. ఆ విషయాన్ని కక్షిదారుడు నిరూపించుకోవాలి. కోర్టు నిర్ధారించే విచారణీయ అంశం ఎవరిపై రుజువుభారం మోపితే వారే ఆ అంశాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసులలో ముద్దాయి సాక్ష్యం చెప్పనవసరం లేదు. నేను నేరం చేయలేదు అని అంటే చాలు. పూర్తి ఆధారాలతో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ముద్దాయి చేసిన నేరాన్ని ప్రాసిక్యూషన్ రుజువు చేయాల్సి ఉంటుంది. ముద్దాయి తాను నిర్దోషినని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాసిక్యూషన్ వారి కథనంలో ఏ మాత్రం పొంతన లేకపోయినా, అనుమానం ఉన్న సందేహ స్పదంగా(బెనిఫిట్ ఆఫ్ డౌట్) కేసు కొట్టివేయుదురు. క్రిమినల్ కేసుల్లో, నేరం జరిగినప్పుడు తాను అక్కడ లేనని, మరోచోట ఉన్నానని ముద్దాయి వాదన చేసినప్పుడు ఆ విషయాన్ని రుజువు చేసుకోవాల్సిన భారం ముద్దాయిపై ఉంటుంది. భారతీయ సాక్ష్యం చట్టంలోని సెక్షన్–101 ఈ విషయాలను సూచిస్తుంది. రుజువు చేయలేకపోతే.. భారతీయ సాక్ష్య చట్టంలోని సెక్షన్–102 ప్రకారం.. ఒక సివిల్ దావా లేదా ప్రొసీడింగ్లలో ఇరువర్గాలు(వాది, ప్రతివాది) సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేనప్పుడు, తీర్పు ఎవరికీ వ్యతిరేకంగా వచ్చునో రుజువు భారం ఆ కక్షిదారుడిపై ఉంటుంది. ఉదాహరణకు.. రామయ్య, రాజయ్యకు రూ.10 వేలు ప్రామిసరీ నోటుపై అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. అప్పుడు రాజయ్య తాను అసలు నోటు రాయలేదని, తనకు డబ్బు ఇవ్వలేదని వాదన చేసినచో, రాజయ్య నోటు రాశాడని రుజువు చేయాల్సిన భారం రామయ్యపై ఉంటుంది. ఆ ప్రామిసరీ నోటును రాజయ్య రాసిచ్చినట్లుగా రామయ్య సాక్ష్యం చెబితే, తాను ఆ నోటు రాయలేదని రాజయ్య సాక్ష్యంను చెప్పవలెను. రామయ్య సాక్ష్యం చెప్పనిచో, రాజయ్య కూడా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు సాక్ష్య ం చెప్పకపోతే కేసు కోట్టివేయుదురు. అప్పుడు రామయ్య నష్టపోతాడు. కాబట్టి, రుజువు భారం రామయ్యపై ఉండును. దీన్నిబట్టి రుజువు భారం ఎవరిపై ఉండునో వారే ముందుగా సాక్ష్యంను చెప్పాల్సి ఉంటుంది. వాస్తవమేనని నిరూపించుకోవాలి భారతీయ సాక్ష్యం చట్టం సెక్షన్–103 ప్రకారం ఒక నిర్ధిష్ట విషయం వాస్తవమేనని రుజు వు చేయాల్సిన బాధ్యత, అది వాస్తవమేనని నమ్మిన వ్యక్తిపై ఉంటుంది. ఉదాహరణకు..రాజు దొంగతనం చేసినట్లుగా రాము కే సును దాఖలు చేశాడు. రాజు తన నేరాన్ని రాజారావు వద్ద ఒప్పుకున్నాడని రాము వాదన. ఆ వి షయాన్ని రాజారావు చేత సాక్ష్యా న్ని చెప్పించుట ద్వారా రాము రు జువు చేయాల్సి ఉంటుంది. ఇదే చట్టంలోని సెక్షన్–105 ప్రకారం ఒక వ్యక్తిపై నేరారోపణ చేయబడినప్పుడు, ఆ నేరం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చే యబడిన ఎడల, ఆ ప్రత్యేక పరిస్థితులను రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నేరారోపణ చేయబడిన వ్యక్తిపై ఉంటుంది. ఉదాహరణకు..రమేశ్పై హత్యానేరం మోపబడింది. విచారణలో రమేశ్ తనకు మతిస్థిమితం లేదని, తాను ఏమి చేయుచున్నాడో తనకే తెలియడం లేదని వాదించాడు. ఆ నేరం జరిగినప్పుడు తనకు మతిస్థిమితం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత రమేశ్పై ఉంటుంది. బుద్ధిపూర్వకంగా నేరం చేయలేదని, క్షణికావేశంలో చేశానని ముద్దాయి రుజువు చేసుకోగలిగితే శిక్ష తగ్గుతుంది. సీనియర్ న్యాయవాది కటుకం చంద్రమోహన్ -
సంచలనం: 46 రోజుల్లోనే కోర్టు తీర్పు
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఓ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పును వెలువరించింది. తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ సాగర్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. మే 21 తేదిన తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను నలబైఏళ్ల వ్యక్తి పక్కనున్న గుడి సమీపంలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన పోలీసులు మే 25న పూర్తి వివరాలను కోర్టును సమర్పించారు. మొత్తం ఇరవైమంది సాక్షులను విచారించిన కోర్టు ఘటన జరిగిన 46 రోజుల్లోనే తీర్పును వెలువరించడం విశేషం. లైంగిక వేధింపుల నుంచి పిల్లల రక్షణ (పోస్కో) చట్టం, ఐపీసీ సెక్షన్ 376(అత్యాచారం), సెక్షన్ 366(అపహరణ) సెక్షన్ల పై విచారణ చేపట్టి శిక్ష విధించినట్లు అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి సుధాన్ష్ సక్సేనా తీర్పులో పేర్కొన్నారు. -
5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్
లక్నో: ఉత్తర ప్రదేశ్ జిల్లా కోర్టులోని లిఫ్ట్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. వజీర్గంజ్ జిల్లా కోర్టులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలోని లిఫ్ట్ సడెన్గా కూలిపోవడంతో భయాందోళణ వాతావరణం నెలకొంది. వైర్లు తెగిపడటంతో అయిదవ అంతస్తునుంచి లిఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 12మందిగాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సిఉంది. -
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
- ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (లీగల్): న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని కర్నూలు లోక్సభ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న న్యాయవాద సంఘ కార్యాలయ భవన నిర్మాణాన్ని పరశీలించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.చాంద్బాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ గతంలో ఎవరికి రాని అవకాశం న్యాయవాదులు తనకు ఇచ్చినందుకు సంతోషంగానూ, గర్వంగా ఉందన్నారు. తనకు ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో రూ.50 లక్షలు కేటాయించానని, భవిష్యత్తులో ఎంపీ నిధులు పెరిగితే తప్పకుండా కర్నూలు మహిళా న్యాయవాదులకు కూడా సహకారం అందిస్తానన్నారు. జిల్లాలో తీవ్రంగా మంచినీటి సమస్యను ప్రజలు ఈ ఏడాది ఎదుర్కొంటున్నారని, మంచినీటి సమస్య పరిష్కారానికే తాను ప్రాధాన్యతనిస్తానన్నారు. కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం తనను ఇంతగా అభిమానించిందని వారికి ఎల్లవేళలా సహకారం అందిస్తామన్నారు. పార్లమెంటులో లా కమిషన్ ప్రతిపాదనను వ్యతిరేకించి న్యాయవాదులకు అండగా నిలుస్తామన్నారు. బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా మాట్లాడుతూ న్యాయవాద వృత్తికి ఉరితాడుగా మారేలా కమిషన్ ప్రతిపాదనలున్నాయని, పార్లమెంటులో ఆ బిల్లును అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు ఎంపీ తన గళం విప్పి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్బాషా మాట్లాడుతూ రూ.50 లక్షలు ఎంపీ నిధులు కేటాయించి ఎంపీ బుట్టా రేణుక న్యాయవాదులపై తన అభిమానం చాటుకున్నారన్నారు. సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మిదేవి, ఓంకార్, రంగారవికుమార్, పి.నిర్మల, సంపత్కుమార్, ఎన్.నారాయణరెడ్డి, సువర్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కె.పుల్లారెడ్డి, తెర్నేకల్ సురేందర్రెడ్డి తదితరులు మాట్లాడి ఎంపీ నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా వచ్చే ఎన్నికల్లో ఎంపీ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఒక విద్యావేత్త, మహిళ అయిన బుట్టా రేణుక ప్రజల సమస్యల çపట్ల స్పందిస్తున్న తీరును వారు గుర్తు చేసుకున్నారు. అనంతరం కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఎంపీ బుట్టా రేణుకను ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అనిల్కుమార్, కరీం, తిరుపతయ్య, గీతామాధురి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు
హైకోర్టులో 34 జడ్జి పోస్టులు ఖాళీ: ఇంద్రకరణ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన ప్రతి జిల్లాలో జిల్లా కోర్టు ఏర్పాటుకు హైకోర్టుతో సంప్రదిం పులు జరుపుతు న్నామని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శనివారం శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి మాట్లా డారు. హైకోర్టు విభజన కోసం కేంద్రంతో ఎన్నో సార్లు సంప్రదింపులు చేశామని, ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం నగరంలో స్థలం కేటాయిస్తామని ప్రతిపాదిం చామని తెలిపారు. హైకోర్టు విభజనకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు. హైకోర్టులో మొత్తం 34 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఏపీ భవన్ విభజనకు చర్చలు: తుమ్మల ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు చర్చలు జరుపుతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. సాధారణ పరిపాలన, న్యాయశాఖల బడ్జెట్ పద్దులపై శాసనసభలో చర్చించడం 1996 తర్వాత ఇదే తొలిసారని వెల్లడించారు. మంత్రులు మాట్లాడిన అనంతరం స్పీకర్ ఎస్. మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేశారు. -
జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా దబ్బర నారాయణస్వామి
అనంతపురం లీగల్ : జిల్లా కోర్టు పబ్లిక్ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది దబ్బర నారాయణ స్వామిని నియమిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన పదవీ కాలం మూడు సంవత్సరాల పాటు వుంటుంది. వజ్రకరూరు మండలం ధర్మపురి గ్రామం రైతు కుటుంబానికి చెందిన నారాయణస్వామి 1985 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలు ఏపీఎస్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకుగా పాల్గొని కొంతకాలం టీడీపీ లీగల్సెల్కు ప్రాతిని«థ్యం వహించారు. -
లోక్ అదాలత్లో 1,218 కేసులు పరిష్కారం
కర్నూలు(లీగల్): జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 1,218 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి, వాహనాల రోడ్డు ప్రమాదాల 15 కేసులను పరిష్కరించి బాధితులకు దాదాపు 41 లక్షల రూపాయలు ఇన్యూరెన్స్ కంపెనీలు ఇచ్చే విధంగా సమ్మతించారు. సివిల్ కేసులు, రాజీ కాగల క్రిమినల్ కేసులు, ప్రిలిటిగేషన్ కేసులను న్యాయమూర్తులు ఎం.ఎ.సోమశేఖర్, స్వప్నారాణి, ఎం.బాబు, పి.రాజు పరిష్కరించారు. కర్నూలులో 412 కేసులు పరిష్కారం కాగా, నంద్యాలలో 67 కేసులు, ఆదోనిలో 65, నందికొట్కూరులో 52, ఆత్మకూరులో 271, ఎమ్మిగనూరులో 29, ఆలూరులో 24, డోన్లో 72, ఆళ్లగడ్డలో 68, పత్తికొండలో 23, కోవెలకుంట్లలో 117, బనగానపల్లెలో 18 కేసులను ఆయా న్యాయమూర్తులు పాల్గొని పరిష్కరించినట్లు పేర్కొన్నారు. -
జిల్లా కోర్టులోతనిఖీలు
ఒంగోలు సెంట్రల్ : జిల్లా కోర్టులో శనివారం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. జిల్లా కోర్టు ప్రాంగణం మొత్తం కలియతిరిగాయి. నెల్లూరు కోర్టులో గతంలో ఉగ్రవాదులు బాంబులు అమర్చిన నేపథ్యంతో పాటు మావోయిస్టుల ఎన్కౌంటర్ జరగడంతో బాంబు, డాగ్ స్క్వాడ్లకు ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు ప్రాంగణంలో పాడైన వాహనాలు తీసేస్తే బాంబులు అమర్చేందుకు అవకాశం ఉండదని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
రాజీ కేసులన్నీ పరిష్కారం
లీగల్ (కడప అర్బన్ ) : జిల్లాలోని వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులలో రాజీ కాదగిన కేసులన్నింటినీ పరిష్కరించాలనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఆధ్వర్యంలో చేపట్టిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి ప్రసంగించారు. వివిధ కోర్టుల పరిధిల్లో రాజీ కాదగిన కేసునలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. 1567 కేసులకు పరిష్కారం నేషనల్ లోక్ అదాలత్ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో 1747 కేసులకుగాను 1567 కేసులకు పరిష్కారం లభించింది. బాధితులకు రూ. 1,36,82,755 నష్టపరిహారంగా లభించింది. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీనివాస మూర్తి, జడ్జి అన్వర్ బాష, మెజిస్ట్రేట్ శోభారాణి, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జివి రాఘవరెడ్డి, న్యాయవాదులు, కక్షి దారులు పాల్గొన్నారు. -
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
కమాన్చౌరస్తా : హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్లోనే కొనసాగించాలని కోరుతూ హుస్నాబాద్లో దీక్ష చేపట్టిన న్యాయవాదులపై శుక్రవారం పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ జిల్లా కోర్టు న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి కోర్టు వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మండలాలను సిద్దిపేటలో విలీనం చేయరాదని న్యాయవాదులను డిమాండ్ చేస్తూ పోలీసుల వైఖరిపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్రెడ్డి, సీనియర్ న్యాయవాదులు ప్రభాకర్రావు, ఎం విక్రంరెడ్డి, రాజ్కుమార్ గుప్తా, భీమాసాహెబ్, హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుబ్బాక నాగరాజు, కార్యదర్శి బాకం సంపత్, సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్రెడ్డి, రాజిరెడ్డి,ç Üంజీవరెడ్డి, మల్లేశం, రవీందర్, దేవేందర్ పాల్గొన్నారు. -
నిజాం కాలంలోనే జిల్లాకోర్టు
– 1950–51లో కోర్టు నిర్వహణ – ఈ ఆధారంతోనే వనపర్తికి జిల్లా అదనపు కోర్టు సాధించాం : సీనియర్ న్యాయవాది బాల్రెడ్డి వనపర్తి : నిజాం కాలంలోనే ‘నాజీం జిల్లా’ పేరుతో వనపర్తిలో జిల్లాకోర్టు ఏర్పాటు చేసినట్లు స్థానిక సీనియర్ సిటిజన్లు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు ఏ పత్రికల్లో, టీవీచానెళ్లలో ఈ విషయాన్ని వెల్లడించలేదు. స్థానికుల్లో చాలా మందికీ ఈ విషయమే తెలియదు. వనపర్తి జిల్లా ఏర్పడుతున్న సందర్భంగా వనపర్తికి చెందిన సీనియర్ న్యాయవాది జి. బాల్రెడ్డిని సాక్షి పలకరించింది. ప్రస్తుతం న్యాయవాది బాల్రెడ్డికి ఎనబై సంవత్సరాలు ఆయన న్యాయవ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సాక్షితో పంచుకున్నారు. నాజీం జిల్లా నిర్వహణను తాను విద్యార్థిదశలో ఉన్నప్పుడు చూశానని చెప్పారు. నాగవరం గ్రామంలోని రాజావారి వాసుదేవమ్మ తోట బంగ్లాలో నాజీం జిల్లా నిర్వాహణ జరిగేదన్నారు. సంస్థానాధీశుల కాలంలో కోర్టుల నిర్వహణ బాధ్యతలను నిజాం నవాబులు జాగీర్దార్లు అప్పగించారని, కోర్టు నిర్వహణ ఖర్చులు వారి ద్వారానే చెల్లింపులు జరిగేవని ఆయన తెలిపారు. సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనం చేసిన తర్వాత జిల్లాకు ఒక్కటే జిల్లాస్థాయి కోర్టు ఉండాలని ఇక్కడి కోర్టును మహబూబ్నగర్కు తరలించారు. 1962 నుంచి తాను న్యాయవాది వృత్తిలో పనిచేస్తున్నానని చెప్పారు. చిన్న చిన్న సంస్థానాల్లో మున్సిఫ్ కోర్టులు ఉండేవి గోపాల్పేట, కొల్లాపూర్, నాగర్కర్నూల్, గద్వాల, ఆత్మకూర్ నిజాం ఆధీనంలో ఉన్న చిన్న సంస్థానాల్లో అదాలత్ మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పైకోర్టు (జిల్లా కోర్టు) రావాలంటే వనపర్తి నాజీం జిల్లా కోర్టుకు వచ్చేవారు. ఇక్కడి నుంచి పైకోర్టుకు వెళ్లాలంటే హైదరాబాద్లో నవాబుల ఆధీనంలో నిర్వహించే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉండేదన్నారు. అన్ని సంస్థానాలకు వనపర్తి మధ్యభాగంలో ఉన్న కారణంగా ఇక్కడి నాజీం జిల్లాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 1950–51వరకు నాజీం జిల్లా కోర్టు స్వాతంత్య్రానికి పూర్వం నుంచి సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనం అయిన తర్వాత జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేసే వరకు 1950–51 వరకు వనపర్తిలోని వాసుదేవమ్మ తోటలో నాజీం జిల్లా కోర్టు నిర్వాహణ జరిగింది. కొన్ని అదాలత్ మున్సిఫ్ కోర్టులు రద్దు చేయబడ్డాయి. ఈ ఆధారంతోనే వనపర్తికి జిల్లా అదనపు కోర్టును సాధించాం సంస్థానాధీశుల కాలంలోనే వనపర్తిలో నాజీం జిల్లా పేరుతో జిల్లా కోర్టు ఉండేదనే ఆధారం చూపించి తాను వనపర్తి బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో హైకోర్టుకు నివేధించి వనపర్తికి అదనపు జిల్లా కోర్టును మంజూరు చేయించామని న్యాయవాది బాల్రెడ్డి చెప్పారు. కొన్నేళ్ల క్రితమే ప్రస్తుత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మదన్బీ లోకూర్ చేతుల మీదుగా అదనపు జిల్లా కోర్టును ప్రారంభించుకున్నామని అన్నారు. నా చిన్నతనంలో చూశాను అవునూ.. చిన్న తనంలో మా ఊర్లోని వాసుదేవమ్మ తోటబంగ్లలో కోర్టు నడిచేది. మంది మార్బలంతో ఒక్కోరోజు చాలామంది వచ్చేవారు. చదవుకునే రోజుల్లో సంస్థానం నుంచి ఎవరైనా వస్తే ఆసక్తిగా వెళ్లి చూసేవాళ్లం. ఇక్కడినుంచి వనపర్తి పాతకోటలోని జైలుకు చాలామందిని తీసుకెళ్లేవారు. – బత్తిని రాంరెడ్డి, రిటైడ్ ఉద్యోగి, నాగవరం, వనపర్తి -
10న నేషనల్ మెగా లోక్ అదాలత్
లీగల్ (కడప అర్బన్ ): జిల్లాలోని వివిధ కోర్టుల పరిధిలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను సెప్టెంబర్ 10న జరిగే నేషనల్ మెగా లోక్ అదాలత్లో రాజీ చేసేందుకు ప్రతి పోలీసు అధికారి ప్రయత్నించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపు నిచ్చారు. బుధవారం సాయంత్రం జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవన్లో పోలీసు అధికారులతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో కాలంగా పోలీస్ స్టేషన్లలో దర్యాప్తు ప్రారంభించి కోర్టుల్లో విచారణ కొనసాగుతున్న కేసుల్లో నిబంధనల మేరకు రాజీ కాదగిన కేసులన్నీ వెంటనే రాజీ అయ్యేలా చూడాలన్నారు. సెప్టెంబర్ 3వ తేదీలోపు రాజీ అయ్యే కేసులన్నింటి వివరాల జాబితాను జిల్లా నలుమూలల నుంచి తీసుకుని రావాలన్నారు. రాజీ కేసుల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి యూ యూ ప్రసాద్, మెజిస్ట్రేట్లు జి. దీనా, శోభారాణి, భారతి, పోలీసు యంత్రాంగం నుంచి ఓఎస్డి (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు, కడప డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ నాగేంద్రుడు, సీఐలు రమేష్, మోహన్ ప్రసాద్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
లీగల్ (కడప అర్బన్) : చట్టాలపై పోలీసు అ«ధికారులతోపాటు ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి ఖచ్చితమైన అవగాహన ఉండాలని, మారుతున్న చట్టాలకు అనుగుణంగా తాము కూడా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణంలోని లోక్ అదాలత్ భవనంలో పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారులకు, ఎన్జీఓలకు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని, తద్వారా మారుతున్న చట్టాలను మరింత ప్రజల్లోకి అవగాహన కోసం తీసుకు వెళుతున్నామన్నారు. ఇందులో భాగంగానే పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓలు, స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులకు మరింత అవగాహన కల్పించే క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి యూయూ ప్రసాద్, జడ్జిలు అన్వర్బాష, శోభారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీ రాఘవరెడ్డి, కడప డీఎస్పీ ఈజీ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని సభలో జనగామ జిల్లా నినాదం
జనగామ : తెలంగాణ రాష్ట్రానికి ప్రప్రమథంగా వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహా సమ్మేళన సభలో జేఏసీ నాయకులు జనగామ జిల్లా నినాదాలతో హోరెత్తించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రధాని సభలో పలువురు జేఏసీ నాయకులు అన్ని అర్హతలు ఉన్న జనగామను జిల్లా చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. జనగామ జిల్లా విషయమై బీజేపీ నేతలు రాష్ట్రనాయకులతో కలిసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు జిల్లా సాధాన కమిటీ కన్వీనర్ మంగళంపల్లి రాజు తెలిపారు. -
హైదరాబాద్ తరలిన న్యాయవాదులు
వరంగల్ లీగల్ : రాష్ట్ర బార్ అసోసియేషన్ల ఫెడరేషన్, అడ్వకేట్స్ జాక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు జిల్లా నుంచి వందలాది మంది న్యాయవాదులు తరలివెళ్లారు. అంతకు ముందు జిల్లా కోర్టు ఎదుట హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జయాకర్ మాట్లాడుతూ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తూ తెలంగాణ న్యాయవ్యవస్థ స్తంభించడానికి కారకుడైన హైకోర్టు చీఫ్ జస్టిస్ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సహోదర్రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.వి. రమణ, నాగరాజు, సహాయ కార్యదర్శి అరుణ్ప్రసాద్, మహిళా కార్యదర్శి కవిత, కోశాధికారి సిద్దునాయక్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీకాకుళం సిటీ : జిల్లా కోర్టుల ప్రాంగణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉభయ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తి, శ్రీకాకుళం జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి హామీ ఇచ్చారు. శనివారం జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కోర్టు సమస్యలను కమిటీ సభ్యులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. న్యాయవృత్తి ద్వారా సమాజానికి సేవ చేయాలని న్యాయవాదులకు సూచించారు. తీర్పులను హుందాతనంతో స్వీకరించాలన్నారు. సామాన్యులు కోర్టుల చుట్టూ తిరగకుండా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి గురుగుబిల్లి యతిరాజులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ, వివిధ కోర్టుల న్యాయమూర్తులు వై.శ్రీనివాసరావు, గౌతమ్ప్రసాద్, గోపాలకృష్ణ, సుధామణి, సాయిసుధ, పద్మావతి, నాగమణి, ఎ.మేరీగ్రేస్కుమారి, రాజేంద్రప్రసాద్, మధుసూదనరావు, అప్పారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగు కృష్ణారావు, కార్యదర్శి పి.రాజారావు, ఉపాధ్యక్షుడు మామిడి క్రాంతి, జనరల్ సెక్రటరీ చిరుగుపల్లి రామ్మోహన్, ట్రెజరర్ పి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ వర్సెస్ దొంగ హైడ్రామా
► ఓ కేసులో కోర్టుకు హాజరైన నిందితుడు ► మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నం ► పోలీసులు, నిందితుడి కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం ► అరగంట సేపు జిల్లా కోర్టు సమీపంలో ట్రాఫిక్ జామ్ నెల్లూరు సిటీ : జిల్లా కోర్టు సమీపంలో సోమవారం పోలీస్ వర్సెస్ దొంగ హైడ్రామా నడిచింది. ఈ ఘటన కారణంగా దాదాపు అర్ధగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఓ కేసులో కోర్టుకు హాజరైన నిందితుడని మరో నాన్బెయిల్బుల్ కేసులో మూడో నగర పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నిం చగా పోలీసులు, నిందితుడి కుటుంబ సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం, పెనుగులాట జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని కుక్కలగుంట ప్రాంతానికి చెందిన అరవ రమేష్ 2011లో ఓ చోరీ విషయలో నిందితుడు. అప్పటి నుంచి రమేష్ పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఇతనిపై మూడో నగర పోలీసులు నాన్బెయిల్బుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఒకటోనగర పోలీస్స్టేషన్లోని ఓ పెండింగ్ కేసులో అరవ రమేష్ జిల్లా కోర్టుకు హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మూడోనగర పోలీసులు కోర్టు నుంచి పాత జిల్లా జైలు మీదుగా వచ్చే రోడ్డు బయటకు వస్తుండగా రమేష్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితుడు రమేష్తో పాటు అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నిందితుడు పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు, నింది తుడు, అతని కుటుంబ సభ్యుల మధ్య తోపులాట, పెనుగులాట జరిగింది. దాదాపు అరగంటకు పైగా ఈ హైడ్రామాతో ఆ ప్రాం తంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఓ దశలో ఉద్రిక్తత పరిస్థితి నెల కొంది. అయితే చివరికి పోలీసులు ఆటోలో రమేష్ను బలవంతం గా ఎక్కించి పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ రామారావు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాలాజీ నాయుడు(36) అనే గుమాస్తాను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పార్క్ చేసి ఉంచిన స్కూటర్ డిక్కీలో ఈ బాంబు పెట్టినట్లు సమాచారం. కాగా చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూను విచారణలో భాగంగా పోలీసులు ఈ రోజు కోర్టుకు తీసుకువచ్చారు. ఆ సమయంలోనే పేలుడు జరిగింది. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు కోర్టు ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రిషితేశ్వరి కేసు:నిందితుల బెయిల్ పై నేడు విచారణ
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం.రుషితేశ్వరి మృతి కేసులో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్ ను శుక్రవారం జిల్లా కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు మృతురాలు తండ్రి అయిన మొండి మురళీకృష్ణ తనను కూడా రికార్డుపరంగా ప్రతివాదిగా తరపున సీనియర్ న్యాయవాది వైకే బుధవారం పిటిషన్ దాఖలు చేయగా అది గురువారం విచారణకు వచ్చింది. బాధితులు తమకు నచ్చిన న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉన్నదని న్యాయమూర్తులు అందుకు అనుమతించాలనే న్యాయసూత్రాన్ని న్యాయవాది వైకే తన వాదన ద్వారా వినిపించారు. వైకే వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి గోపీచంద్ బెయిల్ పిటీషన్లో 2వ ప్రతివాదిగా మురళీకృష్ణను చేర్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు కేసు విచారణను నేటికి వాయిదా వేశారు. -
కోర్టులో యాసిన్ భత్కల్ హల్చల్
-
కోర్టులో యాసిన్ భత్కల్ హల్చల్
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ మరోసారి కోర్టులో హల్చల్ సృష్టించాడు. మంగళవారం అతడిని రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టులో ఓ లెటర్ విసిరేశాడు. ఆ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పెద్ద కుట్ర చేస్తున్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భత్కల్ చేష్టలు పలు అనుమానాలను రేకెత్తించాయి. -
మా నాన్నకు పెళ్ళి
-
కూతురు సాక్షిగా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు..!
శ్రీకాకుళం సిటీ: జిల్లా కోర్టు ప్రాంగణమే వేదికగా, జిల్లా జడ్జి సమక్షంలో ఓ ప్రేమ జంట కూతురు సాక్షిగా గురువారం ఒక్కటైంది. వివరాల్లోకి వెళ్తే.. రణస్థలం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కొమర నీలవేణి, అదే మండలం జీరుపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి అప్పన్నలు ఒకరికొకరు ఇష్టపడ్డారు. కొన్ని నెలలు సహజీవనం చేశారు. దీనికి ప్రతిగా ఓ పాప కూడా జన్మించింది. ఇరువురు మత్యకార కుటుంబానికి చెందిన వారే. నీలవేణి స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. వివాహం చేసుకుంటానని చెప్పడంతో అప్పన్నకి రూ.2.30 లక్షల నగదు, రెండు తులాల బంగారాన్ని నీలవేణి కుటుంబ సభ్యులు ముట్టజెప్పారు. ఒక్కసారిగా నగదు చేతికందే సరికి అప్పన్న చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. దీంతో నీలవేణి రణస్థలం పోలీస్స్టేషన్లో అప్పన్నపై ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో లోక్అదాలత్ను ఆశ్రయించారు. నీలవేణిని వివాహం చేసుకుని, మూడేళ్ల కూతురు జాన్సీని అక్కున చేర్చుకునేందుకు అప్పన్న అంగీకరించాడు. దీంతో జిల్లా ప్రిన్సిపల్ జిడ్జి వి.అప్పారావు సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నచిన్న మనస్పర్థలతో విడిపోవడం మంచిది కాదన్నారు. ఒకరినొకరు అవగాహన చేసుకొని మెలగాలని పిలుపునిచ్చారు. ఈనెల 13న నేషనల్ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నామని, మోటరు వాహనాల కేసులకు సంబంధించి సత్వర పరిష్కారం చేయనున్నట్టు వెల్లడించారు. -
లోక్ అదాలత్లో 2,569 కేసుల పరిష్కారం
న్యాయవాదుల నిరసనల నడుమ జిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు తాలూకా కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 2,569 కేసులు పరిష్కారమయ్యూయి. రాష్ర్టంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. - వరంగల్ లీగల్ వరంగల్ లీగల్ : జిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు తా లూకా కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. అయితే, హైకోర్టు సాధన కోసం ఉద్యమిస్తున్న న్యాయవాదులు లోక్ అదాలత్ను బ హిష్కరించి ధర్నాకు దిగగా.. వారి నిరసనల నడుమే జాతీయ లోక్ అదాలత్లో పెద్దసంఖ్యలో కేసులు పరి ష్కరించారు. ఈ మేరకు రాష్ర్టంలో కేసుల పరిష్కారంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. సివిల్, క్రిమినల్ ప్రమాద బాధితుల నష్టపరిహారం చెల్లింపు, ప్రభుత్వ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతుల నష్టపరిహారం చెల్లింపులు కేసులు పరిష్కరిం చారు. జిల్లావ్యాప్తంగా 35 సివిల్ కేసులు, 146 క్రిమినల్, 2388 ప్రిలిటిగేషన్ కేసులు కలిపి మొత్తం 2,569 కేసులను పరిష్కరించారు. ఇక ప్రమాదాలకు సంబంధించి 17 కేసుల్లో బాధితులకు రూ.13,39,130, నాలుగు కేసుల్లో రైతులకు రూ.1, 81,135 భూసేకరణ కింద నష్టపరిహారంగా చెల్లించడానికి అంగీకరించారు. కాగా, జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ కోసం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆరు బెంచ్లు ఏర్పాటుచేయగా మొదటి అదనపు జిల్లా జ డ్జి కే.బీ.నర్సింహులు, రెండో అదనపు జిల్లా జడ్జి యార రేణుక, సీనియర్ సివిల్ జడ్జిలు డి.సరళాకుమారి, రవీంద్రశర్మ, ఎం.జాన్సన్, సీహెచ్.ఆశాలత, శారదాదేవి, కళ్యాణచక్రవర్తి, రాజేంద్రారెడ్డి, ఆర్.రఘునాథ్రెడ్డి, టి.అనిత, బి.చంద్రయ్య వివిధ బెంచ్లకు నేతృత్వం వహించారు. బహిష్కరణ, కోర్టు హాల్ ఎదుట ధర్నా జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయలోక్ అదాలత్ను న్యాయవాదులు బహిష్కరించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ మేజిస్రేట్(పీడీఎం) కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేశారు. అయితే, లోపల అదనపు జిల్లా జడ్జిలు నర్సింహులు, యార రే ణుక నేతృత్వంలో బెంచ్ కొనసాగుతుండగా.. బయ ట న్యాయవాదులు నినాదాలు చేస్తుండడంతో కొద్దిసేపటికి న్యాయమూర్తులు వెళ్లిపోయారు. చిల్లా రాజేంద్రప్రసాద్, లెక్కల జలేందర్రెడ్డి, ఇ.వేణుగొపాల్, డాగర రాములు, వి.లలితకుమారి, మడ్డి మంజుల, స్వప్న, సత్యరాజ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
పెనుకొండ దుర్ఘటనపై సుమోటో కేసు
అనంతపురం: పెనుకొండ బస్సు ప్రమాదంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీరియస్ అయింది. బస్సు దుర్ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదుచేసింది. పోలీసు, కాంట్రక్టర్, ఆర్టీసీ, ఆర్ అండ్ బి అధికారులకు జిల్లా జడ్జి వెంకటేశ్వరరావు నోటీసులు జారీ చేశారు. ఈ నెల24న విచారణకు హాజరుకావాలని జిల్లా కోర్టు వారిని ఆదేశించారు. అనంతపురం జిల్లా మడకశిర-పెనుకొండ మార్గంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో 15 మంది మృతిచెందగా పలువురు గాయపడిన తెలిసిందే. -
52 పోస్టులు.. 18,490 దరఖాస్తులు
ఆదిలాబాద్ క్రైం : జిల్లా కోర్టుల్లో అటెండర్ ఉద్యోగాల కోసం డబ్బులు అడుగుతున్నారనే వదంతులు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి సూచించారు. మొత్తం 52 పోస్టులకు గానూ 18,490 దరఖాస్తులు వచ్చినట్లు మంగళవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నవంబర్ 12న జిల్లాలోని ఆయా కోర్టుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్కు విడుదల చేశామని, ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. పోస్టు, కొరియర్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించినట్లు చెప్పారు. నేరుగా దరఖాస్తులు తీసుకొచ్చిన వాటిని తిరస్కరించామని తెలిపారు. ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, రికమండేషన్లు తీసకొస్తే దరఖాస్తులు తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం కమిటీ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కాగా దరఖాస్తులు చేసుకున్న వాటిలో చాలా మంది దరఖాస్తు ఫారాల మీద గజిటెడ్ సంతకాలు, అభ్యర్థి సంతకాలు లేవని, ఫొటోలు అతికించకపోవడం, విద్యార్హత పత్రాలు జత చేయని దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు. వీరికి పోస్టల్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. ఈ ఉద్యోగాలకు 7వ తరగతి చదివిన వారికి అర్హత కల్పించినా డిగ్రీ, పీజీ విద్యార్హత ఉన్న వారు సైతం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్లో ఇచ్చిన అర్హతను బట్టి మాత్రమే ఎంపిక చేస్తామని, విద్యార్హత ఎక్కువ ఉన్నవారికే జాబ్ వస్తుందనే అపోహ వద్దని స్పష్టం చేశారు. -
లోక్ అదాలత్కు అనూహ్య స్పందన
రిమ్స్క్యాంపస్: జాతీయ లోక్ అదాలత్ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన రెండో లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా జిల్లాలో 1709 కేసులను పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు వి. అప్పారావు వెల్లడించారు. ఇందులో 108 మోటారు వాహనాల కేసులకు రూ.కోటీ 99 లక్షల, 4 వేలను కక్షిదారులకు నగదు రూపంలో చెల్లించినట్లు తెలిపారు. మిగతా కేసులకు సంబంధించి రూ. లక్షా 73వేల 262 విధించినట్టు వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. అప్పారావు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్అదాలత్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని, శ్రీకాకుళంతో పాటు చుట్టు పక్క గ్రామాలకు చెందిన కక్షిదారులు అధికసంఖ్యలో హాజరై వారి కేసులను రాజీ మార్గంలో పరిష్కారం చేసుకున్నారని ఆయన వివరించారు. కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కక్షిదారులు ఇరువర్గాల కేసులకు సంబంధించి కోర్టు ఫీజులు చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం కోసం ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. లోక్ అదాలత్ కార్యక్ర మం నిరంతర ప్రక్రియ అని, ఇందులో సివిల్ కేసులు, కుటుంబ తగాదాలు, క్రిమినల్ కేసులు, వినియోగదారుల కేసులు, ఇతర కేసులకు సంబంధించి జాతీయ లోక్అదాలత్ ద్వారా పరిష్కార మార్గం చూపించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి పి. అన్నపూర్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ పర్యవేక్షకులు సుధాకర్, డీఆర్వో బీహెచ్ఎస్ వెంకటరావు, సంఘ సేవకుడు మంత్రి వెంకటస్వామి, వాకర్స్ ఇంటర్ నేషనల్ గవర్నర్ జి. ఇందిరాప్రసాద్, లోక్ అదాలత్ సభ్యుడు కె. పోలినాయుడు పాల్గొన్నారు. -
కోర్టుకు హాజరైన సినీ నటి
రాయచూరు రూరల్ : కన్నడ సినీ నటి పూజాగాంధీ శుక్రవారం స్థానిక జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2013 అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్ఆర్ సీపీ తరఫున రాయచూరు సిటీ స్థానం నుంచి ఆమె పోటీచేసిన సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసును ఈనెల 25కు వాయిదా వేశారు. సెప్టెంబర్ 2వ వారంలో ‘అభినేత్రి’ విడుదల అనంతరం పూజాగాంధీ విలేకరులతో మాట్లాడారు. నటి కల్పన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన అభినేత్రి చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కల్పన తరఫువారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. దీంతో అభినేత్రి చిత్రాన్ని సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు పూజాగాంధీ తెలిపారు. ప్రముఖ ప్రధాన కన్నడ సినీ నటుడు శివరామపై అమితమైన అభిమానం ఉందని వివరించారు. ఎన్నికల సమయంలో రాయచూరు ప్రజలు తనను ఎంతో ఆదరించారని, వారికి రుణపడి ఉంటానని తెలిపారు. -
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే
సంగారెడ్డి క్రైం : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు జేఏసీ పిలుపు మేరకు జిల్లా కోర్టుతో సహా సిద్దిపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టుకు సమైక్య సంకెళ్లు ఇంకెన్నాళ్లు అంటూ నినదించారు. తెలంగాణ ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యర్శి వీరన్న పాటిల్, ఆర్ మాణిక్రెడ్డి, ఎం జైపాల్రెడ్డి, ఆర్ శ్రీనివాస్, బాల్రెడ్డి, రవీందర్, సంజీవరెడ్డ, వెంకట్రాములు, శివకుమార్, భగవాన్రావు, అంబరీష్, వర్మ, నాగరాజు, ప్రసాద్, బాలరాజు, అరుణ్ నాగిశెట్టి, అమర్నాథ్రావు, కసిరెడ్డి శ్రీనివాసులు, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నారాయణ, సదానందం, చంద్రయ్యస్వామి, ప్రసాద్, ప్రభుదాన్యం, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జోన్ : స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జుడీషియల్కు సంబంధించిన పోస్టుల ను తెలంగాణ ప్రాంత వ్యక్తులచే భర్తీ చే యాలన్నారు. సమస్యలు విస్మరిస్తే భవిష్యత్తులో నిరవధికంగా విధులకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రమేష్బాబు, పవన్కుమార్, సంజయ్కృష్ణ, నరసింహారెడ్డి, సాయిబాబ, జనార్దన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. నర్సాపూర్ : తెలంగాణ న్యాయవాదులు జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో విధులు బహిష్కరించినట్లు చెప్పారు. -
జిల్లా కోర్టుకు త్వరలో వసతులు
విద్యుత్ సమస్య పరిష్కారానికి జనరేటర్లు హైకోర్టు జడ్జి అశుతోష్ మొహంతా వెల్లడి బందరుతో అనుబంధం మరువలేను : మరో జడ్జి సత్యనారాయణమూర్తి మచిలీపట్నం, న్యూస్లైన్ : ఎంతో చరిత్ర కలిగిన జిల్లా కోర్టులో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి అశుతోష్ మొహంతా అన్నారు. జిల్లా కోర్టులో విద్యుత్కోత సమస్యను తీర్చేందుకు త్వరలో జనరేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా కోర్టులో అసిస్టెంట్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తి ఎం.సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.చక్రధరరావుతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఇనగుదురుపేట పోలీస్స్టేషన్లో నమోదైన కేసుపై వాదనలు లాంఛనంగా ప్రారంభించి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1802 నుంచి మచిలీపట్నంలో జిల్లా కోర్టు ఉందని, బ్రిటీష్, ఫ్రెంచి దేశస్తులు ఇక్కడ న్యాయమూర్తులుగా పనిచేశారని చెప్పారు. ఇక్కడి సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకున్నా... హైకోర్టు న్యాయమూర్తి ఎం.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తన స్వస్థలం మచిలీపట్నమేనన్నారు. జిల్లా కోర్టులో చాలా కాలం పాటు న్యాయవాదిగా పనిచేసినట్లు చెప్పారు. మచిలీపట్నం పురపాలక సంఘ స్టాండింగ్ కమిటీ న్యాయవాదిగా కూడా పనిచేశానన్నారు. ఇక్కడ పనిచేసే సీనియర్ న్యాయవాదుల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. స్వస్థలమైన మచిలీపట్నాన్ని, తనతోపాటు పనిచేసిన న్యాయవాదులు, న్యాయమూర్తులను ఎన్నటికీ మరువనన్నారు. న్యాయమూర్తుల పనితీరులో మార్పు వస్తేనే కేసులు త్వరితగతిన పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అధిక శాతం న్యాయమూర్తులు చాంబర్కే పరిమితమవుతున్నారని, ఈ పద్ధతి విడాల్సిన అవసరముందని సూచించారు. జిల్లా కోర్టులో అసిస్టెంట్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించటం శుభసూచకమన్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు... జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.చక్రధరరావు మాట్లాడుతూ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోగిరెడ్డి వెంకన్నబాబు సభకు స్వాగతం పలకగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెపు వెంకటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. హైకోర్టు న్యాయమూర్తులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పార్కును హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పట్టు వీడని అమెరికా
న్యూయార్క్/వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసిందంటూ ఓవైపు మొసలి కన్నీరు కారుస్తున్న అమెరికా.. మరోవైపు మాత్రం తన పట్టువీడడం లేదు. దేవయానిని పూర్తిస్థాయిలో కేసులో ఇరికించడానికి యత్నిస్తోంది. వీసా మోసం కేసులో తనపై అభియోగాలు నమోదు చేయడానికి ఈ నెల 13 వరకు ఉన్న గడువును నెల రోజులపాటు పొడిగించాలని దేవయాని కోరగా.. దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అమెరికా ప్రాసిక్యూటర్ తేల్చిచెప్పారు. అమెరికా ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా(ఈయన భారత్లోనే పుట్టారు) కార్యాలయం.. దేవయానిని అరెస్టు చేసిన 30 రోజు ల్లోపు.. అంటే ఈ నెల 13కల్లా ఆమెపై అభియోగాలు నమో దు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవయాని తరఫు న్యాయవాది డేనియల్ అర్షక్.. న్యూయార్క్ దక్షిణ జిల్లాలోని జిల్లా కోర్టులో సోమవారం అభ్యర్థన దాఖలు చేశారు. ‘ప్రాసిక్యూషన్కు, డిఫెన్స్ పార్టీకి, ప్రభుత్వ విభాగాలకు మధ్య పలు కీలకమైన చర్చలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. అయితే గడువు దగ్గరపడిపోవడంతో.. ఈ చర్చలకు విఘాతం కలుగుతోంది’ అని ఆ అభ్యర్థనలో పేర్కొన్నారు. గడువు నెల రోజులు పెంచాలని అడిగారు. దీనిపై ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా స్పందిస్తూ.. గడువు పొడిగింపునకు అంగీకరించబోమని చెప్పారు. అభియోగాలు నమోదు చేసిన తర్వాత కూడా చర్చలు జరుపుకోవచ్చన్నారు. దేవయానికి పూర్తి దౌత్య రక్షణ కల్పించేందుకు వీలుగా భారత్ ఆమెను ఐక్యరాజ్యసమితికి బదిలీ చేసినప్పటికీ.. అమెరికా మాత్రం బదిలీని ఇంకా ఆమోదించలేదు. చట్ట ప్రకారం కొన్ని ఫైళ్లు ఇంకా సిద్ధం కావాల్సి ఉందంటూ రెండు వారాలుగా కాలం గడుపుతోంది. పరిష్కారానికి 3 అవకాశాలు.. రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిన దేవయాని సమస్య పరిష్కారానికి మూడు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అమెరికా పాలనా యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. వాటిలో మొదటిది.. ఐక్యరాజ్యసమితికి ఆమె బదిలీని.. నేరాభియోగాలు మోపడానికి ముందే అంగీకరించడం ద్వారా పూర్తి స్థాయి దౌత్య రక్షణ ఆమెకు కల్పించడం. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుండాలని కోరుకుంటున్న వారు.. దీనికి మద్దతిస్తున్నట్లు సమాచారం. ఇక రెండోది.. ఆమెపై అభియోగాలు నమోదు చేశాక ఐక్యరాజ్యసమితికి బదిలీని అంగీకరించడం. మూడోది.. నేరాభియోగాలు పెండింగ్లో ఉన్నాయన్న కారణం చూపి.. ఐక్యరాజ్యసమితికి ఖోబ్రగడే బదిలీని తిరస్కరించడం. అమెరికా దౌత్యవేత్తల హోదా తగ్గిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా చివరి ఆప్షన్ ప్రయోగించాలని అమెరికా పాలనా యంత్రాంగంలో మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కాన్సులేట్ ముందు దేవయాని తండ్రి ధర్నా ముంబై: దేవయాని అరెస్టు అక్రమమంటూ ఆమె తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే ముంబైలో అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నాకు దిగారు. ‘నా కుమార్తె అరెస్టు అక్రమం. ఈ విషయాన్ని స్వయానా అమెరికా కూడా అంగీకరించింది. ఆమెపై అభియోగాలన్నీ బూటకం’ అంటూ ఆయ న నినదించారు. ఆమె అరెస్టును కిడ్నాప్తో పోల్చారు. -
కోర్టుకు హాజరైన ప్రేమజంట
తిరువళ్లూరు, న్యూస్లైన్: తిరువళ్లూరు జిల్లా పూసానిమేడు ప్రాంతానికి చెందిన వినాయకం కుమార్తె సూర్యకుమారి(23) పదవ తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం వెంగల్ సమీపంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వెంగల్ సమీపంలోని పనపాక్కం గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు కార్తీక్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరిది వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరు ఈ నెల 23న ఇంటి నుంచి పారిపోయి రాయపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. సూర్యకుమారిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆమె తమ్ముడు శంకర్ వెంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సూర్యకుమారి, కార్తీక్ బుధవారం తిరువళ్లూరు కోర్టులో న్యాయమూర్తి తమిళ్సెల్వి ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి తమిళ్సెల్వి సూర్యకుమారిని ప్రత్యేకంగా విచారించారు. తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, తాను మూడేళ్ల నుంచి కార్తీక్ను ప్రేమిస్తున్నానని పేర్కొంది. తన ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నట్టు చెప్పింది. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని తెలిపింది. దీంతో న్యాయమూర్తి తమిళ్ సెల్వి తీర్పు వెలువరిస్తూ సూర్యకుమారి కార్తీక్తో వెళ్లవచ్చని పేర్కొన్నారు. ప్రేమ వివాహానికి మద్దతుగా, వ్యతిరే కంగా పెద్ద ఎత్తున యువకులు కోర్టుకు హాజరుకావడంతో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. -
తేలని పరిహారం లెక్క!
కలెక్టరేట్, న్యూస్లైన్: బాధితురాలికి చెల్లించాల్సిన పరిహారం విషయమై కలెక్టరేట్ను వేలం వేసైనా సరే చెల్లించాల్సిందేనని జిల్లాకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. అయితే వేలం కంటే ముందు పరిహారం ఎంతో తేల్చిస్తే చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు కోరడంతో కోర్టు పరిహారాన్ని నిర్ణయించేందుకు మరో అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి గతనెల 28న విచారణ ఉండ గా, జడ్జిలేని కారణంగా వాయిదా వేస్తూ ఈనెల 5న జిల్లా కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో అధికారులు బాధితురాలికి చెల్లించే పరిహారం విషయమై గురువారం డీఆర్వో రాంకిషన్ ఆధ్వర్యంలో లెక్కలు తేల్చేపనిలో నిమగ్నమయ్యారు. ఎందుకంటే విచారణ సమయంలో అధికారుల లెక్కలను కోర్టు ముందు ఉంచాల్సి ఉంటుందని కావునా ఆ పనిని పూర్తిచేసుకుంటున్నారు. బాధితురాలు సత్తూర్ ఎల్ల మ్మ లెక్కప్రకారం..అప్పట్లో బలహీనవర్గాలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు అధికారులు 3.04 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే అధికారులు అప్పట్లో స్పందించి బాధితురాలికి పరిహారం చెల్లించినట్లయితే రూ.20లక్షలతోనే సరిపోయేది. కానీ వారి నిర్లక్ష్యం కారణంగా వడ్డీ పెరిగిపోయి అది నాలుగింతలకు చేరింది. దీంతో పరిహారం అధికారులకు తడిసిమోపెడైంది. ఇప్పటివరకు బాధితురాలికి రూ.47.39లక్షలు చెల్లించినా లెక్కప్రకారం ఇంకా రూ.49లక్షలు చెల్లించాల్సి ఉంది. లెక్కలను సిద్ధంచేశాం.. నిబంధనల ప్రకారం సేకరించిన భూమికి బాధితురాలికి రూ.24లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ అప్పట్లో కొంత ఆలస్యమైన కారణంగా ఇప్పటివరకు విడతల వారీగా రూ.47.39 లక్షలు చెల్లించాం. అంటే అసలుకు ధీటుగా వడ్డీ కూడా చెల్లించాం. ఇంకేమైనా చెల్లించాల్సి వస్తే రూ.5లక్షల లోపే ఉంటుంది. ఇందుకు సంబంధించిన లెక్కలన్నింటినీ సంబంధిత అధికారులతో కలిసి సిద్ధంచేసుకున్నాం. వీటిని శనివారం కోర్టు ముందు ఉంచుతాం. వీటిని పరిశీలించి కోర్టు ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాం.. - డీఆర్వో రాంకిషన్