Iceland
-
ఐస్లాండ్లో అగ్నిపర్వతం విస్ఫోటనం..ఆందోళన చెందుతున్న ప్రజలు (ఫొటోలు)
-
ఎనిమిదేళ్లలో తొలిసారి కనిపించిన ధ్రువ ఎలుగుబంటి.. పోలీసులు ఏం చేశారంటే!
ఐస్లాండ్లోని ఒక మారుమూల గ్రామంలోని కనిపించిన అరుదైన ధ్రువ ఎలుగుబంటిని స్థానిక ప్రజలకు ముప్పుగా భావించి పోలీసులు కాల్చి చంపారు. అయితే ముందుగా ఎలుగుబంటిని తరలించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ విఫలం కావడంతో చంపాల్సి వచ్చందని వెస్ట్ఫ్జోర్డ్స్ పోలీస్ చీఫ్ హెల్గి జెన్సన్ తెలిపారు.ఆ ఎలుగుబంటి ఓ ఇంటికి సమీపంలోకి వచ్చిందని చెప్పారు. ఆ ఇంట్లో ఓ వృద్ధురాలు ఉందని, ఎలుగుబంటినిచూసి ఆమె భయంతో మేడపైకి వెళ్లి దాక్కుందని పేర్కొన్నారు. సాయం కోసం తన కుమార్తెకు చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎలుగుబంటి ద్వారా వృద్ధురాలి ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని దాన్ని కాల్చినట్లు పోలీసులు తెలిపారు.ధృవపు ఎలుగుబంట్లు ఐస్లాండ్కు చెందినవి కావు, అయితే కొన్నిసార్లు మంచు గడ్డలపై గ్రీన్లాండ్ నుంచి ఒడ్డుకు చేరుకుంటాయి. 2016లో ఐస్ల్యాండ్లో మొదటిసారి కనిపించింది ఇవి 150 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ధృవపు ఎలుగుబంట్లు మానవులపై దాడి చేయడం చాలా అరుదు. 2017లో వైల్డ్లైఫ్ సొసైటీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా సముద్రపు మంచు కోల్పోవడం వల్ల ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడం ప్రారంభించాయని తెలిపింది. దీని వల్ల మానకులకు ప్రమాదం పెరిగిందని పేర్కొంది. వీటి వల్ల, మానవులకు లేదా పశువులకు ముప్పు కలిగిస్తే అధికారులు వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుది. -
ఐస్ల్యాండ్లో మరోసారి బద్దలైన అగ్ని పర్వతం.. (ఫొటోలు)
-
గ్లోబల్ వార్మింగ్పై ఫైటర్.. ది మమ్మోత్
ఏటేటా పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమలు.. వాటి నుంచి వెలువడే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతోంది. వాతావరణంలో నిరంతరం పెరిగిపోతున్న కార్బన్డయాక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమ వుతోంది. దీనికి పరిష్కారంగానే.. ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టాయి.ఈ క్రమంలోనే ఐస్ ల్యాండ్కు చెందిన ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి బదులు.. నేరుగా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తొలగించే సరికొత్త సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..ఏటా 36 వేల టన్నుల మేర..గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసి.. దానిని నీటితో కలిపి, భూమిలోపలి పొరల్లోకి పంపేలా క్లైమ్ వర్క్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దీని సాయంతో ఏటా 36 వేల టన్నుల కార్బన్డయాక్సైడ్ను గాలిలోంచి తొలగించి.. భూమి పొరల్లోకి పంపేలా నిర్మించింది. ఇది సుమారు 8 వేల డీజిల్ కార్లు ఏడాదంతా తిరిగితే వెలువడేంత కార్బన్డయాక్సైడ్తో సమానం కావడం గమనార్హం. చూడటానికి ఇది తక్కువే అనిపించినా.. ఇలాంటి ప్లాంట్లు భారీ సంఖ్యలో పెడితే.. గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఒక పరిష్కారంగా పనికొస్తుందని ‘క్లైమ్ వర్క్స్’ సంస్థ చెప్తోంది.దీనిలో నిలువునా గోడల్లా ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఒకవైపు భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి వెనకాల చిన్న చాంబర్ ఉంటుంది. అందులో కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే ఫిల్టర్లు ఉంటాయి.ఫ్యాన్లను ఆన్ చేసినప్పుడు.. అవి వెనకాల చాంబర్ నుంచి గాలిని లాగి.. ముందు వైపునకు వదులుతాయి. ఈ క్రమంలో చాంబర్లోని ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహిస్తాయి.ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్తో నిండిపోతే.. ఆటోమేటిగ్గా చాంబర్ సీల్ అయిపోతుంది. అందులో చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో 100 సెంటిగ్రేడ్ల మేరకు వేడెక్కుతుంది. దాంతో ఫిల్టర్లలోని కార్బన్ డయాక్సైడ్ ఆవిరి అవుతుంది.ఎలా పనిచేస్తుంది?ఈ ఆవిరిని ప్రత్యేక పైపుల ద్వారా భూగర్భంలోకి తరలిస్తారు. ఆ పైపుల్లోకి నీటిని పంపే ఏర్పాట్లు చేస్తారు. దీనితో కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి కార్బన్ వాటర్గా మారిపోతుంది. భూగర్భంలోకి ఆ కార్బన్ వాటర్ మెల్లగా గడ్డకట్టి రాళ్లుగా తయారవుతుంది.ఈ ప్రక్రియలో ఫ్యాన్ల కోసం, పైపుల ద్వారా కార్బన్ డయాక్సైడ్, నీరు పంపింగ్ చేయడం కోసం వాడే విద్యుత్ను ఆ ప్రాంతంలోని జియోథర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు.ఇది వేడినీటి బుగ్గల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ కాబట్టి.. దాని వినియోగంతో పర్యావరణానికి సమస్యేమీ లేదని ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.అమెరికాలోని లూసియానాలో 2030 నాటికి ఏటా 10 లక్షల టన్నుల కార్బన్డయాక్సైడ్ను సంగ్రహించగలిగే ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
రూ. 24.75 కోట్లు.. మరీ ఇంత చెత్త ప్రదర్శనా?
ఐపీఎల్-2024.. మినీ వేలంలో ఏకంగా రూ. 24.75 కోట్లకు అమ్ముడుపోయిన క్రికెటర్. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు. మరి ఆడిన రెండు మ్యాచ్లలో అతడి గణాంకాలు ఎలా ఉన్నాయి?!.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేశాడు ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్. వన్డే వరల్డ్కప్-2023లో సత్తా చాటిన ఈ సీనియర్ పేసర్ కోసం వేలంలో ఫ్రాంఛైజీలన్నీ పోటీ పడితే.. కోల్కతా నైట్ రైడర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఒక్క వికెట్ కూడా తీయలేదు కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో స్టార్క్ వల్ల జట్టుకు చేకూరిన ప్రయోజనం శూన్యం. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన విషయం తెలిసిందే. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ అదృష్టవశాత్తూ.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అందుకే స్టార్క్ పేలవ ప్రదర్శన పెద్దగా హైలైట్ కాలేదు. చెత్త గణాంకాల వల్ల విమర్శలు నిజానికి ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 22 ఏళ్ల పేసర్ హర్షిత్ రాణా(4/33) విజయవంతమైన చోట ఈ లెఫ్టార్మ్ పేసర్ పూర్తిగా తేలిపోయాడు. తదుపరి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లోనూ చెత్త ప్రదర్శన పునరావృతం చేశాడు స్టార్క్. నాలుగ ఓవర్ల బౌలింగ్లో 47 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఫలితంగా.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో కలిపి 8-0-100-0 గణాంకాలు నమోదు చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. కమిన్స్ మాత్రం మెరుగ్గానే మరోవైపు.. రూ. 20.50 కోట్లకు అమ్ముడై సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్లో 1/32, మలి మ్యాచ్లో 2/35 గణాంకాలతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా ఓ మ్యాచ్లోనూ జట్టును గెలిపించాడు. బీరు కంటే ఎక్కువే ఇదిలా ఉంటే.. స్టార్క్ ప్రదర్శనను ఐస్ల్యాండ్ క్రికెట్ దారుణంగా ట్రోల్ చేసింది. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు స్టార్క్ బౌలింగ్ గణాంకాలు.. తమ దేశంలో బీర్ కంటే కూడా ఖరీదుగా ఉన్నాయని వ్యంగ్యస్త్రాలు సంధించింది. కాగా యూరోపియన్ దేశం ఐస్ల్యాండ్లో బీర్ ధరలు.. మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయనే ప్రచారం ఉంది. చదవండి: మాటల్లేవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు! స్మిత్కు వార్నింగ్ ఇచ్చేశా! -
Iceland : ఐస్లాండ్లో అగ్నిపర్వత విస్ఫోటనం (ఫొటోలు)
-
Volcano: ఐస్లాండ్లో బద్దలైన మరో అగ్నిపర్వతం
రెగ్జావిక్: ఐస్లాండ్లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణకేంద్రం తెలిపింది. కరిగిపోయిన రాతితో పాటు లావా పర్వతానికి ఇరువైపులా విరజిమ్మాయి. రాజధాని రెగ్జావిక్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవబోతోందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెగ్జావిక్లో పోలీసులు అత్యవసరస్థితి ప్రకటించారు. ఐస్లాండ్లో 30 దాకా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. దీంతో ఇక్కడికి అగ్నిపర్వాతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్ను పేల్చేసిన అమెరికా -
Iceland volcano: భూగర్భంలో భుగభుగలు
అనగనగా ఒక చిన్న పల్లెపట్టు. అంతా సజావుగా సాగిపోతున్న వేళ. ఉన్నట్టుండి ఎటు చూస్తే అటు భూమిపై పగుళ్లు. చూస్తుండగానే అందులోంచి ఫౌంటేన్లా విరజిమ్ముతూ లావా ప్రవాహాలు. బిక్కచచి్చపోయి కకావికలమవుతున్న జనం. ఏదో హాలీవుడ్ సినిమాలా ఉంది కదూ! ఐస్లాండ్లో పశ్చిమ రెగ్జానెస్ ద్వీపకల్పంలోని గ్రెంతావిక్ అనే బుల్లి బెస్త గ్రామం, దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు అచ్చం అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అక్కడ భూగర్భంలో 800 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అపారమైన లావా రాశి కొన్నాళ్లుగా ఒళ్లు విరుచుకుంటోంది. భారీ ప్రవాహంగా మారి భయపెడుతోంది...! ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెగ్జానెస్ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం. పెద్ద టూరిస్టు స్పాట్ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవలేదు. అలాంటిది గతేడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి. ముఖ్యంగా గ్రెంతావిక్, పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాలవారిని ఖాళీ చేయించాల్సి వచి్చంది. ఇదంతా టీజర్ మాత్రమేనని అసలు ముప్పు ముందుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రెంతావిక్ కింద భూగర్భంలో మాగ్మా (శిలాద్రవం) పూర్తిగా కరిగి అపార లావా ప్రవహంగా మారిందని తేల్చారు! దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్ మీటర్లని లెక్కగట్టారు! అంతేకాదు, ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యుబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట. ఇది డాన్యుబ్ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ. 2021–23 మధ్య ఇక్కడ భూగర్భంలో నమోదైన లావా ప్రవాహ రేటు కంటే ఇది 100 రెట్లు ఎక్కువని అధ్యయన సారథి యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్లోని నోర్డిక్ వోల్కెనోలాజికల్ సెంటర్కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెస్టెనిన్ సిగ్మండ్సన్ లెక్కగట్టారు. ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల ఎత్తు, కేవలం కొన్ని మీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు. ఈ గణాంకాలు, హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్సైన్స్లో గురువారం ప్రచురితమైంది. అందుకు కేవలం కొన్ని గంటల ముందే ఆ ప్రాంతమంతటా అగ్నిపర్వతం బద్దలవడంతో పాటు భూగర్భం నుంచి కూడా లావా ఎగజిమ్మిన ఉదంతాలు నమోదయ్యాయి! ఇలా జరగడం గత రెండు నెలల్లో మూడోసారి. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు లావా ఎగజిమ్మింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 14న కూడా రెండుసార్లు లావా పెల్లుబికింది. దాంతో ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ ద్వీపకల్పమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. భవిష్యత్తుపై ఆందోళన తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజులుగా గ్రెంతావిక్తో పాటు ఇక్కడి పలు ఆవాస ప్రాంతాల్లో భూగర్భంపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. భూమిలోంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే గాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో భూ ప్రకంపనలూ నమోదవుతున్నాయి. ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగులు ఏర్పడటం వణికిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం ద్వీపకల్పం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయని ప్రొఫెసర్ సిగ్మండ్సన్ ఆవేదనగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ లావా ప్రవాహం మరింతగా పెరిగేలా ఉందని కూడా ఆయన హెచ్చరించారు. అగ్నిపర్వతాల పుట్టిల్లు ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్లాండ్కు పేరుంది. అందుకే దాన్ని లాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని చమత్కరిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా. వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు. ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్నిపర్వాతల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iceland: అగ్ని పూలు
ఐస్లాండ్ దేశంలోని గ్రాండావ్ సిటీ సమీపంలోని అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున దుమ్ము, ధూళి, లావాలను వెదజల్లుతున్న దృశ్యం. డిసెంబర్ నుంచి ఈ సిలింగర్ఫెల్ అగ్నిపర్వతం బద్దలవడం వరసగా ఇది మూడోసారి. దీంతో దగ్గర్లోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీచేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వత బిలం బద్దలై వందల మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళిని ఎగజిమ్మింది. దీంతో తీరనగరం గ్రాండావ్ లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
బద్దలైన అగ్నిపర్వతం.. ఇళ్లపైకి లావా ప్రవాహం
ఐస్ల్యాండ్: ఐస్ల్యాండ్లోని రెక్జానెస్ ద్వీపకల్పంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. దీని నుంచి వెలువడిన అగ్ని పర్వతం జనావాసాలపైకి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. లావా ముప్పులో ఆ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఆ ప్రాంతంపైకి ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అడ్డుగా పెద్ద బండరాళ్లను పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోయింది. లావా ప్రవహించడంతో స్థానికులు ఇళ్లను ఖాలీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వారితోపాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఐస్ల్యాండ్లో నెలరోజుల వ్యవధిలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం లావా ఈ ప్రదేశానికి దూరంగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా -
Aus vs Pak: అద్భుతం.. అందుకే వరుసగా 16 టెస్టులు ఓడిపోయారా?
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్పై ఐస్లాండ్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆస్ట్రేలియా ఇకపై తన అదృష్టాన్ని కాలదన్నుకుని పాక్కు గెలిచే అవకాశం ఇస్తుందేమో అంటూ అతడిని దారుణంగా ట్రోల్ చేసింది. కాగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ వరుసగా రెండింట ఓడింది. దీంతో సిరీస్ 2-0 తేడాతో ఆతిథ్య జట్టు కైవసం అయింది. అయితే, తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. రెండో టెస్టులో మెరుగ్గానే ఆడింది. కానీ.. కీలక సమయంలో ఫీల్డింగ్ తప్పిదాలు, బ్యాటింగ్ వైఫల్యాలతో మ్యాచ్ను చేజార్చుకుంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అవుట్ కావడంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్యాట్ కమిన్స్ విసిరిన బంతి రిజ్వాన్ రిస్ట్బ్యాండ్ను తాకి వికెట్ కీపర్ చేతుల్లో పడినట్లు కనిపించగా.. అప్పీలు చేశాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో.. ఆసీస్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో రిజ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో.. ఓటమి అనంతరం మహ్మద్ హఫీజ్ స్పందిస్తూ.. తమ జట్టు గొప్పగా ఆడినా.. సాంకేతిక లోపాలు, అంపైరింగ్ తప్పిదాల వల్లే ఓడిపోయిందని ఆసీస్ ఆట తీరును విమర్శించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి కమిన్స్ ఇప్పటికే అతడికి కౌంటర్ ఇచ్చాడు. ఆఖరి వరకు బాగా ఆడిన జట్టునే విజయం వరిస్తుందని హఫీజ్ వ్యాఖ్యలకు బదులిచ్చాడు. తాజాగా ఐస్లాండ్ క్రికెట్ సైతం.. ‘‘నిజంగా ఇదొక అద్భుతం. అత్యంత ప్రతిభావంతమైన, సుపీరియర్ టాలెంట్ ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో వరుసగా 16 టెస్టులు ఎలా ఓడిపోయింది? ఇక నుంచి ఆస్ట్రేలియా జట్టు తాము అదృష్టవంతులుగా ఉండటం ఆపేస్తే బాగుంటుంది’’ అంటూ మహ్మద్ హఫీజ్ను ట్రోల్ చేసింది. కాగా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో పాకిస్తాన్ ఇప్పటి వరకు వరుసగా పదహారు ఓడిపోవడం గమనార్హం. ఆసీస్ గడ్డపై ఇంత వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. It's amazing. How can the more talented and superior team have lost 16 matches in a row in Australia? Surely those lucky Aussies will stop being lucky soon. https://t.co/118gmMCe2K — Iceland Cricket (@icelandcricket) December 29, 2023 -
Leif Erikson Lunar Prize: ఇస్రోకు ఐస్లాండ్ ‘అన్వేషణ’ అవార్డ్
న్యూఢిల్లీ: చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ఐస్ల్యాండ్కు చెందిన సంస్థ నుంచి అవార్డ్ దక్కింది. చంద్రయాన్–3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ల్యాండింగ్ను విజయవంతంగా పూర్తిచేసినందుకుగాను 2023 ఏడాదికి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను ఇస్తున్నట్లు హుసావిక్ నగరంలోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది. క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 సంవత్సరాల ముందే అమెరికా గడ్డపై కాలుమోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్కు గుర్తుగా ఈ అవార్డును ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇస్తోంది. నూతన అన్వేషణలతో చేస్తున్న కృషికిగాను ఈ అవార్డ్ను ప్రదానంచేస్తోంది. ఇస్రో తరఫున భారత రాయబారి బి.శ్యామ్ ఈ అవార్డ్ను అందుకున్నారు. అవార్డ్ ఇచి్చనందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధన్యవాదాలు తెలిపారు. -
14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి
రేగ్యావిక్: ఒక భూ కంపం వస్తేనే ప్రజలు వణికిపోతారు.పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి.అలాంటిది ఐస్లాండ్ దేశంలో కేవలం 14 గంటల్లో ఎనిమిది వందల సార్లు భూమి కంపించిందంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వరుస భూ కంపాలు బెంబేలిత్తిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఐస్లాండ్ మెట్ ఆఫీస్ తెలిపిన దాని ప్రకారం రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో గ్రిండావిక్ గ్రామంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.రాజధాని రేగ్యావిక్కు 40 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ప్రకంపనల కారణంగా ఇళ్లలోని కిటికీల తలుపులు, వస్తువులు కొద్దిసేపు ఊగాయి.వరుస భూ ప్రకంపనలు సంభవించినపుడు అగ్నిపర్వతం బద్దలయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఐలాండ్ దేశంలో 33 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి.యూరప్లోనే ఇది అత్యధికం. ఇదీ చదవండి...అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత -
CWC 2023: వరల్డ్ ఎలెవెన్ జట్టు.. నలుగురు భారత క్రికెటర్లకు చోటు
వన్డే వరల్డ్కప్-2023కి సంబంధించి ఐస్ల్యాండ్ క్రికెట్ తమ ఫేవరెట్ (వరల్డ్ ఎలెవెన్) జట్టును ప్రకటించింది. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఐస్ల్యాండ్ క్రికెట్ తమ జట్టులో చోటు కల్పించింది. ఇందులో ఏకంగా ఐదుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కడం విశేషం. ఈ జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపిక చేయబడగా.. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలకు సభ్యులుగా చోటు దక్కింది. We have seen enough. It's time to announce our World XI from the CWC group stage. Discuss. R Sharma (c) Q de Kock (wk) V Kohli R Ravindra D Mitchell G Maxwell R Jadeja M Jansen A Zampa J Bumrah M Shami — Iceland Cricket (@icelandcricket) November 8, 2023 ఈ జట్టుకు వికెట్కీపర్గా దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఎంపిక చేయబడగా.. న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), గ్లెన్ మ్యాక్స్వెల్ (ఆస్ట్రేలియా), మార్కో జన్సెన్ (దక్షిణాఫ్రికా), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) ఇతర సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో కేవలం నాలుగు జట్లకు మాత్రమే ప్రాతినిథ్యం లభించింది. భారత్ నుంచి ఐదుగురు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నుంచి తలో ఇద్దరు ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ఆటగాళ్లంతా ప్రస్తుత ప్రపంచకప్లో ప్రఛండమైన ఫామ్లో ఉన్నారు. ఈ జట్టును గనక వరల్డ్కప్ బరిలో దించితే ఎంతటి మేటి జట్టునైనా మట్టికరిపించగలదు. ఐస్ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన ఈ జట్టులో ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్కు స్థానం లభించకపోవడం విశేషం. పై పేర్కొన్న అందరు ఆటగాళ్లలాగే వార్నర్ సైతం ప్రస్తుత ప్రపంచకప్లో భీకరఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-7 బ్యాటర్లకు చోటు కల్పించిన ఐస్ల్యాండ్ క్రికెట్ ఒక్క డేవిడ్ వార్నర్ను మాత్రమే విస్మరించింది. జట్టు కూర్పు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అలాగే బౌలర్ల విషయంలోనూ షాహీన్ అఫ్రిదికి చోటు కల్పించి ఉండాల్సిందని పాక్ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఐస్ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన వరల్డ్ ఎలెవన్ జట్టు.. ప్రస్తుత వరల్డ్కప్లో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన రోహిత్ శర్మ (కెప్టెన్)- 8 మ్యాచ్ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 442 పరుగులు క్వింటన్ డికాక్ (వికెట్కీపర్)- 8 మ్యాచ్ల్లో 4 సెంచరీల సాయంతో 550 పరుగులు విరాట్ కోహ్లి- 8 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 543 పరుగులు రచిన్ రవీంద్ర- 8 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీ సాయంతో 523 పరుగులు డారిల్ మిచెల్- 8 మ్యాచ్ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 375 పరుగులు గ్లెన్ మ్యాక్స్వెల్- 7 మ్యాచ్ల్లో 2 సెంచరీల సాయంతో 397 పరుగులు రవీంద్ర జడేజా- 8 మ్యాచ్ల్లో 14 వికెట్లు మార్కో జన్సెన్- 8 మ్యాచ్ల్లో 17 వికెట్లు ఆడమ్ జంపా- 8 మ్యాచ్ల్లో 20 వికెట్లు జస్ప్రీత్ బుమ్రా- 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు మొహమ్మద్ షమీ- 4 మ్యాచ్ల్లో 16 వికెట్లు -
రొనాల్డో చరిత్ర.. 200 మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయిని అందుకున్నాడు. పోర్చుగల్ తరపున రొనాల్డో 200వ మ్యాచ్ ఆడాడు. పురుషుల ఫుట్బాల్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. యూరోకప్ 2024 క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా పోర్చుగల్ మంగళవారం అర్థరాత్రి ఐస్లాండ్తో తలపడింది. మ్యాచ్లో పోర్చుగల్ 1-0 తేడాతో నెగ్గింది. పోర్చుగల్ తరపున వచ్చిన ఏకైక గోల్ కూడా క్రిస్టియానో రొనాల్డోదే కావడం విశేషం. ఆట 89వ నిమిషంలో రొనాల్డో జట్టుకు గోల్ అందించాడు. ఇక రొనాల్డోకు ఇది 123వ అంతర్జాతీయ గోల్. 200వ మ్యాచ్ ఆడడంపై క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. ''చాలా సంతోషంగా ఉంది. దేశం తరపున 200 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహిస్తానని ఊహించలేదు. నా కెరీర్లో ఇదొక గొప్ప ఘనతగా భావిస్తున్నా'' అంటూ చెప్పుకచ్చాడు. కాగా యూరో 2024 క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్-జెలో ఉన్న పోర్చుగల్ తాము ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ నాలుగు విజయాలు అందుకొని టాపర్గా కొనసాగుతుంది. "I'm so happy. For me it's an unbelievable achievement" We spoke to Mr 200 @Cristiano Ronaldo... pic.twitter.com/LpaInwxHej — UEFA EURO 2024 (@EURO2024) June 20, 2023 The historical scorer of the teams 🐐🇵🇹⚽️#CR7𓃵 #CR200#CristianoRonaldo pic.twitter.com/i0z0DHaTKA — عمر المدريدي ⓮㉟ (@omar14rmd) June 20, 2023 🙌🙌🙌#EURO2024 @selecaoportugal pic.twitter.com/JydpIv0BSE — UEFA EURO 2024 (@EURO2024) June 20, 2023 చదవండి: మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్ వద్దన్నది -
కిస్కా కథ అలా ముగిసింది..!
ఒంటారియో: కిస్కా. ఓర్కా రకం కిల్లర్ వేల్. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం. దాదాపు 40 ఏళ్లపాటు నీళ్ల ట్యాంకులో ఒంటరిగా బతుకీడ్చింది. చోటు మార్చాలని జంతువుల హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసింది. ఐస్ల్యాండ్ సమీపంలోని సముద్ర జలాల్లో ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఈ కిల్లర్ వేల్ పట్టుబడింది. దీనిని ఒంటారియోలోని నయాగరా జలపాతం వద్ద ఉన్న మెరైన్ల్యాండ్ జూ పార్క్కు అమ్మేశారు. 40 ఏళ్ల పాటు కిస్కా ఓ నీళ్ల ట్యాంకుకే పరిమితమైపోయింది.ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలంగా ముద్రపడింది. ఇటీవలే సుమారు 47 ఏళ్ల వయస్సులో కిస్కా చనిపోయింది. ‘కిస్కా మృతి పట్ల విచారిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓర్కా రకం తిమింగలాలు బందీలుగా ఉన్నాయి. కెనడా ప్రభుత్వం నోవాస్కోటియాలో వందెకరాల్లో వేల్ శాంక్చువరీ ప్రాజెక్టు ఏర్పాటు పనుల్లో ఉంది. ఇది పూర్తయితే ట్యాంకుల్లో కన్నా స్వేచ్ఛగా, మెరుగైన సురక్షిత వాతావరణంలో పట్టుబడిన తిమింగలాలు, డాల్ఫిన్లను ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది’అని ఏనిమల్ జస్టిస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెమిల్లె లబ్చుక్ అన్నారు. తిమింగలాల్లో అత్యంత బలమైన ఈ ఓర్కాల ఆయుర్ధాయం 50 నుంచి 90 ఏళ్లు. -
BGT 2023: కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. చెత్త పోస్టులు పెడితే: ఫ్యాన్స్ ఫైర్
India vs Australia, 2nd Test- Virat Kohli: రికార్డుల రారాజు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే అంతర్జాతీయ కెరీర్లో 25 వేల పరుగుల మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. 549 ఇన్నింగ్స్లలో ఈ మేరకు రన్స్ పూర్తి చేసుకుని క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. అత్యంత వేగంగా 25000 పరుగుల మార్కును అందుకున్న తొలి బ్యాటర్గా కోహ్లి చరిత్రకెక్కాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టు సందర్భంగా రన్మెషీన్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీ టెస్టులో మొత్తంగా 64 పరుగులు చేసిన కోహ్లి జట్టు విజయంలో.. తద్వారా 2-0 ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కింగ్ కోహ్లి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అదే ఆఖరిది ఇలాంటి సందర్భంలో ఐస్లాండ్ క్రికెట్ ప్రదర్శించిన అత్యుత్సాహం ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పించింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు కోహ్లి 74 సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. ఇందులో వన్డేల్లో 46, టెస్టుల్లో 27, టీ20లో ఒక శతకం ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబరులో బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా కోహ్లి ఆఖరి వన్డేలో సాధించిన సెంచరీ చివరిది. ఇక ఆసీస్తో టెస్టుల్లో కోహ్లి బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకున్నప్పటికీ ఇంతవరకు ‘కింగ్’ స్థాయి స్కోరు నమోదు కాలేదు. అంతేకాదు టెస్టుల్లో కోహ్లి సెంచరీ చేసి దాదాపు మూడున్నరేళ్లు దాటింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాదేశ్తో రెండో టెస్టులో ఆఖరిసారి శతకం బాదాడు. 136 పరుగులు సాధించాడు. కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే ఈ నేపథ్యంలో ఐస్లాండ్ క్రికెట్.. ‘‘ఈ గణాంకాలు భారత అభిమానులకు అంతగా రుచించకపోవచ్చు. కానీ విరాట్ కోహ్లి గత 23 టెస్టుల్లో ఇంత వరకు సెంచరీ సాధించిందే లేదు. ఆఖరిసారి 2019లో శతకం బాదాడు. చాలా కాలం.. అంటే చాలా కాలం అయిపోయింది కదా?’’ అని గురువారం ట్వీట్ చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్కు చిర్రెత్తిపోయింది. ఐస్లాండ్ క్రికెట్పై భగ్గుమంటున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే అస్సలు బాగోదు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో కోహ్లి చేసిన 44 పరుగులు సెంచరీ కంటే విలువైనవి. ఇక మీరు అడిగిన చెత్త ప్రశ్నకు మా సమాధానం ఏంటంటే.. కింగ్ కోహ్లి ఎప్పటికీ కింగ్కోహ్లినే! అర్థమైందా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. త్వరలోనే కోహ్లి సెంచరీ సాధిస్తాడు, అప్పుడు ఏమని ట్వీట్ చేస్తారో! అయినా ఇంతకీ మీకా అర్హత ఉందంటారా? అని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: తండ్రుల కాలం అయిపోయింది, కొడుకులు తయారయ్యారు.. సౌతాఫ్రికా-విండీస్ మ్యాచ్లో ఆసక్తికర పరిణామం ICC Rankings: ఆండర్సన్ ప్రపంచ రికార్డు! మళ్లీ ఎవరికీ సాధ్యం కాదేమో! అశ్విన్తో పొంచి ఉన్న ప్రమాదమిదే! This statistic won't please many of our Indian fans, but it is now 23 Tests since Virat Kohli scored a century, which was back in 2019. How long is too long? — Iceland Cricket (@icelandcricket) February 21, 2023 You wouldn’t be publishing this rubbish if you saw his 44 against Australia in the second BGT test at Dehi. Worth more than many a century! And to answer your question, since this involves 👑 Kohli, ‘as long as it takes’ #KingKohli — Somesh Dwivedi (@someshdwived) February 21, 2023 -
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్కు ఘోర అవమానం
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్కు ఘోర అవమానం జరిగింది. క్రికెట్ ఐస్లాండ్ (సీఐ).. తాజాగా ప్రకటించిన పాకిస్తాన్ ఆల్టైమ్ వన్డే టీమ్లో బాబర్ పేరును డ్రింక్స్ బాయ్స్ జాబితాలో చేర్చింది. బాబార్తో పాటు మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ పేర్లను కూడా క్రికెట్ ఐస్లాండ్ డ్రింక్స్ బాయ్స్ జాబితాలో చేర్చింది. ఈ జట్టులో ఓపెనర్లుగా సయీద్ అన్వర్, జహీర్ అబ్బాస్లకు స్థానం కల్పించిన క్రికెట్ ఐస్లాండ్.. వన్డౌన్లో ఇంజమామ్ ఉల్ హాక్, నాలుగో స్థానంలో జావిద్ మియాందాద్, ఐదో ప్లేస్లో మహ్మద్ యూసఫ్, ఆరో స్థానంలో ఇమ్రాన్ ఖాన్, ఏడో స్థానంలో షాహిద్ అఫ్రిది, ఆతర్వాత మొయిన్ ఖాన్ (వికెట్కీపర్), పేస్ బౌలర్ల కోటాలో వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా సక్లయిన్ ముస్తాక్లను ఎంపిక చేసింది. Today we announce our Pakistani ODI team of all time: S Anwar Z Abbas I Ul Haq J Miandad M Yousuf I Khan (c) S Afridi M Khan (WK) W Akram W Younas S Mushtaq Drinks boys: B Azam, M Hafeez and Shoaib Malik — Iceland Cricket (@icelandcricket) January 8, 2023 క్రికెట్ ఐస్లాండ్.. ఈ జట్టుకు కెప్టెన్గా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఐస్లాండ్ కొద్ది గంటల ముందు (జనవరి 8) తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. కాగా, బాబర్ ఆజమ్ సారధ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో టెస్ట్ సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయిన బాబర్ సేన.. ఆతర్వాత స్వదేశంలోనే న్యూజిలాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను అతికష్టం మీద 0-0తో డ్రా చేసుకోగలిగింది. ఈ సిరీస్లోనూ రెండు మ్యాచ్ల్లో ఓటమి అంచుల దాకా వచ్చిన పాక్ అతికష్టం మీద బయటపడగలిగింది. స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాక్ అభిమానులు బాబర్ ఆజమ్పై దుమ్మెత్తిపోస్తున్నారు. బాబర్.. కేవలం రికార్డుల కోసమే మ్యాచ్లు ఆడతాడు, జట్టు జయాపజాలతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తాడని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఐస్లాండ్ బాబర్ను డ్రింక్స్ బాయ్గా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. -
లింగ సమానత్వం.. 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135!
న్యూఢిల్లీ: లింగ సమానత్వం విషయంలో ఐస్లాండ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135! అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘వార్షిక జెండర్ గ్యాప్ రిపోర్ట్–2022’ను బుధవారం చేసింది. లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది. చదవండి: లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే! -
‘వాలీ’ దొరికిందోచ్!.. 22 రోజుల్లో 900 కిలోమీటర్లు ఈదేసింది
‘వాలీ’.. సముద్ర జలాల్లో తన విభిన్న చేష్టలతో ప్రఖ్యాతి గాంచిన వాల్రస్(ధ్రువపు జీవి). ఆర్కిటిక్ ప్రాంత సముద్ర జలాల్లో ప్రయాణించేవారికి ఇది సుపరిచితం. అయితే కొన్నిరోజుల కిందట అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో చాలా మంది జంతు ప్రేమికులు, పర్యాటకులు ఆందోళన చెందారు. వాలీ క్షేమంగా ఉండాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఎట్టకేలకు 22 రోజుల తర్వాత వాలీ ఆచూకీ లభించింది. 800 కిలోల బరువు ఉండే ఈ ప్రాణి.. 22 రోజుల్లో దాదాపు 900 కిలోమీటర్లు ఈదేసింది. చివరిసారిగా ఐర్లాండ్లో కనిపించిన వాలీ.. తిరిగి 22 రోజుల తర్వాత ఆదివారం ఐస్లాండ్ సమీపంలో దర్శనమిచ్చింది. బ్రిటిష్ డైవర్స్ దాని శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా ‘వాలీ’ని నిర్ధారించారని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ తెలిపింది. ఈ 22 రోజులు చాలా ఆందోళన చెందామని.. మళ్లీ చూస్తామో లేదో అని భయపడ్డామని పేర్కొంది. ఎట్టకేలకు వాలీ ఆచూకీ లభించడం సంతోషంగా ఉందని వెల్లడించింది. అది తిరిగి తన స్వస్థలం ఐర్లాండ్కు వచ్చేందుకు ఈదడం మొదలుపెట్టిందని వివరించింది. వివిధ దేశాల మీదుగా దాదాపు 4,000 కిలోమీటర్లు ప్రయాణించి ఐర్లాండ్కు చేరుకుంటుందని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ అంచనా వేస్తోంది. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ చదవండి: ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు! #WalrusWatch UPDATE: After 22 days with no confirmed sightings, we were starting to lose hope of ever seeing the young, wandering walrus again. HOWEVER, we just received notice that a similar-looking walrus was sighted yesterday in ICELAND.. Picture: Hafrún Eiríks / Höfn 1/7 pic.twitter.com/ZQLwGtbVol — Seal Rescue Ireland (@seal_rescue) September 20, 2021 -
ఓర్కా.. టన్నుల్లో బొగ్గుపులుసును మింగేస్తది
పర్యావరణ కాలుష్యానికి కార్బన్ ఉద్గారాలు ప్రధాన కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహన కాలుష్యంతో పాటు ప్రకృతి వైపరిత్యాల కారణంగా గత రెండేళ్లుగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే గాల్లోని బొగ్గుపులుసు వాయువును సంగ్రహించి.. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు ప్రయత్నాలు అక్కడక్కడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఐస్ల్యాండ్లో ప్రపంచంలోనే భారీ ఫ్యాక్టరీని నెలకొల్పి సంచలనాలకు తెర లేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద Co2 సంగ్రహణ పరిశ్రమను ఐస్ల్యాండ్లో బుధవారం(సెప్టెంబర్ 8, 2021) ప్రారంభించారు. దీనిపేరు ఓర్కా(ఆర్కా). ఇది ఐస్ల్యాండిక్ పదం. ఇంగ్లిష్ మీనింగ్ ‘ఎనర్జీ’ అని. మొత్తం నాలుగు యూనిట్లు.. రెండు మెటల్ బాక్స్ల సెటప్తో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. స్విట్జర్ల్యాండ్కు చెందిన క్లైమ్వర్క్స్, ఐస్ల్యాండ్కు చెందిన కార్బ్ఫిక్స్ కంపెనీలు సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని భారీ నిధులు వెచ్చించి నెలకొల్పాయి. ఎలా పని చేస్తుందంటే.. ఏడాది నాలుగు వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్ని ఇది సంగ్రహిస్తుంది. ఇది దాదాపు 870 కార్ల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలతో సమానమని యూఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) పేర్కొంది. ఈ ఫ్యాక్టరీ యూనిట్లలోని ఫ్యాన్లు.. వాతావరణంలోని Co2ను సంగ్రహిస్తాయి. ఫిల్టర్ మెటీరియల్ సాయంతో వాయువును ఫిల్టర్ చేస్తుంది. అక్కడ అధిక ఉష్ణోగ్రతల వద్ద గాఢత ఉన్న Co2 గ్యాస్గా మారుతుంది. ఆపై నీటిని చేర్చి.. వెయ్యి మీటర్ల లోతులో బాసాల్ట్ బండరాళ్ల మీదకు వదిలేస్తారు. అంటే కార్బన్ క్యాప్చుర్ అండ్ స్టోరేజ్(CCS) ద్వారా కార్బన్ డయాక్సైడ్ను రాళ్లురప్పల్లో కలిపేయడం ఈ ప్రక్రియ విధానమన్నమాట. అయితే విమర్శకులు మాత్రం ఈ సాంకేతికత మంచిది కాదని చెప్తున్నారు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఇది అమలు చేయడానికి సంవత్సరాలు పడుతుందని వాళ్లు విబేధిస్తున్నారు. చదవండి: రియల్మీ ట్యాబ్! ఇవాళ్టి నుంచే.. -
అగ్నిపర్వతంలో పడిపోయిన డ్రోన్ కెమెరా.. దానికి ముందు
రేక్జావిక్: డ్రోన్ కెమెరాల వాడకం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డ్రోన్ గాలిలో చక్కర్లు కొడుతూ.. ప్రతీ ఒక్కదానిని కవర్ చేసే యాంగిల్స్ భలే గమ్మత్తుగా ఉంటుంది. అందుకే సినిమాలు, డాక్యుమెంటరీలు మొదలుకొని చివరికి పెళ్లిలో కూడా డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి భగభగమండే అగ్నిపర్వతాన్ని డ్రోన్ కెమెరా ఆధారంగా వీడియో తీయాలనుకున్నాడు. అనుకుందే తడవుగా తన పనిని ప్రారంభించాడు. అప్పుడే బద్దలైన అగ్నిపర్వతంలో ఎగజిమ్ముతున్న లావాను చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.అయితే దురదృష్టవశాత్తూ ఆ డ్రోన్ అగ్నిపర్వతంలో పడి కరిగిపోయింది. అయితే అతను తీసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జోయి హెల్మ్స్ అనే య్యూట్యూబర్.. ఐస్ల్యాండ్లోని జెల్డింగదాలిర్ లోయలో కొత్తగా కనుగొన్న అగ్నిపర్వతాన్ని చిత్రీకరించేందుకు వెళ్లాడు. అయితే ఆ ప్రాంతమంతా లావాతో నిండిపోవడంతో అగ్నిపర్వం బిలం వరకు వెళ్లడం కష్టమని భావించాడు. దీంతో అతడి డ్రోన్కు పనిచెప్పాడు. అగ్నిపర్వతం నుంచి విరజిమ్ముతున్న లావా కాలువ మీదుగా.. ఆ డ్రోన్ కదిలింది. చివరికి బిలం వద్దకు చేరుకుంది. ఇక్కడే అతను తప్పు చేశాడు. డ్రోన్ను ఇంకా ఎత్తులోకి తీసుకెళ్లకుండా లావాకు మరింత దగ్గరగా తీసుకెళ్లాడు. దీంతో లావా నుంచి వచ్చే వేడికి డ్రోన్ కరిగిపోయింది. ఆ వెంటనే సిగ్నల్ కూడా పోయింది. అగ్నిపర్వతంలో పడిపోతున్న డ్రోన్.. చివరి క్షణంలో చిత్రీకరించిన వీడియోను చూసేందుకు మాత్రం నెటిజన్లు ఆసక్తి చూపారు. ఫలితంగా ఈ వీడియోకు సుమారు 4.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చదవండి: 12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్ వద్దకు ఎవరు రావొద్దు ఈ పిల్ల తెలివి మామూలుగా లేదు.. -
వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట
రేక్సావిక్: ఐస్ల్యాండ్ రాజధాని రేక్సావిక్కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేక్సానెస్ అగ్నిపర్వతం ఈ నెల 28న బద్ధలైంది. దీంతో పర్వతంలో నుంచి పెద్ద ఎత్తున లావా బయటకు వస్తోంది. అయితే ఆ లావా వేడి తీవ్రత తక్కువగానే ఉండటంతో పర్యాటకులు కాస్త దాని దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఆదివారం చాలా మంది హైకర్లు, సందర్శకులు అక్కడికెళ్లి దాన్ని పరిశీలించారు. పర్యాటకలు అగ్ని పర్వతం వద్ద సెల్పీలు దిగుతున్నారు. తాజాగా అగ్ని పర్వతం వద్ద కొంత మంది యువకులు సరదగా వాలీబాల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రూట్ ఐనార్స్డోట్టిర్ అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో వాలీబాల్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘అగ్నిపర్వతం వద్ద యువకులు సరదగా వాలీబాల్ ఆడుతున్నారు’ అని ఆమె కామెంట్ జతచేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను పదిలక్షల మంది వీక్షించారు. ఆమె మరో వీడియోను షేర్ చేసి.. ‘ ఉదయం ఆగ్ని పర్వతం వద్ద కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది’ అని కామెంట్ చేశారు. ఈ వీక్షించిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘చాలా అద్భుతం’, ‘అక్కడ ఆటలు ఆడటాన్ని నిషేధిస్తారు.. జాగ్రత్త’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. People casually playing volleyball at the #volcano in #Fagradalsfjall, #Iceland yesterday 🌋 Mögulega það íslenskasta sem ég hef séð. pic.twitter.com/nU3VeDqziR — Rut Einarsdóttir (@ruteinars) March 28, 2021 -
వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్ వేసిన సైంటిస్టులు
రేక్జావిక్: ఐస్ల్యాండ్ రాజధాని రేక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్ఫాల్ పర్వతం సమీపంలో ఉన్న అగ్ని పర్వతం వారం రోజుల క్రితం విస్ఫోటనం చెందిన సంగతి తెలిసిందే. 900 వందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది బద్దలవ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడానికి ఐస్ల్యాండ్ చేరుకున్న శాస్త్రవేత్తలు పర్వత ప్రాంతంపై నుంచి లావా ప్రవహించే అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే వారు అక్కడ వంట కూడా చేశారు. మీరు చదివింది కరెక్టే.. శాస్త్రవేత్తలు అక్కడ వంట చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. వందల ఏళ్ల తర్వాత ఈ అగ్ని పర్వతం విస్పోటనం చెందడంతో కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడానికి ఐస్ల్యాండ్ చేరుకున్నారు. అగ్నిపర్వతం వద్దకు చేరుకున్న శాస్త్రవేత్తల బృందం ఈ విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడమేకాక.. ఈ ఘటనలో వెలువడిన లావాను ఉపయోగించి ఏకంగా వంట చేశారు. 'ఐస్లాండ్ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం వల్ల వెలువడిన లావా హాట్ డాగ్స్ను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది' అనే క్యాప్షన్తో యూట్యూబ్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది ఇప్పటికే 58కే వ్యూస్ పొందింది. విస్పోటనం వల్ల వెలువడిన వేడి వేడి లావాపై హాట్ డాగ్స్ వండటం, రేకు కాగితంపై శాండ్విచ్లను గ్రిల్ చేయడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. మరొక బృందం ఈ లావా మీద పాన్ పెట్టి గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్ వేయడమేకాక బేకన్ వండుతున్న మరొక వీడియోను యూరుకుర్ హిల్మార్సొన్మ్ యూట్యూబ్లో షేర్ చేశారు. ఫగ్రడాల్స్ఫాల్లో విస్ఫోటనం ప్రారంభమైన తరువాత గత శుక్రవారం రాత్రి ఎర్రటి మేఘం ఆకాశాన్ని కమ్మెసిందా అన్నట్లు అక్కడి పరిసరాలు మారిపోయాయి. ఇక విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విస్ఫోటనంతో అగ్ని పర్వతం నుంచి బయటకు చిమ్ముతున్న ఎర్రని లావా ప్రవహాన్ని చూపించే ఒక డ్రోన్ ఫుటేజ్ ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సంపాదించింది. విస్ఫోటనం జరగడానికి ముందు నాలుగు వారాల్లో ఈ ద్వీపకల్పంలో 40,000కు పైగా భూకంపాలు సంభవించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ ఆంక్షలు విధించారు. విస్ఫోటనం ప్రజలకు తక్షణ ప్రమాదం కలిగించలేదని అధికారులు వెల్లడించారు. చదవండి: వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా? -
900 ఏళ్లకు నిద్రలేచి.. వణికించి.. భయపెట్టి
వరుసగా భూకంపాలు.. రాత్రిలేదు, పగలు లేదు.. ప్రతి నిమిషం వణుకే.. ప్రతి క్షణం భయం భయమే. ఒకటీ రెండూ కాదు.. కేవలం మూడు వారాల్లో ఏకంగా 50 వేల ప్రకంపనలు. ఓ రోజు ఉన్నట్టుండి ఆగిపోయాయ్. హమ్మయ్య అనుకోవడానికి లేదు. భూకంపాలు ఆగిపోగానే.. అగ్ని పర్వతం పేలడం మొదలైంది. కుతకుతా ఉడుకుతున్న ఎర్రని లావా పెల్లుబుకుతూ ప్రవహిస్తోంది. అటు యూరప్.. ఇటు అమెరికా ఖండాల మధ్య అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఐస్ల్యాండ్లో కొద్దిరోజులుగా పరిస్థితి ఇది. ఇక్కడ 900 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న ఫగ్రడాల్స్జల్ అగి్నపర్వతం తాజాగా బద్దలైంది. సుమారు కిలోమీటరు వెడల్పుతో లావా ఓ నదిలా ప్రవహిస్తోంది. కొందరు ఫొటోగ్రాఫర్లు ఓ డ్రోన్ సాయంతో అగ్ని పర్వతం పేలుడును చిత్రీకరించారు. ఓ వైపు మంచు గ్లేసియర్లు, వేడి నీటి ఊటలు, మరోవైపు ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన ఐస్ల్యాండ్లో.. ఏకంగా 32 అగి్నపర్వతాలు ఉండటం గమనార్హం. -
వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా
-
వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా
సాక్షి,న్యూఢిల్లీ: ఐస్లాండ్ రాజధాని రీజావిక్లో బద్దలైన అగ్నిపర్వతం బీభత్సం రేపేలా అగ్నికీలల్ని వెదజిమ్మింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. ఎర్రటి లావా ఆకాశంలోకి ఫౌంటెయిన్లా ఎగసిపడింది. దీంతో భయంతో జనం బిక్కుబిక్కుమన్నారు. సెగలు, పొగలు గక్కుతూ లావా వరదై పారింది. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలోని ఫాగ్రాదల్సజాల్లో శుక్రవారం ఈ ఉదంతంచోటు చేసుకుంది. అయితే దీని వల్ల ప్రస్తుతానికి ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఐస్లాండ్ వాతావరణ శాఖ (ఐఎంవో) పేర్కొంది. కేవలం ఒక నెలలో 40 వేల భూకంపాలు సంభవించిన అనంతరం వాల్కనో బద్దలైనట్టు తెలిపింది. అలాగే దాదాపు 800 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఇది తొలి అగ్నిపర్వత విస్ఫోటనమని అధికారులు పేర్కొన్నారు. చదరపు కిలోమీటర్ మేర లావా వ్యాపించి, 100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. అలాగే ఎగిసిన పొగ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ముప్పు ఉందని,అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ట్విటర్లో వాతావరణ శాఖ షేర్ చేసింది. అలాగే దృశ్యాల్ని చూసిన చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ వీడియోలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ వినియోగంపై వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరోనా వైరస్ నివారణకు గాను వాక్సీన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తాజాగా డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ దేశాలు గురువారం ప్రకటించాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు రక్తం గడ్డకట్టినట్లు కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెన్మార్క్ ఆరోగ్య అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. డెన్మార్క్లో పరిస్థితులు బాగానే ఉన్నా, వ్యాక్సిన్తో ముడిపడి ఉన్న కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. వీటిని మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ తెలిపారు.అందుకే వాడకాన్ని పూర్తిగా నిషేధించలేదు కానీ, తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. టీకా సురక్షితమైనది సమర్థవంతమైందని రుజువు చేసే విస్తృత డాక్యుమెంటేషన్ ఉంది కానీ, ఇతర యూరోపియన్ దేశాలలో తీవ్రమైన దుష్ప్రభావాల గురించి సమాచారాన్ని పరిశీలించాలని బ్రోస్ట్రోమ్ చెప్పారు. (అమెరికన్ల జీవితాలు మారుతాయ్!) మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ (ఇఎంఎ) తెలిపింది. అలాగే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కారణంగా ఆస్ట్రియా నర్సు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టీకా తీసుకున్న తరువాత ఆమె తీవ్రమైన రక్త గడ్డంకట్టే సమస్యతో చనిపోవడంతో ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు యూరోపియన్ యూనియన్ దేశాలు ఎస్టోనియా, లాట్వియా, లిధుయేనియా, లక్సంబర్గ్లు కూడా తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో డెన్మార్క్ నార్వే, ఐస్లాండ్ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. (కోవిడ్ ముప్పు తొలగిపోలేదు) -
ఐస్లాండ్లో పేలిన అగ్ని పర్వతం
బోథ్: అమెరికాలోని ఐస్లాండ్లో అగ్నిపర్వతం పేలి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం గుర్రాలతండాకు చెందిన మయూరి సింగ్ మృతి చెందారు. ఆమె భర్త ప్రతాప్సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన జరగగా.. ఇక్కడి బంధువులకు ఆలస్యంగా విషయం తెలిసింది. సింగ్ బంధువుల కథనం ప్రకారం.. గుర్రాలతండాకు చెందిన ప్రతాప్సింగ్ ఇరవై ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లాడు. అక్కడ పలు వ్యాపారాలు చేస్తున్నాడు. ఈనెల 9న ఐస్లాండ్ చూసేందుకు భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తున్న క్రమంలో అక్కడే ఉన్న అగి్నపర్వతం ఒక్కసారిగా బద్ధలైంది. ఈ ఘటనలో మయూరిసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రతాప్సింగ్ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బుధవారం ఉదయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఇమాముల్ను దారుణంగా ట్రోల్ చేసిన ఐస్లాండ్
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ను ఐస్లాండ్ క్రికెట్ దారుణంగా ఆడేసుకుంది. ఈ మ్యాచ్తో ఐస్లాండ్ క్రికెట్కు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇమాముల్ ఒక ప్లేయర్ కాదు అనేంతగా ట్వీటర్ అకౌంట్లో విమర్శలు చేసింది. ఆసీస్తో రెండో టెస్టులో ఆడుతున్న ఇమాముల్ హక్ తొలి ఇన్నింగ్స్లో రెండు పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. ఇక ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండు టెస్టులకు గాను రెండు ఇన్నింగ్స్లు ఆడి 489 పరుగులు చేశాడు. అందులో 154 పరుగుల్ని బ్రిస్బేన్లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సాధిస్తే, ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అజేయంగా 335 పరుగులు చేశాడు. దీన్ని టార్గెట్ చేస్తూ.. వార్నర్ రెండు ఇన్నింగ్స్లో చేసిన పరుగుల కంటే ఇమాముల్ హక్ తన కెరీర్లో సాధించిన పరుగులే తక్కువంటా ఎద్దేవా చేసింది. ఇప్పటివరకూ ఇమాముల్ హక్ 11 టెస్టు మ్యాచ్లకు గాను 21 ఇన్నింగ్స్లు ఆడి 485 పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఇమాముల్ హక్ డకౌట్గా వెనుదిరిగితే, అజహర్ అలీ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. బాబర్ అజామ్ కూడా 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ 16.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 39 పరుగుల వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ నిలిపివేశారు. David Warner has scored more runs in his last two innings than Imam-ul-Haq has scored in his entire test career. #AUSvPAK — Iceland Cricket (@icelandcricket) December 1, 2019 -
పదేళ్లయినా పాడవని బర్గర్!
రేక్జవిక్ : బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? మహా అయితే రెండ్రోజులు. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్నవి ఏకంగా పదేళ్లయినా పాడవలేదు! ఆశ్చర్యంగా ఉందా? అయితే, ఇది చదవండి. బర్గర్లు, పీజాల తయారీలో ప్రసిద్ధి చెందిన మెక్డొనాల్డ్ కంపెనీ ఐస్లాండ్లో 2009లో తన చివరి అవుట్లెట్ను మూసివేసింది. అయితే, చివరగా హిజోర్టర్ స్మెర్సెన్ అనే వ్యక్తి ఆ షాప్లో ఫ్రెంచ్ ఫ్రైస్, ఓ బర్గర్ కొన్నాడు. అయితే అతను ఈ వాటిని తినేందుకు బదులు, మెక్డొనాల్డ్ గుర్తుగా అలానే ఉంచుకోవాలనుకున్నాడు. మొదట్లో అతను వీటిని తన దగ్గర నిల్వ చేశాడు. తరువాత నేషనల్ మ్యూజియంకు అప్పగించాడు. ఇప్పుడు వాటిని ఒక హోటల్లో భద్రపరిచారు. అయితే, సుమారు పదేళ్లయినా ఇప్పటికీ అవి తాజాగా ఉన్నాయి. దీని గురించి తెలుసుకున్న వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. కాగా వీటి గురించి ఫుడ్సైన్స్కు చెందిన ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ తేమ ఏమాత్రం లేనందునే అవి తాజాగా ఉన్నాయని అన్నారు. -
మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో...
‘డిస్కోరాజా’ షూటింగ్కు గుమ్మడికాయ కొట్టే సమయం దగ్గరపడింది. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ఐస్ల్యాండ్లో జరిగింది. భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడ మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో కూడా షూటింగ్ చేశారు టీమ్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. వారం రోజులు షూటింగ్ జరిగితే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూరై్తపోతుందట. రజిని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
భూమి భగభగ.. హిమనీనదాలు విలవిల
సాక్షి, అమరావతి: ‘ఐస్ల్యాండ్లోని ఒకుకూల్ హిమనీనదం అంతరించిపోయింది. అది ఇక మృత హిమనీనదం’ అని శాస్త్రవేత్తలు ఒడ్డుర్ సిగురొసన్, కైమెన్ హువే ఈ నెల 18న ప్రకటించారు. వాతావరణ మార్పులతో భూమిపై పర్యావరణానికి ముంచుకొస్తున్న పెనుముప్పుకు తాజా సంకేతం ఇదీ. ఒక్క ఐస్ల్యాండ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిమనీనదాలు వేగంగా కరిగిపోతుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మనదేశ నదీజలాలకు ప్రధాన ఆదరవుగా ఉన్న హిమాలయాల్లోని హిమనీనదాలకు కూడా పెనుప్రమాదం ముంచుకొస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముంచుకొస్తున్న ముప్పు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తాజా అధ్యయనం ప్రకారం.. గ్రీన్హౌస్ ఉద్గారాలు ప్రస్తుత రేటులోనే కొనసాగితే ప్రపంచంలో దాదాపు సగం హిమనీనదాలు 2100 నాటికి పూర్తిగా కనుమరుగైపోతాయి. వాయు కాలుష్యంతో గ్రీన్హౌస్ ఉద్గారాల రేటు అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. 2019, ఆగస్టులో గాలిలో కార్బన్ డయాక్సెడ్ సాంద్రత 415.26 పీపీఎంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా శీతల, సమశీతోష్ణ, ఉష్ణ, సముద్ర తీరప్రాంతాలపై తీవ్ర దుష్ఫలితాలకు కారణమవుతోంది. ఆర్కిటిక్, అంటార్కిటిక్ మినహాయించి హిమనీనదాల ఉపరితల ప్రదేశం 50 శాతం తగ్గిపోయింది. హిమాలయాల్లోని 40 శాతం హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ముఖ్యంగా సూత్రి ఢాకా, బాటల్, బారా షిగ్రీ, సముద్ర తాపు, జెపాంగ్ గాథ్, కుంజుమ్ అనే ఆరు హిమనీనదాలు ఏటా 13 మిల్లీమీటర్ల నుంచి 33 మిల్లీమీటర్ల చొప్పున కరిగిపోతున్నాయని గుర్తించారు. వీటిలో బారా షిగ్రీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. పంజాబ్, హరియాణాలను సస్యశ్యామలం చేస్తున్న చినాబ్ నదికి ఈ హిమనీనదమే ప్రధాన ఆదరువు. ఇది పూర్తిగా కరిగిపోతే చినాబ్ నదిలో నీటి లభ్యత అమాంతం తగ్గిపోతుంది. గంగోత్రి, సియాచిన్ హిమనీనదాలు కూడా అంతకంతకూ కరుగుతుండటం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఇవేకాకుండా ఆండీస్, ఆల్ప్స్, రాకీ పర్వతాల్లోని హిమనీనదాలు కూడా వేగంగా కరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్ల్యాండ్లో మరో 400 హిమనీనదాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని.. గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించకపోతే రాబోయే 200 ఏళ్లలో అవి పూర్తిగా కనుమరుగైపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మేల్కొనకుంటే పెను ప్రమాదమే భూతాపం పెరుగుతుండటం భారత ఉపఖండంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు, సముద్రమట్టాలు పెరగడం, శక్తివంతమైన తుపానులు, వరదలు విరుచుకుపడటం, మరోవైపు ఎడారీకరణ ఇలా పలు రూపాల్లో దుష్ఫ్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజూ లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. 2030 నాటికి ఓజోన్ పొర క్షీణత కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన 26 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. వాతావరణ మార్పుల వల్ల రైతులు, తీరప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాతోపాటు తెలంగాణలోని నల్గొండ, ఒడిశాలోని కలహండీ, కర్ణాటకలోని బెల్గాం జిల్లాలు ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని రిమోట్ సెన్సింగ్ డేటా అధ్యయనాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులతో 974 కి.మీ. పొడవైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రం తరచూ తుపాన్ల బారిన పడుతోంది. తీరప్రాంతం కోతకు గురికావడం, సముద్రపు నీరు పొలాల్లోకి చేరి భూగర్భ జలాలు లవణీకరణకు గురై పంటలు దెబ్బతింటున్నాయి. తీరప్రాంతాన్ని అటవీ శాఖకు అప్పగిస్తే మేలు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. లేకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయి. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు తీరప్రాంతం కేంద్ర బిందువుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. తీరప్రాంతాన్ని అటవీ శాఖకు అప్పగిస్తే బాగుంటుంది. తీరప్రాంతం నుంచి 300 మీటర్ల వరకు మడ అడవులను అభివృద్ధి చేయాలి. తద్వారా కార్బన్ డయాక్సైడ్ను నియంత్రించడంతోపాటు సముద్ర కోత, మట్టి క్షయకరణను నివారించవచ్చు. – మనోజ్ నలనాగుల, భూవిజ్ఞాన శాస్త్ర పరిశోధకుడు -
కరుగుతున్న హిమనదాలు
అంతరించిపోయిన హిమానీనదానికి ఒక విషాద భావగీతం. అవును. ప్రస్తుతం ఐస్లాండ్ శాస్త్రజ్ఞులు సరిగ్గా దీనికే పథకం రచిస్తున్నారు. పశ్చిమ ఐస్లాండ్ ప్రాంతంలో కనుమరుగైపోయిన మొట్టమొదటి హిమానీనదానికి గుర్తుగా ఆగస్టు 18న ఒక స్మారక స్తూపం ఏర్పర్చడానికి రైస్ యూనివర్సిటీ, ఐస్లాండ్ దేశం కలిసి ప్లాన్ చేస్తున్నాయి. ఆ మంచుదిబ్బ పేరు ‘ఓకే’. ఆ స్మారకచిహ్నం ఫలకంపై పొందుపరుస్తున్న సందేశం మనందరినీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. ‘హిమానీనదంగా తన ప్రతిపత్తిని కోల్పోతున్న మొదటి ఐస్లాండ్ మంచుదిబ్బ ఓకే. రాబోయే 200 ఏళ్లలో మన హిమానీనదాలన్నీ ఇదే మార్గం అనుసరించనున్నాయి. మనకు ఏం జరగబోతోందో, మనం ఏం చేయాల్సి ఉందో మనకు స్పష్టంగా తెలుసని ఈ స్మారకస్తూపం గుర్తు చేస్తోంది. మనం దాన్ని చేస్తామా అన్నది లేదా అనేది కూడా మనకే తెలుసు’’ మంచుదిబ్బలు కాదు కరుగుతున్నది భవిష్యత్తు! ఐస్లాండ్ దేశంలోని ఓకే హిమానీనదం ఆ దేశం నుంచి అంతరించిపోతున్న తొలి మంచుదిబ్బ. కానీ ఇది చివరిదేమీ కాదు. వచ్చే 200 సంవత్సరాల్లో ఐస్లాండ్ దేశంలోని మంచుదిబ్బలన్నీ అంతర్థానం కానున్నాయని ఆ స్మారక స్తూప ఫలకం ప్రకటిస్తోంది. అయితే 30 ఏళ్ల తర్వాత అంటే 2050లో ఈ స్మారక స్తూప సందేశాన్ని చూడబోయే ప్రజలందరూ ఓకే హిమానీనదానికి ఆ గతి పట్టించినందుకు ప్రస్తుత తరాన్ని శపించడం ఖాయం. మంచుదిబ్బను కరగదీయడం ద్వారా అత్యంత వేడి, పొడి వాతావరణం కలిగిన భూగ్రహాన్ని మనం భవిష్యత్ తరాలవారికి అందించనున్నాం. ఈ ప్రపంచంలో సంతోషభరితంగా జీవించే అవకాశాన్ని, వారికి దక్కాల్సిన వాటాను మనం దూరం చేసేస్తున్నాం. అంతరించిపోతున్న హిమానీనదాలకు స్మారకస్తూపాలను నెలకొల్పడం నిజంగానే అద్భుతమైన ఆలోచన. అలా మంచుదిబ్బలకు స్మారక స్తూపాలను నిర్మించడం సరైనదే అయినట్లయితే, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, భూటాన్, చైనా దేశాల్లో విస్తరించిన హిమాలయ పర్వత శ్రేణుల పొడవునా మనం అనేక స్మారకస్తూపాలను నిర్మించవలసి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జలగోపురంగా పేరొందిన హిమాలయాలు భూమ్మీద లభిస్తున్న స్వచ్ఛమైన జలంలో 40 శాతాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ ఇక్కడ 50,000 కంటే ఎక్కువ సంఖ్యలో మంచుదిబ్బలు శరవేగంతో కరిగిపోతున్నాయని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యూఎన్డీపీ) వారి అంచనా. ఇవి అంతరిస్తున్న వేగాన్ని చూస్తుంటే, ఈ అత్యున్నత పర్వత శ్రేణికి ఇరువైపులా నివసిస్తున్న 130 కోట్లమంది ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టించడం ఖాయమనే తెలుస్తోంది. మూడో ధ్రువం కరిగితే పెనుముప్పే అంటార్కిటికా, ఆర్కిటిక్ ఖండాల తర్వాత అతిపెద్ద స్థాయిలో మంచును కలిగి ఉన్న మూడో భూభాగంగా హిమాలయాలు గుర్తింపు పొందాయి కాబట్టి దీనిని మూడవ ధ్రువ ప్రాంతం అని పిలుస్తున్నారు. అందుచేత భూగ్రహంలోని అంటార్కిటికా, ఆర్టిటిక్ ధ్రువప్రాంతాలే కాకుండా హిమాలయాలు కూడా వాటికి సమాన స్థాయిలో కరిగిపోయే ప్రమాదం స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే హిమాలయాలు యూరోపియన్ ఆల్ఫ్స్ పర్వతాలతో సమాన వేగంలో కరిగిపోవడం లేదు. గత దశాబ్దకాలంలో ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలోని అనేక హిమానీనదాలు పూర్తిగా అంతరించిపోయాయి. దక్షిణాసియాలో కంటే యూరప్లో చాలా త్వరగా ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించడమే దీనికి కారణం కావచ్చు. కాకపోతే, 2000 సంవత్సరం నుండి హిమాలయాలు ప్రతి సంవత్సరం ఒకటిన్నర అడుగు కంటే ఎక్కువ స్థాయిలో మంచును కోల్పోతున్నాయని ఇటీవలే కొలంబియా యూనివర్సిటీకి చెందిన లేమోంట్–డొహెర్తీ ఎర్త్ అబ్జర్వేటరీ నిర్వహించిన సమగ్ర అధ్యయనం భారత్లో ఆగ్రహావేశాలను ప్రేరేపిస్తుందని నేను ఊహించాను. దీనికి ముందుగా 1975 నుంచి 2000 సంవత్సరం వరకు హిమాలయాల్లో ప్రతి ఏటా 10 అంగుళాల మేరకు మంచు కరుగుతూ వచ్చింది. అయితే తాజా అధ్యయనం ఆసియాలోని పామిర్, హిందూ కుష్, టియాన్ షాన్ అత్యున్నత పర్వత శ్రేణులను తన పరిశీలనాంశంగా చేర్చలేదు. ఈ స్థాయిలో హిమాలయాలు కరుగుతూ రావడం మొత్తం ఆసియా ప్రాంతానికి విధ్వంసకరంగా పరిణమించనుంది. హిమాలయాల్లో హిమానీనదాలు ప్రమాదకరంగా కరిగిపోవడం జాతికి వాస్తవంగా షాక్ కలిగించాలి. ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంతంలోని ప్రజలకు ఇది భారీ నష్టాన్ని కలిగించనుంది. కానీ అరుదుగా కొన్ని పతాక శీర్షికల్లో ప్రస్తావించడం తప్పితే దేశప్రజల్లో ఈ పరిణామం ఎలాంటి ఆగ్రహాన్ని కలిగించలేదు. ఈ సమస్యను తమ సంపాదకీయాల్లో ప్రస్తావించడానికి తగినదేనని వార్తా పత్రికలు కనీసం ఆలోచించలేదు. ఇక టీవీ చానెల్స్ అయితే అసందర్భమైన రాజకీయ ప్రకటనలతో చొంగకార్చుకోవడంలో బిజీగా ఉండిపోయాయి. చెన్నై జల సంక్షోభం నుంచి నేర్చుకోమా? హిమాలయ ప్రాంతంలో విస్తరించిన 650 హిమానీనదాలపై సాధారణంగా ఉపగ్రహాలు తీసే ఫొటోలతోపాటు, అమెరికన్ గూఢచర్య ఉపగ్రహాలు తీసిన ఫొటోలను కూడా వర్గీకరించి చేసిన పై అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం హిమాలయాలు 800 కోట్ల లీటర్ల నీటిని కోల్పోతున్నాయని తెలిసింది. అంటే ప్రతి సంవత్సరం ఒలింపిక్ పరిమాణంలోని 32 లక్షల స్విమ్మింగ్ పూల్స్లలోని నీటికి సమానమైన నీటిని హిమాలయాలు కోల్పోతున్నాయి. దక్షిణ భారతదేశంలోని చెన్నయ్లో ఇటీవల సంభవించిన జల సంక్షోభం కలిగించిన షాక్ని చూస్తే హిమాలయాల్ని కప్పి ఉంచిన మంచు కరిగిపోతుండటం పట్ల మనందరం కూర్చుని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇది మనందరి భవిష్యత్తుతో ముడిపడిన సమస్య కాబట్టి, మన పిల్లలకు మనం విడిచివెళుతున్న జల రహిత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి ప్రజలు తప్పకుండా ఆందోళన చెందాల్సి ఉంటుంది. బలమైన ప్రజాభిప్రాయం జాతి మొత్తాన్ని ప్రకంపింపచేయాలి. ఈ విషయమై భారత పార్లమెంటు కూడా అత్యవసర అర్ధరాత్రి సెషన్కు కూర్చోవాలి. కానీ ఏమీ జరగలేదు. లభ్యమవుతున్న సాగునీటిలో 78 శాతం నీటిని వ్యవసాయ రంగం దుర్వినియోగపరుస్తోందని దెప్పడం మినహా, జీవితం సజావుగానే సాగిపోతోంది. ఈలోగా హిమాలయాల్లో భాగంగా ఏర్పడిన అతి ముఖ్యమైన సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీపరివాహక ప్రాంతాల్లో నీరు క్షీణించిపోతోందని కేంద్ర జల కమిషన్ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇవి ఈశాన్య భారత్, కొంతవరకు మధ్యభారత్ ప్రాంత ప్రజాజీవనానికి అత్యవసర వనరులు. కానీ ఇక్కడ కూడా నీటి లభ్యత తగ్గిపోతుండటం ఎవరూ గుర్తించడం లేదు. ఈ మూడు నదీ పరివాహక ప్రాంతాల్లో సగటున నీటి లభ్యత ఇప్పటికే 40 శాతం క్షీణించిపోయింది. ఇక నదీ పరివాహకప్రాంతం క్షీణించిపోవడంతో తూర్పు, ఉత్తర భారత ప్రాంతంలో 628 చదరపు కిలోమీటర్ల పొడవునా అడవులు హరించుకుపోయినట్లు 2015 అటవీ నివేదిక తెలిపింది ఈ తరం తప్పులతో భవిష్యత్ తరాల బలి ఇలాంటి పరిస్థితుల్లో ఎండిపోతున్న నదుల దిగువ ప్రాంతంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను, తాగునీటి వసతులను దెబ్బతీస్తున్న జల సంక్షోభం నేపథ్యంలో జీవనం సాగిస్తున్న వందల కోట్లమంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో హిమాలయన్ రాష్ట్రాలుగా పేరొందిన జమ్మూ– కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్లు తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న కొండ ప్రాంతాల పరిరక్షణకు కలిసికట్టుగా ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయిదేళ్ల క్రితం కేదార్నాథ్లో సంభవించిన విధ్వంసం పునరావృతం కాకుండా అనువైన పథకాలు రూపొందించడం, నదీపరివాహక ప్రాంతాల పరిరక్షణకోసం సామూహికంగా మదుపులు పెట్టడంపై ఈ రాష్ట్రాలన్నీ దృష్టి సారించాల్సి ఉంది. పర్వతాలు అందించే పర్యావరణ వ్యవస్థ సేవలకు చెందిన ఆర్థిక విలువను మదింపు చేస్తున్న క్రమంలో నీరు, వృక్షాల పరిరక్షణ, నేల కోత నివారణ, వన్యమృగాల పరిరక్షణ వంటి సేవలను తప్పకుండా మిళితం చేయాలి. వీటిని అంతిమంగా రాష్ట్రాల బడ్జెట్ అంచనాల్లో భాగం చేయాలి. పర్వతాలు అందించగలిగే ఆర్థిక సంపదను కొలిచే కొలమానం ఇదే. అభివృద్ధి పేరుతో ఇంతకాలంగా సాగిస్తూ వచ్చిన కొండల్ని కొల్లగొట్టే ప్రక్రియలకు వెంటనే చెల్లుచీటీ చెప్పాలి. పర్వత ప్రాంత రాష్ట్రాల అభివృద్ధికి ఇది నిజంగానే ఒక వినూత్న మార్గంగా ఉపయోగపడుతుంది. ప్రకృతి, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంపైనే పర్వత ప్రాంత రాష్ట్రాలు మనగలుగుతాయి. దీనికి తోడుగా మన పరిశోధనా విధానాలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మైదాన ప్రాంతాల్లో సాగించే పరిశోధనా పద్ధతులను నకలు చేస్తూ పర్వతప్రాంతంలో మన యూనివర్సిటీలు యథాతథంగా అమలు చేయడంలో ఎలాంటి సంబద్ధతా లేదు. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
చలిలో చిల్లింగ్
ఇలా పెళ్లయిందో లేదో అలా హనీమూన్ చెక్కేశారు సౌందర్యా రజనీకాంత్, విశాగన్. తమ విహారయాత్రలకు ఐస్ల్యాండ్ బెస్ట్ అనుకుని అక్కడకు వాలిపోయారు ఈ కొత్త దంపతులు. చల్ల చల్లని ప్రాంతంలో చిల్ అవుతూ ఆ మూమెంట్స్ తాలూకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఐస్లాండ్ ప్రమాదంలో భారతీయుల మృతి
లండన్: ఐస్లాండ్లో విహారయాత్రకు వెళ్లిన మహారాష్ట్రీయుల కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటన్లో ఉండే శ్రీరాజ్, సుప్రీం అనే సోదరులు తమ కుటుంబాలతో కలిసి ఐస్లాండ్లో ‘స్కీయోరార్సండర్’ పర్యాటక ప్రాంతానికి వాహనంలో బయలుదేరారు. గురువారం వేకువజామున నది వంతెన మీదుగా వెళ్తున్న ఆ వాహనం అదుపు తప్పి కిందకు పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఐస్లాండ్ పోలీసులు తెలిపారు. -
అర్జెంటీనా ఊపిరి పీల్చుకో..
మాస్కో : అర్జెంటీనాకు ఉపశమనం లభించింది. లియోనల్ మెస్సీ, అర్జెంటీనా అభిమానులు ఎప్పుడూ లేనంతగా ఐస్లాండ్పై క్రొయేషియా గెలవాలి.. కనీసం ఈ మ్యాచ్ డ్రా అవ్వాలని ప్రార్ధించారు. వారి ప్రార్థనలు ఫలించాయి. ఐస్లాండ్పై 2-1తో క్రొయేషియా గెలిచి అర్జెంటీనాను నాకౌట్కు పంపించింది. ఫిఫా ప్రపంచకప్ తొలి నాకౌట్ పోరులో ఫ్రాన్స్తో అర్జెంటీనా శనివారం రోజు(జూన్ 30)న తలపడనుంది. మంగళవారం అర్ధరాత్రి ఐస్లాండ్తో జరిగిన హోరాహోరి మ్యాచ్లో చివరకు క్రోయేషియా విజయం సాధించింది. తొలి భాగం ముగిసే సరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. రెండో అర్థభాగం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకు క్రొయేషియా ఆటగాడు బాడెల్జ్ (53వ నిమిషంలో) తొలి గోల్ నమోదు చేశాడు. గోల్పోస్ట్పై ఇరుజట్లు పోటీపడీ దాడులు చేసినా, రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. 76వ నిమిషంలో పెనాల్టీ కిక్ రూపంలో ఐస్లాండ్ను అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐస్లాండ్ ఆటగాడు సిగుర్గ్స్సన్ గోల్గా మలిచాడు. రెండో అర్థభాగం పూర్తవుతుందనుకున్న సమయంలో క్రొయేషియా ఆటగాడు పెరిసిక్ కళ్లుచెదిరే రీతిలో గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఇంజ్యూరీ టైమ్లో ఇరుజట్లు మరో గోల్ నమోదు చేయకపోవడంతో క్రొయేషియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఐస్లాండ్ అత్యధిక సార్లు(17) గోల్ కోసం ప్రయత్నించగా, క్రొయేషియా రక్షణశ్రేణి విజయవంతంగా ఆడ్డుకుంది. క్రొయేషియా అనవసర తప్పిదాలు 12 చేయగా, ఐస్ లాండ్ 10 తప్పిదాలు చేసింది. ఈ మ్యాచ్లో రిఫరీలు ఇద్దరు క్రొయేషియా, ముగ్గురు ఐస్లాండ్ ఆటగాళ్లకు ఎల్లో కార్డు చూపించారు. -
అరంగేట్రంలోనే అద్భుతం
ఆడుతున్నది ప్రపంచ కప్లో తొలి మ్యాచ్... ప్రత్యర్థి దిగ్గజం... అయినా ఐస్లాండ్ అదరలేదు... బెదరలేదు! విపరీతమైన దాడులు ఎదురైనా, బంతి ఎక్కువసేపు తమ ఆధీనంలో లేకున్నా దీటుగా నిలిచింది. మెస్సీలాంటి మహామహుడున్న అర్జెంటీనాను నిలువరించింది. అద్భుత ఆటతో అరంగేట్ర మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకుంది. మరోవైపు మెస్సీ పెనాల్టీ కిక్ను వృథా చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మాస్కో: ఫుట్బాల్ పసికూన ఐస్లాండ్ తమ తొలి ప్రపంచ కప్ను ఘనంగా ప్రారంభించింది. కొండలాంటి అర్జెంటీనాతో తలపడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడింది. సులువుగా గెలిచేస్తుందనుకున్న లియోనల్ మెస్సీ జట్టుకు చుక్కలు చూపింది. శనివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో దుర్బేధ్యమైన డిఫెన్స్తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి 1–1తో డ్రా చేసుకుంది. ఈ ఫలితం ఐస్లాండ్కు విజయంతో సమానం కాగా, ఓడకపోయినా అర్జెంటీనాకు మింగుడుపడని పరిణామమే. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఎన్నడూ లేనంతగా ఏకంగా 11 సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేసినా ఒక్కసారీ విజయవంతం కాలేకపోవడం గమనార్హం. ఓ పెనాల్టీ కిక్తో పాటు మెస్సీని అన్నిసార్లు అడ్డుకున్న ఐస్ల్యాండ్ గోల్ కీపర్ హాన్స్ హాల్డర్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. రెండూ మొదటి భాగంలోనే... అర్జెంటీనా స్థాయి జట్టు ఏ క్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం ఉంటుందని భావించిన ఐస్లాండ్ రక్షణాత్మక ఆటను ఎంచుకుని మ్యాచ్లో ఒక్కడే ఫార్వర్డ్ ప్లేయర్తో బరిలో దిగింది. దీనికి తగ్గట్లే, మెస్సీ నుంచి రెండు ఫ్రీ కిక్లు ఎదురై ప్రారంభం కఠినంగానే సాగినా వెంటనే కోలుకుంది. ఇదే సమయంలో ఆ జట్టుకూ అవకాశం వచ్చినా సఫలం కాలేదు. అనూ హ్యంగా మెస్సీ ఒత్తిడిలో పడటంతో అర్జెంటీనాకూ పైచేయి చిక్కలేదు. అయితే, క్రమంగా అటాకింగ్ గేమ్లోకి దిగింది. దీని ఫలితం 19వ నిమిషంలోనే కనిపించింది. మార్కస్ రోజో అందించిన క్రాస్ పాస్ను బాక్స్ ఏరియా నుంచి కున్ అగ్యురో అద్భుతమైన రీతిలో గోల్పోస్ట్లోకి పంపాడు. ఈ ఆధిక్యాన్ని ఆస్వాదించే లోపే ఒక్కసారిగా మెస్సీ జట్టుకు షాక్ తగిలింది. అర్జెంటీనా డిఫెన్స్లోని అనిశ్చితిని సొమ్ము చేసుకుంటూ 23వ నిమిషంలో ఫిన్బొగాసన్ ఐస్లాండ్కు చరిత్రాత్మక గోల్ అందించాడు. అప్పటికీ మెస్సీ బృందం అప్రమత్తమై దాడులతో ఆధిపత్యానికి ప్రయత్నించింది. ఐస్లాండ్ డిఫెన్స్ను ఛేదించలేక ఫలితం రాబట్టలేకపోయింది. పట్టు వదల్లేదు... అత్యుత్తమ ఆటతో తొలి భాగంలో అర్జెంటీనాను కాచుకుని నిలిచిన ఐస్లాండ్... రెండో భాగంలోనూ పట్టుదల చూపింది. ప్రత్యర్థి గోల్పోస్ట్ వరకు వెళ్లలేకపోయినా, వారి డిఫెన్స్ బలహీనతను సొమ్ము చేసుకుంటూ దూకుడు చూపింది. అయితే 63వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు మాగ్నసన్ కారణంగా అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ లభించింది. దీనిని మెస్సీ పేలవంగా కొట్టగా... గోల్ కీపర్ హాల్డర్సన్ కుడి వైపునకు ఒరిగిపోతూ అడ్డుకున్నాడు. ఉపేక్షిస్తే గెలుపు దక్కే పరిస్థితి లేదని భావించిన అర్జెంటీనా... జోరు పెంచి ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసింది. అయినా ఐస్లాండ్ డిఫెన్స్ను దెబ్బతీయలేకపోయింది. వ్యూహం మార్చిన మెస్సీ దూరం నుంచి గోల్కు ప్రయత్నించినా, కీలక ఆటగాడైన హిగుయెన్ను 84వ నిమిషంలో బరిలో దింపినా ఇవేమీ ఐస్లాండ్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయాయి. ఇంజ్యూరీ సమయం (90+5) ఆఖర్లో వచ్చిన ఫ్రీ కిక్నూ మెస్సీ సద్వినియోగం చేయలేకపోయాడు. దీంతో మ్యాచ్ 1–1తో డ్రా అయింది. గెలుపు చిక్కకపోయినా... బంతిని ముప్పావు వంతు ఆధీనంలో ఉంచుకోవడం, తీవ్రంగా దాడులకు దిగడం వంటివి అర్జెంటీనాకు ఉపశమనం కలిగించాయి. -
భువిలో మహిళల దీవి
ఐస్ల్యాండ్.. దీవిలా ఉండే దేశం. మహిళలకు అది ‘దివి’ భూమి! ఐరోపాలో ఉంది. ఉత్తర అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉంటుంది. ‘గ్లోబల్ జెండర్ గ్యాప్’ సంస్థ రిపోర్టు ప్రకారం.. స్త్రీలను భద్రంగా, గౌరవంగా చూసుకునే ప్రపంచ దేశాలలో తొమ్మిదేళ్లుగా ఐస్ల్యాండ్దే ఫస్ట్ ప్లేస్. ఇప్పుడక్కడ స్త్రీ పురుషులు మరింత ఈక్వల్ ఈక్వల్ అయ్యారు. ఎలాగంటే.. న్యూ ఇయర్ నుండి అక్కడ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇరవై అయిదు, అంతకు మించి ఉన్న సిబ్బంది ఉన్న ప్రతి సంస్థ.. గవర్నమెంట్, ప్రైవేట్.. ఏదైనా సరే, ఆడవాళ్ల కంటే మగవాళ్లకు ఎక్కువ జీవితం ఇవ్వడం చట్టవిరుద్ధం! సమాన పనికి సమానం వేతనం ఉండాల్సిందే. ఆడ, మగ తేడాలు చూపడానికి లేదు. చూపట్లేదు అని ఎలా తెలుస్తుంది? గవర్నమెంటు దగ్గర్నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. ‘ఈ సంస్థ సమాన వేతనాలు ఇస్తోంది’ అని! ఆ సర్టిఫికెట్ ఊరికే ఇవ్వదు కదా ప్రభుత్వం. స్కాన్ చేసి, స్క్రీన్ చేసి ఇస్తుంది. సర్టిఫికెట్ ఉన్నవాళ్లకే రాయితీలు అవీ ఇస్తుంది. జీతాలు మిగుల్చుకుందామని చెప్పి, మహిళా ఉద్యోగులకు మగ ఉద్యోగులకన్నా తక్కువ జీతం ఇవ్వాలనే ఏ కంపెనీ అయినా కక్కుర్తి పడితే ఇదిగో ఈ రాయితీలు కట్ అవుతాయి. ఇలాంటి చట్టం తేవాలని లాస్ట్ ఇయర్ మహిళా దినోత్సవం రోజు ఐస్ల్యాండ్ గవర్నమెంట్ ఫిక్స్ అయింది. చక్కగా ప్లాన్ చేసి, ఈ జనవరి ఫస్ట్ నుంచి అమలు చేస్తోంది. ఐస్ల్యాండ్ పార్లమెంటులో సగం మందికి పైగా మహిళలు ఉన్నారు. ప్రధాని కూడా మహిళే! అందుకే ‘ఈక్వల్ పే’ చట్టం సాధ్యమైందా? ఏమైనా స్త్రీకి స్త్రీయే స్నేహితురాలు. అన్నట్టు ప్రపంచంలో ఇలాంటి చట్టం చేసిన మొట్ట మొదటి దేశం ఐస్ల్యాండే. -
ఐస్లాండ్ అద్భుతం
రిక్జావిక్ (ఐస్లాండ్): గతేడాది యూరో ఫుట్బాల్ చాంపియన్షిప్లో తమ క్వార్టర్ ఫైనల్ ప్రదర్శన గాలివాటమేమీ కాదని ఐస్లాండ్ జట్టు నిరూపించింది. కేవలం 3 లక్షల 30 వేల జనాభా ఉన్న ఈ చిన్న యూరోప్ దేశం వచ్చే ఏడాది రష్యాలో జరిగే ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. యూరోప్ జోన్లో భాగంగా జరిగిన తమ చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఐస్లాండ్ 2–0తో కొసావో జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్ను దక్కించుకుంది. ఆరు జట్లు ఉన్న గ్రూప్–1లో ఐస్లాండ్ 10 మ్యాచ్లు ఆడి 7 విజయాలు, ఒక ‘డ్రా’, రెండు పరాజయాలతో మొత్తం 22 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్కు అర్హత పొందిన అతి చిన్న దేశంగా (జనాభా పరంగా) ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఈ ఘనత ట్రినిడాడ్ అండ్ టొబాగో (2006–కోటి 30 లక్షల జనాభా) పేరిట ఉండేది. వచ్చే ఏడాది జూన్ 14 నుంచి జూలై 15 వరకు రష్యాలో జరిగే ప్రపంచకప్లో మొత్తం 32 జట్లు పాల్గొంటాయి. ఇప్పటివరకు ఆతిథ్య రష్యా జట్టుతో కలిపి 17 జట్లు అర్హత సాధించగా... నవంబర్ 14వ తేదీతో మిగతా 15 జట్లు ఖాయమవుతాయి. -
ఆమెకు ఎందుకింత ఫాలోయింగ్..?
రెక్జావిక్: బిర్నా బ్రాన్స్డాటిర్ అనే 20 ఏళ్ల అమ్మాయి జనవరి నెలలో తప్పిపోయింది. యావత్ దేశం ఆమె గురించే చర్చ. కొండలు, గుట్టలతోపాటు నిర్జీవ ప్రదేశాలన్నింటినీ గాలించండంటూ దేశాధ్యక్షుడు ప్రజలందరికి పిలుపునిచ్చారు. అలా ప్రజల గాలింపులో ఎనిమిది రోజుల తర్వాత ఓ సముద్ర తీరంలో ఆమె మృతదేహం దొరికింది. దేశాధ్యక్షుడు తోర్లాసియస్ జోహానెస్సన్, ప్రధాన మంత్రి బెనెడిక్ట్సన్లతోపాటు ప్రజలంతా ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె రాజకీయవేత్తకాదు, పారిశ్రామికవేత్తకాదు. అందరిలా డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయి. మరి ఆమెకు ఎందుకింత ఫాలోయింగ్ అన్న అనుమానం రావచ్చు. ఐస్లాండ్లో అంతేమరి. అక్కడ ఓ అమ్మాయి చనిపోతే ప్రజలంతా తమ కూతురో, సోదరియో చనిపోయినంతగా, అబ్బాయి చనిపోతే తమ కుమారుడో, సోదరుడో మరణించినంతగా బాధపడతారు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులూ అంతే. అందుకే ఐస్లాండ్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ. హత్యల రేటు ఏడాదికి 1.8 శాతం మాత్రమే ఉంది. నిరుద్యోగం కూడా చాలా తక్కువ. 2008 తర్వాత ఆ దేశంలో ఒక్క ఆత్మహత్య కూడా లేని సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. 2008లో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసినప్పడు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ఒకటి, రెండు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసినా ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదు. 1944లో రక్తపాత రహితంగానే డెన్మార్క్ నుంచి స్వాతంత్య్రం సాధించిన చరిత్ర కూడా ఐస్లాండ్కు ఉంది. ఈ దేశంలో ప్రజలంతా సమానత్వ భావనతో మెదలుతారు. ఆపదలో ఒకరినొకరు ఆదుకుంటూ పరస్పర సహకారంతో ప్రజలంతా బతుకుతారు. ఏడాదిలో తక్కువ ఎండకాలం, ఎక్కువ శీతాకాలం ఉండడం వల్ల కూడా ప్రజల మధ్య పరస్పర సహకారం అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు సమైక్య జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమాజంలో హత్యలు జరిగినప్పుడు కలవరం రేగుతుంది. 20 ఏళ్ల బిర్నాను చంపింది కూడా విదేశీయులేనని దర్యాప్తులో తేలింది. గ్రీన్లాండ్ నుంచి వచ్చిన ఇద్దరు నావికులు ఐస్లాండ్ సముద్రం ఒడ్డున లంగర్ వేసినప్పుడు ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి తిరిగి వారి దేశం వెళ్లిపోవడంతో ఐస్లాండ్ పోలీసులు గ్రీన్లాండ్ వెళ్లి అనుమానితులను హెలికాప్టర్లో తీసుకొచ్చారు. హత్య వెనక కారణం ఏమిటో ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
వాళ్లు వెళ్లిపోయారు... వీళ్లు వడలిపోయారు!
జెండర్ ఫైట్ ఐస్లాండ్లో నిన్న మళ్లీ మధ్యాహ్నం 2.38 నిమిషాల తర్వాత మహిళలెవరూ ఆఫీసులలో కనిపించలేదు! గత కొన్ని సొమవారాలుగా ఆ దేశంలో ఇలా మహిళా ఉద్యోగులు మధ్యలోనే పనిమాని, లే దా పని అక్కడికి ముగించి, ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అలాగని వారి ప్రభుత్వం ఆఫ్టర్నూన్ నుంచి ఆడవాళ్లంతా హాయిగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని ఏమీ ప్రకటించలేదు. ఉద్యోగినులే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మగవాళ్లకు ఇస్తున్న జీతాలతో పోల్చిచూస్తే... తమకు వచ్చే జీతానికి తాము 2.38 గంటల వరకు మాత్రమే పనిచేస్తే సరిపోతుందని లెక్కగట్టి, అంతవరకే ఆఫీసులలో ఉంటున్నారు ఐస్లాండ్ మహిళా ఉద్యోగులు. సమానమైన పనికి సమానమైన వేతనం ఉండాలని ఎన్నిసార్లు పిడికిలి బిగించి, నినాదాలు చేసినా ఫలితం లేకపోవడంతో వాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దశాబ్దం క్రితం.. 2005లో మధ్యాహ్నం 2.08 గంటల వరకు పని చేసి వెళ్లిపోయేవారు. 2008లో ఆ వెళ్లిపోయే సమయం 2. 25 గం. అయింది. ఇప్పుడు అదే 2.38కి వచ్చింది. అంటే జీతంలోని అసమానతలు కొద్దికొద్దిగా తగ్గేకొద్దీ సోమవారాల్లో వీళ్లు పనిచేసే టైమ్ నిమిషాల వ్యవధిలో పెరుగుతూ వస్తోంది. ఈ ధోరణితో ప్రభుత్వ కార్యాలయాలు తలపట్టుకుంటున్నాయి. వారానికొకసారి కొన్ని గంటల ముందు మహిళా ఉద్యోగినులు ఇళ్లకు వెళ్లిపోతే వచ్చే నష్టం కన్నా... వాళ్లు వెళ్లిపోయాక వెలవెలపోతున్న కార్యాలయాల్లో పురుష ఉద్యోగులు ఉత్సాహం నశించి, ఈసురోమంటూ పని చేసుకుంటూ పోవడం వల్ల ఉత్పాదక తగ్గి ఎక్కువ నష్టం వస్తోందని అక్కడి సర్వేలు చెబుతున్నాయట! ఈ మాట అలా ఉంచితే... స్త్రీ పురుష వివక్ష లేని దేశంగా కొన్నేళ్ల నుంచీ ఐస్లాండ్ మార్కులు కొట్టేస్తోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వాళ్ల ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్’ ప్రకారం ఐస్లాండ్కు ‘మహిళల స్వర్గసీమ’ అన్న పేరు కూడా ఉంది. ఎంత పేరున్నా నేటికీ ఆ దేశంలోని మహిళలు మగవాళ్లకన్నా 14 నుంచి 17 శాతం తక్కువగా జీతాలు పొందుతున్నారు. -
ఫ్రాన్స్.. ‘పాంచ్’ పటాకా
యూరో కప్లో ఐస్లాండ్ సంచలన ప్రదర్శన క్వార్టర్స్లో ముగిసింది. సూపర్స్టార్లతో నిండిన ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు తమ స్థాయికి తగ్గట్టుగానే ఆడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అయితే పసికూన ఐస్లాండ్ ఈ మ్యాచ్లో అసాధారణ తెగువ చూపింది. ఫ్రాన్స్ డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకుంటూ ద్వితీయార్ధంలో రెండు గోల్స్ కూడా సాధించి శభాష్ అనిపించుకోగలిగింది. ఇక సెమీస్లో తమ చిరకాల శత్రువు జర్మనీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఫ్రాన్స్ సిద్ధమవుతోంది. * యూరో కప్ సెమీస్లోకి ప్రవేశం * క్వార్టర్స్లో 5-2తో ఐస్లాండ్పై విజయం పారిస్: యూరో చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా నిలిచేందుకు ఫ్రాన్స్ జట్టు మరో అడుగు ముందుకేసింది. ఆదివారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్స్లో స్ట్రయికర్ ఒలివియర్ గిరౌడ్ రెండు గోల్స్తో అదరగొట్టడంతో ఆతిథ్య జట్టు 5-2 తేడాతో ఐస్లాండ్పై నెగ్గింది. దీంతో తమ చిరకాల శత్రువు జర్మనీతో అమీతుమీ తేల్చుకునేందుకు శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బరిలోకి దిగనుంది. గత ప్రపంచకప్ క్వార్టర్స్లో ఫ్రాన్స్ జట్టు జర్మనీ చేతిలోనే ఓడింది. ప్రిక్వార్టర్స్లో ఇంగ్లండ్ను కంగుతినిపించిన ఐస్లాండ్ను ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు తేలిగ్గా తీసుకోలేదు. వారి బలం, బలహీనలతలపై దృష్టి పెట్టి తగిన వ్యూహాలతో బరిలోకి దిగింది. దీనికి తోడు సొంత అభిమానుల మద్దతుతో ఆరంభం నుంచే చెలరేగిన ఫ్రాన్స్ పూర్తి స్థాయి అటాకింగ్తో తొలి అర్ధభాగంలోనే నాలుగు గోల్స్తో పైచేయి సాధించింది. ఓవరాల్గా ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ గిరౌడ్ (12, 59వ నిమిషాల్లో), పోగ్బా (20), పయేట్ (43), గ్రిజ్మన్ (45) గోల్స్ సాధించారు. ఐస్లాండ్కు సితోర్సన్ (56), జర్నాసన్ (84) గోల్స్ అందించారు. ఆరంభం నుంచే దూకుడు మ్యాచ్ ప్రారంభం నుంచే ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్లు ఎదురుదాడికి దిగారు. దీంతో జట్టు 12వ నిమిషంలో ఖాతా తెరిచింది. మిడ్ఫీల్డ్ నుంచి మటౌడి ఇచ్చిన పాస్ను ఏరియాలో అందుకున్న గిరౌడ్ గోల్గా మలిచాడు. 18వ నిమిషంలో ఐస్లాండ్ ఆటగాడు బొడ్వర్సన్ హెడర్ ప్రయత్నం నేరుగా గోల్కీపర్ లోరిస్ చేతుల్లోకి వెళ్లింది. కానీ మరో నిమిషంలోనే రైట్ వింగ్ కార్నర్ నుంచి గ్రిజ్మన్ ఇచ్చిన పాస్ను పాల్ పోగ్బా హెడర్ గోల్గా మలిచి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ఇదే జోరుతో ప్రథమార్ధం మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ఫ్రాన్స్ రెండు గోల్స్తో రెచ్చిపోయింది. 43వ నిమిషంలో గ్రిజ్మన్ ఇచ్చిన పాస్ను ఐస్లాండ్ ముగ్గురు డిఫెండర్లకు చిక్కకుండా బాటమ్ కార్నర్ వైపు గోల్ చేయగా 45వ నిమిషంలో బ్యాక్ నుంచి పోగ్బా ఇచ్చిన లాంగ్ పాస్ను అందుకున్న గ్రిజ్మన్ బంతిని కాస్త ముందుకు తీసుకెళ్లి చిప్ షాట్తో గోల్ కీపర్ పైనుంచి నెట్లోకి పంపి ఫస్ట్ హాఫ్ను 4-0తో ముగించాడు. 56వ నిమిషంలో ఐస్లాండ్ మ్యాచ్లో బోణీ చేసింది. రైట్ ఫ్లాంక్ నుంచి సిగర్డ్సన్ ఇచ్చిన క్రాస్ను పోస్టుకు అతి సమీపం నుంచి సితోర్సన్ గోల్ చేశాడు. అయితే వెంటనే కోలుకున్న ఫ్రాన్స్ 59వ నిమిషంలోనే ఐదో గోల్ చేసింది. 40 గజాల దూరం నుంచి సంధించిన పయేట్ ఫ్రీకిక్ను వేగంగా అందుకున్న గిరౌడ్ హెడర్తో గోల్ చేశాడు. పలు ప్రయత్నాల అనంతరం ఐస్లాండ్ ఫ్రాన్స్ డిఫెన్స్ను ఛేదించి రెండో గోల్ చేయగలిగింది. అరి స్కులసోన్ క్రాస్ను జర్నాసన్ గోల్ చేసి ప్రత్యర్థి ఆధిక్యాన్ని కాస్త తగ్గించగలిగినా ప్రయోజనం లేకపోయింది. సెమీస్లో ఎవరితో ఎవరు పోర్చుగల్ X వేల్స్ గురువారం రాత్రి 12.30 గంటల నుంచి జర్మనీ X ఫ్రాన్స్ శుక్రవారం రాత్రి 12.30 గంటల నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్షప్రసారం 1 యూరోలో వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఒక్క మార్పు కూడా లేకుండా బరిలోకి దిగిన జట్టుగా ఐస్లాండ్ చరిత్ర సృష్టించింది. -
ఇంగ్లండ్ గుండె పగిలింది
ఫుట్బాల్ అంటే వారికి ప్రాణం... ఆట కోసం నిద్రాహారాలు మానేస్తారు... ప్రపంచంలో ఏ మూల తమ జట్టు ఆడుతున్నా వేలాదిగా వెళ్లి జట్టును ప్రోత్సహిస్తారు. ఆ దేశంలో పుట్టిన ఆటగాడు ఎవరైనా బాగా ఆడాడంటే దేవుడిలా ఆరాధిస్తారు. ఇంగ్లండ్లో ఫుట్బాల్కు ఉన్న ఆదరణ, మమకారం ఇది. అందుకే ఆ దేశంలో జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ. అయితే 1966 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తర్వాత ఇంగ్లండ్ జాతీయ జట్టు మాత్రం ఏ టైటిల్ గెలవలేదు. ఈసారి యూరోలో ఎలాగైనా తమ జట్టు గెలుస్తుందని భారీ అంచనాలతో ఉన్న ఇంగ్లండ్ గుండె పగిలింది. యూరో ప్రిక్వార్టర్స్లో ఐస్లాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయింది. నైస్: ఐస్లాండ్ జనాభా కేవలం 3 లక్షల 38 వేలు. జట్టులో స్టార్ ఆటగాళ్లెవరూ లేరు. జట్టులో ఎవరికీ పెద్దగా అనుభవం కూడా లేదు.అయినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో చెలరేగిన ఐస్లాండ్... ఈ యూరోలోనే పెను సంచలనం నమోదు చేసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఐస్లాండ్ 2-1తో ఇంగ్లండ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఐస్లాండ్ తరఫున సిక్వెర్డ్సన్ (6వ ని.), సిగ్తోర్సన్ (18వ ని.) గోల్స్ చేయగా, కెప్టెన్ రూనీ (4వ ని.) ఇంగ్లండ్కు ఏకైక గోల్ అందించాడు. 1966 తర్వాత మరో మేజర్ టైటిల్పై కన్నేసిన ఇంగ్లండ్ ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఆరు మార్పులతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మైదానంలో చురుకుగా కదల్లేకపోయింది. ఆరంభంలో స్టెర్లింగ్ ఇచ్చిన పాస్ను స్టూరిడ్జ్ గోల్గా మలిచే ప్రయత్నంలో ఐస్లాండ్ గోల్ కీపర్ ఫౌలయ్యాడు. దీంతో నాలుగో నిమిషంలో లభించిన పెనాల్టీని రూనీ బాటమ్ నుంచి లక్ష్యాన్ని చేర్చాడు. దీంతో కెరీర్లో 53వ గోల్తో డేవిడ్ బెక్హామ్ సరసన నిలిచాడు. అయితే ఇంగ్లండ్ ఆనందం రెండు నిమిషాల్లోనే ఆవిరైంది. ఐస్లాండ్ రైట్ విండ్ మిస్సైల్ కారీ ఆర్నసన్ హెడ్తో అందించిన పాస్ను సిక్వెర్డ్సన్ చాకచక్యంగా నెట్లోకి పంపి స్కోరును సమం చేశాడు. మరో 12 నిమిషాల తర్వాత సిక్వెర్డ్సన్, బోద్వర్సన్లు సమయోచితంగా కదులుతూ ఇచ్చిన పాస్ను సిగ్తోర్సన్ ఇంగ్లండ్ గోల్ కీపర్ హార్ట్ను ఏమారుస్తూ గోల్పోస్ట్లోకి పంపాడు. తర్వాత ఇంగ్లండ్ సూపర్ అటాకింగ్తో రెచ్చిపోయినా ఐస్లాండ్ రక్షణశ్రేణి సమర్థంగా తిప్పికొట్టింది. రెండో అర్ధభాగంలో కాస్త వ్యూహాత్మకంగా ఆడిన ఇంగ్లండ్ ఒకటి, రెండు అవకాశాలను సృష్టించుకున్నా ఐస్లాండ్ డిఫెండర్లు అడ్డుకోవడంతో ఓటమి తప్పలేదు. హడ్సన్ రాజీనామా! ఓటమికి బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ కోచ్ రాయ్ హడ్సన్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవంగా ఈ టోర్నీ తర్వాత ఆయన కాంట్రాక్ట్ ముగియనుంది. అయితే తను మరోసారి ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే అవకాశాల్లేవని హడ్సన్ స్పష్టం చేశారు. ‘మరో రెండేళ్లు పదవిలో ఉండాలని అనుకున్నా. కానీ ఇది పూర్తిగా ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. యూరో తర్వాత నా కాంట్రాక్ట్ను పునరుద్ధరించేవాళ్లు. కానీ ఇప్పుడు వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నా’ అని హడ్సన్ పేర్కొన్నారు. -
ఐస్లాండ్ అధ్యక్షుడిగా జొహాన్నెసన్
రెక్జావిక్: హిస్టరీ ప్రొఫెసర్ జొహాన్నెసన్.. ఐస్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో 39.1 శాతం ఓట్లతో ఆయన గెలుపొందారు. ఐస్లాండ్కు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులకు విదేశాల్లో అవినీతి ఖాతాలు ఉన్నట్లు పనామా పత్రాల్లో వెల్లడైన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. జొహాన్నెసన్ తన 48వ పుట్టిన రోజునే అధ్యక్షుడిగా ఎన్నికవడం విశేషం. మరోవైపు స్వతంత్రంగా బరిలోకి దిగిన మహిళా పారిశ్రామికవేత్త హల్లా టొమాస్డొటిర్ 27.9 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రచారంలో జొహాన్నెసన్కు గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించిన మాజీ ప్రధాని డేవిడ్ ఆడ్సన్ 13 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. గత రెండు దశాబ్దాలుగా అధ్యక్షుడిగా ఉన్న ఓల్ఫర్ రాగ్నర్ గ్రిమ్సన్ స్థానంలో జొహాన్నెసన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ద్వీపం జనాభా కేవలం 3.34 లక్షలు కాగా, 10 శాతం మంది యూరో-2016 ఫుట్బాల్ టోర్నమెంట్లో తమ జట్టు ప్రదర్శన చూసేందుకు ఫ్రాన్స్ కు వెళ్లిపోయారు. -
ఎందుకు కట్టాలి?
ఇతని పేరు మాట్ బోటెన్. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నివాసి. గర్ల్ఫ్రెండ్తో కలసి ఐస్ల్యాండ్కు హాలీడే ట్రిప్నకు బయలుదేరాడు. గాత్విక్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్కు వెళ్లగా... మీ లగేజీ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉంది... 45 పౌండ్లు (దాదాపు 4,250 రూపాయలు) కట్టాలని అక్కడి సిబ్బంది చెప్పారు. దీన్ని తప్పించుకోవడానికి మనోడికి వెంటనే ఓ ఐడియా తట్టింది. బ్యాగును ఓపెన్ చేసి... అందులో ఉన్న దుస్తులన్నింటినీ ఇలా ధరించేశాడు. ఒకదానిపై మరొకటి వేసుకున్నాడు. చివరికి అదనంగా ఓ షూ జత ఉంటే దాన్నిలా ప్యాంటు రెండు జేబుల్లోకి దోపుకున్నాడు. తోటి ప్రయాణికులు నవ్వుకుంటున్నా... చెక్ ఇన్ సిబ్బంది నోళ్లు వెళ్లబెట్టి చూస్తుండగా... దర్జాగా వెళ్లి విమానంలో కూర్చున్నాడు. ఒక్క పైసా అదనంగా కట్టకుండానే. పైగా ఈ ఫొటో తీసి ‘నేను వెళుతోంది ఐస్ల్యాండ్కు కదా... అందుకే ఇలా’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. -
ఎంత పెద్ద ఏనుగో...
డైనోసార్ల కాలంనాటి భారీ ఏనుగు నీళ్లు తాగుతున్నట్లు ఉంది కదూ...! నిజానికి ఇది దక్షిణ ఐస్ల్యాండ్లోని హీమేయ్ దీవిలో సముద్రతీరంలో ఏర్పడిన లావా ఆకృతి. 1973లో ఇక్కడి ఎల్డ్ఫెల్ అనే అగ్నిపర్వతం బద్దలై లావాను వెదజిమ్మింది. దగ్గర్లోని హార్బర్ను రక్షించుకోవాలనే ఉద్దేశంతో స్థానికులు చల్లని సముద్రపు నీటిని మోటర్ల సాయంతో లావాపై వెదజల్లారు. అప్పుడు ఏర్పడిందే ఈ ఏనుగు. పర్యాటకులకు ఇదో పెద్ద ఆకర్షణగా మారిందట. -
వారి తలరాతలు బాగున్నాయి...
ఫొటో చాలా కలర్ఫుల్గా, అద్భుతంగా ఉంది కదూ? ఫొటోయే కాదు.. ఆ విమానంలో ఉన్నవారి తలరాత కూడా చాలా బావుంది. అందుకే పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐస్లాండ్లోని హోలుహ్రౌన్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతంపై సరదాగా చక్కర్లు కొట్టాలని కొందరు సందర్శకులు ఈ విమానంలో బయలుదేరారు. సరిగ్గా అగ్నిపర్వతం దగ్గరకు వెళ్లేసరికి అది బద్దలై ఒక్కసారిగా లావా ఇంతెత్తున లేచింది. దాదాపు 850 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న లావా.. ఏకంగా 200 మీటర్ల ఎత్తుకు పెల్లుబికింది. అయితే అదృష్టం కలిసిరావడంతో ఈ విమానానికి ఎలాంటి ముప్పూ వాటిల్లలేదు. అదే సమయంలో ఈ అగ్నిపర్వతం చుట్టూ చక్కర్లు కొడుతున్న మరో విమానంలో నుంచి బల్దూర్ అనే వ్యక్తి ఈ చిత్రాన్ని చకచకా కెమెరాలో బంధించారు. -
అవార్డుల కాంతి..
నింగిలో పచ్చని రంగులో మెరిసిపోతున్న ఉత్తర ధ్రువ కాంతులు.. కింద నీటిలో దాని ప్రతిబింబం.. ఐస్లాండ్లోని వత్నజోకల్ నేషనల్ పార్కు వద్ద బ్రిటన్కు చెందిన ఫొటోగ్రాఫర్ జేమ్స్ వుడ్ఎండ్ తీసిన చిత్రమిది. ఇదింత బాగుంది కాబట్టే.. తాజాగా ప్రకటించిన ఆస్ట్రోనమీ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014 పోటీలో మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ , బీబీసీ స్కై వాళ్లు ఏటా ప్రదానం చేస్తున్నారు.