Horror movie
-
మా సినిమాలో ఎవరి ముఖాలు కనిపించవు.. పెద్ద ప్రయోగమే!
‘‘డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘డ్యూయల్’ చిత్రంలో నటీనటుల ముఖం కనిపించదు. అలాంటి నేపథ్యంలో ‘రా రాజా’ సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. ఇది చాలా పెద్ద ప్రయోగం’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. బి. శివ ప్రసాద్ దర్శకత్వంలో పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్పై రూపొందిన చిత్రం ‘రా రాజా’. బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను తమ్మారెడ్డి భరద్వాజ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ముఖాలు కనిపించవు. కథే ముందుకు వెళ్తుంటుంది. ఇది అద్భుతమైన ఐడియా. ఇది సక్సెస్ అయితే హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు’’ అన్నారు. ‘‘మా చిత్రంలో నటీనటుల ముఖాలు కనిపించవు. కథ, కథనమే ముఖ్యంగా ఈ మూవీని తీశాం. ఇది ఒక ప్రయోగం’’ అన్నారు డైరెక్టర్ శివప్రసాద్. చదవండి: అమ్మానాన్న విడిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నా: నటి -
భయపెడుతున్న రా రాజా మూవీ పోస్టర్
ఇండియన్ స్క్రీన్పై ఇంతవరకు ఎవరూ టచ్ చేయని ఓ ప్రయోగంతో సినిమా రాబోతోంది. అసలే ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు అంతా కూడా కొత్త కాన్సెప్టులతో ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తున్నారు. మొహాలు కనిపించకుండా ట్రైలర్ను కట్ చేయడం అన్నది ఎలాంటి టెక్నీషియన్కు అయినా కష్టమే. అలాంటి ఓ విభిన్న ప్రయోగాన్ని ‘రా రాజా’ టీం చేసింది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ దర్శకత్వంలో ‘రా రాజా’ చిత్రం తెరకెక్కింది.ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రా రాజా పోస్టర్ రిలీజ్ చేశారు. రోమాలు నిక్కబొడుచుకునేలా, వెన్నులో వణుకు పుట్టేలా కట్ చేసిన ‘రా రాజా’ ట్రైలర్ను ఇది వరకే అందరం చూశాం. ఒక్క యాక్టర్ ముఖం కూడా చూపించకుండా ట్రైలర్ కట్ చేసిన తీరు బాగుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్, రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరా యాంగిల్స్తోనే అందరినీ భయపెట్టేశారు.ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ జనాల్లో మరింత ఆసక్తిని పెంచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను మేకర్లు ప్రకటించనున్నారు. -
మా సినిమాకు జిమ్మిక్కులు అక్కర్లేదు: బాలీవుడ్ హీరో
ఈ మధ్య హారర్ సినిమాలకు గిరాకీ పెరిగిపోయింది. ఆల్రెడీ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసుకొస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో 'భూల్ భులయ్యా 3' రానుంది. ఈ ఫ్రాంచైజీలో మొదటిసారిగా 2007లో అక్షయ్ కుమార్ హీరోగా భుల్ భులయ్యా తెరకెక్కింది. ఈ సినిమా హిట్ కావడంతో 2022లో సీక్వెల్ తీసుకొచ్చారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. సింగం అగైన్ Vs భూల్ భులయ్యా 3ఈ చిత్రానికి విశేష స్పందన రావడంతో మూడో భాగం ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఈ మూడో పార్ట్లోనూ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. తృప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా అజయ్ దేవ్గణ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ వంటి బడా స్టార్లు నటించిన 'సింగం అగైన్' రిలీజవుతోంది. జిమ్మిక్కులు అవసరం లేదుదీంతో ఈ దీపావళి వార్లో ఎవరు గెలుస్తారనేది బాలీవుడ్లో ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో హీరో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. భూల్ భులయ్యా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మా మూవీకి ఎలాంటి జిమ్మిక్కులు అవసరం లేదు. కథపై, సినిమాపై మాకు పూర్తి నమ్మకముంది అని పేర్కొన్నాడు.చదవండి: ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్గా -
హారర్ మూవీకి 'ఎ' సర్టిఫికెట్.. అప్పుడే రిలీజ్
మున్నా కాశీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202'. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ముఖ్య పాత్రల్లో నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది.గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. -
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా?
టైటిల్: ఇమ్మాక్యూలేట్దర్శకత్వం: మైఖేల్ మోహన్లీడ్ రోల్: సిడ్నీ స్వీనినిడివి: 90 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్విడుదల తేదీ: మార్చి 22, 2024ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్లోనూ ఇటీవల ఆ జోనర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే హాలీవుడ్లో అయితే ఈ చిత్రాలకు కొదువే లేదు. హాలీవుడ్ చిత్రాలు అత్యంత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది.గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ కథ మొత్తం నన్ల చుట్టు తిరుగుతుంది. నన్గా మారేందుకు అమెరికా నుంచి ఇటలీకి వచ్చిన ఓ యువతి కథ. ఇందులో నన్ పాత్రలో సిడ్నీ స్వీనీ నటించారు. సిసిలియో అనే యువతిగా కనిపించారు. వృద్ధ నన్స్కు సేవలందించేందుకు వచ్చిన యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే అసలు కథ.నన్ నేపథ్యంలో వచ్చిన కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. హారర్ సినిమా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేలా స్క్రీన్ ప్లే నడిపించారు. అత్యంత భయానక దృశ్యాలు ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగించేలా కూడా ఉన్నాయి. నన్లను ట్రీట్ చేసే విధానం.. వారిని వేధింపులకు గురిచేయడం లాంటి అత్యంత దారుణమైన సీన్స్ ఆడియన్స్ను భయపెట్టేస్తాయి. ఒక నన్ జీవితం ఇంత దారుణంగా ఉంటుందో ఈ సినిమాలో ఆడియన్స్కు పరిచయం చేశారు. హారర్ చిత్రమే అయినా.. ఎక్కడా కూడా దెయ్యం అనే కాన్సెప్ట్ లేకుండానే తెరకెక్కించాడు. ఈ కథలో సిసిలియో యువతిదే కీ రోల్. ఈ హారర్ మూవీకి ఆమె నటనే బలం. ఎక్కువగా హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అయితే కొన్ని సీన్స్ అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు లేనప్పుడు ఈ సినిమా చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. -
'సి 202' హారర్ మూవీ.. ఈ నెలలోనే రిలీజ్
ఇప్పుడు ఆడియెన్స్ అంతా కూడా కొత్త కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న చిత్రాలనే ఆదరిస్తున్నారు. ఈక్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్, టైటిల్తో తెరకెక్కిన మూవీ ‘సి 202’. పూర్తి నైట్ ఎఫెక్ట్స్లోనే ఈ సినిమాను చిత్రీకరించారు. మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించింది. మైటీ ఓక్ పిక్చర్స్ బ్యానర్పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నాడు. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్లో ఒక్క డైలాగ్ లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 25న విడుదల చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ పోస్టర్ను ఆవిష్కరించారు. -
ఓటీటీలో హారర్ మూవీ.. నిద్రలేని రాత్రి కోసం సిద్ధమా?
బ్లాక్బస్టర్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. అరుళ్ నిధి, ప్రియ భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డీమాంటి కాలనీ 2. ఇది 2015లో వచ్చిన హిట్ మూవీ డీమాంటి కాలనీకి సీక్వెల్గా తెరకెక్కింది. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాట ఆగస్టు 15న విడుదలై దాదాపు రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో అదే నెల 23న తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జీ5లో తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు.సినిమా విషయానికి వస్తే..క్యాన్సర్తో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను డెబీ (ప్రియ భవానీ శంకర్) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతడిని క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. అతడి ఆత్మహత్య వెనక కారణం తెలియక మానసికంగా సతమతమవుతుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని, ఈ తరహాలోనే పలువురూ మరణించారని తెలుసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? వరుస చావులకు చెక్ పెట్టేందుకు ఆమె ఏం చేసింది? ఈ పుస్తకానికి, డిమాంటి కాలనీకి ఉన్న లింకేంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by ZEE5 Tamil (@zee5tamil) చదవండి: హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్ -
'చరిత్ర పునరావృతం'.. త్వరలో తుంబాడ్ 2
కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా అద్భుతంగా అనిపిస్తాయి. అలాంటి చిత్రమే తుంబాడ్. హారర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా 2018లో విడుదలైంది. అప్పుడు మరీ అంత ఆదరణ లభించలేదు కానీ ఓటీటీలో మాత్రం జనం విపరీతంగా చూశారు. తాజాగా ఈ సినిమాను రీరిలీజ్ కూడా చేశారు. బాలీవుడ్లో ఫ్రెష్గా రిలీజ్ చేసిన సినిమాలకంటే ఎక్కువ వసూళ్లు తుంబాడ్ రాబట్టడం విశేషం.చరిత్ర పునరావృతంతాజాగా తుంబాడ్ మేకర్స్ ఓ గుడ్న్యూస్ చెప్పారు. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. ఈ మేరకు తుంబాడ్ చిత్ర హీరో సోహమ్ షా చిన్న టీజర్ కూడా వదిలారు. ఇందులో కాలం ఎన్నటికీ ఆగదు.. చరిత్ర పునరావృతం అవుతుంది. ఆ ద్వారాలు మళ్లీ తెరుచుకోనున్నాయి అని పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండియన్ సినిమాలోనే గ్రేటెస్ట్ మూవీ తుంబాడ్. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుందంటే ఆగలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈసారి మరిన్ని ట్విస్టులుఈ సీక్వెల్ గురించి హీరో, నిర్మాత సోహమ్ షా మాట్లాడుతూ.. తుంబాడ్ 2తో ఆడియన్స్కు మరింత అద్భుతమైన అనుభూతిని అందించాలనుకుంటున్నాం. ఈసారి మరిన్ని ట్విస్టులు ఉండనున్నాయి. అత్యాశకు పోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది మరింత లోతుగా, వివరంగా చూపించనున్నాం అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sohum Shah Films (@sohumshahfilms) చదవండి: యష్మికి బుల్లెట్ దింపిన నాగ్.. వెంటనే ప్లేటు తిప్పేసిందే! -
'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)
హారర్ కామెడీ స్టోరీలకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో కొన్నేళ్ల క్రితం ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే రీసెంట్ టైంలో హిందీలో ఇలా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'ముంజ్య'. తాజాగా ఇది హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది 1952. మహారాష్ట్రలో కొంకణ్ అనే ప్రాంతం. తనకంటే పెద్దమ్మాయిని గోట్యా అనే పిల్లాడు ప్రేమిస్తాడు. ఆమెకు పెళ్లి ఫిక్స్ కావడంతో చేతబడి చేసి వశం చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో తానే బలైపోతాడు. అప్పటి నుంచి 'ముంజ్య' అనే పిల్ల దెయ్యంగా మారిపోతాడు. ప్రస్తుతానికి వస్తే పుణెలో బిట్టు (అభయ్ వర్మ) తల్లి, నానమ్మతో కలిసి ఉంటాడు. కుక్కకి కూడా భయపడే ఇతడు.. కొంకణ్ ప్రాంతానికి వెళ్తాడు. అనుకోకుండా ముంజ్యని విముక్తి చేస్తాడు. అప్పటినుంచి బిట్టు జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైంది? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కోరిక తీరని ఆత్మ, దెయ్యంగా మారడం.. ఓ వ్యక్తి వల్ల బయట ప్రపంచంలోకి రావడం.. అక్కడి నుంచి అందరినీ ముప్పతిప్పలు పెట్టడం.. చివరకు కోరిక తీర్చుకునే క్రమంలో చావడం... ఈ స్టోరీ లైన్ చెప్పగానే అనుష్క 'అరుంధతి' సినిమా గుర్తొచ్చి ఉంటుందేమో! దాదాపు ఇదే కథతో తీసిన హిందీ సినిమా 'ముంజ్య'. కాకపోతే అనుష్క మూవీ మొత్తం సీరియస్గా ఉంటే ఇది మాత్రం కాస్త భయపెడుతూ కాస్త నవ్వించే ప్రయత్నం చేసింది.1952లో కొంకణ్ అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. గోట్య అనే పదేళ్ల పిల్లాడు, పక్కింట్లో ఉంటే మున్ని అనే అమ్మాయిని ఇష్టపడతాడు. కాకపోతే ఇతడి కంటే ఆమె ఏడేళ్లు పెద్దది. ఆమెకు పెళ్లి జరుగుతుందని తెలిసి.. ఏకంగా చేతబడి చేసి ఆమెని వశపరుచుకోవాలనుకుంటాడు. తన చెల్లినే బలివ్వాలనుకుంటాడు. ఇదంతా చెటుక్వాడి అనే దీవిలో చేస్తాడు. అనుకోకుండా అప్పుడు గోట్యా చనిపోతాడు.. పిల్ల దెయ్యంగా మారతాడు. ఇలా నేరుగా కథలోకి వెళ్లిపోయారు.ప్రస్తుతానికి వస్తే చాలా భయస్తుడైన బిట్టు(అభయ్ వర్మ)కి అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి. అందులో ముంజ్య కనిపిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో చెటుక్వాడి వెళ్లి అక్కడే నిర్బంధంలో ఉన్న ముంజ్యని విడుదల చేసేస్తాడు. అప్పటినుంచి ముంజ్య.. బిట్టు వెంటపడతాడు. తనకు మున్నితో పెళ్లి చేయాలని తెగ వేధిస్తాడు. అక్కడి నుంచి మొదలైన కథ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.పాయింట్ బాగానే ఉన్నప్పటికీ భయపెట్టే సీన్స్ అక్కడక్కడే ఉన్నాయి. హాలీవుడ్ మూవీ 'ద లార్డ్ ఆఫ్ రింగ్స్'లోని గోలుమ్ అనే పాత్రని స్ఫూర్తిగా తీసుకుని.. ముంజ్య అనే పిల్ల దెయ్యాన్ని సృష్టించారు. నిజంగానే దెయ్యమా అనే రేంజులో గ్రాఫిక్స్ ఉన్నాయి కానీ దానితో పెద్దగా భయపెట్టలేకపోయారు. రెండు గంటల సినిమానే కానీ కొన్నిచోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. ఇందులో బెలా పాత్రలో శర్వరి అనే అమ్మాయి చేసింది. ఈమె పెద్దగా ఇంపార్టెన్స్ లేదేంటా అనుకుంటాం. కానీ చివర్లో దెయ్యాన్ని చేసి భయపెట్టాలని చూశారు. కానీ ఆ పార్ట్ అంతా ఓకే ఓకే.ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అభయ్ వర్మ యాక్టింగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మిగతా పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండదు. కాబట్టి ఉన్నంతలో న్యాయం చేశారు. రీసెంట్ టైంలో హారర్ సినిమాలేం చూడలేదు. టైమ్ పాస్ అవ్వాలి అనుకుంటే హిందీలో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న 'ముంజ్య' చూడొచ్చు.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
సడెన్గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన 'ముంజ్యా' హరర్ సినిమా
బాలీవుడ్ బ్లాక్బస్టర్ హారర్ సినిమా 'ముంజ్యా' సడెన్గా ఓటీటీలో విడుదల అయింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ చిత్ర మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ముంజ్యా సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి డిస్నీ+ హాట్స్టార్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (ఆగష్టు 25) ఓటీటీలో విడుదలైంది. అయితే, కేవలం హిందీ వర్షన్లో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర ముంజ్యా సత్తా చాటింది. మ్యాడ్డాక్ సూపర్నేచురల్ యూనివర్స్లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. ఈ యూనివర్స్లో వచ్చిన స్త్రీ 2 ఐదో సినిమా. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. -
ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్బస్టర్ సినిమా
బాలీవుడ్ బ్లాక్బస్టర్ హారర్ సినిమా ముంజ్యా ఓటీటీ విడుదల కంటే బుల్లితెరపైకి రానుంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. మ్యాడ్డాక్ సూపర్నేచురల్ యూనివర్స్లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది.నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన ముంజ్యా సినిమా ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి రానుందని ప్రకటన వచ్చేసింది. స్టార్ గోల్డ్ ఛానల్ మంజ్యా సినిమా టెలికాస్ట్ గురించి ప్రకటించింది. ఆగస్ట్ 24న రాత్రి ఎనిమిది గంటలకు బుల్లితెరపై ఈ చిత్రాన్ని చూసేయండని పేర్కొంది.అయితే, ఇప్పటికే ముంజ్యా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఇప్పటికీ కూడా ప్రకటించలేదు. స్టార్ గోల్డ్ ఛానెల్ ముందుగా ప్రకటించి ప్రేక్షకులను తమపైపు తిప్పుకుంది. దీంతో హాట్స్టార్ కూడా అలెర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 9న ముంజ్యా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న హాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?
లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'నిన్ను వదలను'. యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా షిరాజ్ మెహది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అశోక్ కుల్లర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రంలో రష్యాకు చెందిన లియుబా పామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె సింగర్గా రాణించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్కు నిర్మాతగా.. లవ్ ఓవర్ ఈవిల్ అనే టీవీ సిరీస్కు రైటర్గా, నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం నిన్ను వదలను అంటూ హారర్ థ్రిల్లర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
అదరగొడుతున్న హారర్ మూవీ.. రూ.50 కోట్లు దాటేసింది!
ఎండాకాలం అయిపోయింది. సమ్మర్లో బ్లాక్బస్టర్ కొట్టిన సినిమాలంటూ పెద్దగా ఏవీ లేవు. ఇంతలోనే వర్షాకాలం మొదలైంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి, చందూ చాంపియన్, ముంజా వంటి కొత్త సినిమాలు బాలీవుడ్లో రిలీజయ్యాయి. వాటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ముంజా. ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. రెండు వారాల్లోనే రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మ్యాడ్డాక్ సూపర్నేచురల్ యూనివర్స్లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది. ఇకపోతే ఈ యూనివర్స్లో వచ్చిన ముంజా సినిమాను చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడుతున్నారు. మౌత్టాక్తోనే వసూళ్లు పెరుగుతున్నాయి. ఆదిత్య సర్పోడర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మ్యాడ్డాక్ ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న ఈ చిత్రం జూలైలో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా: రామ్ చరణ్ -
Sister Death Review: అక్కడ పేరు కనిపిస్తే మరణమే!
టైటిల్: సిస్టర్ డెత్నటీనటులు: అరియా బెడ్మర్, మరు వల్దీవిల్సో, లూయిసా మెరెలస్, చెలో వివరెస్, సారా రోచ్, అల్ముడెనా ఆమొర్ తదితరులుదర్శకుడు: పాసో ప్లాజాజానర్: హారర్ఓటీటీ ప్లాట్ఫామ్: నెట్ఫ్లిక్స్నిడివి: 1 గంట 30 నిమిషాలుహారర్ సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు! కొన్ని పేరుకే హారర్ మూవీస్ అంటారు కానీ అందులో భయపడేంత సీన్ ఏం ఉండదు. ఇక్కడ చెప్పుకునే సిస్టర్ డెత్ మూవీలో మాత్రం మొదట్లో దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టేందుకు ప్రయత్నించారు. మరి అందులో సక్సెస్ అయ్యారా? అసలు ఈ సినిమా కథేంటి? ఎలా ఉందనేది రివ్యూలో మాట్లాడుకుందాం..కథసిస్టర్ నార్సిసా.. కాన్వెంట్ స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నన్స్కు ఈమె పెద్దగా నచ్చదు. అది పట్టించుకోని నార్సిసా తన పని తాను చేసుకుపోతోంది. తన గదిలో ఏదో ఆత్మ ఉందని అర్థమవుతుంది. మరోవైపు స్కూల్లో బోర్డ్ మీద తనను తాను పరిచయం చేసుకుంటూ పేరు రాస్తుంది. అది చూసి అక్కడున్నవాళ్లు షాక్ అవుతారు. కారణం.. దెయ్యం ఆ బోర్డుపై ఎవరి పేరు రాస్తే వారి జీవితం అంతమైపోతుంది. అలా ఓసారి ఒక విద్యార్థి పేరు బోర్డు మీద ప్రత్యక్షమవుతుంది. నీకేం కానివ్వను అని హామీ ఇచ్చిన నార్సిసా ఆ బాలిక ప్రాణాలు కాపాడలేకపోతుంది. బాలిక చావుకు నువ్వే కారణమంటూ అక్కడి నన్స్ నార్సిసాను వెళ్లిపోమంటారు. పెట్టేబేడా సర్దుకుని బయటకు వెళ్లిపోయే క్రమంలో నన్స్ దాచిన రహస్యాన్ని ఆమె తెలుసుకుంటుంది. అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. దెయ్యానికి హీరోయిన్ సాయం చేస్తుంది. అందుకు కారణమేంటి? తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!విశ్లేషణనన్ను దెయ్యంగా చూపిస్తూ బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే! కానీ ఇందులో ఆ నన్ దెయ్యంగా ఎలా మారిందని చూపించారు. కొన్ని సంఘటనలు కలలా? నిజంగా జరుగుతున్నాయా? అనేవి అర్థం కావు. రియల్ సన్నివేశాల కంటే ఆ కలలే కాస్త భయంకరంగా ఉంటాయి. దెయ్యం తన గతానికి ముడిపడి ఉన్నవారిని చంపడం ఓకే కానీ ఏ సంబంధమూ లేని చిన్నారిని బలి తీసుకోవడం మింగుడుపడదు. చాలా సింపుల్గా కథను ముందుకు తీసుకెళ్లారు. దర్శకుడు వికృత ఆకారాలతో దెయ్యాన్ని చూపించి భయపెట్టాలనుకోలేదు. పెద్దగా ట్విస్టులు కూడా ఉండవు. రాసుకున్న కథ మాత్రం బాగుంది. చివర్లో జరిగేది ప్రేక్షకుడు ముందే పసిగట్టేలా ఉండటం మైనస్. నార్సిసా పాత్రలో స్పానిష్ హీరోయిన్ అరియా బెడ్మర్ చాలా బాగా నటించింది. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు. యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. పీరియాడిక్ ఫిలిం కావడంతో సినిమా ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్లోనే సాగుతుంది.సినిమాను ఒకటిన్నర గంటలో పూర్తి చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమా ఎండింగ్లో ఇది వెరోనికా(2017) చిత్రానికి ప్రీక్వెల్ అని అర్థమవుతుంది. మీరు హారర్ సినిమా అభిమానులైతే వెంటనే చూసేయండి.. కాకపోతే ఈ స్పానిష్ సినిమాకు తెలుగు డబ్ వర్షన్ లేదు. హిందీ, ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
హారర్ సినిమాలకు ఓటీటీలో మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇలాంటి చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా? అని ఓటీటీ ప్రియులు ఎదురుచూస్తుంటారు. వీరికోసమే ఈ గుడ్న్యూస్. 'ది ఫస్ట్ ఒమెన్' అనే అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.ఒమెన్ ఫ్రాంచైజీలో ఆరో సినిమాఒమెన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఐదు సినిమాలు వచ్చాయి. ది ఒమెన్(1976), డామెయిన్- ఒమెన్ 2 (1978), ద ఫైనల్ కాన్ఫ్లిక్ట్(1981), ఒమెన్ 4- ద అవేక్నింగ్(1991), ది ఒమెన్(2006) కాగా ఇప్పుడు వచ్చిన ది ఫస్ట్ ఒమెన్(2024) ఆరవది! ఇది 2006లో వచ్చిన ది ఒమెన్ సినిమాకు ప్రీక్వెల్గా తెరకెక్కింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్ఆర్కష స్టీవెన్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాఫీక్ బర్హోమ్, సోనియా బ్రాగ, నెల్ టైగర్ ఫ్రీ, బిల్ నైయ్, రాల్ఫ్ ఇనెసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెలన్నర లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 30 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది.From service to survival. Brace yourself for a chilling mystery.#TheFirstOmen streaming 30th May on #DisneyPlusHotstar pic.twitter.com/0GTsn66z9O— Disney+ Hotstar (@DisneyPlusHS) May 18, 2024 చదవండి: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలి.. నటుడి సలహా -
సడన్గా ఓటీటీకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ వారికి మాత్రమే!
హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ గార్డియన్. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి శబరి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈమూవీ బిగ్ డిజాస్టర్గా నిలిచింది. మొదటి వారంలో థియేటర్లలో మాయమైపోయింది. తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది.హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన గార్డియన్ మూవీ ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం సింప్లీసౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియాలోని ఆడియన్స్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్లో ఈ హారర్ మూవీ రానున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.అసలు కథేంటంటే..రోటీన్ హారర్ స్టోరీగా దర్శకుడు శబరి గురుశరవణన్ తెరకెక్కించారు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే అసలు కథ. -
Death Whisperer Review: అమ్మాయిలను వెంటాడే దెయ్యం..చివరికేమైంది?
టైటిల్: డెత్ విస్పరర్డైరెక్టర్: థావివాత్ వాంతానటీనటులు: నదెచ్ కుగిమియ, జూనియర్ కజ్భుందిట్, పీరకృత్ పచరబూన్యకైట్, దెడిస్ జెలిల్చ కపౌన్నిడివి: 2 గంటలుఓటీటీ: నెట్ఫ్లిక్స్హారర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. కొందరు భయమనేదే లేకుండా.. కన్నార్పకుండా సినిమా చూస్తారు. మరికొందరు ఎంత భయమేసినా సరే.. నిండా దుప్పటి కప్పుకుని మరీ చూస్తుంటారు. హారర్ సినీప్రియులందరికోసం ప్రతియేడూ బోలెడన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. అలా గతేడాది డెత్ విస్పరర్ అనే థాయ్ మూవీ రిలీజైంది. క్రిట్టనాన్ రచించిన టీ యోడ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కథేంటి? ఎలా ఉందో చూద్దాం..కథేంటంటే..అది 1970.. థాయ్లాండ్ కాంచనబూరిలోని గ్రామంలో ఓ ఫ్యామిలీ సంతోషంగా జీవనం సాగిస్తుంటుంది. ఇంటి పెద్ద పొలం పని చేస్తుంటాడు. చాలా స్ట్రిక్ట్. భార్య ఇంటి పనికే పరిమితమవుతుంది. వీరికి ముగ్గురమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు సంతానం. పిల్లలు బడికి వెళ్లేముందు, వచ్చాక తల్లికి ఇంటిపనిలో సాయపడుతుంటారు. ఇద్దరబ్బాయిలు తండ్రికి పొలంలో సాయం చేస్తారు. అందరికంటే పెద్దవాడైన యాక్ మిలిటరీలో పని చేస్తాడు. కానీ ఓ రోజు ఉన్నట్లుండి ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే ముగ్గురమ్మాయిలకు స్కూలుకు వెళ్లే దారిలో ఓ చెట్టు కింద దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దెయ్యం కనిపిస్తుంది.పన్ను పీకి చేతబడిఆ దెయ్యం అందరికంటే ఆరోగ్యంగా ఉన్న యామ్ను ఆవహించేందుకు సెలక్ట్ చేసుకుంటుంది. దీంతో తను అనారోగ్యానికి లోనవుతుంది. వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఓ రోజు చూయ్ అనే మంత్రగత్తె కిటికీలోంచి ఆ అమ్మాయి గదిలోకి దూరం తన పన్ను పీకి దానిపై చేతబడి చేస్తుంది. ఈ విషయం తెలిసి మిలిటరీ నుంచి వచ్చిన అన్న తనను చావబాదడానికి వెళ్తే తనే ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడినుంచి ఈ కుటుంబానికి కష్టాలు మొదలవుతాయి.క్లైమాక్స్లో ట్విస్ట్రాత్రిపూట దెయ్యం ఏదో వింతవింత(గుసగుసలాడినట్లు) శబ్దాలు చేయడం, అది విన్నవారు స్పృహ తప్పిపోవడం.. అర్ధరాత్రి యామ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం, ఆమెను వెతికి తీసుకురావడం.. ఇదే జరిగేది. దెయ్యం వారిని మానిప్యులేట్ చేయడానికి ట్రై చేసినా.. ప్రాణాలకు తెగించి మరీ యాక్ తన చెల్లిని బతికించేందుకు ప్రయత్నిస్తాడు. దెయ్యం ఎక్కడైతే కనిపించిందో ఆ చెట్టును కొట్టేసి అక్కడున్న మానవ మాంసాన్ని కాల్చేస్తారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లే దారిలో దెయ్యాన్ని కూడా షూట్ చేస్తారు. ఇక దాని పీడ విరగడైందనుకున్న సమయంలో డైరెక్టర్ ట్విస్ట్ ఇచ్చాడు.. అదేంటో తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?డెత్ విస్పరర్స్.. ఈ మూవీలో హారర్కే పెద్ద పీట వేశారు. కామెడీ జోలికి వెళ్లలేదు. అయితే సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్లిపోతుంది. పెద్దగా ఎగ్జయిట్ అయ్యే విషయాలంటూ ఏమీ ఉండవు. నటీనటులు బాగా యాక్ట్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ మీద కాస్త ఫోకస్ చేయాల్సింది. క్లైమాక్స్ చివర్లో సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అయితే తెలుగు ఆడియో, సబ్టైటిల్స్ లేవు. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో సినిమా చూసేయొచ్చు. -
ఇంటి నెం.13 సినిమా రివ్యూ, నిజంగానే భయపెట్టిందా?
టైటిల్: ఇంటి నెం.13 నటీనటులు: నవీద్బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, గుండు సుదర్శన్, దేవయాని తదితరులు రచన, దర్శకత్వం: పన్నా రాయల్ సంగీతం: వినోద్ యాజమాన్య సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్ ఎడిటింగ్: సాయినాథ్ బద్వేల్ మాటలు: వెంకట్ బాలగోని, పన్నా రాయల్ సమర్పణ: డా.బర్కతుల్లా నిర్మాత: హేసన్ పాషా బ్యానర్స్: రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ విడుదల తేదీ: 01.03.2024 సినిమా నిడివి: 126 నిమిషాలు హారర్ మూవీస్ అంటే దెయ్యాలు, ప్రేతాత్మలకు సంబంధించిన కథలతోనే తెరకెక్కుతుంటాయి. అయితే కొందరు దర్శకులు వాటిలోనే కొంత వైవిధ్యం వున్న కథలతో, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకొని కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దర్శకుల్లో పన్నా రాయల్ ఒకరు. ఇంతకుముందు అలాంటి కథాంశాలతోనే కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ చిత్రాలను తీసి పేరు గడించారు. ఇప్పుడు తన మూడో చిత్రంగా ‘ఇంటి నెం.13’ను తెరకెక్కించారు. ఒక కొత్త పాయింట్, కొత్త బ్యాక్డ్రాప్ని ఎంచుకొని ప్రేక్షకుల్ని మరోసారి భయపెట్టే ప్రయత్నం చేశారు. శుక్రవారం(మార్చి 1న) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథ ఓ 90 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో ప్రేతాత్మల నుంచి ఎంత మందిని విముక్తుల్ని చేశాడో వివరిస్తుంటాడు. అందులో భాగంగా ‘ఇంటి నెం.13’ అనే ఒక విల్లాకు సంబంధించిన కథను చెప్పడం మొదలు పెడతాడు. అర్జున్ ఒక రచయిత. అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిందంటూ అది ప్రింట్ చేసిన పబ్లిషర్ ఫోన్ చేసి చెబుతాడు. ఆ అచీవ్మెంట్కి బహుమానంగా ఒక విల్లా గిఫ్ట్గా ఇస్తానంటాడు. దానికి సంబంధించిన తాళాలను తన అన్నయ్య సంజయ్కి ఇమ్మని చెబుతాడు అర్జున్. అలా సంజయ్, అతని భార్య నిత్య, పనిమనిషి జేజమ్మ ఆ ఇంట్లో దిగుతారు. ఆ తర్వాత అర్జున్, నిత్య చెల్లెలు మధు కూడా ఆ ఇంటికి వస్తారు. కొన్ని రోజులు బాగానే గడుస్తుంది. ఆ తర్వాత నిత్యకు తెల్ల ముసుగు వేసుకున్న ఆకారాలు కనిపిస్తుంటాయి. దగ్గరకెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అలాంటివి తరచూ కనిపిస్తుండటంతో ఆమె మానసికంగా ఆందోళనకు గురవుతుంది. ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇది గమనించిన భర్త ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్ని, సైకియాట్రిస్ట్లను తీసుకొస్తాడు. కానీ ఇద్దరూ చేతులెత్తేస్తారు. ఫైనల్గా గజానంద్ (ఆనంద్రాజ్) రంగంలోకి దిగుతాడు. ఆ ఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి? అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయి? ఆ ఇంటిలో ఉన్న సమస్యను గజానంద్ ఏవిధంగా పరిష్కరించాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ మనం ఎప్పుడూ చూసే దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏ సినిమా అయినా ఒక ఇంట్లో ఉండే సమస్యతోనే మొదలవుతుంది. ఇందులోనూ అలాంటి సమస్యే అయినా దాన్ని చెప్పిన విధానం విభిన్నంగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ లేకుండా, ల్యాగ్ లేకుండా నడిపించేందుకు దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. కానీ కొన్నిచోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చే ట్విస్టులు ఆడియన్స్ని థ్రిల్ చేస్తాయి. ఫస్ట్హాఫ్ కంటే సెకండాఫ్ థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా మారింది. వినోద్ యాజమాన్య ఇచ్చిన మ్యూజిక్ ఎంతో గ్రాండ్గా ఉంది. నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నవీద్, శివాంగి మెహ్రా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోదగిన గజానంద్ పాత్రను ఆనంద్రాజ్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మీ, పృథ్విరాజ్, సుదర్శన్, శివన్నారాయణ, రవివర్మ వారి పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక నిపుణులు చిన్న సీన్ని కూడా బాగా ఎలివేట్ చేసేలా వినోద్ సంగీతం అందించారు.దర్శకుడు పన్నా రాయల్ తను అంతకుముందు చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఆర్టిస్టుల నుంచి మంచి పర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్గా చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ని ఎంతో రిచ్గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ సాయి బద్వేల్ సినిమాను క్రిస్పీగా ఎడిట్ చేశారు. వెంకట్ బాలగోని, పన్నా రాయల్ రాసిన మాటలు పర్వాలేదనిపించాయి. నిర్మాత హేసన్ పాషా పెట్టిన ఖర్చు స్క్రీన్పై కనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే.. హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. మరో విశేషం ఏమిటంటే.. లాస్ట్ సీన్ చూసిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని అర్థమవుతుంది. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే వారికి, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన వారికి ‘ఇంటి నెం.13’ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. -
ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు – దర్శకుడు సాయికిరణ్ దైదా
‘‘తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ‘మా పిండం’ ఉంటుంది. భయపెట్టాలని హారర్ సీన్స్ పెట్టలేదు. బలమైన కథ ఉంది. ప్రేక్షకులకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు సాయికిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కానుంది. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుండి నాకు రాయడం అంటే ఇష్టం. అమెరికాలో వ్యాపారం చేస్తున్నా స్క్రిప్ట్లు రాసేవాడిని. కోన వెంకట్గారు అమెరికాలో పరిచయమయ్యారు. నేను రాసుకున్న ఓ క్రైమ్ కామెడీ కథ ఆయనకు నచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆ సినిమా డల్లాస్లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా కుదరలేదు. నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకుని ‘పిండం’ తీశాను. ఇది హారర్ సినిమా కాబట్టి భయపెట్టే సీన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నెక్ట్స్ ‘కృష్ణుడి లంక’ టైటిల్తో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. -
'పిండం' చూసి భయపడతారు: డైరెక్టర్ సాయి కిరణ్ దైదా
‘నల్లగొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది మా నాయనమ్మ చెప్పడం వల్ల నాకు బాగా గుర్తుండిపోయింది. దాని చుట్టూ కథ అల్లుకొని, ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచించాను.దీనిని హారర్ జానర్ లో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో పిండం సినిమా మొదలుపెట్టాను. ఇప్పటి వరకు తెలుగులో చాలా హారర్ మూవీస్ వచ్చాయి. అవన్ని ఒకెత్తు.. మా పిండం మూవీ మరో ఎత్తు. హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు’అని అన్నారు దర్శకుడు సాయి కిరణ్ దైదా. శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన తాజా చిత్రం ‘పిండం’.'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సాయికిరణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► యదార్థ ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకొని ‘పిండం’సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులు హారర్ జానర్ సినిమాలు చూడటానికి వచ్చేది భయపడటం కోసమే. ఆ హారర్ అనుభూతిని కలిగించి, భయం ఇవ్వాలి. ఇది నా మొదటి సినిమా కాబట్టి భారీ తారాగణం ఉండదు. కథ బలంగా ఉండాలి. దానిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ని ఎంతో శ్రద్ధతో రాసుకోవడం జరిగింది. హారర్ సినిమా కాబట్టి ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. సినిమా మొత్తం పూర్తయ్యాక, సినిమా చూసుకొని విజయం పట్ల మరింత నమ్మకం కలిగింది. ► పిండం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే. నేను కథ రాసుకున్నప్పుడే పిండం టైటిల్ అనుకున్నాం. ఇలాంటి నెగటివ్ టైటిల్ ఎందుకు, అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అని నా టీమ్ మెంబర్స్ కూడా పిండం టైటిల్ మార్చమన్నారు. అయితే ఒక మూఢ నమ్మకాన్ని పట్టుకొని, కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ని కాదని వేరే టైటిల్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ►ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ చదివాను. సబ్జెక్ట్ లోకి మరింత లోతుగా వెళ్ళడం కోసం అంతగా రీసెర్చ్ చేశాను. ఎప్పుడూ వచ్చే హారర్ సినిమాల్లాగా కాకుండా, కొత్తగా ఎలా చూపించాలి అనే దానిపై ఎంతో వర్క్ చేశాము. క్లైమాక్స్ సన్నివేశంలో.. వివిధ భాషల్లో ఉండే నిజమైన మంత్రాలను తెలుసుకొని పెట్టడం జరిగింది. ► టీజర్ కి, ట్రైలర్ కి రెండింటికీ మంచి స్పందన వచ్చింది. కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది. ట్రైలర్ చూసి ఎందరో అభినందించారు. మీరు టీజర్, ట్రైలర్ లో చూసిన దానికంటే ఎన్నో రెట్ల కంటెంట్ సినిమాలో ఉంటుంది. ► ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు. మా పిండం సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏదో భయపెట్టాలని ఒక హారర్ సీన్ పెట్టడం అలా ఉండదు. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలకు మనం ఎంతలా కనెక్ట్ అయితే, భయం అనేది అంత బాగా పండుతుంది. ఊరికే ఏదో హారర్ పెట్టాలి అన్నట్టుగా ఉండదు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అప్పుడే భయం ఇంకా ఎక్కువ పండుతుంది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలకి ట్రెండ్ కూడా బాగుంది. మాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాం. ►ఈ సినిమాలో సంగీతానికి చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. ►త్వరలో కృష్ణుడి లంక అనే క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నాను. హీరో పేరు కృష్ణ, అతను శ్రీలంకలో ఉంటాడు. ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అతని సమస్య ఏంటి? అనేది కథ. ఇంకా హీరో ఎవరు అనేది అనుకోలేదు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాను. -
హార్రర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోన్న రెజీనా!
టాలీవుడ్లో శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా. కోలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించింది. ఇటీవలే ఓ వెబ్సిరీస్లోనూ నటించిన రెజీనా తాజాగా తమిళంలో కంజూరింగ్ కన్నప్పన్ అనే చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు సతీష నాజర్, శరణ్య పొన్వన్నన్, ఆనంద్రాజ్, వీటీవీ గణేష్, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి సెల్విన్ రాజ్సేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) ఈ చిత్రం గురించి సెల్విన్ మాట్లాడుతూ.. ఇది హార్రర్, కామెడీ జానర్లో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. అయితే ఇది గత చిత్రాల తరహాలో ఉండదన్నారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని తెలిపారు. హాలీవుడ్ స్టైల్లో కొన్ని విషయాలను చెప్పామన్నారు. వినూత్న కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని హార్రర్తో కూడిన ఫాంటసీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందించినట్లు చెప్పారు. ఇందులోని క్యాష్బ్యాక్ సన్నివేశాలను బ్రహ్మాండంగా చిత్రీకరించినట్లు తెలిపారు. మంచి చిత్రాన్ని చేయాలనే భావనతో నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకావట్లేదని చెప్పారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పూర్తి అయిందని.. మరోపక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు సెల్విన్ రాజ్సేవియర్ తెలిపారు. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్లో సెక్షన్ 108 చిత్రంలో నటిస్తోంది భామ. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. -
ప్రపంచంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమా ఇదే! చెక్కుచెదరని రికార్డు!
అతివృష్టి, అనావృష్టి.. వర్షం విషయంలోనే కాదు బాక్సాఫీస్ విషయంలోనూ ఇది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి భారీ బడ్జెట్ సినిమాలు కనీస వసూళ్లు కూడా రాబట్టలేక చతికిలపడుతుంటే చిన్న చిత్రాలు మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంటాయి. మొదటి సందర్భంలో నిర్మాత పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతే రెండో సందర్భంలో మాత్రం నిర్మాత పంట పండినట్లే! మరి ప్రపంచంలోనే అత్యధికంగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదో మీకు తెలుసా? లక్షలు పెట్టి తీస్తే వేల కోట్లు కొల్లగొట్టిన ఆ సినిమా ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే! కశ్మీర్ ఫైల్స్.. పెట్టుబడి రూ.15 కోట్లు వసూళ్లు.. కలెక్షన్స్ రూ.350 కోట్లు. వావ్, గ్రేట్ అని నోరెళ్లబెడుతున్నారేమో.. 'పారానార్మల్ యాక్టివిటీ' సినిమా సంగతి చెప్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడటం ఖాయం! ఈ హాలీవుడ్ సినిమా ఏకంగా 13,30,000 శాతం లాభాలను అందుకుంది. ఈ సినిమాను 2007లో హాలీవుడ్ డైరెక్టర్ ఓరెన్ పెలి తెరకెక్కించాడు. తనే కథ రాసుకుని, దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాలో నలుగురు మనుషులు, ఒక అస్థిపంజరం ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఈ సినిమా తీయడానికి ఆయనకు 15 వేల డాలర్లు (2007లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.6 లక్షలు) ఖర్చయ్యాయి. అయితే పారామౌంట్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను సొంతం చేసుకుని క్లైమాక్స్లో కాస్త మార్పులుచేర్పులు చేసి దానికి మరిన్ని హంగులు అద్ది రిలీజ్ చేసింది. దీనికి దాదాపు రూ.90 లక్షలు ఖర్చయ్యాయి. ఈ సినిమా ఎవరూ ఊహించనంతగా హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 193 మిలియన్ డాలర్లు (2007లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.800 కోట్లు) రాబట్టింది. ప్రపంచంలోనే తక్కువ బడ్జెట్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అప్పటివరకు లాభాల పంట పండించిన చిత్రంగా 'ద బ్లైయిర్ విచ్ ప్రాజెక్ట్' పేరిట ఉన్న రికార్డును పారానార్మల్ యాక్టివిటీ మూవీ తన స్వాధీనం చేసుకుంది. ఈ ఊపుతో 'పారానార్మల్ యాక్టివిటీ' సినిమాకు సీక్వెల్స్ కూడా తీశారు. వరుసగా ఆరు సీక్వెల్స్ తీయగా ఇవి మొత్తంగా రూ.7320 కోట్లు రాబట్టాయి. ఇలా తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ రెండో స్థానంలో ఉంటుంది. 1999లో వచ్చిన 'ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్' రూ.85 లక్షలతో తెరకెక్కగా రూ.1045 కోట్లు రాబట్టింది. 2003లో వచ్చిన టార్నేషన్ కేవలం రూ10,000తో తెరకెక్కగా రూ.5.5 కోట్లు సాధించింది. రెండు లక్షలతో తెరకెక్కిన పోర్నోగ్రఫీ చిత్రం 'డీప్ త్రోట్' రూ.17 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రూ.87వేలతో నిర్మితమైన 'ఎరేజర్ హెడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.6 కోట్లు కలెక్షన్ల వర్షం కురిపించింది. చదవండి: బ్రో సహా మరో బాలీవుడ్ సినిమాకు ఆదరణ కరువు, రిటైర్మెంట్ తీసుకోమన్న కంగనా పెళ్లైన 6 ఏళ్లకే విడాకులు.. విడిపోవడం కష్టంగా ఉందని నటి పోస్ట్ -
సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో హార్రర్ చిత్రం
హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల నిర్మాణంపై చిన్న దర్శక నిర్మాతలు దృష్టి పెడుతున్నారని చెప్పవచ్చు. అలా తాజాగా నటి స్మతి వెంకట్ సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హార్రర్ కథా చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డ్రీమ్ హౌస్ పతాకంపై ఎన్.కారుణ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నిజ జీవితంలో మన కళ్లముందు జరిగే కొన్ని అమానుష సంఘటనలు నిజంగా ఎలా జరుగుతాయా మనకి తెలియదన్నారు. అలాంటి ఘటనలతో ఈ చిత్రాన్ని రపొందిస్తున్నట్లు చెప్పారు. ఇది సాధారణ హార్రర్ చిత్రాలకు భిన్నంగా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటుందన్నారు. నటి స్మతి వెంకట్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇందులో కథానాయకుడిగా రోషన్ నటిస్తున్నారని, సంగీత దర్శకుడు సిద్ధార్త్ విపిన్, దర్శకుడు సుబ్రమణియం, శివ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షటింగ్ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర టైటిల్ను, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. కాగా దీనికి కేఎం రయాన్ సంగీతాన్ని, విజయ్కుమార్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. స్మృతి వెంకట్, సోనియా అగర్వాల్ కొత్త చిత్రం ప్రారంభం -
హీరోగా మ్యూజిక్ డైరెక్టర్.. మరో హర్రర్ చిత్రం '13'
చెన్నై సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ 'డార్లింగ్' (తమిళం) చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. జీవీ ప్రకాష్ కుమార్ తాజాగా నటిస్తోన్న చిత్రం '13'. ఇటీవల జీవీ ప్రకాష్ కుమార్, దర్శకుడు గౌతమ్ మీనన్ కలిసి నటించిన 'సెల్ఫీ' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి '13' మూవీలో నటించడం విశేషం. దీన్ని ఎస్. నందగోపాల్ సమర్పణలో మద్రాస్ స్టూడియోస్, అన్షు ప్రభాకర్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నటి ఆదిత్య, భవ్య, ఐశ్వర్య నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వివేక్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ నిర్మాత నందకుమార్ ఫోన్ చేసి మంచి హారర్ కథ ఉంది దర్శకుడు చెబుతారు వినమని చెప్పారన్నారు. తొలి చిత్రమే హర్రర్ నేపథ్యంలో డార్లింగ్ చేయడంతో కాస్త సందేహించానన్నారు. అయితే కథ విన్న తర్వాత వెంటనే నటించడానికి అంగీకరించానని, ఇది హర్రర్ నేపథ్యంలో సాగే విభిన్నమైన చిత్రమని చెప్పారు. చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రెండు రోజుల క్రితం ఆవిష్కరించినట్లు వెల్లడించారు. చదవండి:👇 రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్.. ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_71236443.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా ‘నఘం’.. టీజర్ విడుదల
గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం 'నఘం'. విభు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ దొసకాయల ఈ సినిమాను నిర్మించగా నరసింహ జీడీ దర్శకత్వం వహించారు. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు. ఒక్క డైలాగ్ లేకుండా.. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కట్ చేసిన ఈ టీజర్.. అందరిని ఆకట్టుకుంటుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు కావాల్సిన సంగీతాన్ని భగవత్ అందించారు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్గా అరవింద్ బి వ్యవహరించగా కిచ్చు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. -
హారర్ ఆట
నూతన నటీనటులతో పీబీ లింగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాతో ఆట’. విఘ్నేష్ ధనుష్ సమర్పణలో శుక్లాంబరధరం సినీ క్రియేషన్స్పై బి.ఎల్. బాబు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా బి.ఎల్. బాబు మాట్లాడుతూ– ‘‘నాతో ఆట’ ఒక హారర్ చిత్రం. మంచి కథతో యూత్కి కావాల్సిన అన్ని అంశాలతో నిర్మించాం. మా చిత్రాన్ని మోహిత్ ఫిలిమ్స్ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. -
సమాధానం ఏంటి?
అదా శర్మ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘క్వశ్చన్ మార్క్ (?)’. విప్రా దర్శకత్వంలో గౌరు ఘనా సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరి సహకారంతో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. మా టైటిల్ ‘క్వశ్చన్ మార్క్ (?)’కి విశేష స్పందన లభించింది’’ అన్నారు. ‘‘మా నిర్మాతగారు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు విప్రా. ‘‘చక్కని హారర్ సినిమా ఇది. ‘క్వశ్చన్ మార్క్ (?)’ టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్రశ్నకు సమాధానం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు అదా శర్మ. ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్, సంగీత దర్శకుడు: రఘు కుంచె. -
హారర్ చిత్రంలో చైతూ.. డైరెక్టర్ అతడేనా?
వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘లవ్స్టోరీ’ చిత్రం చేస్తున్నాడు. ‘లవ్స్టోరీ’ తర్వాత ‘మనం’ డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చైతూ ఓ మూవీ చేస్తారనేది సినీ వర్గాల్లో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వార్త. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రం హారర్ జానర్లో తెరకెక్కనుందని సమాచారం. అది కూడా గతంలో వచ్చిన హారర్ చిత్రానికి సీక్వెల్ అని తెలుస్తోంది. గతంలో విక్రమ్ కుమార్ మాధవన్తో తీసిన ‘13 బీ’ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమాని రూపొందించనున్నారని అంటున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘13 బీ’ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం అందుకుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో చైతూ ఈ సీక్వెల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన అంటున్నారు. అయితే అటు దర్శకుడు నుంచి గాని ఇటు హీరో నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దిల్రాజ్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అని టైటిల్ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రసుతం వరుస సినిమాలతో చైతూ ఫుల్ బిజీగా ఉన్నాడు. నాగార్జున టైటిల్ రోల్లో కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బంగార్రాజు’ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక పరుశురామ్ ‘నాగేశ్వర్రావు’ చిత్రం ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. అంతేకాకుండా తాజాగా ఇంద్రగంటి మోహన్కృష్ణ చెప్పిన కథకు పచ్చ జెండా ఊపడంతో ఈ సినిమా కూడా త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది. చదవండి: మే 9 వెరీ స్పెషల్ డే ఎందుకంటే? పెయింటింగ్... కుకింగ్.. డ్యాన్సింగ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_831249961.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అన్ని హర్రర్ సినిమాల కన్నా భిన్నంగా..
రాజ్బాల, మానస హీరోహీరోయిన్లుగా రమేష్ వీభూది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చిత్రం x’. శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ బ్యానర్లో, బేబీ రాజశ్రీ సమర్పణలో పొలం గోవిందయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమా ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. కొత్త దర్శకులైనా, మంచి కంటెంట్తో సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి కంటెంట్తో తెరకెక్కినట్లు తెలుస్తోందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. (ప్రభాస్ షూటింగ్ ఆగేది లేదు) నిర్మాత పొలం గోవిందయ్య మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరిగారికి ధన్యవాదాలు. డైరెక్టర్ చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. ఖచ్చితంగా మంచి విజయం సాధింస్తుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు రమేష్ వీభూది మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకు ప్రేక్షకులు అన్ని భాషల్లో వచ్చిన ఎన్నో హర్రర్ ఫిలిమ్స్ చూసి ఉంటారు. మా సినిమా వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అవసరమైనచోట గ్రాఫిక్స్ కూడా వాడాము. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు. (భారీ గ్రాఫిక్స్తో వస్తున్న ‘అంగుళీక’) హీరో రాజ్ బాల మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాలో నాకు హీరోగా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. భయంకరమైన అడవిలో నెల రోజుల పాటు ఈ సినిమా కోసం పని చేశాము. చిత్రీకరణ పూర్తయింది. నటీనటులందరం ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించాము. సినిమా సూపర్గా వచ్చింది. పాటలు, ఫైట్స్ అదిరిపోతాయి’’ అన్నారు. ఈ చిత్రంలో పలాస శ్రీను, బాచి, సునీల్ రావినూతల, శ్యాం పిల్లలమర్రి తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె కావలి, మ్యూజిక్: శివ ప్రణయ్, డాన్స్: కపిల్ మాస్టర్, ఫైట్స్: అంజి మాస్టర్. -
హారర్ కథ
సంగీత దర్శకుడు మున్నాకాశి హీరోగా నటించి, దర్వకత్వం వహించిన చిత్రం ‘హేజా’. ఏ మ్యూజికల్ హారర్ అనేది ట్యాగ్లైన్. కేవీయస్ఎన్ మూర్తి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మున్నాకాశి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ద్వారా హీరోగా, దర్శకునిగా పరిచయం అవుతున్నాను. మంచి కథాంశంతో రూపొందించిన మ్యూజికల్ హారర్ మూవీ ఇది. ఈ సినిమాకి సంగీతం, నేపథ్య సంగీతం హైలెట్గా ఉంటాయి’’ అన్నారు. కో–ప్రొడ్యూసర్ వి.యన్ వోలేటి మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది. ఎంతో క్లారిటీతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది’’ అన్నారు. తనికెళ్ల భరణి, ముమైత్ఖాన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. -
తొలి పరిచయం
తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేసి మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు తమన్నా. నార్త్ టు సౌత్ తమన్నా అందరికీ పరిచయం. కానీ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి తొలి పరిచయం కాబోతున్నారు. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న తమన్నా తొలిసారి మలయాళంలో స్ట్రయిట్ మూవీ చేస్తున్నారు. గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా మలయాళంలో కనిపించారామె. ఇప్పుడు తొలి స్ట్రయిట్ సినిమాతోనే ప్రేక్షకులను భయపెడతానంటున్నారు. ‘సెంట్రల్ జైలిలే ప్రేతం’ (సెంట్రల్ జైల్లో దెయ్యం అని తెలుగు అర్థం) అనే హారర్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు తమన్నా. కథ మొత్తం ఓ సెంట్రల్ జైల్, అందులో ఉండే దెయ్యాల చుట్టూ తిరుగుతుందట. ఇందులో మలయాళ, తమిళ స్టార్స్ యాక్ట్ చేయనున్నారు. సంధ్యా మీనన్ దర్శకురాలు. -
ఇక షురూ...
ఈ రోజు (శుక్రవారం) నుంచి షురూ అంటున్నారు జాన్వీ కపూర్. తన కొత్త చిత్రం గురించే జాన్వీ కపూర్ ఇలా చెబుతున్నారు. ఆమె కథానాయికగా నటిస్తున్న హారర్ మూవీ ‘రూహీ అఫ్జా’ శుక్రవారం మొదలైంది. ఇందులో రాజ్కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నారు. హార్థిక్ మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ శర్మ కీలక పాత్రధారి. దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం మొదలైంది. ‘‘సినిమా అభిమానులందరూ శ్రద్ధగా ఆలకించండి. నా తర్వాతి హిందీ చిత్రం ఈ రోజు మొదలైంది’’ అని జాన్వీ కపూర్ అన్నారు. ఈ సినిమా కాకుండా వీరవనిత గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కార్గిల్ గాళ్’ సినిమాలోనూ నటిస్తున్నారు జాన్వీ కపూర్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. -
‘మోహిని’ ట్రైలర్ విడుదల
చిత్రసీమలో హారర్ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. సరైన కథా కథనం సరిగా లేకపోతే బెడిసికొడుతుంది. దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు ఇలా ఒకప్పటి కథలతో సినిమాలను తీసినా.. కథనం మాత్రం ఈతరానికి నచ్చేవిధంగా.. కాస్త కామెడీ టచ్ ఇస్తే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ప్రేమ కథా చిత్రమ్, ఆనందో బ్రహ్మ, రాజు గారి గది ఇలా ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి. గతంలో త్రిష నాయకి అంటూ హారర్ మూవీ చేశారు. కానీ ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా త్రిష మరో హారర్ సినిమాలో నటిస్తున్నారు. మోహినిగా త్రిష నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఫారెన్ లొకేషన్లలో జరిగినట్టు కనిపిస్తోంది. వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించగా, ఆర్ మధేష్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్, జాకీ, తమిళ హాస్య నటుడు యోగీ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ జూలై 27న విడుదల కానుంది. -
‘దెయ్యాలున్నాయని నిరూపిస్తే 5కోట్లు’
జబర్దస్త్ యాంకర్ రష్మీ హీరోయిన్గా సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. జబర్తస్త్లో ఫేమస్ కాకముందు నుంచే సిల్వర్ స్క్రిన్పై చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మి ‘గుంటూరు టాకీస్’ సినిమాలో నటించి మెప్పించారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపును తీసుకురాలేదు. అయితే మళ్లీ రష్మి హీరోయిన్గా ‘అంతకు మించి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ను ఈరోజు (జూలై 9) విడుదల చేశారు. దెయ్యాలున్నాయని నిరూపిస్తే ఐదు కోట్లు ఇస్తారన్న ప్రకటన చూసిన హీరో.. ఆ ప్రయత్నంలో ఉండగా హీరోయిన్తో పరిచయం.. నిజంగా దెయ్యాలున్నాయా? ఆ హీరోకు ఎదురైన పరిస్థితులు ఏంటి అన్న ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ను కట్ చేశారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు జానీదర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. -
స్టన్నింగ్ సర్ప్రైజ్
అవును.. కథానాయిక నయనతార నటించబోయే కొత్త సినిమాలో స్టన్నింగ్ సర్ప్రైజ్ ఏదో ఉందట. మరి.. ఆ సర్ప్రైజ్ తాలూకు డీటేల్స్ ఏమైనా లీక్ అయ్యాయా? అంటే.. ఇది హారర్ బేస్డ్ అండ్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అట. మణిరత్నం, మురుగదాస్ వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన కేఎమ్. సర్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ షార్ట్ ఫిల్మ్స్ ‘మా’, లక్ష్మి’లకు ఈయనే దర్శకుడు. నయనతారతో ఆయన తెరకెక్కిస్తున్న తాజా సినిమా షూటింగ్ మొదలైంది. గతేడాది నయనతార నటించిన ‘ఆరమ్’ సినిమాను నిర్మించిన కేజేఆర్ స్టూడియో సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘‘నయనతార ముఖ్య తారగా మా సంస్థలో మరో చిత్రం మొదలైనందుకు ఆనందంగా ఉంది. యంగ్ టీమ్ కూడా తోడైంది. కొన్ని స్టన్నింగ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని గ్యారంటీగా చెప్పగలం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటుల వివరాలను చిత్రబృందం ప్రస్తుతానికి పేర్కొనలేదు. ఈ సినిమాతో కలిపి నయనతార చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. -
మళ్లీ దడిపిస్తానంటున్న అంజలి!
పాత కథలే అయినా కొత్తగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అదే హారర్ సినిమాల విషయాలకొస్తే... కథలో కొత్తదనం లేకపోయినా... తెరకెక్కించే విధానం, మధ్యలో హాస్యాన్ని జోడించడం లాంటివి చేస్తే హారర్ మూవీలు విజయాన్ని సాధిస్తాయి. ప్రేమ కథా చిత్రమ్, ఆనందో బ్రహ్మ, గీతాంజలి లాంటి సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. భారీ తారాగణం లేకపోయినా భారీ స్థాయి విజయాన్ని అందుకోవచ్చని అంజలి హీరోయిన్గా తెరకెక్కిన ‘గీతాంజలి’ నిరూపించింది. ప్రస్తుతం హీరోయిన్ అంజలి మరో హారర్ మూవీలో నటించనున్నట్లు పేర్కొన్నారు. త్రీడీలో తెరకెక్కుతున్న ‘లీసా’ సినిమాలో లీడ్ రోల్ను చేయనున్నట్లు అంజలి తెలిపారు. సరికొత్త కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం... తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు. Me as Lisaa 🤗,, my next tamil #ANJALIasLISAA pic.twitter.com/rGzdpnTs4m — Anjali (@yoursanjali) May 21, 2018 -
సిద్ధార్థతో దివ్యాన్షా రొమాన్స్
తమిళసినిమా: నటుడు సిద్ధార్థ్ ఆ మధ్య అపజయాలతో వెనుకపడడంతో ఆలోచనలో పడ్డారు. కాస్త గ్యాప్ తీసుకుని ‘అవళ్’అంటూ హారర్ చిత్రాన్ని నమ్ముకుని సక్సెస్ అయ్యారు. ఇకపై తప్పటడుగు వేయరాదంటూ చిత్రాల ఎంపికలో జాగ్రత్త పడుతున్న ఈ యువనటుడు ప్రస్తుతం కప్పల్ చిత్రం ఫేమ్ కార్తీక్ జీ.క్రిష్ దర్శకత్వంలో ‘సైతాన్ కీ బచ్చా’చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాకముందే అదే దర్శకుడితో మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ చిత్రం కూడా షూటింగ్ జరుపుకుంటోందట. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ మోడల్ దివ్యాన్షా కౌషిక్ హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అవుతోంది. ఈ విషయాన్ని ఈ అమ్మడే చెప్పింది. తాను ఇటీవలే నిర్మాత సుధన్ను కలిశానని, ఆయన నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకిగా ఎంపిక కావడానికి ఆడిషన్, ఫోటో షూట్లో కూడా పాల్గొన్నానని చెప్పింది. అంతే కాదు చిత్ర షూటింగ్లో కూడా పాల్గొంటున్నానని ఇందులో నటిండం చాలా ఫన్గా ఉందని అంది. ఈ చిత్రంలో చాలా మోడరన్ లుక్లో కనిసించే అనార్థోడాక్స్ యువతి పాత్రలో నటిస్తున్నానని, ఇంతకంటేఎక్కువ పాత్ర గురించి చెప్పకూడదని పేర్కొంది. అయితే ఈ పాత్ర తన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉందనిపిస్తోందని చెప్పింది. తమిళ చిత్రంలో నటించడానికి తనకు భాష సమస్య అనిపించడం లేదంది. ఎందుకంటే మూడు నాలుగు రోజుల ముందే చిత్ర స్క్రిప్ట్ను తెప్పించుకుని ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పింది. చిత్ర టీం కూడా ఆడియో క్లిప్పింగ్స్ పంపుతున్నారని, కాబట్టి తమిళం సంభాషణలు ఉచ్చరించడం తనకేమంత కష్టం అనిపించడం లేదంది. దర్శకుడు కార్తీక్ జీ.క్రిష్, నటుడు సిద్ధార్థ తనకు కావలసిని సమయాన్ని ఇస్తున్నారని, అందువల్ల తనకు ఇంటి వద్ద ఉన్న ఫీలింగే కలుగుతోందని దివ్యాన్షా కౌశిక్ చెప్పుకొచ్చింది. చూద్దాం ఈ అమ్మడి టైమ్ ఇక్కడ ఎలా ఉంటుందో! -
మరో హర్రర్ చిత్రంలో..
తమిళసినిమా: మరో హర్రర్ కథా చిత్రంలో నటించడానికి నటి నయనతార రెడీ అవుతున్నారా? అవుననే టాక్ వినిపిస్తోంది. ఈ తారను లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా మార్చిన చిత్రం మాయ. ఇది హర్రర్తో కూడిన మిస్టరీ కథా చిత్రం. సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తరువాత నయనతార రేంజే మారిపోయిందని చెప్పాలి. అయితే ఆ తరువాత నటించిన డోర చిత్రం నిరాశపరచినా, నయనతార కెరీర్కు పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. ఇక ఈ మధ్య నటించిన అరమ్ చిత్రం నయనతారకు లేడీ సూపర్స్టార్ స్థాయినే తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్లో నయనతారకు ఆ తరహా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే కొలమావు కోకిల, కొలైయుధీర్ కాలం, అరివళగన్ దర్శకత్వంలో చిత్రం అంటూ నటిస్తున్న నయనతార తాజాగా మరో హర్రర్ మిస్టరీ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. బాలీవుడ్లో సంచలన నటి అనుష్కశర్మ కథానాయకిగా నటించి సొంతంగా నిర్మించిన పరి అనే హర్రర్ కథా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. దీనికి ప్రాజిట్రాయ్ దర్శకుడు. ఆయనిప్పుడు పరి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఇందులో నయనతారను అనుష్కశర్మ పాత్రలో నటింపజేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇదే విధంగా ఇప్పటికే హిందీలో మంచి విజయాన్ని సాధించిన తుమ్హారి సులు చిత్రం తమిళంలో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. హిందీలో నటి విద్యాబాలన్ పోషించిన పాత్రలో జ్యోతిక నటించడానికి రెడీ అవుతున్నారు. దీనికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా మన కథానాయికలు హిందీ చిత్రాల రీమేక్లపై ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. -
మరోసారి దెయ్యం కథతో నయన్
తమిళసినిమా: హర్రర్ చిత్రాలు లాభాలను తెచ్చిపెడుతున్న రోజులివి. అంతేకాకుండా అగ్రతార నయనతారకు కలిసొచ్చిన ట్రెండీ కథలు కూడా. మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియంటెడ్ నాయకిగా టర్న్ అయిన ఈ సంచలన నటికి ఆ చిత్రం సక్సెస్ను అందించింది. అలాంటి కథతో తెరకెక్కిన ‘డోర’ చిత్రం ఆశించిన విజయాన్ని అందించనప్పటికీ నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ‘అరమ్’ చిత్రంతో నయన్ స్థాయి మరింత పెరిగింది. దీంతో మళ్లీ హర్రర్ కథలో నటించడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. సార్జన్ అనే వర్థమాన దర్శకుడు మోగాఫోన్ పట్టనున్నాడు. ఈయన ఇటీవల ‘మా’అనే లఘు చిత్రంతో సామాజిక మాద్యమాలు, సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు. అంతకు ముందు కూడా లక్ష్మీ అనే లఘు చిత్రాన్ని రూపొందించి అభినందనలు అందుకున్నారు. తాజాగా ఈయన నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హెచ్చరికై ఇది మనిదర్గళ్ నడమాడుం ఇడం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అరమ్, గులేబకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజీఆర్ స్టూడియోస్ సంస్థ మూడో చిత్ర నిర్మాణానికి సిద్ధమైంది. అరమ్ తరువాత మరోసారి నయన్తో హర్రర్ కథా చిత్రాన్ని రూపొందించనుంది. దీనికి సార్జాన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోమవారం అధికారికంగా వెల్లడించారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయన్ను వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు వరించడం విశేషం. నయన్ నటించిన తరువాత విడుదలయ్యే చిత్రం ఇమైకా నోడిగళ్ అవుతుందని సమాచారం. ఇందులో ఈ బ్యూటీ సీబీఐ అధికారిగా నటిం చారు. -
అనగనగా ఓ దెయ్యం
‘‘ఇప్పటివరకూ ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. కానీ, మా ‘దెయ్యం చెప్పిన కథ’ చిత్రం హారర్ సినిమాలకు కేరాఫ్గా నిలుస్తుంది. మూస ధోరణి కాకుండా విభిన్నమైన కథా, కథనాలతో పూర్తి హారర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం’’ అని దర్శకుడు ప్రదీప్ అన్నారు. నూతన నటీనటులతో ఆయన దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎస్వీయన్రావు సారథ్యంలో ఆరాధ్య ప్రొడక్షన్స్ పతాకంపై పెనాక దయాకర్రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘దెయ్యం ప్రధాన పాత్రగా సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసేలా ఉంటుంది. అన్ని సినిమాల్లాగా కమర్షియల్ హంగులు, సెట్టింగులు ఉండవు. ఈ చిత్రం ద్వారా 29 మంది కొత్తవారిని పరిచయం చేయబోతున్నాం. హీరోయిన్ అరోహి బాగా యాక్ట్ చేసింది’’ అన్నారు. ‘‘చిన్న బడ్జెట్లో ప్రదీప్ ఈ సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారు. చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నాం. ప్రదీప్ దర్శకత్వంలోనే ‘దెయ్యంతో ఓ రాత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నాం’’ అన్నారు దయాకర్రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: నవీన్ .జె, కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం: ప్రదీప్. -
సినిమా చూస్తూ బాల్కనీ నుంచి దూకేసిన నటుడు
-
చిరంజీవిగారు నాకు ఇన్స్పిరేషన్
‘‘తేజాగారి ‘హోరా హోరీ’ హీరోగా నా ఫస్ట్ మూవీ. ఆయన దగ్గర పని చేయడం స్కూల్కి వెళ్లడం లాంటిది. రెండో సినిమా ‘మాయామాల్’ హీరోగా నాకు మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దిలీప్కుమార్. గోవింద్ లాలం దర్శకత్వంలో నల్లం శ్రీనివాస్, కేవీ హరికృష్ణ నిర్మించిన ‘మాయామాల్’ ఈ నెల 14న విడుదల కానుంది. దిలీప్కుమార్ మాట్లాడుతూ – ‘‘గోవింద్ చెప్పిన కథ చాలా నచ్చింది. మంచి థ్రిల్లర్ ఎంటర్టైనర్. ఓ ఛేజ్తో వైజాగ్లో స్టార్టయి హైదరాబాద్ చేరుకుంటాం. షెల్టర్ కోసం ఓ మాల్లోకి ఎంటరవుతాం. సినిమాలోని ఇతర పాత్రలు కూడా ఎంటర్ అవుతాయి. ఆ రాత్రి నుంచి మరుసటిరోజు ఉదయం వరకు ఏం జరిగిందనేదే కథ. హారర్ అండ్ థ్రిల్ జోనర్ మూవీ. ఒకే ఒక్క పాట, రెండు ఫైట్స్ ఉంటాయి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమాలంటే ఇష్టం. చిరంజీవిగారి అభిమానిని. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. సత్యానంద్గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్కి కావల్సినవన్నీ మినిమమ్ నేర్చుకుని, తర్వాత వచ్చాను’’ అని చెప్పారు. ‘‘సేమ్ బ్యానర్లో ఒక సినిమా డిస్కషన్ జరుగుతోంది. ఇంకో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి’’ అన్నారు దిలీప్. -
రిస్క్లోనే కిక్!
సాగర గర్భంలో ఈత అంటే, స్విమ్మింగ్పూల్లో ఈదినంత సులువు కాదనే విషయం అందరికీ తెలిసిందే. తెలిసినప్పటికీ రిస్క్ చేసేవాళ్లు కొంతమంది ఉంటారు. దాని కోసం పని గట్టుకుని స్క్యూబా డైవింగ్ నేర్చుకుంటారు. సాగరంలో జలచరాలను చూసి, ఆనందించేస్తారు. ఇలాంటి ఆనందాన్ని త్రిష చాలాసార్లు పొందారు. రిస్క్లో ఓ కిక్ ఉందంటారామె. స్నేహితులతో విదేశీ యాత్రలకు వెళ్లినప్పుడు స్క్యూబా డైవింగ్ చేయకుండా దాదాపు వెనక్కి రారు. అదంతా సరదా కోసం అయితే ఇప్పుడు సినిమా కోసం చేశారు. త్రిష టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మోహిని’. రమణ మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ మూవీ ఇది. ఈ చిత్రం కోసం నీటి లోపల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శకుడు చెప్పగానే, త్రిష ఓకే అనేశారు. ఆ సీన్స్ని ఇటీవల చిత్రీకరించారు. ఆ సమయంలో సాగరంలో దర్శకుడితో ఓ ఫొటో కూడా దిగారు. ‘‘నీటి లోపల మా డెరైక్టర్తో సరదాగా’’ అని ఈ సందర్భంగా త్రిష పేర్కొన్నారు. సినిమా కోసం ఎలాంటి రిస్కులైనా తీసుకోవడానికి ఇష్టపడే ఈ బ్యూటీ ఆ రిస్కులంటే తనకు బోల్డంత ఇష్టం అంటున్నారు. అంత ఇష్టంగా నటిస్తారు కాబట్టే, కథానాయిక అయ్యి పదమూడేళ్లయినా ‘నాట్ అవుట్’ అని చెప్పొచ్చు. -
ఉత్కంఠకు గురి చేసేలా...
‘ఈరోజుల్లో’ ఫేమ్ శ్రీ, రవిబాబు, నాగేంద్రబాబు, సన, షాలిని ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం - ‘త్రివిక్రమన్’. స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగోను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టైటిల్ లోగోను చినబాబు, ట్రైలర్ను రఘురామ కృష్ణంరాజు విడుదల చేశారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ- ‘‘భిన్నమైన హర్రర్ కథ ఇది. చిత్రీకరణ సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర య్యాయి. కస్తూరి శ్రీని వాస్ సహకారంతో సహ నిర్మాత రామ కృషాణరావు పరిచ యమై నన్ను ముందుకు నడిపిం చారు’’ అన్నారు. శ్రీ, సంగీత దర్శకుడు రుంకీ గోస్వామి పాల్గొన్నారు. దర్శకత్వ పర్యవేక్షణ: కస్తూరి శ్రీనివాస్, సహ నిర్మాత: తోటకూర రామకృష్ణారావు. -
ఇటు హారర్ కామెడీ... అటు ప్యూర్ కామెడీ
‘అల్లరి’ నరేశ్ను ‘సీమశాస్త్రి’గా, ‘సీమటపాకాయ్’గా చూపించిన దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఇప్పుడు ‘ఇంట్లో దెయ్యం.. నాకేంభయం’ అనే హారర్ చిత్రంతో హ్యాట్రిక్ మీద గురిపెట్టారు. బీవీయస్యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 23న ప్రారంభమైంది. ఈ హారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని విజయదశమికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కృతిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: భోగవల్లి బాపినీడు. కృష్ణభగవాన్ కథతో... ‘అల్లరి’ నరేశ్ పంచ్ డైలాగ్.. కృష్ణభగవాన్ కౌంటర్ డైలాగ్.. భలే కామెడీ కాంబినేషన్ ఇది. కృష్ణభగవాన్లో కమెడియన్తో పాటు మంచి రచయిత కూడా ఉన్నారు. అందుకు ఓ నిదర్శనం ‘డిటెక్టివ్ నారద’. ఆ సినిమా స్క్రిప్ట్ రాసిందీయనే. కొంత విరామం తర్వాత ‘అల్లరి’ నరేశ్ కోసం కృష్ణభగవాన్ పూర్తి స్థాయి కామెడీ కథ రాశారు. ఈ చిత్రాన్ని శ్రీమతి నీలిమ సమర్పణలో జాహ్నవి ఫిలింస్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మించనున్నారు. ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్కృష్ణ దర్శకుడు. -
దెయ్యంగా రెజీనా!
ఆశించినవి జరగవు. అయితే జరిగే వాటిని అనుకూలంగా మార్చుకోవడం బుద్ధిమంతుల లక్షణం అంటారు. నటి రెజీనా ఇప్పుడు ఈ మంత్రాన్నే పాఠిస్తున్నారు. కేడీబిల్లా కిలాడిరంగా చిత్రంతో కోలీవుడ్కు పరిచయం అయిన నటి రెజీనా. ఆ చిత్రం విజయం సాధించినా ఆ తరువాత ఈ అమ్మడికి ఇక్కడ అంత ఆశాభావ పరిస్థితులు కనిపించలేదు. కారణం అందాలారబోతకు తాను దూరం అంటూ మడికట్టుకు కూర్చోవడమే. సహ నటీమణులు గ్లామర్లో దుమ్మురేపుతుంటే తాను కుటుంబ కథాపాత్రలనే చేస్తానన్న రెజీనాను కోలీవుడ్ దూరంగా పెట్టింది. దీంతో ఈ భామ టాలీవుడ్పై దృష్టి సారించారు.అక్కడ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. అవకాశాలతో పాటు విజయాలు వరిస్తున్నాయి. అయినా తమిళంలో నెగ్గలేకపోయాననే చింత రెజీనాను ఒక పక్క వెంటాడుతూనే ఉంది. దీంతో తన హద్దులను చెరిపేయడానికి సిద్ధపడి సొంతంగా ఫొటో సెషన్ను ఏర్పాటు చేసుకుని హాట్ హాట్ ఫొటోలను వెబ్సైట్లో పెట్టి గ్లామర్ పాత్రలకు సై అంటూ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.అయితే అలాంటి గ్లామరస్ ఫొటోలు పబ్లిసిటీకి పనికొచ్చాయిగానీ అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఒక అవకాశాన్ని కోలీవుడ్లో రెజీనా రాబట్టుకుంది.అదీ సంచలన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంలో చాలా ఖుషీ అయిపోయారు. ఈ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని కోలీవుడ్లో పరిక్షించుకోవచ్చునని భావించారు.సెల్వరాఘవన్ చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం నెంజమ్ మరప్పదిల్లై. ఎస్జే.సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నందిత నాయికలుగా నటిస్తున్నారు. అయితే ఆ చిత్రంలో అందాలను ఆరబోసి మరిన్ని అవకాశాలను రాబట్టుకోవాలని ఆశ పడిన రెజీనాకు ఆ అవకాశం లేకపోయిందట. కారణం ఇందులో ఆమెను సెల్వరాఘవన్ దెయ్యంగా చూపించడమే. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి దెయ్యం కథా చిత్రం ఇదేనన్నది గమనార్హం. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను మంగళవారం ఇంటర్నెట్లో విడుదల చేశారు. -
హర్రర్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి
హార్రర్ సినిమా చూడాలన్న ఉత్సాహం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇటీవల విడుదలైన హాలీవుడ్ హార్రర్ మూవీ ద కంజూరింగ్ 2ను చూస్తూ 68 ఏళ్ల పెద్దమనిషి మరణించాడు. తమిళనాడులోని తిరువణ్ణామలై పట్టణంలో ఈ సంఘటన జరిగింది. తిరువణ్ణామలైలోని శ్రీ బాలసుబ్రమణియర్ సినిమాస్ లో ప్రదర్శింపబడుతున్న ద కంజూరింగ్ 2 సినిమాను చూడటానికి కడప జిల్లాకు చెందిన జి రామ్ మోహన్, ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి వెళ్లాడు. సినిమా అంతా ప్రశాంతంగానే చూసిన రామ్ మోహన్కు క్లైమాక్స్ సమీపించే సరికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్న దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. రామ్ మోహన్ను పరీక్షించిన వైధ్యులు అప్పటికే చనిపోయినట్టుగా తెలిపారు. గతంలోనే ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉందని అలా, గుండె సంబందిత వ్యాధులు ఉన్న వారు హర్రర్ సినిమాలు చూడటం మంచికాదని డాక్టర్లు తెలిపారు. -
పక్కాగా ప్లాన్ చేశారు !
సుభాష్, నాగేష్, భవాని, యువరాణి ప్రధాన పాత్రల్లో రూపొందిన హారర్ చిత్రం ‘పక్కా ప్లానింగ్’. బేబీ దివ్య సమర్పణలో ఏవీ ఫణీశ్వర్ (తుఫాన్) దర్శకత్వంలో నాగేష్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్ను నిర్మాతలు టి. ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో చాలా చిత్రాలొచ్చాయి. ఈ చిత్రకథాంశం వాటికి భిన్నంగా ఉంటుంది. ఇందులో నటీనటులంతా కొత్తవారే అయినా, అనుభవం ఉన్న వారిలా నటించారు. నిర్మాత నాగేష్ పక్కా ప్రణాళిక, చిత్ర బృందం హార్డ్ వర్క్తో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయగలిగాం. ప్రేమ్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్’’ అని తెలిపారు. ‘‘త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత, హీరో నాగేష్ సీహెచ్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ప్రేమ్ ఎల్ఎమ్ పాల్గొన్నారు. -
నయన మరో మాయ చేస్తుందా?
నాయకిగా అగ్రస్థానంలో వెలుగొందుతున్న నటి నయనతార. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. శింబుతో రొమాన్స్ చేసిన ఇదునమ్మఆళు చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. జీవాతో జత కట్టిన తిరునాళ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా కార్తీ సరసన నటించిన కాష్మోరా, విక్రమ్కు జంటగా నటిస్తున్న ఇరుముగన్, తెలుగులో వెంకటేశ్తో బాబు బంగారం చిత్రాల షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఇక మోహన్రాజా దర్శకత్వంలో శివకార్త్తికేయన్తో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇవి కాక మరో నూతన చిత్రాన్ని అంగీకరించారు. ఈ బ్యూటీని రీఎంట్రీలో ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టిన చిత్రాల్లో మాయ ఒకటని చెప్పక తప్పదు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా నయన్కు మంచి విజయాన్ని అందించిన మాయ చిత్ర దర్శకుడు అశ్వన్ శరవణన్ తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ది హిందూ రంగరాజన్ మనవడు రోహిత్ రమేశ్ డబ్ల్యూఎఫ్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థతో కలిసి మో అనే చిత్రాన్ని నిర్మిస్తున్న మూమెంట్ ఎంటర్టెయిన్మెంట్పై నిర్మిస్తున్న జీఏ.హరిక్రిష్ణన్ మాయ చిత్ర దర్శకుడి తాజా చిత్రాన్ని భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాయ చిత్రాన్ని హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన అశ్విన్శరవణ న్ తాజా చిత్రాన్ని వేరే బ్యానర్లో రూపొందించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇదీ కథానాయకి చుట్టూ తిరిగే కథేనట. నాయకిది హిందీలో విద్యాబాలన్ నటించే తరహాలో చాలా బరువైన పాత్ర కావడంతో ఈ పాత్రలో నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం అరడజను చిత్రాలతో బిజీగా ఉన్న నయన్ మాయ చిత్ర దర్శకుడికి పచ్చజెండా ఊపుతారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తమ చిత్రంలో నటించే తారాగణాన్ని వెల్లడిస్తామంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. -
మరో హారర్ చిత్రంలో చెన్నై చిన్నది
33వ వసంతంలోకి అడుగు పెట్టి బుధవారం పుట్టిన రోజు జరుపుకున్న నటి త్రిషకు బర్త్డే గిఫ్ట్గా నూతన చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం నాయకి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయ్యే వరకూ మరో చిత్రం అంగీకరించని త్రిష ధనుష్తో నటిస్తున్న కొడి చిత్రాన్ని పూర్తి చేశారు. గత ఏడాది వరుసగా భూలోకం, తూంగావనం, అరణ్మణై-2 చిత్రాలతో విజయాలను తన ఖాతాలో వేసుకుందీ ముద్దుగుమ్మ. తాజా చిత్రాలు కొడి, నాయకిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వీటిలో నాయకి ద్విభాషా చిత్రం కాగా త్రిష ఇందులో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. నాయకి చిత్రం తరువాత ఈ బ్యూటీ నటించే చిత్రం ఏమిటన్న విషయం ఆసక్తిగా మారింది. తన తదుపరి చిత్రానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. నాయకి చిత్రం హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్రిష నటించే తదుపరి చిత్రం కూడా హారర్ కథా చిత్రమేననీ తెలిసింది. ఇంతకు ముందు విజయ్ హీరోగా మధురై అనే విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాత మాదేష్ తాజాగా త్రిష నాయకిగా హారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి అధికార పూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
దెయ్యంగా మారిన రెజీనా
దెయ్యంగా ఇక నటి రెజీనా వంతు వచ్చింది. ఇప్పటికే నయనతార, త్రిష, హన్సిక, ఆండ్రియా లాంటి ప్రముఖ తారలందరూ హారర్ చిత్రాలలో దెయ్యాలుగా నటించి సక్సెస్ అయ్యారు. తాజాగా నటి రెజీనా కూడా రెయ్యంగా మారిపోయింది. ఈ అమ్మడు దెయ్యంగా నటిస్తున్న చిత్రం నెంజం మరప్పదిల్లై. ఇంతకు ముందు కేడీబిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, రాజమందిరం తదితర చిత్రాలలో నటించిన రెజీనా ఆ తరువాత తన దృష్టిని టాలీవుడ్పైకి మరల్చింది. అక్కడ సాయి ధరమ్తేజ్ తదితర యువ నటులతో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనూహ్యంగా ఇప్పుడు మళ్లీ కోలీవుడ్లో బిజీ అవుతోంది. తమిళంలో నెంజం మరప్పదిల్లై, మానగరం, రాజతందిరం-2 మొదలగు మూడు చిత్రాలలో నటిస్తోంది. సంచలన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం నెంజం మరప్పదిల్లై. నాటి ఆణిముత్యం లాంటి పాట పల్లవిని టైటిల్గా నిర్ణయించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో కథానాయికలుగా రెజీనా, నందిని నటిస్తున్నారు. నటి రెజీనా ఈ చిత్రంలో తొలి సారిగా దెయ్యంగా నటించడం విశేషం. ఇందులో ఒక పాటలో ఈ అమ్మడు పలు గెటప్లలో భయపెట్టనుందట. ఈ పాటను ఆరు రోజుల పాటు చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ హారర్ కథా చిత్రంలో రెజీనా కు ప్రాధాన్యం ఉన్న పాత్ర అట.తెలుగులోనూ మంచి మర్కెట్ ఉండడంతో దర్శకుడు సెల్వరాఘవన్ నటి రెజీనాను దెయ్యం పాత్రకు ఎంపిక చేశారని సమాచారం. -
లేడీ అఘోరా!
వెండితెరపై నమిత కనిపించి దాదాపు నాలుగైదేళ్లు అయిపోయింది. ఈ బ్రేక్కి కారణం నమిత బరువు అని చెప్పొచ్చు. బొద్దుగా ఉన్నప్పుడు నమిత బాగానే ఉన్నా.. ఆ బొద్దు హద్దు దాటడంతో అవకాశాలు తగ్గాయి. అందుకే నమిత తగ్గారు. వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుని, తగ్గిన నమిత ఆ మధ్య ఓ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈవిడగార్ని చూసినవాళ్లందరూ ‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అని కితాబులిచ్చేశారు. ఇప్పుడు నమితకు అవకాశాలు కూడా మొదలయ్యాయి. ఇన్నేళ్ల విరామం తర్వాత ఆమె అంగీకరించిన మొదటి చిత్రం ‘పొట్టు’. ఇప్పటి వరకూ నమితను గ్లామరస్గా చూశాం. ఈ తమిళ చిత్రంలో ‘లేడీ అఘోరా’గా ఆమెను చూడనున్నాం. ఇది హారర్ మూవీ. వడివుడయన్ దర్శకత్వంలో నమిత, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, ఇనియా కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కథ, పాత్ర నచ్చి నమిత అంగీకరించారు. ఇందులో నమిత చుట్ట తాగుతారట. ‘‘నిజజీవితంలో నేను చుట్ట తాగను. అందుకని, ఈ సినిమాలో నేను వాడే సిగార్లో బొగ్గు పొడి నింపారు. దాన్నే కాలుస్తాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను’’ అని నమిత పేర్కొన్నారు. ఈ అందాల అఘోరా పాత్ర కోసం నమిత బ్లాక్ మేకప్ వేసుకుంటున్నారు. సో.. ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో తెల్లని నమితను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు బ్లాక్ బ్యూటీని చూడనున్నారన్నమాట. -
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో!
దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిని కూడా తన అందం, అభినయంతో ఉర్రూతలూగించిన కథానాయికల్లో జయప్రద ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ప్రేక్షకులతో నీరాజనాలందుకున్న జయప్రద తన రెండో ఇన్నింగ్స్లో అడపా దడపా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘మహారథి’ తర్వాత తెలుగులో ఆమె వేరే చిత్రాల్లో నటించలేదు. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఓ తెలుగు చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. పాప్కార్న్ స్పోర్ట్స్ ఎంటర్టైన్ మెంట్స్, వి.ఎస్.వి ప్రొడక్షన్స్ పతాకంపై నీరజ్వాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చీరాలలో ప్రారంభమైంది. ‘‘తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దుతున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నా. ఈ చిత్రనిర్మాత బాలగిరి నాకెప్పట్నుంచో తెలుసు’’ అన్నారు. చక్కని హాస్యం నేపథ్యంలో సాగే హారర్ మూవీ ఇదని దర్శకుడు తెలిపారు. సంగీతదర్శకుడు డబ్బూ మాలిక్ అందించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆయన తనయుడు అమాల్ మాలిక్ పాటలు స్వరపరుస్తున్నారు. -
రాజుగారి ఇంట్లో....
‘‘క్రైమ్ నేపథ్యంలో సాగే హారర్ చిత్రమిది. స్క్రీన్ప్లే చాలా బాగుంటుంది ’’ అని దర్శకుడు ఫిరోజ్ రాజ అన్నారు. భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై భరత్ కుమార్ పీలం నిర్మించిన ‘రాజుగారింట్లో 7వ రోజు’ సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ‘‘ఇది మంచి హారర్ ఫిలిం. మూవీ అవుట్పుట్ బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అని నిర్మాత అన్నారు. ‘‘టైటిల్ బాగుంది. ట్రైలర్స్, పాటలు కొత్తగా అనిపించాయి’’ అని మల్టీ డైమన్షన్ వాసు పేర్కొన్నారు. నిర్మాతలు ప్రసన్న కుమార్, శోభారాణి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కె. కుమార్, సంగీతం: కనిష్క్. -
మళ్లీ భయపెట్టడానికి రెడీ!
అందాలతార నయనతార ఈ మధ్య ఎక్కువ భయపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టున్నారు. ఆ మధ్య ‘మయూరి’ సినిమాలో బాగా భయపెట్టిన ఆమె మళ్లీ మరోసారి హారర్ చిత్రం చేస్తున్నారు. దాస్ రామస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని తెలుగులో మానస్ రుషి ఎంటర్ప్రైజస్ పతాకంపై కె. రోహిత్ అందిస్తున్నారు. ‘‘ లేడీ ఓరియంటెడ్ హారర్ డ్రామా ఎంటర్టైనర్గా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. త్వరలోనే టైటిల్, మిగితా వివరాలు ప్రకటిస్తాం ’’ అని సమర్పకుడు జూలకంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సజ్జూభాయ్ - రామ్ప్రసాద్ వి.వి.ఎన్. -
అవంతిక దెయ్యం అవుతుందట
సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్కి కేరాఫ్ అడ్రస్గా మారిన హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ తొలిసారిగా బాహుబలి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్తో ఆకట్టుకుంది. అదే జోరులో ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఓ హర్రర్ సినిమాలో దెయ్యంగా నటించడానికి అంగీకరించిందట మిల్కీ బ్యూటీ. ఇప్పటికే హన్సిక, నయనతార లాంటి టాప్ హీరోయిన్లు దెయ్యాలుగా భయపెట్టడంతో తాను కూడా అదే ఫార్ములాతో హిట్ కొట్టాలని భావిస్తోంది. కోలీవుడ్లో ఆసామి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆండాల్ రమేష్ దర్శకత్వంలో హర్రర్ సినిమాకు రెడీ అవుతోంది తమన్నా. గతంలో హర్రర్ సినిమాలో నటించిన తారలు కాకుండా కొత్తవారితో సినిమా చేయాలని భావించిన రమేష్ తమన్నాను సంప్రదించాడట. చాలా రోజులుగా డిఫరెంట్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ కూడా ఈ పాత్రలో నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తోంది. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వెలువడనుంది. -
హార్రర్ చిత్రంలో మిల్కీబ్యూటీ
దెయ్యం ఈ పదం ఇప్పుడు కోలీవుడ్లో కాసుల వర్షం కురిపిస్తోందని చెప్పవచ్చు. ఇక్కడ హార్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. విభిన్న హార్రర్ కథా చిత్రాల కథలను రెడీ చేసుకుంటున్న దర్శకులు అందులో ప్రముఖ నటీమణుల్ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. క్రేజీ నటి నయనతార నటించిన మాయ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ప్రస్తుతం టాప్ తారామణులు త్రిష, హన్సికల నుంచి రాయ్లక్ష్మి,లక్ష్మిమీనన్ వరకు హార్రర్ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా బాహుబలి చిత్రంలో సౌందర్యరాశిగా ప్రేక్షకులను మతులు పోగొట్టిన నటి తమన్నాను ఇప్పుడు దెయ్యంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే అలాంటి పాత్రలో ఆమె నటించి భయపెట్టిస్తారా? అన్నదే ప్రశ్న. అసలు విషయానికి వస్తే ఇంతకు ముందు ఆసామి, ఇన్నారుక్కు ఇన్నారెండ్రు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఆండాళ్ రమేశ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈయన ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్నే ఫాలో అవుతున్నారు. అయితే ఇది హార్రర్ కథా చిత్రం అయినా ఇప్పటి వరకూ తన కథ తరహా హార్రర్ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో చూసి ఉండరంటున్నారు. తాను 2012లో దర్శకత్వం వహించిన ఆసామి తమిళ ప్రభుత్వ అవార్డులకు ఎంపికైన 12 చిత్రాల్లో ఒకటిగా చోటు సంపాదించుకుందని తెలిపారు. దొంగస్వాముల మోసాలకు ప్రజలు గురి కావద్దు అన్న సందేశంతో రూపొందించిన చిత్రం అదన్నారు. ఇక ఇప్పడు తెరకెక్కించనున్న చిత్రంలో దెయ్యమే కథానాయకుడని తెలిపారు. కాథానాయికకూ ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు. ఆ పాత్రకు నటి తమన్నా అయితే బాగుంటుందని భావించామన్నారు.తనూ ఇంతకు ముందే హార్రర్ కథా చిత్రంలో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారని,అందువల్ల తమన్నాతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఒకవేళ ఆమె కాల్షీట్స్ సర్దుబాటు కాకుంటే నటి రాయ్లక్ష్మినిగానీ ఓవియను గానీ నాయకిగా ఎంపిక చేస్తామని దర్శకుడు ఆండాళ్ రమేశ్ అన్నారు. ఇందులో నాజర్, కోవైసరళ, సంతాన భారతి ముఖ్యపాత్రలు పోషించనున్నారని, చిత్ర షూటింగ్ సంక్రాంతి తరువాత ప్రారంభం అవుతుందని తెలిపారు. తమన్నా ప్రస్తుతం తమిళంలో శీను రామసామి దర్శకత్వంలో విజయ్సేతుపతికి జంటగా ధర్మదురై చిత్రంలో సక్కని పల్లెటూరి యువతిగా నటిస్తున్నారన్నది గమనార్హం. -
ఆ ముగ్గురి కలయికలో హార్రర్ చిత్రం
ఒక ఆసక్తికరమైన వార్త కోలీవుడ్లో తాజాగా హల్ చల్ చేస్తోంది. ముగ్గురు సంచలన దర్శకుల కలయికలో ఒక హార్రర్ చిత్రం తెరకెక్కనుందన్నదే వార్త. దర్శకుడు సెల్వరాఘవన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పలు విజయవంతమైన చిత్రాల సృష్టికర్త ఈయన. అదే విధంగా దర్శకుడు గౌతమ్మీనన్, ఎస్జే.సూర్య పలు సంచలన విజయాలను నమోదు చేసుకున్నవారే. అలాంటి ఈ ముగ్గురి కలయికలో ఒక చిత్రం రూపొందితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందుతున్న ఖాన్ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. అదే విధంగా గౌతమ్మీనన్ దర్శక నిర్మాతగా శింబు కథానాయకుడు తెరకెక్కుతున్న అచ్చం ఎంబదు మడమయడా చిత్రం నిర్మాణం శింబు బీప్ సాంగ్ ఇతర సమస్యల కారణంగా నత్త నడకన నడుస్తోంది. ఇక ఎస్ఏ.సూర్య దర్శకత్వంలో విజయ్ హీరోగా చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం జరిగినా, అది తెర రూపం దాల్చలేదు. ఇక సెల్వరాఘవన్ తన సోదరుడు ధనుష్ హీరోగా ఒక హారర్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆ ముగ్గురు దర్శకులు కలిసి చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్నది విశేషమే. ఈ దర్శక త్రయంలో సెల్వరాఘవన్ దర్శకుడుగా గౌతమ్మీనన్ నిర్మాణంలో ఎస్జే.సూర్య కథానాయకుడిగా ఈ చిత్రం తయారు కానుందని సమాచారం. ఇది ధనుష్తో చేయాలనుకున్న హార్రర్ కథతో తెరకెక్కనున్న చిత్రం అని కోలీవుడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రంలో నటించనున్న నాయకి, ఇతర నట వర్గం, సాంకేతిక బృందం వివరాలను త్వరలో దర్శకనిర్మాతలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
గిలిగింతలు పెట్టే ప్రేమ
హారర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మనసే మాయ’. సాయికిరణ్, ప్రాచి అధికారి జంటగా ఎం. బల్వాన్ దర్శకత్వంలో సునీల్సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘గిలిగింతలు పెట్టే ప్రేమకథతో పాటు ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లింగ్, హారర్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఇందులో ఉన్న ఏడు పాటల్లో మూడు పాటల చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలో మిగతా నాలుగు పాటలను పూర్తి చేస్తాం. డిసెంబరులో పాటలను, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.కె.మజ్నూ, ఛాయాగ్రహణం: ప్రసాద్, సహ-నిర్మాతలు: ఎం.భాగ్యలక్ష్మి, కె.ఫిష్లక్ష్మి. -
ఇప్పటివరకూ టచ్ చేయలేదు!
‘గీతాంజలి’తో ప్రేక్షకులను భయపెట్టిన కథానాయిక అంజలి తాజాగా మరో హారర్ చిత్రంతో తెర మీదకు రావడానికి రెడీ అవుతున్నారు. సినిమా పేరు - ‘చిత్రాంగద’. గతంలో ‘పిల్ల జమీందార్’ తీసిన జి. అశోక్ దర్శకత్వంలో అంజలి కథానాయికగా గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ వేడుక మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ‘‘అమెరికాలో తొమ్మిది రాష్ట్రాల్లో చిత్రీ కరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రమిది. ఇలాంటి కథాంశాన్ని ఎవరూ టచ్ చేయ లేదు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు చెప్పారు. అంజలి మాట్లాడుతూ, ‘‘ ‘గీతాంజలి’ తర్వాత హారర్ సినిమా చేయకూడ దనుకున్నా. కానీ అశోక్గారు చెప్పిన కథ డిఫరెంట్గా అనిపించింది. ఈ సినిమాలో కొత్త అంజలిని చూస్తారు’’ అన్నారు. నవంబర్ ఆఖరులో పాటల్నీ, డిసెంబరులో చిత్రాన్నీ విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
మరో హారర్ చిత్రం - షీ...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోదరుని కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్రావు నిర్మిస్తున్న ‘షీ’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పర్స రమేశ్ మహేంద్ర దర్శకుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘హీరో ఎప్పుడూ తనకు దెయ్యం పడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూంటాడు... అతనికి దెయ్యం పట్టిందా లేదా అనే కథాంశంతో ఈ చిత్రాన్ని ఎంటర్టైనర్గా రూపొందించ నున్నాం’’అని తెలిపారు. -
భయపడనివారికి 5 లక్షలు!
ఇన్నాళ్లూ తన అందాలతో ఆకట్టుకున్న నయనతార తొలిసారిగా భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆమె తమిళంలో నటించిన హారర్ చిత్రం ‘మాయ’ తెలుగులో ‘మయూరి’గా రానుంది. అశ్విన్ శరవణన్ డెరైక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మాత సి.కల్యాణ్ తెలుగులో అందిస్తు న్నారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ఇందులో ఇద్దరు నయన తారలుంటారు. ఒకరు మయూరి, ఇంకొకరు మాయ. ఎవరైనా ఈ చిత్రాన్ని ఒంటరిగా చూస్తూ, బీపీ పెరగన ట్లయితే, 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం. ఈ సినిమా చూస్తే, ఒక ఇంగ్లీషు సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. ఇందులో నయనతార ఒక బిడ్డకు తల్లిగా నటించారు. సినిమా థ్రిల్లింగ్గా ఉంటూ, అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాన్ ఎథన్ యోహాన్, ఛాయా గ్రహణం: సత్యన్ సూర్యన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోనేరు కల్పన. -
హర్రర్ చిత్రంలో విశాకాసింగ్
కోలీవుడ్ హర్రర్ చిత్రాల హవా నడుస్తోందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే సాధారణంగా ఈ తరహా చిత్రాల్లో కథ,కథనాల కే ప్రాధాన్యం ఉంటుంది. కనుక దర్శకనిర్మాతలు ప్రముఖ నటీనటుల జోలికి పోరు. అలాంటిది ఈ మధ్య వారిని వదలడం లేదు. ఇంకా చెప్పాలంటే చంద్రముఖి హర్రర్ కథా చిత్రమే. అందులో సూపర్స్టార్ రజనీకాత్ నటించిన విషయం గమనార్హం.అలాగే నటుడు సూర్య దెయ్యం ఇతి వృత్తంతో కూడిన మాస్ చిత్రంలో నటించారు. నయనతార మాయ అంటూ హర్రర్ సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి నటి విశాకాసింగ్ చేరింది. కన్నాలడ్డు తిన్న ఆశయా చిత్రంతో కోలీవుడ్కు దిగుమతి అయిన ఈ బ్యూటీకి ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది.అయితే ఆ తరువాతే అవకాశాలు రాలేదు. నటి ప్రియా ఆనంద్ సిఫారసు మేరకు ఒక్క ఊరుల రెండు రాజా చిత్రంలో చిన్న పాత్ర చేసింది. బహుశా అదే ఆమె చేసిన పెద్ద తప్పు కావచ్చు.ఆ తరువాత పూర్తిగా కోలీవుడ్కు దూరమైంది. అలాంటి భామను వెతికి మళ్లీ తీసుకొస్తున్నారు నవ దర్శకుడు మణిశర్మ. ఈరం చిత్ర దర్శకుడు అరివళగన్ శిష్యుడైన ఈయన ఒక హర్రర్ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టనున్నారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని అంటున్నారాయన. విశాకాసింగ్కు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుందంటున్నారు. త్వరలో సెట్పైకి వెళ్లడానికి సిద్ధం అవుతున్న ఈ చిత్రంలో నటించే హీరో, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని వెల్లడించారు. -
అందంగా కనిపిస్తాను
ఇక పై విభిన్న నందితను చూస్తారంటోంది నందిత. అట్టకత్తి చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తమిళ ప్రేక్షకుల నుంచి పక్కింటి అమ్మాయిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం చేతిలో రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్న నందిత త్వరలో హార్రర్ చిత్రంలో భయపెట్టడానికి సిద్ధం అవుతోంది. యువనటుడు శివ హీరోగా నటించనున్న ఈ చిత్రం ఏప్రిల్లో సెట్పైకి రానుంది. ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో ఉప్పుకరువాడు చిత్రంతో పాటు భరత్బాలా శిష్యుడు రాజశేఖర్ మోగాఫోన్ పట్టిన నూతన చిత్రంలో నటిస్తోంది. వీటి గురించి నందిత మాట్లాడుతూ ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా చూసిన తనను ఇకైపై విభిన్న పాత్రల్లో చూస్తారంది. ఉప్పుకరువాడు చిత్రంలో తన పాత్రను దర్శకుడు రాధామోహన్ చాలా కొత్తగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది. నవ దర్శకుడు రాజశేఖర్ చిత్రంలో నాగరికతతో కూడిన గ్లామరస్ పాత్రను పోషిస్తునట్లు చెప్పింది. ఈ పాత్రలో తాను కలర్ఫుల్ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తానని నందిత చెబుతోంది. -
చంద్రకళగా భయపెట్టిన హన్సిక
-
నేనూ నా దెయ్యాలు!
పుస్తకోత్సాహం ఎన్నో ప్రసిద్ధ నవలలు సినిమాలుగా వచ్చి హిట్ సాధించాయి. ‘సినిమాలను నవలలుగా మలిస్తే ఆ నవలలు ఎందుకు హిట్ అవ్వవు?’ అనుకున్నాడో ఏమో బాలీవుడ్ డెరైక్టర్ విక్రమ్భట్ తన రాబోవు చిత్రం ‘కామోషియన్’తో సహా గత చిత్రాలు ‘1920’ ‘1920-ఈవిల్ రిటర్న్స్’ చిత్రాలను నవలుగా మలుస్తున్నారు. ఈ నవలలలో గతంలో ఎవరూ చూడని ఫోటోలు, గతంలో ఎవరికీ చెప్పని విషయాలను ఇస్తున్నారు. ‘‘యువ పాఠకుల నుంచి నా పుస్తకాలకు ఆదరణ లభిస్తుంది అని ఆశిస్తున్నాను’’ అన్నారు విక్రమ్. ‘‘ఇలా పుస్తకాలను అచ్చేయడం నాకు బొత్తిగా కొత్త’’ అంటున్నారు ఆయన. సినిమాలను నవలలుగా చదువుకోవడం కూడా ఈ తరానికి ఎంతో కొంత కొత్తే కదా! ఇది సరేగానీ, హారర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వారు, ఆ ట్రాన్స్లో కొన్ని చిత్ర విచిత్రమైన మానసిక భ్రమలకు గురవుతుంటారు. అలాంటి విషయాలను అడపాదడపా ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. తనకు ఎదురైన హారర్ అనుభవాలను విక్రమ్భట్ ఒక పుస్తకంగా రాసి ‘నేనూ నా దెయ్యాలు’ అని పేరు పెడితే... అట్టి పుస్తకం హాట్ హాట్గా అమ్ముడవుతుంది అనడంలో అణుమాత్రం సందేహం లేదు! -
హర్రర్ చిత్రాలంటే భయపెట్టేవేనా?
హర్రర్ చిత్రాలంటే భయపెట్టేవేనా? అని ప్రశ్నిస్తున్నారు దర్శకుడు మిష్కిన్. ఈయన దర్శక శైలి ప్రత్యేకంగా ఉంటుదన్నదానికి ఆయన గత చిత్రాలే నిదర్శనం. చిత్తిరం పేసుదడి, అంజాదే, ఓనాయం ఆటుకుట్టి తదితర చిత్రాల రూపకర్త మిష్కిన్ తాజాగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం పిశాచు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల తన బి స్టూడియోస్ పతాకంపై నిర్మించడం విశేషం. హర్రర్ చిత్రా ల హవా కొనసాగుతున్న ఈ రోజుల్లో మిష్కిన్ కూడా ఇదే బాట పట్టారు. అయితే తన హర్రర్ చిత్రం ఇంతకుముందు చిత్రాలకు భిన్నంగా, వినూత్నంగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఈ చిత్రం గురించి తెలుపుతూ, తన దృష్టిలో భయ పెట్టేవే హర్రర్ చిత్రాలు కావన్నారు. తన పిశాచు చిత్రంలో భయంతోపాటు, గుండెల్ని పిండే అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషించిన వారి నుంచి చిన్న పాత్రల్లో నటించిన వారి వరకు 4 నెలల పాటు శిక్షణ ఇచ్చి నటింపజేసినట్లు తెలిపారు. పిశాచు చిత్రం ద్వారా నాగ అనే నవ నటుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. తొలి చిత్రంలోనే ఈయన నటనలో అదరగొట్టాడని అన్నారు. హీరోయిన్గా కేరళకు చెందిన ప్రియూంకను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. నృత్యంలో ప్రావీణ్యం పొందిన ఈమె 60 అడుగుల ఎత్తులో ఒక రాత్రంతా పిశాచిగా ఎగురుతూ నటించి యూనిట్లోని వారందరినీ ఆశ్చర్య పరిచిందని చెప్పారు. కెమెరామెన్ రవిరాయ్ ఈ సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించారని తెలిపారు. అదే విధంగా అరోల్ కారేలి అనే నూతన సంగీత దర్శకుడిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. పిశాచు చిత్రానికి చివరి ఘట్టమే ప్రాణం అని మిష్కన్ పేర్కొన్నారు.