fake accounts
-
అమ్మాయిల పేరుతో ఇన్స్టాగ్రామ్లో నకిలీ అకౌంట్స్.. బరితెగించిన బీటెక్ స్టూడెంట్
-
మీ ఇన్స్టా అకౌంట్కి ఒకేసారి లైక్స్, వ్యూస్ పెరుగుతున్నాయా? తస్మాత్ జాగ్రత్త
నిజజీవితంలో కాకుండా డిజిటల్ మీడియా ద్వారా సంతోషాన్ని ప్రదర్శించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి దూరమవుతూ, తాము అంతా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ‘ఫేక్ హ్యాపీనెస్’ను క్రియేట్ చేస్తుంటారు కొందరు. అది ఫేక్ అని తెలియని వాళ్లు, తాము కూడా తమ ఫేక్ హ్యాపీనెస్ను మరింత క్రియేటివ్గా పోస్ట్ చేస్తుంటారు. వ్యసనంలా మార్చే ఈ చట్రంలో రోజుకు ఎంతోమంది చేరుతున్నారు. అవగాహనా లోపం మనమంతా మన చుట్టూ ఉన్నవారితో కలిసి జీవిస్తున్నాం. ఇందులో కొందరు తమపై తమకు సరైన అవగాహన లేని కారణంగా ఎదుటివారిని అనుకరించడం, విలువలు లేని వారి ప్రవర్తనలను కాపీ చేయడం చూస్తుంటాం. అంటే, ఉదాహరణకు.. స్నేహితుల్లో ఒకరు తాగతాగడాన్ని చూస్తూ, కొన్నాళ్లకు ఆ గ్రూప్లో ఉన్న మిగతావారూ అదేపని చేస్తుంటారు. ఇది సమయాన్ని వృథా చేస్తుంది. మానసికంగా, శారీరకంగా చెత్తను తయారు చేస్తుంది. ఇదే సోషల్ మీడియా విషయంలోనూ జరుగుతుంది. చాలామంది ఒకేరకమైన కంటెంట్ను చూడటానికి అలవాటు పడుతున్నారు.అది నిజం కాదని స్పష్టంగా తెలిసినప్పటికీ. ఏదో ఆనందం కోసం చూస్తున్నాం అంటారు. అదే కంటెంట్ను చూస్తూ కొంతకాలానికి తామూ కూడా అదే రకమైన కంటెంట్ను పోస్ట్ చేస్తారు. ఒకరిని చూసి ఒకరు ఫేక్ కంటెంట్ను సోషల్మీడియాలో వదిలితే.. కొన్నాళ్లకు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ఆత్మగౌరవ సమస్య మీలో ఆత్మబలం లేకపోతే ఇతర వ్యక్తులపై ఆధారపడతారు. అప్పుడు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఎప్పుడూ బాధ, భయపడుతూ ఉంటారు. నిజానికి చుట్టూ ఉన్నవాళ్లకు మన గురించి పట్టించుకునేంత తీరిక లేదు. మన సొంత అవగాహనే తప్ప ఎవరూ ఎవరికీ తీర్పులు చెప్పరు. ఆత్మగౌరవ సమస్యలు ఉన్న ఎవరైనా సోషల్మీడియా ద్వారా తమ జీవితం గొప్పగా, సంతోషకరంగా ఉందని నిరూపించడానికి ప్రయత్నించవచ్చు. డిప్రెషన్తో పోరాడుతున్న ఎవరైనా ఇప్పటికీ అంతా బాగానే ఉన్నట్లు నటించడానికి సోషల్మీడియాను ఉపయోగించవచ్చు. వారి బంధాల గురించి, సంతోషకరంగా గడిపిన సందర్భాలను ఫొటోలతో సహా పోస్ట్ చేయవచ్చు. అవే నిజం అనుకోవడానికి లేదు. వాటికి ప్రతిగా మరికొందరు తాము సంతోషంగా ఉన్న ఎప్పటి సందర్భాన్నో ఇప్పుడు పంచుకోవచ్చు. ఇలాంటి విధానాల వల్ల ఆత్మగౌరవం, బలం పెరగవు అని గుర్తుంచుకోవాలి. ఫేక్ సర్కిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతిదీ ఏదైనా డిలీట్ చేయలేరు. దశాబ్దాలుగా ఇంటర్నెట్లో కనిపించే అవకాశం ఉంది. మీరు మీ మెసేజ్ను లేదా ఫొటోని డిలీట్ చేయవచ్చు. అయితే, ఇంటర్నెట్లో స్క్రీన్షాట్, డౌన్లోడ్ వంటి సాధనాలపై మీ కంట్రోల్ ఉండదని గుర్తించాలి. మీ ప్రొఫైల్ని ఆర్ట్ గ్యాలరీగా పరిగణించాలి. అంటే, మీ సొంత భావోద్వేగాలతో సహా గొప్పగా కనిపించని దేన్నీ పోస్ట్ చేయరని అర్ధం. కానీ, కాలక్రమేణా ఫేక్ హాపీనెస్ షేరింగ్ ఒక అలవాటుగా మారొచ్చు. అలాంటప్పుడు కొన్నాళ్లకు ప్రోఫైల్లోని మొత్తం కంటెంట్ ఫేక్ అవ్వచ్చు. దీనిని కొన్నాళ్లుగా చూస్తున్న మీ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు కూడా అదే అలవాటుగా మార్చుకుంటే... ఫేక్ హాపీనెస్ చట్రం క్రియేట్ అవుతుంది. గుర్తింపు కోరుకోవడం ఈ ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది. సోషల్ మీడియాను అదే పనిగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలలో ఇది ఒకటి. కాలక్రమేణా మిమ్మల్ని మీ ఆన్లైన్ ప్రోఫైల్తోనే జనాలు గుర్తించవచ్చు. అప్పుడు మీ ప్రోఫైల్ మీరు కావచ్చు. మన మనసుకు ఏది నిజం, ఏది అబద్ధం.. వాటి మధ్య ఉంటే తేడా అన్నీ తెలుసు. కానీ, అది ఒక్కటే సరిపోదు. సోషల్ మీడియాలో తమ సొంత ఇమేజ్తో గుర్తింపు పొందేందుకు ఇష్టపడే ఎవరైనా చివరికి వారి సొంత నిజ జీవితాన్ని, నిజమైన అవసరాలను విస్మరించవచ్చు. మీరు సంతోషంగా లేని సమయాల్లో గుర్తింపు పోతుందేమో అనే ఆలోచనతో ఫేక్ హ్యాపీనెస్ ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేయవచ్చు. మీరు సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, దానిపై ఆధారపడే వ్యాపారాన్ని చేస్తుండవచ్చు. కానీ, అన్నింటికన్నా జీవితంపై దృష్టి పెట్టడం ఇప్పుడే మొదలవ్వాలి. ఎందుకంటే జీవితం ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లోనే ఉంటుంది. వ్యసనం లైక్లు, కొత్త ఫాలోవర్లు, నోటిఫికేషన్లను చూడటం గొప్ప అనుభూతిని ఇస్తుంది. మీరు చేసిన పోస్ట్కి వచ్చిన కామెంట్స్కు రిప్లై కూడా ఇవ్వండి. వచ్చే నోటిఫికేషన్స్కి అడిక్ట్ అవకండి. మీరు చేసిన పోస్ట్కు కామెంట్స్, వ్యూస్, లైక్స్.. నంబరింగ్పై దృష్టి పెట్టకండి. సంతోషకరమైన ఫొటోలన పోస్ట్ చేయడం వల్ల వచ్చే లైక్లు, వ్యూస్ పెరుగుతుంటే వాటి వల్ల వచ్చేదేంటో ఊహించండి. లైక్స్ ఎన్ని ఎక్కువ వస్తే అంత బలం పొందినట్టుగా అనిపిస్తుంది. దీనివల్లే మళ్లీ మళ్లీ అదే పని చేయాలనుకుంటారు. పొంచి ఉండే స్కామర్లు మీరు ఫేక్హ్యాపీనెస్ కోసం ప్రయతిస్తుంటే మిమ్మల్ని నకిలీ ఖాతాలతో మోసం చేసేవారూ ఉండచ్చు.. మీరు చేసే పోస్ట్లకు ఉన్న ఫలంగా ఎక్కువ లైక్స్, వ్యూస్ వస్తే అనుమానించండి. ఎందుకంటే, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా మీతో పరస్పర చర్యలు జరిపి, దారితప్పించవచ్చు.. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేలా లేదా ఆర్థిక స్కామ్లలో పాల్గొనేలా మోసగించవచ్చు. స్కామర్లు ఫేక్ స్పాన్సర్షిప్ అవకాశాలను అందిస్తూ, వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవచ్చు. పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు మొదలైన సమాచారాన్ని పంచుకునేలా మోగిసించవచ్చు. మోసగించబడుతున్నాం అని గుర్తిస్తే వెంటనే... ఈ క్రింది సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో రి΄ోర్ట్ చేయండి. ♦ https://help.twitter.com/en/safety-and-security/report-a-tweet ♦ https://www.facebook.com/help/1380418588640631 https://www.linkedin.com/help/linkedin/answer/a1344213/recognize-and-report-spam-inappropriate-and-abusive-content?lang=en https://help.instagram.com/192435014247952 ♦ https://faq.whatsapp.com/1142481766359885/?cms_platform=android పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంటే.. https://www.cybercrime.gov.inË లో రిపోర్ట్ చేయండి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
100 పెట్టి, వంద కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కొనుగోలు చేసే స్థితిలో..
మెరిసేవన్నీ బంగారం కానట్టే, మనం చూసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో అందరూ నిజమైన వారు కాకపోవచ్చు. వారు చూపే ఉత్పత్తులు నమ్మదగినవి అయిఉండకపోవచ్చు. ఎందుకంటే, రూ.100 పెట్టి, వంద అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కొనుగోలు చేసే కొత్త మార్కెట్ ప్లేస్గా ప్రస్తుత సోషల్మీడియా తయారైంది. సరైన అవగాహన లేకపోతే పెయిడ్ పోస్ట్– వ్యక్తిగత అభిప్రాయం మధ్య తేడాను గుర్తించడం కష్టం. సెలబ్రిటీలు, ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవారు చెబుతున్నారు కదా అని నాసిరకం వస్తుసేవలను కొనుగోలు చేసి మోసపోవద్దు. ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి కంపెనీలు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వైపు మళ్లుతున్నాయని ఆన్లైన్ ట్రెండ్ నివేదికలు చూపుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ ఎండార్స్మెంట్ పెరగడానికి ప్రధాన కారణాలివి.. ►ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ చేసే ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ. ►వినియోగదారులు ఆన్లైన్లో ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ చూపించే వ్యూస్, కామెంట్స్ను చూసి నమ్ముతారు. ►ఎక్కువ షేర్ అయిన కంటెంట్ను చదవడానికి అధిక సమయం కేటాయిస్తారు. అలాగే ఆ సమాచారాన్ని వినియోగదారులు నమ్మే అవకాశాలు ఎక్కువ. ►ఇన్ప్లుయెన్సర్లు వారి ఫాలోవర్స్ కామెంట్స్కు ప్రతిస్పందించడం, ఉత్పత్తులు, సేవలపై వారి అభిప్రాయాలను చెప్పడం.. మొదలైన వాటితో వినియోగదారుడు నమ్మకం పెంచుకుంటాడు. ►ఇన్ఫ్లుయెన్సర్లు వారి ఫాలోవర్స్తో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండటం కూడా దీనికి ఒక కారణం. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు.. ►నకిలీ ఉత్పత్తులు/సేవలు/ యాప్లు అందించే డబ్బును చూసి ఆశపడవద్దు. వాటి వల్ల మీపైన కూడా యూజర్లకు నమ్మకం పోయే అవకాశం ఉంది. ►ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా గూగుల్లో శోధించండి. చట్టబద్ధమైన సమాచారం ఉందో లేదో రివ్యూలు చదివి నిర్ధారించండి. ►మీ ఫోన్ నెంబర్ లేదా చిరునామాను సోషల్ మీడియాలో ఉంచవద్దు. ఎందుకంటే వీటిని వ్యాపార ఉపయోగాల కోసం ఇతరులు సేకరించే అవకాశం ఉంది. ►యాప్లకు ఇచ్చిన యాక్సెస్ను ఒకటికి పదిసార్లు చెక్ చేసి గాని నిర్ధారణకు రాకండి. ►ఫోన్లో అవసరమైన ప్రైవసీ సెట్టింగ్స్ను సెట్ చేయండి. అందుకు.. ఫోన్లో జీపీఎస్, బ్లూ టూత్, పాస్వర్డ్లు, పిన్లను సెట్ చేయండి. ►నమ్మకమైన ప్రొవైడర్ల నుండి మాత్రమే కావల్సినవాటిని డౌన్లోడ్ చేసుకోండి. ►అన్ని ఆఫ్లైన్, ఆన్లైన్ పరస్పర చర్యల కోసం సమ్మతిని ఒకే విధంగా పరిగణించాలి. ►మీ వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ట్రోలింగ్కి ఆస్కారమిచ్చే వ్యక్తిగత కథనాలు, అభిప్రాయాల వ్యక్తీకరణలు, ఫొటోలు/వీడియోల ... వంటివి పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తపడటం మంచిది. ►అన్ని ఫొటోలపై వాటర్మార్క్లను ఉపయోగించండి. ►హద్దులను సృష్టించుకోండి. అంటే, భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిగత కథనాల జోలికి వెళ్లకండి. ►ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేయవద్దు. ►జాత్యాహంకార, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యాలను నివారించడం మంచిది. ►మీ డేటాను రక్షించుకోవడం ముఖ్యం. మాల్వేర్, ట్రాకర్లను నిరోధించే పెయిడ్ టూల్స్ను ఉపయోగించండి. ►పాస్వర్డ్లు, ఇమెయిల్, నగదు చెల్లింపులను రక్షించడానికి రెండు రకాల ప్రామాణికతను పాటించాలి. ►ఫాలోవర్లను ఆకట్టుకోవడానికి నకిలీ సమీక్షలు, కామెంట్స్, లైక్స్ను కొనుగోలు చేయకూడదు. ఇలాంటి వాటిలో ఎక్కువ... ►నకిలీ కంపెనీలు ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, పెట్టుబడి, మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిఫ్టో కరెన్సీ .. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సహాయంతో ఇంటర్నెట్లో గుర్తుతెలియని విధంగా పనిచేస్తాయి. వారి యాప్లలో పెట్టుబడులు పెట్టడానికి సగటు మధ్యతరగతిని ప్రలోభ పెట్టడానికి ఖరీదైన మార్కెటింగ్ ప్రచారాలను ప్రారంభించాయి. ►ఆపిల్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయని యాప్లు చాలా వరకు చట్టబద్ధమైనవి కావు. వీటి ఉద్ధృతికి అడ్డుకట్ట వేయాలంటే మన దేశంలో చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకు పట్టే సమయం ఎంతో తెలియదు కాబట్టి మనమే జాగ్రత్త వహించడం ముఖ్యం. గుర్తించడం ఇలా? ►ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ చేసిన సర్వే ప్రకారం 50 శాతం ఫాలోవర్లు నకిలీలే అని తేలింది. చాలా మంది ప్రముఖ బాలీవుడ్ నటులు, నటీమణులు, ర్యాపర్లను కూడా నకిలీ ఇన్ఫ్లుయెన్సర్లుగా మోసగాళ్లు వాడుకుంటున్నారు. ►పోస్టింగ్కు ఉన్న ఫాలోవర్ల ట్రెండ్ను చూడాలి. ►ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ చేసే పోస్టింగ్లపై దృష్టి పెట్టండి. ఫాలోవర్స్ ఎక్కువ, పోస్ట్లు తక్కువ ఉంటే అవి రెడ్ ఫ్లాగ్స్ అని గుర్తించాలి. ►కొన్ని నకిలీ ఇన్ఫ్లుయెన్సర్ల అకౌంట్స్ చూస్తే ఒకే విధమైన కామెంట్స్, ఒకే విధమైన ఫాలోవర్లు ఉంటారు. ►ఇన్ఫ్లుయెన్సర్ల మానిటరింగ్ టూల్స్ అంటే కూపన్కోడ్లు, లింక్, బయో డిస్క్రిప్షన్లు... మొదలైనవి పర్యవేక్షించడం ద్వారా మోసపూరితమైన వాటిని కనిపెట్టవచ్చు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఫేస్‘బుక్’ అవుతున్నారు.. వందలాది ఖాతాలు హ్యాక్ !
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫోన్లు వాడే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. ఇందులో 80 శాతం మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా సెల్ఫోన్ల వాడకం 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గణాంకాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతా లను కలిగి ఉన్నట్టు గూగుల్ లెక్కలు చెబుతున్నాయి. పలమనేరు: మీ ఫోన్లో ఫేస్ బుక్ (ముఖ పుస్తకం) ఖాతా ఉందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. నిత్యం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ హ్యాక్ బుక్గా మారిపోయింది. ఫేస్బుక్ను టార్గెట్గా చేసుకొని హ్యాకర్లు విరుచుకు పడుతున్నారు. యూజర్స్ వ్యక్తిగత సమాచారం, ఫొటోలను వాడుకుంటూ నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఫేక్ అకౌంట్లను ఎలా డిలీట్ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. హ్యాకర్లను గుర్తించినా వారి పేరు, చిరునామా తప్పుగా ఉంటుంది. దాంతో వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఆపదలో ఉన్నామంటూ రిక్వెస్ట్లు హ్యాక్ చేసిన వారి వివరాలతో ఫేక్ ఖాతాలను సృష్టించి వాటిద్వారా మన స్నేహితులకు ఫేస్బుక్తో పాటు వారి మొబైల్ నంబర్లకు మెసెంజర్, వాట్సాప్, సాధారణ ఎస్ఎంఎస్లను పంపుతున్నారు. తాను ఆస్పత్రిలో ఉన్నానని వెంటనే డబ్బు కావాలంటూ వారి ఫోన్పే లేదా గుగూల్పే నంబర్లను అందులో ఉంచి, సులభంగా డబ్బు కాజేస్తున్నారు. ఇది నిజమని నమ్మి ఎంతోమంది తమ ఖాతాలనుంచి నగదును హ్యాకర్లకు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అయి అదే పేర్లతో రెండు, మూడు ఫేక్ అకౌంట్లు కనిపిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బగ్స్ సృష్టించి హ్యాక్ చేస్తున్న వైనం ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పలువురు సోషల్ ఇంజినీరింగ్ విద్యార్థులు హ్యాకింగ్ చేయడమే వృత్తిగా చేసుకొని నిత్యం డబ్బులు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మన ఫోన్కొచ్చే లింక్స్ ద్వారా, యాడ్స్ ద్వారా, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ హ్యాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. మన ఫోన్కు తరచూ వచ్చే ఫోన్ రీచార్జీలు ఉచితమని, లాటరీ వచ్చిందని, ఫెస్టివల్ ఆఫర్లని క్యూఆర్ కోడ్లను పంపుతున్నారు. వాటిని టచ్ చేస్తే చాలు మన సమాచారం మొత్తం హ్యాకర్ల చేతిలోకి చేరుతోంది. మన ఫోన్ను హ్యాకర్లు ఆపరేట్ చేస్తుంటారు. మన ఫోన్లోని యాక్సెస్ లోకేషన్ ఆధారంగా మనకు తెలియకుండానే మన మొబైల్లోని కెమరాసైతం మనల్ని రికార్డు చేసే టెక్నిక్స్ను ఎథికల్ హ్యాకర్స్ సులభంగా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సెక్యూరిటీ పటిష్టం చేసుకోండి ఫేస్బుక్ హ్యాక్ చేశాక ఇబ్బందులు పడేకంటే ముందుగానే సెక్యూరిటీ సిస్టంను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మన ఫేస్బుక్లోని సెట్టింగ్స్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో టు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకోవడం, మన పాస్వర్డ్ను మార్చుకోవడం, ఫేస్బుక్ ప్రొఫైల్ను లాక్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మన ఫేస్బుక్ హ్యాక్ అయిందా లేదా అని సెటింగ్స్లో కెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఫేస్బుక్లో అన్నోన్ ఫ్రెండ్ రిక్సెస్ట్లను ఎప్పుడూ అంగీరించకుండా ఉంటే మంచిది. మనకు బాగా తెలిసిన వారినే ఫ్రెండ్స్గా పెట్టుకోవాలి. హ్యాక్చేసి.. ఫేక్ ఖాతాల సృష్టి హ్యాక్చేసిన ఖాతాలోని వ్యక్తిగత వివరాలు, ఫొటోలను వాడి, అసలు ఖాతాను పోలిన నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. పోనీ ఎందుకొచ్చిన తంటలేనని మన ఫేస్బుక్ ఖాతాను శాశ్వతంగా డిలీట్ చేసుకుంటే మరిన్ని తిప్పలు తప్పవు. అప్పటికే హ్యాకర్ల చేతిలోకి వెళ్లిన మన సమాచారంతో మరిన్ని సైబర్ నేరాలు చేసుకొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన జీమెయిల్ ఆధారంగా బ్యాంకు ఖాతాలను సైతం సులభంగా హ్యాక్ చేసి ఆపై మన మొబైల్ నంబర్కు కొన్ని యాడ్లింక్స్ పంపుతున్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త స్మార్ట్ఫోన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన లింకులను టచ్ చేయడం, మనకు తెలియని యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవడం, కోడ్ను స్కాన్ చేయడం చాలా ప్రమాదకరం. మనకు రకరకాలుగా ఆశపెట్టి హ్యాక్ చేసేవాళ్లు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. సైబర్ నేరాలపై తమశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలి. పొరబాటు జరిగాక బాధపడేకంటే ముందుగానే అప్రమత్తంగా ఉండడం ఉత్తమం. – సుధాకర్ రెడ్డి, డీఎస్పీ, పలమనేరు నా ఫేస్బుక్ను హ్యాక్ చేశారు ఇటీవల నా ఫేస్బుక్ హ్యాక్ అయింది. ఎవరో ఫేక్ అకౌంట్ను సృష్టించి ఆపదలో ఉన్నానని డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్లు పెట్టారు. దీంతోనేను ఫేస్బుక్హ్యాక్ అయిందని, అదే పేజీలో మెసేజ్ పెట్టాను. నా ఖాతాను సైతం మరింత భద్రపరుచుకున్నా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన వివరాలు సులభంగా బయటకు పోతాయి. – సుధాకర్రెడ్డి, వి.కోట, పలమనేరు నియోజకవర్గం -
సోషల్ మీడియాలో ‘చీకోటి’ ట్వీట్స్ హల్చల్!
హైదరాబాద్: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చీకోటి ప్రవీణ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చీకోటి ప్రవీణ్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు తెలిసింది. @praveenchikotii పేరుతో ట్విట్టర్లో నకిలీ ఖాతాను గుర్తించాడు చీకోటి ప్రవీణ్. వాటి ద్వారా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలను ప్రవీణ్ బెదిరిస్తున్నట్టు.. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం ఆయా ట్వీట్లలో ప్రస్తావిస్తు ఫేక్ పోస్ట్లు పెట్టినట్లు సమాచారం. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు.. సోషల్ మీడియాల్లో ఫేక్ అకౌంట్లపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు చీకోటి ప్రవీణ్. తప్పుడు ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నాడు. ఆయా నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని.. సీసీఎస్ పోలీస్లకు ఫిర్యాదు చేశాడు ప్రవీణ్. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ‘చీకోటి’ ల్యాప్టాప్లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్ -
ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విటర్, ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. 44 బిలియన్ డాలర్ల ట్విటర్ కొనుగోలు ఒప్పందంనుంచి తప్పుకోవడంతో ట్విటర్ మస్క్పై చట్టపరమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో మస్క్ శుక్రవారం ట్విటర్కు వ్యతిరేకంగా 164 పేజీల కౌంటర్సూట్ దాఖలు చేశారు. ట్విటర్ పిటిషన్పై ఈ అక్టోబర్ 17 నుండి ఐదు రోజుల పాటు విచారణ ప్రారంభం కానుందని డెలావేర్ కోర్టు ప్రకటించిన అనంతరం ఈ వ్యాజ్యం దాఖలు చేయడం విశేషం. కాగా నకిలీ ఖాతాల వెల్లడి విషయంలో ట్విటర్ సరియైన సమాచారాన్ని అందించ లేదంటూ వాదించిన ఎలాన్ మాస్క్ ట్విటర్ కొనుగోలు డీల్నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. దీంతో మస్క్ నిర్ణయంతో తమ వ్యాపారానికి విఘాతం కలిగిందని, ఒప్పందాన్ని కొనసాగించేలా ఆయనను ఆదేశించాలని కోరుతూ ట్విటర్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ట్విటర్ ఇంకా స్సందించాల్సి ఉంది. చదవండి: విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు! -
Elon Musk - Twitter : ‘కోకకోలాలో కొకైన్’.. అసలేముందక్కడ!
ట్విటర్లో ఫేక్/స్పాన్ ఖాతాలు ఎన్ని ఉన్నాయనే అంశంపై ఈలాన్ మస్క్ వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్ ప్రస్తుత యాజమాన్యం చెబుతున్న సంఖ్యలు వాస్తవ పరిస్థితులకు మధ్యన పొంతన ఉండటం లేదంటూ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. తన వాదనను సమర్థించుకునేలా అనేక ఉదాహారణలు చూపెడుతున్నారు. ట్విటర్ బోర్డుకు చుక్కులు చూపెడుతున్నాడు.. ట్విటర్ను టేకోవర్ చేసే విషయంలో ఈలాన్మస్క్ పునారాలోచనలో పడ్డట్టు ప్రకటించారు. దీనిపై ఇటీవల జరిగిన ఓ పోడ్కాస్ట్లో ఈలాన్ మస్క్ స్పందించారు. ట్విటర్లో ఫేక్ ఖాతాలు 20 శాతానికి పైగానే ఉన్నాయని, ఇక మనుషుల ఖాతాల్లోనూ యాక్టివ్ యూజర్ల సంఖ్య మరింత తక్కువ అంటూ వివరణ ఇచ్చారు. ఇందులో కోసం ఇటీవల తాను చేసిన ఓ ట్వీట్కి వచ్చిన స్పందనను ఉదహారించారు. మస్క్ రికార్డ్ ట్విటర్ను కొనుగోలు చేస్తున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించిన తర్వాత నెక్ట్స్ ఏం కొనబోతున్నారంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు.. దానికి బదులిస్తూ నెక్ట్స్ కోకకోలాను కొనుగోలు చేసి అందులో కొకైన్ పెడతానంటూ ఈలాన్ మస్క్ చమత్కరించాడు. అయితే ఈ ట్వీట్ వైరల్గా మారింది. మొత్తం మీద ఈ ట్వీట్కి 4.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ప్రపంచంలో జీవించి ఉన్న మనుషుల్లో అత్యధిక లైకులు సాధించిన ట్వీట్గా ఇది రికార్డు సృష్టించింది. Next I’m buying Coca-Cola to put the cocaine back in — Elon Musk (@elonmusk) April 28, 2022 ఇంత తక్కువగా అంటే.. రికార్డు సృష్టించిన కోకకోలా - కొకైన్ ట్వీట్పై ఈలాన్ మస్క్ స్పందిస్తూ.. ట్వీటర్కు 217 మిలియన్ల మానిటైజ్డ్ యాక్టివ్ యూజర్ల ఉన్నట్టుగా ట్విటర్ చెబుతోంది. ఇదే సమయంలో రికార్డు సృష్టించిన కోక్ - కొకైన్ ట్వీట్కి వచ్చిన లైకులును పరిశీలిస్తే ఇది కేవలం 2 లేదా 2.5 శాతానికి మించదు అన్నారు. అంతమంది యాక్టివ్ యూజర్లు ఉన్నప్పుడు రికార్డు ట్వీట్కే ఇంత తక్కువ లైక్స్ రావడం అనేక సందేహాలకు తావిస్తోందంటున్నాడు ఈలాన్ మస్క్. నా ట్వీట్ అనే కాదు బాగా వైరల్ అయ్యే ట్వీట్స్కి కూడా నాలుగు మిలియన్ లైకులు వస్తున్నాయి. అంటే యాక్టివ్ యూజర్ల సంఖ్య 2 శాతం దగ్గరే ఉంటోంది. దీనికి కారణం ఫేక్/స్పామ్ అకౌంట్లు అంటూ తర్కిస్తున్నాడు ఈలాన్ మస్క్. ప్రజలకు నిజాలు తెలియాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. నీకో దండం బాబు ఇక ఈలాన్మస్క్ చేస్తున్న ఆరోపణలు సమర్థించేవారు ఉన్నారు. ట్వీటర్ బోర్డు ఫేక్ ఖాతాలు కేవలం 5 శాతం ఉన్నట్టుగా చెబుతోంది. అయితే ఈ ఐదు శాతం అన్నది కనిష్టం. గరిష్టంగా ఇంది 20 శాతానికి పైగానే ఉంటుందంటున్నారు. ఓ వైపు మస్క్ ఆరోపణలు..మరోవైపు అతనికి పెరుగుతున్న మద్దతులో ట్విటర్కి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 44 బిలియన్ డాలర్ల డీల్ సంగతి దేవుడెరుగు! ఈలాన్తో వచ్చిన తంటా తొలగిపోతే చాలనుకునే పరిస్థితి క్రమంగా బలపడుతోంది? అత్యధిక లైకులు ఈ ట్వీట్కే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లైకులు సాధించిన ట్వీట్ బ్లాక్ పాంథర్ చిత్ర నటుడు చాడ్విక్ బోస్మన్ పేరిట ఉంది. ఆయన మరణించినప్పుడు కుటుంబ సభ్యలు ఆ విషయాన్ని ఆయన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ ట్వీట్ 7.1 మిలియన్ లైకులు సాధించి నంబర్ వన్ స్థానంలో ఉంది. pic.twitter.com/aZ2JzDf5ai — Chadwick Boseman (@chadwickboseman) August 29, 2020 అప్పట్లో కొకైన్ ఉండేది చాలామందికి ఫేవరేట్ డ్రింకులలో ఒకటైన కోకకోలాలో ప్రారంభంలో కొకైన్ కలిపేవారు. కోలా ఆకుల నుంచి సంగ్రహించిన కొకైన్ను, కోలా నట్స్ నుంచి సేకరించిన కోలాను కలిపి ఈ డ్రింకును 1890లలో తయారు చేశారు అప్పట్లో అమెరికాలో కొకైన్ను ఔషధంగా వినియోగించేవారు. ప్రతీ కోక్ బాటిల్లో 9 మిల్లీగ్రాముల కొకైన్ ఉండేది. అయితే కాలక్రమేనా కొకైన్ వాడకంపై విమర్శలు రావడంతో.. అమెరికా కోలాలో కొకైన్ కలపడాన్ని నిషేధించింది. ఇక ఈలాన్మస్క్ - ట్విటర్ డీల్ విషయంలో ఇప్పుడు కోక్బ్రాండ్కి ఉచితంగా పబ్లిసిటీ దొరుకుతోంది. చదవండి: ట్విటర్ డీల్.. ఈలాన్మస్క్ షరతులు వర్తిస్తాయి .. -
ట్విటర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం: ఎలన్ మస్క్
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ట్విటర్ డీల్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్లోనే ఓ పోస్ట్ చేశారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్-ఎలన్ మస్క్ మధ్య కొనుగోలు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలో పూర్తిగా ఎలన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లాల్సి ఉంది. ఈలోపే ట్విటర్ డీల్ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్లో పెట్టాం అని ఆయన స్పష్టం చేశారు. Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn — Elon Musk (@elonmusk) May 13, 2022 ఈ ప్రకటనతో మార్కెట్ ట్రేడింగ్లో ట్విటర్ షేర్లు పతనం అయ్యాయి. మరోవైపు ఈ డీల్ నిలిపివేతపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్లో పెట్టగా.. ఇది ఐదు శాతం కంటే తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో ఎలన్ మస్క్ ట్విటర్ నుంచి స్పాట్ బోట్స్ను తొలగించడమే తన ప్రాధాన్యత అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మొదటి త్రైమాసికంలో.. డబ్బు ఆర్జించగల రోజువారీ క్రియాశీల వినియోగదారులలో(ట్విటర్ యూజర్లు) 5% కంటే తక్కువ మంది తప్పుడు లేదంటే స్పామ్ ఖాతాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. మస్క్తో ఒప్పందం ముగిసే వరకు, ప్రకటనదారులు ట్విట్టర్లో ఖర్చు చేయడం కొనసాగించాలా వద్దా అనే దానితో సహా అనేక నష్టాలను ఎదుర్కొన్నట్లు కూడా పేర్కొంది. -
చైనీస్ ఆపరేషన్?.. బట్టబయలు చేసిన మెటా
ప్రభుత్వాల కోసం పని చేసే సర్వయిలెన్స్ కంపెనీలు.. నిఘాను అద్దెకి ఇస్తే!, డబ్బులిచ్చిన వాళ్ల కోసం యూజర్ల సమాచారాన్ని చేరవేస్తే! ఎలా ఉంటుంది?. అలాంటి సర్వయిలెన్స్ కంపెనీల బాగోతాన్ని వెలికి తీసింది మెటా కంపెనీ(ఒకప్పుడు ఫేస్బుక్). వేల కొద్దీ ఫేస్బుక్ అకౌంట్ల నుంచి, ఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. క్లయింట్లకు చేరవేస్తున్న కంపెనీల బండారాన్ని బయటపెట్టడంతో పాటు.. ఈ స్కామ్కు సంబంధించిన ఫేక్ అకౌంట్లను నిషేధించింది మెటా కంపెనీ. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ ‘మెటా’ గురువారం 1,500 అకౌంట్లను(ఏడు సర్వయిలెన్స్ కంపెనీలకు చెందినవి) పూర్తిగా నిషేధించింది. ఈ అకౌంట్లన్నీ సైబర్ మెర్కెనరీ (సైబర్ కిరాయి) కంపెనీలకు చెందినవిగా తేల్చింది. ఉద్యమకారులు, ప్రముఖ జర్నలిస్టులు, అసమ్మతివాదులపై నిఘాలో భాగంగా క్లయింట్ల తరపున ఈ అకౌంట్లు పని చేసినట్లు మెటా నిఘాలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వందకు పైగా దేశాల్లో యాభై వేల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లను అప్రమత్తం చేసే ఉద్దేశంతో ఉంది మెటా. చైనీస్ ఆపరేషన్.. మెటా ఆపరేషన్లో వెల్లడైన కీలక అంశం.. చైనా కేంద్రంగా నడుస్తున్న ఆపరేషన్. ఈ ఆపరేషన్ పేరు, ఎవరు నడుపుతున్నారో మెటా గుర్తించలేకపోయింది. కానీ, చైనా అధికారులకు చెందిన సర్వర్లు, నిఘా సాధనాల ‘కమాండ్ అండ్ కంట్రోల్’ వ్యవస్థను మెటా ట్రేస్ చేయగలిగింది. కొన్ని చైనా బ్రాండ్లకు చెందిన ఫోన్ల ద్వారా ఈ స్కామ్ నడుస్తోందని, ఫేస్బుక్తో పాటు ఇతర డేటాను సైతం సేకరించి.. క్లయింట్లకు చేరవేస్తున్నాయని మెటా పేర్కొంది. ఇక ఈ స్కామ్లో ఎక్కువగా పాల్గొంది ఇజ్రాయెల్కు చెందిన సర్వయిలెన్స్ కంపెనీలే. ఈ ఏడు కంపెనీల లిస్ట్లో బ్లూహాక్ సర్వయిలెన్స్ కంపెనీ పేరు ప్రముఖంగా ఉంది. భారత్కు చెందిన బెల్ట్రాక్స్ సంబంధిత ఫేస్బుక్ అకౌంట్లను సైతం తొలగించింది మెటా. ఏం జరుగుతోందంటే.. సర్వయిలెన్స్ కంపెనీలు ఫేక్ అకౌంట్లు సృష్టించి.. యూజర్ల ప్రొఫైల్ను గుంజేస్తున్నాయి. వీటిలో సెలబ్రిటీలు, ప్రభుత్వ విభాగాల పేరుతోనూ అకౌంట్లను క్రియేట్ చేస్తాయి ఆ కంపెనీలు. అంతేకాదు గ్రూపుల్లో, సంభాషణల్లో జోక్యం చేసుకుంటూ వ్యక్తిగత వివరాల్ని సేకరిస్తాయి. ఫేస్బుక్ అకౌంట్లతో పాటు ఫోన్, కంప్యూటర్, పాస్వర్డ్లు, పొటోలు, వీడియోలు, మెసేజన్లు.. అన్నీ హ్యాక్ చేస్తారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి నిఘా కంపెనీలు.. వెబ్ ఇంటెలిజెన్స్ సేవలను ప్రభుత్వాలకు విక్రయిస్తుంటాయి. వార్తా నివేదికలు, వికీపీడియా వంటి పబ్లిక్గా అందుబాటులో ఉన్న ఆన్లైన్ మూలాల నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇవి నిఘా ప్రక్రియను ప్రారంభిస్తాయి. అయితే ఈ సేవలను ప్రైవేట్గా అద్దెకు ఇస్తుండడం, అందునా యూజర్ల డాటాను అందిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైబర్ మెర్కెనరీ సర్వయిలెన్స్ కంపెనీల పేరుతో ఇవి.. క్లయింట్ల(పెయిడ్) కోసం పని చేస్తుంటాయి. అయితే ఇవి కేవలం క్రిమినల్స్, టెర్రరిస్టులపై నజర్ కోసమే పని చేస్తున్నాయని ప్రకటించుకున్నప్పటికీ.. జరిగే వ్యవహారం అంతా మరోలా ఉంటోంది. చదవండి: ఈ వీడియోలో ఉంది మీరేనా? -
"ట్రింగ్.. ట్రింగ్..హే హలో నేను"..అబ్బాయిలా గొంతు మార్చి..20 లక్షలు కాజేసిన
ఫేస్బుక్లో తప్పుడు పేర్లు, ఫొటోలతో ఐడీలు క్రియేట్ చేసింది. అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు అబ్బాయిల పేర్లు, ఫొటోలు.. అబ్బాయిలను ముగ్గులో దించేందుకు అమ్మాయిల ఫొటోలు, పేర్లు వాడింది. గొంతుమార్చి తనే అబ్బాయి, అమ్మాయిగా మాట్లాడింది. ఫేక్ ఫ్యామిలీ ఫొటోలు క్రియేట్ చేసి లోతుగా ప్రేమలోకి దించింది. తాను దూరమైతే వారు చచ్చిపోయేలా చేసి.. చివరకు బ్లాక్మెయిల్చేసి రూ. 20 లక్షలకుపైగా వసూలు చేసింది. వింటేనే అశ్చర్యంగా ఉంది కదూ.. ఇంతా చేసి ఆ మహిళ చదివింది కేవలం ఇంటర్. కరీంనగర్ క్రైం: లేని పేర్లు, మనుషులను సృష్టించి, సామాజిక మాధ్యమాల్లో పలువురు యువతీ, యువకులను మోసగించి రూ.20 లక్షలు వసూలు చేసిన ఓ మహిళ (30)ను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కమిషనరేట్ కేంద్రం లో అడిషనల్ డీసీపీ (లాఅండ్ఆర్డర్) ఎస్.శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందిన మహిళ కరీంనగర్ లోని తిరుమలనగర్లో ఉంటూ మిషన్ భగీరథలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తోంది. ఒక వ్యక్తితో పెళ్లి, విడాకులయ్యాయి. రెండో పెళ్ళి చేసుకున్నా ప్రస్తుతం కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. (వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్ డీసీపీ శ్రీనివాస్) 2012 నుంచి మోసాలు.. తనకు తెలిసిన అబ్బాయిని వలలో వేసుకునేందుకు 2012లో ఒక ఫేస్బుక్ ఫేక్ ఐడీ క్రియేట్ చేసింది. తర్వాత అతడికి తెలిసిన ఒక ఉన్నత ఉద్యోగం గల యువతిని పరిచయం చేసుకొని యువకుడి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి చాట్ చేయడం మొదలుపెట్టింది. చివరకు ఆమెను లోతుగా ప్రేమలోకి దింపింది. విచిత్రమేమిటంటే మహిళ అయి ఉండి కూడా ఏ మాత్రం అనుమానం రాకుండా మిమిక్రీ చేస్తూ మగవాడిలా మాట్లాడుతూ జాగ్రత్తపడింది. బాధల్లో ఉన్నానంటూ బాధితురాలి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. 34 ఫేక్ఐడీలు క్రియేట్ చేసి 10 సిమ్కార్డులను ఉపయోగించి 20 మందికి పైగా యువతీ యువకులను మోసం చేసింది. రూ.20 లక్షలకుపైగా వసూలు చేసింది. -
Telugu Academy: ఏడాది క్రితం నుంచే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిందుతుల ఏడాది క్రితం నుంచే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర పన్నారని తెలిసింది. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్తో కలిసి డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. అకాడమీ నుంచి 3 బ్యాంకుల్లో డిపాజిట్లకు సిఫార్సు చేశారు. బ్యాంకుల డిపాజిట్ల సందర్భంలోనే నకిలీ పత్రాలు, డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్ సంతకాలు ఫోర్జరీ వంటి అంశాలను సెట్ చేసుకున్నారు. సంవత్సర కాలానికి డిపాజిట్లు పెట్టి.. 15 రోజులకే మార్పు చేశారు. ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు తమ దగ్గరే ఉంచుకుని.. నకిలీ సర్టిఫికెట్లు అకాడమీకి ఇచ్చారు నిందితులు. ఒరిజినల్ ఎఫ్డీలతో 64.5 కోట్ల రూపాయలు డ్రా చేసింది ఈ ముఠా. ముందుగానే తెలుగు అకాడమీ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారు. అగ్రసేన్, ఏపీ మర్కంటైల్ సొసైటీల్లో నకిలీ ఖాతాలు సృష్టించారు. ఈ క్రమంలో యూనియన్, కెనరా బ్యాంకుల్లో కాజేసిన నిధులను ముందుగా అగ్రసేన్ బ్యాంక్కు తరలించారు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరింత లోతుగా..) తర్వాత మర్కంటైల్ సొసైటీకి మళ్లించి 64.5 కోట్ల రూపాయలు డ్రా చేశారు. దీనిలో 6 కోట్ల రూపాయలను బ్యాంకు మేనేజర్లు, సొసైటీ సిబ్బందికి లంచంగా ఇచ్చారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్కు కోట్ల రూపాయల లంచం ఇచ్చిన ముఠా.. మిగతా మొత్తాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు. మరి కొంతమంది నిందితులు కాజేసిన నిధులతో అప్పులు తీర్చుకున్నట్టు విచారణలో వెళ్లడయ్యింది. చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్! -
మాటల్లో దించి.. మాయచేసి..
సాంకేతిక పెరిగేకొద్ది సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్త ఎత్తుగడలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేసి నగదు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు మాత్రం తమదైన శైలిలో దోచుకుంటున్నారు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్ చేయరని, అలాంటి ఫోన్లు వస్తే ఎలాంటి వివరాలు ఇవ్వరాదని సమీపంలోని స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధి వాసులు సైబర్ వలకు చిక్కకుండా పోలీసులు, కాలనీ సంక్షేమ సభ్యులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. – బాలానగర్ మచ్చుకుకొన్ని.. లింక్ ఓపెన్ చేయడంతో.. బాలానగర్ ఏపీహెచ్బీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి ఫోన్కు వచ్చిన మెసేజ్ చూడగా ‘మీ బ్యాంక్ అకౌంట్ 24 గంటల్లో డియాక్టివేట్ అవుతుంది’. వెంటనే మీ కేవైసీ డాక్యుమెంట్స్ను చేయాలని ఓ లింక్ వచ్చింది. ఆ లింక్ను ఓపెన్ చేసి బ్యాంక్ సీఆర్ఎం నంబర్, పాస్వర్డ్ ఎంట్రీ చేయగా ఆ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.49,999 డెబిట్ అయ్యాయి. నౌకరీ.కామ్ పేరుతో.. 27 ఏప్రిల్ 2021 రాత్రి 11.41 సమయంలో ఓ మహిళలకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి నౌకరీ.కామ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు మంచి ఉద్యోగం ఇస్తాం ఓ లింక్ పంపించాం. ఆన్లైన్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఉంది. అందుకు గాను రూ. 25తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఆ లింక్ను తెరిచిన ఆమె వివరాలు అందించి పేమెంట్ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. ఆ తర్వాత ఆమె దాని గురించి పట్టించుకోలేదు. అప్పటికే తమ దగ్గర ఉన్న వివరాలతో సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్ నుంచి రూ.16,665 దోచుకున్నారు. ఇట్లు అద్దెకు తీసుకుంటానని.. ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్లో పోస్ట్ చేసిన వ్యక్తి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. బాలానగర్ డివిజన్ సాయినగర్కు చెందిన ఓ వ్యక్తి ప్లాట్ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్లో పోస్టు చేశాడు. అది చూసిన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇంటి అద్దె, అడ్వాన్స్ గురించి యజమాని తెలుపగా మొత్తం రూ. 45 వేలు చెల్లిస్తానని గూగుల్ పేమెంట్ నంబర్ నుండి అకౌంట్కు వివరాలు పంపాలని చెప్పడంతో బాధితుడి విరాలు పంపగా క్షణల్లో సైబర్ నేరగాళ్లు మూడు దఫాల్లో రూ. లక్ష తమ ఖాతల్లోకి మార్చుకున్నారు. ఈఎంఐ చెల్లించే క్రమంలో.. ఫిరోజ్గూడలో నివసించే ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు ఈఎంఐ లోన్ కట్టేందుకు గూగుల్లో వెతుకుతుండగా కస్టమర్ కేర్ అని కనిపించిన ఓ నెంబర్కు ఫోన్ చేశాడు. ఈఎంఐ నగదు డెబిట్ కాలేదు.. కారణమేంటని ప్రశ్నించగా మీ నగదు జమ కావాలంటే మీ ఫోన్లో ఎనీ డెస్క్ యాప్ను ఇన్స్టాల్ చేసి క్రెడిట్ కార్డు నెంబర్, ఓటీపీనీ చెప్పాలని అవతలి నుంచి సమాధానం వచ్చింది. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు బాధితుడు చేయడంతో అరగంటలో దాదాపుగా రూ. 15 వేలకు పైగా బాధితుడి ఖాతాలోంచి దోచుకున్నారు. ► బాలానగర్ పోలీస్స్టేషన్లో ఈ ఏడాది మార్చి 24వ తేదీన సైబర్ క్రైమ్ వింగ్ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కాగా ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకున్నారు. అందులో 7 మంది మహిళలు ఉన్నారు. ► సైబర్ నేరగాళ్లు రూ. 54. 31 లక్షలు దోచుకోగా అందులో నుంచి రూ. 8.75 లక్షలు రికవరీ చేశారు. ► బాధితులు ఎవరైన ఉంటే ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి, లేదా 155260 నంబర్కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ► సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన కొందరైతే.. బంధువులు, స్నేహితులకు తెలిస్తే వారి దగ్గర చులకన అవుతామనే ఆలోచనలతో ఫిర్యాదు చేయడం లేదు. బ్యాంక్ వివరాలు ఇవొద్దు.. సైబర్ నేరాలు తగ్గాలంటే ప్రజల్లో అవగాహన రావాలి. కేవైసీ అప్డేట్, బీమా అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని మోసం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాగాళ్లను ఎదుర్కొంటున్నాం. ఎవ్వరికీ బ్యాంక్ వివరాలు ఇవొద్దు. బాధితులుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయండి. –ఎండీ. వాహిదుద్దీన్, బాలానగర్ సీఐ చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
అవును! అప్పుడు పొరపాటు జరిగింది : ట్విట్టర్
గతంలో తమ వల్ల పొరపాటు జరిగిందంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఒప్పుకుంది. ఇకపై అలాంటి తప్పులకు తావివ్వబోమంటూ యూజర్లకు హామీ ఇచ్చింది. ఇకపై మరింత నాణ్యతతో సేవలు అందిస్తామని పేర్కొంది. ఫేక్ అకౌంట్లు మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియాగా సంచలనం సృష్టించిన ట్విట్టర్ గతంలో ఫేక్ ఖాతాలను వడబోసేది. అయితే ఈ వడపోత కార్యక్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ట్విట్టర్ 2017 నుంచి ఈ పని నిలిపేసింది. అయితే అప్పటికే అనేక ఫేక్ అకౌంట్లు ట్విట్టర్లో ఉండిపోయాయి. వీటి వల్ల యూజర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. తప్పు జరిగింది దాదాపు నాలుగేళ్ల తర్వాత 2021 మే నుంచి మరోసారి వెరిఫికేషన్ ప్రోగ్రామ్ చేపట్టింది ట్విట్టర్. ఈ సందర్భంగా ట్విట్టర్ ప్రతినిధులు స్పందిస్తూ ... గతంలో పొరపాటుగా కొన్ని ఫేక్ అకౌంట్లకు తాము అనుమతి ఇచ్చామని, వెరిఫికేషన్లో జరిగిన తప్పులే ఇందుకు కారణమని తెలిపారు. ఇకపై ఫేక్ అకౌంట్లకు ఎట్టి పరిస్థితుల్లో వెరిపై చేసి బ్లూ టిక్ ఇచ్చే ప్రశ్నే లేదని తెలిపారు. ఇవి నిబంధనలు మానిప్యులేషన్, స్పామ్ పాలసీ ప్రకారం ఫేక్ అకౌంటర్లను శాశ్వతంగా తొలగిస్తున్నామని, అదే విధంగా వాటికి జారీ చేసిన వెరిఫైడ్ బ్యాడ్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ట్విట్టర్. ఫేక్ ఖాతా కాదు అనేందుకు ట్విట్టర్ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం గత ఆరు నెలలుగా ఖాతా ఉపయోగంలో ఉండాలి. దీంతో పాటు ఖాతాకు సంబంధించిన ఈమెయిల్, ఫోన్ నంబరు వివరాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ నేమ్, ఇమేజ్లు కూడా ఉండాలి. అదే విధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిటీస్ ఉండాలి. ఈ నియమాలు పాటించే ఖాతా దారులకు వెరిఫైడ్ బ్యాడ్జీని జారీ చేస్తుంది ట్విట్టర్. లేని పక్షంలో ఫేక్గా గుర్తించి ఖతాలు స్తంభింప చేస్తుంది. -
ఆ దొంగ ఎవరు?!
వసుధ (పేరు మార్చడమైనది) పేరున్న రేడియో జాకీ. రెండేళ్లుగా రేడియో ఎఫ్ఎమ్లో వర్క్ చేస్తోంది. ఎప్పుడూ సరదాగా ఉండే వసుధ అంటే టీమ్లో అందరికీ చాలా ఇష్టం. లీవ్ తీసుకొని వారం రోజులు తన సొంతూరుకు వెళ్లి వచ్చింది. తన పెళ్లి సెటిల్ అయ్యిందని టీమ్ అందరికీ పార్టీ ఇచ్చింది. అందరూ అభినందనలు తెలిపారు. ఉదయాన్నే వసుధకు ఫోన్ వచ్చింది. చూస్తే తన ఫ్రెండ్ రోజీ. ‘ఏంటే ఇంత పొద్దున్నే ఫోన్ చేశావ్’ అడిగింది వసుధ. ‘త్వరలో పెళ్లి అన్నావ్, ఎందుకా చెత్త ఫొటోలు అప్లోడ్ చేశావ్!’ కాస్త కటువుగానే అడిగింది రోజీ. నిద్రమత్తు ఎగిరి పోయింది వసుధకు. ఫొటోలా, ఏం ఫొటోలు?! అర్ధం కాక అడిగింది. ఒకసారి నీ ఎఫ్బి ఓపెన్ చేసి చూడు. ఎలాంటి ఫొటోలు ఉన్నాయో..!’ అంది రోజీ. పోస్ట్ చేసేది ఎవరు? తన అకౌంట్ ఓపెన్ చేసి చూసింది. అలాంటివేవీ లేవు. అదే విషయాన్ని రోజీకి ఫోన్ చేసి అడిగింది. వసుధ పేరుమీద అప్లోడ్ చేసిన ఫొటోలు, అకౌంట్ డీటెయిల్స్తో సహా స్క్రీన్ షాట్ చేసి వసుధకు పంపించింది రోజీ. అవి చూసిన వసుధ ఉలిక్కిపడింది. తన పేరు మీదనే ఉన్న మరో అకౌంట్లో ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోలు. అసలా ఫొటోలు అంత వల్గర్గా ఎవరు తీశారో, ఎవరు అప్లోడ్ చేశారో.. ఏమీ అర్ధం కాలేదు. గంటకో ఫొటో అప్లోడ్ అవుతూనే ఉంది. అవి తన వ్యక్తిగత ఫొటోలు. ఎక్కడ నుంచి తన ఫొటోలు ఎవరు తీసి, అప్లోడ్ చేస్తున్నారో తెలియడం లేదు. వేలాదిగా వస్తున్న చెత్త కామెంట్లు. తను మార్కెట్కి, షాపింగ్కి వెళ్లినా.. పలానా చోట ఉన్నట్టు ఆ సమాచారం ఎఫ్బిలో పోస్ట్ అవుతుంది. నాలుగు రోజులుగా తిండీ, నిద్రకు దూరమైంది. ముక్కలైన బంధం కాబోయే భర్త రాఘవ ఫోన్ చేశాడు. ఆనందంగా ఫోన్ ఎత్తిన వసుధ అతని మాటలకు తల్లడిల్లిపోయింది. ‘ఆధునిక భావాలు కలదానివని తెలుసు. కానీ, మరీ ఇంత ఆధునికం అని తెలియదు. ఇక మన పెళ్లి జరగదు, సారీ’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇంజనీరింగ్ చేసిన వసుధ, తనకు నచ్చిన రేడియో జాకీ జాబ్ చేస్తూ అందరి మెప్పు పొందింది. పెద్దలు కుదిర్చిన సంబంధానికే ఓకే చెప్పింది. ఇరువైపుల పెద్దలకు సంబంధం నచ్చడంతో సింపుల్గా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. నెల రోజుల్లో పెళ్లి. ఓ పది రోజులు డ్యూటీ చేసి, ఆ తర్వాత షాపింగ్ పూర్తి చేసుకొని ఊరెళ్లిపోదామనే ఆలోచనలో ఉంది వసుధ. కానీ, అనుకోని ఈ అవాంతరం పెళ్లే ఆగిపోయేలా చేసింది. ఆ రోజంతా ఏడుస్తూనే కూచుంది వసుధ. రోజీ ఇచ్చిన ధైర్యంతో సైబర్ నిపుణులను సంప్రదించింది. మేకవన్నె పులి దీనికంతటికీ కారణం సూరజ్ అని తెలిసేసరికి షాక్ అయ్యింది వసుధ. సూరజ్ కూడా రేడియో జాకీగా వసుధ చేసే ఆఫీసులోనే వర్క్ చేస్తున్నాడు. వసుధ అంటే ఇష్టం పెంచుకున్నాడు. తన పెళ్లి గురించి వసుధ చెప్పగానే బాధపడ్డాడు. వసుధ పై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. ‘నాకు దక్కని వసుధ ఎవరికీ దక్కడానికి వీల్లేదు, ఆమె సంతోషంగా ఉండటానికి వీల్లేదు’ అనుకున్నాడు. అందులో భాగంగానే ఎవరికీ అనుమానం రాకుండా ఓ ప్లాన్ వేశాడు. తన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆధార్కార్డుతో కొత్త సిమ్ తీసుకొని, ఆ ఫోన్ నెంబర్ నుంచి వసుధ పేరుతో ఆన్లైన్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు. వసుధతో స్నేహంగా ఉన్నట్టు నటించి, ఆమె ఫోన్లో ఆమెకే తెలియకుండా స్పై యాప్ డౌన్లోడ్ చేసి, దానిద్వారా వసుధ ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకుంటూ, ఆ సమాచారాన్ని పోస్ట్ చేసేవాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలూ అప్లోడ్ చేస్తూ వచ్చాడు. కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి మరీ ఉపయోగించాడు. ఈ విధంగా వసుధ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసి ఆమెను నలుగురిలో చులకన చేయాలన్నది సూరజ్ ప్లాన్. పులులు అడవుల్లో ఉంటాయి. కానీ, ఇలాంటి మేకవన్నె పులులు మన చుట్టూ ఉంటారు. గమనించి జాగ్రత్తపడాలన్న ఆలోచన అమ్మాయిల్లో పెరగాలి. ఎమెషనల్ ఫ్రాడ్స్కి దూరం ఐడెంటిటీ ఫ్రాడ్ అమ్మాయిల విషయాల్లోనే జరుగుతుంది. 90 శాతం దొంగ దొరికిపోతాడు. కానీ, అమ్మాయిలు ఏమరుపాటుతో ఉండాలి. తమ ఫోన్ని జాగ్రత్తపరుచుకోవాలి. వ్యక్తిగత సమాచారం దొంగిలించ బడకుండా బ్యాంకింగ్కు ఒక ఇమెయిల్ ఐడీ ఫోన్ నెంబర్, ఈ కామర్స్ అన్నింటికీ మరో కొత్త ఫోన్ నెంబర్, ఇ–మెయిల్ ఐడి ఉపయోగించడం వల్ల కొన్ని ఫ్రాడ్స్ని అరికట్టవచ్చు. మ్యాట్రిమోనియల్, డేటింగ్.. మొదలైన ఏ లింక్ ప్రొఫైల్లో అయినా వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. మహిళలను మానసికంగా వేధించేవారు ఎక్కువ మందే ఉంటారు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ పగ తీర్చుకోవాలనే.. కాలేజీలు, కార్యాలయాల నుంచి ఇలాంటి కంప్లైట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్రెండ్స్, లవర్స్గా ముందు క్లోజ్గా ఉండి, బ్రేక్ అయినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటారు. దీంతో ఇలా ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే మరో ఇద్దరు సహోద్యోగుల మధ్య జరిగింది. స్నేహంగా ఉంటూనే ఉద్యోగిని ఫోన్లో ఒక బగ్ (ఐకాన్ కూడా కనపడదు) ఇన్ స్టాల్ చేశాడు. అక్కణ్ణుంచి ఆమె ఆన్లైన్ మానిటరింగ్ మొత్తం ఈ ఫ్రాడ్ చేసేవాడు. అవన్నీ ఆఫీసు గ్రూ‹ప్కు పంపించేవాడు. ఫోనోలో ఉన్న ఆ బగ్ ఏ మెయిల్ నుంచి ఆపరేట్ అవుతుందో కనిపెట్టి, ఆ ఫ్రాడ్ని పట్టుకున్నాం. కాబట్టి, ఫోన్ వాడకంలో జాగ్రత్త అవసరం. – వి. గోపీనాథ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్, విశాఖపట్నం -
Club House Scam: టాప్ హీరోహీరోయిన్ల ఫేక్ ఫ్రొఫైల్స్
ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్వర్కింగ్ యాప్ ‘క్లబ్ హౌస్’.. ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా ఆ యాప్లో జాయిన్ అయ్యే అవకాశం ఈమధ్యే కల్పించారు. దీంతో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై తమకేం సంబంధం లేదని హీరోహీరోయిన్లు వరుసగా స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆడియో యాప్ ‘క్లబ్హౌజ్’ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫేక్ ఫ్రొఫైల్స్తో నటీనటులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళీ నటులు ఈ యాప్తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇదివరకే దుల్కర్ సల్మాన్, సీనియర్ హీరో సురేష్ గోపీ ఈ యాప్లో తమకు ప్రొఫైల్స్ లేవని స్పష్టం చేయగా, తాజాగా మరో యంగ్ స్టార్ నివీన్ పౌలీ స్పందించాడు. ‘‘హలో ఫ్రెండ్స్. నాకు క్లబ్హౌజ్లో ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా.. ముందు మీకు చెప్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా, సీనియర్ హీరో సురేష్ గోపీ, దుల్కర్ కూడా ఇది వరకు ఇదే విషయాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక యంగ్ హీరోయిన్ రాధికా వేణుగోపాల్ సాధిక కూడా ఈ ఫేక్ స్కామ్పై రియాక్ట్ అయ్యింది. టోవినో థామస్, జోజు జార్జ్లతో పాటు తన పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్ ‘ఫేక్’ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఆమె ఉంచింది. So, I am not on on Clubhouse. These accounts are not mine. Please don’t impersonate me on social media. Not Cool ! pic.twitter.com/kiKBAfWlCf — dulquer salmaan (@dulQuer) May 31, 2021 క్లబ్హౌజ్ ఏంటంటే.. ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్లబ్హౌజ్ను మనదేశంలో ఈ ఏప్రిల్లోనే లాంఛ్ చేశారు. ఇది రెగ్యులర్ ఫొటో, వీడియో షేర్ యాప్స్ల్లాగా కాదు. ఇందులో ఆడియో కన్వర్జేషన్ల ద్వారా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్ ఉండాలనే నిబంధన ఇంతకు ముందు ఉండేది. అయితే ఈ మధ్యే ఆ రూల్ను సవరించడంతో అడ్డగోలుగా జాయిన్ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఎంట్రాప్రెన్యూర్లు దీన్ని ఉపయోగించడం వల్ల క్లబ్హౌజ్కి క్రేజ్ పెరుగుతోంది. ఇక ప్రముఖ నగరాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న క్లబ్హౌజ్ ఆడియో కన్వర్జేషన్ యాప్.. కేరళలో మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్గా మారింది. ప్రత్యేకంగా ఆన్లైన్ రూమ్స్తో సినిమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతీ టాపిక్పై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఛాయ కడా(టీ కొట్టు) కి మంచి క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలోనే ఇలా హీరోహీరోయిన్ల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika) -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రహస్యంగా నగ్న వీడియోలు తీసి..
అనంతపురం క్రైం: క్రికెట్ బెట్టింగ్.. పేకాట.. ప్రేమ, పెళ్లి ముసుగులో దగా.. 126 నగ్న ఫొటోలు, వీడియోలతో రూ.5లక్షల వరకు వసూలు.. గంజాయి వ్యాపారం.. ఇలా ఒకటేమిటి, ఎన్నో విధాల మోసాలకు పాల్పడుతున్న ఓ నియవంచకుడిని జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కేజీ గంజాయి, సెల్ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం నగరంలోని డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి.సత్యయేసుబాబు వివరాలను వెల్లడించారు. నగరంలోని భైరవనగర్లో నివాసముంటున్న భరత్ రెడ్డి బీటెక్ మూడో సంవత్సరం వరకు చదివి, ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. క్రికెట్ బెట్టింగ్, పేకాటకు బానిసయ్యాడు. సరిపడా డబ్బులు, సంపాదన లేకపోవడంతో నూతన పంథా ఎంచుకున్నాడు. ఫేస్బుక్, టిండర్ యాప్, తెలుగు మ్యాట్రిమోనిలలో ఫేక్ ఐడీలతో అకౌంట్లు సృష్టించాడు. వీటిలో భరత్ రెడ్డి పేరుకు బదులుగా సిద్ధార్థ రెడ్డి అని పేరు.. అతని ఫొటోకు బదులుగా ఓ అందమైన వ్యక్తి ఫొటోను ప్రొఫైల్గా పెట్టుకున్నాడు. అలా అమ్మాయిలను పరిచయం చేసుకుని నిరంతం వాట్సాప్ చాటింగ్, వాయిస్ కాల్స్ కొనసాగించాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొందరు అమ్మాయిలను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నగ్న దృశ్యాలు, రికార్డ్లు సేకరించాడు. మోసపోయిన 20 మందికి పైగా యువతులు ఫేస్ బుక్, టిండర్ యాప్, మ్యాట్రిమోనీ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, ప్రొద్దుటూరు, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాలకు చెందిన యువతులను మోసం చేశాడు. అమ్మాయిల నుంచి సుమారు రూ.5 లక్షల వరకు డబ్బును తన బ్యాంకు అకౌంట్లు, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రాబట్టుకున్నాడు. ఇలా సుమారు 20 మంది అమ్మాయిలు భరత్ వలలో మోసపోయారు. వీరిలో ఉన్నత విద్యను అభ్యసించిన యువతులు.. స్టాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా ఉండటం గమనార్హం. రహస్యంగా నగ్న వీడియోల చిత్రీకరణ అమ్మాయిలు, మహిళలు స్నానం చేసే సమయంలో దొంగచాటుగా వెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. దీంతో పాటుగా గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతనిపై ఇప్పటికే అనంతపురం వన్టౌన్లో కిడ్నాప్ కేసు, టూటౌన్లో గ్యాంబ్లింగ్ కేసులున్నాయి. అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న భరత్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు విచారణలో నయవంచన బాగోతం వెలుగు చూసింది. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేంద్రుడు పాల్గొన్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం ప్రమాదం సామాజిక మాధ్యమాల్లో ఫేక్ అకౌంట్ల ద్వారా అమ్మాయిలను వంచించడం పరిపాటిగా మారింది. వాట్సాప్ చాటింగ్లు, వాయిస్ కాల్స్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో స్నేహం ప్రమాదమని గుర్తించాలి. భరత్ రెడ్డి బాధితులెవరైనా ఉంటే దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులను సంప్రదించండి. మహిళల చేతిలో వజ్రాయుధమైన దిశ ఎస్ఓఎస్ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. – బి.సత్యయేసుబాబు, ఎస్పీ చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు కృష్ణా జిల్లాలో దారుణం: భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి -
బ్లాక్మెయిలింగ్: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను
విద్య(పేరు మార్చడమైనది) పదవ తరగతి చదువుతోంది. ఫోన్లో వచ్చిన మెసేజ్లు చూసి, తెగ నవ్వుతుంటే తల్లి మందలిస్తూనే ఉంది. అవేమీ పట్టించుకోని విద్య ఫోన్ చూస్తూ భోజనం ముగించి, తన రూమ్కి వెళ్లిపోయింది. ‘ఏం పిల్లలో ఏమో..’ అనుకుంటూ తల్లి పనిలో పడిపోయింది. ఫేస్బుక్లో తన ఫొటోకు వచ్చిన లైక్లు చూసుకుంటూ, సంబరపడిపోతూ విద్య, స్నేహితులతో చాట్ చేస్తూ కూర్చుంది. కొత్తగా వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ చూసి వెంటనే యాడ్ చేసుకుంది. ఆ రిక్వెస్ట్ తన క్లాస్మేట్ రమ్యది. వారం రోజులుగా రమ్యతో చాట్ చేస్తూ ఉంది. ఓ రోజు.. విద్య కత్తితో తన చేయి మణికట్టు మీద కట్ చేసుకుంది. తల్లి తండ్రి కంగారు పడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎందుకు చేశావీపని అంటే ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విషయమంతా వివరించింది. విద్య చెప్పింది విన్న తల్లిదండ్రులు షాక్కి లోనయ్యారు. విద్యకు ఆన్లైన్లో పరిచయం అయిన వ్యక్తికి తన ఫొటోలే కాకుండా, చెల్లెలు డ్రెస్ మార్చుకుంటుండగా తీసిన ఫొటోలు ఆ బ్లాక్మెయిలర్కు షేర్ చేయాల్సిన పరిస్థితిని చెప్పి, తల్లిని పట్టుకుని ఏడ్చేసింది విద్య. ఇప్పుడా ఫొటోలు ఆన్లైన్లో షేర్ చేస్తానని చెబుతూ డబ్బుల కోసం తనని బెదిరిస్తున్నాడని చెప్పింది. తన క్లాస్మేట్ ఫేస్బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని, తన క్లాస్మేటే అనుకుని చాట్ చేస్తున్నానని, ఆ బ్లాక్మెయిలర్ తనకు తెలియదంది. విద్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. టార్గెట్ టీనేజర్స్ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు సదరు బ్లాక్మెయిలర్ను పట్టుకున్నారు. అతని టార్గెట్ అంతా 13 –18 ఏళ్ల అమ్మాయిలని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. కేవలం టీనేజ్ అమ్మాయిల ప్రొఫైల్స్ చూస్తూ, వాటిలోని సమాచారాన్ని చదివి, ఫేక్ అకౌంట్లు తెరుస్తుంటాడు. ఆ అకౌంట్ నుంచి సదరు అమ్మాయిల క్లాస్మేట్స్కి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతుంటాడు. ఒక సారి యాడ్ చేసుకోగానే రోజూ ఉదయమే ‘హాయ్..’తో సంభాషణ మొదలుపెడతాడు. అవతలి వ్యక్తి తన క్లాస్మేట్ అమ్మాయే కదా అనుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాడ్ చేసుకున్న అమ్మాయి చాట్ చేస్తుంటుంది. దీంతో, సదరు వ్యక్తి మంచి భాషా నైపుణ్యంతో మాటలు పెంచి, ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ తర్వాత వ్యక్తిగత సమాచారమంతా తెలుసుకుని, అదను చూసి మానసికంగా దగ్గరవుతాడు. ఆ తర్వాత శరీరాకృతి గురించి, వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయడం వరకు వెళుతుంది. అమ్మాయి బాగుంటే ఫిజికల్గా, లేదంటే డబ్బు గురించి ట్రాప్ చేయడం మొదలుపెడతాడు. ఇవేవీ లేదంటే, ఇంట్లో ఆడవాళ్లు బాత్రూమ్లో ఉన్న ఫొటోలు, స్నేహితుల న్యూడ్ ఫొటోలు పంపించమని బెదిరిస్తాడు. ఒకసారి ట్రాప్ అయితే ఇక ఏదో ఒక సమస్యలో ఆ అమ్మాయి ఇరుక్కోవాల్సిందే. ఇలాగే ఆ బ్లాక్ మెయిలర్ వందల మందిని ఫేక్ అకౌంట్ ద్వారా మోసం చేశాడు. ఆన్లైన్ మోసగాళ్లు సైబర్ నేరస్థులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నకిలీ ప్రొఫైల్స్ను సృష్టించి, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతుంటారు. ఒకసారి స్నేహం మొదలయ్యాక వ్యక్తిగత కథనాలను జోడిస్తారు. నమ్మకాన్ని, సానుభూతిని పొందుతారు. బాధితురాలికి నమ్మకం కలిగించడానికి, మొదట తమ ఫొటోలను పంపుతారు. కొన్నిసార్లు నగ్న చిత్రాన్ని పంపుతారు. మంచి ఫొటో, వీడియోలను పంపమని ప్రేరేపిస్తారు. అవి తమకు చేరిన తర్వాత బ్లాక్ మెయిల్, దోపిడీ ప్రారంభమవుతుంది. సరైన ఫోటోలు, వీడియోలను పంపకపోతే మార్ఫింగ్ పద్ధతిని ఎంచుకుంటారు. దోపిడీ ద్వారా వారికి డబ్బు రాకపోతే, వారు ఈ దుర్మార్గపు నెట్వర్క్లోకి ఇతర వ్యక్తులను లాగడానికి ఈ ఫొటోలను ఎరగా వాడుతారు. నకిలీ ఖాతాల గుర్తింపు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ల సంఖ్య ఆకస్మికంగా పెరుగుతుంది ∙అవతలి వ్యక్తి ప్రొఫైల్ తేదీ గమనించాలి ∙చూడాల్సింది పేరు, ప్రొఫైల్ పిక్ కాదు. ప్రొఫైల్ను తనిఖీ చేయాలి. ∙ఆ ఫ్రొఫైల్లో పోస్టులు ఏమేం ఉన్నాయో చూడాలి. ఒక కారణం కోసం విరాళాలు కోరడం/ అత్యవసర పరిస్థితుల్లో రుణాలు కోరడం వంటివి ఉన్నాయేమో గమనించండి. ఆన్లైన్ రొమాన్స్కు సంబంధించి చిత్రాలు ఉన్నాయేమో చూడండి. సోషల్ మీడియాను సురక్షితంగా.. మీకు బాగా పరిచయం ఉన్న, నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. వారి నిజాయితీని ధృవీకరించుకోకుండా ఆన్లైన్ చాటింగ్, డేటింగ్ వంటివి చేస్తూ మానసికంగా చేరిక కాకూడదు. సన్నిహిత/ స్పష్టమైన చిత్రాలు లేదా వీడియోలను ఆన్లైన్లో ఎప్పుడూ షేర్ చేయవద్దు వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ పంచుకోకూడదు (ఫోన్ నెంబర్, ఉన్న ప్లేస్.. మొదలైనవి) అలాగే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై మీ పూర్తి సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దు. (ఫైనాన్షియల్, లాగిన్ క్రెడెన్షియల్స్ – ఆర్గనైజేషన్.. వంటివి) బ్యాక్గ్రౌండ్ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే సోషల్ మీడియా స్నేహితులను వ్యక్తిగతంగా కలవండి. మీ ప్రతి సోషల్ మీడియా ఖాతాకు ప్రత్యేకమైన, సంక్లిష్టమైన పాస్వర్డ్లను (ప్రత్యేక అక్షరాలు) ఉపయోగించండి. వాటిని తరచూ మారుస్తూ ఉండండి. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం మానుకోండి. కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులకు సరైన కమ్యూనికేషన్ ఉంటే ఇలాంటి సమస్యలు దరిచేరవు. టీనేజ్ అమ్మాయిలు సోషల్ మీడియా వేదికగా జరిగే మోసాలకు బలవకుండా మొదట్లోనే కనిపెట్టి, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదే. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఆ ఫౌండేషన్ నాది కాదు: సోనూసూద్
ముంబై: లాక్డౌన్ కాలంలో పేదల అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అనుచరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. తన పేరు మీద విరాళాలు వసూలు చేస్తున్న ఓ ఫౌండేషన్ గురించి ఆయన హెచ్చరించారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో, తన ఫొటోను పెట్టుకున్న ఓ నకిలీ సంస్థకు చెందిన వ్యక్తులు విరాళాలు వసూలు చేస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సంస్థ గురించి తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. -
డీహెచ్ఎఫ్ఎల్ ఉత్తుత్తి గృహ రుణాలు..
న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది. -
130 కోట్ల ఫేక్ ఖాతాలు నిలిపివేత
వాషింగ్టన్: 2020లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 130 కోట్లకు పైగా ఫేక్ ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్బుక్ యాజమాన్యం సోమవారం తెలియజేసింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ ప్రతినిధి రోసెన్ వెల్లడించారు. 60కి పైగా భాషల్లోని కంటెంట్ను నిశితంగా పరిశీలించడానికి స్వతంత్ర ఫ్యాక్ట్ చెకర్స్ను నియమించినట్లు తెలిపారు. ఏదైనా సమాచారం అసత్యమని తేలితే అది ఎక్కువ మందికి చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాంటి సమాచారంపై హెచ్చరిక సంకేతం ఉంటుందని, దాన్నిబట్టి అప్రమత్తం కావాలని సూచించారు. ఈ సంకేతం ఉన్న సమాచారాన్ని 95 శాతం మంది యూజర్లు క్లిక్ చేయడం లేదని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్పై దుష్ప్రచారం చేస్తున్న కంటెంట్ను కూడా పూర్తిగా తొలగించామన్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించుకుంటున్నామని వివరించారు. -
ఆ అకౌంట్లను నమ్మొద్దు: వైష్ణవ్ తేజ్
‘‘సోషల్ మీడియాలో నాకు ఎలాంటి అధికారిక అకౌంట్స్ లేవు. నా పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ను దయచేసి ఎవరూ ఫాలో కావొద్దు’’ అని హీరో పంజా వైష్ణవ్ తేజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి నా పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ఉపయోగిస్తున్నారు’’ అన్నారు వైష్ణవ్. తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఘనవిజయం అందుకున్న వైష్ణవ్ తేజ్ ద్వితీయ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్గా నటించిన ఉప్పెన సినిమా ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వంద కోట్ల మైలురాయిని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సినిమా యూనిట్ విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకుంది. చదవండి: రంగ్దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్గా త్రివిక్రమ్, కారణం అదేనట! -
రిక్వెస్ట్ పెట్టి దోచేస్తారు.. ఇది ఆ గ్యాంగ్ పనేనా
‘ఇన్నాళ్లూ మీ ఫోన్ నంబరుకు లాటరీ తగిలిందనో.. మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుంది.. వెంటనే మీ మొబైల్కు వచ్చే ఓటీపీ చెప్పాలనో.. ఫోన్ చేస్తూ మోసం చేసిన నేరగాళ్ల గురించి విన్నాం. ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. స్నేహితుల ఫొటోలు, పేర్లతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో ఇలాంటి నేరాలు ఎన్నో వెలుగు చూశాయి. వెలుగు చూడని నేరాలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.. సాక్షి, కడప : అనుమానం వచ్చిన వారు ఫోన్ చేసి నివృత్తి చేసుకుని మిన్నకుండిపోతుండగా, రిక్వెస్టుకు చలించిన వారు వెంటనే అకౌంటు ఎవరిదన్న విషయం చూసుకోకుండా డబ్బులు జమ చేస్తున్నారు. దీంతో ఫేక్ అకౌంట్ దారుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా కొందరు సైబర్ నేరాలకు తెగబడుతున్నారు. ఫేక్ ఫేస్బుక్, వాట్సాప్లలో ప్రముఖుల పేర ఫేక్ అకౌంట్స్ సృష్టించి అత్యవసరమంటూ డబ్బులు దోచుకుంటున్నారు. తెలిసిన వారేనన్న భ్రమతో పలువురు వారి అకౌంట్లకు డబ్బులు జమ చేసి నష్టపోతున్నారు. తీరా అసలు విషయం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. బాధితుల్లో జిల్లాలోని ప్రముఖులతోపాటు కొందరు పోలీసు అధికారులు ఉండడం గమనార్హం. సైబర్ నేరగాళ్లు ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న ఫేస్బుక్, వాట్సాప్లను గుర్తించి ఆ తర్వాత స్వల్ప మార్పులతో వారి ఫొటోలతోనే ఫేక్ అకౌంట్లను సృష్టిస్తున్నారు. వారు రెగ్యులర్గా చాట్ చేస్తున్న స్నేహితులతో కొంతకాలం చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత అత్యవసరమని రూ. 15–30 వేల వరకు డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారు. సర్దుబాటు చేయలేమని చెబితే ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే డబ్బులు సర్దాలని, త్వరలోనే ఇచ్చేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో కొందరు నిజమని నమ్మి బ్యాంకు అకౌంటు నంబరు ఎవరిదన్న విషయం నిర్ధారించుకోకుండానే డబ్బులు జమ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారు ఫోన్ ద్వారా వివరాలు నిర్ధారించుకుని మిన్నకుండి పోతున్నారు. డబ్బు అడిగిన వారు పది మందికి తెలిసిన ప్రముఖులుగా ఉండడం, ఫాలోయర్స్ ఎక్కువగా ఉండడంతో కొందరు స్పందించి తక్షణమే ఫేక్ అకౌంట్ సృష్టించిన వారి అకౌంట్కు డబ్బులు జమ చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఆలస్యంగా విషయం తెలుసుకుంటున్నారు. జిల్లాలో చాలామంది ఫేక్ అకౌంట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈనెలలోనే జిల్లాలో వందలాది మంది ఫేక్ అకౌంట్ల ద్వారా దోపిడీ చేసిన సంఘటనలు ఉన్నాయి. కొందరు డబ్బులు పోగొట్టుకుని మిన్నకుండి పోతుండగా, మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక నెలలోనే సైబర్ క్రైంకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1100 మంది పోలీసు అధికారులు, పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలు, పోలీసులు సైతం బాధితులుగా ఉండగా, మరోవైపు జర్నలిస్టులు, కవులు, రచయితలు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లతోపాటు వివిధ రంగాలలో ప్రముఖులుగా ఉన్న వారు బాధితులుండడం గమనార్హం. సైనికుల పేరుతో ఫేక్ అకౌంట్లు మరోవైపు సైనికుల పేరుతోనూ జిల్లాలో ఫేక్ అకౌంట్లు వెలిసినట్లు తెలుస్తోంది. డబ్బులు పంపిస్తే తక్కువ ధరకే గృహోపకరణాలతోపాటు పలు రకాల వస్తువులు తీసుకు వస్తామని పోస్టులు పెడుతూ డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఈ తరహా మోసాల బారిన పడినట్లు తెలుస్తోంది. ఇది రాజస్థాన్ ముఠా పనే! రాజస్థాన్కు చెందిన ఓ ముఠా ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లతో దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసుల విచారణలోనూ వెల్లడైంది. ఇప్పటికే కొందరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండకపోతే అంతే! ఫేక్ ఫేస్బుక్, వాట్సాప్ అకౌంట్లతో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుందని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఈ తరహా నేరాలపై ఫేస్బుక్కు సైతం లేఖ రాసింది. దీంతో ఫేస్బుక్...ఫేస్బుక్ ప్రొఫైల్ లాగ్ సిస్టమ్ను తెరపైకి తెచ్చింది. ఫేస్బుక్ యాప్ సెట్టింగ్లోకి వెళ్లి ప్రతి ఒక్కరూ తమ వివరాలతోపాటు ప్రొఫైల్ వివరాలు బయటికి వెలువడకుండా ఫేస్బుక్ ప్రొఫైల్ లాగ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అప్పుడే సైబర్ నేరాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. -
ఫేస్‘బుక్’ అయ్యారు
నల్లగొండ క్రైం: పోలీసుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు నల్లగొండ జిల్లా పోలీసులు. రాజస్తాన్ వెళ్లి మరీ నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఎస్పీ రంగనాథ్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 350 మంది పోలీసు అధికారుల పేరిట ఈ సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం, ఆర్థిక అవసరాలు ఉన్నాయంటూ మెసేజ్లు పంపి డబ్బులను ఖాతాల్లో జమ చేయించుకున్నారని వివరించారు. ఇదేవిధంగా తన పేరుతో కూడా నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు కావాలని పోలీసు అధికారులకు సందేశాలు పంపారని, అయితే విషయం తన దృష్టికి రావడంతో వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాన్ని రాజస్తాన్కు పంపినట్లు తెలిపారు. ఆ రాష్ట్రంలోని భరత్పురా జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ప్రధాన నిందితుడు ముస్తభీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాంఖాన్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు, 8 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, నకిలీ ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నిందితులు అనేక రాష్ట్రాలకు చెందిన కొందరు అధికారుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తెరిచినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ముఠాలో ఓ బాలుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అ«ధికారులకు రివార్డు ప్రకటిస్తామన్నారు. నిందితుల్లో ముగ్గురిని నల్లగొండ జైలుకు, బాలుడిని హైదరాబాద్లోని బాల నేరస్తుల జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్రానికి చెందిన 81 మంది పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో బలమైన నమ్మకం ఉండటంతో పలువురు పోలీసు అధికారుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించారు. తెలంగాణకు చెందిన 81 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారు. మొదట ఐజీ స్వాతి లక్రా పేరిట నకిలీ ఖాతాను సృష్టించగా, ఆ తర్వాత వారం పది రోజుల్లో నల్లగొండ జిల్లా ఎస్పీ పేరిట ఓ ఖాతా తెరిచారు. పోలీసుల పేరిటే నకిలీ ఖాతాలు తెరుస్తూ మోసాలకు పాల్పడుతుండటంతో జిల్లా పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకొని ఆ సైబర్ నేరగాళ్ల ఆటను కట్టించారు. -
పోలీసులకు ఫిర్యాదు చేసిన సివిల్స్ విన్నర్
ముంబై: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన 23 ఏళ్ల ఐశ్వర్య షెరాన్ పోలీసులను ఆశ్రయించారు. ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లో తన పేరుతో 20 నకిలీ ఖాతాలు ఉన్నాయని తెలిపారు. తన అనుమతి లేకుండా ఖాతాలు సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని కోలాబా పోలీస్స్టేషన్లో శనివారం ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ఐశ్వర్య గతంలో పలు అందాల పోటీల్లో తుళక్కుమన్నారు. 2016లో ఫెమినా మిస్ ఇండియా విజేతగా నిలిచారు. అయితే, ఇప్పటి వరకు తనకు ఇన్స్టాలో ఎలాంటి అకౌంట్లు లేవని ఆమె చెప్పుకొచ్చారు. ఆగస్టు 5న ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో నకిలీ ఖాతాల విషయం వెలుగు చూసిందని అన్నారు. (చదవండి: బంగారం వద్దు.. రూ.2 వేలు చాలు..!) ‘మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో అసలైనది ఏదీ? అని జర్నలిస్టు ప్రశ్నించడంతో నాకేం అర్థం కాలేదు. ఇన్స్టాలో నాకు అకౌంట్ లేదని చెప్పాను. వెంటనే మా తమ్ముడు సెర్చ్ చేయగా నా పేరుతో ఇన్స్టాగ్రామ్లో 20 ఫేక్ ఖాతాలు ఉన్నట్టు తెలిసింది. ఒక ఖాతాకైతే ఏకంగా 27 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. నా ఫొటోలను ఆ ఆగంతకులెవరో దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకే ఫిర్యాదు చేశాం’అని ఐశ్వర్య పేర్కొన్నారు. కాగా, ఐశ్వర్య కలాబాలో తన కుటుంబంతో కలిసి 2017 నుంచి నివసిస్తన్నారు. ఆమె తండ్రి కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ఇక ఐశ్వర్య ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కోలాబా సీనియర్ ఇన్స్పెక్టర్ శివాజీ ఫడ్తారే చెప్పారు. సర్విస్ ప్రొవైడర్ సాయంతో నకిలీ ఖాతాలను క్లోజ్ చేయిస్తామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు. (ఐపీఎస్ టు ఐఏఎస్) -
అజయ్ భూపతి పేరుతో.. విజయ్లా మాట్లాడి
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి పేర్లతో కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సినిమాలు, టీవీ సీరియళ్లు, మోడలింగ్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయక జనాల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సరికొత్త మోసాలకు తెరలేపారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి పేరుతో నకిలీ వాట్సప్ నెంబర్ సృష్టించి కథానాయికలు, మోడల్స్ కావాలని, ఆసక్తి ఉన్నవారు ఫోటోలు, వీడియోలు పంపాలని యువతకు కొందరు కేటుగాళ్లు సైబర్ వల వేస్తున్నారు. ఈ ప్రకటనలు చూసి ఆశపడిన ఆశావాహుల నుంచి వేలాది రూపాయలు వారి ఖాతాల్లో జమచేసుకుంటున్నారు. ఇలా నటన, మోడలింగ్లో శిక్షణ, అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి వేలల్లో డబ్బులు దోచుకొని ఆ నేరగాళ్లు ఉడాయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రకటనలను చూసిన కొంతమంది యువతులు నేరుగా దర్శకుడిని సంప్రదించడంతో ఈ తతంగమంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన అజయ్ భూపతి తన పేరుపై నకిలీ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండ పేరుతో బాన్సువాడకు చెందిన సాయికిరణ్ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. విజయ్లా మాట్లాడి పలువురు యువతులను ఆకర్షించి మోసం చేసే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, విజయ్ దేవరకొండ బృందం ఓ ప్రణాళిక రచించారు. ఒక యువతితో సాయి కిరణ్తో మాట్లాడించి హైదరాబాద్కు రప్పించారు. సదరు యువతిని కలిసేందుకు నిందితుడు సాయి కిరణ్ హైదరాబాద్కు రాగానే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
నిన్న రావు రమేష్.. నేడు ఉత్తేజ్
హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సినీ సెలబ్రెటీల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టించి వివాదస్పద పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే విలక్షణ నటుడు రావు రమేశ్ పేరుతో ట్విటర్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, టాలీవుడ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వివాదస్పదంగా ట్వీట్లు చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీంతో ఈ ట్వీట్లపై రావు రమేశ్ స్పందించారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’అని రావు రమేష్ మీడియాకు వెల్లడించారు. తాజాగా నటుడు ఉత్తేజ్ కూడా నకిలీ అకౌంట్ల సమస్య బారిన పడ్డారు. ఆయన పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి పలు అభ్యంతకర పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్లపై ఉత్తేజ్ స్పందించారు. ‘నమస్తే!! సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నాకు ట్విటర్ అకౌంట్ లేనే లేదు. నా పేరుతో వస్తున్న తప్పుడు వార్తల్ని ఖండిస్తున్నాను. సంఘంలో ఓ అస్తిత్వం, వ్యక్తిత్వం లేని వాళ్లు మాత్రమే ఇలాంటి చీప్ ట్రిక్స్ తో వాగుతుంటారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాను’ అని ఉత్తేజ్ మీడియాకు వివరించారు. ఇక నకిలీ ఆకౌంట్లపై టాలీవుడ్ ప్రముఖులు అందోళన చెందుతున్నారు. నకిలీ ఖాతాలను నియంత్రించేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: ట్విటర్ పోస్టులపై క్లారిటీ ఇచ్చిన రావు రమేష్ మహేశ్ సర్ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్లో టైటిల్ -
పోలీసులకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ : సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ర్పచారంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేక్గ్యాంగ్పై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మొదలెట్టారని, సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు. ఫేక్ గ్యాంగ్ పోస్టులను అత్యుత్సాహంతో షేర్ చేసుకునే వాళ్లు సైతం సైబర్ క్రైమ్ చట్టం కిద్ద శిక్షార్హులేనని చెప్పారు. అలాంటి వారు ప్రపంచంలో ఎక్కడున్నా.. ఏ రాష్ట్రంలో ఉన్నా సైబర్ క్రైమ్ పోలీసుల వలకు చిక్కక తప్పదన్నారు. కాబట్టి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య, ఫేక్ పోస్టులు పెట్టే వారితో పాటు వాటిని అత్యుత్సాహంతో సర్క్యులేట్ చేసే వారిని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు విడిచి పెట్టరని హెచ్చరించారు. -
వాటిని ఎంకరేజ్ చేయకండి : నివేదా
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించడం కొందరు ఆకతాయిలకు పరిపాటిగా మారింది. ముఖ్యంగా అధికారిక గుర్తింపు లేని ఖాతాలు కలిగిన నటీనటులకు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. అభిమానులు కూడా ఇందులో ఏది నిజమైన అకౌంట్ తేల్చుకోలేకపోతున్నారు. పలు సందర్భాల్లో ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతో సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటి నివేదా పేతురాజ్ పేరిట కూడా ట్విటర్లో పదులు సంఖ్యల్లో అకౌంట్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేసిన నివేదా.. వాటిని నమ్మవద్దని కోరారు. దయచేసిన ఫేక్ అకౌంట్లను ఎంకరేజ్ చేయవద్దని చెప్పారు. ‘ట్విటర్లో పెద్ద సంఖ్యలో నా పేరు మీద ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. @Nivetha_Tweets అనేది నాకున్న ఏకైక ట్విటర్ ఐడీ. ఫేక్ అకౌంట్లను ఎంకరేజ్ చేయండి. నా ఖాతాకు వెరిఫై చేయించడానికి ప్రయత్నిస్తున్నాను’ అని నివేదా తెలిపారు. కాగా, చెన్నైలో పుట్టిన నివేదా.. తన బాల్యం అంతా దుబాయ్లో గడిపారు. తొలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న ఆమె.. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన అల.. వైకుంఠపురములో.. చిత్రంలో ఆమె సుశాంత్కు జోడిగా కనిపించారు. తెలుగులో ప్రస్తుతం ఆమె కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి : నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా.. కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్ -
ఫేక్ టిక్టాక్ అకౌంట్స్.. నటి హెచ్చరిక!
ప్రముఖుల పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు పుట్టుకురావటం సర్వసాధారణం. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి మున్మున్ దత్తా పేరిట టిక్టాక్లో కొన్ని ఫేక్ అకౌంట్లు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మున్మున్ ఇబ్బందిగా ఫీలయ్యారు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులను హెచ్చరించారు. తన పేరిట ఉన్న ఫేక్ టిక్టాక్ అకౌంట్ల స్ర్కీన్ షాట్లను షేర్ చేశారు. ( అమితాబ్ ట్వీట్.. మండిపడ్డ అభిమానులు ) మున్మున్ పేరిట టిక్టాక్లో ఉన్న ఫేక్ అకౌంట్లు ‘‘ నేను టిక్టాక్లోకి రావాలనుకుంటే కచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్లో అందరికీ తెలియజేస్తా. అంతవరకు ఫేక్ అకౌంట్లకు దూరంగా ఉండండి’’ అని అన్నారు. మున్మున్ ‘‘ తారక్ మెహ్తా కా ఉల్టా చెస్మా’’ సీరియల్తో బాగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్ గత 11 సంవత్సరాల నుంచి టెలికాస్ట్ అవుతూనే ఉండటం గమనార్హం. -
చదివింది ఇంటర్..మోసాల్లో మాస్టర్స్
గచ్చిబౌలి: కొంపల్లికి చెందిన ఓ మహిళ గత అక్టోబర్ 8న ఆన్లైన్లో రూ.228 చెల్లించి స్నాప్డీల్ డాట్ కామ్లో స్పైరల్ పొటాటో కట్టర్ను కొనుగోలు చేసింది. అదే కంపెనీ పేరును పోలి ఉన్న క్యూపీఎస్ఎన్డీల్ పేరుతో ఆమెకు గత నవంబర్ 11న రూ.6.90 లక్షల నగదు లేదా టాటా నెక్సా కారు గెలిచారని మెసేజ్ వచ్చింది. మెసేజ్లోని టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయడంతో తక్షణమే రూ.6500 చెల్లించాలని సూచించారు. కారు గెలిచానన్న ఆనందంలో ఆమె ఆన్లైన్లో ఆ మొత్తాన్ని చెల్లించింది. అనంతరం ఆమెకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు జీఎస్టీ, ట్రాన్స్పోర్ట్, షోరూమ్, టోల్ గేట్ ఖర్చుల నిమిత్తం మరో రూ.2.30 లక్షలు చెల్లిస్తే టాటా నెక్సా కారు పంపిస్తామని, కారు రంగు కూడా ఎంపిక చేసుకోవచ్చునని నమ్మబలికారు. వెంటనే ఆ మొత్తాన్ని వారు సూచించిన బ్యాంక్ ఖాతాకు టాన్స్ఫర్ చేసింది. మరుసటి రోజు తనకు ఫోన్ వచ్చిన నంబర్కు కాల్ చేయగా సదరు టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లు అందుబాటులో లేకపోవడంతో ఆమె నివ్వెరపోయింది. తాను మోసపోయినట్లు గుర్తించిన నవంబర్ 13న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీహార్ ముఠా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఇదే తరహాలో వందలాది మందిని మోసం చేసి దాదాపు రూ. 5 కోట్లు టోకరా వేసినట్లు విచారణలో వెల్లడైంది. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఫొటోతో ఎర.. బీహార్ రాష్ట్రం, షైక్పురా జిల్లా, కబీర్పుర గ్రామానికి చెందిన సందీప్ కుమార్ అలియాస్ ఆర్యన్ ఇంటర్తో చదువుకు స్వస్తి చెప్పాడు. అతను అదే రాష్ట్రానికి చెందిన బిపిన్ కుమార్, సందీప్ పాశ్వాన్, మాణిక్చంద్ పాశ్వాన్తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఈ కామర్స్ కంపెనీల పేరుతో మోసాలకు పాల్పడాలని పథకం పన్నిన వీరు గజియాబాద్కు చెందిన తౌసిప్ నుంచి వోడా ఫోన్, ఎయిటెల్ టోల్ ఫ్రీ నంబర్లు తీసుకున్నారు. అనంతరం న్యూ ఢిల్లీకి చెందిన వికాస్ కుమార్తో కలిసి 13 నకిలీ వెబ్ సైట్లను సృష్టించారు. స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్, హోమ్షాప్–18, షాప్క్లూస్, నాప్టాల్, అమెజాన్, క్లబ్ ఫ్యాక్టరీ తదితర ఈ కామర్స్ వినియోగదారుల డాటాను సేకరించారు. అనంతరం వారికి ఆయా కంపెనీల పేరుతో రూ.6.90 లక్షల నగదు లేదా టాటా నెక్సా కారును బంపర్ ప్రైజ్గా గెలిచారని బల్క్ మేసేజ్లు పంపేవారు. మెసేజ్లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నంబర్కు ఫోన్ చేస్తే ఆన్లైన్ కొనుగోలు చేసిన వస్తువు పేరు, ఐడీ నంబర్, డేట్ చెబుతూ వారి నమ్మకాన్ని సంపాదిస్తారు. అనంతరం వాట్సాప్కు వారి పేరు బంపర్ ప్రైజ్ను గెలిచిన టికెట్తో పాటు నెక్సా కారు ఫొటోను పంపుతారు. కారు లేదా నగదు కావాలంటే ముందు రూ.6500 చెల్లించాలని కోరుతారు. ఆ తర్వాత ట్యాక్స్ల పేరుతో రూ.లక్షలు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తే వెంటనే కారు పంపిస్తామని నమ్మబలుకుతారు. అంతేగాక తాము ఈ కామర్స్ కంపెనీ ఉద్యోగులమని నమ్మించేందుకు తమ నకిలీ ఐడీ, పాన్, ఆధార్ కార్డులను వాట్సాప్లో పంపుతారు. నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాగానే టోల్ ప్రీ నంబర్, వాట్సాప్ నంబర్లకు కాల్ రాకుండా ఆయా నంబర్లను రిజక్ట్లో పెడతారు. ఇదే తరహాలో వీరు వందల మందిని మోసగించారని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే వీరి బాధితులు 80 మంది ఉన్నట్లు సీపీ తెలిపారు.నిందితులు సందీప్ కుమార్ అలియాస్ ఆర్యన్, మాణిక్చంద్ పాశ్వాన్, తౌసిఫ్ అహ్మద్, వికాస్ కుమార్లను అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు నిందితులు బిపిన్ కుమార్, సందీప్ పాశ్వాన్ పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వారి నుంచి 12 సెల్ ఫోన్లు, రెండు ల్యాప్టాప్లు, స్కానర్ కమ్ ప్రింటర్, స్కార్పియో కారు, 19 సిమ్ కార్డులు, నకిలీ పాన్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డులు ,4 డెబిట్ కార్డులు, 5 స్నాప్ డీల్ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ టోల్ ఫ్రీ నంబర్లపై విచారణ కేవైసీ డాక్యుమెంట్లు లేకుండా టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడంపై సెల్ఫోన్ కంపెనీలను విచారించనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. అంతే కాకుండా ఈ కామర్స్ వినియోగదారుల డాటా చోరీపై సదరు కంపెనీలను ప్రశ్నిస్తామన్నారు. గిఫ్ట్ వచ్చిందనే మెసేజ్లను నమ్మ వద్దని, వాటిని వెంటనే డిలీట్ చేయాలని ఆయన సూచించారు. ఈ కామర్స్ కంపెనీలు ఎవరికి గిఫ్ట్లు ఇవ్వవని సీపీ పేర్కొన్నారు. సమావేశంలో సైబరాబాద్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రామయ్య, చంద్రశేఖర్, ఎస్ఐలు విజయ్ వర్ధన్, రాజేంద్ర, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. చదివింది ఇంటర్..మోసాల్లో మాస్టర్స్ ఈ ముఠా సభ్యులు ఇంటర్తో చదువు ఆపేసినా మోసాల్లో మాత్రం ఆరితేరారు. బీహర్లోని నలంద, నవాడ, వస్లీగంజ్ జిల్లాల్లోని ములంద్, పంచ్, చాక్వాయ్, డాక్రా, కబీర్పుర్, కటర్దీ, భగవాన్పూర్, మాయాపూర్, మీర్బీగా గ్రామాల నుంచి ఈ ముఠా సభ్యులు రోజుకు 50 మంది చొప్పున బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తారు. స్పందించిన వారిని నగదు, కారు పేరుతో బుట్టలో పడేస్తారు. ఆపై ఆన్లైన్లో నగదు డిపాజిట్ చేయించుకుని టోకరా వేస్తారు. నిందితుల స్నేహితుడైన సూరజ్ సింగ్ ఎస్బీఐ అకౌంట్తో పాటు మరో ఇద్దరు స్నేహితుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో గుడిసెల్లో నివాసం ఉండే వీరు నేడు భవనాలు నిర్మించుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
వేలాది ఫేక్ న్యూస్ అకౌంట్ల క్లోజ్
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థ వేలాది ఫేక్ న్యూస్ అకౌంట్లను శుక్రవారం తొలగించింది. సౌదీ అరేబియాలో యుద్ధం అంటూ సౌదీకి అనుకూలంగా తప్పుడు సమాచారం శుక్రవారం ట్విటర్లో వైరల్ కావడంతో ట్విటర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా హాంకాంగ్లో ఆందోళనల గురించి చైనా నుంచి వస్తున్న పోస్టులకు సంబంధించిన అకౌంట్లను కూడా ట్విటర్ రద్దు చేసింది. ఇంకా స్పెయిన్, ఈక్వెడార్లోని అదనపు ఫేక్ అకౌంట్లను తొలగించింది. హాంకాంగ్ నిరసనకారుల గురించి పోస్టులు పెడుతున్న 4302 నకిలీ ఖాతాలను రద్దు చేసినట్టు ట్విటర్ వెల్లడించింది. హాంకాంగ్లో నిరసనలపై పోస్టులు పెట్టిన చైనా చెందిన 2 లక్షల నకిలీ ఖాతాలను గత ఆగస్టులో ట్విటర్ తొలగించింది. (చదవండి: ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్) -
నటుడు ఫిర్యాదు చేయడంతో.. వంచకుడు అరెస్టు
కర్ణాటక, బనశంకరి: కన్నడ సినిమాల్లో నటించడానికి అవకాశం కల్పిస్తామని యువతులను పరిచయం చేసుకుని నమ్మించి డబ్బు తీసుకుని వంచనకు పాల్పడుతున్న మోసగాన్ని ఆదివారం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుంకదకట్టె హొయ్సళనగర వెంకటేశ్ భావసా (22) అనే యువకుడు ఈ మోసగాడు. కన్నడ సినిమా నటుల పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి యువతులను పరిచయం చేసుకుని వారితో చాటింగ్ చేసేవాడు. యువతులకు సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తామని తన సహాయకుడు వెంకీరావ్ను సంప్రదించాలని వాట్సాప్ నెంబర్ ఇచ్చేవాడు. అతడే వెంకీరావ్ పేరుతో వాట్సాప్ ద్వారా పరిచయస్తులతో చాటింగ్ చేసి సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తామని నమ్మించి పలువురి నుంచి రూ.25 వేల చొప్పున తీసుకుని ముఖం చాటేశాడు. వీడియోకాల్ చేయడానికి ఓ యువతి ప్రయత్నించగా కాల్ రీసివ్ చేసుకుని కాల్ కట్ చేసి తప్పించుకున్నాడు. ఫిర్యాదుతో అరెస్టు తన పేరుతో ఫేస్బుక్ అకౌంట్ తెరిచి మోసాలకు పాల్పడుతున్నారని ఓ నటుడు సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు న మోదు చేసుకున్న పోలీసులు ఆదివారం వెంకటేశ్ భావసాను అరెస్ట్ చేశారు. సోషల్మీడియా వినియోగదారులు ప్రముఖుల పేరుతో వచ్చే కాల్స్, అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అదనపు పోలీస్ కమిషనర్ సందీప్పాటిల్ తెలిపారు. -
కాంగ్రెస్కు ఫేస్బుక్ షాక్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఐటీ సెల్తో సంబంధమున్న వ్యక్తుల నకిలీ అకౌంట్లను, 687 పేజీలను తొలగించినట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సోమవారం వెల్లడించింది. ఆ ఖాతాలను వారు పోస్ట్ చేసిన కంటెంట్ ఆధారంగా తొలగించలేదని, తప్పుడు ప్రవర్తన ఆధారంగానే తొలగించామని స్పష్టం చేసింది. ‘కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్లో పనిచేసే వారి వ్యక్తిగత ఖాతాలతో సంబంధమున్న ఫేస్బుక్ పేజీలను భారీ స్థాయిలో తొలగించాం. వీటిని ఆటోమేటెడ్ సిస్టంతో గుర్తించాం. వారు నకిలీ ఖాతాలతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నందునే తొలగించాం’అని ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నథానియల్ గ్లీచర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో పేజ్ అడ్మిన్లు, ఖాతాదారులు బీజేపీ పార్టీతో సహా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు వంటి అంశాలతో పాటు స్థానిక వార్తలు, రాజకీయ సమస్యలపై పోస్టులు పెడుతున్నారని తెలిపారు. అలాగే పాకిస్తాన్ నుంచి నకిలీ అకౌంట్లను నిర్వహిస్తున్న పేజీలను కూడా తొలగించినట్లు వెల్లడించారు. ఇందులో మిలిటరీ ఫ్యాన్ పేజీలు, పాక్ సంబంధిత వార్తలు, కశ్మీర్ కమ్యూనిటీ పేజీలున్నట్లు ఆయన చెప్పారు. ఈ నకిలీ ఖాతాలను పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) ఉద్యోగులు నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. -
సెలబ్రిటీల లెక్కలు మారిపోయాయి
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఈ మధ్య ప్రముఖుల ఫాలోవర్ల లెక్కలను విడుదల చేసింది. అయితే అనుసరించేవారి(ఫాలోవర్ల) లెక్కలు నిజం కాదని, అందులో చాలా మట్టుకు బోగస్వే ఉన్నాయంటూ పెద్ద షాకే ఇచ్చింది. ప్రధాని మోదీ నుంచి మొదలుకుని, సినీ సెలబ్రిటీల దాకా ఎవరి ఖాతాలో ఎన్ని ఫేక్ ఫాలోవర్లు ఉన్న లిస్ట్ను ట్విటర్ విడుదల చేసింది. అందులో మన స్టార్ల లెక్కలను పరిశీలిస్తే... టాలీవుడ్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ సమంత అక్కినేని. అయితే ఆమె ఫాలోవర్లలో 68 శాతం మాత్రమే అసలు అని ట్విటర్ తేల్చింది. ఇక తర్వాతి స్థానంలో ఉన్న మహేష్ బాబు ఫాలోవర్లలో 51 శాతం, రానా దగ్గుబాటి 53 శాతం, నాగార్జున ఖాతాలో 54 శాతం రియల్ ఫాలోవర్లు ఉన్నారంట. లిస్ట్లో తర్వాతి ప్లేస్లో ఉన్న రాజమౌళి ట్విటర్లో మాత్రం 72 శాతం ఒరిజినల్ ఫాలోవర్లు ఉండగా, అత్యధిక ఒరిజినల్ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా జక్కన్న నిలిచారు. తారక్ రియల్ ఫాలోవర్స్ 65 శాతం ఉండగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 49 శాతంతో లోయెస్ట్ రియల్ ఫాలోవర్స్ సెలబ్రిటీగా నిలిచారు. బాలీవుడ్ విషయానికొస్తే... 35 మిలియన్ల ఫాలోవర్లతో షారూఖ్ ఖాన్ ట్విటర్ టాప్లో కొనసాగుతున్నారు. అయితే ఆయన ఒరిజినల్ ఫాలోవర్స్ 48 శాతం మాత్రమే ఉంది. అంతేకాదు ఈ లిస్ట్లో ఆయనే లోయెస్ట్ ఫాలోవర్స్ సెలబ్రిటీ కావటం గమనార్హం. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 62 శాతం, సల్మాన్ ఖాన్ 50 శాతం, అక్షయ్ కుమార్ 50 శాతం, దీపికా పదుకొనే 67 శాతం, హృతిక్ రోషన్ 56 శాతం, అమీర్ ఖాన్ 68 శాతం, ఏఆర్ రెహమాన్ 53 శాతం, అలియా భట్ 61 శాతం రియల్ ఫాలోవర్స్ ఉండగా, ఈ లిస్ట్లో ప్రియాంక చోప్రా 71 శాతం రియల్ ఫాలోవర్స్తో హయ్యెస్ట్ సెలబ్రిటీగా ఉన్నారు. ట్విటర్ అడిట్ ప్రకారం... -
58 కోట్ల ఫేస్బుక్ ఖాతాలు ఔట్, ఎందుకు?
శాన్ఫ్రాన్సిస్కో: డేటా లీక్ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ ఎత్తున ఫేక్ అకౌంట్లను తొలగించింది. కేవలం మూడు నెలల్లోనే ఈ ఖాతాలకు చెక్ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 58.3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్టు తెలిపింది. అంతేకాదు ఫేస్బుక్లో లక్షలాది నకిలీ ఖాతాలను రూపొందించే పయత్నాలను నిరోధిస్తున్నామని వెల్లడించింది. భారీ ఎత్తున డేటా బ్రీచ్ ఆరోపణలతో యూజర్ల గోప్యత ప్రశ్నార్థకంగా మారడంతో తన ఫ్లాట్పాంలో సెక్యూరిటీ అంశాలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా నకిలీ అకౌంట్లను ఏరివేసేందుకు సన్నద్ధమైంది. యూజర్ డేటా దుర్వినియోగం విచారణలో భాగంగా తమ ప్లాట్ఫాంపై దాదాపు 200 యాప్స్ను తొలగించినట్టు ప్రకటించిన ఫేస్బుక్ తాజాగా ఈ చర్య తీసుకోవడం విశేషం 2018 మొదటి మూడునెలల్లో 583 మిలియన్ల నకిలీ ఖాతాలను రద్దు చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. లైంగిక వేధింపులు, హింసాత్మక చిత్రాలు, తీవ్రవాద ప్రచారాలు లేదా ద్వేషపూరిత ప్రసంగం లాంటి కమ్యూనిటీ ప్రమాణాలను దృష్టిలోవుంచుకుని ఆయా ఖాతాలను డిలిట్ చేసినట్టు వెల్లడించింది. దీంతోపాటు 837 మిలియన్ల పోస్టులను తొలగించామని వివరించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా బ్రీచ్ కుంభకోణం తరువాత ఫేస్బుక్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ నకిలీ ఖాతాలను నిరోధిస్తున్నట్టు చెప్పింది. అయినప్పటికీ నకిలీ ప్రొఫైల్స్ బెడద భారీగా ఉందని చెప్పింది. ఇది యాక్టివ్ అకౌంట్లను 3-4 శాతం ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొంది. -
ఫేస్బుక్కు మరింత భద్రత
వాషింగ్టన్: భారత్లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశ ఎన్నికల వ్యవస్థ సమగ్రతకు గౌరవమివ్వటంతోపాటు ఫేస్బుక్లో వినియోగదారుల భద్రతను పటిష్టం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ స్పష్టం చేశారు. వినియోగదారుల భద్రతతో ఆయాదేశాల సమగ్రతను కాపాడేందుకు నిర్ణయించినట్లు..ఆయన గురువారం వెల్లడించారు. భారత్, బ్రెజిల్ తదితర దేశాల్లో ఎన్నికలు జరగనున్నందున.. ఫేస్బుక్ భద్రతను పటిష్టపరచనున్నట్లు జుకర్బర్గ్ తెలిపారు. ఇందుకోసం కృత్రిమ మేధస్సు (ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) టూల్స్ ద్వారా ఫేక్ అకౌంట్లను గుర్తించటం, ఎన్నికలను ప్రభావితం చేసే యాప్లను తొలగించే పని ప్రారంభమైందన్నారు. తాజా గందరగోళం నేపథ్యంలో తొలిసారిగా బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చిన జుకర్బర్గ్.. వినియోగదారుల విశ్వాసానికి భంగం కలిగించినందుకు క్షమాపణలు కోరారు. ఇకపై ఎలాంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామని వెల్లడించారు. కృత్రిమ మేధస్సుతో నిరంతర సమీక్ష ‘2016 ఎన్నికల తర్వాత మేం రూపొందించిన ఏఐ టూల్స్ ద్వారా ఈ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు సృష్టించిన 30వేల (రష్యాకు చెందినవిగా భావిస్తున్న) ఫేక్ అకౌంట్లను తొలగించాం. ఫ్రాన్స్ ఎన్నికల్లో అలాంటి బయటి శక్తుల ప్రభావం ఉండకుండా జాగ్రత్తపడ్డాం. 2017 అలబామా ఎన్నికల్లోనూ కొత్తగా రూపొందించిన ఏఐ కారణంగా, ఫేక్ అకౌంట్లు, తప్పుడు వార్తలను అడ్డుకోగలిగాం. అమెరికాలో 2018లో జరగనున్న మిడ్టర్మ్ ఎన్నికలతోపాటు, భారత్, బ్రెజిల్లలో జరగనున్న ఎన్నికల్లోనూ ఇలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవటంపై దృష్టిపెడతాం. భారత్లో ఈ ఏడాది చాలా పెద్ద ఎన్నిక జరగనుంది. అందుకే వారి ఎన్నికల వ్యవస్థ సమగ్రతను గౌరవిస్తూ.. ఫేస్బుక్ను భద్రంగా మారుస్తాం’ అని జుకర్బర్గ్ పేర్కొన్నారు. వివిధ దేశాల ఎన్నికల్లో రష్యా వంటి దేశాల ప్రభావం ఉండకుండా ఫేస్బుక్ మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. డేటా భద్రతపై ప్రస్తుతం పనిచేస్తున్న నిపుణుల సంఖ్యను రెట్టింపుచేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా 20వేల మంది కేవలం భద్రతపైనే పనిచేస్తారన్నారు. ఫేస్బుక్ డేటా లీకేజీపై భారత ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తూ.. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని, జుకర్బర్గ్ను భారత్కు పిలిపించి విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అమెరికా ఎన్నికలపై అదృశ్య హస్తం! ఫేస్బుక్ వివరాల ద్వారా అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని జుకర్బర్గ్ వెల్లడించారు. 2016 ఎన్నికల్లో రష్యా ప్రయత్నించినట్లుగానే.. ‘వర్షన్ 2’తో కుటిలయత్నాలు జరుగుతున్నాయి. కొత్త వ్యూహాలతో జరుగుతున్న ఈ ప్రయత్నాలను గుర్తించి వాటిని ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. నన్ను క్షమించండి ప్రపంచవ్యాప్తంగా 5కోట్ల వినియోగదారుల వివరాల లీకేజీపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఫేస్బుక్ సీఈవో జుకర్బర్గ్ క్షమాపణలు తెలిపారు. వినియోగదారుల విశ్వాసానికి భంగం కలిగిందని, తమవైపు నుంచి తప్పు జరిగిందని.. ఇకపై అలా జరగకుండా డేటా వివరాలను మరింత భద్రంగా చూసుకుంటామన్నారు. ‘నేను ఫేస్బుక్ను ప్రారంభిం చాను. ఈ వేదిక ద్వారా ఏం జరిగినా దానికి నేనే బాధ్యుడిని. నన్ను క్షమించండి. మన సమాజ సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం’ అని కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం అనంతరం తొలిసారిగా జుకర్బర్గ్ ప్రకటన చేశారు. ‘నేను యువకుడిగా, సరైన అనుభవం లేనప్పుడు సంస్థను ప్రారంభించాను. సాంకేతికతంగా,వాణిజ్యపరంగా తప్పులు దొర్లాయి. చాలా సందర్భాల్లో తప్పుడు వ్యక్తులను ఉద్యోగంలోకి తీసుకున్నాను. అదే నా పొరపాటు’ అని అన్నారు. -
ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లు ఎన్నో తెలుసా?
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు అధికమే. అబ్బాయి పేరు మీద అమ్మాయి, అమ్మాయి పేరు మీద అబ్బాయి.. ఇలా ఫేక్ అకౌంట్లు సృష్టించి, యూజర్లను కొందరు తప్పుదోవ పట్టిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఫేస్బుక్ ప్లాట్ఫామ్పై ఎన్ని నకిలీ అకౌంట్లు ఉన్నాయో అని కంపెనీ లెక్కతేల్చింది. దానిలో 2017 డిసెంబర్ ముగింపు నాటికి దాదాపు 200 మిలియన్ అకౌంట్లు(20 కోట్ల అకౌంట్లు) ఫేస్బుక్లో నకిలీవని తేలింది. ఈ అకౌంట్లు భారత్లోనే అత్యధికంగా ఉన్నాయని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ వెల్లడించింది. 2017 నాలుగో క్వార్టర్ ముగింపు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్లలో సుమారు 10 శాతం డూప్లికేట్ అకౌంట్లు కలిగి ఉన్న వారేనని ఫేస్బుక్ తన వార్షిక రిపోర్టులో తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డూప్లికేట్ అకౌంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని రిపోర్టు వెల్లడించింది. 2017 డిసెంబర్ చివరి నాటికి ఫేస్బుక్ నెలవారీ యాక్టివ్ యూజర్లు 2.13 బిలియన్లుగా ఉన్నారు. 2016 డిసెంబర్ చివరితో పోలిస్తే.. ఇది 14 శాతం అధికం. నెలవారీ యాక్టివ్ యూజర్ల పరంగా... 2017లో వృద్ధికి ప్రధాన వనరులుగా భారత్, ఇండోనేషియా, వియత్నాం ఉన్నాయని ఫేస్బుక్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ యాక్టివ్ యూజర్లు కూడా 14 శాతం పెరిగి 1.40 బిలియన్లుగా నమోదయ్యారు. 2016 డిసెంబర్లో ఈ సంఖ్య 1.23 బిలియన్లుగా ఉండేది. రోజువారీ యాక్టివ్ యూజర్ల పరంగా.. కీలక వనరులుగా కూడా భారత్, ఇండోనేషియాలే ఉన్నాయని, అదనంగా బ్రెజిల్ కూడా ఈ జాబితాలో ఉందని తెలిపింది. -
‘ఫేక్’ బుక్ ఖాతాల్లో భారత్ టాప్!
హైదరాబాద్: సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో దాదాపు 20 కోట్ల నకిలీ ఖాతాలున్నట్లు తేలింది. ఆ సంస్థ ప్రకటించిన 2017 డిసెంబర్ నాటి వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నకిలీ ఖాతాలు అధికంగా భారత్లోనే ఉన్నట్లు పేర్కొంది. 2017 నాలుగో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్లీ ఆక్టివ్ యూజర్లు (ఎంఏయూ)లలో 10 శాతం నకిలీ ఖాతాలే అని అంచనా వేసింది. అలాగే ఈ నకిలీ ఖాతాలున్న దేశాల్లో తొలి స్థానాల్లో భారత్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ ఉన్నట్లు పేర్కొంది. 2017 చివరి నాటికి మొత్తం 2.13 బిలియన్ల ఎంఏయూలు ఉన్నారని, 2016తో పోలిస్తే 14 శాతం ఎంఏయూలు పెరిగారంది. 2017లో ఖాతాలు పెరగడానికి భారత్, ఇండోనేసియా, వియత్నాం దేశాలే కారణమని పేర్కొంది. ఒక వాడకందారుడికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలుంటే.. అందులో మొదటి ఖాతా మినహా మిగతావన్నీ నకిలీవేనని పేర్కొంది. -
‘ఫేక్’బుక్గా ఫేస్బుక్
హైదరాబాద్ : ఫేస్బుక్లో కనిపించే ఖాతాల్లో ఎక్కువశాతం నకిలీవేనట. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. 2017 డిసెంబరు 31 వరకు ఫేస్బుక్లో ఉన్న ఖాతాల్లో 20 కోట్లమంది ఫేక్ అకౌంట్లు కలిగి ఉన్నారు. మొత్తం ఖాతాల్లో దాదాపు 10 శాతం ఖాతాలు బహుశా నకిలీవై ఉంటాయని ఆ సంస్థ భావించినా.. అంతకు మించే ఉన్నట్లు గుర్తించామని చెప్పింది. భారత్ వంటి దేశాల్లో ఇటీవల ఫేక్ ఖాతాల సంఖ్య బాగా పెరిగిపోతోందని వార్షిక నివేదికలో పేర్కొంది. ఇండియాతోపాటు, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయట. 2016తో పోలిస్తే నకిలీ ఖాతాల సంఖ్య 14 శాతం పెరిగిందట. వ్యాపారం, ఇలా నకిలీ ఖాతాలు సృష్టించి, వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. తమ సంస్థ నియమనిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఖాతాలన్నింటినీ త్వరలోనే నిలిపివేస్తామని హెచ్చరించింది. -
ఫేస్బుక్కూ ఆధార్!
న్యూఢిల్లీ: నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ద్వారా కొత్తగా ఫేస్బుక్లో ఖాతాలు తెరిచేవారిని ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరుతోంది. ‘ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వండి’ అని ఫేస్బుక్లో ఓ ప్రాంప్ట్ వస్తోంది. దీంతోపాటు ‘మీ పేరేంటి? ఆధార్ కార్డులోని అసలు పేరు ఇవ్వడం ద్వారా స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలరు. నకిలీల బెడద తగ్గుతుంది’ అన్న సందేశం తెరపై ప్రత్యక్షమవుతోంది. రెడిట్, ట్వీటర్ వాడుతున్న కొందరు యూజర్లు దీన్ని గుర్తించారు. ‘కుటుంబ సభ్యులు, స్నేహితులు సులభంగా గుర్తించేందుకు ప్రజలు ఫేస్బుక్లో ఆధార్ కార్డుల్లో ఉన్న నిజమైన పేర్లను వాడాలని కోరుతున్నాం. ఆధార్లోని పేరు ఇవ్వాలన్న ప్రాంప్ట్ కేవలం మొబైల్ ద్వారా ఫేస్బుక్ వినియోగించేవారికి కన్పిస్తోంది. వినియోగదారులు ఆధార్లోని తమ పేర్లను ఇవ్వాలన్నది ఐచ్ఛికమే. ప్రస్తుతం దీన్ని మేం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం’ అని ఫేస్బుక్ అధికార ప్రతినిధి చెప్పారు. యూజర్ల పేర్లు తప్ప ఆధార్లోని ఎలాంటి వివరాలను అడగటం లేదన్నారు. దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. దాదాపు 125 గ్రామాల్లో ‘ఎక్స్ప్రెస్ వైఫై’ పేరిట హైస్పీడ్ ఇంటర్నెట్ హాట్స్పాట్లను ఫేస్బుక్ 2016లో ప్రారంభించింది. -
బీ’టెక్‘ పిలగాడు చుక్కలు చూపించాడు
సాక్షి, ముంబై : సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయటం.. సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేయటం... తరచూ చూస్తున్నదే. అయితే ఇక్కడ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మాత్రం మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించాడు. ఆయన పేరు మీద సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసి మహిళలకు సందేశాలు పంపటం ప్రారంభించాడు. అతగాడి విషయం తెలీక ఎమ్మెల్యేనే ఆ పని చేస్తున్నాడంటూ విమర్శలు వినిపించాయి కూడా. సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర అవాహద్ ఈ కేసులో బాధితుడు కావటం విశేషం. మహిళలతో గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటమే కాదు.. వారిని డిన్నర్ లకు రావాల్సిందిగా ఆహ్వానించేవాడంట. మరి కొందరు ఏకంగా అవాహద్ ఆఫీస్కే వచ్చేయటంతో ఆయనకు అసలు విషయం అర్థం అయ్యింది. దీంతో వెంటనే ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే అప్రమత్తమైన ఆ నిందితుడు.. ఆ ఆకౌంట్లను బ్లాక్ చేసేశాడు. కానీ, అది కొద్ది కాలం మాత్రమే. తిరిగి మళ్లీ ఈ మధ్యే మళ్లీ కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి మళ్లీ మహిళలకు మెసేజ్లు పంపటం ప్రారంభించాడు. ఈసారి మాత్రం థానే పోలీసులే ముందున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా అతగాడిని పట్టేసుకున్నారు. తాను సందేశాలు పంపుతుంటే వారిచ్చే సమాధానాలను ఆస్వాదించేవాడినని ఆ యువకుడు చెప్పటం విశేషం. ఆ యువకుడి పెరేంట్స్ విదేశాల్లో ఉండగా.. బంధువుల వద్ద ఉంటూ ముంబైలోని ఓ టాప్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నాడంట. -
30 వేల ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ల ఏరివేత
ఫేక్ ఖాతాలపై ఫేస్బుక్ కొరడా ఝుళిపించింది. స్పామ్ను తగ్గించడానికి, తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి వీలుగా ఫ్రాన్స్లోని 30 వేల ఫేక్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. బాగా ఎక్కువ యాక్టివిటీ ఉంటూ, ఎక్కువ మందికి రీచ్ అవుతున్న ఫేక్ అకౌంట్లను తీసేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సామాజిక మాధ్యమం ద్వారా తప్పుడు సమాచారం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం చెబుతోంది. ప్రధానంగా ఆర్థికపరమైన మోసాలు చేయడానికి ఫేస్బుక్ను వేదికగా వాడుకుంటున్నారని, యూజర్ల భద్రత కోసం తాము చర్యలు చేపడుతున్నామని ఫేస్బుక్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ షబ్నమ్ షేక్ తెలిపారు. ఇలాంటి ఫేక్ అకౌంట్లు ఉన్నవారు ఫేస్బుక్ ప్లాట్ఫారాన్ని ఉపయోగించుకుని తప్పుడు విషయాలు ప్రచారం చేసి జనాన్ని దోచుకోవడం ఇకమీదట అంత సులభంగా ఉండబోదని అన్నారు. అయితే, అసలు ఈ ఫేక్ అకౌంట్లను ఎలా గుర్తిస్తారన్నది కూడా ముఖ్యమైన విషయమే. ఒకే కంటెంటును ఎక్కువ సార్లు పోస్ట్ చేయడం, పదే పదే మెసేజిలు పంపుతుండటం.. ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్లవి ఫేక్ అకౌంట్లుగా పరిగణిస్తారు. -
3.56 కోట్ల నకిలీ అకౌంట్లు గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రత్యక్ష్ హన్స్తంత్రి లాభ్(పీఏహెచ్ఎల్) పథకం అమలు తర్వాత దేశవ్యాప్తంగా 3.56 కోట్ల నకిలీ అకౌంట్లను గుర్తించారు. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో రాత పూర్వక సమాధానం ఇచ్చారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 3.56 కోట్లు నకిలీ బ్యాంకు అకౌంట్లను గుర్తించినట్లు చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ సబ్సిడీ కింద రూ.40,569 కోట్లు, 2015-16 ఆర్థిక సంత్సరానికి రూ.16,074 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం వల్ల(పీఏహెచ్ఎల్ పథకం ద్వారా), అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం తదితర కారణాల వల్ల 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 24,495 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. 2017 జనవరి నెల వరకూ కోటి ఐదు లక్షల మంది ఎల్పీజీ వినియోగదారులు స్వచ్ఛందంగా ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నట్లు తెలిపారు. -
బద్దలైన మరో ప్రైవేటు బ్యాంకు బాగోతం!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఉన్న యాక్సిస్ బ్యాంకు శాఖల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంకు బాగోతం మరువకముందే మరో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులో నకిలీ ఖాతాల వ్యవహారం కలకలం రేపుతోంది. న్యూఢిల్లీ కస్తుర్బా గాంధీ మార్గ్లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకు శాఖపై తాజాగా ఆదాయపన్ను (ఐటీ) అధికారులు నజర్ పెట్టారు. ఈ బ్యాంకులో దాదాపు రూ. 70 కోట్లు డిపాజిట్ చేసిన నకిలీ ఖాతాలు వెలుగుచూసినట్టు సమాచారం. ఇందులో రూ. 39 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో తొమ్మిది నకిలీ ఖాతాలు తెరిచి.. అందులో సుమారు రూ. 39 కోట్లను డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాలన్నింటినీ రమేశ్ చంద్, రాజ్కుమార్ అనే వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్టు భావిస్తున్నారు. కాగా, రాధికా జెమ్స్ అనే కంపెనీ పేరిట ఉన్న మరో నకిలీ ఖాతాలో మరో 36.40 కోట్లు డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది. నకిలీ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయడమే కాదు.. పెద్ద ఎత్తున డిమాండ్ డ్రాప్ట్స్ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించినట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు తమ బ్యాంకులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు అన్ని తీసుకున్న తర్వాత ఆయా ఖాతాల్లో డిపాజిట్లకు అనుమతించామని కోటక్ మహేంద్ర బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుల విషయంలో ఐటీ అధికారుల విచారణకు సహకరిస్తున్నట్టు పేర్కొంది. -
బద్దలైన మరో ప్రైవేటు బ్యాంకు బాగోతం!
-
ఫేస్బుక్ నకిలీ ప్రొఫైల్తో.. బ్లాక్మెయిల్
అతడు అందమైన అమ్మాయిల ఫొటోలతో నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. యువతులకు ఫ్రెండ్ రిక్వెస్టు పంపి, వాళ్లతో చాటింగ్ మొదలుపెడతాడు. కొన్నాళ్ల తర్వాత కలుద్దామని చెబుతాడు. వాళ్లు నిరాకరిస్తే, వారి ప్రొఫైల్లో ఉన్న ఫొటోలతో మరో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి, దాంట్లో వాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి దారుణంగా పెడతాడు. ఆ అకౌంట్ను పోర్న్ కంటెంట్తో నింపేస్తాడు. దాంతోపాటు వాళ్ల వివరాలను ఎస్కార్ట్ వెబ్సైట్లలో పెడతాడు. అంతటితో అయిపోదు.. నకిలీ ప్రొఫైల్ను వాళ్ల స్కూలు ఫేస్బుక్ అకౌంటులో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి, వాళ్ల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తాడు. ఎట్టకేలకు ఈ మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. అతడి పేరు అఖిలేష్ (24). పెళ్లి కూడా అయింది. ఇప్పటివరకు ఇలా వంద మంది వరకు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేశాడు. చిన్నవయసు నుంచే అతడికి తప్పులు చేయడం అలవాటు. స్కూలు రికార్డులలో తన తండ్రి పేరుకు బదులు మామ పేరు రాశాడు. డ్రైవింగ్ లైసెన్సుకు కూడా అలాగే చేశాడు. మధ్యప్రదేశ్లోని భింద్ ప్రాంతానికి చెందిన అఖిలేష్, ఢిల్లీలోని బక్కర్వాలా ప్రాంతంలో నివసిస్తాడు. పదోతరగతి ఫెయిలై చదువు మానేశాడు. వజీర్పూర్లోని ఓ ఎగుమతుల కంపెనీలో పనివాడిగా చేరి, డ్రైవర్ అయ్యాడు. బాలీవుడ్లో పాటలు పాడాలని అనుకునేవాడు. పొరుగునుండే ఓ అమ్మాయితో స్నేహం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. తర్వాతి నుంచి ఫేస్బుక్ వ్యవహారం మొదలుపెట్టాడు. అతడిపై 354డి, 509, 506లతో పాటు పోస్కోచట్టంలోని 12వ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఫేస్బుక్ మెసెంజర్ సాయంతో తన కూతురిని ఎవరో వేధిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఓ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అఖిలేష్ బాగోతం మొత్తం బయటపడింది. ఆమె ఫోన్ నంబరును అసభ్యకరమైన టైటిళ్లతో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. చివరకు సైబర్సెల్కు చెందిన ఇన్స్పెక్టర్ రమేష్ దహియా ఇతడి గుట్టు రట్టుచేశారు. సుమారు వంద మంది అమ్మాయిల నెంబర్లతో కూడిన మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. -
ఆ హీరోయిన్ పేరుతో ఉన్నవన్నీ నకిలీ ఎకౌంట్లే
ముంబై: హీరో, హీరోయిన్ల పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు ఓపెన్ చేయడం, అందులో వారి విషయాలు, ఫొటోలను పోస్ట్ చేసిన సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. ఈ తర్వాత సంబంధిత నటులు ఈ విషయం తెలుసుకుని స్పందించారు. అవి నకిలీ ఎకౌంట్లను, తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రాణి ముఖర్జీ ముద్దుల తనయ అడిరా ఫొటో ఇంటర్నెట్లో చక్కర్లుకొట్టడంతో ఆమె తరఫున ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశాడు. రాణి ముఖర్జీకి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ఎకౌంట్ లేదని తెలియజేశాడు. ఇక మీదట కూడా ఉండబోదని చెప్పాడు. సోషల్ మీడియాలో రాణి ముఖర్జీ పేరు మీద నకిలీ ఎకౌంట్లు చాలా ఉన్నాయని ఆమె ప్రతినిధి వెల్లడించారు. అభిమానులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని, రాణి పేరు మీదున్న ఎకౌంట్లను ఫాలోకావద్దని, వాటిలో పోస్ట్ చేసే వివరాలు నిజంకాదని చెప్పాడు. 2014లో రాణి ముఖర్జీ నిర్మాత ఆదిత్య చోప్రాను ఇటలీలో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గతేడాది డిసెంబర్లో ఓ పాప జన్మించింది. -
ఫేస్‘బుక్కై’పోతున్నారు!
జానకి ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం ఈ ‘పేజీలను’ అడ్డంపెట్టుకుని వంచనలూ అపరిచిత స్నేహాలు వద్దంటున్న పోలీసులు సిటీబ్యూరో: సిటీలో తొలి ‘ఫేస్బుక్ మర్డర్’ రికార్డులకెక్కింది. డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేస్తున్న జానకి-ట్యాక్స్ కన్సల్టెంట్ యశ్వంత్ కుమార్ ఉదంతం ఈ కోవకు చెందినదే. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన జానకితో సాన్నిహిత్యం పెంచుకుని మోసం చేసిన యశ్వంత్ ఆపై దారుణంగా హత్య చేశాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ హత్యతో పాటు ఫేస్బుక్ ఆధారంగా జరుగుతున్న ఘోరాలు సిటీలో అనేకం ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు... ముఖ్యంగా యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. అతడో సైబర్ శాడిస్ట్... బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివసించే అబ్దుల్ మాజిద్ రెండేళ్లుగా ఫేస్బుక్లో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతా లు తెరిచాడు. సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినుల ప్రొఫైల్స్ను గుర్తించి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపిస్తాడు. అవతలి వారు కూడా అమ్మాయిలే అనే ఉద్దేశంతో విద్యార్థినులు ‘యాక్సెప్ట్’ చేయడంతో అసలు కథ మొదలెడతాడు. వారితో స్నేహపూరితంగానే ఛాటింగ్ చేస్తూ వ్యక్తిగత విషయాలు అడుగుతాడు. ఇలా స్నేహం పెరిగిన తర్వాత వారి ఆంతరంగిక అంశాల్లోకీ తలదూర్చుతాడు. విద్యార్థినుల్ని వంచిస్తూ వారి నగ్న చిత్రాలు, వీడియోలు సంగ్రహిస్తాడు. ప్రైవేట్ ఛాటింగ్ ద్వారా అసభ్యకరమైన సంభాషణలు కొనసాగిస్తాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో పెట్టడంతో పాటు తల్లిదండ్రులకూ పంపుతానంటూ వారిని బెదిరిస్తూ అందినకాడికి దండుకుంటాడు. మాజిద్ను గతేడాది సెప్టెంబర్ 11న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడు దాదాపు 80 మందిని వంచించినట్లు ఆరోపణలున్నాయి. జైలు నుంచి వచ్చినా అదే పంథాలో రెచ్చిపోతూ ఈ ఏడాది ఏప్రిల్లో మళ్లీ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. చాటింగ్స్తో మొదలెట్టి ... గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బాబూరావు ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలైన ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తాడు. అందులో తన ఈ-మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నెంబర్ సైతం పొందుపరుస్తాడు. ఆసక్తికనబరుస్తూ దరఖాస్తు చేసిన వారిలో యువతులు, మహిళల్ని ఎంచుకుంటాడు. దరఖాస్తు పత్రాల్లో ఉన్న వారి ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలు తీసుకుంటాడు. వీటి ఆధారంగా వారిలో చాటింగ్ చేయడం ప్రారంభిస్తాడు. తొలుత ఉద్యోగానికి సంబంధించిన విషయాలే చర్చించే బాబూరావు... కొన్నాళ్లకు వారిని మాయజేస్తూ వ్యక్తిగత అంశాలతో పాటు అభ్యంతరకర, అశ్లీల సందేశాలూ పంపిస్తుంటాడు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత సదరు యువతి/మహిళకు ఫోన్లు చేసి ‘చాటింగ్’ వివరాలకు కుటుంబీకులు, సంబంధీకులకు చెప్తానంటూ బ్లాక్మెయిలింగ్ మొదలెడతాడు. అలా కాకుండా ఉండాలంటే తాను అడిగినంతా ఇవ్వాలంటూ అందినంత మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ నగర విద్యార్థిని ఫిర్యాదుతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. స్నేహం ముసుగులో వంచన... ‘ఫేస్బుక్ మర్డర్’ జానకి ఉదంతం వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందే నగరంలో ‘ఫేస్బుక్ రేప్’ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ టోలిచౌకిలోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ఇతడికి ఫేస్బుక్ ద్వారా సమీపం ప్రాంతంలో నివసించే ఓ యువతి పరిచయమైంది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తు న్న ఆమెతో కొన్ని రోజుల పాటు స్నేహం నటిం చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వయంగా వెళ్లి కారులో ఎక్కించుకుని వచ్చాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకు న్న ఈ నయవంచకుడు కూల్డ్రింక్లో మత్తు మం దు కలిపి స్ఫృహతప్పేలా చేశాడు. ఆపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు యువతిని తీసుకురావడానికి వినియోగించిన కారునూ స్వాధీనం చేసుకున్నారు. యువతులూ తక్కువేం కాదు.. ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి యువకుల్ని ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్న ఇద్ద రు యువతులూ నగరంలో పట్టుబడ్డారు. పాతబస్తీలోని పత్తర్గట్టీ, రికాబ్గంజ్లకు చెందిన ఇద్దరు యువతులు స్నేహితులు. వీరిద్దరూ తప్పిపోయారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నాక అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ఫొటోలతో వీరు ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా యువకుల్ని ఆకర్షిస్తూ వారితో స్నేహం, చాటింగ్ చేస్తూ ముగ్గులోకి దింపారు. ఆ యువకుల నుంచి నగదు, నగలు, కెమెరాలు, ఫోన్లు రాబట్టుకున్నారు. ఆ డబ్బుతో డెహ్రా డూన్, ఊటీ, వైజాగ్ల్లో జల్సాలు చేస్తుండేవారు. ఈ పంథాలో వీరిద్దరూ 17 మంది యువకుల్ని మోసం చేశారు. -
ఫేస్బుక్ కీచకుడు
అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలు సాక్షి, హైదరాబాద్: అమ్మాయిల పేర్లతో ఫేస్బుక్ రిక్వెస్ట్, అమ్మాయే కదా అని యాక్సెప్ట్ చేస్తే మెల్లమెల్లగా స్నేహం, వ్యక్తిగత విషయాలు సేకరించి బెదిరింపులు.. నగ్నచిత్రాలు, వీడియోలు పంపాలంటూ డిమాండ్లు.. అవి పంపాక డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిలింగ్... హైదరాబాద్లో టీనేజీ అమ్మాయిలపై ఓ మోసగాడు వేసే వల ఇది. ఫేస్బుక్ అడ్డాగా 80 మందికిపైగా అమ్మాయిలను మోసం చేశాడు. చివరికి ఓ విద్యార్థిని ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ మురికివాడలో ఉండే మజీద్ అనే యువకుడి బాగోతం ఇది. బంజారాహిల్స్కు చెందిన జనని అనే విద్యార్థిని, ఆమె తల్లి శ్వేతప్రభు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వారు మజీ ద్ను శుక్రవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విలేకరులకు వెల్లడించారు. ఏడాదిన్నరగా.. మజీద్ దాదాపు ఏడాదిన్నర కింద అమ్మాయిల పేర్లతో ఐదారు ఫేస్బుక్ ఖాతాలు తెరిచాడు. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న సంపన్న వర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్లను వెతికి పట్టుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్లను పంపేవాడు. ఇలా 200 మందికి రిక్వెస్టులు పంపాడు. వారు కూడా రిక్వెస్ట్ పంపింది అమ్మాయే కదాని యాక్సెప్ట్ చేసేవారు. ఆ తర్వాత మజీద్ వారితో చాటింగ్ చేస్తూ చనువు పెంచుకున్నాడు. తమ వ్యక్తిగత సమాచారం, అంతర్గత విషయాలు పంచుకునేదాకా స్నేహం పెంచుకున్నాడు. తర్వాత తనలోని అసలు కోణం బయటపెట్టాడు. ఆ అమ్మాయిల నగ్నచిత్రాలు, వీడియోలను తీసి తన మెయిల్కు పంపాలని... లేకపోతే తనతో చాట్ చేసిన ప్రైవేట్ విషయాలను, సీక్రెట్ చాటింగ్, మెసేజ్లను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అయినా లొంగకపోతే ఆ మెసేజ్లను తల్లిదండ్రులకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. సంపన్న కుటుంబాల్లోని పిల్లలు తల్లిదండ్రులతో కాస్త దూరంగా మెలుగుతుండడంతో వారికి చెప్పే ధైర్యం చేయలేకపోయారు. అలా 80 మందికి పైగా అమ్మాయిలు మజీద్ ట్రాప్లో పడ్డారు. తన మాట వినకపోతే అంతకుముందటి ఫొటోలను ఫేస్బుక్లో, పోర్న్సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. కొన్ని సందర్భాల్లో అమ్మాయిలను వ్యక్తిగతంగా కలిసేవాడు. మరికొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు. అయితే డబ్బులు తీసుకున్నది, లేనిది ఇంకా తెలియలేదు. కానీ ‘రూ.86 వేలు ఇచ్చాను కదా.. మళ్లీ మళ్లీ బ్లాక్మెయిల్ ఏంటీ’ అని మజీద్ ఫేస్బుక్ ఖాతాలో ఓ అమ్మాయి పెట్టిన మెసేజ్ ఉంది. దీనిపై అసలు వివరాలు పోలీసుల విచారణలో తేలే అవకాశం ఉంది. ఇంటర్ నుంచే.. మజీద్ మలక్పేటలో ఒక ప్రైవేటు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వారిది పేద కుటుం బమే. తండ్రి పాన్షాప్లకు తమలపాకులు సరఫరా చేస్తుం టాడు. తల్లి కూరగాయలు విక్రయిస్తుంటుంది. కానీ మజీద్ ఆకతాయి పనులు చేసేవాడు. ఇంటర్ చదివే సమయంలోనే ప్రేమిస్తున్నానంటూ పలువురు అమ్మాయిలను వేధించాడు. బీటెక్కు వచ్చాక అమ్మాయిల వెంట పడడం మరింత పెరిగింది. అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలతో ఇతరులు చేసిన చాటింగ్లను చూసి స్ఫూర్తి పొంది... తానూ అదే దారిపట్టాడు. అమ్మాయిల పేర్లతో ఫేస్బుక్ ఖాతాలను తెరిచి అమ్మాయిలను ట్రాప్ చేశాడు. కొన్ని సందర్భాల్లో సీనియర్ పోలీసు అధికారి కూతురినని కూడా చెప్పుకుని, బెదిరించాడు. మజీద్పై ఇప్పటికే ఓ వివాహితను వేధించిన కేసు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అమ్మాయే కదాని.. ‘‘వారం కింద ఓ అమ్మాయి పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయే కదాని యాక్సెప్ట్ చేశా. 2 గంటల తర్వాత నీ ప్రైవేట్ వ్యక్తిగత వివరాలు నా వద్ద ఉన్నాయి, నేను చెప్పినట్టు చెయ్యకపోతే అవి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. నగ్నచిత్రాలు, వీడియోలు పంపాలని డిమాండ్ చేసింది. ఓ సీనియర్ పోలీసు అధికారి కుమార్తెనంటూ బెదిరించింది. మా అమ్మకు ఈ విషయం చెప్పాను. ఆ తర్వాత మాదాపూర్ సీఐ వెంకటేశ్వర్రెడ్డినంటూ ఒక ఫోన్కాల్ వచ్చింది. ఫేస్బుక్ ఖాతాలో అసభ్యకర మెసేజ్లు పెట్టావంటూ, చెక్ చేసేందుకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడిగాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని అమ్మ చెప్పింది. తర్వాత సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు ఈ విషయం చెప్పాం’’ - జననీ, విద్యార్థిని 4 రోజుల్లోనే పట్టుకున్నారు ‘‘మాకు వచ్చిన బెదిరింపుపై సైబరాబాద్ సీపీకి చెప్పగానే సైబర్ క్రైమ్కు పంపిం చారు. సోమవారం ఫిర్యాదు చేస్తే 4 రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అయితే ఏ తరగతి వర్గానికి చెందిన తల్లిదండ్రులైనా పిల్లలతో దగ్గరగా మెలగాలి. వాళ్ల సమస్యలను మనమే పరిష్కరిస్తామన్న నమ్మకాన్ని వారిలో కల్పించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి..’’ - శ్వేతప్రభు, జననీ తల్లి -
హ్యాకింగ్ చేసి.. అసభ్య చిత్రాలు.. అరెస్టు
చండీగఢ్: హర్యానాలో ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేసి వాటిల్లో అసభ్య చిత్రాలు పెడుతూ అవతలి వ్యక్తులనుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం యమునా నగర్ కు చెందిన అరవింద్ సింఘాల్ (24) అనే యువకుడు దాదాపు 20 ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేశాడు. ఆరు నెలలుగా వారి ఖాతాల్లోకి పోర్న్ చిత్రాలను పెడతానని బెదిరిస్తూ డబ్బు గుంజడం ప్రారంభించాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు మొత్తం 17 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫేస్ బుక్ పాస్ వర్డ్స్ కోసం ఉపయోగించేవాడని పోలీసులు తెలిపారు. తన ఫేస్ బుక్ ఖాతాలోకి అసభ్య చిత్రాలు వస్తుండటంతో నహన్ ప్రాంతానికి చెందిన సర్వేశ్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరవింద్ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. మే 15న కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది కాలానికే అతడిని అరెస్టు చేశారు. -
ఫేస్బుక్ వేధింపులు: యువతి అరెస్టు
స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి, వాళ్ల ఫొటోలతో అసభ్య సందేశాలు పోస్ట్ చేస్తూ వాళ్ల పరువు గంగలో కలుపుతున్న 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టుచేశారు. మొత్తం ఎనిమిది మంది పేర్ల మీద నకిలీ ఫేస్బుక్ ఐడీలను ఆమె తెరిచింది. అయితే.. ఆమె ప్రాక్సీ సర్వర్లను ఉపయోగించి ఈ అకౌంట్లను క్రియేట్ చేయడంతో పోలీసులకు ఈ కేసు ఛేదించడం పెద్ద సవాలుగానే మారింది. ఎట్టకేలకు ఆమె ఆచూకీని తెలుసుకోగలిగినట్లు గోవా సైబర్ క్రైం ఎస్పీ కార్తీక్ కశ్యప్ తెలిపారు. ఈ నేరం చేయడానికి ఆమె ఉపయోగించిన పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేయడం అలవాటు. ఎవరూ తనను ట్రాక్ చేయకుండా ఉండేందుకు తెల్లవారుజామున ఈ నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేయడం, వాటిలో పోస్టింగులు అన్నీ చేసేదని, అసలు ఆమె ఇలా చేయడానికి గల కారణం ఏంటో చూస్తున్నామని కశ్యప్ చెప్పారు.