ECB
-
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అల్టిమేటం.. ఐపీఎల్ జట్లకు షాక్
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్లో పాల్గొంటున్న తమ ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసింది. మే 22లోగా స్వదేశానికి చేరుకోవాలని ఆజ్ఞాపించింది. టీ20 వరల్డ్కప్కు ముందు ఇంగ్లండ్ స్వదేశంలో పాక్తో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్కప్ కోసం ప్రకటించిన జట్టే ఈ సిరీస్లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసమే ఈసీబీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉండాలని ఆదేశించింది.పాక్తో ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి (మే 22) ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి కీలక దశలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే సంబంధిత జట్లపై భారీ ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా పాక్తో సిరీస్ కోసమని ఐపీఎల్కు డుమ్మా కొడితే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలినట్లే.టీ20 వరల్డ్కప్ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ఐపీఎల్ 2024లో వివిధ జట్లకు ఆడుతున్న ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టు సభ్యులు..జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్)మొయిన్ అలీ (సీఎస్కే)బెయిర్స్టో (పంజాబ్)సామ్ కర్రన్ (పంజాబ్)లివింగ్స్టోన్ (పంజాబ్)విల్ జాక్స్ (ఆర్సీబీ)ఫిల్ సాల్ట్ (కేకేఆర్)రీస్ టాప్లే (ఆర్సీబీ)ఐపీఎల్ ప్లే ఆఫ్స్..మే 21: క్వాలిఫయర్-1మే 22: ఎలిమినేటర్మే 24: క్వాలిఫయర్-2మే 26: ఫైనల్ -
'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుటెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆసీస్ రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక రెండోటెస్టు ఇరుజట్ల మధ్య జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. అయితే ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్లో అలీ గాయపడ్డాడు. దీంతో లార్డ్స్ టెస్టుకు మొయిన్ అలీ దూరమయ్యాడు. అయితే అతని స్థానంలో ఎవరు ఊహించని రీతిలో 18 ఏళ్ల కుర్రాడికి ఈసీబీ అవకాశం ఇచ్చింది.లెగ్ స్పిన్నర్ అయిన 18 ఏళ్ల రిహాన్ అహ్మద్ను మొయిన్ అలీకి రీప్లేస్గా తీసుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే ఇదే రిహాన్ అహ్మద్కు గతంలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ షేక్హ్యాండ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. రిహాన్ 13 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గ్రౌండ్లో బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అతని బౌలింగ్ను నిశితంగా పరిశీలించిన షేన్ వార్న్.. కాసేపటికి అతని దగ్గరికి వచ్చి.. ''నిజంగా సూపర్గా బౌలింగ్ చేస్తున్నావ్. నేను అప్పటినుంచి నిన్ను గమనిస్తున్నా. త్వరలోనే నీ గురించి కామెంట్ చేస్తానేమో. 15 ఏళ్ల వయసులోనే నువ్వు ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.. అంతేకాదు చిన్న వయసులోనే ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదిస్తావు'' అని చెప్పుకొచ్చాడు. వార్న్ ఆ మాటలు ఏ శుభ ముహుర్తానా అన్నాడో తెలియదు కానీ అదే ఇప్పుడు నిజమయ్యింది. మొయిన్ అలీ స్థానంలో ఎంపికవడం.. అదీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సందర్భంగా ఇది జరగడం రిహాన్ అహ్మద్ది అదృష్టం అని చెప్పొచ్చు. ఒకవేళ రెండో టెస్టులో అవకాశం లభించి మంచి ప్రదర్శన ఇస్తే మాత్రం ఇంగ్లండ్ జట్టులో శాశ్వత స్పిన్నర్గా పాతుకుపోయే అవకాశం రావొచ్చు. ఇక రిహాన్ అహ్మద్ తన ఎంపికపై స్పందిస్తూ.. ''ఏదో ఒకరోజు ఇంగ్లండ్కు ఆడుతానని తెలుసు.. కానీ ఇలా ఎంపికవుతానని ఊహించలేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నన్ను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయి. వార్న్ బతికి ఉంటే తప్పకుండా సంతోషించేవాడు'' అంటూ పేర్కొన్నాడు. The King Shane Warne knew. Rehan Ahmed. pic.twitter.com/pCl6oaXkk3 — M (@anngrypakiistan) June 23, 2023 చదవండి: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్తోనే కానిచ్చేయండి!' -
'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో బిజీగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. బజ్బాల్ ఆటతీరుతో దూకుడు మీదున్న ఇంగ్లండ్కు.. ఆసీస్ ఓటమి రుచి చూపించి బ్రేకులు వేసింది. అయితే 2021లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 0-4 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దెబ్బతో అప్పటి టెస్టు కెప్టెన్ జో రూట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. బ్యాటింగ్ మెంటార్గా ఉన్న గ్రహం థోర్ఫ్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అష్లే గైల్స్ తమ పదవులను కోల్పోయారు. ఆ తర్వాత రాబ్ కీ అనే వ్యక్తి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి కొత్త డైరెక్టర్గా ఎంపికయ్యాడు. కాగా రాబ్ కీ వచ్చీ రావడంతోనే తన మార్క్ను చూపించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి మెక్కల్లమ్ కంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా పాంటింగ్ తాజాగా రివీల్ చేశాడు. గురిల్లా క్రికెట్పాడ్ కాస్ట్కు ఇంటర్య్వూ ఇచ్చిన పాంటింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మెక్కల్లమ్ కంటే ముందు ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి నన్ను ముందు సంప్రదించారు. ఈ విషయంలో రాబ్ కీ కీలకంగా వ్యవహరించాడు. అతనే స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇంగ్లండ్ టెస్టు కోచ్గా ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దానిని తిరస్కరించా. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కోచ్గా ఫుల్టైమ్ పనిచేయడానికి అప్పటికి నేను మానసికంగా సిద్దం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు కావడం.. అంతర్జాతీయ కోచ్గా ఉంటే జట్టుతో పాటు వివిధ దేశాలకు పర్యటించాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకోలేదు. అందుకే కోచ్ పదవి ఆఫర్ను తిరస్కరించాల్సి వచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ను ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవి వరించింది. రూట్ స్థానంలో బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. వీరిద్దరు కలిసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ పూర్తిగా మారిపోయింది. బజ్బాల్ క్రికెట్ను పరిచయం చేసిన ఈ ద్వయం ఇంగ్లండ్కు టెస్టుల్లో వరుస విజయాలు కట్టబెట్టారు. ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకున్నాకా ఇంగ్లండ్ టెస్టుల్లో 13 మ్యాచ్ల్లో 11 విజయాలు సాధించడంతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లపై సిరీస్ విజయాలు సాధించింది. చదవండి: హెచ్సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
ఇంగ్లండ్ క్రికెట్లో జేసన్ రాయ్ 'కాంట్రాక్ట్ కలకలం'
ఇంగ్లండ్ క్రికెట్లో జేసన్ రాయ్ కాంట్రాక్ట్ రద్దు వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో తాను ఈసీబీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై రాయ్ స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈసీబీ కాంట్రాక్ట్ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపాడు. తాను ఈసీబీతో కేవలం ఇంక్రిమెంటల్ కాంట్రాక్ట్ (షెడ్యూల్ లేని సమయానికి డబ్బు వదులుకోవడం) మాత్రమే వదులుకున్నట్లు వివరణ ఇచ్చాడు. ఈసీబీతో తన కాంట్రాక్ట్ యధాతథంగా కొనసాగుతుందని, ఇంగ్లండ్ షెడ్యూల్ లేని సమయంలో తాను మేజర్ లీగ్ క్రికెట్లో ఆడేందుకు ఈసీబీ అధికారులు కూడా అనుమతిచ్చారని, ఈ కాలానికి తనకు ఈసీబీ నుంచి ఎలాంటి రెమ్యూనరేషన్ దక్కదని ఇన్స్టా వేదికగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సింగిల్ ఫార్మాట్ ప్లేయర్గా అసలు తనకు ఈసీబీతో సెంట్రల్ కాంట్రాక్టే లేదని వెల్లడించాడు. కాగా, అమెరికా వేదికగా జూలై 13 నుంచి జూలై 30 వరకు జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు జేసన్ రాయ్ ఈసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్ను వదులుకుంటున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కోల్కతా నైట్రైడర్స్కు చెందిన లాస్ ఏంజెల్స్ నైట్రైడర్స్తో రాయ్ రెండేళ్లకు గాను రూ. 36.8 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనాలు ప్రసారమయ్యాయి. ఇదిలా ఉంటే, 33 ఏళ్ల జేసన్ రాయ్ను ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ 2 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 మధ్యలో కేకేఆర్ టీమ్లో చేరిన రాయ్.. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 151కి పైగా స్ట్రయిక్ రేట్తో 285 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. చదవండి: ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే ఏం చేయలేకపోయాడు.. అక్కడికి వెళ్లగానే..? -
'కెరీర్ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్ ఆడే క్రమంలో స్టిక్ కాలికి బలంగా తగలడంతో బెయిర్ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ మినీ వేలంలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్ స్టోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్ స్టో గాయపడే సమయానికి కెరీర్లో పీక్ ఫామ్లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్ స్టో స్పందించాడు. ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్ను తలకిందులు చేసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. '' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్ స్టిక్ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి సూచనలను సీరియస్గా తీసుకొని వర్కౌట్స్ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది. కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్నెస్ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు. చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు -
17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్
పాకిస్తాన్తో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు ఆదివారం తెల్లవారుజామున పాక్ గడ్డపై అడుగుపెట్టింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ పాక్లో టెస్టు సిరీస్ ఆడేందుకు రావడం ఆసక్తిగా మారింది. చివరగా 2005లో పాకిస్తాన్లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆడింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ట్విటర్లో ఇంగ్లండ్ టెస్టు బృందం పాకిస్తాన్లో ల్యాండ్ అయింది.. సిరీస్ ఆడడమే తరువాయి అని క్యాప్షన్ జత చేసి వీడియో రిలీజ్ చేసింది. అయితే టి20 ప్రపంచకప్కు ముందు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడేందుకు వచ్చింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 4-3 తేడాతో పాకిస్తాన్ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరల్డ్కప్ ఉండడంతో మళ్లీ ఇరుజట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. టి20 వరల్డ్కప్ ముగిసిన అనంరతం ముందుగా అనుకున్న ప్రకారమే బెన్ స్టోక్స్ సేన పాకిస్తాన్లో అడుగుపెట్టింది. డిసెంబర్ 1 నుంచి రావల్పిండిలో తొలి టెస్టు జరగనుంది. ఆ తర్వాత ముల్తాన్ వేదికగా(డిసెంబర్ 9 నుంచి 13 వరకు) రెండో టెస్టు, కరాచీ వేదికగా డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడో టెస్టు జరగనుంది. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉంది. ఈ సిరీస్లో విజేతగా నిలిచిన జట్టు టాప్-4కు చేరుకునే అవకాశం ఉంది. ఇక టి20 ప్రపంచకప్లో గాయంతో దూరమైన మార్క్ వుడ్ పాక్తో టెస్టు సిరీస్ ఆడేది అనుమానంగా ఉంది. వాస్తవానికి ఇంగ్లండ్ జట్టు గతేడాదే పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడాల్సింది. కానీ కివీస్ సెక్యూరిటీ కారణాలతో సిరీస్ను రద్దు చేసుకోవడంతో ఇంగ్లండ్ పాక్ రావడానికి సంశయించింది. అయితే ఏడాది వ్యవధిలో పాకిస్తాన్లో కొంత పరిస్థితి మెరుగవడంతో ఇంగ్లండ్ ఆడడానికి ఒప్పుకుంది. Touchdown in Pakistan for our Men’s Test squad! 🇵🇰 pic.twitter.com/2GbRr1Xcw1 — England Cricket (@englandcricket) November 26, 2022 చదవండి: మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్ చూడాల్సిందే 'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే' -
'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ (మన్కడింగ్)చేసిన విషయం తెలిసిందే. మన్కడింగ్ చట్టబద్ధం చేసినప్పటికి.. ఇంగ్లీష్ మీడియా సహా అక్కడి క్రికెటర్లు మాత్రం దీప్తి శర్మ ఏదో పెద్ద నేరం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ తమ వెర్రితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఒక్క ట్వీట్తో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు,విశ్లేషకులు,విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా షేర్ చేసిన వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియాకు సంబంధించిన ఓ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియా..తన ముందున్న వారిని దాటేయడానికి గాను సైకిల్ను వేగంగా తొక్కి తర్వాత తన బాడీని సీట్ మీద ఫ్లాంక్ పొజిషన్ లో ఉంచుతాడు.దీంతో సైకిల్.. తన ముందున్న సైకిళ్లను దాటేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ వీడియోను జాఫర్ రీట్వీట్ చేస్తూ.. ''ఇది (గరియా చేసిన పని) వాస్తవానికి చట్టబద్దమైనదే కావచ్చు. నిబంధనల్లో ఉండొచ్చు. కానీ ఇది సైక్లింగ్ స్ఫూర్తికి విరుద్ధం.. అని ఇ ఓ ఇంగ్లీష్ సైక్లిస్టు చెప్పాడు.తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'' అని రాసుకొచ్చాడు. పేరు చెప్పకపోయినా జాఫర్ ట్వీట్ ద్వారా ఇంగ్లీష్ మీడియా,క్రికెటర్ల వ్యాఖ్యలకు కౌంటరిచ్చినట్టేనని స్పష్టమవుతున్నది. Italian cyclist Michael Guerra uses his knowledge of physics and aerodynamics to adopt a “plank” position and overtake his competitors. pic.twitter.com/EsRt16l2PT — Ian Fraser (@Ian_Fraser) September 27, 2022 Deepti Sharma nailed id today on field 😄 what she did it was heart breaking feeling for England . Superb #DeeptiSharma . Gore ko unki line se bahar jaane ki saja 😄🤣#ENGvsIND #womenscricket #JhulanGoswami #ODI pic.twitter.com/NKnoHhfRQD — Vishoka M🇮🇳 (@Vishokha) September 24, 2022 చదవండి: ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్ -
IND Vs PAK: ఈసీబీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన బీసీసీఐ!
క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్లకు ఎనలేని క్రేజ్ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు మాత్రం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐసీసీ, ఆసియా కప్ లాంటి మేజర్ టోర్నీల్లో తప్ప పెద్దగా మ్యాచ్లు ఆడలేదు. అందుకే భారత్, పాక్ మ్యాచ్కు అంత క్రేజ్ ఉంటుంది. ఇక అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్లో ఈ చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడనున్నాయి. ఆ మ్యాచ్ కోసం ఇరుదేశాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా టీమిండియా, పాకిస్తాన్లు ఒప్పుకుంటే మా దేశంలో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే ఈసీబీ ప్రతిపాధించింది వన్డేలు, టీ20లు కాదు. ఐదు రోజుల పాటు జరిగే టెస్టు సిరీస్ కోసం. బీసీసీఐ, పీసీబీ ఒప్పుకుంటే తమ దేశంలో ఇండియా-పాక్ లతో మూడు టెస్టులు ఆడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీబీ ప్రతిపాదించింది. కానీ ఈసీబీ ప్రతిపాదనను ఇరు దేశాల బోర్డులు తిరస్కరించినట్టు సమాచారం. తటస్థ వేదికపై ఇండియా-పాక్ టెస్టు మ్యాచ్ లు జరిపించాలన్న ఆలోచన తమకు లేదని.. ఆడితే ఇండియాలో అయినా లేదంటే పాకిస్తాన్ లో ఓకే గానీ టెస్టులను కూడా ఇతర దేశాలలో తాము ఆడబోమని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది. ఇక సుమారు 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి తర్వాత సుమారు పదేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేక అల్లాడిన పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే విదేశీ జట్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా రాగా ఇప్పుడు ఇంగ్లండ్ పాక్ పర్యటనకు వచ్చింది. టి20 సిరీస్ ముగిశాక డిసెంబర్లో ఇంగ్లండ్ టెస్టులు ఆడేందుకు మరోసారి పాక్కు రానుంది. ఈ సిరీస్ చర్చ సందర్బంగానే ఈసీబీ పీసీబీ ఎదుట ప్రతిపాదనను తెచ్చినట్టు సమాచారం. ఇంగ్లండ్లో దక్షిణాసియా వాసులు అధికంగా ఉన్నారని.. తద్వారా అక్కడ ఇండియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ సూపర్ హిట్ అవుతుందని ఈసీబీ భావిస్తున్నది. మరోవైపు బీసీసీఐ కూడా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ''ఇండియా-పాక్ సిరీస్ గురించి ఈసీబీ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్లు అంటే అది బీసీసీఐ పరిధిలో లేదు. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇప్పటివరకైతే ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్ గురించి మా వైఖరిలో మార్పు లేదు. పాకిస్తాన్తో ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే ఆడతాం'' అని కుండబద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ లు చివరిసారిగా 2007లో టెస్టు సిరీస్ ఆడాయి. ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ రెండు దేశాల మధ్య దూరం నానాటికీ పెరుగుతున్నది. -
ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు..
రాబోయే టి20 ప్రపంచకప్కు సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై సుధీర్ఘ టి20 సిరీస్ ఆడనుంది. గురువారం రాత్రి పాకిస్తాన్కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్కు ఇది మంచి ప్రాక్టీస్లా ఉపయోగపడనుంది. ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ బట్లర్ సహా ఇతర ఆటగాళ్లకు పాకిస్తాన్లో ఒక్క మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ డాసన్ లాంటి ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడడం ద్వారా పాక్ పిచ్లపై కాస్త అవగాహన ఉంది. అయితే గాయంతో బాధపడుతున్న కెప్టెన్ జాస్ట్ బట్లర్ సిరీస్లో ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. పాకిస్తాన్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పాక్లోని చాలా ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ క్రికెటర్లు పెద్ద మనసు చాటుకున్నారు. ఇదే విషయమై కెప్టెన్ జాస్ బట్లర్ మాట్లాడుతూ..'' పాకిస్తాన్ ప్రస్తుతం భారీ వరదలతో అతలాకుతలమైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో మేము పాక్ గడ్డపై సిరీస్ ఆడేందుకు వచ్చాం. ఒక జట్టుగా గెలుపోటములు పక్కనబెడితే.. మ్యాచ్కు సంబంధించిన డొనేషన్స్ను వరద బాధితులకు అందేలా చూస్తాం. ఇందుకోసం ఈసీబీతో ఇప్పటికే మాట్లాడాము. ఈసీబీ కూడా మా వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని పెద్ద మొత్తంలో సాయం చేడయానికి ముందుకు రానుంది. క్రికెట్లో ఇలాంటి స్నేహపూరిత వాతావరణం ఉండడం చాలా మంచిది. ఇక ఇరుజట్ల మధ్య జరగనున్న టి20 సిరీస్.. వరద నష్టాల నుంచి పాక్ ప్రజలకు, అక్కడి అభిమానులకు మంచి ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో లంక చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్లో గెలిచి టి20 ప్రపంచకప్కు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ విజయం అనంతరం పాక్ గడ్డపై అడుగుపెట్టింది. చదవండి: 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
చాప్టర్ క్లోజ్ అనుకున్న తరుణంలో హార్డ్ హిట్టర్కు జాక్పాట్..
ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్కు జాక్పాట్ తగిలింది. జట్టుకు దూరమై మూడేళ్లు కావొస్తుండడంతో ఇక చోటు కష్టమే అనుకుంటున్న తరుణంలో అలెక్స్ హేల్స్కు ఈసీబీ నుంచి పిలుపొచ్చింది. అక్టోబర్లో జరగనున్న ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్కు ఈసీబీ.. గాయంతో దూరమైన జానీ బెయిర్ స్టో స్థానంలో అలెక్స్ హేల్స్ను ఎంపిక చేసింది. టి20 ప్రపంచకప్తో పాటు మెగాటోర్నీకి ముందు పాకిస్తాన్తో ఆడనున్న ఏడు మ్యాచ్ల టి20 సిరీస్కు కూడా హేల్స్కు చోటు దక్కింది. కాగా పాకిస్తాన్తో సెప్టెంబర్ 20, 22, 23, 25, 28, 30, అక్టోబర్ 2వ తేదీన ఇంగ్లండ్ ఏడు టి20లు ఆడనుంది. ఇక ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఇక అలెక్స్ హేల్స్ 2019లో ఇంగ్లండ్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. 2019 వన్డే వరల్డ్కప్కు ముందు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా హార్డ్ హిట్టర్ జానీ బెయిర్ స్టో అనూహ్యంగా గాయంతో వైదొలగడంతో అలెక్స్ హేల్స్ మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు తలుపులు తెరుచుకున్నాయి. ఇక బెయిర్ స్టో ఇటీవలే గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. గోల్ఫ్ ఆడుతున్న తరుణంలో మోకాలు కింది భాగంలో తీవ్ర గాయం కావడంతో పాకిస్తాన్ సిరీస్తో పాటు టి20 ప్రపంచకప్కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. ఈ మధ్య కాలంలో అలెక్స్ హేల్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 33 ఏళ్ల హేల్స్ ఇటీవలే జరిగిన హండ్రెడ్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్లో ఒకడిగా ఉన్నాడు. 2020 నుంచి చూసుకుంటే అలెక్స్ హేల్స్ టి20ల్లో 111 ఇన్నింగ్స్లో 3376 పరుగులు సాధించాడు. అతని కంటే ముందు పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ 3435 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక టి20 క్రికెట్లో 10వేల పరుగుల మార్క్ను అందుకున్న క్రికెటర్ల జాబితాలో అలెక్స్ హేల్స్ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక హేల్స్ ఇంగ్లండ్ తరపున 60 టి20ల్లో 1644 పరుగులు, 70 వన్డేల్లో 2419 పరుగులు, 11 టెస్టుల్లో 573 పరుగులు సాధించాడు. Alex Hales has also been added to our squads for the #T20WorldCup and IT20 tour of Pakistan 🏏 — England Cricket (@englandcricket) September 7, 2022 చదవండి: పాక్ కెప్టెన్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్ Nick Kyrgios: వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు! -
జట్టును ప్రకటించి 24 గంటలు కాలేదు.. టి20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ స్టార్ దూరం
అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శుక్రవారం 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. కాగా జట్టును ప్రకటించి 24 గంటలు గడవకముందే ఇంగ్లండ్కు బిగ్షాక్ తగిలింది. విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో అనూహ్య రీతిలో టి20 ప్రపంచకప్కు దూరమయ్యాడు. ''బెయిర్ స్టో దూరమవడం మా దురదృష్టం. శుక్రవారం లీడ్స్లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో కాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది.దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బెయిర్ స్టోను పరిశీలించిన వైద్యులు సర్జరీ అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్తో పాటు టి20 ప్రపంచకప్కు దూరం కానున్నాడు'' అని ఈసీబీ పేర్కొంది. కాగా ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు బెయిర్ స్టో స్థానంలో బెన్ డకెట్ను ఎంపిక చేశారు. అయితే టి20 ప్రపంచకప్కు మాత్రం బెయిర్ స్టో స్థానంలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. కాగా బెయిర్ స్టో తన గాయంపై స్పందించాడు. ''ఇవాళ ఉదయం గోల్ఫ్ కోర్సులో గేమ్ ఆడుతుండగా జారి పడ్డాను. దీంతో కాలి కింది భాగంలో గాయం కావడంతో వైద్యులు సర్జరీ అవసరమన్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచకప్కు దూరం కావడం బాధిస్తోంది. నేను ఆడకపోయినప్పటికి మా కుర్రాళ్లకు ఆల్ ది బెస్ట్'' అని చెప్పుకొచ్చాడు. ఇక టి20 ప్రపంచకప్కు ఈసీబీ ప్రకటించిన జట్టులో స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు రాగా.. జేసన్ రాయ్కు మొండిచేయి ఎదురైంది. తాజాగా గాయంతో బెయిర్ స్టో కూడా దూరమయ్యాడు. కాగా రాయ్ ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున ఆడిన 11 టీ20 మ్యాచ్లలో మొత్తంగా 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్తో మ్యాచ్తో మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2022కు ఈసీబీ ప్రకటించిన ఇంగ్లండ్ జట్టు : జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' KL Rahul: 'మరో రెండు మ్యాచ్లు చూస్తారు.. తర్వాత తీసేయడమే' -
సొంత బోర్డు షాకివ్వడంతో.. ఇబ్బందుల్లో ఇంగ్లండ్ క్రికెటర్
ఇంగ్లండ్ క్రికెటర్ ఆడమ్ లిత్కు ఈసీబీ షాక్ ఇచ్చింది. ఇకపై ఈసీబీ పరిధిలో జరిగే ఏ మ్యాచ్లోనూ ఆడమ్ లిత్ బౌలింగ్ వేయకుండా అతనిపై నిషేధం విధించింది. అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. జూలై 16న విటాలీటి బ్లాస్ట్లో భాగంగా లంకాషైర్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆడమ్ లిత్ ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 15 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్కు ఆన్ఫీల్డ్ అంపైర్లుగా ఉన్న డేవిడ్ మిల్న్స్, నీల్ మాలెండర్లు ఆడమ్ లిత్ బౌలింగ్ యాక్షన్పై అభ్యంతరం చెప్పారు. లిత్ యొక్క బౌలింగ్ యాంగిల్లో చేయి 15-డిగ్రీల థ్రెషోల్డ్ మార్క్ను అధిగమించినట్లుగా కనిపించిదని పేర్కొన్నారు.అంపైర్ల ఫిర్యాదుతో లాఫ్బరో యునివర్సిటీలోని గ్రౌండ్లో ఆడమ్ లిత్ బౌలింగ్పై ఈసీబీ అధికారులు అసెస్మెంట్ నిర్వహించారు. బౌలింగ్ యాక్షన్ కాస్త తేడాతా అనిపించడంతో ఈసీబీ రెగ్యులేషన్ టీంకు పంపించారు. వారి నివేదిక వచ్చిన అనంతరం.. మరోసారి బౌలింగ్ రీ-అసెస్మెంట్ నిర్వహించే వరకు ఆడమ్ లిత్ బౌలింగపై నిషేధం కొనసాగుతుంది. దీంతో ప్రస్తుతం హండ్రెడ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఆడమ్ లిత్ బౌలింగ్ వేయకూడదని ఉత్తర్వులు వచ్చాయి. కాగా ఆడమ్ లిత్ హండ్రెడ్ టోర్నమెంట్లో నార్తన్ సూపర్ చార్జర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం టోర్నీలో మూడు మ్యాచ్లు కలిపి 132 పరుగులు చేసిన ఆడమ్ లిత్ టాప్ స్కోరర్గా కొనసాగతున్నాడు. ఇక అంతకముందు యార్క్షైర్ తరపున కౌంటీ సీజన్లో పాల్గొన్న ఆడమ్ లిత్ 10 మ్యాచ్లు కలిపి 608 పరుగులు చేశాడు. అంంతేకాదు విటాలిటీ బ్లాస్ట్ 2022 టోర్నమెంట్లోనూ ఆడమ్ లిత్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మొత్తం 16 మ్యాచ్లాడి 177 స్ట్రైక్రేట్తో 525 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఏడు టెస్టులు ఆడిన ఆడమ్ లిత్ 265 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ ఉంది. చదవండి: ఏడుసార్లు గెలిచి చరిత్రకెక్కాడు.. ఈసారి మాత్రం అవమానం! CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా.. -
భారత్ను కాదని ఇంగ్లండ్కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు
టీమిండియా మాజీ పేసర్ రుద్రప్రతాప్ సింగ్ (సీనియర్) కుమారుడు హ్యారీ సింగ్ ఇంగ్లండ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడనున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న ద్వైపాక్షిక అండర్-19 సిరీస్కు హ్యారీ సింగ్ ఎంపికయ్యాడు. కొన్నాళ్ల నుంచి హ్యారీ సింగ్తన బ్యాటింగ్తో అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అండర్-19లో రాణిస్తే.. సీనియర్ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండడంతో హారి సింగ్కు ఇది కీలకం కానుంది. కాగా హ్యారీ సింగ్ లంకాషైర్ జూనియర్ టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు. కాగా అండర్-19కు ఎంపికైన తన కుమారుడిపై సీనియర్ ఆర్పీ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ఎక్స్ప్రెక్స్కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' కొద్ది రోజుల క్రితం, ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు హ్యారీని ఎంపిక చేసినట్లు ఈసీబీ నుంచి కాల్ వచ్చింది. శ్రీలంక అండర్-19 జట్టుతో స్వదేశంలోనే ఈ సిరీస్ ఆడనుంది. అయితే హారీ ఎంపిక అంత సులభంగా కాలేదు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొంచెం అదృష్టంతో పాటు పరుగులు చేయడం కూడా అవసరం. 90వ దశకంలో మన భారత్లో దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తున్న చాలా మంది క్రికెటర్లను చూశాను. కానీ వారు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఘోరంగా విఫలమయ్యారు. హ్యారీ ఎదుగుతున్న కొద్దీ.. ప్రతి క్రికెటర్ చేసే టెక్నికల్ సర్దుబాట్లను చేయడానికి కష్టపడాల్సి వచ్చింది.'' అని పేర్కొన్నాడు. కూతురు, కుమారుడితో మాజీ క్రికెటర్ రుద్రప్రతాప్ సింగ్ సీనియర్ ఇక లక్నోకు చెందిన సీనియర్ రుద్రప్రతాప్ సింగ్(ఆర్పీ సింగ్) 1986లో టీమిండియా తరపున ఆస్ట్రేలియాతో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కేవలం రెండు వన్డే మ్యాచ్ల్లో మాత్రమే అతను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కపిల్దేవ్ కెప్టెన్సీలోనే ఆర్పీ సింగ్ ఈ రెండు మ్యాచ్లు ఆడాడు. ఇక దేశవాలీ క్రికెట్లో ఉత్తర్ ప్రదేశ్కు ఆడిన ఆర్పీ సింగ్ 59 ఫస్ట్క్లాస్, 21 లిస్ట్ -ఏ మ్యాచ్లు ఆడాడు. ఇక ఆర్పీ సింగ్ బ్రిటన్కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి లండన్లోనే సెటిలయ్యాడు. కాగా ఆర్పీ సింగ్ కూతురు కూడా మెడిసిన్ చదవడానికి ముందు లంకాషైర్ తరపున అండర్-19 క్రికెట్కు ప్రాతినిధ్యం వహించింది. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. సీనియర్ ఆర్పీ సింగ్ అరంగేట్రం చేసిన 19 ఏళ్లకు.. అంటే 2005లో టీమిండియా తరపున మరో ఆర్పీ సింగ్(రుద్రప్రతాప్ సింగ్) అరంగేట్రం చేశాడు. ఇతనికి కూడా ఉత్తర్ప్రదేశ్ కావడంతో.. సీనియర్ ఆర్పీ సింగ్కు బంధువు అని చాలా మంది అనుకున్నారు. కానీ సీనియర్ ఆర్పీ సింగ్తో.. జూనియర్ ఆర్పీ సింగ్కు ఎలాంటి సంబంధం లేదు. ఇక జూనియర్ ఆర్పీ సింగ్ టీమిండియా తరపున 2005-2011 వరకు బౌలింగ్లో ఆర్పీ సింగ్ కీలకపాత్ర పోషించాడు. టీమిండియా గెలిచిన 2007 టి20 వరల్డ్కప్ జట్టులో ఆర్పీ సింగ్ సభ్యుడు. అంతేకాదు ఆ టోర్నీలో రెండో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. 2018లో ఆర్పీ సింగ్ అన్ని ఫార్మాట్లు సహా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. చదవండి: Asia Cup 2022: టీమిండియా వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి! Asia Cup 2022: ఆసియా కప్లో భారత్, పాక్లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..! -
పంత్కు సపోర్టు.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు దినేశ్ కార్తీక్ కౌంటర్
భారత జట్టుపై కొందరు ఇంగ్లీష్ క్రికెటర్లు ప్రతీసారి ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్లేయర్లను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తారు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. దీంతో, టీం ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, ఇంగ్లాండ్- టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 416 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 84 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక, భారత జట్టు 98 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన దశలో టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. భారత జట్టు స్కోర్ బోర్డును జడేజాతో కలిసి ముందుకు తీసుకెళ్లాడు. కాగా, పంత్ 146 పరుగుల వద్ద జో రూట్ బౌలింగ్లో అవుట్ అయిన విషయం తెలిసిందే. ఇక, మొదటి రోజు మ్యాచ్ హైలెట్స్ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యూట్యూబ్లో పెట్టింది. కానీ, దానికి టైటిల్.. మాత్రం ఇంగ్లాండ్ జట్టును పొడుగుతున్నట్టుగా రాసుకొచ్చింది. రిషబ్ పంత్ను ఔట్ చేసిన రూట్ అని ఇచ్చింది. ఇక ఈ టైటిల్ను చూసిన దినేష్ కార్తీక్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై సెటైర్స్ వేశాడు. కార్తీక్ ట్విట్టర్ వేదికగా.. ‘‘రిషబ్ పంత్ అటువంటి ఆకట్టుకునే అద్భుతమైన బ్యాటింగ్ చేసిన తర్వాత.. ఇంగ్లాండ్ బోర్డు ఇంతకంటే మంచి టైటిల్ పెట్టవచ్చు. కానీ, రెండు జట్లు ఇంత మంచి క్రికెట్ ఆడిన తర్వాత కూడా ఇంగ్లాండ్ బోర్డుకు మంచి టైటిల్ రానట్లుంది” అని రాసుకొచ్చాడు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అనంతరం.. ఎవరు మంచి ప్రదర్శ చేస్తారో వార పేరునే టైటిల్స్ పెడతారు. కానీ, ఈసీబీ మాత్రం అలా చేయకపోవడంతో దినేశ్ కార్తీక్ ఇలా కౌంటర్ అటాక్ ఇచ్చాడు. After such an engrossing, enthralling days play, I'm sure the headline can be much better and apt than this @ECB_cricket That knock by @RishabhPant17 land the quality of test cricket played by both sides were as good as it can be and this is how you sum up a day 🤔#ENGvIND pic.twitter.com/T51tBycL6W — DK (@DineshKarthik) July 2, 2022 ఇది కూడా చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే బ్రాడ్ అత్యంత చెత్త రికార్డు.. తొలి బౌలర్గా..! -
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు.. టీమిండియా అభిమానులకు గుడ్న్యూస్
బర్మింగహమ్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ సహా ఉపఖండం అభిమానుల కొరకు మ్యాచ్ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి జూలై 1న టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకి( ఇంగ్లండ్ లోకల్ టైం ఉదయం 11 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా ఈసీబీ మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు మార్చింది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు(లోకల్ టైం ఉదయం 10:30 గంటలు) ప్రారంభమై రాత్రి 10 లేదా 10:30 గంటల వరకు జరగనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న టెస్టు మ్యాచ్లో రోజు 90 ఓవర్లు ఆట సాధ్యమయ్యేలా ఈసీబీ ప్రణాళికలు రచించిందిఇక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూలై 7, 9,10 తేదీల్లో మూడు టి20లు.. ఆ తర్వాత జూలై 12,14, 17వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. కాగా రోహిత్ శర్మ కరోనా పాజిటివ్గా తేలినట్లు ఆదివారం ఉదయం బీసీసీఐ ట్విటర్లో తెలిపింది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్గా తేలిన రోహిత్.. ఆర్టీపీసీఆర్లోనే పాజిటివ్ వస్తే వారం రోజులు ఐసోలేషన్లో ఉండాల్సి వస్తుంది. దీంతో ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ లేదా కోహ్లి, రహానేలలో ఎవరో ఒకరు తుది జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? IND vs LEIC: షమీని ఎదుర్కోలేక జట్టు మారిన పుజారా.. -
ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం.. అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ జిమ్ పార్క్స్(90) బుధవారం కన్నుమూశాడు. అతను మృతి చెందే నాటికి ఇంగ్లండ్ తరపున అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. జిమ్ పార్క్స్ అనారోగ్య కారణాలతో బాధపడుతూ గత వారం ఇంగ్లండ్లోని వార్తింగ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కాగా ఇవాళ ఉదయం చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. జిమ్ పార్క్స్ మృతి విషయాన్ని ససెక్స్ వెల్లడించింది. 'జిమ్ పార్క్స్ మరణ వార్త మమ్మల్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. తన కెరీర్లో కౌంటీల్లో ససెక్స్ తరపున ఎక్కువకాలం ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ క్రికెట్కు అతను అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆ మృతి పట్ల ప్రగాడ సానభూతి ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.' అంటూ తెలిపింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కూడా జిమ్ పార్క్స్ మృతిపై సంతాపం తెలిపింది. ''నిజంగా చాలా విషాదకరమైన వార్త. అతనో గుర్తుంచుకోదగ్గ ఆటగాడు. ససెక్స్, సోమర్సెట్, ఇంగ్లండ్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. జిమ్ పార్క్స్ కుటుంబసభ్యులకు, మిత్రులకు మా ప్రగాడ సానభూతి'' ఇక జిమ్ పార్క్స్ 1954 నుంచి 1968 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరపున 46 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 2వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్ అయినప్పటికి లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్కు వచ్చే జిమ్ పార్క్ తాను చేసిన రెండు సెంచరీలు 8వ స్థానంలో రావడం విశేషం. 1959/60 ఏడాదిలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో 101 నాటౌట్, అలాగే అదే ఏడాది డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 108 పరుగులు నాటౌట్తో జిమ్ పార్క్స్ గుర్తింపు పొందాడు. ఇక 1931లో జన్మించిన జిమ్ పార్క్స్ 18 ఏళ్ల వయసులో ససెక్స్ తరపున కౌంటీల్లో అరంగేట్రం చేసిన పార్క్స్.. ససెక్స్, సోమర్సెట్ తరపున 739 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 132 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు. బ్యాట్స్మన్గా తన కెరీర్ను ప్రారంభించినప్పటికి అప్పటి కోచ్ల ప్రోత్సాహంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అవతారంలోకి మారాడు. అయితే వికెట్ కీపర్ కంటే బ్యాట్స్మన్గానే తాను ఎక్కువగా ఇష్టపడతానని జిమ్ పార్క్స్ చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్పై దాడి.. పరిస్థితి విషమం -
చారిత్రక లార్డ్స్ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది'
ఇంగ్లండ్లోని లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్లో లార్డ్స్ స్టేడియానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంగ్లండ్లో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు, మేజర్ టోర్నీలు జరిగినా ఫైనల్ మ్యాచ్ మాత్రం లార్డ్స్ స్టేడియంలోనే నిర్వహించడం ఆనవాయితీ. లార్డ్స్ బాల్కనీ నుంచి కప్ను అందుకోవడం ప్రతీ జట్టు కెప్టెన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. లార్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే పూర్తి సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. అది టెస్టు.. వన్డే.. టి20 ఏదైనా సరే వంద శాతం ప్రేక్షకులు ఉంటారు. అలాంటి పేరున్న లార్డ్స్ స్టేడియానికి మొదటిసారి అవమానం జరిగింది. జూన్ 2న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలిసారి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు మాత్రం చాలా టికెట్స్ మిగిలిపోయాయి. దీనికి కారణం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) టికెట్స్ ధరలు పెంచడమేనంట. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లార్డ్స్ టెస్టు తొలి నాలుగు రోజులకు 20వేల టికెట్లు మిగిలిపోయినట్లు సమాచారం. బార్మీ ఆర్మీ పేర్కొన్న ప్రకారం ఒక టికెట్పై 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల దాకా పెంచడంతో క్రికెట్ ఫ్యాన్స్ టికెట్స్ కొనుగోలు చేయడంపై వెనక్కి తగ్గారు. ఒక టెస్టు మ్యాచ్కు అంత టికెట్ ధర ఉంటే ఎలా కొంటామని.. దీనికంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడం బెటర్ అని చాలామంది ఫ్యాన్స్ వాపోయారు. సోమవారం సాయంత్రం వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం.. తొలి రోజున 1800 టికెట్లు, రెండో రోజుకు 2500 టికెట్లు, మూడోరోజుకు 4600 టికెట్లు, నాలుగో రోజుకు 9600 టికెట్లు మిగిలే ఉన్నాయని తేలింది. ఇక జో రూట్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాకా.. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్కు ఫుల్క్రేజ్ వచ్చింది. కాగా లార్డ్స్ స్టేడియంలో టికెట్ల రేట్లు పెంపుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఈసీబీని ట్విటర్ వేదికగా ఎండగట్టాడు. ''చారిత్రాక లార్డ్స్ మైదానానికి ఇది పెద్ద అవమానం. లార్డ్స్లో టెస్టు మ్యాచ్ జరుగుతుందంటే తొలిరోజు పూర్తిస్థాయిలో స్టేడియం నిండుతుంది. కానీ తొలిసారి స్టేడియం ఫుల్ కావడం లేదు. ఇది భరించలేకుండా ఉంది. ఒక్కసారిగా టికెట్స్ ధరలు అంత పెంచడంపై ఈసీబీ మర్మమేంటో అర్థం కావడం లేదు. ఒక్క టికెట్పై 100 నుంచి 160 పౌండ్లు పెంచడమేంటి.. అంత ధర ఎందుకు? ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి. వారి పేరెంట్స్తో కలిసి మ్యాచ్ చూడాలని స్టేడియాలకు వస్తుంటారు. కాబట్టి అమ్ముడపోని టికెట్స్ను పిల్లల కోసం ప్రత్యేకంగా టికెట్ ధరను 40 పౌండ్లుగా నిర్ణయించి స్టేడియంను ఫుల్ చేస్తే బాగుంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్..! T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్లోకి దూసుకెళ్లిన బంతి Lords not being full this week is embarrassing for the game .. Try & blame the Jubilee if they want but I guarantee if tickets weren’t £100 - £160 it would be jam packed !!! Why are they so expensive ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 How about working out a way to get the tickets remaining at Lords to kids with a parent for £40 to make sure it is full .. it’s the school holidays and lots of kids will be around to go to the Test match ?? @HomeOfCricket ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 -
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్గా అతడే.. హెడ్కోచ్గా గ్యారీ కిర్స్టన్!
Ben Stokes: వరుస పరాజయాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో ఇంగ్లండ్ కెప్టెన్సీకి జో రూట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలు వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం అతడిపై వేటు వేయాలని డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో అతడు స్వయంగా తానే కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో స్టార్ ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ బెన్స్టోక్స్ ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నూతన మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో సమావేశం అనంతరం టెస్టు కెప్టెన్సీ తీసుకునేందుకు స్టోక్స్ అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ నియామకానికి సంబంధించి పేపర్ వర్క్ పూర్తైన అనంతరం అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. రాబ్ కీ గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించనున్నాడు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టన్ను లేదంటే ఆస్ట్రేలియా మాజీ కోచ్ సైమన్ కటిచ్ను ఇంగ్లండ్ హెడ్కోచ్గా నియమించే యోచనలో రాబ్ కీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మానసిక ఆందోళనల కారణంగా కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. యాషెస్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అతడు.. వెస్టిండీస్తో సిరీస్లో అదరగొట్టాడు. విండీస్తో రెండో టెస్టు సందర్భంగా.. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. చదవండి👉🏾Sanju Samson: సంజూ బాగానే ఆడుతున్నాడు.. కానీ టీమిండియాలో చోటు దక్కడం కష్టమే! -
సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి
ఐపీఎల్ 2022 సీజన్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మధ్యలోనే వైదొలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి అంచె పోటీలకు అందుబాటులో ఉండనున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండో అంచె పోటీలకు మాత్రం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఐపీఎల్ 15వ సీజన్ను మార్చి 27 నుంచి మే చివరివారం వరకు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా అంతకముందు ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం నిర్వహించనున్నారు. ఈసారి మెగావేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు చాలా మందే తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ టెస్టు జట్టులో సభ్యులైన జానీ బెయిర్ స్టో, మార్క్వుడ్, డేవిడ్ మలన్, ఓలీ పోప్, క్రెయిగ్ ఓవర్టన్, సామ్ బిల్లింగ్స్, డాన్ లారెన్స్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా యాషెస్ సిరీస్లో పాల్గొన్నారు. ఇక రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న జాస్ బట్లర్ కూడా టెస్టు జట్టులో సభ్యుడే. చదవండి: మెగా వేలంలో నాకోసం లక్నో బడ్జెట్ ఎంత? బేస్ ప్రైస్ ఇక జూన్ 2 నుంచి లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ న్యూజిలాండ్తో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే.. టెస్టు జట్టులోని ఆటగాళ్లు కనీసం 15 రోజుల ముందు నుంచే అందుబాటులో ఉండేలా ఈసీబీ ప్లాన్ చేసుకుంటుంది. అందుకోసం ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లను సీజన్ మధ్యలోనే వెనక్కి పిలిపించే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కీలకం కావడంతో ఈసీబీ ఆటగాళ్లను రప్పించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో ఐపీఎల్ సీజన్లో కీలకమైన రెండో దశ పోటీలు జరగనున్న సమయంలోనే వాళ్లు వెనక్కి రావాల్సి ఉంటుంది. అసలే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను 4-0తో దారుణ పరాభవం చూసిన ఇంగ్లండ్.. మళ్లీ టెస్టుల్లో పునర్వైభవం తెచ్చుకోవాలని భావిస్తోంది. అయితే ఈసీబీ తీరుపై ఐపీఎల్ అభిమానులు మాత్రం మండిపడ్డారు. వేలంలో కోట్టు కుమ్మరించి ఆటగాళ్లను తీసుకుంటారు. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండాలని ఆయా ఫ్రాంచైజీలు కోరుకుంటాయి. ఇలా సగం సీజన్ ఆడి.. మిగతా మ్యాచ్లు ఆడకుండా వెళ్లిపోవడం బాగుండదు. సగం సీజన్ ఆడే బదులు అక్కడే ఉండిపోండి.. మీకు ఖర్చులు దండగా అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Australian Open 2022: ఫైనల్కు దూసుకెళ్లిన నాదల్.. కన్నీటిపర్యంతం -
పాకిస్తాన్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణలు
ECB Chief issues apology To Pakistan: భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్ల మానసిక, శారీరక క్షేమం ముఖ్యమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పాక్ పర్యటను రద్దు చేసుకుంది. ఈ అయితే పాక్ పర్యటనను ఇంగ్లండ్ రద్దు చేసుకోవడంపై ఆ జట్టు క్రికెట్ బోర్డుపై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ద్వజం ఎత్తారు. ఈ క్రమంలో స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛీప్ ఇయాన్ వాట్మోర్ క్షమాపణలు తెలిపారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు. "ముఖ్యంగా మా నిర్ణయంతో పాకిస్తాన్ బాధపడినందకు నేను చింతిస్తున్నాను. బోర్డు తీసుకున్న నిర్ణయం చాలా క్లిష్టమైనది. మా ఆటగాళ్లు, సిబ్బంది సంక్షేమం, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటన కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎదురుచూస్తోంది ”అని వాట్మోర్ డైలీ మెయిల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. అయితే ఈసీబీ ఛీప్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌదరి ముక్తకంఠంతో స్వాగతించారు. "వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్ రాబోతుందని ప్రకటించడం చాలా సంతోషకరం. పాకిస్థాన్ క్రికెట్కు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని మాజీ క్రికెటర్లకు, మీడియా, క్రికెట్ అభిమానులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా''. అని ఆయన ట్వీట్ చేశారు చదవండి: కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..? -
క్రికెట్లో సరికొత్త ఫార్మాట్ 'ద హండ్రెడ్'.. రూల్స్ ఇలా ఉండబోతున్నాయి
The Hundred Rules: వందేళ్లకుపైగా ఘన చరిత్ర కలిగిన క్రికెట్ క్రీడ ఎప్పటికప్పుడు కొత్తగా అభిమానుల ముందుకు వస్తూనే ఉంది. ఈ ఆటలో తొలుత సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ మాత్రమే భాగంగా కాగా, ఆతర్వాతి కాలంలో వన్డేలు, టీ20లు, టీ10 లీగ్లు వచ్చి చేరాయి. ఇప్పుడు తాజాగా హండ్రెడ్ పేరుతో మరో కొత్త ఫార్మాట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్నింగ్స్కు 100 బంతుల చొప్పున ఉండే ఈ ఫార్మాట్లో ఎనిమిది పురుషుల జట్లు, ఎనిమిది మహిళా జట్లు ఉంటాయి. తాజాగా దీనికి సంబంధించిన నియమ నిబంధనలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విడుదల చేసింది. దీంతో ఈ సరికొత్త ఫార్మాట్ ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన రూల్స్ ఎలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం. * ఈ కొత్త ఫార్మాట్లో టాస్ గ్రౌండ్లోనే వేయాలన్న రూలేమీ లేదు. * ఈ ఫార్మాట్లో ఓవర్లు ఉండవు. బాల్స్ ఆధారంగానే ఇన్నింగ్స్ మారుతుంది. ఒక బౌలర్ ఒకే ఎండ్ నుంచి రెండుసార్లు ఐదేసి బంతులు వేయాల్సి ఉంటుంది. తొలి ఐదు బంతులు ముగిసిన తర్వాత అంపైర్ ఓ వైట్ కార్డు చూపిస్తాడు. ఓ సెట్ పూర్తయినట్లుగా ప్రేక్షకులు, స్కోరర్లు, కామెంటేటర్లు, బ్రాడ్కాస్టర్లకు తెలియడానికి ఇలా చేస్తారు. * ఇందులో తొలి 25 బంతులు పవర్ ప్లేగా పరిగణించబడతాయి. ఈ సమయంలో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. * పవర్ ప్లే ముగిసాక ఫీల్డింగ్ టీమ్ ఎప్పుడైనా రెండు నిమిషాల స్ట్రేటజిక్ టైమౌట్(బ్రేక్) తీసుకోవచ్చు. * అలాగే, బ్యాట్స్మెన్ క్యాచ్ అవుటైన తర్వాత అవతలి బ్యాట్స్మన్ క్రాస్ అయ్యాడా లేదా అన్నదానితో సంబంధం లేకుండా కొత్త బ్యాట్స్మన్ స్ట్రైక్ తీసుకోవాలి. * గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ టై అయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. అదే ఎలిమినేటర్, ఫైనల్లో టై అయితే.. సూపర్ ఫైవ్ ఆడాల్సి ఉంటుంది. అంటే ఒక్కో టీమ్ ఐదు బాల్స్ ఆడాల్సి ఉంటుంది. * ఒకవేళ సూపర్ ఫైవ్ కూడా టై అయితే.. మరో సూపర్ ఫైవ్ ఆడిస్తారు. అది కూడా టై అయితే.. గ్రూప్ స్టేజ్లో టాప్లో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. * వర్షం వల్ల ప్రభావితమైన మ్యాచ్లలో కొత్త డీఎల్ఎస్ పద్ధతిని అమలు చేస్తారు. * ఒకవేళ జట్టు నెమ్మదిగా బౌలింగ్ చేస్తుందనుకుంటే అంపైర్కే పెనాల్టీ విధించే హక్కు ఉంటుంది. ఇలా జరిగితే ఫీల్డింగ్ టీమ్కు సర్కిల్ బయట ఒక ఫీల్డర్ను తగ్గించాల్సి ఉంటుంది -
ఇంగ్లండ్ జట్టులో కరోనా కలకలం
లండన్: శ్రీలంకను పరిమిత ఓవర్ల సిరీస్లలో ఊదేసిన ఇంగ్లండ్ జట్టును కరోనా వైరస్ చుట్టుముట్టింది. ముగ్గురు ఆటగాళ్లతో పాటు నలుగురు సహాయక సిబ్బందికి కోవిడ్ సోకింది. ఇలా ఏకంగా ఏడుగురు వైరస్ బారిన పడటంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఉలిక్కి పడింది. ఇక చేసేదేమీ లేక పాకిస్తాన్తో జరిగే సిరీస్కు జట్టును మార్చేసింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో పూర్తిగా కొత్త జట్టును ప్రకటించింది. 18 మందిలో సగం మంది కొత్త ముఖాలే! లంకతో ఆడినట్లుగానే పాక్తో కూడా ఇంగ్లండ్ జట్టు మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడనుంది. గురువారం కార్డిఫ్లో జరిగే తొలి వన్డేతో ఇంగ్లండ్, పాక్ సిరీస్ మొదలవుతుంది. ఇదిలావుండగా కరోనా బారిన పడిన క్రికెటర్ల పేర్లుగానీ సహాయ సిబ్బందిలో ఎవరెవరికి సోకిందనే విషయాలు ఈసీబీ బయటకు వెల్లడించలేదు. మొత్తం జట్టును ఐసోలేషన్లో ఉంచింది. కోవిడ్ సోకిన ఏడు మందితో టచ్లో ఉన్న ఇంకెంతమందికి వైరస్ సోకు తుందోనని ఈసీబీ ఆందోళన పడుతుంది. ఇంగ్లండ్ వన్డే జట్టు: స్టోక్స్ (కెప్టెన్), జేక్బాల్, బ్రిగ్స్, కేర్స్, క్రావ్లీ, డకెట్, గ్రేగొరి, హెల్మ్, జాక్స్, లారెన్స్, సాఖిబ్, మలాన్, ఓవర్టన్, పార్కిన్సన్, పేన్, సాల్ట్, సింప్సన్, విన్స్. -
కోహ్లీ సేనకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మ్యాచ్కు ఓకే చెప్పిన ఈసీబీ
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును (ఈసీబీ) ఒప్పించింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బరిలో దిగిన భారత్.. సౌతాంఫ్టన్ పరిస్థితులను అర్ధం చేసుకోలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తప్పు మరోసారి పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. దీంతో జులై 20-22 మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను ఈసీబీ షెడ్యూల్ చేసిందని తెలుస్తోంది. అయితే భారత జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బయో బబుల్ నుంచి బయటకు వచ్చి.. కుటుంబంతో గడుపుతున్న కోహ్లీసేన తిరిగి రాగానే ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, భారత్, ఇంగ్లండ్ల మధ్య ఆగష్టు 4 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. -
శ్రీలంకతో చివరి వన్డే: హార్డ్ హిట్టర్ వచ్చేస్తున్నాడు
లండన్: శ్రీలంక జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్ వన్డే సిరీస్పై కూడా కన్నేసింది. అందుకు తగ్గట్టుగానే తొలి వన్డేలో లంకపై ఇంగ్లండ్ మంచి విజయాన్ని అందుకుంది. కాగా నేడు ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇదిలా ఉంటే శ్రీలంకతో జరగనున్న చివరి వన్డేకు ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ టామ్ బాంటన్ను ఈసీబీ జట్టులోకి తీసుకొచ్చింది. డేవిడ్ మలన్కు బ్యాకప్గా టామ్ బాంటన్ను తీసుకున్నట్లు తెలిపింది. కాగా డేవిడ్ మలన్ వ్యక్తిగత కారణాల రిత్యా వన్డే సిరీస్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చివరి వన్డే బ్రిస్టల్ వేదికగా జూలై 4న జరగనుంది. టామ్ బాంటన్ ఇటీవలే టీ20 బ్లాస్ట్లో సోమర్సెట్ తరపున 47 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్ ఆధారంగా టామ్ బాంటన్ను మరోసారి జట్టులోకి పిలిచినట్లు తెలుస్తుంది. ఇక టీ20 బ్లాస్ట్లో సోమర్సెట్ తరపున ఆడుతున్న బాంటన్ ఈరోజే జట్టుతో కలవనుండడంతో డెర్బిస్తో జరగనున్న మ్యాచ్కు దూరం కానున్నాడు. ఇక బాంటన్ చివరిసారిగా ఇంగ్లండ్ తరపున ఆగస్టు 2020లో ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో ఆడాడు. -
వాళ్లు నిజంగా జాత్యహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ ఎపిసోడ్పై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ స్పందించాడు. రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అతని విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్ణయం సరైందేనని, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై జీవితకాల నిషేదం విధించాలని ఈసీబీని కోరాడు. ఈ సందర్భంగా రాబిన్సన్ను వెనకేసుకొచ్చిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. గతంలో తాను లాంకషైర్ కౌంటీకి ప్రాతినిధ్యం వహించే రోజుల్లో జాతి వివక్షను ఎదుర్కొన్నానని, ఇంగ్లీష్ వాళ్లు భారతీయుల పట్ల అహంకారులుగా వ్యవహరించే వాళ్లని తెలిపాడు. వాళ్లు అప్పుడు ఇప్పుడు మన యాసను ఎగతాలి చేస్తున్నారని, వాళ్లలో జాత్యాంహంకారం బుసలు కొడుతుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ అయితే తరచూ బ్లడీ ఇండియన్స్ అంటూ సంబోధించేవాడని, అలాంటి వాడిని మన వాళ్లే అందలమెక్కించారని వాపోయాడు. ఈ విషయంలో ఇంగ్లీష్ క్రికెటర్ల తర్వాత ఆసీస్ ఆటగాళ్లుంటారని, వాళ్లు కూడా భారతీయుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. ఒకప్పుడు మనపై వివక్ష చూపిన వాళ్లంతా ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని మన బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టాడు. ఇంగ్లీష్ క్రికెటర్లు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారని, వాళ్ల నిజస్వరూపమేంటో తనకు తెలుసునని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాబిన్సన్.. తాను టీనేజర్గా ఉన్న సమయంలో ఆసియా వాసులు, ముస్లింలపై జాతి వివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: క్రికెట్ చరిత్రలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అత్యుత్తమం -
జాతి వివక్ష: చిక్కుల్లో పడిన మోర్గాన్, బట్లర్
లండన్: సోషల్ మీడియా వేదికగా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు ఇంగ్లండ్ క్రికెట్ను కుదిపేస్తున్నాయి. ఇంగ్లండ్ యువ బౌలర్ ఓలీ రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష ట్వీట్లను సీరియస్గా తీసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. అతని ట్వీట్స్పై విచారణ ప్రారంభించిన ఈసీబీ పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు గతంలో చేసిన పాత ట్వీట్లను వెలికితీస్తోంది. ఇప్పుడు ఈ వివాదం ప్రస్తుత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మెర్గాన్తో పాటు వికెట్ కీపర్ జోస్ బట్లర్లను చిక్కుల్లో పడేలా చేసింది. దీనిపై టెలిగ్రాఫ్ పత్రిక ఒక కథనం విడుదల చేసింది. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఐపీఎల్లో కోల్కతా కెప్టెన్గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా గతంలో ఇండియన్స్ను వెక్కిరిస్తూ పలు ట్వీట్లు చేశారు. మోర్గాన్, బట్లర్ ఇద్దరూ సర్ అనే పదం పదే పదే వాడుతూ ఇండియన్స్ను వెక్కిరించారు. కావాలని తప్పుడు ఇంగ్లిష్ వాడుతూ చేసిన ఆ ట్వీట్లు ఇండియన్స్ను వెక్కిరించేలాగానే ఉన్నట్లు ఈసీబీ భావిస్తోంది. 2018 ఐపీఎల్ సందర్భంగా వీళ్లు ఈ ట్వీట్లు చేశారు. బట్లర్ ఆ ట్వీట్లను తొలగించినా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ బయటకు వచ్చింది. విచారణ పూర్తయిన తర్వాత ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలో వద్దో నిర్ణయిస్తామని ఈసీబీ చెప్పినట్లు టెలిగ్రాఫ్ వెల్లడించింది. రాబిన్సన్ను సస్పెండ్ చేసిన తర్వాత వీళ్ల పాత ట్వీట్లు కూడా వైరల్ అయ్యాయి. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్పైనా విచారణ జరిగే అవకాశం ఉంది. 2010లో అతడు తన సహచర బౌలర్ బ్రాడ్ హెయిర్కట్పై స్పందిస్తూ.. 15 ఏళ్ల లెస్బియన్లా కనిపిస్తున్నాడంటూ అండర్సన్ ట్వీట్ చేశాడు. దీనిపై అండర్సన్ స్పందిస్తూ.. ఎప్పుడో పదేళ్ల కిందట అలా చేశానని, ఇప్పుడు తానో వ్యక్తిగా మారిపోయానని, తప్పులు జరుగుతూనే ఉంటాయని ఈ మధ్యే వివరణ ఇచ్చుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారుతున్న ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. మొదటి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టు జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఇంగ్లండ్ జట్టు టీమిండియాతో ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14వరకు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: జాతి వివక్ష: మరో ఇంగ్లండ్ క్రికెటర్పై వేటు పడనుందా! కేన్ విలియమ్సన్ మోచేతికి గాయం.. కివీస్లో కలవరం -
తొమ్మిదేళ్ల కిందట ట్వీట్లు.. ఇప్పుడు శిక్ష!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్లో రాణిస్తున్న ఆల్రౌండర్ ఓలీ రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఇందుకు కారణం గతంలో అతను చేసిన ఫ్రస్ట్రేషన్ ట్వీట్లే. లండన్: ఇంగ్లండ్ ఆల్రౌండర్ రాబిన్సన్ 2012-13లో తన ట్విట్టర్ అకౌంట్లో జాత్యాంహకార, సెక్సీయెస్ట్ ట్వీట్లు చేశాడు. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాగా, న్యూజిలాండ్ సిరీస్కు రాబిన్సన్ ఎంపిక కాగానే కొందరు అప్పటి ట్వీట్లను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద రచ్చే అయ్యింది. ఇక జూన్ 3న ప్రారంభమైన తొలి టెస్ట్(మ్యాచ్ డ్రా అయ్యింది)కి ముందే ఈ వివాదంపై స్పందించిన రాబిన్సన్.. ‘‘నేను చేసిన పనికి బాధపడుతున్నా. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను’’ అని రాబిన్సన్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. నా కెరీర్ అత్యంత ఘోరమైన దశలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఆ ట్వీట్లు చేశా, ఇంగ్లీష్ కౌంటీ యార్క్షైర్ నన్ను యుక్తవయసులో తరిమేసింది. ఆ ట్వీట్లు ఇప్పటికీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ప్రజలకు, నా సహచర ఆటగాళ్లకు.. అందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను’’ అని రాబిన్సన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కమిటీ రిపోర్ట్ ఆధారంగానే.. న్యూజిలాండ్తో గత బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో ఇంగ్లండ్ టీమ్లోకి అరంగేట్రం చేసిన రాబిన్సన్.. రెండు ఇన్నింగ్స్ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో 42 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ జరుగుతుండగానే ఈసీబీ అతని ట్వీట్స్పై విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీని నియమించే ముందు ‘రేసిజం కామెంట్లను ఏమాత్రం సహించబోము’’ అని ఈసీబీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కమిటీ అందించిన రిపోర్ట్ ప్రకారం.. రాబిన్సన్పై క్రమశిక్షణ చర్యల కింద ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. దాంతో.. ఈ టాలెంటెడ్ ఆల్రౌండర్ కెరీర్ సంగ్ధిగ్దంలో పడినట్లయ్యింది. చదవండి: ఏడేళ్ల గ్యాప్ తర్వాత టెస్ట్ -
ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం
లండన్: న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ముందు ఇంగ్లండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మోచేతికి శస్త్రచికిత్స కారణంగా ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగు వారాల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. సర్జరీ కారణంగా జూలై వరకు అతడు జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడే అవకాశం లేదు. గత జనవరి నుంచి గాయాల బారీన పడుతూ వస్తున్న ఆర్చర్ టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్లో మరోసారి గాయపడడంతో టోర్నీ మధ్యలోనే లండన్కు వెళ్లిపోయాడు. వైద్యులు అతన్ని పరీక్షించి శస్త్ర చికిత్స నిర్వహించారు. దీంతో ఐపీఎల్ 14వ సీజన్కు ఆర్చర్ దూరమవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లే కనిపించిన ఆర్చర్ కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొన్నాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్కు గతవారం మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. స్పెషలిస్ట్ వైద్యుల సలహా మేరకు ఆర్చర్ శుక్రవారం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఈసీబీ బుధవారం వెల్లడించింది. కాగా తాజాగా మరోసారి ఆర్చర్ గాయంతో దూరం కానుండడం ఇంగ్లండ్కు పెద్ద దెబ్బగా పరిగణించవచ్చు. కాగా ఆర్చర్ ఇంగ్లండ్ తరపున 13 టెస్టుల్లో 42 వికెట్లు.. 17 వన్డేల్లో 30 వికెట్లు.. 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. చదవండి: ఆర్చర్కు తిరగబెట్టిన గాయం... కోచ్ అసహనం -
AUS VS ENG: యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల
సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం విడుదల చేసింది. ఈసీబీతో చర్చించిన అనంతరం ఈ షెడ్యూల్ రిలీజ్ చేసినట్లు సీఏ ప్రకటించింది. కాగా పురుషుల జట్టు షెడ్యూల్తో పాటు మహిళల జట్టు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఎప్పుడైనా నవంబర్-డిసెంబర్లో జరిగే యాషెస్ సిరీస్ టీ20 ప్రపంచకప్ కారణంగా డిసెంబర్- జనవరిలో జరగనుంది. మొత్తం ఐదు టెస్టులు జరగనున్న నేపథ్యంలో బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 6 నుంచి 11 వరకు తొలి టెస్టు జరగనుంది. డిసెంబర్ 16 నుంచి 20 వరకు అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టు డే నైట్ పద్దతిలో నిర్వహించనున్నారు. ఇక బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్బోర్న్లో జరగనుండగా.. నాలుగో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 5 నుంచి 9 వరకు జరగనుంది. ఇక సిరీస్లో చివరిదైన ఐదో టెస్టు పెర్త్ వేదికగా జనవరి 14 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. అయితే యాషెస్ కన్నా ముందు అఫ్గానిస్థాన్తో ఓ టెస్టు మ్యాచ్కు ఆసీస్ అతిథ్యం ఇవ్వనుంది. అఫ్గాన్ జట్టుకు కంగారులు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2019లో ఇంగ్లండ్లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇరుజట్లు 2-2తో సమానంగా నిలిచినా.. అంతకముందు(2017-18లో) ఆసీస్ విజేతగా నిలవడంతో సంప్రదాయం ప్రకారం యాషెస్ ట్రోపీని ఆసీస్ తమవద్దే ఉంచుకుంది. కాగా నవంబర్ -డిసెంబర్లో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆసీస్ జట్టు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. ఆ తర్వాతే ఇరు జట్ల మధ్య యాషెస్ సిరీస్ మొదలుకానుంది. ఇక మహిళల జట్ల యాషెస్ సిరీస్ జవవరి- ఫిబ్రవరి మధ్యలో ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు నిర్వహించనున్నారు. చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (పురుషుల జట్టు)- యాషెస్ షెడ్యూల్ తొలి టెస్టు: డిసెంబర్ 6 నుంచి 11 వరకు (బ్రిస్సేన్) రెండో టెస్టు (డే నైట్): డిసెంబర్ 16 నుంచి 20 వరకు (అడిలైడ్) మూడో టెస్టు( బాక్సింగ్ డే టెస్టు): డిసెంబర్ 26 నుంచి 30 వరకు (మెల్బోర్న్) నాలుగో టెస్టు : జనవరి 5 నుంచి 9 వరకు (సిడ్నీ) ఐదో టెస్టు :జనవరి 14 నుంచి 18 వరకు (పెర్త్) మహిళల జట్టు- యాషెస్ షెడ్యూల్ జనవరి 27 నుంచి 30 వరకు కాన్బెర్రా వేదికగా టెస్టు మ్యచ్ ఫిబ్రవరి 4: తొలి టీ20 (సిడ్నీ) ఫిబ్రవరి 6: రెండో టీ20 (సిడ్నీ) ఫిబ్రవరి 10: మూడో టీ20 (అడిలైడ్) ఫిబ్రవరి 13: తొలి వన్డే( అడిలైడ్) ఫిబ్రవరి 16: రెండో వన్డే(మెల్బోర్న్) ఫిబ్రవరి 19 : మూడో వన్డే( మెల్బోర్న్) Lock in these dates. Two huge #Ashes series are coming right up! 🔐 Get your tickets through an early access window exclusively for our interstate travel program: https://t.co/IPV70lgiKu pic.twitter.com/s1UCND5qZK — Cricket Australia (@CricketAus) May 19, 2021 -
ఆర్చర్కు తిరగబెట్టిన గాయం... కోచ్ అసహనం
లండన్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో న్యూజిలాండ్తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్లో ఆర్చర్ ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. కాగా ఆర్చర్ ఇంతకముందు కూడా మోచేతి గాయంతోనే భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మోచేతికి సర్జీరీ చేయించుకోవడంతో ఐపీఎల్ 14వ సీజన్కు అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్కు కూడా ఆర్చర్ ఇదే కారణంతో దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకొని ససెక్స్ తరపున కౌంటీ మ్యాచ్లు ఆడుతూ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. ససెక్స్ తరపున కౌంటీ చాంపియన్షిప్ ఆడుతున్న ఆర్చర్ మంచి ప్రదర్శన కనబరుస్తూ వికెట్లు తీస్తున్నాడు. బనానా ఇన్స్వింగర్.. సాట్నర్... ఇలా రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ సరికొత్త ఆర్చర్లా కనిపించాడు. అయితే కెంట్తో జరుగుతున్న మ్యాచ్లో శనివారం ఆర్చర్ ఐదు ఓవర్లు వేసిన తర్వాత గాయం తిరగబెట్టడంతో మళ్లీ బౌలింగ్ వేయలేకపోయాడు. ఇదే విషయమై ససెక్స్ కోచ్ ఇయాన్ సాలిస్బరీ అసహనం వ్యక్తం చేశాడు.'' ఆర్చర్కు గాయం తిరగబెట్టింది. ఈరోజే బౌలింగ్ చేయలేకపోయాడు.. రేపు చేస్తాడని గ్యారంటీ లేదు. కానీ ఆర్చర్ను బౌలింగ్ చేయమని చెప్పలేం. దానికి ఈసీబీ అనుమతి అవసరం. ససెక్స్ను విజేతను చేయాలని ఆర్చర్ భావించాడు. కానీ ఇది మా చేతుల్లో లేదు.. ఈసీబీ అనుమతి ఇస్తేనే ఆర్చర్ బౌలింగ్కు వస్తాడు.''అంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో సిరీస్కు ముందు న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. గాయం తిరగబెట్టడంతో ఆర్చర్ ఈ సిరీస్ ఆడడం అనుమానమే. అయితే టీమిండియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ఐపీఎల్లో ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్లకు టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తాజాగా ఆర్చర్కు గాయం తిరగబెట్టడం ఈసీబీని ఆందోళనకు గురిచేస్తుంది. కాగా ఆర్చర్ ఇంగ్లండ్ తరపున 13 టెస్టుల్లో 42 వికెట్లు.. 17 వన్డేల్లో 30 వికెట్లు.. 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. చదవండి: మొన్న బనానా ఇన్స్వింగర్; నేడు స్నార్టర్.. నువ్వు సూపర్ ఆర్చర్ బనానా ఇన్స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్మన్ -
గాయాలతో అలసిపోయా.. అందుకే రిటైర్మెంట్
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ గార్నీ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్బై చెప్పాడు. గార్నీ ఇంగ్లండ్ తరపున 10 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లు కలిపి మొత్తం 14 వికెట్లు తీశాడు. 2014లో స్కాట్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన గార్నీ కెరీర్ మొత్తం గాయాలతో సతమతమయ్యాడు. ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతూనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే గార్నీ దేశవాలీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపాడు. నాటింగ్హమ్షైర్ తరపున 103 ఫస్ట్క్లాస్, 93 లిస్ట్ ఏ, 156 టీ20 మ్యాచ్లాడి మొత్తంగా 614 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించిన గార్నీ 8 మ్యాచ్లాడి 7 వికెట్లు తీశాడు.2017లో టీ20 బ్లాస్ట్ టోర్నీలో నాటింగ్హమ్షైర్ కప్ గెలవడంలో గార్నీ కీలకపాత్ర పోషించాడు. ఇక తన రిటైర్మెంట్పై గార్నీ స్పందిస్తూ.. ''నా రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం. 24 ఏళ్ల నా ఫస్టక్లాస్ కెరీర్లో గాయాలు చాలా ఇబ్బందులు పెట్టాయి. చివరకు గుడ్బై చెప్పే సమయంలోనూ భుజం గాయంతో బాధపడుతున్నా. అందుకే ఇక ఆడే ఓపిక లేకనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. కానీ ఇన్నేళ్ల నా కెరీర్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నాటింగ్హమ్షేర్ను మాత్రం వదల్లేదు. వీటితో పాటు ఇంగ్లండ్కు ఆడడం.. ఐపీఎల్, బిగ్బాష్, సీపీఎల్ లాంటి మేజర్ టోర్నీలో పాల్గొనడం నాకు గర్వంగా అనిపించింది. ఇక క్రికెటకు వీడ్కోలు పలికిన నేను బిజినెస్మన్గా కొత్త అవతారం ఎత్తబోతున్నా. చివరగా నా భార్య అవ్రిల్కు కృతజ్థతలు.. కష్టకాలంలో తను నాకు తోడుగా నిలబడింది.. నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు నేనే అదృష్టవంతుడిని'' అని చెప్పుకొచ్చాడు. -
Jofra Archer: ఫుల్ రిథమ్లో జోఫ్రా ఆర్చర్
లండన్: చేతి వేలికి సర్జరీ చేయించుకుని కొన్ని వారాల విరామం తర్వాత ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్న ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఫుల్ రిథమ్లో బౌలింగ్ను ఆరంభించాడు. ఈ మేరకు నెట్ సెషన్లో ఆర్చర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను కౌంటీ జట్టు ససెక్స్ ట్వీటర్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆర్చర్ బౌన్సర్తో బౌలింగ్ను ప్రారంభించగా, ఆ బౌన్సర్ను తప్పించుకునే క్రమంలో బ్యాట్స్మన్ అదుపు తప్పి కిందపడ్డాడు. కాగా, ఇన్టైమ్లో సదరు బ్యాట్స్మన్ తప్పించుకోవడంతో అతనికి ఎటువంటి గాయం కాలేదు.,. వచ్చేవారం ఆర్చర్ తన పూర్తిస్థాయి ట్రైనింగ్ను ఆరంభించినున్నట్లు ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ససెక్స్ ఆటగాడైన ఆర్చర్.. క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. గత నెలలో భారత్తో సిరీస్లో ఆర్చర్ చేతికి గాయమైంది. దాంతో సర్జరీ అనివార్యం కావడంతో ఆర్చర్ ఐపీఎల్కు దూరమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్కు ప్రధాన బౌలింగ్ ఆయుధమైన ఆర్చర్ దూరం కావడంతో ఆ జట్టు అతని లోటును పూడ్చటంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. How many runs would you get off this @JofraArcher over? 👀 pic.twitter.com/rWx3bkSpbo — Sussex Cricket (@SussexCCC) April 27, 2021 -
ఏడేళ్ల విరామం తర్వాత... తొలి టెస్టు..
లండన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఏడేళ్ల నిరీక్షణ ముగిసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు భారత జట్టుకు టెస్టు మ్యాచ్ ఆడే భాగ్యం లభించింది. ఈ ఏడాది జూన్–జూలైలలో భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఏకైక టెస్టు మ్యాచ్ సహా మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడుతుంది. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి 8న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఈ ఏడాది భారత మహిళల జట్టు ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడుతుందని ప్రకటించారు. అయితే ఆ రోజు ఆయన వేదిక, తేదీని వెల్లడించలేదు. కాగా సోమవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారత మహిళల పర్యటన వివరాలను ప్రకటించింది. జూన్ 16 నుంచి 19 వరకు (నాలుగు రోజులు) బ్రిస్టల్ మైదానంలో ఇంగ్లండ్, భారత మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు జరుగుతుందని ఈసీబీ తెలిపింది. భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్ ఆడి ఏడేళ్లయింది. చివరిసారి భారత జట్టు 2014 నవంబర్లో స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు ఆడి ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఇంగ్లండ్ జట్టుతో భారత్ 2014 ఆగస్టులో చివరిసారి టెస్టు ఆడింది. ఆ మ్యాచ్లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల జట్టు మొత్తం ఎనిమిది టెస్టులు ఆడి ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. రెండు టెస్టుల్లో నెగ్గిన టీమిండియా, మిగతా ఆరు టెస్టులను ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఓవరాల్గా భారత జట్టు 1976 నుంచి 2014 వరకు మొత్తం 36 టెస్టులు ఆడి 5 మ్యాచ్ల్లో గెలిచి, ఆరింటిలో ఓడి, 25 మ్యాచ్లను ‘డ్రా’గా ముగించింది. చదవండి: మరోసారి విలియమ్సన్కే... ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా భువీ.. -
ఫించ్కు హోల్డింగ్ స్ట్రాంగ్ కౌంటర్
ఆంటిగ్వా: ప్రపంచ వ్యాప్తంగా ఏదొక చోట నల్ల జాతీయులపై దాడులు జరుగుతున్నా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ క్రికెట్ జట్ల నుంచి మద్దతు కరువైందంటూ వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, కామెంటేటర్ మైకేల్ హెల్డింగ్ ధ్వజమెత్తాడు. నల్ల జాతీయులపై జరుగుతున్న దాడులను ప్రస్తుతం ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లో కనీసం లోగోల ద్వారా కూడా ఆ రెండు జట్ల నిరసించకపోవడాన్ని హోల్డింగ్ విమర్శించాడు. అంతకుముందు పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన సిరీస్లో సైతం ఇదే విధానం కనిపించిందన్నాడు. అంతకుముందు వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో ఇంగ్లండ్ బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ లోగోలను ధరించి క్రికెట్ ఆడగా, ఇప్పుడు మాత్రం దానికి చరమగీతం పాడటం వెనుక అర్థం ఏమిటని ప్రశ్నించాడు. వెస్టిండీస్ ఇలా స్వదేశానికి వచ్చేయగానే బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ అంశం ముగిసిపోయిందని అనుకుంటున్నారా అంటూ ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ని హోల్డింగ్ ప్రశ్నించాడు. ఇప్పుడు జరుగుతున్నది నలుపు-తెలుపు వ్యక్తుల పోరాటం కాదని, సమాన హక్కుల పోరాటమని గుర్తుంచుకోవాలన్నాడు. ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన అంశం కాదన్నాడు.(చదవండి: పొలార్డ్ గ్యాంగ్పై షారుక్ ప్రశంసలు) హోల్డింగ్ వ్యాఖ్యలపై ఈసీబీ స్పందించింది. ‘ బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ అంశంలో మాది సుదీర్ఘమైన ప్రణాళిక. ఈ క్రమంలోనే మా దేశంలోని అన్ని ప్రాంతాల క్రికెట్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. దానిపైనే ఫోకస్తో ముందుకు వెళుతున్నాం’ అని బదులిచ్చింది. ఇక దీనిపై ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ కూడా రిప్లై ఇచ్చాడు. ‘ఇప్పుడు జరుగుతున్న పోరాటం కంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు. అదే సమయంలో ఏ ఒక్కరిపై వివక్ష లేని క్రీడలో ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ ఫించ్ పేర్కొన్నాడు. ఫించ్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇది కేవలం విద్య కోసం జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు. సమానత్వపు పోరాటంలో అవగాహనా ఉద్యమంతో పాటు ఎడ్యుకేషన్ కూడా ముఖ్యమే. జాతి, మతం, నీ వర్ణం నీ లింగం ఆధారంగా ఎవరూ నిషేధం విధింపబడలేని క్రీడలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఫించ్ అంటున్నాడు. ఫించ్ ప్రకటన ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏ క్రీడలో వివక్ష లేదు. నీ ప్రకటన హాస్యాస్పదంగా ఉంది’ అంటూ హోల్డింగ్ కౌంటర్ ఇచ్చాడు. ఒకవేళ మీకు ఎవరికి నల్ల జాతీయుల ఉద్యమానికి మద్దతు అవసరం లేదనకుంటే మిమ్ముల్ని తానేమీ బలవంతంగా అందులోకి తీసుకెళ్లడానికి ఇక్కడ లేనన్నాడు. కానీ ఆచరణలో పెట్టలేని మాటలను మాట్లడవద్దన్నాడు.(చదవండి: ‘ఆ గన్ ప్లేయర్తో రైనా స్థానాన్ని పూడుస్తాం’) -
600 బుల్లెట్...
టెస్టు క్రికెట్కు ముందు వన్డేలతోనే అండర్సన్ అంతర్జాతీయ అరంగేట్రం జరిగింది. తొలి ఆరేళ్లు అతని కెరీర్ రెండు పార్శా్వలుగా సాగింది. ఒక్కసారి తనదైన జోరు మొదలైతే అద్భుతమైన బౌలర్గా కొన్ని సార్లు కనిపిస్తే... గతి తప్పాడంటే అతనికంటే చెత్త బౌలర్ మరెవరూ లేరన్నంతగా అనిపించేది. ప్రపంచంలో ప్రతీ బ్యాట్స్మెన్ అండర్సన్ బౌలింగ్ను అంతగా చితక్కొట్టారు. దాంతో జట్టులో చోటు కోల్పోవడం, వీటికి తోడు అదనంగా గాయాలు కలగలిసి అతడిని ఇబ్బందుల్లో పడేశాయి. ఎట్టకేలకు కొందరు సీనియర్ బౌలర్ల వరుస వైఫల్యాల తర్వాత 2007–08 న్యూజిలాండ్ పర్యటనతో పునరాగమనం చేసిన అండర్సన్ ఆ తర్వాత తన స్థాయిని పెంచుకుంటూ కీలకంగా మారాడు. కొద్ది రోజులకే సొంతగడ్డపై అదే జట్టుపై 7 వికెట్లు తీసి సత్తా చాటిన తర్వాత జిమ్మీకి తిరుగు లేకుండా పోయింది. ► పేస్ దళాన్ని నడిపిస్తూ... 2010నుంచి అండర్సన్ బౌలింగ్ మరింత పదునెక్కింది. జట్టు పేస్ బృందానికి నాయకుడిగా ఎదిగిన అతను దానికి తగినట్లుగా అద్భుత ప్రదర్శనలతో జట్టును గెలిపించాడు. సాంప్రదాయ స్వింగ్, సీమ్ కలగలిపి అతను అద్భుతాలు చేశాడు. ఇక పాతబడిన బంతి రివర్స్ స్వింగ్లో అతను చెప్పినట్లుగా ఆడింది. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, వరుసగా మెయిడిన్ ఓవర్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి వికెట్లు రాబట్టడం అతను తన శైలిగా మార్చుకున్నాడు. ఎలాంటి లోపాలు కనిపించకుండా సంపూర్ణ పేస్ బౌలర్ అనిపించుకున్న అండర్సన్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దృష్టిలో ప్రమాదకారిగా మారాడు. 2011లో ఇంగ్లండ్ గడ్డపై 0–4తో చిత్తుగా ఓడిన తర్వాత ధోని మాట్లాడుతూ... ‘మా రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అండర్సన్’ అని వ్యాఖ్యానించాడు. 2014 సిరీస్లో కూడా అతను విరాట్ కోహ్లిని ఎంతగా ఇబ్బంది పెట్టాడో అభిమానులెవరూ మరచిపోలేరు. ► తిరుగు లేని ప్రదర్శనలతో... టెస్టు క్రికెట్లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్కు మెల్లగా దూరం కావడం ఇంగ్లండ్ క్రికెట్లో అతి సాధారణం. ఇదే తరహాలో పూర్తి స్థాయిలో టెస్టులపై దృష్టి పెట్టేందుకు అండర్సన్ 2015లో వన్డేలనుంచి తప్పుకున్నాడు. ఆ సమయానికే పలు టెస్టు రికార్డులు అతని ఖాతాలో వచ్చి చేరాయి. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా ఇయాన్ బోథమ్ రికార్డును అధిగమించిన అనంతరం 500 వికెట్లు మైలురాయిని కూడా దాటాడు. అప్పటి వరకు పేస్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న గ్లెన్ మెక్గ్రాత్ వికెట్ల సంఖ్యను అందుకున్న క్షణం కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయింది. పాతబడిన కొద్దీ రుచి పెరిగే వైన్ తరహాలో అండర్సన్ వయసు పెరిగిన కొద్దీ మరింత రాటుదేలాడు. అతని అద్భుతమైన గణాంకాలు అదే విషయం చెబుతాయి. అతని కెరీర్లో సగంకంటే ఎక్కువ (332) వికెట్లు 30 ఏళ్ల వయసు దాటిన తర్వాతే వచ్చాయి. 2014నుంచి ఆడిన 65 టెస్టుల్లో జిమ్మీ కేవలం 21.71 సగటుతో ఏకంగా 260 వికెట్లు పడగొట్టాడు. ఇది ఏ ప్రమాణాల ప్రకారం చూసినా అసాధారణ ప్రదర్శనే. ఇదే సమయంలో కనీసం 100 వికెట్లు తీసిన వారి జాబితా చూస్తే అతనే అగ్రస్థానంలో ఉండటం ఈతరం కుర్ర బౌలర్లతో పోలిస్తే ఎంత మెరుగో అర్థమవుతుంది. ‘వచ్చే ఏడాది చివర్లో జరిగే యాషెస్ సిరీస్లో నేను ఆడగలనని నమ్ముతున్నాను. నా ఆట బాగుంది. ఫిట్నెస్పై కూడా దృష్టిపెట్టాను కాబట్టి ఇది అసాధ్యమని నేను అనుకోవడం లేదు. ఇదే విషయాన్ని రూట్తో కూడా మాట్లాడాను. నాలో సత్తా ఉన్నంత వరకు ఆడతా. ఇప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదు. కొందరు 700 వికెట్ల గురించి అడుగుతున్నారు. ఎందుకు సాధించలేను. అదీ చేద్దాం. అయితే యాషెస్కు ముందు చాలా సిరీస్లు ఉన్నాయి. వాటిలో నేను పాల్గొనడం లేదా విశ్రాంతినివ్వడాన్ని ఈసీబీ నిర్దేశిస్తుంది. నా కెరీర్ను తిరిగి చూసుకుంటే ఇంత దూరం ప్రయాణిస్తానని అస్సలు ఊహించలేదు. తాజా ఘనత పట్ల నేను గర్వపడుతున్నాను’ –జేమ్స్ అండర్సన్ అద్వితీయం అండర్సన్ కెరీర్ ‘రివర్స్ రివర్స్ స్వింగ్’ అనే మాటను ఎప్పుడైనా విన్నారా... ఆ బౌలింగ్ ఎలా ఉంటుందో ఒక్క మాటల్లో చెప్పాలంటే జిమ్మీ అండర్సన్ బౌలింగ్ చేసినట్లుగా ఉంటుంది. సాధారణ ఇన్స్వింగర్ తరహాలోనే మణికట్టును ఉంచుతూ రివర్స్ అవుట్ స్వింగర్ను సంధించడమే ఇది... బ్యాట్స్మన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టే ఈ శైలి ఒక్క అండర్సన్కు మాత్రమే సాధ్యమైంది. ఈ మాట చెప్పింది ఎవరో అల్లాటప్పా విశ్లేషకుడు కాదు. సాక్షాత్తూ సచిన్ అన్నాడంటే దాని విలువ, అండర్సన్పై ప్రశంస ఏమిటో అర్థమవుతుంది. కెరీర్లో అందరికంటే ఎక్కువగా 9 సార్లు మాస్టర్ను అవుట్ చేశాడు. ఇప్పుడు 600 టెస్టు వికెట్లు సాధించిన తొలి పేస్ బౌలర్గా ఘనత సృష్టించాడు. – సాక్షి క్రీడా విభాగం -
బయో సెక్యూర్ క్రికెట్ సాధ్యమేనా?
సౌతాంప్టన్: కరోనా సంక్షోభం.. యావత్ ప్రపంచాన్ని నేటికీ అతలాకుతలం చేస్తూనే ఉంది. ఇప్పటికీ కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ఇక అది తమ జీవన విధానంలో భాగంగానే ప్రపంచం భావిస్తోంది. కరోనా వైరస్కు వ్యాక్సిన్ వచ్చే వరకూ ప్రతీ షెడ్యూల్ను వాయిదా వేస్తూ ముందుకు సాగడం కష్టసాధ్యంగా మారిన క్రమంలో ఎక్కువ శాతం మంది జాగ్రత్తులు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక క్రీడా ఈవెంట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. క్రీడలు జరగాలంటే తప్పనిసరిగా ప్రేక్షకులు ఉండాలి. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు జరపడానికి ఆయా క్రీడా సమాఖ్యలు సిద్ధమవుతున్నా అసలు ప్రజలే స్టేడియాలకు వెళ్లే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. ఇప్పటికే క్రికెట్ టోర్నీలు నిర్వహించడానికి సలైవా(లాలాజలాన్ని బంతిపై రద్దడాన్ని)ను బ్యాన్ చేసిన ఐసీసీ.. ఇంకా పకడ్భందీగా మ్యాచ్లు జరపాలని చూస్తోంది. ఇక నుంచి క్రికెట్ మ్యాచ్లు జరిగే వేదికల్లో బయో సెక్యూర్ విధానాన్ని అవలంభించాలని చూస్తోంది. ఇందుకు ఇంగ్లండ్-వెస్టిండీస్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్ను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి సిద్ధమైంది. క్రికెట్లో బయో సెక్యూర్ ఏమిటి? ప్రాణాంతకమైన ఒక వైరస్ను విస్తరించకుండా చేయడం లేదా.. అసలు అక్కడ వైరస్ ఉనికే లేకుండా చేయడం. దీని కోసం బయో సెక్యూర్ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ వాతావరణాన్ని సృష్టించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)తో పాటు ఐసీసీ కట్టుదిట్టంగా ప్రణాళికలు రచిస్తోంది. ముందు సాధ్యమైనంత వరకూ వేదికల్ని కుదించడం. అంటే ఆటగాళ్లను ఎక్కువ ప్రయాణాలు చేయకుండా నివారించడం ఒకటి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్-వెస్టిండీస్ల తొలి టెస్టు సౌతాంప్టన్లో జరుగుతుండగా, రెండు, మూడు టెస్టులు మాంచెస్టర్లో నిర్వహించనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు లార్డ్స్లో జరగాల్సి ఉండగా దానిని మాంచెస్టర్కు పరిమితం చేశారు. ఈ స్టేడియాలకు అనుబంధంగా హోటళ్లు ఉన్నాయి. దాంతో ఇతరులు హోటళ్లకు రాకుండా చర్యలు తీసుకుంటారు. కేవలం ఆటగాళ్లు మాత్రమే ఉండే విధంగా చూస్తారు. ఆటగాళ్లు సైతం క్రికెటర్లు హోటళ్లు దాటి బయటకు వెళ్లకూడదు. మరొకవైపు మ్యాచ్ జరిగేటప్పుడు ఆటగాళ్లు ఒకరినొకరు తాకకూడదు. సెలబ్రేషన్స్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. కేవలం ఇలా క్రికెట్ మ్యాచ్ బయో సెక్యూర్ వాతావరణంలో జరగాలన్న మాట. జూలై 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. (‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’) ఇది సాధ్యమేనా? మరి బయో సెక్యూర్ విధానం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇంగ్లండ్ వంటి దేశాల్లో దీనికి అనుకూలంగా ఉన్నా వేరే దేశాల్లో మాత్రం ఇది కష్టమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం అందరికీ అది సాధ్యపడదని అంటున్నారు. ఆటగాళ్లను హెటళ్ల నుంచి బయటకు వెళ్లకుండా చేయడం వరకూ ఓకే కానీ, క్రికెట్ స్టేడియాలకు ఆనుకుని హోటళ్లు అన్ని చోట్ల ఉండవనేది వారి వాదన. మరొకవైపు ఇతరులను హోటళ్లకు అనుమతి లేకుండా చేయాలంటే అందుకు అయ్యే ఖర్చులను క్రికెట్ బోర్డులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకండా క్రికెట్ టోర్నీలు నిర్వహించి బోలెడంత నష్టం చూడటానికి సిద్ధమైన బోర్డులు.. అదనపు ఖర్చును భరించడం అంటే తలకు మించిన భారమే అవుతుందని అంటున్నారు. ఈ విధానం అన్ని చోట్లా వర్కౌట్ కాదని రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు సైతం అభిప్రాయ పడటం ఇక్కడ గమనించాల్సిన అంశం. -
ప్రేక్షకులు వద్దు.. మనమే ‘కేక’ పెట్టిద్దాం
లండన్: కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న క్రీడా ఈవెంట్లపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆడటానికి అనుమతులు వచ్చినా అది ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే దిశగా ఆయా క్రీడా సమాఖ్యలు ఆలోచన చేస్తున్నాయి. దీనిని కొందరు వ్యతిరేకిస్తుండగా, మరి కొందరు సమర్ధిస్తున్నారు. అసలు ప్రేక్షకులు లేకుండా మజానే ఉండదనే అభిప్రాయాన్ని మెజార్టీ సభ్యులు వ్యక్తం చేస్తుండగా, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం అదిరిపోయే సలహా ఇచ్చాడు. ఇప్పటివరకూ ఎవరికీ తట్టని ఒక ఆలోచనతో ఆర్చర్ ముందుకొచ్చాడు. (‘నన్ను ఎందుకు తీశావని ధోనిని అడగలేదు’) ఈ సంక్షోభంలో ప్రేక్షకులు అవసరం లేదంటూనే వారి చేసే గోల మాత్రం ఉండాలంటున్నాడు. అదేంటి స్టేడియాల్లో జనాలు లేకుండా సందడి ఎలా వస్తుందని అనుకుంటున్నారా.. అందుకు చక్కటి ఉపాయం చెప్పేశాడు. క్రీడలు పునరుద్ధించబడ్డ తర్వాత స్టేడియాల్లో ప్రేక్షకులు చేసే గోలను ఆడియో రూపంలో ఏర్పాటు చేస్తే మనం వారు ఉన్నట్లే ఫీలవుతామని అంటున్నాడు. ‘మనం స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా ఎందుకు ఆడలేం. ఆడొచ్చు. ఎలా అంటే మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఆడియో ప్లే చేద్దాం. చప్పట్లు, ఈలలతో స్టేడియాలను ఊదరగొట్టేలా చేద్దాం. దాంతో మ్యాచ్లు ఆడే క్రికెటర్లకు తప్పకుండా ఊపు వస్తుంది. అది కూడా ఎలా ఉండాలంటే వాస్తవిక మ్యాచ్లను తలపించేలా ఉండాలి’ అని ఆర్చర్ పేర్కొన్నాడు. క్రికెట్ టోర్నీలు నిర్వహించినా ఎంత సురక్షితం నిర్వహిస్తే అంత మంచిదన్నాడు. (ఐసీసీ ట్రోల్స్పై అక్తర్ సీరియస్ రియాక్షన్) -
పుజారా ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లౌసెష్టర్షైర్ రద్దు చేసుకుంది. ఈ మేరకు గురువారం ఆ జట్టు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అతను ఏప్రిల్ 12–మే 22 మధ్య నాలుగు రోజుల పాటు సాగే 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ (కోవిడ్–19) విజృంభణతో ప్రస్తుతం ప్రపంచమంతా లాక్డౌన్లో ఉండటంతో అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ దేశంలో మే 28 వరకు జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్లను రద్దు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పుజారాతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించలేమని... అందుకే రద్దు చేస్తున్నట్లు గ్లౌసెష్టర్షైర్ పేర్కొంది. (‘మనసులోని కోరికను బయటపెట్టిన పుజారా’) -
డక్వర్త్ ‘లూయిస్’ కన్నుమూత
లండన్: అంతర్జాతీయ క్రికెట్కు డక్వర్త్ లూయిస్ పద్ధతిని పరిచయం చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న లూయిస్ కన్నుమూసిన విషయాన్ని ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. ప్రపంచ క్రికెట్లో డక్వర్త్ లూయిస్ పద్ధతి గురించి అందరికీ తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్లు ఆగినప్పుడు, తిరిగి లక్ష్యాన్ని నిర్దేశించడానికి ఈ పద్థతిని వాడుతారన్న సంగతి తెలిసిందే. 1997లో ఫ్రాంక్ డక్వర్త్తో కలిసి టోనీ లూయిస్ ఈ పద్ధతిని ప్రతిపాదించారు. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 1999లో ఆమోద ముద్ర వేయగా, దాన్ని 2004 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా వర్షం కురిసి మ్యాచ్లు సగంలో ఆగిపోతే అప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించి విజేతను ప్రకటించడం నేటికీ ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం దీన్ని డక్వర్త్ లూయిస్ స్టెర్న్ పద్ధతిగా పిలుస్తున్నారు. మరోవైపు లూయిస్ మరణంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం వ్యక్తం చేసింది. క్రికెట్కు ఆయన ఎంతగానో సేవ చేశారని అభిప్రాయపడింది. ఇంగ్లండ్ కెప్టెన్గా సేవలందించిన లూయిస్.. ఆపై జర్నలిస్టుగా సేవలందించారు. 1990వ దశకంలో బీబీసీ టెలివిజన్ కామెంటేటర్గా ఆయన పనిచేశారు. ఇక క్రికెట్ లా మేకర్ అయిన మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడిగా సైతం సేవలందించిన ఘనత టోనీ లూయిస్ది. -
గ్యారీ కిర్స్టన్కు మళ్లీ నిరాశే
లండన్: ఇటీవల భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుని భంగపడ్డ మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం కిర్స్టన్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా క్రిస్ సిల్వర్వుడ్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ తుది జాబితాలో కిర్స్టన్ పేరున్నప్పటికీ సిల్వర్వుడ్ను నియమించడానికి ఈసీబీ మొగ్గుచూపింది. ఇంటర్యూలో కిర్స్టన్ కంటే సిల్వర్వుడ్ చెప్పిన సమాధానాలకే అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ఈసీబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లకు హెడ్ కోచ్గా పనిచేసిన అనుభవం ఉన్న కిర్స్టన్.. ఈసీబీ రేసులో ముందందజలో నిలిచినా చివరకు మాత్రం ప్రతికూల ఫలితమే వచ్చింది. స్వదేశీ క్రికెటర్ కావడమే సిల్వర్వుడ్కు నియమాకానికి ప్రధాన కారణం. ఇప్పటివరకూ ఇంగ్లండ్కు కోచ్గా పని చేసిన ట్రావెర్ బెయిలీస్ పదవీ కాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఈసీబీ.. కోచ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే కిర్స్టన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. పలువురు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు కిర్స్టన్ నియమానికే ఓటేసినా, ఆ దేశ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమక్షంలోనే ఈసీబీ సెలక్షన్ ప్యానల్ మాత్రం సిల్వర్వుడ్ పేరును ఖరారు చేసింది. 2017-18 సీజన్లో భాగంగా యాషెస్ సిరీస్కు 44 ఏళ్ల సిల్వర్వుడ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా సేవలందించడం కూడా అతని నియమానికి దోహదం చేసింది. ఇంగ్లండ్ ప్రధాన కోచ్కు దరఖాస్తు చేసుకున్న వారిలో కిర్స్టన్తో పాటు అలెక్ స్టువార్ట్, గ్రాహమ్ ఫోర్డ్లు ఉన్నారు. -
‘అందుకే అతన్ని టెస్టు క్రికెట్ నుంచి తప్పించాం’
లండన్: ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడిన ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ మొయిన్ అలీ.. ఆ తర్వాత టెస్టుల్లో కనిపించలేదు. యాషెస్ తొలి టెస్టులో మొయిన్ అలీ విఫలమైన నేపథ్యంలో అతన్ని తదుపరి టెస్టు మ్యాచ్కు తప్పించారు. ఆపై మిగతా మ్యాచ్ల్లో కూడా ఇంగ్లండ్ క్రికెట్ మేనేజ్మెంట్కు మొయిన్ అవసరం అనిపించలేదు. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఎంపిక చేసిన టెస్టు జట్టులో కూడా మొయిన్ అలీని పక్కన పెట్టేశారు. దాంతో మొయిన్ అలీ టెస్టు కథ ముగిసిందనే చర్చ నడిచింది. టెస్టు క్రికెట్కు మొయిన్ అలీ వీడ్కోలు చెప్పాడనే వార్తలు వచ్చాయి. దీనిపై ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ వివరణ ఇస్తూ.. తాము కావాలని మొయిన్కు ఉద్వాసన చెప్పలేదన్నాడు. ‘ టెస్టు క్రికెట్ నుంచి విరామం ఇమ్మని మొయిన్ మాకు విజ్ఞప్తి చేశాడు. అంతే తప్ప ఎటువంటి రిటైర్మెంట్ ప్రకటించలేదు. సాధారణ బ్రేక్ మాత్రమే మొయిన్కు ఇచ్చాం. నేను కేవలం మొయిన్ గురించే ఈ విషయం చెప్పడం లేదు. మాకు సమ్మర్ అంతా చాలెంజ్గా గడిచింది. వరల్డ్కప్, యాషెస్లతో మా క్రికెటర్లు తీవ్రంగా అలసిపోయారు. దానిలో భాగంగానే పలువురి విశ్రాంతి ఇస్తున్నాం’ అని గైల్స్ పేర్కొన్నాడు. -
ఆండ్రూ స్ట్రాస్ మళ్లీ వచ్చేశాడు..
లండన్: గతేడాది ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) డైరెక్టర్ పదవికి గుడ్ బై చెప్పిన ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్కు మళ్లీ కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఈసీబీ క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లండ్ క్రికెట్ను పర్యవేక్షించే కమిటీ చైర్మన్ బాధ్యతను స్ట్రాస్కు ఇచ్చినట్లు ఈసీబీ ప్రకటించింది. గడిచిన ఏడాది తన భార్య రూత్ క్యాన్సర్తో మంచాన పట్టడంతో స్ట్రాస్ డైరక్టర్ పదవిని వదులుకున్నాడు. దాంతో డైరక్టర్గా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆష్లే గేల్స్ను నియమించారు. గత డిసెంబర్లో రూత్ మృతి చెందగా అప్పట్నుంచి స్ట్రాస్ క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. కాగా, మళ్లీ స్ట్రాస్ను క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమించడానికి ఈసీబీ మొగ్గుచూపగా, అతను కూడా అంగీకరించాడు. దీనిపై స్ట్రాస్ మాట్లాడుతూ.. ‘ నాకు కష్టకాలంలో ఈసీబీ అండగా నిలిచింది. మళ్లీ నాకు ఒక పాత్రను అప్పచెప్పడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇంగ్లండ్లో క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తా’ అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ప్రధాన కోచ్ ట్రావెర్ బెయిలిస్ను స్ట్రాస్ నియమించిన సంగతి తెలిసిందే. బెయిలిస్ పర్యవేక్షణలోని ఇంగ్లిష్ జట్టు వరల్డ్కప్ను గెలిచి తమ చిరకాల కోరికను సాకారం చేసుకుంది. -
ఈసీబీ తాజా ఉద్దీపన
లండన్: ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) మరో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది. దీనిప్రకారం, నెలకు 20 బిలియన్ యూరోల (22 బిలియన్ల అమెరికా డాలర్లు) విలువైన బాండ్లను వ్యవస్థ నుంచి కొనుగోలు చేయనుంది. దీనితో ఆరి్థక వ్యవస్థలోకి ఈ మొత్తం వచ్చి, ఆరి్థక వృద్ధికి దోహదపడుతుందన్నది సిద్ధాంతం. ఇక ఇదే దిశలో వడ్డీరేట్లనూ మరింత మైనస్లోకి పంపింది. బ్యాంకింగ్ వడ్డీరేట్లు ప్రస్తుతం మైనస్ 0.4 శాతం ఉంటే, దీనిని మరింతగా మైనస్ 0.5 శాతానికి తగ్గించింది. దీనివల్ల బ్యాంకులో డిపాజిట్లు వేస్తే, రివర్స్ వడ్డీరేట్లు మరింతగా కట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో బ్యాంకులో డిపాజిట్లు తగ్గి ఆ మేరకు మొత్తాలు ఆర్థిక ఉద్దీపనకు దోహదపడతాయని అంచనా. వచ్చే వారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న వార్తల నేపథ్యంలో యూరోజోన్లో తాజా ఉద్దీపన చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా వడ్డీరేట్లు తగ్గిస్తే, ఇది ఈ ఏడాది రెండవసారి అవుతుంది. ప్రపంచ వృద్ధి తగ్గుతుందన్న వార్తల నేపథ్యంలో పలు దేశాలు సరళతర ఆరి్థక విధానాలవైపు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. -
భౌగోళిక రాజకీయ అంశాలే కీలకం..!
ముంబై: భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధ్మాన్ను వాఘా సరిహద్దు దగ్గర పాక్ అప్పగించిన నేపథ్యంలో గతవారం దేశీ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. పైలట్ను తిరిగి అప్పగించడంతో భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత వరకు తగ్గి దాయాదుల మధ్య కమ్ముకున్న యుద్థ మేఘాలు సమసిపోయినట్లేనని మార్కెట్ వర్గాలు భావించాయి. ఈ అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు కూడా మార్కెట్ను నిలబెట్టాయి. అణ్వాయుధ శక్తి కలిగిన ఇద్దరు దాయాదుల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోయే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్నది ఉగ్రవాద శిబిరాలపై దాడులు తప్పించి.. ఇరు దేశాల మధ్య యుద్ధంకాదన్న స్పష్టతతో వారంతంనాడు మార్కెట్లు సానుకూల స్పందించినప్పటికీ, యుద్ధ భయాలు మాత్రం ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భయాలు మరింత పెరిగినా, యుద్ధ వాతావరణమే మరోసారి కనిపించినా రానున్నరోజుల్లో ఒక్కసారిగా భారీ పతనం ఉండేందుకు అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. అంతర్జాతీయ అంశాలపై దృష్టి.. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ మధ్య భేటీ గురువారం ఎలాంటి సత్ఫలితం లేకుండానే ముగిసింది. ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కిమ్ కోరగా ఇందుకు తాము అంగీకరించలేదని ట్రంప్ వెల్లడించారు. ఇక్కడి వాతావరణం అయోమయంగానే ఉన్నప్పటికీ.. మరోవైపు అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఇరు దేశాల తుది వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధికారులు సిద్ధంచేస్తున్నట్లు బ్లూమ్బర్గ్ కథనం ప్రచురించింది. రెండు దేశాల చర్చల్లో అద్భుత పురోగతి ఉందని వైట్హౌస్ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో వ్యాఖ్యానించడం మార్కెట్కు సానుకూల అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. మొదలైన ఎన్నికల వేడి.. సార్వత్రిక ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పష్టం చేసిన నేపథ్యంలో మార్కెట్లో ఎన్నికల వేడి మొదలుకానుందని యస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున సూచీల్లో ఒక భారీ పెరుగుదల ఉండనుందని అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. ఇక వచ్చే వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అంచనాలు ఉన్న కారణంగా సూచీల్లో అధిక స్థాయి ఒడిదుడుకులకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గణాంకాలపై దృష్టి.. ఈఏడాది ఫిబ్రవరికి సంబంధించిన నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ మార్చి5న (మంగళవారం) వెల్లడికానుంది. డిసెంబర్ నెల యూఎస్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా బుధవారం వెల్లడికానుండగా.. ఆదేశ జనవరి వాణిజ్య గణాంకాలు గురువారం రానున్నాయి. శుక్రవారం చైనా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వెల్లడికానుండగా.. అదేరోజున యూఎస్ నాన్ ఫామ్ పేరోల్స్ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇక ఇతర అంతర్జాతీయ ప్రధాన అంశాల్లో.. వడ్డీ రేట్లకు సంబంధించి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన నిర్ణయాన్ని మార్చి 7న (గురువారం) ప్రకటించనుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర దిగొచ్చింది. ఫ్యూచర్స్ రేట్లు 2 శాతం తగ్గాయి. అయితే, గతేడాది డిసెంబర్లో నమోదైన 50.5 డాలర్ల వద్ద నుంచి చూస్తే 15% పెరిగాయి. ఒపెక్ ఉత్పత్తి కోత కారణంగా ధరల్లో ఈస్థాయి పెరుగుదల నమోదైందని నార్నోలియా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కమోడిటీ విశ్లేషకులు సకినా అన్నారు. 15–నెలల గరిష్టస్థాయికి ఎఫ్ఐఐల పెట్టుబడి... ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) జోరుగా పెట్టుబడులు పెట్టారు. రూ.17,220 కోట్లను దేశీయ స్టాక్ మార్కెట్లో నికరంగా వెచ్చిం చినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడైంది. 2017 నవంబర్లో రూ.19,728 కోట్ల నికర పెట్టుబడి పెట్టిన ఎఫ్పీఐలు. ఆ తరువాత గతనెల్లోనే భారీగా నిధులు కుమ్మరించారు. నేడు మార్కెట్కు సెలవు మహాశివరాత్రి సందర్భంగా మార్చి4న (సోమవారం) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. తిరిగి మంగళవారం(5న) యథాప్రకారం మార్కెట్ ప్రారంభమవుతుంది. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. -
నివాస భవనాలకూ ఈసీబీసీ
సాక్షి, హైదరాబాద్: నివాస భవనాలకు ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) నిబంధన అమల్లోకి వచ్చింది. గతేడాది జూన్లో వాణిజ్య భవనాలకు ఈసీబీసీ కోడ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నివాస విభాగంలో ఈసీబీసీ కోడ్తో 2030 నాటికి 125 బిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేసింది. నివాస, వాణిజ్య భవనాలు రెండు విభాగాల్లో కలిపి 2030 నాటికి సుమారు 1,000 బిలియన్ యూనిట్ల విద్యుత్ శక్తి ఆదా అవుతుంది. -
ఈసీబీలకు హెడ్జింగ్ నిబంధనల సడలింపు
ముంబై: విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) హెడ్జింగ్ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సడలించింది. ఇప్పటికి వరకూ ఈసీబీలకు సంబంధించి పూర్తి 100 శాతం హెడ్జింగ్ అవసరంకాగా ఈ ప్రొవిజన్ను 70 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. వ్యాపారంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోవడానికి వినియోగించే పెట్టుబడి సాధనాల్ని హెడ్జింగ్గా పేర్కొంటారు. మూడు నుంచి ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్కు (టైర్ 1 ఈసీబీ ఫ్రేమ్వర్క్) ఈ సడలింపు వర్తిస్తుందని తాజా నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నోటిఫికేషన్కు ముందు హెడ్జింగ్ల విషయంలోనూ తాజా సవరణ వర్తిస్తుందని, రోలోవర్స్లో హెడ్జింగ్ను తగ్గించుకోవచ్చని సూచించింది. -
బెన్ స్టోక్స్పై ఈసీబీ ‘సస్పెన్షన్’
లండన్: తప్పతాగి పబ్లో గొడవకు దిగిన ఆల్రౌండర్ బెన్ స్టోక్స్పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ కేసుకు సంబంధించి తమ సొంత విచారణతో పాటు పోలీస్ విచారణ కూడా పూర్తయ్యే వరకు అతడిని ఇంగ్లండ్ ఆడే అంతర్జాతీయ మ్యాచ్లకు ఎంపిక చేయబోమని ప్రకటించింది. స్టోక్స్తో పాటు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సహచర ఆటగాడు అలెక్స్ హేల్స్కు కూడా ఈ ‘సస్పెన్షన్’ వర్తిస్తుందని ఈసీబీ ప్రకటించింది. నిజానికి బుధవారం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్ వైస్ కెప్టెన్గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున బ్రిస్టల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు గురువారం బయటకు రావడంతో వివాదం ముదిరింది. ఒక వ్యక్తిపై స్టోక్స్ తీవ్రంగా దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సాక్ష్యం కారణంగా పోలీస్ విచారణలో కూడా స్టోక్స్ దోషిగా తేలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసీబీ తమ వైపు నుంచి చర్యలకు సిద్ధమైంది. -
కెప్టెన్గా ఎన్నో విజయాలు అందించా.. కానీ!
లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తొలిసారిగా అలిస్టెర్ కుక్ ఆసక్తికర విషయాలపై నోరువిప్పాడు. తన నాయకత్వ లక్షణాలపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేయడంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఈ ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్తో ఘనంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని భావించాడు కుక్. 59 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన ఈ 32 ఏళ్ల వెటరన్ మాట్లాడుతూ.. '2016లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను డ్రా చేసుకోవడంతో నా నాయకత్వంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆపై బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు ఓటమి పాలవడం, ఆ వెంటనే ఐదు సిరీస్లో భారత్ చేతిలో 4-0తో దారుణ మూటకట్టుకోవడం నన్ను అసహనానికి గురిచేశాయి' అని పేర్కొన్నాడు. 'సొంతగడ్డపై 2013, 2015లలో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను అందించాను. ఆపై అదే జోరుతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్లలో ఘనవిజయాలు సాధించినా ప్రస్తుతం బోర్డు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. గతేడాది పాక్తో సిరీస్ డ్రా చేసుకోవడం ఎంతగానో బాధించింది. జట్టు సమష్టిగా వైఫల్యం చెందినా ఫలితం నేను అనుభవించాల్సి వచ్చింది. రెండు యాషెస్ సిరీస్లు అందించాను. మరో సిరీస్ వరకు కెప్టెన్ విజయాన్ని అందించాలని భావించాను. ఈసీబీ తనపై నమ్మకం కోల్పోవడంతో కీలక నిర్ణయాన్ని తీసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. 2012 ఆగస్టులో పగ్గాలు చేపట్టిన కుక్ వరుస పరాభవాలతో ఈ ఫిబ్రవరిలో అవమానాల మధ్య కెప్టెన్సీని వదులుకున్నాడు. ఇటీవలి టెస్టు సిరీస్లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కుక్ చెన్నైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే కెప్టెన్గా కుక్కు భారత్ సిరీసే చివరిదిగి నిలిచిపోయింది. 2010-14 మధ్య కాలంలో 69 వన్డేలకు కెప్టెన్గా వ్యవహరించాడు కుక్. కుక్ వైదొలిగాక మిడిలార్డర్ ప్లేయర్ జో రూట్ కెప్టెన్ అయ్యాడు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
కెప్టెన్సీకి కుక్ బైబై
లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలిస్టెర్ కుక్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రికార్డు స్థాయిలో ఇంగ్లండ్ జట్టుకు 59 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన ఈ 32 ఏళ్ల వెటరన్ స్టార్ మాట్లాడుతూ ‘ఇది నాకు బాధకలిగించే రోజే కానీ... జట్టుకోసం సరైన నిర్ణయమే తీసుకున్నాను’ అని వెల్లడించాడు. సారథ్యానికి రాజీనామా చేసినా... ఆటగాడిగా కెరీర్ను కొనసాగిస్తానన్నాడు. తన రాజీనామాను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్కు ఆదివారమే అందజేశాడు. ‘ఇంగ్లండ్కు సారథ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఐదేళ్లపాటు కెప్టెన్గా కొనసాగాను. ఇపుడు బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం కఠినమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం సరైన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని కుక్ అన్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుక్ రికార్డులకెక్కాడు. 140 మ్యాచ్లాడిన కుక్ 11,057 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 53 అర్ధసెంచరీలున్నాయి. కుక్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. సొంతగడ్డపై 2013, 2015లలో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను కైవసం చేసుకుంది. అదేజోరుతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్లలో ఘనవిజయం సాధించింది. 2012లో ‘విజ్డెన్ క్రికెట్ అఫ్ ద ఇయర్’గా ఎంపికైన అతను ఆ మరుసటి ఏడాదే (2013) ఐసీసీ ప్రపంచ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. -
ఆ విషయంలో చేతులెత్తేసిన బీసీసీఐ!
-
చేతులెత్తేసిన బీసీసీఐ!
న్యూఢిల్లీ:ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు రోజుల సమీపిస్తున్న తరుణంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేతులెత్తేసింది. లోధా కమిటీ సిఫారుసుల అమలుపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇరుకున పడ్డ బీసీసీఐ.. భారత్లో పర్యటించే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఖర్చులు భరించలేమని తేల్చిచెప్పింది. దీనిలో భాగంగా హోటల్, ప్రయాణ ఖర్చులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డే భరించాలని బీసీసీఐ లేఖలో కోరింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే.. ఈసీబీకి తాజాగా లేఖ రాశారు. 'సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎటువంటి నిధులు మంజూరు చేయలేకపోతున్నాం. అందుచేత ఇరు బోర్డుల పరస్పర ఒప్పందంలో భాగమైన ఆర్థికపరమైన ఖర్చులను మీరే భరించాలి. ఇది నిజంగా బాధాకరం.ఇరు బోర్డుల మ్యూచువల్ అగ్రిమెంట్ను అమలు చేసే స్థితిలో ప్రస్తుతం బీసీసీఐ లేదు.ఆ ఖర్చులను ఈసీబీనే భరించాలి'అని షిర్కే కోరారు. దీనిపై ఈసీబీ స్పందించింది.ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు భారత్ లో ఉంది. సిరీస్ యథావిధిగానే జరుగుతుంది. అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత బీసీసీఐ నిర్ణయంతో సిరీస్ను రద్దు చేసుకునే ఆలోచనలేదు'అని ఈసీబీ ప్రతినిధి తెలియజేశారు. -
అంత డబ్బు ఎందుకు కేటాయించారు?
ఐసీసీపై బీసీసీఐ గరంగరం న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్లో జరిగిన టి20 ప్రపంచకప్ నిర్వహణ కోసం బీసీసీఐకి ఐసీసీ ఇచ్చిన మొత్తం 45 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.300 కోట్లు). అరుుతే వచ్చే ఏడాది ఇంగ్లండ్లో జరిగే చాంపియన్స ట్రోఫీ నిర్వహణ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి ఏకంగా 135 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.900 కోట్లు) బడ్జెట్ను కేటారుుంచడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. అంతేకాకుండా 19 రోజుల పాటు సాగే ఈ టోర్నీ సందర్భంగా లండన్లో ఆఫీస్ కోసం ఓ భవనాన్ని నిర్మించి పోటీలు ముగిశాక దాన్ని ఈసీబీకే అప్పగించనుంది. వాస్తవానికి టి20 ప్రపంచకప్లో ఇంతకంటే ఎక్కువగా 58 మ్యాచ్లు జరిగారుు. ‘నిజంగా ఇది శోచనీయం. టి20 ప్రపంచకప్ను ఇంతకన్నా తక్కువ ఖర్చులోనే మేం జరిపాం. పౌండ్లలో లెక్కేసినప్పుడు ఇంగ్లండ్లో నిర్వహణ ఖర్చు ఎక్కువగానే ఉండొచ్చు. మాకు కూడా ఆటగాళ్ల వసతి, ఒక చోటి నుంచి మరో చోటికి విమాన ప్రయాణ ఖర్చులుండేవి. ఇంగ్లండ్లో ఈ సమస్య ఉండదు. అసలు అక్కడ ఆఫీస్ను నిర్మించేందుకు మా అందరి సభ్య దేశాల డబ్బును ఎందుకు వెచ్చిస్తారు. ఒక సభ్య దేశంపైనే అంత ప్రేమ ఎందుకు చూపడం? ఇది సరైన పద్ధతి కాదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో తమ అసంతృప్తిని తెలుపుతూ భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. -
పడగొట్టిన ఈసీబీ ప్యాకేజీ..
249 పాయింట్ల నష్టంతో 25,638కు సెన్సెక్స్ 82 పాయింట్ల నష్టంతో 7,782కు నిఫ్టీ ముంబై: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ప్యాకేజీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనబాట పట్టాయి. వీటితో పాటే మన స్టాక్ మార్కెట్ కూడా శుక్రవారం నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. స్టాక్ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా మూడో రోజు. బీఎస్ఈ సెన్సెక్స్249 పాయింట్లు నష్టపోయి 25,638 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 7,782 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, వాహన, బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక సేవల రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 531పాయింట్లు నష్టపోయింది. రూపాయి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇక ఈ వారానికి సెన్సెక్స్ 490 పాయింట్లు(1.87 శాతం), నిఫ్టీ 161 పాయింట్లు (2 శాతం) చొప్పున నష్టపోయాయి. 4 సెన్సెక్స్ షేర్లకే లాభాలు సన్ ఫార్మా రూపొందించిన క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే గ్లీవెక్ జనరిక్ వెర్షన్కు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం లభించడంతో సన్ ఫార్మా షేర్ 4 శాతం ఎగసింది. సెన్సెక్స్ సూచీలోని సన్ ఫార్మాతో పాటు భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ షేర్లు పెరిగాయి. హెచ్డీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా చెరో 2.4 శాతం చొప్పున నష్టపోయాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టపోయాయి. 4 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విలీన వార్తలతో జీ లెర్న్ 3.3 శాతం,, ట్రీ హౌస్ ఎడ్యుకుషన్ అండ్ యాక్సెసరీ 10 శాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్టీపీసీ, ఐటీసీ, ఐసీసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పతనమయ్యాయి. హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ షేర్లన్నీ 2 శాతం వరకూ నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎస్బీఐలు 0.5-3 శాతం వరకూ నష్టపోయాయి. 1,567 షేర్లు నష్టాల్లో, 1,177 షేర్లు లాభాల్లో ముగిశాయి. మదర్సన్ సుమికి అండర్ వెయిట్... అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, వాహన విడిభాగాల కంపెనీ మదర్సన్ సుమి రేటింగ్ను అండర్ వెయిట్కు తగ్గించింది. కంపెనీ ఆదాయం 20 శాతం తగ్గే అవకాశాలున్నాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. మదర్సన్ సుమి అంచనా వేస్తున్న మార్జిన్లు ఆచరణ సాధ్యం కావంటూ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. రూ,238 టార్గెట్ ధరగా ఈ కంపెనీ రేటింగ్ను అండర్వెయిట్కు తగ్గించింది. ఈ నేపథ్యంలో మదర్సన్ సుమి షేర్ ధర 1% క్షీణించి రూ.280 వద్ద ముగిసింది. వచ్చే ఏడాది మదర్సన్ సుమి 18 ప్లాంట్లను అందుబాటులోకి తెస్తోందని, దీంతో వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల విషయంలో ఇటీవల భారీ మోసానికి పాల్పడిన ఫోక్స్వ్యాగన్ నుంచి మదర్సన్ సుమికి వచ్చే రాబడుల వాటా 44%గా ఉండడమూ ప్రతికూలత చూపనున్నదని పేర్కొంది. -
డిపాజిట్ రేటు తగ్గించిన ఈసీబీ
ఫ్రాంక్ఫర్ట్: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన కీలక డిపాజిట్ రేటును ప్రస్తుత మైనస్ 0.20 శాతం నుంచి మైనస్ 0.30 శాతానికి తగ్గించింది. దీనితో బ్యాంకులు ఈసీబీ వద్ద ఉంచే నిధులకు ప్రస్తుతంకన్నా 10 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్య వల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఈసీబీ వద్ద ఉంచకుండా... ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది వ్యవస్థలో డిమాండ్, వృద్ధికి దారితీసే అంశం. ఈసీబీ బెంచ్మార్క్ రీఫైనాన్సింగ్ రేటు (తాను ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీరేటు) చరిత్రాత్మక కనిష్ట స్థాయి 0.05 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్ లేక 19 దేశాల యూరో జోన్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం (వార్షికంగా 0.1 శాతం) కూడా అతి స్వల్పంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమలు చేస్తున్న ఉద్దీపన ప్యాకేజీని మరో ఏడు నెలలపాటు పొడిగిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. అంటే నెలకు 60 బిలియన్ యూరోల బాండ్ల కొనుగోలు కార్యక్రమాన్ని(ముందుగా నిర్దేశించిన గడువు(2016, సెప్టెంబర్) మార్చి 2017 వరకూ పెంచింది. దీనివల్ల నిధులు మరింతగా వ్యవస్థలోకి వచ్చి వృద్ధికి తోడ్పాటును అందించే అవకాశం ఉంది. -
యూరోజోన్కు ఉద్దీపన ఆక్సిజన్!
ఈసీబీ 1.1 ట్రిలియన్ యూరోల సహాయ ప్యాకేజీ ఫ్రాంక్ఫర్ట్: యూరోజోన్ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఆర్థిక సహాయక చర్యలను గురువారం ప్రకటించింది. ఈ ఉద్దీపన విలువ దాదాపు 1.1 ట్రిలియన్ డాలర్లు. 2015 మార్చి నుంచి 2016 సెప్టెంబర్ వరకూ ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కార్యక్రమం జరుగుతుందని ఈసీబీ ప్రెసిడెంట్ మారియో డ్రాఘీ ప్రకటించారు. ఈ ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కార్యక్రమం వల్ల మొత్తం యూరోజోన్ ఎకానమీలో కొత్త ఊపును తెస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సంబంధించి నెలకు 60 బిలియన్ యూరోల సెక్యూరిటీలను (బాండ్ల)ను ఈసీబీ కొనుగోలు చేయనున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్ తెలిపారు. అంటే వ్యవస్థలోకి నెలకు 60 బిలియన్ డాలర్ల యూరోలు వస్తాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, డిమాండ్ పెంపు, మందగమనంలో నడుస్తున్న యూరో ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా ఉత్సాహాన్ని అందించడం తాజా ఉద్దీపన నిధుల లక్ష్యమని అన్నారు. ఈ నిర్ణయం వల్ల కొన్ని దేశాల్లో వ్యయాలు పెరిగి, ఆర్థిక సంస్కరణలు నీరుగారతాయని జర్మనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, మొత్తం యూరో వృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు. గ్యాపప్తో భారత సూచీలు! యూరప్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీ.. అంచనాలను మించడంతో యూరప్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్టీఎస్ఈ, డ్యాక్స్, సీఏసీ-40లు 11.5% మేర పెరిగాయి. ఇదే జోరును అమెరికా మార్కెట్లు కొనసాగించాయి. గురువారం రాత్రి ఎస్జీఎక్స్ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,847 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) భారత స్టాక్ మార్కెట్లు గ్యాప్ అప్తో మొదలవుతాయనేది విశ్లేషకుల అంచనా. -
కుక్ కోసమే తీసేశాం
పీటర్సన్ వేటుపై ఈసీబీ లండన్: డాషింగ్ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ను జట్టు నుంచి తప్పించడంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పందించింది. కెప్టెన్ అలిస్టర్ కుక్తో సరైన సంబంధాలు లేని కారణంగానే అతడిని పక్కన పెట్టాల్సి వచ్చిందని తేల్చి చెప్పింది. జట్టు ఆటగాళ్లంతా ఇప్పుడు కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, కెప్టెన్ కు సంపూర్ణ మద్దతు అవసరమని ఈసీబీ అభిప్రాయపడింది. ఆసీస్ పర్యటనలో ఇంగ్లండ్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ దారుణ పరాజయాలు ఎదుర్కొన్న సంగతి విదితమే. ఈ దశలో జట్టు వాతావరణాన్ని మార్చేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. ‘ఇంగ్లండ్ జట్టుకు పీటర్సన్ అందించిన సేవలు మరిచిపోలేం. ఆసీస్లో వైట్వాష్ అనంతరం జట్టును పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. దీంట్లో భాగంగా ఇప్పుడు కెప్టెన్ కుక్కు మద్దతుగా నిలిచే ఆటగాళ్లు కావాలి. ఈ కారణాలతోనే పీటర్సన్ లేకుండానే ముందుకెళ్లాలని భావించాం’ అని ఈసీబీ స్పష్టం చేసింది. -
పునరావాసం కంటితుడుపే
సాక్షి, కాకినాడ : గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై వేలాదిమందికి కనీసం నిలువనీడ లేకుండా పోయింది. వర్షాలు మొదలయ్యాక రెండురోజులు పట్టించుకోని అధికారులు ఆ తర్వాత పునరావాస కేంద్రాల ఏర్పాటుతో హడావిడి మొదలు పెట్టారు. గత నాలుగు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 32 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 10,866 మందిని తరలించినట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో 4,735 మందికి ప్రతి రోజూ రెండు పూటలా భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. కానీ వాస్తవానికి డజనుకు పైగా కేంద్రాల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా తలదాచుకోలేదు. ఇక మిగిలిన కేంద్రాల్లో ఎక్కడా పట్టుమని 50 మంది కూడా లేరు. పునరావాస కేంద్రాలకు తరలిపోతే ఇళ్లు, ఇళ్లలోని సామాన్లు ఏమైపోతాయోనన్నఆందోళనతో కొందరు బాధితులు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. కాగా మరికొందరు అధికారుల చులకనభావం, సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం కారణంగా పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ముంపునకు గురైన ప్రాంతాల సమీపంలోని బడులు, గుడులనే పునరావాస కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. జిల్లాలో భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన బాధితుల కోసం ఏర్పాటు చేసిన 32 పునరావాస కేంద్రాల్లో మూడవవంతు వాటిలో కనీస సదుపాయాల్లేవు. విధి లేక బాధితులు తరలివెళ్లినా వారిని పట్టించుకునే నాథులే ఉండడం లేదు. చాలామంది అధికారులు ‘పునరావాస కేంద్రాలకు తరలించాం..ఇక మా పనైపోయింది’ అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కనీసం బాధితులు తిన్నారా, ఉన్నారా, వారి పరిస్థితి ఎలా ఉంది అని అడిగే వారే ఉండడం లేదు. పరిస్థితి ఇలా అఘోరించినందునే వర్షపునీరు ఇళ్లల్లోకి చేరి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు బాధితులు ఆసక్తి చూపడం లేదు. పుష్కర, పీబీసీ కాలువలకు గండ్లు పడడంతో గొల్లప్రోలు మండలం సూరంపేట, ఈబీసీ, ఎస్సీ కాలనీ, శివాలయం మాన్యం, దేవీనగర్, మార్కండేయపురం నీటమునిగి సుమారు 3 వేల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. వీరి కోసం మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఏ ఒక్కరూ వెళ్లలేదు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరకొరగా భోజనసదుపాయం కల్పించారు. దీనిపై శనివారం ఉదయం తహశీల్దార్ పినిపే సత్యనారాయణను నిలదీయగా ‘నేను అలాగే పెడతాను.. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి’ అంటూ పరుషంగా చెప్పడంతో బాధితులందరూ కాలనీ ఎదుట 216 జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ వచ్చి, ఆదుకుంటామని హామీ ఇస్తే కానీ వారు శాంతించలేదు. ఈ పరిస్థితి ఒక్క గొల్లప్రోలులోనే కాక.. జిల్లావ్యాప్తంగా నెలకొంది. పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్ల వద్దే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వారిలో అత్యధికులకు ప్రభుత్వపరంగా అందేసాయం కనీసంగానైనా అందడంలేదు. ఇళ్లల్లో వండుకునే పరిస్థితి లేక, ఆదుకోవల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పస్తులతో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్నిచోట్లయితే నాసిరకమైన ఆహారాన్ని ఇస్తుండడంతో గత్యం తరం లేక తింటూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నామంటూ బాధితులు వాపోతున్నారు. ఇప్పటి కైనా వర్ష బాధితులను తగురీతిలో ఆదుకోవల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. ఆదుకోని ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. వర్షాలు విపరీతంగా కురుస్తున్నా, పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా పట్టించుకునే పాలకులు, అధికారులు లేకపోవడం బాధాకరం. మొక్కుబడిగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వెళ్లేందుకు బాధితులు ఆసక్తిని చూపడం లేదు. - తమ్మన గోపాలకృష్ణ, చెముడులంక, ఆలమూరు మండలం