India Win
-
రో‘హిట్స్’... భారత్దే సిరీస్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత శిబిరానికి గొప్ప శుభవార్త! క్రికెట్ను శ్వాసించే అభిమానులకు కచ్చితంగా ఇది తీపి కబురు! ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్లోకి వచ్చాడు. అట్లాంటి... ఇట్లాంటి... ఆటతో కాదు. 300 పైచిలుకు పరుగుల వేటలో భారత్ ఉండగా... తనశైలి రో‘హిట్స్’తో అలరిస్తూ, లక్ష్యాన్ని కరిగిస్తూ, శతకంతో కదంతొక్కాడు. అతని జోరుకు మైదానం హోరెత్తింది. పెద్ద లక్ష్యమే అయినా చిన్నబోయింది. ఇంకో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్ కూడా టీమిండియా వశమైంది.కటక్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రెండు, మూడు మ్యాచ్లు విఫలమైనా... తక్కువ స్కోరుకు అవుటైనా... విమర్శకులు ఈ మధ్య నెట్టింట తెగ విరుచుకుపడుతున్నారు. ఆదివారం ‘హిట్మ్యాన్’ విరుచుకుపడ్డాడు. నోటితో కాదు... బ్యాట్తో! నెట్లో కాదు... మైదానంలో! అద్భుతమైన సెంచరీతో కొండంత లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించేలా చేశాడు. దీంతో ఆఖరి పోరు మిగిలుండగానే వన్డే సిరీస్ కూడా భారత్ చేతికి చిక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు), జో రూట్ (72 బంతుల్లో 69; 6 ఫోర్లు), లివింగ్స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. బ్యాట్ గర్జిస్తున్న వేళ భారత బౌలర్లంతా పరుగులు సమరి్పంచుకుంటే... రవీంద్ర జడేజా (10–1–35–3) మాత్రం పూర్తి కోటా వేసి వికెట్లు తీసి పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు. అనంతరం కఠినమైన లక్ష్యమే అయినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ రోహిత్ (90 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్స్లు) వీరోచిత శతకంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ (52 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరూ కెపె్టన్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2–0తో దక్కించుకుంది. చివరిదైన మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్లో జరుగుతుంది. డకెట్, రూట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (26; 2 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ దూకుడుగా ఆడి తొలి వికెట్కు 81 పరుగులు జోడించారు. డకెట్ 36 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. అతడు అవుటయ్యాక రూట్, హ్యారీ బ్రూక్ (31; 3 ఫోర్లు, 1సిక్స్) నింపాదిగా ఆడటంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆద్యంతం సాఫీగా సాగిపోయింది. రూట్ 60 బంతుల్లో తన వన్డే కెరీర్లో 56వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అనంతరం కెపె్టన్ బట్లర్ (34; 2 ఫోర్లు), లివింగ్స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు)లు సైతం పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. షమీ, రాణా, పాండ్యా, వరుణ్ తలా ఒక వికెట్ తీశారు. 76 బంతుల్లో శతకం ఎంతటి బ్యాటింగ్ పిచ్ అయినా... 305 పరుగుల లక్ష్యం వన్డేల్లో అంత ఈజీ కానేకాదు. చక్కని శుభారంభం... కడదాకా ఓర్పుగా, నేర్పుగా ఒక బ్యాటరైనా క్రీజులో నిలిస్తేనే గెలుపు ఆశలుంటాయి. సరిగ్గా నాయకుడు రోహిత్ కూడా ఇదే చేశాడు. ఓపెనింగ్లో గిల్తో జతగా మొదట లక్ష్యానికి అనువైన ఆరంభమిచ్చాడు. దీంతో 6.2 ఓవర్లలోనే భారత్ స్కోరు 50 దాటింది. భారీ షాట్లతో విరుచుకుపడిన ‘హిట్మ్యాన్’ 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, గిల్ 45బంతుల్లో పూర్తి చేశాడు. ఇద్దరి పట్టుదలతో 14వ ఓవర్లోనే జట్టు 100కు చేరుకుంది. తర్వాత గిల్ ని్రష్కమించినా, కోహ్లి (5) విఫలమైనా ... ఆ ప్రభావం ఇన్నింగ్స్పై పడకుండా అయ్యర్తో కలిసి ధాటిని కొనసాగిస్తూ టీమిండియాను లక్ష్యంవైపు నడిపించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో సెంచరీ సాధించాక భారీ షాట్కు యతి్నంచి అవుటయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 29.4 ఓవర్లలో 220/3. ఇక గెలిచేందుకు 125 బంతుల్లో 85 చేస్తే చాలు. ఈ పనిలో అక్షర్ పటేల్ (43 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) అజేయంగా భాగమవడంతో 33 బంతులు మిగిలుండగానే భారత్ మ్యాచ్ నెగ్గింది.ఫ్లడ్లైట్లు మొరాయించడంతో... బారాబతి స్టేడియంలోని ఫ్లడ్లైట్లు మొరాయించడంతో ఆటకు అరగంటకు పైగానే అంతరాయం ఏర్పడింది. డేనైట్ వన్డేలు, టి20ల కోసం మైదానం చుట్టూరా... ఎనిమిది చోట్ల ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకదాంట్లో సమస్య వచ్చింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ధనాధన్ వేగంతో 48 పరుగులు చేసింది. ఈ సమయంలో క్లాక్ టవర్ వద్ద వున్న ఫ్లడ్లైట్లు ఆగిపోయాయి. దీంతో 35 నిమిషాల పాటు మ్యాచ్ను నిలిపేసి లైట్లు వెలిగాకే తిరిగి మ్యాచ్ను నిర్వహించారు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జడేజా (బి) వరుణ్ 26; డకెట్ (సి) పాండ్యా (బి) జడేజా 65; రూట్ (సి) కోహ్లి (బి) జడేజా 69; బ్రూక్ (సి) గిల్ (బి) రాణా 31; బట్లర్ (సి) గిల్ (బి) పాండ్యా 34; లివింగ్స్టోన్ (రనౌట్) 41; ఓవర్టన్ (సి) గిల్ (బి) జడేజా 6; అట్కిన్సన్ (సి) కోహ్లి (బి) షమీ 3; రషీద్ (రనౌట్) 14; మార్క్ వుడ్ (రనౌట్) 0; సఖిబ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 304. వికెట్ల పతనం: 1–81, 2–102, 3–168, 4–219, 5–248, 6–258, 7–272, 8–297, 9–304, 10–304. బౌలింగ్: షమీ 7.5–0–66–1, హర్షిత్ రాణా 9–0–62–1, పాండ్యా 7–0–53–1, వరుణ్ 10–0–54–1, జడేజా 10–1–35–3, అక్షర్ 6–0–32–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) లివింగ్స్టోన్ 119; గిల్ (బి) ఓవర్టన్ 60; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 5; అయ్యర్ (రనౌట్) 44; అక్షర్ పటేల్ (నాటౌట్) 41; కేఎల్ రాహుల్ (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 10; పాండ్యా (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 10; జడేజా (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 8; మొత్తం (44.3 ఓవర్లలో 6 వికెట్లకు) 308. వికెట్ల పతనం: 1–136, 2–150, 3–220, 4–258, 5–275, 6–286. బౌలింగ్: సఖిబ్ 6–0–36–0, అట్కిన్సన్ 7–0–65–1, మార్క్ వుడ్ 8–0–57–0, ఆదిల్ రషీద్ 10–0–78–1, ఓవర్టన్ 5–0– 27–2, లివింగ్స్టోన్ 7–0–29–1, రూట్ 1.3–0–15–0. -
తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం
భారత్ ముందున్న లక్ష్యం 166. స్కోరేమో 15 ఓవర్లలో 126/7. అంటే ఈ పాటికే అర్థమై ఉంటుంది. మిగిలిందల్లా టెయిలెండర్లే అని! గెలుపు కష్టమని!! కానీ వారితో పాటు ఒకడు మిగిలాడు. అతడే తెలుగు తేజం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. 30 బంతుల్లో 40 పరుగులు... ఇది గెలుపు సమీకరణం. సరిజోడు లేకపోయినా, బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడు కరువైనా... వెన్నుచూపలేదు. ఇంగ్లండ్ బౌలింగ్కు తమ సహచరుల్లా తలొంచలేదు. ఆర్చర్ 16వ ఓవర్లో 0, 6, 6, 1, 4, 2లతో 19 పరుగులొచ్చాయి. ఇందులో 2 సిక్స్లు, 1 పరుగు తిలకే చేశాడు.ఇక 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఇది భారత్ను ఊరించింది. కానీ ఆదిల్ రషీద్ 17వ ఓవర్లో 1 పరుగిచ్చి అర్ష్దీప్ను అవుట్ చేయడంతో మళ్లీ టెన్షన్... టెన్షన్... అప్పుడు రవి బిష్ణోయ్ (5 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఆపద్భాంధవుడిలా వచ్చాడు. అతనిది సింగిల్ డిజిట్ స్కోరే కావొచ్చు. కానీ తిలక్తో అమూల్యమైన, అబేధ్యమైన విజయానికి ఆ పరుగులు, ఆ భాగస్వామ్యమే (తొమ్మిదో వికెట్కు 20 పరుగులు) టీమిండియాను గెలిపించింది. సిరీస్లో 2–0తో పైచేయి సాధించేలా చేసింది. చెన్నై: ఓపెనర్ల దూకుడు లేదు. సూర్యకుమార్ యాదవ్ జోరు కనిపించలేదు. హార్దిక్ పాండ్యా అనుభవం కలిసిరాలేదు. కానీ... ఇన్ని ప్రతికూలతల మధ్య భారత్ రెండో టి20లో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. కారణం ఒకేఒక్కడు తిలక్ వర్మ. అసలు ఆశలే లేని చోట... స్పెషలిస్టు బ్యాటర్లే కరువైన వేళ... పరుగుల వేటలో గెలుపుబాట పరిచాడు. 20వ ఓవర్ రెండో బంతికి బౌండరీతో విన్నింగ్షాట్ కొట్టేదాకా క్రీజులో కడదాకా నిలిచి భారత్ను గట్టెక్కించాడు. ఆఖరిదాకా విజయం కోసం పట్టుబిగించిన ఇంగ్లండ్ చివరకు 2 వికెట్ల తేడాతో భారత్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెపె్టన్ జోస్ బట్లర్ (30 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్లు), బ్రైడన్ కార్స్ (17 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించారు. అక్షర్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. మెరిపించిన బట్లర్, కార్స్ ఆరంభంలోనే ఓపెనింగ్ జోడీ సాల్ట్ (4)ను అర్ష్దీప్, డకెట్ (3)ను సుందర్ పెవిలియన్ చేర్చారు. సొంత ప్రేక్షకుల మధ్య తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 4వ) వేసేందుకు దిగిన సుందర్ తొలి బంతికే డకెట్ను బోల్తాకొట్టించాడు. హ్యారీ బ్రూక్ (13), లివింగ్స్టోన్ (13)లను వరుణ్, అక్షర్ కుదురుకోనివ్వలేదు. చెప్పుకోదగిన భాగస్వామ్యం లేకపోయినా... ధాటైన ఇన్నింగ్స్ ఏ ఒక్కరు ఆడలేకపోయినా... ఇంగ్లండ్ ఆఖరుకొచ్చే సరికి పుంజుకుంది. కెపె్టన్ బట్లర్ మెరుపులతో స్కోరు మోస్తరుగా సాగిపోగా... అరంగేట్రం హీరో జేమీ స్మిత్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్లు), కార్స్ల వేగంతో స్కోరు వేగం పెరిగింది. అర్ష్దీప్, పాండ్యా, సుందర్, అభిషేక్లకు తలా ఒక వికెట్ దక్కింది. తిలక్... అంతా తానై... ఇంగ్లండ్ ఇన్నింగ్స్లాగే మనకూ మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు అభిషేక్ (12)కు మార్క్ వుడ్, సామ్సన్ (5)కు ఆర్చర్ చెక్ పెట్టారు. తిలక్ వర్మ అడపాదడపా మెరుపులతో భారత్ స్కోరు 50 దాటింది. కానీ ఈ దశలో కెపె్టన్ సూర్యకుమార్ (12), ధ్రువ్ జురేల్ (4), హార్దిక్ పాండ్యా (7)లు స్వల్పవ్యవధిలో అదికూడా 10 ఓవర్లలోపే అవుటవడం భారత్ ఇన్నింగ్స్కు పెద్దకుదుపు... 9.1 ఓవర్లు 78/5 స్కోరు! గెలుపు చాలా దూరంలో ఉంటే మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్ తిలక్ వర్మ ఒక్కడే! సుందర్, అక్షర్ పటేల్ (2) బ్యాటింగ్ చేయగలరు కానీ గెలిపించేదాకా నిలుస్తారా అన్న సందేహాలు భారత శిబిరాన్ని, స్టేడియంలోని ప్రేక్షకుల్ని కలవరపెట్టాయి. ఊహించినట్లే వారిద్దరు కలవరపెట్టే నిష్క్రమించారు. ఈ దశలో తిలక్వర్మ గెలిచేదాకా బాధ్యతను భుజానవేసుకొని విజయమాల భారత జట్టు మెడలో వేశాడు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సుందర్ (బి) అర్ష్దీప్ 4; డకెట్ (సి) జురేల్ (బి) సుందర్ 3; బట్లర్ (సి) తిలక్ వర్మ (బి) అక్షర్ 45; బ్రూక్ (బి) వరుణ్ 13; లివింగ్స్టోన్ (సి) సబ్–హర్షిత్ (బి) అక్షర్ 13; స్మిత్ (సి) తిలక్ వర్మ (బి) అభిõÙక్ 22; ఓవర్టన్ (బి) వరుణ్ 5; కార్స్ (రనౌట్) 31; ఆర్చర్ (నాటౌట్) 12; రషీద్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 10; మార్క్ వుడ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–6, 2–26, 3–59, 4–77, 5–90, 6–104, 7–136, 8–137, 9–157. బౌలింగ్: అర్ష్దీప్ 4–0–40–1, హార్దిక్ పాండ్యా 2–0–6–1, వాషింగ్టన్ సుందర్ 1–0–9–1, అక్షర్ 4–0–32–2, రవి బిష్ణోయ్ 4–0–27–0, వరుణ్ 4–0–38–2, అభిషేక్ 1–0–12–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) ఆర్చర్ 5; అభిõÙక్ (ఎల్బీ) (బి) వుడ్ 12; తిలక్ వర్మ (నాటౌట్) 72; సూర్యకుమార్ (బి) కార్స్ 12; జురేల్ (సి) సబ్–రేహన్ (బి) కార్స్ 4; పాండ్యా (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 7; సుందర్ (బి) కార్స్ 26; అక్షర్ (సి) డకెట్ (బి) లివింగ్స్టోన్ 2; అర్ష్దీప్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 6; బిష్ణోయ్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–15, 2–19, 3–58, 4–66, 5–78, 6–116, 7–126, 8–146. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–60–1, మార్క్ వుడ్ 3–0–28–1, కార్స్ 4–0–29–3, ఆదిల్ రషీద్ 4–0–14–1, ఓవర్టన్ 2.2–0–20–1, లివింగ్స్టోన్ 2–0–14–1. -
మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో భారత్ ఘన విజయం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(40 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... యస్తిక భాటియా (24; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చీనిల్ హెన్రీ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో వార్మప్ మ్యాచ్లో మంగళవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది. -
వైజాగ్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
భారీ లక్ష్య ఛేదనలో ‘బజ్బాల్’ మంత్రం పని చేయలేదు...దూకుడైన ఆటతో చెలరేగి విజయతీరం చేరాలనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగలేదు...భారత బౌలింగ్ సామర్థ్యం ముందు బ్యాటర్లు తలవంచారు...మన బౌలర్ల ప్రతిభకు తోడు స్వీయతప్పిదాలు పర్యాటక జట్టును దెబ్బ తీశాయి...కీలక సమయాల్లో వికెట్లు తీసిన టీమిండియా నాలుగో రోజే ఇంగ్లండ్ను పడగొట్టింది...హైదరాబాద్లో ఎదురైన ఓటమికి విశాఖపట్నంలో ప్రతీకారం తీర్చుకుంది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సిరీస్ను 1–1తో సమం చేసి రాబోయే టెస్టులపై ఆసక్తిని పెంచింది. తొలి ఇన్నింగ్స్కంటే మరింత పదునైన బంతులతో చెలరేగిన బుమ్రా ఇంగ్లండ్ను ఉక్కిరిబిక్కిరి చేయగా, అశ్విన్ అండగా నిలిచాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉన్నా...పెద్దగా స్పిన్ టర్న్ లేకపోయినా క్రాలీ మినహా ఎవరూ నిలవలేకపోయారు. అద్భుత ఫీల్డింగ్ భారత బలాన్ని రెట్టింపు చేసి విజయానికి బాటలు వేసింది. స్టోక్స్ సేన తాము ఆశించినట్లుగా గెలుపు పక్షాన నిలవలేకపోయినా...నాలుగో ఇన్నింగ్స్లో మూడు వందల పరుగులకు చేరువగా వచ్చి గట్టి పోటీనివ్వగలిగామనే సంతృప్తితో ముగించింది. విశాఖ స్పోర్ట్స్: భారత గడ్డపై ఒక విదేశీ జట్టు నాలుగో ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకున్న సందర్భాల్లో ఆ టీమ్ సాధించిన అత్యధిక స్కోరు 276 పరుగులు...ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అంతకంటే ఎక్కువ పరుగులే చేసింది. కానీ చివరకు ఆ పోరాటం సరిపోక వందకు పైగా పరుగుల భారీ తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సోమవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 67/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ (132 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవగా...టామ్ హార్ట్లీ (47 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ ఫోక్స్ (69 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో ప్రతిఘటించారు. ఈ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (9/91) మ్యాచ్లో మొత్తం 9 వికెట్లతో టెస్టు ఫలితాన్ని శాసించగా, అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తాజా ఫలితం తర్వాత ఐదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. కొంత విరామం తర్వాత ఈ నెల 15నుంచి రాజ్కోట్లో మూడో టెస్టు జరుగుతుంది. రూట్, స్టోక్స్ విఫలం... ఓపెనర్ క్రాలీతో పాటు నైట్వాచ్మన్ రేహన్ అహ్మద్ (27 బంతుల్లో 28; 6 ఫోర్లు) కూడా సోమవారం ఉదయం కొద్ది సేపు భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీసినా ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఒలీ పోప్ (23) ఒక్క అక్షర్ బౌలింగ్లోనే ఐదు ఫోర్లు బాదాడు. స్లిప్లో రోహిత్ సూపర్ క్యాచ్కు పోప్ వెనుదిరిగాడు. అయితే చెత్త షాట్తో రూట్ భారత్కు కీలక వికెట్ ఇచ్చేశాడు. అశ్విన్ బౌలింగ్లో మిడ్ వికెట్ వైపు గుడ్డిగా ఆడబోయిన రూట్ బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ జోరుకు కళ్లెం పడింది. ఆపై లంచ్ విరామానికి ముందు రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా విజయానికి బాటలు వేసుకుంది. కుల్దీప్ బౌలింగ్లో క్రాలీ వికెట్ల ముందు దొరికిపోగా, డీఆర్ఎస్ ఫలితం కాస్త చర్చకు దారి తీసింది. బుమ్రా బంతికి బెయిర్స్టో వద్ద జవాబు లేకపోయింది. స్టోక్స్ ఉన్నంత వరకు కాస్త ఆశలు ఉన్నా...అతని రనౌట్తో జట్టు ఓటమి దాదాపుగా ఖాయమైంది. సింగిల్ తీసే క్రమంలో స్టోక్స్ బద్ధకంగా కదలగా...అయ్యర్ మెరుపు త్రో అతని ఆటను ముగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 253; భారత్ రెండో ఇన్నింగ్స్ 255; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీ) (బి) కుల్దీప్ 73; డకెట్ (సి) భరత్ (బి) అశ్విన్ 28; రేహన్ (ఎల్బీ) (బి) అక్షర్ 23; పోప్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 23; రూట్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 16; బెయిర్స్టో (ఎల్బీ) (బి) బుమ్రా 26; స్టోక్స్ (రనౌట్) 11; ఫోక్స్ (సి) అండ్ (బి) బుమ్రా 36; హార్ట్లీ (బి) బుమ్రా 36; బషీర్ (సి) భరత్ (బి) ముకేశ్ 0; అండర్సన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 15; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్) 292. వికెట్ల పతనం: 1–50, 2–95, 3–132, 4–154, 5–194, 6–194, 7–220, 8–275, 9–281, 10–292. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పా యింట్ల పట్టికలో భారత్ ముందుకు దూసుకుపోయింది. ఇప్పటి వరకు ఐదో స్థానంలో ఉన్న భారత్ ఈ గెలుపుతో మూడు స్థానాలు మెరుగుపర్చుకొని రెండో స్థానానికి (52.77 పాయింట్ల శాతం) చేరుకుంది. ఆ్రస్టేలియా అగ్రస్థానంలో (55 పాయింట్ల శాతం) కొనసాగుతోంది. -
IND vs AFG 3rd T20I: రోహిత్ సూపర్... భారత్ ‘డబుల్ సూపర్’...
ఏమా ఉత్కంఠ... ఏమిటా మలుపులు... ఒక టి20 సమరం అభిమానులందరినీ కట్టిపడేసింది. ఒక ద్వైపాక్షిక సిరీస్లో, అదీ అఫ్గానిస్తాన్తో పోరు ఏకపక్షం అనుకుంటే నరాలు తెగే పరిస్థితి వచి్చంది. 212 పరుగులు చేశాక భారత్ గెలుపు ఖాయమనిపించి నిశి్చంతగా ఉండగా... అఫ్గానిస్తాన్ మేమేమీ తక్కువ కాదన్నట్లుగా స్కోరు సమం చేసేసింది. ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలుతుందనుకుంటే అక్కడా ఇరు జట్లూ సమమే. చివరకు అంతా రెండో సూపర్ను ఆశ్రయించాల్సి వచి్చంది... ఇక్కడ చివరకు పైచేయి సాధించిన టీమిండియా గట్టెక్కింది. తుది ఫలితంతో గెలుపు భారత్దే అయినా ఆఖరి వరకు అఫ్గాన్ చూపిన పోరాటపటిమ అసమానం. బెంగళూరు: టి20 ప్రపంచకప్కు ముందు తాము ఆడిన ఆఖరి సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. అఫ్గానిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల పోరును టీమిండియా 3–0తో సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన చివరి టి20లో భారత్ రెండో ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించింది. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. రెండో సూపర్ ఓవర్లో ముందుగా భారత్ 11 పరుగులు చేయగా... అఫ్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం ‘సూపర్ ఓవర్’లో రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్టే కావడంతో భారత విజయం ఖరారైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్లు) అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... రింకూ సింగ్ (39 బంతుల్లో 69 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్లు) మరో మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 95 బంతుల్లోనే అభేద్యంగా 190 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు సాధించింది. గుల్బదిన్ (23 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు), గుర్బాజ్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), ఇబ్రహీమ్ జద్రాన్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. శతక భాగస్వామ్యం... ఫరీద్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగిన యశస్వి... కోహ్లి తొలి బంతికి డకౌట్... అంతా నిశ్శబ్దం... ఫామ్లో ఉన్న శివమ్ దూబే కూడా కీపర్కు క్యాచ్ ఇవ్వగా, తర్వాతి ఓవర్లో తన తొలి బంతికే సామ్సన్ కూడా సున్నాకే అవుట్! ఐదో ఓవర్ మూడో బంతి ముగిసేసరికి టీమిండియా స్కోరు 21/4... అయితే రోహిత్, రింకూ భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. 15 ఓవర్లు ముగిసేసరికి 109/4తో స్కోరు మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే చివరి ఐదు ఓవర్లలో 22, 13, 10, 22, 36 స్కోర్లతో భారత్ ఏకంగా 103 పరుగులు సాధించింది. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్ వీర విధ్వంసం ప్రదర్శించగా... 1 సిక్స్, 4 ఫోర్లతో రింకూ చెలరేగిపోయాడు. 64 బంతుల్లోనే శతకం అందుకొని అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలవగా... రింకూ ఖాతాలో రెండో అర్ధ సెంచరీ చేరింది. వీరిద్దరి దెబ్బకు అఫ్గాన్ కుదేలైంది. రోహిత్ తన శైలికి భిన్నంగా ఈసారి కొన్ని వైవిధ్యమైన షాట్లతో అలరించడం విశేషం. కరీమ్ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో రోహిత్ 4, 6 (నోబాల్), 6 కొట్టగా... చివరి మూడు బంతుల్లో రింకూ 6, 6, 6 బాదాడు. అనంతరం అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీమ్ 66 బంతుల్లోనే 93 పరుగులు జోడించి తమ జట్టుకు శుభారంభం అందించారు. వీరు వెనుదిరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత గుల్బదిన్, నబీ (16 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కలిసి జట్టుకు విజయానికి చేరువగా తెచ్చారు. విజయం కోసం చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, అఫ్గాన్ 18 పరుగులు చేయడంతో స్కోరు సమమైంది. రిలీఫ్..! ‘ఏంటి వీరూ... లెగ్బై ఇచ్చావా, బ్యాట్కు అంత బలంగా బంతి తగిలింది... అసలే ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి’... తను ఆడిన తొలి బంతి లెగ్సైడ్ దిశగా ఆడి బౌండరీని తాకగా, అంపైర్ లెగ్బై ఇవ్వడంతో అంపైర్ వీరేందర్ శర్మతో రోహిత్ అన్న మాట ఇది! అతని దృష్టిలో ఆ పరుగులు ఎంత విలువైనవో ఇది చెబుతుంది. నిజంగానే టి20ల్లో చాలా కాలంగా రోహిత్ ఫామ్ బాగా లేదు. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా 2022 నుంచి అంతర్జాతీయ టి20ల్లో ఈ మ్యాచ్కు ముందు 31 ఇన్నింగ్స్లలో అతను 3 అర్ధ సెంచరీలే చేశాడు. ఐపీఎల్లో కూడా అంతంతమాత్రంగానే ఆడాడు. ఇటీవలి పరిణామాలు సహజంగానే అతడిని ఇబ్బంది పెట్టాయి. ముంబై ఇండియన్స్ కెపె్టన్సీ పోవడంతో పాటు టీమిండియా కెపె్టన్సీపై కూడా సందేహాలు వచ్చాయి. అసలు వచ్చే టి20 వరల్డ్ కప్లో అతను ఆడతాడా అన్నట్లుగా కూడా చర్చ సాగింది. దానికి తోడు తొలి రెండు మ్యాచ్లలో డకౌట్. ఇలాంటి స్థితిలో ఈ ఇన్నింగ్స్ అతని స్థాయిని చూపించింది. అఫ్గాన్ మరీ బలమైన ప్రత్యర్థి కాకపోయినా... ఇక్కడా విఫలమైతే పరిస్థితి ఇంకా జఠిలంగా మారేంది. ఈ నేపథ్యంలో సరైన లెక్కలతో చేసిన సెంచరీ రోహిత్కు ఊరటనిచి్చందనడంలో సందేహం లేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) నబీ (బి) ఫరీద్ 4; రోహిత్ (నాటౌట్) 121; కోహ్లి (సి) ఇబ్రహీమ్ (బి) ఫరీద్ 0; దూబే (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 1; సామ్సన్ (సి) నబీ (బి) ఫరీద్ 0; రింకూ (నాటౌట్) 69; ఎక్స్ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–21, 4–22. బౌలింగ్: ఫరీద్ 4–0–20–3, అజ్మతుల్లా 4–0–33–1, ఖైస్ 4–0–28–0, సలీమ్ 3–0–43–0, షరాఫుద్దీన్ 2–0–25–0, కరీమ్ 3–0–54–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) సుందర్ (బి) కుల్దీప్ 50; ఇబ్రహీమ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) సుందర్ 50; గుల్బదిన్ (నాటౌట్) 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 0; నబీ (సి) అవేశ్ (బి) సుందర్ 34; కరీమ్ (రనౌట్) 2; నజీబుల్లా (సి) కోహ్లి (బి) అవేశ్ 5; షరాఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–93, 2–107, 3–107, 4–163, 5–167, 6–182. బౌలింగ్: ముకేశ్ 4–0–44–0, అవేశ్ 4–0–55–1, బిష్ణోయ్ 4–0–38–0, సుందర్ 3–0–18–3, దూబే 2–0–25–0, కుల్దీప్ 3–0–31–1. సూపర్ ఓవర్లలో ఇలా... ముకేశ్ వేసిన తొలి సూపర్ ఓవర్లో అఫ్గానిస్తాన్ 1 సిక్స్, 1 ఫోర్తో 16 పరుగులు చేసింది. ఛేదన లో రోహిత్ 2 సిక్స్లు కొట్టినా చివరకు భారత్ కూడా 16 పరుగులకే పరిమితమైంది. అవసరమైతే చివరి బంతికి వేగంగా పరుగు తీయాల్సి వస్తుందనే ఆలోచనతో రోహిత్ ఐదో బంతి తర్వాత రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగి రింకూను పంపించాడు. అయితే ఆఖరి బంతికి యశస్వి 2 పరుగులు రాబట్టలేకపోయాడు. ఫరీద్ వేసిన రెండో సూపర్ ఓవర్లో రోహిత్ 4, 6తో భారత్ 11 పరుగులు చేసింది. అయితే బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్ తొలి 3 బంతుల్లోనే అఫ్గాన్ 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపు ఖాయమైంది. -
ODI World Cup 2023: 'అష్ట' దిగ్భంధనం
వన్డే వరల్డ్ కప్లో లెక్క మారలేదు. 31 ఏళ్లుగా పాకిస్తాన్పై వేర్వేరు వేదికల్లో కనిపించిన ఆధిపత్యం అహ్మదాబాద్లోనూ కొనసాగింది. ఫేవరెట్గా భావించిన భారత జట్టు అన్ని రంగాల్లో చెలరేగి పాక్ను ఊపిరాడనీయకుండా చేసింది. ఒకవైపు భారత బౌలర్లంతా సమష్టిగా చెలరేగుతుంటే... మరోవైపు లక్ష మంది జనం ‘భారత్ మాతాకీ జై’ అంటూ హోరెత్తిస్తుంటే... మైదానంలో దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది... బ్యాటింగ్లో కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక... కనీసం 200 పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది... ఆపై మొదటి బంతి నుంచే ఇండియా జోరు మొదలైంది... సిక్సర్లతో చెలరేగిపోతున్న రోహిత్ శర్మను నిలువరించలేక పాక్ బౌలర్లు చేతులెత్తేయగా మరో అలవోక విజయం మన ఖాతాలో చేరింది. ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించిన టీమిండియా వరల్డ్ కప్లో చిరకాల ప్రత్యరి్థపై తన అజేయ రికార్డును ఘనంగా నిలబెట్టుకుంది. 8–0తో సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అహ్మదాబాద్: ప్రపంచకప్లో తిరుగులేకుండా దూసుకుపోతున్న భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. పటిష్టమైన టీమిండియా అంచనాలకు అనుగుణంగా చెలరేగి పాకిస్తాన్పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఎలాంటి హోరాహోరీ, పోటాపోటీ లేకుండా సాగిన లీగ్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్న్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 50; 7 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (69 బంతుల్లో 49; 7 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఒకదశలో 155/2తో మెరుగైన స్థితిలో కనిపించిన పాక్ 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/19) రెండు కీలక వికెట్లు తీయగా... పాండ్యా, కుల్దీప్, జడేజా, సిరాజ్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్న్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్స్లు) దూకుడైన బ్యాటింగ్తో భారత్ గెలుపును సులువుగా మార్చగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్ను గురువారం పుణేలో బంగ్లాదేశ్తో ఆడుతుంది. ఆ భాగస్వామ్యం మినహా... పాకిస్తాన్ తమ ఇన్నింగ్స్ను సానుకూలంగానే ప్రారంభించింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (38 బంతుల్లో 36; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (20) ఒత్తిడికి లోనుకాకుండా చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. అయితే షఫీక్ను సిరాజ్ ఎల్బీగా అవుట్ చేయడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇమామ్ను పాండ్యా వెనక్కి పంపించాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత సీనియర్లు బాబర్, రిజ్వాన్లపై పడింది. జడేజా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నా... బ్యాటర్ రివ్యూలో అది నాటౌట్గా తేలింది. ఇద్దరు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిరి్మంచే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 57 బంతుల్లో బాబర్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే సిరాజ్ వేసిన చక్కటి బంతి స్టంప్స్ పైభాగాన్ని తాకడంతో బాబర్ అదే స్కోరు వద్ద నిరాశగా ని్రష్కమించాడు. అంతే... ఆ వికెట్ తర్వాత పాక్ పతనం వేగంగా సాగింది. కుల్దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టగా, బుమ్రా ఆఫ్కటర్కు రిజ్వాన్ బౌల్డ్ కావడంతో భారీ స్కోరుపై పాక్ ఆశలు వదులుకుంది. మిగిలిన నాలుగు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేయడానికి భారత్కు ఎంతో సమయం పట్టలేదు. పాకిస్తాన్పై 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ (మొహాలిలో) తరహాలోనే భారత్ తరఫున ఐదుగురు బౌలర్లు తలా 2 వికెట్లు పంచుకోవడం విశేషం. మెరుపు బ్యాటింగ్... డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్లెగ్, వైడ్ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్... రోహిత్ శర్మ అలవోకగా వేర్వేరు దిశల్లో బాదిన ఆరు సిక్సర్లు ఇవి! స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఛేదించేందుకు సిద్ధమైన తరుణంలో స్టేడియంలోని అభిమానులకు ఇదే తరహా రోహిత్ ఆట వినోదం పంచింది. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్తో మొదలు పెట్టిన రోహిత్ ఎప్పుడెప్పుడు మ్యాచ్ను ముగిద్దామా అన్నట్లుగా వేగంగా దూసుకుపోయాడు. మరో ఎండ్లో శుబ్మన్ గిల్ (11 బంతుల్లో 16; 4 ఫోర్లు), కోహ్లి (18 బంతుల్లో 16; 3 ఫోర్లు) మాత్రం విఫలమయ్యారు. షాదాబ్ చక్కటి క్యాచ్కు గిల్ వెనుదిరగ్గా, పేలవ షాట్ ఆడి కోహ్లి ని్రష్కమించాడు. అయితే రోహిత్ జోరును మాత్రం పాక్ అడ్డుకోలేకపోయింది. 36 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా పాక్ బౌలర్లను వదలకుండా మరో 3 ఫోర్లు, 2 సిక్స్లు బాదిన రోహిత్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ విజయానికి మరో 36 పరుగులు చేయాల్సిన స్థితిలో అవుటై రోహిత్ వరల్డ్ కప్ చరిత్రలో ఎనిమిదో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం అయ్యర్, కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్ను ముగించారు. నవాజ్ వేసిన 31వ ఓవర్ మూడో బంతిని నేరుగా శ్రేయస్ బౌండరీకి తరలించగా అతని అర్ధసెంచరీతో పాటు భారత్ విజయం పూర్తయింది. మా బౌలర్లే ఈ రోజు మ్యాచ్ ఫలితాన్ని శాసించారు. పాక్ కనీసం 290 వరకు వెళుతుందనుకుంటే 191 పరుగులకే కట్టడి చేయడం అద్భుతం. బౌలర్లంతా సమష్టిగా సత్తా చాటారు. అందరూ అన్ని రోజుల్లో బాగా ఆడలేరు. మనదైన రోజును మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోవాలి. నేను అదే పని చేశాను. కెప్టెన్న్గా కూడా నాపై అదనపు బాధ్యత ఉంది. ఈ మ్యాచ్లో కూడా పాక్ను మేం మరో ప్రత్యర్థిగానే చూశాం తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. మేం గత రికార్డును పట్టించుకోలేదు. ప్రపంచకప్లోకి అడుగు పెట్టక ముందే జట్టులో అందరికీ తమ బాధ్యతలపై స్పష్టత ఉంది. అందుకే అందరూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ విజయంతో మేమేమీ అతిగా ఉప్పొంగిపోవడం లేదు. టోరీ్నలో ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్న్ స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) సిరాజ్ 20; ఇమామ్ (సి) రాహుల్ (బి) పాండ్యా 36; బాబర్ ఆజమ్ (బి) సిరాజ్ 50; రిజ్వాన్ (బి) బుమ్రా 49; షకీల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 6; ఇఫ్తికార్ (బి) కుల్దీప్ 4; షాదాబ్ (బి) బుమ్రా 2; నవాజ్ (సి) బుమ్రా (బి) పాండ్యా 4; హసన్ (సి) గిల్ (బి) జడేజా 12; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 2; రవూఫ్ (ఎల్బీ) (బి) జడేజా 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–41, 2–73, 3–155, 4–162, 5–166, 6–168, 7–171, 8–187, 9–187, 10–191. బౌలింగ్: బుమ్రా 7–1–19–2, సిరాజ్ 8–0–50–2, పాండ్యా 6–0–34–2, కుల్దీప్ 10–0–35–2, జడేజా 9.5–0–38–2, శార్దుల్ 2–0–12–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) షాహిన్ 86; గిల్ (సి) షాదాబ్ (బి) షాహిన్ 16; కోహ్లి (సి) నవాజ్ (బి) హసన్ అలీ 16; అయ్యర్ (నాటౌట్) 53; కేఎల్ రాహుల్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 2; మొత్తం (30.3 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–23, 2–79, 3–156. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 6–0–36–2, హసన్ అలీ 6–0–34–1, నవాజ్ 8.3–0–47–0, రవూఫ్ 6–0–43–0, షాదాబ్ 4–0–31–0. -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్ల్లో స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్కు షూటింగ్లోనే రెండు కాంస్యాలు, రోయింగ్లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
Asia Cup 2023: నేపాల్ చిత్తు.. సూపర్-4కు భారత్
తొలి మ్యాచ్లో బ్యాటింగ్ ప్రాక్టీస్... కాస్త నిరాశపర్చింది. రెండో మ్యాచ్లో బౌలింగ్ ప్రాక్టీస్... ఇది అంతంత మాత్రమే! నేపాల్ లాంటి జట్టును కుప్పకూల్చలేకపోయిన టీమిండియా బౌలింగ్ వైఫల్యం కనిపించింది... మధ్యలో వాన... అయితే ఎట్టకేలకు సాధికారిక బ్యాటింగ్తో ఉత్కంఠ లేకుండా భారత్ మ్యాచ్ ముగించింది. కుదించిన పోరులో అలవోక విజయంతో ‘సూపర్–4’ దశకు ముందంజ వేసింది. పల్లెకెలె: ఆసియా కప్ రెండో లీగ్ మ్యాచ్లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ షేక్ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. సోంపాల్ కామి (48; 1 ఫోర్, 2 సిక్స్లు), కుశాల్ భుర్తేల్ (38; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం వాన కారణంగా భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 147 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (59 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు), శుబ్మన్ గిల్ (62 బంతుల్లో 67 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కలిసి అజేయంగా జట్టును గెలిపించారు. ఈ విజయంతో భారత్ ‘సూపర్–4’ దశకు చేరగా, నేపాల్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. కీలక భాగస్వామ్యాలు... భారత ఫీల్డింగ్ వైఫల్యాలను సొమ్ము చేసుకుంటూ నేపాల్కు ఓపెనర్లు భుర్తేల్, ఆసిఫ్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు 65 పరుగులు భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు పదో ఓవర్లో శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత జడేజా తన బౌలింగ్లో 11 పరుగుల వ్యవధిలోనే తర్వాతి 3 వికెట్లు పడగొట్టి నేపాల్ను దెబ్బ కొట్టాడు. మరో ఎండ్లో ఆసిఫ్ 88 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్ది సేపటికే ఆసిఫ్తో పాటు గుల్షన్ (23)ను సిరాజ్ పెవిలియన్ పంపించడంతో నేపాల్ 144/6 వద్ద నిలిచింది. ఈ దశలో సోంపాల్, దీపేంద్ర సింగ్ (29; 3 ఫోర్లు) ఆరో వికెట్కు 50 పరుగులు జత చేయడంతో పరిస్థితి మెరుగైంది. హార్దిక్ ఈ పార్ట్నర్íÙప్ను విడగొట్టినా... చివర్లో చెలరేగి ఆడిన సోంపాల్ నేపాల్ స్కోరును 200 దాటించాడు. ఛేదనలో టీమిండియాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఓపెనర్లు రోహిత్, గిల్ తమదైన శైలిలో స్వేచ్ఛగా, అలవోకగా షాట్లు ఆడి జట్టును గెలుపు దిశగా నడిపించారు. వాన అడ్డు పడుతూ... మ్యాచ్లో నాలుగుసార్లు వర్షం ఆటకు అంత రాయం కలిగించింది. నేపాల్ ఇన్నింగ్స్ సమయంలో 30 ఓవర్ల తర్వాత, 34 ఓవర్ల తర్వాత వాన కురిసింది. అయితే ఈ రెండు సందర్భాల్లో పెద్దగా ఇబ్బంది రాలేదు కానీ 37.5 ఓవర్ల తర్వాత కురిసిన వానతో సరిగ్గా గంటసేపు ఆట ఆగిపోయింది. అయినా సరే ఓవర్ల కోత లేకుండా నేపాల్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం భారత ఇన్నింగ్స్లో 2.1 ఓవర్ల తర్వాత వాన పడింది. సుమారు రెండు గంటలు అంతరాయం కలగడంతో చివరకు భారత్ ఇన్నింగ్స్ను కుదించి లక్ష్యాన్ని సవరించారు. ఇదేమి ఫీల్డింగ్? సునాయాస క్యాచ్లు వదిలేయడం, మిస్ఫీల్డింగ్, రనౌట్ అవకాశాలు చేజార్చడం, ఓవర్త్రోలు... ఇవన్నీ సోమవారం భారత ఫీల్డింగ్లో కనిపించాయి. మైదానంలో మన ఆటగాళ్లు ఇంత పేలవంగా కనిపించడం ఆశ్చర్యపర్చింది. తొలి 4.2 ఓవర్లు ముగిసేసరికి భారత ఆటగాళ్లు మూడు క్యాచ్లు వదిలేశారు. షమీ బౌలింగ్లో భుర్తేల్ ఇచ్చిన క్యాచ్లను శ్రేయస్, కిషన్ వదిలేయగా, సిరాజ్ బౌలింగ్లో ఆసిఫ్ క్యాచ్ను కోహ్లి వదిలేశాడు. చివర్లో సోంపాల్ క్యాచ్నూ కిషన్ అందుకోలేకపోయాడు. స్కోరు వివరాలు నేపాల్ ఇన్నింగ్స్: కుశాల్ భుర్తేల్ (సి) కిషన్ (బి) శార్దుల్ 38; ఆసిఫ్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 58; భీమ్ (బి) జడేజా 7; పౌడేల్ (సి) రోహిత్ (బి) జడేజా 5; కుశాల్ మల్లా (సి) సిరాజ్ (బి) జడేజా 2; గుల్షన్ (సి) కిషన్ (బి) సిరాజ్ 23; దీపేంద్ర సింగ్ (ఎల్బీ) (బి) పాండ్యా 29; సోంపాల్ (సి) కిషన్ (బి) షమీ 48; లమిచానే (రనౌట్) 9; కరణ్ (నాటౌట్) 2; రాజ్భన్సీ (బి) సిరాజ్ 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 230. వికెట్ల పతనం: 1–65, 2–77, 3–93, 4–101, 5–132, 6–144, 7–194, 8–228, 9–229, 10–230. బౌలింగ్: షమీ 7–0–29–1, సిరాజ్ 9.2–1–61–3, పాండ్యా 8–3–34–1, శార్దుల్ 4–0–26–1, జడేజా 10–0–40–3, కుల్దీప్ 10–2–34–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 74; గిల్ (నాటౌట్) 67; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 147. బౌలింగ్: కరణ్ 4–0–26–0, సోంపాల్ 2–0–23–0, రాజ్భన్సీ 4–0–24–0, సందీప్ లమిచానే 4–0–39–0, దీపేంద్ర సింగ్ ఐరీ 2–0–12–0, కుశాల్ మల్లా 3–0–11–0, గుల్షన్ 1.1–0–11–0. -
India vs Australia 1st ODI: రాహుల్, జడేజా గెలిపించగా...
తొలి వన్డేలో భారత్ విజయలక్ష్యం 189 పరుగులే...దీనిని చూస్తే ఛేదన చాలా సులువనిపించింది. కానీ ఒక దశలో స్కోరు 16/3 కాగా, ఆపై 39/4కు మారింది...ప్రతికూలంగా ఉన్న పిచ్పై భారత బ్యాటర్లు శ్రమించాల్సి వచ్చింది. చివరకు రాహుల్, జడేజా శతక భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ఎనిమిది నెలల తర్వాత ఆడిన తొలి వన్డేలో జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన నమోదు చేయగా, టెస్టుల్లో బ్యాటింగ్పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ వన్డేల్లో తానేంటో చూపించాడు. అంతకు ముందు భారత బౌలర్లు ఆసీస్ను కట్టి పడేశారు. మిచెల్ మార్‡్ష మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన జట్టు భారీ స్కోరు చేసేందుకు సరిపోలేదు. ముంబై: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్‡్ష (65 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం భారత్ 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (69 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు) ఆరో వికెట్కు అభేద్యంగా 108 పరుగులు జత చేశారు. 2 వికెట్లు, 1 కీలక క్యాచ్తో పాటు బ్యాటింగ్లో రాణించిన జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా... ఈ నెల 19న వైజాగ్లో రెండో వన్డే జరుగుతుంది. మార్‡్ష మినహా... తన తొలి ఓవర్లోనే ట్రవిస్ హెడ్ (5)ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం లభించలేదు. అయితే మార్‡్ష దూకుడుగా ఆడి జట్టును నడిపించాడు. సిరాజ్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన మార్‡్ష, సిరాజ్ మరో ఓవర్లోనే రెండు ఫోర్లు బాదాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 59 పరుగులకు చేరింది. మార్‡్షకు సహకరించిన స్టీవ్ స్మిత్ (22)ను కీపర్ రాహుల్ చక్కటి క్యాచ్తో వెనక్కి పంపడంతో 72 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మార్‡్ష 51 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి అతను తన జోరును కొనసాగించాడు. అయితే జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన మార్‡్ష షార్ట్ థర్డ్మాన్ వద్ద సిరాజ్కు క్యాచ్ ఇచ్చాడు. మార్‡్ష, లబుషేన్ (15) మూడో వికెట్కు 52 పరుగులు జత చేశారు. అంతే...ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. 20వ ఓవర్లో 129/2తో మెరుగైన స్థితిలో నిలిచిన ఆ జట్టు 36వ ఓవర్ కూడా ముగియక ముందే ముగిసింది. 59 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 8 వికెట్లు కోల్పోయింది. తన చివరి 14 బంతుల్లో షమీ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టగా...సిరాజ్ తన చివరి 10 బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వకుండా 2 వికెట్లు తీశాడు. శతక భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఆరంభంలో భారత్ తడబడింది. ఇషాన్ కిషన్ (3) తనకు లభించిన అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా... స్టార్క్ వరుస బంతుల్లో కోహ్లి (4), సూర్యకుమార్ (0)లను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. వ్యక్తిగత స్కోర్ల 2, 7 వద్ద ఇన్గ్లిస్, స్మిత్ క్యాచ్లు వదిలేయడంతో బతికిపోయిన శుబ్మన్ గిల్ (20) దానిని ఉపయోగించుకోలేకపోయాడు. ఈ దశలో రాహుల్, హార్దిక్ పాండ్యా (25) కలిసి జట్టును ఆదుకున్నారు. అయితే స్టొయినిస్ బౌన్సర్తో పాండ్యాను అవుట్ చేయడంతో 44 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. విజయానికి మరో 106 పరుగులు చేయాల్సిన ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాదే పైచేయిగా మారినట్లు అనిపించింది. కానీ రాహుల్, జడేజా జోడి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ వీరిద్దరు పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 73 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) సిరాజ్ 5; మార్‡్ష (సి) సిరాజ్ (బి) జడేజా 81; స్మిత్ (సి) రాహుల్ (బి) పాండ్యా 22; లబుషేన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 15; ఇన్గ్లిస్ (బి) షమీ 26; గ్రీన్ (బి) షమీ 12; మ్యాక్స్వెల్ (సి) పాండ్యా (బి) జడేజా 8; స్టొయినిస్ (సి) గిల్ (బి) షమీ 5; అబాట్ (సి) గిల్ (బి) సిరాజ్ 0; స్టార్క్ (నాటౌట్) 4; జంపా (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (35.4 ఓవర్లలో ఆలౌట్) 188. వికెట్ల పతనం: 1–5, 2–77, 3–129, 4–139, 5–169, 6–174, 7–184, 8–184, 9–188, 10–188. బౌలింగ్: షమీ 6–2–17–3, సిరాజ్ 5.4–1–29–3, పాండ్యా 5–0–29–1, శార్దుల్ 2–0–12–0, జడేజా 9–0–46–2, కుల్దీప్ 8–1–48–1. భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) స్టొయినిస్ 3; గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 20; కోహ్లి (ఎల్బీ) (బి) స్టార్క్ 4; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (నాటౌట్) 75; పాండ్యా (సి) గ్రీన్ (బి) స్టొయినిస్ 25; జడేజా (నాటౌట్) 45; ఎక్స్ట్రాలు 19; మొత్తం (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–5, 2–16, 3–16, 4–39, 5–83. బౌలింగ్: స్టార్క్ 9.5–0– 49–3, స్టొయినిస్ 7–1–27–2, అబాట్ 9–0–31–0, గ్రీన్ 6–0–35–0, జంపా 6–0–37–0, మ్యాక్స్వెల్ 2–0–7–0. -
మహిళల టి20 ప్రపంచకప్ : పాక్పై టీమ్ఇండియా ఘనవిజయం (ఫోటోలు)
-
Womens T20 World Cup 2023: మన అమ్మాయిలు... అదరగొట్టారు
గత మెగా టోర్నీ రన్నరప్ భారత్... ఈ టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ పనిపట్టి శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి నుంచి క్లిష్టమైన లక్ష్యమే ఎదురైనా... కీలకమైన ఈ మ్యాచ్కు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన గాయంతో గైర్హాజరైనా... టాపార్డర్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్తో భారత మహిళలు చక్కని విజయం సాధించారు. కేప్టౌన్: భారత్ మహిళల జట్టు ముందున్న లక్ష్యం 150. కానీ 93 పరుగుల వద్ద 14వ ఓవర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ (16; 2 ఫోర్లు) అవుటైంది. 16వ ఓవర్లో రిచా ఘోష్ను ఎల్బీగా అంపైర్ ప్రకటించింది. భారత్ రివ్యూకెళ్లింది. స్కోరేమో 109/3. విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఈ దశలో రివ్యూలో బంతి రిచా గ్లౌజ్ను తాకినట్లు తేలడంతో బతికిపోయింది. అక్కడి నుంచి టీమిండియా ఆట మారిపోయింది. కాస్త కఠినమైన సమీకరణాన్ని జెమీమా–రిచా జోడీ 19వ ఓవర్లోనే ముగించింది. దాంతో టి20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై గెలిచింది. టాస్ గెలిచిన పాక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పాకిస్తాన్ 12.1 ఓవర్లలో 68 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దశలో కెప్టెన్ బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), అయేషా నసీమ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు అబేధ్యమైన ఐదో వికెట్కు 81 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ప్రపంచకప్ మ్యాచ్లో భారత్కిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ఓవరాల్గా టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై భారత్కిది ఐదో విజయం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (38 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు), రిచా ఘోష్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) గెలిపించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 15న వెస్టిండీస్తో ఆడుతుంది. గెలిపించిన జెమీమా ఓపెనింగ్లో షఫాలీ వర్మ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు) మెరుగ్గానే ఆడినప్పటికీ... యస్తిక భాటియా (17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. క్రీజులోకి జెమీమా రాగా భారీ షాట్లపై గురిపెట్టిన షఫాలీ... సిద్రా అమీన్ చక్కని క్యాచ్కు పెవిలియన్ చేరింది. రెండు బౌండరీలతో ఊపు మీదున్న కెప్టెన్ హర్మన్ప్రీత్ను నష్రా సంధు బోల్తా కొట్టించింది. దీంతో రిచా ఘోష్ క్రీజులోకి రాగా... 15వ ఓవర్లో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. కలిసొచ్చిన రివ్యూతో రిచా, మరోవైపు జెమీమా బౌండరీలతో జట్టు విజయాన్ని సులువు చేశారు. జెమీమా బౌండరీతో భారత విజయాన్ని ఖరారు చేసింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: మునీబా (స్టంప్డ్) రిచా (బి) రాధ 12; జవేరియా (సి) హర్మన్ప్రీత్ (బి) దీప్తి 8; బిస్మా మారూఫ్ (నాటౌట్) 68; నిదా దార్ (సి) రిచా (బి) పూజ 0; సిద్రా అమీన్ (సి) రిచా (బి) రాధ 11; అయేషా (నాటౌట్) 43; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–43, 4–68. బౌలింగ్: రేణుక సింగ్ 3–0–24–0, దీప్తి శర్మ 4–0–39–1, రాజేశ్వరి గైక్వాడ్ 4–0–31–0, రాధా యాదవ్ 4–0–21–2, పూజ 4–0–30–1, షఫాలీ వర్మ 1–0–3–0. భారత్ ఇన్నింగ్స్: యస్తిక (సి) ఫాతిమా (బి) సాదియా 17; షఫాలీ (సి) సిద్రా (బి) నష్రా సంధు 33; జెమీమా (నాటౌట్) 53; హర్మన్ప్రీత్ (సి) బిస్మా (బి) నష్రా సంధు 16; రిచా ఘోష్ (నాటౌట్) 31; ఎక్స్ట్రాలు 1; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–38, 2–65, 3–93. బౌలింగ్: ఫాతిమా 4–0–42–0, సాదియా 4–0–25–1, ఐమన్ 3–0–33–0, నిదా దార్ 4–0–36–0, నష్రా సంధు 4–0–15–2. -
Hockey World Cup 2023: భారత్ 9వ స్థానంతో ముగింపు
భువనేశ్వర్: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ హాకీలో క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేక నిరాశపరిచిన భారత జట్టు చివరకు విజయంతో మెగా టోర్నీని ముగించింది. శనివారం 9 నుంచి 12వ స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 5–2తో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అయితే మరో మ్యాచ్లో అర్జెంటీనా 6–0 స్కోరు తేడాతో వేల్స్ను చిత్తు చేయడంతో భారత్, అర్జెంటీనాలు సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున అభిషేక్ (4వ ని.), హర్మన్ప్రీత్ సింగ్ (11వ ని.), షంషేర్ సింగ్ (44వ ని.), ఆకాశ్దీప్ సింగ్ (48వ ని.), సుఖ్జీత్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. సఫారీ జట్టులో సంకెలొ ఎంవింబి (48వ ని.), ముస్తఫా కాసిమ్ (59వ ని.) చెరో గోల్ చేశారు. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే అభిషేక్ ఫీల్డ్గోల్తో భారత్కు శుభారంభమిచ్చాడు. ఈ క్వార్టర్లోనే హర్మన్ప్రీత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచి 2–0తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగాన్ని (రెండు క్వార్టర్లు) ముగించిన భారత్ ఆఖరి క్వార్టర్లో మరో రెండు ఫీల్డ్ గోల్స్ను ఆకాశ్దీప్, సుఖ్జీత్ సాధించడంతో విజయం సులువైంది. ► నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్ ► జొకోవిచ్ ( సెర్బియా) X సిట్సిపాస్ ( గ్రీస్) ► మ.గం. 2 నుంచి సోనీ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం -
Under-19 Women cricket: సిరీస్ భారత మహిళల సొంతం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా మహిళల (అండర్–19)తో జరిగిన టి20 సిరీస్లో భారత మహిళలు (అండర్–19) పైచేయి సాధించారు. ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకున్నారు. సోమవారం జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సఫారీ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 86 పరుగులే చేయగలిగింది. కేలే రెనెకే (18) టాప్ స్కోరర్గా నిలవగా...భారత బౌలర్లలో నజీలా సీఎంసీ (3/4), ఫలక్ నాజ్ (2/11) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. అనంతరం భారత్ 15 ఓవర్లలో 6 వికెట్లకు 87 పరుగులు సాధించింది. కెప్టెన్ షఫాలీ వర్మ (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించింది. సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్ గెలవగా, తర్వాతి రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సిరీస్లో చివరి మ్యాచ్ రేపు జరుగుతుంది. -
T20 World Cup 2022: 'కోహ్లి'నూర్ విజయం
అద్భుతం... అసాధారణం... అనిర్వచనీయం... ఆదివారం మెల్బోర్న్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ను ఏ తీరుగా ప్రశంసించినా తక్కువే. టి20 క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా దాయాదుల మధ్య సమరం జరిగింది. ఒకదశలో పాకిస్తాన్ గెలవడం ఖాయమనిపించింది. కానీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అసమాన పోరాటం చేశాడు. చిరకాలం అభిమానుల మదిలో మెదిలేలా కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి భారత్ను మ్యాచ్లో నిలబెట్టాడు. కోట్లాది మంది అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. దీపావళి పండగకు దేశానికి విజయకానుక ఇచ్చాడు. మెల్బోర్న్: భారత్ ఏ టోర్నీలో ఓడిందో... అక్కడే బదులు తీర్చుకుంది. ఎవరిని (షాహిన్ అఫ్రిది) చితకబాదాలనుకుందో అతన్నే బాగా ఎదుర్కొంది. భారత బ్యాటర్లు, హిట్టర్లు నిరాశపరిచినా... అడుగడుగునా సవాళ్లు ఎదురైనా... ఒక్కో పరుగు బంగారమైనా... మోస్తరు లక్ష్యం కాస్తా కొండంత అయినా ... కోహ్లి ఆఖరిదాకా నిలిచి కరిగించాడు. ఇప్పటి కోహ్లికి అంత సీన్ ఉందా అనుకున్నవాళ్ల నోళ్లు మూయించి మునుపటి కోహ్లిలా పాక్పై శివమెత్తాడు. తన కెరీర్లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై విజయం సాధించింది. ఆకాశం తాకే ఉత్కంఠభరిత పోరులో భారత్ ఆఖరిబంతికి గెలిచింది. గతేడాది దుబాయ్లో ఎదురైనా పరాజయానికి మెల్బోర్న్లో ప్రతీకారం తీర్చుకుంది. టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’ దశ గ్రూప్–2 లీగ్ మ్యాచ్లో మొదట పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (42 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (34 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. మిగతా వారిని అర్‡్షదీప్ (3/32), హార్దిక్ పాండ్యా (3/30) కట్టడి చేశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి అజేయ పోరాటం చేయగా, పాండ్యా (37 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్స్లు) అండగా నిలిచాడు. హారిస్ రవూఫ్ (2/36), నవాజ్ (2/42) భారత్ను ఇబ్బంది పెట్టారు. గెలిచేదాకా క్రీజులోనే... లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రాహుల్ (4), రోహిత్ (4) నిరాశపరిచారు. 2 ఫోర్లు కొట్టిన సూర్యకుమార్ (10 బంతుల్లో 15) జోరుకు రవూఫ్ తెరదించాడు. అక్షర్ పటేల్ (2)ను ముందుకు పంపితే రనౌటయ్యాడు. భారత్ స్కోరు 31/4. లక్ష్యం కష్టమైన ఈ దశలో కోహ్లి, పాండ్యా ఆదుకున్నారు. 25వ బంతిదాకా కోహ్లి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి 45/4 స్కోరు చేసిన భారత్కు 60 బంతుల్లో 115 పరుగుల లక్ష్యం కష్టమైంది. నవాజ్ 12వ ఓవర్లో ఎట్టకేలకు 25వ బంతిని ఎదుర్కొన్న కోహ్లి సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్లో హార్దిక్ కూడా 2 సిక్స్లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లలో వంద పరుగులు చేసిన భారత్కు 30 బంతుల్లో 60 పరుగుల సమీకరణం క్లిష్టంగా ఉంది. 18వ ఓవర్ నుంచి కోహ్లి ఆట మారిపోయింది. తొలి బంతిని బౌండరీకి తరలించిన అతను 43 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ సాధించాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఆ ఓవర్లో మొత్తం 3 బౌండరీలు బాదాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా, దినేశ్ కార్తీక్ నిష్క్రమించినా తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును గెలిపించడంతో కోహ్లి సఫలమయ్యాడు. తొలి 20 బంతుల్లో 11 పరుగులే చేసిన కోహ్లి ఆఖరి 33 బంతుల్లో 71 పరుగులు చేయడం విశేషం. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 27న నెదర్లా్లండ్స్తో ఆడుతుంది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) భువనేశ్వర్ (బి) అర్‡్షదీప్ 4; బాబర్ ఆజమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్‡్షదీప్ 0; షాన్ మసూద్ (నాటౌట్) 52; ఇఫ్తికార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 51; షాదాబ్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 5; హైదర్ అలీ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 2; నవాజ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్యా 9; ఆసిఫ్ అలీ (సి) దినేశ్ కార్తీక్ (బి) అర్‡్షదీప్ 2; షాహిన్ అఫ్రిది (సి అండ్ బి) భువనేశ్వర్ 16; హారిస్ రవూఫ్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–91, 4–96, 5–98, 6–115, 7–120, 8–151. బౌలింగ్: భువనేశ్వర్ 4–0– 22–1; అర్‡్షదీప్ 4–0–32–3; షమీ 4–0– 25–1; హార్దిక్ పాండ్యా 4–0–30–3; అశ్విన్ 3–0–23–0; అక్షర్ పటేల్ 1–0–21–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) నసీమ్ షా 4; రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) హారిస్ రవూఫ్ 4; కోహ్లి (నాటౌట్) 82; సూర్యకుమార్ (సి) రిజ్వాన్ (బి) 15; అక్షర్ పటేల్ (రనౌట్) 2; హార్దిక్ (సి) బాబర్ ఆజమ్ (బి) నవాజ్ 40; దినేశ్ కార్తీక్ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) నవాజ్ 1; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–10, 3–26, 4–31, 5–144, 6–158. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–34–0; నసీమ్ షా 4–0–23–1; హారిస్ రవూఫ్ 4–0–36–2; షాదాబ్ ఖాన్ 4–0–21–0; నవాజ్ 4–0–42–2. ఆ రెండు సిక్స్లతో... మ్యాచ్ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతున్న ఎంసీజీ పిచ్పై కోహ్లి కోహినూర్ వజ్రంలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ... భారత విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారిన వేళ... కోహ్లి ఆడిన షాట్లు ఇంకెవరికీ సాధ్యం కావు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ తొలి 4 బంతుల్లో 3 పరుగులిచ్చాడు. దాంతో భారత్ గెలవాలంటే 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ దశలో రవూఫ్ వేసిన ఐదో బంతిని అతని తలమీదుగా సిక్సర్ బాదాడు కోహ్లి. ఈ షాట్ మ్యాచ్లోనే హైలైట్. ఇక ఆరో బంతిని కోహ్లి ఫైన్లెగ్లో ఫ్లిక్ షాట్తో సిక్స్గా మలిచాడు. భారత విజయసమీకరణాన్ని 6 బంతుల్లో 16గా మార్చేశాడు. బంతి బంతికీ ఉత్కంఠ... గెలవడానికి భారత్ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ‘హార్డ్ హిట్టర్’ హార్దిక్ పాండ్యా, కోహ్లి ఉన్నారు. హార్దిక్ జోరు చూస్తుంటే మూడు షాట్లలో మ్యాచ్ను ముగించేస్తాడనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ►19.1 నవాజ్ వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడిన పాండ్యా అవుటయ్యాడు. ►19.2క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. ►19.3 కోహ్లి 2 పరుగులు తీశాడు. భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులు. ►19.4 నవాజ్ వేసిన ఫుల్టాస్ను కోహ్లి డీప్ స్క్వేర్లో సిక్సర్గా మలిచాడు. అంపైర్ దీనిని ‘హైట్ నోబాల్గా’ ప్రకటించాడు. దీంతో భారత్ ఖాతాలో 1 బంతికి 7 పరుగులు చేరాయి. భారత్కు ‘ఫ్రీ హిట్’ అవకాశం కూడా వచ్చింది. విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. ►19.4 ఈసారి నవాజ్ వైడ్ వేశాడు. ఫ్రీ హిట్ సజీవంగా నిలిచింది. ►19.4 ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. ‘ఫ్రీ హిట్’పై కేవలం రనౌట్ అయితేనే అవుట్గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. కోహ్లి, కార్తీక్ 3 ‘బై’ పరుగులు తీశారు! విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ►19.5 దినేశ్ కార్తీక్ స్వీప్ షాట్ ఆడగా బంతి అతని ప్యాడ్కు తగిలి వెనక్కి వెళ్లింది. కార్తీక్ క్రీజులోకి వచ్చేలోపు పాక్ కీపర్ రిజ్వాన్ స్టంపౌట్ చేశాడు. విజయ సమీకరణం 1 బంతికి 2 పరుగులుగా మారింది. ►19.5 తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్ లెగ్ సైడ్లో బంతి వేశాడు. అంపైర్ దానిని వైడ్గా ప్రకటించాడు. దాంతో భారత విజయ సమీకరణం 1 బంతికి 1 పరుగుగా మారింది. ►19.6 ఈసారి నవాజ్ వేసిన బంతిని అశ్విన్ మిడాఫ్లో ఫీల్డర్ మీదుగా షాట్ ఆడాడు. పరుగు తీశాడు. భారత్ విజయం ఖరారైంది. -
India vs Australia Warm-Up Match: షమీ అద్భుతం
బ్రిస్బేన్: ఇది ప్రాక్టీస్ మ్యాచే! గెలిస్తే పాయింట్లేమీ రావు. ఓడినా నష్టం లేదు! కానీ అద్భుతమైన ముగింపుతో క్రికెట్ ప్రేక్షకుల్ని మురిపించింది. ఫీల్డింగ్లో కోహ్లి మెరుపులు... షమీ ఆఖరి ఓవర్ నిప్పులతో భారత్ అనూహ్యంగా గెలిచింది. చేతిలో 4 వికెట్లున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 6 బంతుల్లో 11 పరుగులు చేయలేక ఆలౌటైంది. మొత్తానికి టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ అదిరింది. భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. కేన్ రిచర్డ్సన్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) గెలుపు తీరాలకు తెచ్చినా... ఇన్నింగ్స్ మొత్తంలో ఒకే ఒక్క ఓవర్ వేసిన షమీ పేస్ (1–0–4–3)కు ఆసీస్ ఓడిపోయింది. ఆసీస్ చివరి ఆరు వికెట్లను తొమ్మిది పరుగుల తేడాతో కోల్పోయింది. భారత్ తమ రెండో వార్మప్ మ్యాచ్ను బుధవారం న్యూజిలాండ్తో ఆడుతుంది. రాహుల్ ధనాధన్ ఓపెనర్ రాహుల్ తొలి ఓవర్ నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. స్టార్క్ బౌలింగ్లో బౌండరీ కొట్టిన అతను కమిన్స్ వేసిన నాలుగో ఓవర్ను దంచి కొట్టాడు. 6 బంతుల్ని రాహులే ఎదుర్కొని 4, 0, 6, 4, 2, 4లతో 20 పరుగులు చేశాడు. 4 ఓవర్లయినా కెప్టెన్ రోహిత్ (2 బంతులే ఆడాడు) ఖాతా తెరువలేదు. జట్టు స్కోరేమో 47/0. ఇందులో రాహుల్వే 43 పరుగులు! 27 బంతుల్లో (6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే అతను అవుట్కాగా, 6, 4తో టచ్లోకి వచ్చిన రోహిత్ (15; 1 ఫోర్, 1 సిక్స్) కూడా నిష్క్రమించాడు. 10 ఓవర్లలో భారత్ 89/2 స్కోరు చేసింది. వేగంగా ఆడే ప్రయత్నంలో కోహ్లి (13 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్), చెత్త షాట్తో హార్దిక్ పాండ్యా (2) అవుటయ్యారు. కాసేపటికే దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) జోరుకు బ్రేక్ పడగా, కమిన్స్, స్టార్క్లను అవలీలగా ఎదుర్కొన్న సూర్య ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 32 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. ఫించ్ పోరాటం భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదనకు దీటుగానే ఆసీస్ పరుగుల వేట సాగింది. ఓపెనర్లు మార్‡్ష (18 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ఫించ్ ధాటిగా ఆడారు. 5.3 ఓవర్లలో ఓపెనింగ్ వికెట్కు 64 పరుగులు జోడించారు. కానీ తర్వాతి బంతికి మార్‡్షను భువనేశ్వర్ బౌల్డ్ చేశాడు. అయితే ఫించ్ జోరు మాత్రం కొనసాగింది. స్మిత్ (11), మ్యాక్స్వెల్ (16 బంతుల్లో 23; 4 ఫోర్లు), స్టొయినిస్ (7)లతో కలిసి ఫించ్ జట్టును 19వ ఓవర్దాకా గెలుపు వైపు మళ్లించాడు. ఆ ఓవర్ తొలి బంతికి హర్షల్ అతన్ని క్లీన్బౌ ల్డ్ చేయగా, మరుసటి బంతికి టిమ్ డేవిడ్ (5)ను కోహ్లి మెరుపు వేగంతో డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. 19 ఓవర్ల దాకా విశ్రాంతినిచ్చిన షమీకి ఆఖరి ఓవర్ అప్పగించారు. అదే అతని తొలి ఓవర్ కాగా తొలి 2 బంతులకు 4 పరుగులిచ్చాడు. తర్వాత నాలుగు బంతుల్లో వికెట్లు రాలాయి. కమిన్స్ (7) షాట్కు లాంగాన్లో సిక్సర్గా వెళ్లే బంతిని కోహ్లి ఒంటిచేత్తో గాల్లో అందుకోవడం మ్యాచ్కే హైలైట్. అగర్ (0) రనౌట్ కాగా, షమీ యార్కర్లతో ఇంగ్లిస్ (1), రిచర్డ్సన్ (0)లను బౌల్డ్ చేశాడు. -
రెండో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
-
IND vs SA 2nd ODI: సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
రాంచీ: శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 113 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకం... ‘ఇషాన్’దార్ (84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఇన్నింగ్స్ భారత్ను సిరీస్లో నిలబెట్టాయి. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. సిరీస్ నిర్ణాయక మూడో వన్డే మంగళవారం ఢిల్లీలో జరుగుతుంది. రెండో వన్డేలో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మార్క్రమ్ (89 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), రీజా హెండ్రిక్స్ (76 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో సిరాజ్ (10–1– 38–3) ఆకట్టుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున షహబాజ్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. సఫారీ జట్టులో ఫామ్లో లేని కెప్టెన్ బవుమా, స్పిన్నర్ షమ్సీల స్థానాల్లో ఫోర్టున్, హెండ్రిక్స్ బరిలోకి దిగారు. దీంతో కేశవ్ మహరాజ్ సారథ్యం చేపట్టాడు. రాణించిన హెండ్రిక్స్, మార్క్రమ్ డాషింగ్ ఓపెనర్ డికాక్ (5)ను క్లీన్బౌల్డ్ చేసిన సిరాజ్ సఫారీని గట్టిదెబ్బే తీశాడు. కాసేపటికి మలాన్ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు)ను షహబాజ్ అహ్మద్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సఫారీని హెండ్రిక్స్, మార్క్రమ్ ఆదుకున్నారు. హెండ్రిక్స్ 58 బంతుల్లో, మార్క్రమ్ 64 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. చాలాసేపు భారత శిబిరాన్ని ఇబ్బంది పెట్టిన ఈ జోడీని ఎట్టకేలకు సిరాజే విడగొట్టాడు. దీంతో 129 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన క్లాసెన్ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మిల్లర్ (34 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. ఆఖరి 10 ఓవర్లను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 57 పరుగులే వచ్చాయి. కిషన్ సిక్సర్లు కెప్టెన్ ధావన్ (13), గిల్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు) మళ్లీ నిరాశపరిచారు. దాంతో భారత్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ ఫలితం, సిరీస్ చేజార్చుకోవడం తప్పదనిపించింది. ఈ దశలో ఇషాన్, శ్రేయస్ ‘లెఫ్ట్–రైట్’ కాంబినేషన్ తో అదరగొట్టారు. మొదట ఆచి తూచి ఆడిన ఈ జోడీ మ్యాచ్ సాగేకొద్దీ దంచేసే పనిలో పడింది. 20.3 ఓవర్లో భారత్ వంద స్కోరు దాటింది. కేశవ్ వేసిన 21వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన ఇషాన్ తర్వాత నోర్జేనూ చితకబాదాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ చక్కని ప్లేసింగ్తో చూడముచ్చటైన బౌండరీలతో అలరించాడు. ముందుగా ఇషాన్ 60 బంతుల్లో (2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆ తర్వాత అయ్యర్ 48 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్ కేశవ్ మహరాజ్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోయాడు. భారత బ్యాటర్లు చెలరేగడంతో 33.3 ఓవర్లో స్కోరు 200 పరుగులు దాటింది. కేవలం 16.3 ఓవర్లలో 79 పరుగుల విజయ సమీకరణం సులువైపోయింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఇషాన్ను ఫోర్టున్ అవుట్ చేశాడు. దీంతో 161 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత సామ్సన్ (30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి అయ్యర్ అజేయంగా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఈ క్రమంలో శ్రేయస్ 103 బంతుల్లో (14 ఫోర్లు) వన్డేల్లో తన రెండో శతకాన్ని సాధించాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; మలాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షహబాజ్ 25; హెండ్రిక్స్ (సి) షహబాజ్ (బి) సిరాజ్ 74; మార్క్రమ్ (సి) ధావన్ (బి) సుందర్ 79; క్లాసెన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 30; మిల్లర్ (నాటౌట్) 35; పార్నెల్ (సి) శ్రేయస్ (బి) శార్దుల్ 16; కేశవ్ (బి) సిరాజ్ 5; ఫోర్టున్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–7, 2–40, 3–169, 4–215, 5–215, 6–256, 7–277. బౌలింగ్: సిరాజ్ 10–1–38–3, వాషింగ్టన్ సుందర్ 9–0–60–1, షహబాజ్ అహ్మద్ 10–0– 54–1, అవేశ్ ఖాన్ 7–0–35–0, కుల్దీప్ యాదవ్ 9–0–49–1, శార్దుల్ ఠాకూర్ 5–0–36–1. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) పార్నెల్ 13; గిల్ (సి అండ్ బి) రబడ 28; ఇషాన్ కిషన్ (సి) హెండ్రిక్స్ (బి) ఫోర్టున్ 93; శ్రేయస్ (నాటౌట్) 113; సామ్సన్ (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 5; మొత్తం (45.5 ఓవర్లలో 3 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–28, 2–48, 3–209. బౌలింగ్: ఫోర్టున్ 9–1– 52–1, వేన్ పార్నెల్ 8–0–44–1, రబడ 10–1– 59–1, నోర్జే 8.5–0–60–0, కేశవ్ మహరాజ్ 7–0–45–0, మార్క్రమ్ 3–0–22–0. -
IND vs SA 2nd T20: పరుగుల వర్షంలో తేడా పదహారే!
గువహటి: మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేపు ముందు వరకు కూడా వాన ఆటకు అంతరాయం కలిగించేలా కనిపించింది. అయితే ఆపై అసలు వర్షమైతే రాలేదు కానీ ‘బర్సపారా’ మైదానంలో పరుగుల వర్షం కురిసింది. ముందుగా భారత్ మెరుపు బ్యాటింగ్తో భారీ స్కోరు నమోదు చేయగా... అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడింది. చివరకు 16 పరుగుల తేడాతో గెలిచిన భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 2–0తో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్లో చివరిదైన మూడో టి20 మంగళవారం ఇండోర్లో జరుగుతుంది. ఆదివారం జరిగిన రెండో టి20లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టి20ల్లో ఇది భారత్కు నాలుగో అత్యధిక స్కోరు. సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, కోహ్లి (28 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) అదే స్థాయిలో చెలరేగారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్లు), డి కాక్ (48 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) నాలుగో వికెట్కు 84 బంతుల్లోనే అభేద్యంగా 174 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. ఒకరితో పోటీ పడి మరొకరు... గత మ్యాచ్లో డకౌటైన రోహిత్ ఈసారి కొన్ని చక్కటి షాట్లతో శుభారంభం చేయగా, మరో ఎండ్ లో రాహుల్ మొదటినుంచే దూకుడు ప్రదర్శించాడు. పార్నెల్ ఓవర్లో అతను వరుసగా 6, 4 కొట్టగా రోహిత్ మరో ఫోర్ సాధించాడు. పవర్ప్లేలో భారత్ 57 పరుగులు చేసింది. ఆ తర్వాత నోర్జే వేసిన 9వ ఓవర్లో భారత్ పండగ చేసుకుంది. రాహుల్ వరుసగా 4, 6 బాదగా, రోహిత్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. తొలి వికెట్కు 59 బంతుల్లో 96 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ వెనుదిరగ్గా... 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రాహుల్ అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత సూర్య విధ్వంసం దక్షిణాఫ్రికాను అచేతనంగా మార్చేసింది. తొలి నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అతను రబడ ఓవర్లో చెలరేగిపోయాడు. అతను 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. పార్నెల్ వేసిన బంతిని మరో భారీ సిక్సర్గా మలచిన సూర్య 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు తన తొలి 14 బంతుల్లో 18 పరుగులు చేసిన కోహ్లి, తర్వాతి 14 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఎట్టకేలకు సూర్య రనౌటైనా... చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) మరిన్ని పరుగులు జోడించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీ) (బి) మహరాజ్ 57; రోహిత్ (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 43; కోహ్లి (నాటౌట్) 49; సూర్యకుమార్ (రనౌట్) 61; కార్తీక్ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 237. వికెట్ల పతనం: 1–96, 2–107, 3–209. బౌలింగ్: రబడ 4–0–57–0, పార్నెల్ 4–0–54–0, ఇన్గిడి 4–0–49–0, మహరాజ్ 4–0–23–2, నోర్జే 3–0–41–0, మార్క్రమ్ 1–0–9–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి) కోహ్లి (బి) అర్‡్షదీప్ 0; డికాక్ (నాటౌట్) 69; రోసో (సి) కార్తీక్ (బి) అర్‡్షదీప్ 0; మార్క్రమ్ (బి) అక్షర్ 33; మిల్లర్ (నాటౌట్) 106; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–47. బౌలింగ్: చహర్ 4–1–24–0, అర్‡్షదీప్ 4–0–62–2, అశ్విన్ 4–0–37–0, అక్షర్ 4–0–53–1, హర్షల్ 4–0–45–0. -
India vs South Africa 1st T20: ఆరంభం అదిరింది
తిరువనంతపురం: ప్రపంచకప్నకు ముందు చివరి టి20 సిరీస్ ఆడుతున్న భారత్ సులువైన శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో రోహిత్ శర్మ బృందం ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత సీమర్లు దీపక్ చహర్ (2/24), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్దీప్ సింగ్ (3/32), హర్షల్ పటేల్ (2/26) నిప్పులు చెరిగారు. అనంతరం బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు. దాంతో ఆసక్తికరంగా జరుగుతుందనుకున్న తొలిపోరు ఏకపక్షంగా ముగిసింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులే చేసింది. కేశవ్ మహరాజ్ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. తర్వాత భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి గెలిచింది. సూర్య, రాహుల్ మూడో వికెట్కు 93 పరుగులు జోడించారు. సిరీస్ లో రెండో టి20 అక్టోబర్ 2న గువాహటిలో జరుగుతుంది. చహర్, అర్ష్దీప్ దడదడ 1 పరుగుకే వికెట్! బవుమా (0) క్లీన్బౌల్డ్. రెండో ఓవర్లో అదే పరుగు వద్ద రెండో వికెట్... డికాక్ (1)కూడా బౌల్డే! దీన్నుంచి తేరుకోకముందే ఆ ఓవర్లోనే రోసో (0), మిల్లర్ (0) ఇద్దరు వరుస బంతుల్లోనే డకౌట్. మూడో ఓవర్లో స్టబ్స్ (0) కూడా ఖాతా తెరువలేదు. 1, 3వ ఓవర్లు వేసిన దీపక్ చహర్ (2/2), ఒక్క రెండో ఓవర్ వేసిన అర్ష్దీప్ (3/7) పేస్కు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కకావికలమైంది. జట్టు స్కోరు 9/5. ఇలా పది పరుగులైనా చేయకముందే సగం వికెట్లను కోల్పోయింది. మార్క్రమ్ (25; 3 ఫోర్లు, 1 సిక్స్), పార్నెల్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఇద్దరూ కాసేపు నిలబడటంతో కష్టంగా జట్టు స్కోరు 50 దాటింది. అనంతరం కేశవ్ మహరాజ్ కొట్టిన కాసిన్ని మెరుపులతో మొత్తానికి వంద పైచిలుకు స్కోరైతే చేయగలిగింది. ఇంత తక్కువ స్కోరులోనూ 19వ ఓవర్ పరుగందుకోవడం భారత శిబిరానికి మింగుడుపడని అంశం. అర్ష్దీప్ ఓవర్లో కేశవ్ మహరాజ్ 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 17 పరుగులు వచ్చాయి. సూర్య, రాహుల్ ఫిఫ్టీ–ఫిఫ్టీ లక్ష్యం ఛేదించే క్రమంలో భారత టాపార్డర్కూ కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. సీనియర్లు రోహిత్ శర్మ (0), కోహ్లి (3) దక్షిణాఫ్రికా పేసర్లు రబడ, నోర్జేలకు తలవంచారు. దీంతో భారత్ పవర్ప్లేలో 17 పరుగులే చేయగలిగింది. పిచ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్న మరో ఓపెనర్ రాహుల్, హిట్టర్ సూర్యకుమార్ జాగ్రత్త పడ్డారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడకుండా ఆచితూచి ఆడారు. సగం ఓవర్లు ముగిసినా భారత్ స్కోరు 50ని చేరుకోలేదు. 10 ఓవర్లలో 47/2 స్కోరే చేసింది. తర్వాత సూర్య బ్యాట్ ఝుళిపించాడు. రాహుల్ కూడా పరుగుల వేగం పెంచాడు. కుదిరిన బంతిని 4గా, చెత్త బంతిని 6గా దంచేశారు. దీంతో మరో 6.4 ఓవర్లలోనే మిగతా 63 పరుగుల్ని చకచకా చేసేసింది. లక్ష్యం చేరుకున్న 17వ ఓవర్లోనే సూర్య 33 బంతుల్లో, రాహుల్ 56 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) అర్ష్దీప్ 1; బవుమా (బి) దీపక్ చహర్ 0; రోసో (సి) పంత్ (బి) అర్ష్దీప్ సింగ్ 0; మార్క్రమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ పటేల్ 25; డేవిడ్ మిల్లర్ (బి) అర్ష్దీప్ 0; స్టబ్స్ (సి) అర్ష్దీప్ (బి) చహర్ 0; పార్నెల్ (సి) సూర్యకుమార్ (బి) అక్షర్ 24; కేశవ్ (బి) హర్షల్ 41; రబడ (నాటౌట్) 7; నోర్జే (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–8, 4–8, 5–9, 6–42, 7–68, 8–101. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–24–2, అర్ష్దీప్ సింగ్ 4–0–32–3, అశ్విన్ 4–1–8–0, హర్షల్ పటేల్ 4–0– 26–2, అక్షర్ పటేల్ 4–0–16–1. భారత్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 51; రోహిత్ శర్మ (సి) డికాక్ (బి) రబడ 0; విరాట్ కోహ్లి (సి) డికాక్ (బి) నోర్జే 3; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 50; ఎక్స్ట్రాలు 6; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–9, 2–17. బౌలింగ్: రబడ 4–1–16–1, పార్నెల్ 4–0–14–0, నోర్జే 3–0–32–1, షమ్సీ 2.4–0–27–0, కేశవ్ మహరాజ్ 3–0–21–0. 56: అంతర్జాతీయ టి20ల్లో ఎక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో రాహుల్ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. గతంలో ఈ రికార్డు గంభీర్ (54 బంతుల్లో ఆస్ట్రేలియాపై 2012లో) ఉంది. 732: ఒకే ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది సూర్యకుమార్ 21 మ్యాచ్లు ఆడి 732 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్ (689 పరుగులు; 2018లో) పేరిట ఉంది. 16: ఒకే ఏడాది అంతర్జాతీయ టి20ల్లో భారత్కు ఎక్కువ విజయాలు (16) అందించిన కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. ధోని (2016లో 15 విజయాలు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు. -
World Cadets Chess Championship: శుభి, చార్వీలకు స్వర్ణాలు
బాతూమి (జార్జియా): ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్షిప్లో భారత్కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అండర్–12 బాలికల విభాగంలో శుభి గుప్తా... అండర్–8 బాలికల విభాగంలో చార్వీ విజేతలుగా నిలిచారు. ఘాజియాబాద్కు చెందిన శుభి గుప్తా నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. బెంగళూరుకు చెందిన చార్వీ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. సంహిత పుంగవనం 7.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అండర్–8 ఓపెన్ కేటగిరీలో సఫిన్ సఫరుల్లాఖాన్ కాంస్య పతకం గెలిచాడు. కేరళకు చెందిన సఫిన్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేశాడు. -
IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్.. భారత్ భలే గెలుపు
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: ఆస్ట్రేలియాకు లభించిన ఆరంభం చూస్తే స్కోరు 200 ఖాయమనిపించింది. కానీ మన బౌలర్లు మిడిలార్డర్లో ప్రత్యర్థిని కదలనీయలేదు. చివరకు అంతకంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసేశారు. మనకు లభించిన ఆరంభం చూస్తే ఛేదన కష్టమనిపించింది. కానీ సూర్యకుమార్, కోహ్లి దానిని సునాయాసం చేసేశారు. కీలక సమయాల్లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన జట్టుకు మరో గుర్తుంచుకోదగ్గ విజయాన్ని అందించింది. భారీ స్కోర్లతో ఆసక్తికరంగా సాగి ఆఖర్లో కాస్త ఉత్కంఠను పెంచిన పోరులో చివరకు టీమిండియాదే పైచేయి అయింది. రోహిత్ సేన ఖాతాలో మరో సిరీస్ చేరింది. రెండు రోజుల విరామం తర్వాత ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్లో భారత్ బరిలోకి దిగనుంది. సాక్షి, హైదరాబాద్: చివరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే కోహ్లి సిక్స్ బాదాడు. తర్వాతి 3 బంతుల్లో ఒకే పరుగు రావడంతోపాటు కోహ్లి వెనుదిరిగాడు. దాంతో 2 బంతుల్లో 4 పరుగుల చేయాల్సి రాగా... హార్దిక్ తెలివిగా ఆడిన షాట్ థర్డ్మాన్ దిశగా బౌండరీకి దూసుకుపోవడంతో స్టేడియంలో సంబరాలు హోరెత్తాయి. మ్యాచ్లో విజయంతో టి20 సిరీస్ 2–1తో భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం రాజీవ్గాంధీ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్స్లు), కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్లు), విరాట్ కోహ్లి (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్కు 62 బంతుల్లోనే 104 పరుగులు జోడించారు. మెరుపు ఓపెనింగ్... ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మూడు భిన్నమైన దశల్లో సాగింది. ముందుగా గ్రీన్ విధ్వంసం, ఆపై భారత బౌలర్ల కట్టడితో జోరు తగ్గగా... చివర్లో డేవిడ్ దూకుడు జట్టుకు భారీ స్కోరు అందించింది. కెప్టెన్ ఫించ్ (7) విఫలం కాగా, ఆసీస్ 5 ఓవర్లలో చేసిన తొలి 62 పరుగుల్లో 52 గ్రీన్ సాధించడం విశేషం. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో వరుసగా 6,4 కొట్టిన గ్రీన్... బుమ్రా ఓవర్లో ఫోర్, 2 వరుస సిక్స్లతో చెలరేగాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. అయితే గ్రీన్ అవుటైన తర్వాత ఆసీస్ స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. ముఖ్యంగా అక్షర్ పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని నిలువరించాడు. ఒకదశలో 27 బంతుల వ్యవధిలో 22 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అక్షర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే డేవిడ్, స్యామ్స్ భాగస్వామ్యం కంగారూలను మళ్లీ నిలబెట్టింది. వీరిద్దరు ఏడో వికెట్కు 34 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అనంతరం హర్షల్ ఓవర్లో మరో భారీ సిక్సర్తో 25 బంతుల్లో డేవిడ్ ఆసీస్ తరఫున తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు బుమ్రా ఓవర్లో స్యామ్స్ 6, 4 కొట్టడం కూడా హైలైట్గా నిలిచింది. శతక భాగస్వామ్యం... భారీ ఛేదనలో భారత్కు ఆశించిన ఆరంభం లభించలేదు. 4 ఓవర్లు ముగిసేసరికి 34 పరుగులు రాగా, రాహుల్ (1), రోహిత్ (17) వెనుదిరిగారు. అయితే కోహ్లి, సూర్య భాగస్వామ్యం భారత్ను గెలుపు దిశగా నడిపించింది. హాజల్వుడ్ ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లి 6, 4 కొట్టగా, స్యామ్స్ బౌలింగ్లో సూర్య బాదిన సిక్సర్ మైదానాన్ని హోరెత్తించింది. ఆపై జంపా ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాది సూర్య 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హాజల్వుడ్ ఓవర్లోనూ 4, 6 కొట్టిన అనంతరం మరో భారీ షాట్కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. అయితే 36 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన ఈ దశలో కోహ్లి తన జోరును కొనసాగించగా, హార్దిక్ (16 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ చేరుకున్న కోహ్లి జట్టును విజయానికి చేరువగా తెచ్చి చివరి ఓవర్లో నిష్క్రమించినా హార్దిక్ మరో బంతి మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: గ్రీన్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 52; ఫించ్ (సి) హార్దిక్ (బి) అక్షర్ 7; స్మిత్ (స్టంప్డ్) కార్తీక్ (బి) చహల్ 9; మ్యాక్స్వెల్ (రనౌట్) 6; ఇన్గ్లిస్ (సి) రోహిత్ (బి) అక్షర్ 24; డేవిడ్ (సి) రోహిత్ (బి) హర్షల్ 54; వేడ్ (సి అండ్ బి) అక్షర్ 1; స్యామ్స్ (నాటౌట్) 28; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–44, 2–62, 3–75, 4–84, 5–115, 6–117, 7–185. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–39–1, అక్షర్ 4–0–33–3, బుమ్రా 4–0–50–0, హార్దిక్ 3–0–23–0, చహల్ 4–0–22–1, హర్షల్ 2–0–18–1. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) వేడ్ (బి) స్యామ్స్ 1; రోహిత్ (సి) స్యామ్స్ (బి) కమిన్స్ 17; కోహ్లి (సి) ఫించ్ (బి) స్యామ్స్ 63; సూర్యకుమార్ (సి) ఫించ్ (బి) హాజల్వుడ్ 69; హార్దిక్ (నాటౌట్) 25; కార్తీక్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–5, 2–30, 3–134, 4–182. బౌలింగ్: స్యామ్స్ 3.5–0–33–2, హాజల్వుడ్ 4–0–40–1, జంపా 4–0–44–0, కమిన్స్ 4–0–40–1, గ్రీన్ 3–0–14–0, మ్యాక్స్వెల్ 1–0–11–0. M. O. O. D as #TeamIndia beat Australia in the third #INDvAUS T20I & seal the series win. 👍 👍 Scorecard ▶️ https://t.co/xVrzo737YV pic.twitter.com/uYBXd5GhXm — BCCI (@BCCI) September 25, 2022 -
IND vs AUS 2nd T20: భారత్ గెలుపు మెరుపులు
నాగ్పూర్: తడిసిన మైదానంలో ఆలస్యమైన ఆటలో భారత్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. రెండో టి20లో ఆస్ట్రేలియాపై నెగ్గిన టీమిండియా 1–1తో సమం చేసి... సిరీస్ వేటలో నిలిచింది. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్, కెప్టెన్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో గెలిపించాడు. జంపాకు 3 వికెట్లు దక్కాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టి20 ఆదివారం హైదరాబాద్లో జరుగుతుంది. వేడ్ దూకుడు తక్కువ ఓవర్లు కావడంతో టాస్ నెగ్గగానే భారత కెప్టెన్ రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కోహ్లి అద్భుత ఫీల్డింగ్కు గ్రీన్ (5) రనౌట్ కాగా... అదే ఓవర్లో మ్యాక్స్వెల్ (0)ను అక్షర్ బౌల్డ్ చేశాడు. టి20 స్పెషలిస్ట్ హిట్టర్ టిమ్ డేవిడ్ (2)ను కూడా అక్షరే తన తదుపరి ఓవర్లో క్లీన్బౌల్డ్ చేశాడు. ప్రమాదకరమైన బ్యాటర్లిద్దరిని తేలిగ్గా అవుట్ చేసినప్పటికీ కెప్టెన్ ఫించ్, మాథ్యూ వేడ్ ధాటిగా ఆడి స్కోరు పెంచారు. హర్షల్ పటేల్ బౌలింగ్నైతే వేడ్ ఉతికి ఆరేశాడు. అతను వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 2 బౌండరీలతో 12 పరుగులు రాగా... ఆఖరి ఓవర్ (8)లో అయితే చుక్కలే చూపించాడు. డీప్ మిడ్ వికెట్, కవర్స్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన మూడు సిక్సర్లు ప్రేక్షకుల చేతుల్లో పడ్డాయి. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 19 పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా 91 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. బ్యాటింగ్ జోరు... హాజల్వుడ్ తొలి ఓవర్లోనే రోహిత్ 2, రాహుల్ ఒక సిక్సర్ బాదేయడంతో 20 పరుగుల వచ్చాయి. ఇద్దరు పుల్, హెలికాప్టర్ షాట్లతో దంచేశారు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో ‘హిట్మ్యాన్’ హుక్ షాట్తో మరో సిక్స్ కొట్టాడు. మూడో ఓవర్లో స్పిన్నర్ జంపాను దింపగా అతనికి సిక్సర్ ధాటిని చూపాడు. ఈ ఓవర్లో రాహుల్ (10)ను అవుట్ చేసిన జంపా తన మరుసటి ఓవర్లో కోహ్లి (11)ని, సూర్యకుమార్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. మరోవైపు రోహిత్ తన పనిని బౌండరీలతో యథేచ్చగా కానిచ్చేయడంతో జట్టు లక్ష్యం వైపు సాగింది. హార్దిక్ పాండ్యా (9) అవుటైనా... ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ రెండు బంతుల్లోనే సిక్స్, ఫోర్ల తో ముగించాడు. దీంతో 4 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) బుమ్రా 31; గ్రీన్ రనౌట్ 5; మ్యాక్స్వెల్ (బి) అక్షర్ 0; డేవిడ్ (బి) అక్షర్ 2; వేడ్ నాటౌట్ 43; స్మిత్ రనౌట్ 8; ఎక్స్ట్రాలు 1; మొత్తం (8 ఓవర్లలో 5 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–31, 4–46, 5–90. బౌలింగ్: పాండ్యా 1–0–10–0, అక్షర్ 2–0–13–2, చహల్ 1–0–12–0, బుమ్రా 2–0–23–1, హర్షల్ 2–0–32–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) జంపా 10; రోహిత్ నాటౌట్ 46; కోహ్లి (బి) జంపా 11; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) జంపా 0; పాండ్యా (సి) ఫించ్ (బి) కమిన్స్ 9; దినేశ్ కార్తీక్ నాటౌట్ 10; ఎక్స్ట్రాలు 6; మొత్తం (7.2 ఓవర్లలో 4 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1–39, 2–55, 3–55, 4–77. బౌలింగ్: హాజల్వుడ్ 1–0–20–0, కమిన్స్ 2–0–23–1, జంపా 2–0–16–3, సామ్స్ 1.2–0–20–0, అబాట్ 1–0–11–0. -
India vs Zimbabwe 1st ODI: శుభారంభం ఓపెనర్లతోనే...
వరుస పర్యటనలో, వరుస సిరీస్ వేటలో భారత్ శుభారంభం చేసింది. చాలా కాలం తర్వాత పునరాగమనం చేసిన దీపక్ చహర్ (3/27) బౌలింగ్లో జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ను బెంబేలెత్తిస్తే... విజయవంతమైన గిల్–ధావన్ ఓపెనింగ్ జోడి మరొకరికి చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ను ముగించింది. హరారే: ఫామ్లో ఉన్న ఓపెనర్లు శుబ్మన్ గిల్, శిఖర్ ధావన్ అజేయ అర్ధసెంచరీల కంటే కూడా దీపక్ చహర్ స్పెల్ (7–0–27–3) ఈ మ్యాచ్లో హైలైట్. ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన చహర్ పిచ్ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొని వైవిధ్యమైన బంతులతో టాపార్డర్లో ఏ ఒక్కరిని పట్టుమని 10 పరుగులైనా చేయనివ్వలేదు. ఛేదన సులువయ్యేందుకు అతని స్పెల్ కారణమైంది. ఇదే పిచ్పై రెండు వారాల క్రితం వరుస మ్యాచ్ల్లో 290, 303 పరుగులు నమోదయ్యాయి. సులువుగా ఛేదించడం కూడా జరిగింది. అలాంటి పిచ్పై చహర్ బౌలింగ్ అసాధారణమనే చెప్పాలి. దీంతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రెగిస్ చకాబ్వా (51 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచర్డ్ ఎన్గరవా (42 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), ఇవాన్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మన బౌలింగ్కు కాస్త ఎదురు నిలిచారు. స్పిన్నర్ అక్షర్ పటేల్, సీమర్లు దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ తలా 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 30.5 ఓవర్లలో అసలు వికెట్టే కోల్పోకుండా 192 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్ (72 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), ధావన్ (113 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించేశారు. చహర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభించింది. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. చహర్ దెబ్బకు ‘టాప్’టపా వికెట్లు కొత్త బంతితో దీపక్ చహర్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఇన్నోసెంట్ కైయా (4)ను కీపర్ క్యాచ్తో పంపాడు. తన మరుసటి ఓవర్ తొలి బంతికి మరుమని (8)ని కూడా కీపర్ క్యాచ్తోనే పెవిలియన్ చేర్చాడు. వెస్లీ మదెవెర్ (5)ను ఎల్బీగా ఔట్ చేశాడు. అంతకుముందు ఓవర్లో సిరాజ్... సియాన్ విలియమ్స్ (1) వికెట్ తీశాడు. జింబాబ్వే 31 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. మిడిలార్డర్ సంగతి ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ చూసుకోవడంతో ఒక దశలో జింబాబ్వే 110/8 స్కోరుతో ఆలౌట్కు దగ్గరైంది. బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ తొమ్మిదో వికెట్కు 70 పరుగులు జోడించడంతో ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇద్దరే పూర్తి చేశారు టాపార్డర్లో ఓపెనింగ్ను ఇష్టపడే కెప్టెన్ రాహుల్ తను కాదని విజయవంతమైన ధావన్–గిల్ జోడితోనే ఓపెన్ చేయించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శిఖర్–శుబ్మన్ జోడీ ఈ రెండు నెలల్లో మూడో శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. విండీస్ గడ్డపై కనబరిచిన జోరునే జింబాబ్వేపై కూడా కొనసాగించారు. మైదానంలో బౌండరీలు, భారత్కు పరుగులు వస్తున్నాయి కానీ పాపం ఆతిథ్య బౌలర్లకే వికెట్ గగనమైంది. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లతో వేయించిన ప్రయత్నం కూడా ఫలితాన్నివ్వలేదు. ముందుగా ధావన్ (76 బంతుల్లో 5ఫోర్లతో) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 20వ ఓవర్లో 100 పరుగులు దాటింది. శుబ్మన్ కూడా (51 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని చేరేందుకు 30.5 ఓవర్లే సరిపోయాయి. దాదాపు 20 ఓవర్ల ముందే ఇద్దరే బ్యాటర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: కైయా (సి) సామ్సన్ (బి) చహర్ 4; మరుమని (సి) సామ్సన్ (బి) చహర్ 8; వెస్లీ (ఎల్బీ) (బి) చహర్ 5; సియాన్ విలియమ్స్ (సి) ధావన్ (బి) సిరాజ్ 1; సికందర్ రజా (సి) ధావన్ (బి) ప్రసిధ్ 12; చకాబ్వా (బి) అక్షర్ 35; రియాన్ బర్ల్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 11; ల్యూక్ జాంగ్వే (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఇవాన్స్ నాటౌట్ 33; రిచర్డ్ (బి) ప్రసిధ్ 34; విక్టర్ (సి) గిల్ (బి) అక్షర్ 8; ఎక్స్ట్రాలు 25; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–26, 3–31, 4–31, 5–66, 6–83, 7–107, 8–110, 9–180, 10–189. బౌలింగ్: దీపక్ చహర్ 7–0–27–3, సిరాజ్ 8–2–36–1, కుల్దీప్ 10–1–36–0, ప్రసిధ్ 8–0–50–3, అక్షర్ 7.3–2–24–3. భారత్ ఇన్నింగ్స్: ధావన్ నాటౌట్ 81; శుబ్మన్ గిల్ నాటౌట్ 82; ఎక్స్ట్రాలు 29; మొత్తం (30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 192. బౌలింగ్: రిచర్డ్ ఎన్గరవా 7–0–40–0, విక్టర్ 4–0–17–0, ఇవాన్స్ 3.5–0–28–0, సియాన్ 5–0–28–0, సికందర్ రజా 6–0–32–0, ల్యూక్ జాంగ్వే 2–0–11–0, వెస్లీ 2–0–16–0, రియాన్ బర్ల్ 1–0–12–0. -
స్పిన్నర్ల మాయాజాలం.. ఆఖరి టీ20లోనూ టీమిండియాదే విజయం
ఫ్లొరిడా: ఆఖరి టి20లోనూ భారతే విజయం సాధించింది. ఐదో మ్యాచ్లో టీమిండియా 88 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. కరీబియన్ గడ్డపై ఒక మ్యాచ్ అయినా నెగ్గిన విండీస్కు అమెరికాలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పరాజయం ఎదురైంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. తర్వాత వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. బిష్ణోయ్ (4/16), కుల్దీప్ (3/12), అక్షర్ పటేల్ (3/15)ల స్పిన్ ఉచ్చులో పడిన కరీబియన్ను హెట్మైర్ (35 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్స్ చేతులెత్తేయడంతో వెస్టిండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. భారత్ 4–1తో పొట్టి సిరీస్ను కైవసం చేసుకుంది. -
India vs Sri Lanka Womens 2nd T20: భారత్దే సిరీస్
దంబుల్లా: సమష్టి ఆటతీరుతో రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్లో ఐదు వికెట్లతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు సాధించింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 13.5 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. పూజా వస్త్రకర్ బౌలింగ్లో ఆటపట్టు అవుటయ్యాక లంక పతనం మొదలైంది. చివరి ఆరు ఓవర్లలో లంక 38 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రకర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (34 బంతుల్లో 39; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (10 బంతుల్లో 17; 4 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్ప్రీత్ కౌర్ (32 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) చివరిదాకా నిలిచి భారత్ను విజయతీరానికి చేర్చింది. చివరిదైన మూడో టి20 సోమవారం జరుగుతుంది. -
‘షూటౌట్’లో భారత్ గెలుపు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత్ ఆరో విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ను నిర్వహించారు. ముందుగా తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. అనంతరం ఆరో షాట్లో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత్ తరఫున అభిషేక్ గోల్ చేయగా... ఇంగ్లండ్ తరఫున లియామ్ విఫలం కావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఈ గెలుపుతో తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్లో భారత్ 18 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి వచ్చింది. నేడు ఇంగ్లండ్తో ఇదే వేదికపై రెండో మ్యాచ్ ఉంది. -
మనదే యువ ప్రపంచం
కరోనా కారణంగా కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా... మెగా ఈవెంట్ ప్రారంభమయ్యాక జట్టులోని ఆరుగురు కరోనా బారిన పడటం... అదృష్టంకొద్దీ మ్యాచ్లో ఆడేందుకు 11 మంది అందుబాటులో ఉండటం... ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో పోరాటం... వెరసి అండర్–19 వన్డే క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో యువ భారత్ ఐదోసారి చాంపియన్గా నిలిచింది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత్ ఫైనల్లో ఇంగ్లండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోర్నమెంట్ను అజేయంగా ముగించి సగర్వంగా స్వదేశానికి పయనమైంది. టోర్నీ మొత్తంలో ఏ ఒక్కరిపైనో భారత్ సంపూర్ణంగా ఆధారపడలేదు. అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్, షేక్ రషీద్, యశ్ ధుల్, నిశాంత్, రాజ్ బావా, విక్కీ ఒస్త్వాల్, రవి కుమార్... ఇలా ప్రతి సభ్యుడూ తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. తమ కెరీర్లో చిరస్మరణీయ ఘట్టాలను లిఖించుకున్నారు. న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన యువ భారత్ జట్టు అండర్–19 ప్రపంచకప్లో తమదైన ముద్ర వేసింది. ఏకంగా ఐదోసారి జగజ్జేతగా నిలిచి తమ పట్టు నిలబెట్టుకుంది. ఇప్పటివరకు 14 సార్లు అండర్–19 ప్రపంచకప్ జరగ్గా... యువ భారత్ ఐదుసార్లు చాంపియన్గా నిలిచి, మూడుసార్లు రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆంటిగ్వాలో శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ బౌలర్లు రాజ్ బావా (5/31), రవి కుమార్ (4/34) అదరగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్ సింధు (54 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. రాజ్ బావా (54 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ దినేశ్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజ్ బావా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు అందుకున్నాడు. టోర్నీ మొత్తంలో 506 పరుగులు చేసి, 7 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవల్డ్ బ్రెవిస్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు. బీసీసీఐ అభినందన... అన్ని విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి విజేతగా అవతరించిన యువ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రశంసల వర్షం కురిపించారు. రికార్డుస్థాయిలో ఐదోసారి ఈ మెగా ఈవెంట్లో చాంపియన్గా నిలిచిన భారత జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 40 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనున్నారు. ‘అన్ని విభాగాల్లో మన కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తమ శిబిరంలో కరోనా కలకలం రేపినా అందుబాటులో ఉన్న వారితో ముందుకు దూసుకెళ్లారు. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ నిరంతరం కుర్రాళ్లలో ఉత్సాహం నింపారు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. సత్కారం... ఇంగ్లండ్పై ఫైనల్లో విజయం తర్వాత యువ భారత జట్టు అంటిగ్వా నుంచి గయానాలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది. భారత హై కమిషనర్ కేజే శ్రీనివాస భారత జట్టును సన్మానించారు. ఆ తర్వాత టీమిండియా గయానా నుంచి ఆదివారం సాయంత్రం స్వదేశానికి పయనమైంది. అమ్స్టర్డామ్ మీదుగా బెంగళూరు చేరుకోనున్న భారత జట్టు సభ్యులు అక్కడి నుంచి అహ్మదాబాద్కు వెళతారు. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ సీనియర్ జట్ల మధ్య అహ్మదాబాద్లో మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ చేరుకున్నాక బీసీసీఐ అధికారికంగా యువ జట్టును సత్కరించి రివార్డులు అందజేయనుంది. ప్రధాని శుభాకాంక్షలు ప్రపంచకప్ నెగ్గిన భారత అండర్–19 జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యువ జట్టు తమ ప్రదర్శనతో భారత భవిష్యత్ క్రికెట్ సురక్షితంగా ఉందని చాటి చెప్పిందని ఆయన అన్నారు. ‘యువ క్రికెటర్లను చూసి గర్వపడుతున్నాను. అండర్–19 ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు. అత్యున్నతస్థాయి టోర్నీలో ఆద్యంతం వారు నిలకడగా రాణించి భారత క్రికెట్ భవితకు ఢోకా లేదని నిరూపించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. యువ జట్టు విజయం వెనుక బీసీసీఐ పాత్ర కూడా ఉంది. కొన్నేళ్లుగా అండర్–16, అండర్–19, అండర్–23 స్థాయిలో భారీ సంఖ్యలో మ్యాచ్లు, టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా కాస్త ఇబ్బంది ఎదురైన మాట నిజమే. ఈ నేపథ్యంలో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా భారత యువ జట్టు ఈసారి ప్రపంచకప్ను సాధించడం గొప్ప ఘనతగా భావించాలి. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. –వీవీఎస్ లక్ష్మణ్, ఎన్సీఏ హెడ్ -
తగ్గేదే లే.. సౌతాఫ్రికాలోనూ టీమిండియా జోరు..!!
-
‘లార్డ్స్’లో భారత ఘనవిజయం
రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ.... ఈ ఇద్దరు ఓవర్నైట్ బ్యాట్స్మెన్లో పంత్ ఒక్కడే స్పెషలిస్టు బ్యాట్స్మన్. అతడు అవుటైతే ఇంకో ఐదో పదో పరుగులకు కూలిపోవచ్చనే సందేహం... ఇషాంత్కు ముందే పంత్ ఔటయ్యాడు. తర్వాత ఇషాంత్ కూడా పెవిలియన్ చేరాడు. కానీ అనుకున్నట్లుగా ఇన్నింగ్స్ కూలలేదు సరికదా అసలు మరో వికెటే పడలేదు! బంతులతో చెలరేగే బౌలర్లు షమీ, బుమ్రా బ్యాటింగ్తో అద్భుతమే చేశారు. వికెట్ పతనాన్ని అక్కడితోనే ఆపేసి... పరుగులకు బాట వేశారు. తర్వాత మళ్లీ వాళ్లిద్దరే ఇంగ్లండ్ ఓపెనర్లను డకౌట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ స్పీడ్స్టర్ సిరాజ్ ఆఖరి వికెట్ తీసి శుభం కార్డు వేయడంతో లార్డ్స్ మైదానంలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. లండన్: ‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’...ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు తన సహచరులతో కోహ్లి చెప్పిన మాట ఇది! అతను అన్నట్లుగానే మన బౌలర్లు ప్రత్యర్థిని ఒక్కో ఓవర్లో, ఒక్కో బంతికి గుండెలాగిపోయేలా చేస్తూ చివరకు గెలిచే వరకు ఆగలేదు. భారత్కు లార్డ్స్లో అద్భుత విజయాన్నిచ్చారు. రెండో టెస్టులో ఆఖరి రోజు మొదట భారత బౌలర్లు బ్యాటింగ్లో ‘కింగ్’లయ్యారు. తిరిగి బౌలింగ్తో బెంబేలెత్తించారు. ఇంగ్లండ్కు ఊహించని షాక్లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు. రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కష్టాల్లో ఉన్న భారత్ను షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకోవడంతో రెండో ఇన్నింగ్స్ను 109.3 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 51.5 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్ చేతిలో 3 వికెట్లు ఉండటంతో డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ రాబిన్సన్ (9)ను అవుట్ చేసి బుమ్రా బాట వేయగా...ఒకే ఓవర్లో బట్లర్ (25), అండర్సన్ (0)లను పెవిలియన్ పంపించి సిరాజ్ ముగిం చాడు. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 181/6తో సోమవారం ఆట ప్రారంభించిన అనం తరం రిషభ్ పంత్ (22) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాంత్ (16) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో షమీ–బుమ్రా భాగస్వామ్యం అద్భుతాన్నే చేసింది. సిరాజ్కు 4 వికెట్లు భారత్ నిర్దేశించిన లక్ష్యం 272. రెండు సెషన్లు, 60 ఓవర్లు. ఓపెనింగ్ సహా టాపార్డర్ నిలబడితే, దీనికి వేగం జతయితే ఓవర్కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇద్దరు ప్రారంభ ఓవర్లలోనే బర్న్స్ (0), సిబ్లీ (0)లను ఖాతా తెరువనీయలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్ (9), బెయిర్ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్ రూట్ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. ఈ స్థితిలో డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లండ్కు కష్టమే! అయినా సరే బట్లర్ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) ప్రయత్నిద్దామనుకున్నాడు. కానీ సీన్లోకి ఈ సారి సిరాజ్ వచ్చాడు. వరుస బంతుల్లో మొయిన్ అలీ (13), స్యామ్ కరన్ (0)లను ఔట్ చేశాడు. తర్వాత బట్లర్ను తనే పెవిలియన్ చేర్చాడు. షమీ–బుమ్రా బ్యాటింగ్ సత్తా మనం డ్రా చేసుకుంటే చాలనుకునే పరిస్థితి నుంచి ప్రత్యర్థి డ్రాతో గట్టెక్కితే చాలనే స్థితికి తీసుకొచ్చిన మహ్మద్ షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. బంతులేసే బౌలర్లు ప్రధాన బ్యాట్స్మెన్ కంటే బాగా ఆడారు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ అందుబాటులో ఉన్న అస్త్రాల్ని ప్రయోగించాడు. మార్క్వుడ్, రాబిన్సన్, స్యామ్ కరన్ ఇలా ఎవరిని దించినా బుమ్రా, షమీ తగ్గలేదు. అలా అని టిక్కుటిక్కు అని డిఫెన్స్కే పరిమితం కాలేదు. క్రీజులో పాతుకుపోయే కొద్దీ షాట్లపై కన్నేశారు. బంతిని బౌండరీలైనును దాటించారు. ఇద్దరు టెస్టు ఆడినా... పరుగుల వేగం వన్డేలా అనిపించింది. ముఖ్యంగా 40 పరుగుల వద్ద ఉన్న షమీ వరుస బంతుల్లో 4, 6 కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేయడం విశేషం. మొదట లాంగాన్లో బౌండరీ బాదిన షమీ మరుసటి బంతిని ముందుకొచ్చి డీప్ మిడ్వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అది కాస్తా ప్రేక్షకుల గ్యాలరీలో పడింది. ఈ ఇద్దరి సమన్వయం కుదరడంతో ఇంగ్లండ్ బౌలింగ్ దళం చెదిరింది. ఈ జోడీని విడగొట్టే ప్రయత్నం ఫలించక, అటు పరుగులకు అడ్డుకట్ట వేయలేక ఆపసోపాలు పడ్డారు. అబేధ్యమైన భాగస్వామ్యం ఎంతకీ ముగియకపోగా, చివరకు భారత్ డిక్లేర్ చేసింది. అజేయమైన తొమ్మిదో వికెట్కు 20 ఓవర్లలోనే షమీ, బుమ్రా 89 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391 భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజార (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) అలీ 61; పంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 22; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (ఎల్బీ) (బి) రాబిన్సన్ 16; షమీ నాటౌట్ 56; బుమ్రా నాటౌట్ 34; ఎక్స్ట్రాలు 15; మొత్తం (109.3 ఓవర్లలో) 298/8 డిక్లేర్డ్ వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175, 7–194, 8–209. బౌలింగ్: అండర్సన్ 25.3–6–53–0, రాబిన్సన్ 17–6–45–2, వుడ్ 18–4–51–3; కరన్ 18–3–42–1, అలీ 26–1–84–2, రూట్ 5–0–9–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 0; సిబ్లీ (సి) పంత్ (బి) షమీ 0; హమీద్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 9; రూట్ (సి) కోహ్లి (బి) బుమ్రా 33; బెయిర్స్టో (ఎల్బీ) (బి) ఇషాంత్ 2; బట్లర్ (సి) పంత్ (బి) సిరాజ్ 25; అలీ (సి) కోహ్లి (బి) సిరాజ్ 13; కరన్ (సి) పంత్ (బి) సిరాజ్ 0; రాబిన్సన్ (ఎల్బీ) (బి) బుమ్రా 9; వుడ్ నాటౌట్ 0; అండర్సన్ (బి) సిరాజ్ 0; ఎక్స్ట్రాలు 29; మొత్తం (51.5 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–44, 4–67, 5–67, 6–90, 7–90, 8–120, 9–120, 10–120. బౌలింగ్: బుమ్రా 15–3–33–3; షమీ 10–5–13–1, జడేజా 6–3–5–0, సిరాజ్ 10.5–3–32–4, ఇషాంత్ 10–3–13–2. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తొలి టీ20: భారత్ అదరగొట్టింది
కొలంబో: మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టి20లో టీమిండియా 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. బౌలింగ్లో అదరగొట్టి సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్లు) తన ఫామ్ను కొనసాగిం చాడు. శిఖర్ ధావన్ (36 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఛేజింగ్లో శ్రీలంక 18.3 ఓవ ర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (26 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్లు) జట్టు గెలుపు కోసం ఒంటరి పోరాటం చేశాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (4/22) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. దీపక్ చహర్ (2/24) అతనికి చక్కటి సహకారం అందించాడు. రెండో టి20 మంగళవారం జరుగుతుంది. పృథ్వీ షా డకౌట్... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం లభించలేదు. తొలి అంతర్జాతీయ టి20 ఆడిన పృథ్వీ షా (0) ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటై ‘గోల్డెన్ డక్’గా వెనుదిరిగాడు. ఫస్ట్డౌన్లో వచ్చిన సంజూ సామ్సన్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. సూర్యకుమార్ మరోసారి అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ధావన్తో కలిసి అతడు మూడో వికెట్కు 62 పరుగులు జోడించాడు. చివర్లో ఇషాన్ కిషన్ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. కట్టడి చేసిన బౌలర్లు ఛేదనలో శ్రీలంక బ్యాట్స్మెన్ను భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. మినోద్ భానుక (10; 2 ఫోర్లు), ధనంజయ డిసిల్వా (9; 1 ఫోర్), అవిష్క ఫెర్నాండో (26; 3 ఫోర్లు)లను వరుస విరామాల్లో అవుట్ చేశారు. చరిత్ అసలంక కాసేపు ప్రతిఘటించాడు. అతడు యాషెన్ బండార (9; 1 ఫోర్)తో కలిసి నాలుగో వికెట్కు 40 పరుగులు జోడించాడు. అయితే దీపక్ చహర్ అసలంకను అవుట్ చేయగా... ఆశలు పెట్టుకున్న కెప్టెన్ షనక (16; 1 ఫోర్) వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో స్టంపౌట్ అవ్వడంతో భారత్ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) మినోద్ (బి) చమీర 0; ధావన్ (సి) బండార (బి) కరుణరత్నే 46; సామ్సన్ (ఎల్బీ) (బి) హసరంగ 27; సూర్యకుమార్ (సి) (సబ్) మెండిస్ (బి) హసరంగ 50; హార్దిక్ (సి) మినోద్ (బి) చమీర 10; ఇషాన్ (నాటౌట్) 20; కృనాల్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–0, 2–51, 3–113, 4–127, 5–153. బౌలింగ్: చమీర 4–0–24–2, కరుణరత్నే 4–0–34–1, అకిల 3–0–40–0, ఉదాన 4–0–32–0, హసరంగ 4–0–28–2, షనక 1–0–4–0. శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (సి) సామ్సన్ (బి) భువనేశ్వర్ 26; మినోద్ (సి) సూర్యకుమార్ (బి) కృనాల్ 10; ధనంజయ డిసిల్వా (బి) చహల్ 9; అసలంక (సి) పృథ్వీ (బి) దీపక్ 44; బండార (బి) హార్దిక్ 9; షనక (స్టంప్డ్) ఇషాన్ (బి) వరుణ్ 16; హసరంగ (బి) దీపక్ 0; కరుణరత్నే (బి) భువనేశ్వర్ 3; ఉదాన (సి) సూర్యకుమార్ (బి) భువనేశ్వర్ 1; చమీర (సి) కృనాల్ (బి) భువనేశ్వర్ 1; అకిల (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో) 126 ఆలౌట్. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–50, 4–90, 5–111, 6–111, 7–122, 8–124, 9–125, 10–126. బౌలింగ్: భువనేశ్వర్ 3.3–0–22–4, దీపక్ 3–0–24–2, కృనాల్ 2–0–16–1, వరుణ్ 4–0–28–1, చహల్ 4–0–19–1, హార్దిక్ 2–0–17–1. సూర్యకుమార్ భువనేశ్వర్ -
India vs England: మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు
వొర్సెస్టర్: స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్తో కెప్టెన్ మిథాలీ రాజ్ భారత మహిళల జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. మిథాలీ అజేయ అర్ధ సెంచరీ (86 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు) సాధించడంతోపాటు చివరి వరకు క్రీజులో నిలిచి భారత్ను విజయతీరాలకు చేర్చింది. దాంతో చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మహిళల జట్టుపై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 219 పరుగులు చేసింది. నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు), కెప్టెన్ హీతర్ నైట్ (46; 4 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో భారత్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 46.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు స్మృతి మంధాన (49; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (19; 3 ఫోర్లు) తొలి వికెట్కు 46 పరుగులు జోడించారు. జెమీమా (4) విఫలమైంది. హర్మన్ప్రీత్ కౌర్ (16), దీప్తి శర్మ (18; 1 ఫోర్) వెంటవెంటనే పెవిలియన్కు చేరడంతో భారత్ గెలుపుపై అనుమానాలు తలెత్తాయి. అయితే అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న మిథాలీ... స్నేహ్ రాణా (22 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్కు 50 పరుగులు జోడించింది. చివర్లో స్నేహ్ అవుటవ్వగా... భారత విజయ సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులుగా ఉంది. చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు పరుగులు రాగా... మూడో బంతిని బౌండరీ బాదిన మిథాలీ భారత్కు విజయాన్ని కట్టబెట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ ఓడటంతో సిరీస్ను 1–2తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. మిథాలీ మైలురాయి: ఈ మ్యాచ్ మిథాలీకి చిరస్మరణీయ మ్యాచ్ అయ్యింది. ఆమె వ్యక్తిగత స్కోరు 15 పరుగులకు చేరుకున్నపుడు మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా అవతరించింది. చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్; 10,273 పరుగులు) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. ప్రస్తుతం మిథాలీ మూడు ఫార్మాట్లలో కలిపి 10,337 పరుగులు (11 టెస్టుల్లో 669; 217 వన్డేల్లో 7,304; 89 టి20 మ్యాచ్ల్లో 2,364 పరుగులు) చేసింది. -
IND vs ENG 3rd ODI: భారత్ తీన్మార్
సిరీస్ విజేతను తేల్చే ఆఖరి పోరులో భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన చివరి వన్డేలో కోహ్లి బృందం ఏడు పరుగుల తేడాతో ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై నెగ్గింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ను 3–1తో, టి20 సిరీస్ను 3–2తో దక్కించుకున్న టీమిండియా వన్డే ఫార్మాట్లోనూ పైచేయి సాధించి తమ సత్తా చాటుకుంది. 51 రోజులపాటు సాగిన ఈ సుదీర్ఘ పర్యటనలో పలుమార్లు ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ కీలక సమయాల్లో భారత్ దూకుడు ముందు తడబడి మూడు ఫార్మాట్లలోనూ సిరీస్లను సమర్పించుకొని తిరుగుముఖం పట్టింది. పుణే: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన నిర్ణాయక సమరంలో భారత్ ఒత్తిడిని జయించి విజయాన్ని హస్తగతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్లో, అనంతరం బౌలింగ్లో తమ సత్తా చాటుకుంది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఏడు పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున 200వ మ్యాచ్లో కెప్టెన్సీ చేసిన కోహ్లి మరోసారి టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులవద్ద ఆలౌటైంది. ధావన్ (56 బంతుల్లో 67; 10 ఫోర్లు), పంత్ (62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడైన ఆటతో అర్ధ సెంచరీలు సాధించారు. రోహిత్ శర్మ (37 బంతుల్లో 37; 6 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (21 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్స్లు) కూడా రాణించారు. అనంతరం 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసి ఓడిపోయింది. మలాన్ (50 బంతుల్లో 50; 6 ఫోర్లు), స్టోక్స్ (39 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్), లివింగ్స్టోన్ (31 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్) రాణించినా కీలక తరుణంలో అవుట్ అయ్యారు. అయితే స్యామ్ కరన్ (83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పట్టుదలతో ఆడి ఎనిమిదో వికెట్కు ఆదిల్ రషీద్ (22 బంతుల్లో 19; 2 ఫోర్లు)తో 57 పరుగులు... తొమ్మిదో వికెట్కు మార్క్ వుడ్ (21 బంతుల్లో 14; ఫోర్)తో 60 పరుగులు జోడించి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. భారత్కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని తీవ్రంగా శ్రమించి మ్యాచ్ ఆఖరి బంతికి అందుకునేలా చేశాడు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్ నెగ్గినా... స్యామ్ కరన్ తన అసాధారణ పోరాటం తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. భారత బౌలర్ నటరాజన్ నేర్పుతో బౌలింగ్ చేసి స్యామ్ కరన్ను కట్టడి చేసి కేవలం ఆరు పరుగులిచ్చి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత బౌలర్లు భువనేశ్వర్ (3/42), శార్దుల్ (4/67) కీలక వికెట్లు తీశారు. స్యామ్ కరన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... బెయిర్స్టోకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. శతక భాగస్వామ్యం... భారత ఇన్నింగ్స్లో ధావన్, రోహిత్ తొలి వికెట్కు 103 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. మెయిన్ అలీ బౌలింగ్లో రోహిత్ బౌల్డ్ కావడం... ఆ తర్వాత ధావన్, కోహ్లి (7), కేఎల్ రాహుల్ (7) వెంటవెంటనే అవుటవ్వడంతో భారత్ 157 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే పంత్–హార్దిక్ ఐదో వికెట్కు 99 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. పంత్, హార్దిక్ అవుటయ్యాక కృనాల్తో కలిసి శార్దుల్ ఠాకూర్ 45 పరుగులు జత చేయడంతో భారత స్కోరు 300 దాటింది. అయితే ఒక్కసారిగా భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. 8 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయి పూర్తి 50 ఓవర్లు ఆడకుండానే భారత్ 329 పరుగులవద్ద ఆలౌటైంది. సూపర్ భువనేశ్వర్... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఈసారి శుభారంభం లభించలేదు. ఫామ్లో ఉన్న జేసన్ రాయ్, బెయిర్స్టోలను భువనేశ్వర్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. ఆ తర్వాత స్టోక్స్, మలాన్, బట్లర్, లివింగ్స్టోన్, మొయిన్ అలీ క్రీజులో నిలదొక్కుకుంటున్న క్రమంలో అవుట్ కావడంతో ఇంగ్లండ్ 200 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదలు కుంది. కానీ స్యామ్ కరన్ అద్భుత పోరాటంతో మ్యాచ్ను ఆఖరి ఓవర్ వరకు తెచ్చినా ఇంగ్లండ్ను విజయతీరానికి చేర్చలేకపోయాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) రషీద్ 37; ధావన్ (సి అండ్ బి) రషీద్ 67; కోహ్లి (బి) అలీ 7; పంత్ (సి) బట్లర్ (బి) స్యామ్ కరన్ 78; రాహుల్ (సి) అలీ (బి) లివింగ్స్టోన్ 7; హార్దిక్ (బి) స్టోక్స్ 64; కృనాల్ (సి) రాయ్ (బి) వుడ్ 25; శార్దుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 30; భువనేశ్వర్ (సి) స్యామ్ కరన్ (బి) టాప్లీ 3; ప్రసిధ్ కృష్ణ (బి) వుడ్ 0; నటరాజన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 329 వికెట్ల పతనం: 1–103, 2–117, 3–121, 4–157, 5–256, 6–276, 7–321, 8–328, 9–329, 10–329. బౌలింగ్: స్యామ్ కరన్ 5–0–43–1; టాప్లీ 9.2–0–66–1; వుడ్ 7–1– 34–3; స్టోక్స్ 7–0–45–1; రషీద్ 10–0–81–2; అలీ 7–0–39–1; లివింగ్స్టోన్ 3–0–20–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (బి) భువనేశ్వర్ 14; బెయిర్స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్ 1; స్టోక్స్ (సి) ధావన్ (బి) నటరాజన్ 35; మలాన్ (సి) రోహిత్ శర్మ (బి) శార్దుల్ 50; బట్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 15; లివింగ్స్టోన్ (సి అండ్ బి) శార్దుల్ 36; మొయిన్ అలీ (సి) హార్దిక్ (బి) భువనేశ్వర్ 29; స్యామ్ కరన్ (నాటౌట్) 95; రషీద్ (సి) కోహ్లి (బి) శార్దుల్ 19; వుడ్ (రనౌట్) 14; టాప్లీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 322 వికెట్ల పతనం: 1–14, 2–28, 3–68, 4–95, 5–155, 6–168, 7–200, 8–257, 9–317. బౌలింగ్: భువనేశ్వర్ 10–0–42–3; నటరాజన్ 10–0–73–1; ప్రసిధ్ కృష్ణ 7–0–62–0; శార్దుల్ ఠాకూర్ 10–0–67–4; హార్దిక్ పాండ్యా 9–0–48–0; కృనాల్ పాండ్యా 4–0–29–0. -
ఆఖరి పోరులో అదరగొట్టారు
నువ్వా నేనా అంటూ సాగిన టి20 సమరంలో చివరకు భారత్దే పైచేయి అయింది. నిర్ణాయక పోరులో మన బ్యాటింగ్ బ్రహ్మాండంగా పేలగా... ఇంగ్లండ్ బ్యాటింగ్ తడబడి ఓటమిని ఆహ్వానించింది. కోహ్లి, రోహిత్ల అర్ధ సెంచరీలు... సూర్య, హార్దిక్ జోరు కలగలిసి 224 పరుగులతో టీమిండియా సవాల్ విసరగా... లక్ష్యానికి ప్రత్యర్థి చాలా దూరంలో ఆగిపోయింది. మలాన్, బట్లర్ జోరు ఆ జట్టు విజయంపై ఆశలు రేపినా... భువనేశ్వర్ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఇంగ్లండ్ను నిలువరించాడు. ముందుగా టెస్టు, ఆపై టి20 సిరీస్ గెలుచుకున్న కోహ్లి సేన ఇక వన్డే సిరీస్కు సన్నద్ధమైంది. అహ్మదాబాద్: ఇంగ్లండ్తో ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ను భారత్ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్గా దిగిన కోహ్లి ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (34 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్కు 82 బంతుల్లోనే 130 పరుగులు జోడించినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. భారీ స్కోర్ల మ్యాచ్లో పొదుపైన బౌలింగ్తో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (2/15) జట్టును గెలిపించాడు. భారత కెప్టెన్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. రోహిత్, సూర్య సూపర్... సిరీస్ నిర్ణాయక మ్యాచ్లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. అంతర్జాతీయ టి20ల్లో తొలిసారి జంటగా ఓపెనింగ్కు దిగిన రోహిత్, కోహ్లి ఓవర్కు 10.44 రన్రేట్తో పరుగులు రాబట్టారు. ముందుగా రోహిత్ బాధ్యత తీసుకొని తనదైన శైలిలో చెలరేగాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వుడ్ వేసిన రెండు బంతులను స్ట్రయిట్ డ్రైవ్ ద్వారా బౌండరీకి తరలించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆరు బంతుల వ్యవధిలో మరో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే స్టోక్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ కూడా అదే జోరు కొనసాగించడంతో భారత్ స్కోరు వేగం తగ్గలేదు. రషీద్ ఓవర్లో వరుసగా రెండు బంతులను సూర్య భారీ సిక్సర్లుగా మలచడం విశేషం. ఆ తర్వాత జోర్డాన్ బౌలింగ్లో అతను వరుసగా మూడు బంతుల్లో కొట్టిన మూడు ఫోర్లు హైలైట్గా నిలిచాయి. వేగంగా కోహ్లి స్కోరును దాటేసిన అనంతరం జోర్డాన్ అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి, పాండ్యా దూకుడు... ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లి ఆ తర్వాత పుంజుకున్నాడు. రోహిత్ అవుటయ్యే సమయానికి 20 బంతుల్లో 22 పరుగులు చేసిన కెప్టెన్ తర్వాతి 32 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. వుడ్, స్టోక్స్ బౌలింగ్లో ఒక్కో సిక్స్ కొట్టిన అతను వుడ్ మరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 36 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ భారీ స్కోరులో మరో ఎండ్ నుంచి హార్దిక్ కూడా కీలకపాత్ర పోషించాడు. జోర్డాన్ ఓవర్లో వరుస బంతుల్లో పాండ్యా కొట్టిన రెండు సిక్సర్లు టీమిండియా స్కోరును 200 పరుగులు దాటించాయి. శతక భాగస్వామ్యం... భారీ ఛేదనలో ఇంగ్లండ్ రెండో బంతికే రాయ్ (0) వికెట్ను కోల్పోయింది. అయితే మలాన్, బట్లర్ కలిసి భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు పరస్పరం పోటీ పడుతూ ధాటిగా పరుగులు రాబట్టారు. పాండ్యా వేసిన రెండో ఓవర్లో మలాన్ వరుసగా 4, 6, 4 బాదగా, సుందర్ ఓవర్లో బట్లర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. శార్దుల్ ఓవర్లో కూడా వీరిద్దరు 14 పరుగులు రాబట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాత జోరు కొనసాగిస్తూ రాహుల్ చహర్ ఓవర్లో బట్లర్ రెండు సిక్సర్లు కొట్టాడు. నటరాజన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టి మలాన్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... తర్వాతి ఓవర్లో 30 బంతుల్లో బట్లర్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఓవర్కు దాదాపు 11 పరుగుల రన్రేట్ను కొనసాగిస్తూ వీరిద్దరు చేస్తున్న బ్యాటింగ్తో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే చహర్ వేసిన 12వ ఓవర్లో 7 పరుగులే రాగా, భువనేశ్వర్ 4 బంతుల్లో 3 పరుగులే ఇవ్వడంతో ఇంగ్లండ్పై ఒత్తిడి పెరిగింది. భువీ తర్వాతి బంతికి బట్లర్ వెనుదిరగడంతో జట్టు పతనం మొదలైంది. 12 పరుగుల వ్యవధిలో 4 ప్రధాన వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. 231 ఈ సిరీస్లో కోహ్లి చేసిన పరుగులు. కేఎల్ రాహుల్ (224 పరుగులు–2020లో న్యూజిలాండ్తో సిరీస్లో)ను అధిగమిస్తూ ద్వైపాక్షిక టి20 సిరీస్లలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) స్టోక్స్ 64; కోహ్లి (నాటౌట్) 80; సూర్యకుమార్ యాదవ్ (సి) రాయ్ (బి) రషీద్ 32; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–94, 2–143. బౌలింగ్: రషీద్ 4–0–31–1; ఆర్చర్ 4–0–43–0; వుడ్ 4–0–53–0; జోర్డాన్ 4–0–57–0; స్యామ్ కరన్ 1–0–11–0; స్టోక్స్ 3–0–26–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) భువనేశ్వర్ 0; బట్లర్ (సి) హార్దిక్ (బి) భువనేశ్వర్ 52; మలాన్ (బి) శార్దుల్ 68; బెయిర్స్టో (సి) సూర్యకుమార్ (బి) శార్దుల్ 7; మోర్గాన్ (సి) (సబ్) కేఎల్ రాహుల్ (బి) హార్దిక్ 1; స్టోక్స్ (సి) పంత్ (బి) నటరాజన్ 14; జోర్డాన్ (సి) సూర్య (బి) శార్దుల్ 11; ఆర్చర్ (రనౌట్) 1; స్యామ్ కరన్ (నాటౌట్) 14; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 20, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–0, 2–130, 3–140, 4–142, 5–142, 6–165, 7–168, 8–174. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–15–2; హార్దిక్ 4–0–34–1; సుందర్ 1–0–13–0; శార్దుల్ 4–0–45–3; నటరాజన్ 4–0–39–1; రాహుల్ చహర్ 3–0–33–0. -
సూర్య ప్రతాపం.. భారత్ విజయం
అహ్మదాబాద్: పొట్టి ఫార్మాట్లో నంబర్వన్ ఇంగ్లండ్ గెలిచిన రెండు మ్యాచ్ల్లోనూ ఛేదించే ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లోనూ 16 ఓవర్లు ముగిసే సరికి 140/4 స్కోరుతో పోరాటంలో నిలిచింది. 24 బంతుల్లో మరో 46 పరుగులు కావాలి. స్టోక్స్ ధనాధన్గా సాగుతుండగా... మోర్గాన్ అండగా ఉన్నాడు. ఈ దశలో 17వ ఓవర్ వేసిన శార్దుల్ వాళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. కోహ్లి సేన 8 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెరీర్లో ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఆర్చర్కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్లు), జేసన్ రాయ్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. టాప్ మళ్లీ ఫ్లాప్ ఆట మొదలైన తొలి బంతినే హిట్మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్గా బాదేశాడు. కానీ నాలుగో ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి రోహిత్ (12; 1 ఫోర్, 1 సిక్స్) ఔటయ్యాడు. రాహుల్ (14) స్టోక్స్ బౌలింగ్లో ఆర్చర్ చేతికి చిక్కగా, కోహ్లి (1) రషీద్ గూగ్లీకి స్టంపౌటయ్యాడు. సిక్సర్తో అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు మొదలుపెట్టిన సూర్యకుమార్ బంతుల్ని పదే పదే బౌండరీలకు, సిక్సర్లకు తరలించాడు. ఈ క్రమంలో కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రాణించిన రాయ్, స్టోక్స్ లక్ష్యఛేదనలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ జట్టును ఎప్పట్లాగే జేసన్ రాయ్ ధాటిగా నడిపించాడు. కానీ బట్లర్ (9), మలాన్ (14) నిష్క్రమణతో ఇన్నింగ్స్ తడబడింది. ఈ దశలో బెయిర్ స్టో (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టోక్స్ నాలుగో వికెట్కు చకచకా 65 పరుగులు జోడించడం భారత శిబిరాన్ని ఒత్తిడిలోకి నెట్టింది. అయితే 17వ ఓవర్లో వరుస బంతుల్లో స్టోక్స్, మోర్గాన్ (4)లు ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సివుండగా శార్దుల్ 14 పరుగులు ఇవ్వడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. స్కోరు వివరాలు : భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) అండ్ (బి) ఆర్చర్ 12; రాహుల్ (సి) ఆర్చర్ (బి) స్టోక్స్ 14; సూర్య (సి) మలాన్ (బి) కరన్ 57; కోహ్లి (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 1; పంత్ (బి) ఆర్చర్ 30; శ్రేయస్ (సి) మలాన్ (బి) ఆర్చర్ 37; పాండ్యా (సి) స్టోక్స్ (బి) వుడ్ 11; శార్దుల్ నాటౌట్ 10; సుందర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 4; భువీ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–21, 2–63, 3–70, 4–110, 5–144, 6–170, 7–174, 8–179. బౌలింగ్: రషీద్ 4–1–39–1, ఆర్చర్ 4–0–33–4, వుడ్ 4–1–25–1, జోర్డాన్ 4–0–41–0, స్టోక్స్ 3–0–26–1, కరన్ 1–0–16–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సూర్య(బి) పాండ్యా 40; బట్లర్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 9; మలాన్ (బి) చహర్ 14; బెయిర్స్టో (సి) సుందర్ (బి) చహర్ 25; స్టోక్స్ (సి) సూర్య (బి) శార్దుల్ 46; మోర్గాన్ (సి) సుందర్ (బి) శార్దుల్ 4; కరన్ (బి) పాండ్యా 3; జోర్డాన్ (సి) పాండ్యా (బి) శార్దుల్ 12; ఆర్చర్ నాటౌట్ 18; రషీద్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–15, 2–60, 3–66, 4–131, 5–140, 6–140, 7–153, 8–177. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–30–1, పాండ్యా 4–0–16–2, శార్దుల్ 4–0–42–3, సుందర్ 4–0–52–0, చహర్ 4–0–35–2. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రెండే రోజుల్లో మట్టికరిపించేశారు
కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్మెన్ను కట్టిపడేశాయి. స్పిన్ది మాయో లేదంటే పిచ్దే మంత్రమో కానీ మ్యాచ్ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. గిరగిరా తిరిగే బంతులకు ఇరు జట్లు దాసోహమనగా...చివరకు ‘లోకల్ బాయ్’ అక్షర్ పటేల్ 11 వికెట్లతో (రెండు ఇన్నింగ్స్ల్లో) భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2–1తో టెస్టు చాంపియన్షిప్ రేసులో టీమిండియా ముందడుగు వేసింది. అహ్మదాబాద్: భారత్ స్పిన్తో మరో మ్యాచ్ విన్నయ్యింది. డేనైట్ టెస్టును రెండు రోజుల్లోనే ముగించింది. ఇంగ్లండ్తో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్లో 53.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది. రోహిత్ శర్మ (25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 11 వికెట్లు తీసిన అక్షర్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 46 పరుగులకు 7 వికెట్లు... రెండో రోజు 99/3 ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ కేవలం 46 పరుగులే చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ రహానే (7), రోహిత్ (96 బంతుల్లో 66; 11 ఫోర్లు) ఆట మొదలైన కాసేపటికే నిష్క్రమించగా... తర్వాత వచ్చిన వారి ఆట ఎంతోసేపు సాగనే లేదు. పిచ్ సానుకూలతల్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ కెప్టెన్, పార్ట్టైమ్ బౌలర్ రూట్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. మళ్లీ టపటపా వెంటనే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ వికెట్లు రాలడంతోనే మొదలైంది. తొలి ఓవర్ వేసిన అక్షర్ మొదటి బంతికి క్రాలీ (0)ని, మూడో బంతికి బెయిర్స్టో (0)ను ఔట్ చేశాడు. ఇలా మొదలైన పతనంతో డిన్నర్ బ్రేక్కు ముందే ఆలౌటైంది. ఇన్నింగ్స్ మొత్తం మీద బెన్ స్టోక్స్ (25), రూట్ (19), పోప్ (12) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఫోక్స్ (8), లీచ్ (9), ఆర్చర్ (0), అండర్సన్ (0) స్పిన్ ఉచ్చులో తేలిగ్గానే పడిపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్ 81 పరుగుల వద్దే ముగియగా భారత్ 49 పరుగుల లక్ష్యాన్ని అబేధ్యమైన ఓపెనింగ్తో ముగించింది. ఇంగ్లండ్ ఖేల్ ఖతం! తాజా విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు భారత్ మరింత చేరువైంది. చివరి టెస్టులో గెలిస్తే 3–1తో ఫైనల్ చేరగలిగే భారత్, మ్యాచ్ ‘డ్రా’ అయినా సరే 2–1తో ముందంజ వేస్తుంది. మూడో టెస్టులో ఓటమితో సొంత గడ్డపై డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు ఇంగ్లండ్ చేజార్చుకుంది. ఆ జట్టుకు ఇక ఎలాంటి అవకాశం లేదు. అయితే చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిస్తే 2–2తో సిరీస్ ముగుస్తుంది. అప్పుడు ఇంగ్లండ్తో పాటు భారత్ను కూడా వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 112 భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) లీచ్ 66; గిల్ (సి) క్రాలీ (బి) ఆర్చర్ 11; పుజారా (ఎల్బీ) (బి) లీచ్ 0; కోహ్లి (బి) లీచ్ 27; రహానే (ఎల్బీ) (బి) లీచ్ 7; పంత్ (సి) ఫోక్స్ (బి) రూట్ 1; అశ్విన్ (సి) క్రాలీ (బి) రూట్ 17; సుందర్ (బి) రూట్ 0; అక్షర్ (సి) సిబ్లీ (బి) రూట్ 0; ఇషాంత్ నాటౌట్ 10; బుమ్రా (ఎల్బీ) (బి) రూట్ 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (53.2 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98, 4–114, 5–115, 6–117, 7–125, 8–125, 9–134, 10–145. బౌలింగ్: అండర్సన్ 13–8–20–0, బ్రాడ్ 6–1–16–0, ఆర్చర్ 5–2–24–1, లీచ్ 20–2–54–4, స్టోక్స్ 3–0–19–0, రూట్ 6.2–3–8–5. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) అక్షర్ 0, సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 7; బెయిర్స్టో (బి) అక్షర్ 0; రూట్ (ఎల్బీ) (బి) 19; స్టోక్స్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; పోప్ (బి) అశ్విన్ 12; ఫోక్స్ (ఎల్బీ) (బి) అక్షర్ 8; ఆర్చర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; లీచ్ (సి) రహానే (బి) అశ్విన్ 9; బ్రాడ్ నాటౌట్ 1; అండర్సన్ (సి) పంత్ (బి) సుందర్ 0; మొత్తం (30.4 ఓవర్లలో ఆలౌట్) 81. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–19, 4–50, 5–56, 6–66, 7–68, 8–80, 9–80, 10–81. బౌలింగ్: అక్షర్ 15–0–32–5, అశ్విన్ 15–3–48–4, సుందర్ 0.4–0–1–1. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 25; గిల్ నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 9; మొత్తం (7.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 49. బౌలింగ్: లీచ్ 4–1–15–0, రూట్ 3.4–0–25–0. రూట్, రోహిత్ -
కొత్త దారిని ఎంచుకున్నందుకు...
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో ఆరుగురు కొత్త కుర్రాళ్లు కీలకపాత్ర పోషించారు. సిరాజ్, శుబ్మన్ గిల్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్లు ఇదే సిరీస్లో అరంగేట్రం చేయగా, శార్దుల్ ఠాకూర్కు కూడా బ్రిస్బేన్ మ్యాచ్ దాదాపు తొలి టెస్టులాంటిదే. వీరి ప్రదర్శనను అభినందిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన తరఫు నుంచి ప్రత్యేకంగా జీప్లను కానుకలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రికెటర్లకు కొత్త మోడల్ ‘థార్–ఎస్యూవీ’లు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రూ. 13 లక్షలు విలువ చేసే థార్–ఎస్యూవీ జీప్ను మహీంద్రా సంస్థ నుంచి కాకుండా తన సొంత డబ్బులతో వీటిని ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ‘భవిష్యత్తులో భారత యువకులు పెద్ద కలలు కనవచ్చని, అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించవచ్చనే నమ్మకాన్ని వీరు కలిగించారు. ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లగలిగిన వీరి విజయ గాథల్లో ఎంతో వాస్తవం ఉంది. జీవితంలో అన్ని రంగాలకు ఇవి స్ఫూర్తినందిస్తాయి. ఈ ఆరుగురికి కంపెనీ సొమ్ము నుంచి కాకుండా నా సొంత డబ్బులతో కొత్త థార్ ఎస్యూవీ వాహనాలను కానుకగా అందించడం పట్ల ఎంతో ఆనందిస్తున్నా. వీరంతా తమపై తాము ఎంతో నమ్మకముంచి నలుగురు నడిచిన దారిలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకొనే సాహసం చేయడమే నేను బహుమతి ఇవ్వడానికి కారణం. వీరికి నా అభినందనలు. వీలైనంత తొందరగా తగిన ప్రాధాన్యత ఇస్తూ వారికి ‘థార్’లు అందజేయమని మహీంద్రా కంపెనీకి విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. -
పాండ్యా మెరుపులతో... బుమ్రా మలుపుతో...
వరుస సెంచరీలు, శతక భాగస్వామ్యాలు, భారీ స్కోర్లతో చెలరేగిపోతున్న ఆస్ట్రేలియాను ఆఖరి వన్డేలో భారత్ ఆల్రౌండ్ దెబ్బకొట్టింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వీరోచిత పోరాటం, రవీంద్ర జడేజా సందర్భోచిత మెరుపులు భారత్కు పోరాడేందుకు సాయపడితే... బౌలింగ్లో బుమ్రా అద్భుతమైన మలుపు ఆసీస్ గెలుపు బాటనే కాదు... ఈ సిరీస్లోనే జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. కాన్బెర్రా: ఇది ఒకరితో దక్కిన విజయం కాదు. అలాగని ఇదేమీ ఊరట గెలుపు కాదు. ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని, బ్యాటింగ్ బలాన్ని బద్దలు కొట్టిన విజయం. రెండు వన్డేల్లోనూ 370 పైచిలుకు పరుగులు చేసి కూడా చెమటోడ్చిన ఆసీస్ను... భారత్ కేవలం 302 పరుగులు చేసి నిలువరించడం గొప్ప విషయం. సిరీస్ చేజారినా ఇక్కడ బ్యాటింగ్... బౌలింగ్... ఆతిథ్య జట్టును పెట్టించిన ‘కంగారూ’ అంతా ఇంత కాదు. క్లీన్స్వీప్ తప్పించి శుక్రవారం ఇక్కడే జరిగే తొలి టి20 మ్యాచ్కు ముందు భారత్కు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన విజయం ఇది. ఆసీస్ లక్ష్యం 303. గత మ్యాచ్ల భారీస్కోర్ల దృష్ట్యా, స్మిత్ వరుస సెంచరీల ఫామ్ దృష్ట్యా ఆతిథ్య జట్టుకు ఇదేమాత్రం కష్టం కానేకాదు. అయితే 158 పరుగులకే 5 వికెట్లు కోల్పో వడంతో భారత్కు విజయం ఖాయమవుతున్న తరుణంలో మ్యాక్స్వెల్ ధాటిగా ఆడిన ఇన్నింగ్స్ ఆసీస్ను 268/6 దాకా తీసుకెళ్లింది. ఇక 34 బంతుల్లో 35 పరుగుల విజయ సమీకరణం భారత్ను క్లీన్స్వీప్ చేసేలా కనిపించింది. కానీ బుమ్రా వేసిన 45వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. మ్యాక్స్వెల్ను ఔట్ చేయడంతో 268 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది. తర్వాత టెయిలెండర్లు 21 పరుగుల వ్యవధిలోనే నిష్క్రమించడంతో ఆసీస్ ఆలౌటైంది. భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఆసీస్ సిరీస్ను 2–1తో గెల్చుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (76 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (50 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిశారు. తర్వాత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (82 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్లు), మ్యాక్స్వెల్ (38 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. శార్దుల్ 3 వికెట్లు, బుమ్రా, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు. కోహ్లి అర్ధ సెంచరీ... భారత ఓపెనర్లలో ధావన్ (16) నిరాశపర్చగా, శుబ్మన్ గిల్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. తర్వాత కోహ్లి (78 బంతుల్లో 63; 5 ఫోర్లు) బాధ్యతగా ఆడాడు. కానీ బ్యాట్స్మెన్కు స్వర్గధామమైన ఈ పిచ్పై రన్రేట్ జోరందుకోలేదు. అయ్యర్ (19), రాహుల్ (5) చేతులెత్తేశారు. కోహ్లి 32వ ఓవర్లో 152 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఈ దశలో పాండ్యా, జడేజా జోడీ అదరగొట్టింది. ఆరో వికెట్కు అజేయంగా 150 పరుగులు జోడించడంతో భారత్ స్కోరు 300 దాటింది. భయపెట్టిన మ్యాక్స్వెల్... అరంగేట్రం చేసిన నటరాజన్, జట్టులోకి వచ్చిన శార్దుల్ ఆసీస్ టాపార్డన్ను ఇబ్బంది పెట్టారు. వారి బౌలింగ్లో లబ్షేన్ (7), స్మిత్ (7) సింగిల్ డిజిట్కే పరిమితమైనా మరో ఓపెనర్ ఫించ్ చక్కని ఇన్నింగ్స్తో విజయానికి అవసరమైన పరుగులు జతచేశాడు. వరుస విరామాల్లో హెన్రిక్స్ (22), గ్రీన్ (21), క్యారీ (38) ఔట్ కావడంతో భారత శిబిరంలో ఆశలు రేగాయి. కానీ మ్యాక్స్వెల్ చెలరేగడంతో ఆసీస్ ఒక్కసారిగా లక్ష్యానికి చేరువైంది. ఈ దశలో బుమ్రా చక్కని డెలివరీతో మ్యాక్స్వెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది మ్యాచ్ను అనూహ్య మలుపు తిప్పింది. భారత్ను విజేతగా మార్చింది. స్మిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) అగర్ (బి) అబాట్ 16; శుబ్మన్ గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అగర్ 33; కోహ్లి (సి) క్యారీ (బి) హజల్వుడ్ 63; అయ్యర్ (సి) లబ్షేన్ (బి) జంపా 19; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అగర్ 5; పాండ్యా (నాటౌట్) 92; జడేజా (నాటౌట్) 66; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 302. వికెట్ల పతనం: 1–26, 2–82, 3–114, 4–123, 5–152. బౌలింగ్: హజల్వుడ్ 10–1–66–1, మ్యాక్స్వెల్ 5–0–27–0, అబాట్ 10–0–84–1, గ్రీన్ 4–0–27–0, అగర్ 10–0–44–2, జంపా 10–0–45–1, హెన్రిక్స్ 1–0–7–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: లబ్షేన్ (బి) నటరాజన్ 7; ఫించ్ (సి) ధావన్ (బి) జడేజా 75; స్మిత్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 7; హెన్రిక్స్ (సి) ధావన్ (బి) శార్దుల్ 22; గ్రీన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 21; క్యారీ (రనౌట్) 38; మ్యాక్స్వెల్ (బి) బుమ్రా 59; అగర్ (సి) కుల్దీప్ (బి) నటరాజన్ 28; అబాట్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 4; జంపా (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 4; హజల్వుడ్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 17; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 289. వికెట్ల పతనం: 1–25, 2–56, 3–117, 4–123, 5–158, 6–210, 7–268, 8–278, 9–278, 10–289. బౌలింగ్: బుమ్రా 9.3–0–43–2, నటరాజన్ 10–1–70–2, శార్దుల్ 10–1–51–3, కుల్దీప్ 10–0–57–1, జడేజా 10–0–62–1. వన్డే సిరీస్ ట్రోఫీతో ఆస్ట్రేలియా జట్టు జడేజా, హార్దిక్ పాండ్యా -
టీమిండియా ఘన విజయం
-
అండర్–19 ముక్కోణపు క్రికెట్ టోర్నీ విజేత భారత్
హోవ్ (ఇంగ్లండ్): బ్యాట్స్మెన్ బాధ్యతాయుతంగా ఆడటంతో... ఇంగ్లండ్లో జరిగిన అండర్–19 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. హోవ్ నగరంలో ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ సరిగ్గా 50 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. హసన్ జాయ్ (109; 9 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది. యశస్వి జైస్వాల్ (50), దివ్యాంశ్ సక్సేనా (55), కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (73), ధ్రువ్ జురెల్ (59 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. ధ్రువ్తో కలిసి తిలక్ వర్మ అజేయ ఐదో వికెట్కు 29 పరుగులు జోడించాడు. -
చెమటోడ్చి ఛేదన..!
పరుగుల ప్రవాహమే అనుకుంటే... వికెట్లు టపటపా పడ్డాయి. ఇరు జట్ల నుంచి ఒకటైనా సెంచరీ నమోదవుతుందని ఊహిస్తే... వంద పరుగులు చేయడం, ఛేదించడమే కష్టమైపోయింది. పట్టుమని పది ధనాధన్ షాట్లైనా లేవు... మెరుపు ఇన్నింగ్స్ అనే మాటే లేదు... అసలు ఆడుతున్నది టి20నేనా అనేంత అనుమానంతో సాగింది భారత్–వెస్టిండీస్ మ్యాచ్. మొదట్నుంచి నిస్సారంగానే కనిపించినా చివరకు టీమిండియానే విజయం సాధించడంతో ఊరట దక్కింది. లాడర్హిల్ (అమెరికా) ప్రపంచ కప్ అనంతర ప్రయాణాన్ని భారత్ విజయంతో ప్రారంభించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్హిల్లో శనివారం వెస్టిండీస్తో జరిగిన తొలి టి20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అరంగేట్ర పేసర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నవదీప్ సైనీ (3/17) అదరగొట్టడంతో పాటు మిగతా బౌలర్లు తలో చేయి వేయడంతో ప్రత్యర్థిని కట్టిపడేసిన కోహ్లి సేన... బ్యాట్స్మెన్ తలా కొన్ని పరుగులు చేయడంతో లక్ష్యాన్ని అందుకోగలిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ (49 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్. పొలార్డ్ మినహా నికొలస్ పూరన్ (16 బంతుల్లో 20; ఫోర్, 2 సిక్స్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. లక్ష్యం స్వల్పమే అయినా ఛేదనలో భారత్ చెమటోడ్చింది. ఓపెనర్ రోహిత్ శర్మ (25 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫటాఫట్ షాట్లకు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి (29 బంతుల్లో 19; ఫోర్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు) అవసరమైన పరుగులు చేశారు. దీంతో 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి గెలుపొందింది. ఆదివారం ఇక్కడే రెండో టి20 జరగనుంది. ఆడింది విండీసేనా...? టి20ల్లో భీకర హిట్టింగ్కు వెస్టిండీస్ మారుపేరు. కానీ, ఈ మ్యాచ్లో అలాంటిదేమీ కనిపించలేదు. టీమిండియా బౌలింగ్ దాడిని ప్రారంభించిన యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ జాన్ కాంప్బెల్ (0)ను ఔట్ చేశాడు. ఇదే మైదానంలో మూడేళ్ల క్రితం భారత్పై చెలరేగి శతకం బాదిన ఓపెనర్ ఎవిన్ లూయీస్ (0)ను భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. సిక్స్తో తనకు స్వాగతం పలికిన పూరన్పై ఆ వెంటనే సైనీ ప్రతీకారం తీర్చుకున్నాడు. దూకుడైన హెట్మైర్ (0)ను తదుపరి బంతికే బౌల్డ్ చేసి హ్యాట్రిక్పై నిలిచాడు. అయితే, రావ్మన్ పావెల్ (4) అడ్డుకున్నాడు. సరిగ్గా ఆరు బంతుల తర్వాత పావెల్ను ఖలీల్ ఔట్ చేశాడు. పవర్ ప్లే ముగిసిన ఈ దశలో విండీస్ స్కోరు 33/5. స్పిన్నర్లు జడేజా, కృనాల్ రంగంలోకి దిగాక సిక్స్లు బాది పొలార్డ్ స్కోరు పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ, కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ (24 బంతుల్లో 9) మరీ పేలవంగా ఆడాడు. బ్రాత్వైట్ను కృనాల్, నరైన్ (2)ను జడేజా వెనక్కుపంపాక కరీబియన్లు తేరుకోలేకపోయారు. అప్పటికీ సైనీ, భువీ ఓవర్లలో సిక్స్లు కొట్టిన పొలార్డ్ కాసిన్ని పరుగులు జోడించాడు. 120 బంతుల విండీస్ ఇన్నింగ్స్లో 79 బంతులకు పరుగే రాకపోవడం గమనార్హం. ఇబ్బందిపడ్డా... గెలుపు గట్టెక్కారు గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన ఓపెనర్ ధావన్ (1) నిరుత్సాహపర్చినా రోహిత్ తనదైన శైలిలో ఆడుతూ భారత్ ఛేదనను నడిపించాడు. కోహ్లి అతడికి సహకరించాడు. అయితే, నరైన్ (2/14) వరుస బంతుల్లో రోహిత్, రిషభ్ పంత్ (0)ను ఔట్ చేసి కలవరపెట్టాడు. నరైన్ యార్కర్ లెంగ్త్ బంతిని భారీ షాట్ కొట్టబోయి రోహిత్ లాంగాన్లో పొలార్డ్కు చిక్కాడు. పంత్ బంతి గమనాన్ని ఊహించకుండా బల ప్రయోగం చేసి వికెట్ పారేసుకున్నాడు. దాదాపు విండీస్ తరహాలోనే 32/3తో నిలిచిన భారత్ను కోహ్లి, పాండే ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 30 బంతుల్లో 32 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. వీరిద్దరూ ఒకరివెంట ఒకరు వెనుదిరిగినా... కృనాల్ (12), జడేజా (10 నాటౌట్) లక్ష్యానికి దగ్గరగా తీసుకొచ్చారు. కీమో పాల్ ఓవర్లో సిక్స్ కొట్టిన సుందర్ (8 నాటౌట్) లాంఛనాన్ని ముగించాడు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: కాంప్బెల్ (సి) కృనాల్ (బి) సుందర్ 0; లూయిస్ (బి) భువనేశ్వర్ 0; పూరన్ (సి) పంత్ (బి) సైనీ 20; పొలార్డ్ ఎల్బీ (బి) సైనీ 49; హెట్మైర్ (బి) సైనీ 0; పావెల్ (సి) పంత్ (బి) ఖలీల్ 4; బ్రాత్వైట్ (సి అండ్ బి) కృనాల్ 9; నరైన్ (సి) ఖలీల్ (బి) జడేజా 2; పాల్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 3; కాట్రెల్ నాటౌట్ 0; థామస్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–28, 4–28, 5–33, 6–67, 7–70, 8–88, 9–95. బౌలింగ్: సుందర్ 2–0–18–1, భువనేశ్వర్ 4–0–19–2, సైనీ 4–1–17–3, ఖలీల్ 2–0–8–1, కృనాల్ 4–1–20–1, జడేజా 4–1–13–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) పొలార్డ్ (బి) నరైన్ 24; ధావన్ ఎల్బీ (బి) కాట్రెల్ 1; కోహ్లి (సి) పొలార్డ్ (బి) కాట్రెల్ 19; పంత్ (సి) కాట్రెల్ (బి) నరైన్ 0; పాండే (బి) పాల్ 19; కృనాల్ (బి) పాల్ 12; జడేజా నాటౌట్ 10; సుందర్ నాటౌట్ 8; ఎక్స్ట్రాలు 5; మొత్తం (17.2 ఓవర్లలో 6 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–4, 2–32, 3–32, 4–64, 5–69, 6–88. బౌలింగ్: థామస్ 4–0–29–0, కాట్రెల్ 4–0–20–2, నరైన్ 4–0–14–2, పాల్ 3.2–0–23–2, బ్రాత్వైట్ 2–0–12–0. అమెరికాలో మ్యాచ్... అయినా అగ్ర రాజ్యం అమెరికాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించేందుకు... అటు కరీబియన్ దీవులకు దగ్గరగానూ ఉండే ఫ్లోరిడాలో నిర్వహిస్తున్న ఈ సిరీస్కు తొలి మ్యాచ్లో స్పందన అంతంతే కనిపించింది. ఈ మైదానంలో మూడేళ్ల క్రితం భారత్–విండీస్ మ్యాచ్కు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈసారి మాత్రం కనిష్ట టికెట్ ధర 50 డాలర్లే అయినా స్టాండ్స్ నిండలేదు. లాడర్హిల్లో మొత్తమ్మీద ఇది తొమ్మిదో మ్యాచ్ కావడం గమనార్హం. సై.. సై.. సైనీ తొలి టి20లో భారత్కు పెద్ద సానుకూలాంశం నవదీప్ సైనీ. ఆసాంతం 140 కి.మీ. పైగా వేగంతో సాగిన అతడి బౌలింగ్ ఆకట్టుకుంది. తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన సైనీ... తర్వాత సైతం కట్టుదిట్టంగా బంతులేశాడు. అతడి నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా 19 డాట్ బాల్స్ ఉండటమే దీనికి నిదర్శనం. జట్టులో అత్యధిక డాట్ బాల్స్ వేసింది కూడా సైనీనే. అన్నింటికి మించి చివరి ఓవర్ను సైనీ వేసిన తీరు ముచ్చటగొలిపింది. పొలార్డ్ వంటి హిట్టర్కు వరుసగా రెండు డాట్స్ వేయడంతో పాటు మూడో బంతికి ఔట్ చేసి అతడి అర్ధసెంచరీని అడ్డుకున్నాడు. మిగతా మూడు బంతులకూ పరుగివ్వకుండా విండీస్ను 100లోపే పరిమితం చేశాడు. టి20ల్లో సాధారణంగా మెయిడిన్ వేయడమే అరుదంటే... ఏకంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ను వికెట్ మెయిడిన్గా ముగించి భళా అనిపించాడు. -
స్పిన్తో ‘సిడ్నీ’ వశం
ఆస్ట్రేలియా గడ్డపై తొలి అంకాన్ని భారత్ విజయవంతంగా ముగించింది. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్లో చేజారిన విజయం, రెండో మ్యాచ్ రద్దు తర్వాత తమ అసలు సత్తాను ప్రదర్శించి సిరీస్ను సమం చేసింది. ఆసీస్ గడ్డపై దాదాపు సొంత మైదానంలాంటి సిడ్నీలో 37,339 మంది ప్రేక్షకుల్లో సగానికంటే ఎక్కువ మంది టీమిండియాకు మద్దతు పలుకుతుండగా భారత్ గెలుపు తీరం చేరింది. ముందుగా కుల్దీప్ స్పిన్ను ఎదుర్కోలేక ఒత్తిడికి లోనైన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మరో స్పిన్నర్ కృనాల్ పాండ్యాపై ఎదురుదాడి చేయబోయి నాలుగు వికెట్లు సమర్పించుకోవడంతో భారీ స్కోరుకు దూరమైంది. అనంతరం ఓపెనర్ల దూకుడుకు తోడు విరాట్ కోహ్లి తనదైన శైలిలో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. కంగారూలు ఒక్క సిక్స్ కూడా కొట్టలేక పేలవంగా ఆడితే... భారత్ ఏకంగా ఎనిమిది సిక్సర్లు బాది ఇరు జట్ల మధ్య తేడా ఏమిటో చూపించింది. సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టి20 మ్యాచ్ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (4/36), కుల్దీప్ యాదవ్ (1/19) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (41 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ (22 బంతుల్లో 41; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 117 పరుగులు చేసిన ధావన్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో టెస్టు సిరీస్కు ముందు భారత్ ఈ నెల 29 నుంచి ఇదే మైదానంలో జరిగే నాలుగు రోజుల మ్యాచ్లో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్తో తలపడుతుంది. కుల్దీప్ కట్టడి... ఆస్ట్రేలియాకు ఓపెనర్లు షార్ట్, ఫించ్ శుభారంభం అందించారు. ప్రతీ ఓవర్లో వీరిద్దరు కనీసం ఒక ఫోర్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 49 పరుగులకు చేరింది. అనంతరం పాండ్యా వేసిన తొలి బంతికి ఫించ్ (22 వద్ద) ఇచ్చిన క్యాచ్ను లాంగాన్లో రోహిత్ వదిలేశాడు. ఆ ఓవర్లో ఆసీస్కు 12 పరుగులు లభించాయి. తొలి వికెట్కు 51 బంతుల్లో 68 పరుగులు జోడించిన తర్వాత కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. స్వీప్ షాట్ ఆడబోయి పాండ్యాకు ఫించ్ క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో మ్యాక్స్వెల్ను అంపైర్ ఔట్గా ప్రకటించినా... రివ్యూలో అతను బతికి పోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆసీస్ను పాండ్యా దెబ్బ తీశాడు. స్వీప్ షాట్లు ఆడబోయి వరుస బంతుల్లో షార్ట్, మెక్డెర్మట్ (0) వెనుదిరిగారు. పాండ్యా తన తర్వాతి ఓవర్లో మ్యాక్స్వెల్ (13)ను కూడా ఔట్ చేశాడు. అతని చివరి ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అలెక్స్ కారీ (19 బంతుల్లో 27; 4 ఫోర్లు) తర్వాతి బంతికి డీప్లో క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా చక్కటి ఫీల్డింగ్కు లిన్ (13) రనౌట్ కావడం ఆసీస్ పరిస్థితిని దిగజార్చింది. ఈ దశలో స్టొయినిస్ (15 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు), కూల్టర్నీల్ (7 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. వీరిద్దరు చివరి 16 బంతుల్లో 33 పరుగులు రాబట్టారు. ఇన్నింగ్స్లో ఒక్క సిక్సర్ కూడా లేకుండా ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఆసీస్దే కావడం గమనార్హం. ఓపెనర్ల జోరు... లక్ష్య ఛేదనలో భారత్ రెండుసార్లు ఒకే స్కోరు వద్ద రెండేసి వికెట్లు కోల్పోయినా... మొత్తంగా టాప్–3 ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రదర్శనే మళ్లీ జట్టును గెలిపించింది. మరోసారి ఓపెనర్లు ధావన్, రోహిత్ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆటను మొదలు పెట్టారు. అయితే రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడుతున్న స్టార్క్ ఆరంభంలో కొంత ఇబ్బంది పెట్టాడు. అతని తొలి 11 బంతుల్లో భారత్ 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే స్టార్క్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి ధావన్ అద్భుతమైన ఆఫ్డ్రైవ్తో ఫోర్ కొట్టడంతో జోరు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో జట్టు 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 42 పరుగులు రాబట్టడం విశేషం. కూల్టర్నీల్ ఓవర్లో రోహిత్ సిక్స్ బాదగా, ధావన్ వరుసగా 6, 4 కొట్టాడు. తొలి టి20 చివరి ఓవర్లో భారత్ను నిలువరించి హీరోగా మారిన స్టొయినిస్ను ఈసారి మన బ్యాట్స్మన్ చితక్కొట్టారు. అతను వేసిన ఏకైక ఓవర్లో రోహిత్ సిక్సర్, ధావన్ వరుసగా 6, 4, 4 కొట్టడంతో 22 పరుగులు లభించాయి. అయితే స్టార్క్ చక్కటి బంతితో ధావన్ను ఎల్బీగా ఔట్ చేయడంతో 67 పరుగుల (33 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. జంపా వేసిన తర్వాత ఓవర్లో వరుసగా నాలుగు డాట్ బంతులు ఆడిన రోహిత్ ఐదో బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. భారీ సిక్సర్తో ఖాతా తెరిచిన రాహుల్ (20 బంతుల్లో 14; 1 సిక్స్) ఎక్కువసేపు నిలబడలేకపోగా, తొలి బంతికే రిషభ్ పంత్ (0) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో భారత్ 41 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. తర్వాతి 12 బంతుల్లో 6 పరుగులు మాత్రమే రావడంతో లక్ష్యం 29 బంతుల్లో 51 పరుగులుగా మారింది. అయితే ఛేజింగ్ మాస్టర్ కోహ్లి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. టై ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కోహ్లి తర్వాతి ఓవర్లో మరో సిక్సర్ బాదాడు. కార్తీక్ కూడా ఐదు బంతుల వ్యవధిలో సిక్స్, ఫోర్ కొట్టడంతో భారత్ పని సులువైంది. చివరి ఓవర్లో గెలిచేందుకు 6 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లి వరుసగా రెండు ఫోర్లు కొట్టి రెండు బంతుల ముందే ఆట ముగించాడు. చివరి వరకు అండగా నిలిచిన దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో ఐదో వికెట్కు కోహ్లి 39 బంతుల్లోనే అభేద్యంగా 60 పరుగులు జత చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షార్ట్ (ఎల్బీ) (బి) కృనాల్ 33; ఫించ్ (సి) కృనాల్ (బి) కుల్దీప్ 28; మ్యాక్స్వెల్ (సి) రోహిత్ (బి) కృనాల్ 13; మెక్డెర్మట్ (ఎల్బీ) (బి) కృనాల్ 0; కారీ (సి) కోహ్లి (బి) కృనాల్ 27; లిన్ (రనౌట్) 13; స్టొయినిస్ (నాటౌట్) 25; కూల్టర్నీల్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–68; 2–73; 3–73; 4–90; 5–119; 6–131. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0; ఖలీల్ 4–0–35–0; బుమ్రా 4–0–38–0; కుల్దీప్ 4–0–19–1; కృనాల్ 4–0–36–4. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) జంపా 23; ధావన్ (ఎల్బీ) (బి) స్టార్క్ 41; కోహ్లి (నాటౌట్) 61; రాహుల్ (సి) కూల్టర్ నీల్ (బి) మ్యాక్స్వెల్ 14; పంత్ (సి) కారీ (బి) టై 0; కార్తీక్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–67; 2–67; 3–108; 4–108. బౌలింగ్: స్టార్క్ 4–0–26–1; కూల్టర్నీల్ 3–0–40–0; స్టొయినిస్ 1–0–22–0; జంపా 4–1–22–1; మ్యాక్స్వెల్ 4–0–25–1; టై 3.4–0–32–1. సిరీస్ 1–1తో సమం చేయడాన్ని బట్టి చూస్తే ఇరు జట్లు ఎలా ఆడాయో అంచనా వేయవచ్చు. ఇది మా ప్రదర్శనను ప్రతిబింబిస్తోంది. మొత్తంగా ఈ రోజు మేం ఆస్ట్రేలియాపై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించాం. కనీసం 180 పరుగులు చేయాల్సిన ఈ పిచ్పై మిగిలిన ఆ 15 పరుగులను నిరోధించడంలోనే గెలుపు దాగి ఉంది. ఓపెనర్లు చెలరేగితే మా పని మరింత సులువు అవుతుంది. దినేశ్ కార్తీక్ కూడా చివర్లో చాలా బాగా ఆడాడు. –విరాట్ కోహ్లి 14: భారత్ తరఫున ఛేదనలో 14 సార్లు కోహ్లి నాటౌట్గా నిలవగా... అన్ని మ్యాచ్లలోనూ జట్టు నెగ్గింది. 1:ఆసీస్ గడ్డపై టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/36) నమోదు చేసిన స్పిన్నర్గా కృనాల్ పాండ్యా గుర్తింపు పొందాడు. -
భారత్ అదరహో...
ఇంగ్లండ్ గడ్డపై ఇండియా అదరగొట్టింది. లక్ష్యం ఎంతటిదైనా తమ ముందు దిగదుడుపే అని మరోసారి నిరూపించింది. బలమైన ఇంగ్లండ్ అంటూ వినిపించిన మాటలను తేలిగ్గా తీసిపారేసినట్లుగా చివరి టి20లో సునాయాస విజయంతో సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రోహిత్ శర్మ, అంతర్జాతీయ టి20ల్లో మూడో సెంచరీతో మెరిసిన వేళ టీమిండియా 199 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కోహ్లి సమయోచిత బ్యాటింగ్, పాండ్యా మెరుపులు భారత్ పనిని సులువుగా మార్చేశాయి. ఇక గురువారం నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సమరానికి తెర లేవనుంది. బ్రిస్టల్: భారీ అంచనాలతో ఇంగ్లండ్లో దిగిన భారత్ తొలి దశలో దానిని నిలబెట్టుకుంది. ఇంగ్లండ్తో జరిగిన టి20 సిరీస్ను 2–1తో గెలుచుకొని సత్తా చాటింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి టి20లో భారత్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బట్లర్ (21 బంతుల్లో 34; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. పాండ్యాకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (56 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కోహ్లి (29 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచారు. రోహిత్కే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా దక్కింది. ఓపెనర్ల విధ్వంసం... ఎప్పటిలాగే ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. రాయ్, బట్లర్ తమదైన శైలిలో దూకుడుగా ఆడటంతో భారత బౌలర్లు లయ తప్పారు. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దీపక్ చహర్ వేసిన తొలి ఓవర్లో బట్లర్ మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత ఉమేశ్ ఓవర్లో రాయ్ 2 ఫోర్లు, సిక్సర్తో చెలరేగాడు. పాండ్యా వేసిన ఆరో ఓవర్లో రాయ్ వరుసగా 4, 4, 6, 6 కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి. ఫలితంగా పవర్ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 73 పరుగులకు చేరింది. అయితే ఎట్టకేలకు బట్లర్ను బౌల్ట్ చేసి కౌల్ ఈ జోడీని విడగొట్టాడు. వీరిద్దరు 47 బంతుల్లోనే 94 పరుగులు జత చేయడం విశేషం. ఆ తర్వాత రాయ్ను అవుట్ చేసి చహర్ తన తొలి వికెట్ అందుకున్నాడు. అనంతరం హేల్స్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 13 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 132 పరుగులకు చేరింది. ఈ దశలో పాండ్యా వేసిన ఓవర్తో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి బంతికి మోర్గాన్ (6)ను ఔట్ చేసిన పాండ్యా, చివరి బంతికి హేల్స్ ఆట ముగించాడు. ఆ తర్వాత స్టోక్స్ (14), బెయిర్ స్టో (14 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అడపాదడపా కొన్ని మెరుపు షాట్లు ఆడినా... ఆరంభంలో కనబర్చిన దూకుడును ఇంగ్లండ్ చూపలేకపోయింది. వీరిద్దరు కూడా పాండ్యా బౌలింగ్లోనే వెనుదిరిగారు. చివరి ఓవర్లో కూడా ఇంగ్లండ్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఒక దశలో కనీసం 230 పరుగులు చేసేలా కనిపించిన జట్టు... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్తో చివరకు 200 పరుగుల మార్క్ను కూడా అందుకోలేకపోయింది. తన తొలి ఓవర్లో 22 పరుగులిచ్చిన పాండ్యా, తర్వాతి 3 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. రోహిత్ ఒంటిచేత్తో... లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే శిఖర్ ధావన్ (5) వికెట్ కోల్పోయింది. వేగంగా ఆడబోయిన రాహుల్ (10 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా జోర్డాన్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. అయితే మరోవైపు రోహిత్ దూకుడైన బ్యాటింగ్తో భారత్ దూసుకుపోయింది. తాను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్సర్గా మలిచి ఖాతా తెరిచిన రోహిత్ ఇన్నింగ్స్ ఆసాంతం స్వేచ్ఛగా ఆడాడు. ఎక్కడా అతని షాట్లలో తడబాటు కనిపించలేదు. ప్రతీ ఇంగ్లండ్ బౌలర్ను అతను అలవోకగా ఎదుర్కొన్నాడు. జోర్డాన్ ఓవర్లో ఫోర్, 2 సిక్సర్లతో ధాటిని పెంచిన అతను 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజ్లో ఉన్నంత సేపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్కు 57 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. జోర్డాన్ రిటర్న్ క్యాచ్కు కోహ్లి వెనుదిరిగినా, అప్పటికే భారత్ విజయం దిశగా సాగుతోంది. రోహిత్కు పాండ్యా జత కలిసిన తర్వాత గెలుపు సునాయాసమైపోయింది. 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ తర్వాతి 16 బంతుల్లోనే ఆట ముగించేసింది. బాల్ వేసిన 17వ ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాగా, విల్లీ వేసిన 18వ ఓవర్లో పాండ్యా ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టాడు. రోహిత్ కూడా మరో ఫోర్ బాదడంతో 20 పరుగులు లభించాయి. జోర్డాన్ బౌలింగ్లో సింగిల్ తీసి రోహిత్ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్తో పాండ్యా గెలిపించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) ధోని (బి) చహల్ 67; బట్లర్ (బి) కౌల్ 34; హేల్స్ (సి) ధోని (బి) పాండ్యా 30; మోర్గాన్ (సి) ధోని (బి) పాండ్యా 6; స్టోక్స్ (సి) కోహ్లి (బి) పాండ్యా 14; బెయిర్ స్టో (సి) ధోని (బి) పాండ్యా 25; విల్లీ (బి) ఉమేశ్ 1; జోర్డాన్ (రనౌట్) 3; ప్లంకెట్ (సి) ధోని (బి) కౌల్ 9; రషీద్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–94; 2–103; 3–134; 4–140; 5–177; 6–181; 7–183; 8–194; 9–198. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–43–1; ఉమేశ్ 4–0–48–1; కౌల్ 4–0–35–2; పాండ్యా 4–0–38–4; చహల్ 4–0–30–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 100; ధావన్ (సి) బాల్ (బి) విల్లీ 5; రాహుల్ (సి) జోర్డాన్ (బి) బాల్ 19; కోహ్లి (సి అండ్ బి) జోర్డాన్ 43; పాండ్యా (నాటౌట్) 33; ఎక్స్ట్రాలు 1; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–21; 2–62; 3–151. బౌలింగ్: విల్లీ 3–0–37–1; బాల్ 3–0–39–1; జోర్డాన్ 3.4–0–40–1; ప్లంకెట్ 3–0–42–0; స్టోక్స్ 2–0–11–0; రషీద్ 4–0–32–0. ► 3 అంతర్జాతీయ టి20ల్లో రోహిత్ సెంచరీల సంఖ్య. కొలిన్ మున్రో (న్యూజిలాండ్) మాత్రమే 3 సెంచరీలు సాధించాడు. ► 5 ఒకే ఇన్నింగ్స్లో 5 క్యాచ్లు పట్టిన తొలి వికెట్ కీపర్ ధోని. అయితే ఐదుగురిని ఔట్ చేసిన కీపర్లలో షహజాద్ (అఫ్గానిస్తాన్) కూడా ఉన్నాడు. అతను 3 క్యాచ్లు పట్టి, 2 స్టంపింగ్లు చేశాడు. ► 76 భారత్ తరఫున టి20లు ఆడిన 76వ ఆటగాడు దీపక్ చహర్ ► 8 భారత్ ఆడిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్లు. అన్నింటిలోనూ విజేతగా నిలిచింది. -
భారత్ అదరహో
దుబాయ్: ఆరు దేశాలు పాల్గొన్న దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీలో అజేయంగా ఫైనల్కు చేరిన భారత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ట్రోఫీ చేజిక్కించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో ప్రపంచ చాంపియన్ భారత్ 44–26తో ఇరాన్ను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ ప్రథమార్ధం ముగిసేసరికి 18–11తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ జయభేరి మోగించింది. బలమైన భారత డిఫెన్స్ను ఛేదించలేక ఇరాన్ చతికిలబడింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు. -
అయ్యో.. ఐర్లాండ్ : భారత్ ఘన విజయం
అగ్రశ్రేణి జట్టుగా తమ స్థాయిని ప్రదర్శిస్తూ భారత జట్టు అలవోకగా ఐర్లాండ్ ఆట కట్టించింది. తొలి మ్యాచ్లో సునాయాసంగా నెగ్గిన కోహ్లి సేన రెండో మ్యాచ్లో ఆమాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. ఏ విభాగంలోనూ సరితూగలేని ఐర్లాండ్కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా రికార్డు విజయంతో టీమిండియా టి20 సిరీస్ను ఏకపక్షంగా ముగించింది. ముందుగా రాహుల్, రైనా దూకుడుతో బ్యాటింగ్లో భారీ స్కోరుతో కదం తొక్కి... ఆ తర్వాత బౌలింగ్లో చెలరేగింది. ఐర్లాండ్తో ‘సన్నాహకం’ ముగిసిన తర్వాత మంగళవారం నుంచి ఇంగ్లండ్ సవాల్ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమైంది. డబ్లిన్: ఐర్లాండ్తో జరిగిన రెండు టి20 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్ 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 70; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సురేశ్ రైనా (45 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు రెండో వికెట్కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించగా, చివర్లో హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు ప్రదర్శన కనబర్చాడు. అనంతరం ఐర్లాండ్ 12.3 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. విల్సన్ (15) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో మరోసారి కుల్దీప్ (3/16), చహల్ (3/21) ప్రత్యర్థిని పడగొట్టారు. సెంచరీ భాగస్వామ్యం... భారత జట్టు అనుకున్నట్లుగానే నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ధావన్, ధోని, భువనేశ్వర్, బుమ్రా స్థానాల్లో రాహు ల్, దినేశ్ కార్తీక్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన కౌల్ భారత్ తరఫున టి20ల్లో ఆడిన 75వ ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ను కాదని రాహుల్తో పాటు ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లి (9) వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. అయితే రాహుల్, రైనా కలిసి ఐర్లాండ్ను ఆడుకున్నారు. ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తూ రాహుల్ సిక్సర్లతో చెలరేగగా, రైనా కూడా తనదైన శైలిలో జోరుగా ఆడాడు. సిమీ సింగ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాహుల్, ఆ తర్వాత రాన్కిన్ ఓవర్లో మరో రెండు భారీ సిక్సర్లతో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కెవిన్ ఓబ్రైన్ తన తొలి బంతికే రాహుల్ను అవుట్ చేయడంతో సెంచరీ భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు బంతులకే రోహిత్ (0) కూడా ఔటయ్యాడు. అనంతరం 34 బంతుల్లో రైనా హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. రైనాను కూడా ఓబ్రైన్ వెనక్కి పంపించిన తర్వాత వచ్చిన మనీశ్ పాండే (20 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్) దూకుడుగా ఆడలేకపోయాడు. అయి తే హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ భారత్కు భారీ స్కోరు అందించింది. ఆఖరి ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 6, 4 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. వరుస కట్టి... భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ కనీస స్థాయి పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది. రెండో బంతికే స్టిర్లింగ్ (0)ను అవుట్ చేయడంతో మొదలైన పతనం చివరి వరకు కొనసాగింది. తొలి మ్యాచ్లోనైనా కాస్త చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చిన జట్టు ఈ సారి పూర్తిగా చేతులెత్తేసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి అండ్ బి) కెవిన్ ఓబ్రైన్ 70; కోహ్లి (సి) డాక్రెల్ (బి) ఛేజ్ 9; రైనా (సి) డాక్రెల్ (బి) కెవిన్ ఓబ్రైన్ 69; రోహిత్ (సి) స్టిర్లింగ్ (బి) కెవిన్ ఓబ్రైన్ 0; మనీశ్ పాండే (నాటౌట్) 21; పాండ్యా (నాటౌట్) 32; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–22; 2–128; 3–128; 4–169. బౌలింగ్: సిమీ సింగ్ 2–0 –32–0; రాన్కిన్ 3–0–33–0; ఛేజ్ 4–0–42–1; థాంప్సన్ 1–0–17–0; డాక్రెల్ 4–0–30–0; స్టిర్లింగ్ 2–0–19–0; కెవిన్ ఓబ్రైన్ 4–0–40–3. ఐర్లాండ్ ఇన్నింగ్స్: స్టిర్లింగ్ (సి) రైనా (బి) ఉమేశ్ 0; షెనాన్ (సి) రాహుల్ (బి) కౌల్ 2; పోర్టర్ఫీల్డ్ (బి) ఉమేశ్ 14; బల్బిర్నీ (బి) చహల్ 9; విల్సన్ (బి) కుల్దీప్ 15; కెవిన్ ఓబ్రైన్ (సి) కుల్దీప్ (బి) పాండ్యా 0; సిమీ సింగ్ (ఎల్బీ) (బి) చహల్ 0; థాంప్సన్ (బి) చహల్ 13; డాక్రెల్ (సి) ఉమేశ్ (బి) కుల్దీప్ 4; రాన్కిన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కుల్దీప్ 10; ఛేజ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (12.3 ఓవర్లలో ఆలౌట్) 70. వికెట్ల పతనం: 1–0; 2–16; 3–22; 4–30; 5–32; 6–36; 7–44; 8–56; 9–68; 10–70. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–19–2; సిద్ధార్థ్ కౌల్ 2–0–4–1; హార్దిక్ పాండ్యా 2–0–10–1; చహల్ 4–0–21–3; కుల్దీప్ 2.3–0–16–3. ► టి20ల్లో భారత్కు ఇదే అతి పెద్ద విజయం. గతంలో శ్రీలంకపై (2017లో) 93 పరుగుల విజయాన్ని భారత్ సవరించింది. డ్రింక్స్ తీసుకెళ్తున్న ధోని అరంగేట్రం చేసిన బౌలర్ సిద్ధార్థ్ కౌల్తో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ -
ఇంగ్లండ్పై తొలిసారి...
మహిళల హాకీలో భారత్ రెండో విజయం నమోదు చేసింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 2–1తో సంచలన విజయం సాధించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (42వ ని.లో), నవ్నీత్ కౌర్ (48వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్కు తొలి నిమిషంలోనే కెప్టెన్ అలెగ్జాండ్రా డాన్సన్ ఏకైక గోల్ను అందించింది. ఇంగ్లండ్ మహిళల జట్టుపై భారత్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు 4–3తో వేల్స్పై గెలిచింది. ► అథ్లెటిక్స్లో తేజిందర్ సింగ్ షాట్పుట్ ఫైనల్కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్లో అతను ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల 20 కిలోమీటర్ల నడకలో ఖుష్బీర్ కౌర్ నాలుగో స్థానంలో, పురుషుల 20 కిలోమీటర్ల నడకలో మనీశ్ సింగ్ ఆరో స్థానంలో, ఇర్ఫాన్ 13వ స్థానంలో నిలిచారు. ► ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో మహిళల వాల్ట్ ఫైనల్లో ప్రణతి నాయక్... పురుషుల రింగ్స్ ఫైనల్లో రాకేశ్ పాత్రా చివరిదైన ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
మణికట్టు...ఆటకట్టు
పేస్ ఇబ్బంది పెట్టలేదు... బౌన్స్ పెద్దగా కనిపించలేదు... కానీ స్పిన్ మాత్రం సఫారీ బ్యాట్స్మెన్తో సొంతగడ్డపైనే చిందులు వేయించింది. మణికట్టును వీడిన బంతులు మిసైల్స్లా దూసుకొస్తుంటే ఆడుతోంది భారత్లోనా లేక తమ దేశంలోనా అని దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లో సంశయం... ఆ సందేహం తీరేలోపే అంతా ముగిసిపోయింది... ఒకరి వెంట మరొకరు... ఒకే స్కోరు వద్ద ముగ్గురు... కలిసికట్టుగా, సమష్టిగా పెవిలియన్ చేరిపోయారు... 42 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీసిన మన స్పిన్ మంత్రం మళ్లీ పని చేసింది. ఫలితంగా దక్షిణాఫ్రికా 118 ఆలౌట్...ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్లో భారత్ అలవోక ఛేదన. దాదాపు మూడు వారాల క్రితం ఇక్కడే రెండో టెస్టులో ఇది భారత్ పిచ్లాగానే ఉందని అందరూ అన్నారు. దానిని ఉపయోగించు కోలేకపోయిందంటూ పరాజయం తర్వాత వ్యాఖ్యలూ వినిపించాయి. అయితే ఈసారి కూడా వికెట్ సరిగ్గా భారత్లోలాగే స్పందించింది. ఇప్పుడు మనోళ్లు దానిని పూర్తిగా వాడుకున్నారు. యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్తో కోహ్లి సేన అతి సునా యాసంగా రెండో వన్డేను తమ ఖాతాలో వేసుకుంది. లెగ్ స్పిన్నర్ చహల్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టగా... చైనామన్ కుల్దీప్ 3 వికెట్లతో అండగా నిలిచాడు. ఫలితంగా స్వదేశంలో అతి తక్కువ స్కోరుకు ఆలౌటైన చెత్త రికార్డుతో సఫారీలు మ్యాచ్ను సమర్పించుకున్నారు. సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఆదివారం ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్లో పూర్తి ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. డుమిని (25), జోండో (25)లదే అత్యధిక స్కోరు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ (5/22), కుల్దీప్ యాదవ్ (3/20) ప్రత్యర్థి పని పట్టారు. అనంతరం భారత్ 20.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ధావన్ (56 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు), కోహ్లి (50 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్కు అభేద్యంగా 93 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఈ ఫలితంతో భారత్ ఆరు వన్డేల సిరీస్లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే బుధవారం కేప్టౌన్లో జరుగుతుంది. టపటపా... ఒక దశలో 26 బంతుల వ్యవధిలో 12 పరుగులకే 4 వికెట్లు... కొంత పోరాటం తర్వాత చివర్లో 36 బంతుల వ్యవధిలో 19 పరుగులకే 6 వికెట్లు... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ రెండు దశల్లో ఈ రకంగా కుప్పకూలింది! ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయలేకపోగా, ఆరుగురు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనే అందుకు కారణం. మొదట్లో భువీ, బుమ్రా... ఆ తర్వాత చహల్, కుల్దీప్ సఫారీల పని పట్టడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. డివిలియర్స్, డు ప్లెసిస్ లేని బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్లో మరీ పేలవంగా కనిపించింది. ఓపెనర్లు ఆమ్లా (23; 4 ఫోర్లు), డి కాక్ (20; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ను అతి జాగ్రత్తగా ప్రారంభించారు. టెస్టు సిరీస్ నుంచి వరుసగా విఫలమవుతున్న డి కాక్ను బుమ్రా ఒక ఆటాడుకున్నాడు. అతని తొలి ఓవర్లో మొదటి బంతినే డి కాక్ దాదాపు వికెట్లపైకి ఆడుకున్నాడు. అదృష్టవశాత్తూ బెయిల్స్ పడలేదు. రెండో బంతి బౌన్సర్ను అతి కష్టమ్మీద తప్పించుకున్న డి కాక్, మూడో బంతికి వేలికి గాయం చేసుకున్నాడు. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఆమ్లాను భువీ అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత డి కాక్ను అవుట్ చేసి చహల్ తన జోరు మొదలు పెట్టాడు. కుల్దీప్ వేసిన మరుసటి ఓవర్లోనే కెప్టెన్ మార్క్రమ్ (8), మిల్లర్ (0) అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కష్టాలు పెరిగాయి. 51 పరుగుల స్కోరు వద్దే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. ఈ దశలో డుమిని, తొలి వన్డే ఆడుతున్న జోండో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. భారత బౌలింగ్ను కొద్ది సేపు నిరోధించగలిగిన వీరిద్దరు 12.4 ఓవర్లలో ఐదో వికెట్కు 48 పరుగులు జోడించారు. అయితే మళ్లీ చహల్ మాయ మొదలైంది. భారీ షాట్ ఆడబోయిన జోండో మిడ్ వికెట్లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. చహల్ తన వరుస ఓవర్లలో డుమిని, మోర్కెల్ (1)ల పని పట్టగా...మధ్యలో రబడ (1)ను కుల్దీప్ వెనక్కి పంపించాడు. తాహిర్ (0)ను బుమ్రా బౌల్డ్ చేయగా...మోరిస్ (14)ను అవుట్ చేసి చహల్ ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలవోకగా... అతి సునాయాస లక్ష్యాన్ని భారత్ ఏమాత్రం తడబాటు లేకుండా చేరుకుంది. అయితే రోహిత్ శర్మ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు, ఒక సిక్స్) మాత్రం మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. మూడో బంతికి సిక్సర్ బాది దూకుడుగా ఆటను ప్రారంభించిన రోహిత్... రబడ బౌన్సర్ను హుక్ చేయబోయి మోర్కెల్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ధావన్, కోహ్లి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ చకచకా పరుగులు రాబట్టారు. ఇదే జోరులో ధావన్ 49 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత తొమ్మిదో బంతిని స్క్వేర్లెగ్ దిశగా ఆడి కోహ్లి రెండు పరుగులు తీయడంతో భారత్ విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) ధోని (బి) భువనేశ్వర్ 23; డి కాక్ (సి) పాండ్యా (బి) చహల్ 20; మార్క్రమ్ (సి) భువనేశ్వర్ (బి) కుల్దీప్ 8; డుమిని (ఎల్బీ) (బి) చహల్ 25; మిల్లర్ (సి) రహానే (బి) కుల్దీప్ 0; జోండో (సి) పాండ్యా (బి) చహల్ 25; మోరిస్ (సి) భువనేశ్వర్ (బి) చహల్ 14; రబడ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; మోర్కెల్ (ఎల్బీ) (బి) చహల్ 1; తాహిర్ (బి) బుమ్రా 0; షమ్సీ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్) 118 వికెట్ల పతనం: 1–39; 2–51; 3–51; 4–51; 5–99; 6–107; 7–110; 8–117; 9–118; 10–118. బౌలింగ్: భువనేశ్వర్ 5–1–19–1; బుమ్రా 5–1–12–1; పాండ్యా 5–0–34–0; చహల్ 8.2–1–22–5; కుల్దీప్ 6–0–20–3; జాదవ్ 3–0–11–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మోర్కెల్ (బి) రబడ 15; ధావన్ (నాటౌట్) 51; కోహ్లి (నాటౌట్) 46; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119 వికెట్ల పతనం: 1–26. బౌలింగ్: మోర్కెల్ 4–0–30–0; రబడ 5–0–24–1; మోరిస్ 3–0–16–0; తాహిర్ 5.3–0–30–0; షమ్సీ 3–1–18–0. -
'డబుల్' సిక్సర్...
కోహ్లి డబుల్ సెంచరీ, రోహిత్ సమయోచిత ఇన్నింగ్స్, షమీ, ఇషాంత్ అద్భుత బౌలింగ్, లంకను ఆదుకున్న మాథ్యూస్... ఇవీ మైదానంలో చివరి టెస్టు రెండో రోజు ఆటలో విశేషాలు. అయితే ఆటలో అరటి పండులా మ్యాచ్పై ఢిల్లీ కాలుష్యం దెబ్బ... ముఖానికి మాస్క్లతో బరిలోకి దిగిన శ్రీలంక క్రికెటర్లు... కనీసం 11 మంది మైదానంలో లేక చివరకు సహాయక సిబ్బందిని సన్నద్ధం చేయడం... వాద ప్రతివాదాలు, భారత ఆటగాళ్ల అసహనం, బయట నుంచి లంకపై అభిమానుల ఆగ్రహం, అంపైర్ల జోక్యం, తీవ్రమైన చర్చోపచర్చలు... ఇదీ ఫిరోజ్ షా కోట్లాలో రెండో రోజు పరిస్థితి. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో 1932 నుంచి 2015 మధ్య 83 ఏళ్ల కాలంలో కేవలం నలుగురు భారత కెప్టెన్లు మాత్రమే ఒక్కో డబుల్ సెంచరీ సాధించగలిగారు. కానీ విరాట్ కోహ్లి మాత్రం నాయకుడిగా ముందుండి నడిపించడం అంటే ఏమిటో పదే పదే చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు అదే కోవలో అతను ఏకంగా ఆరో డబుల్ సెంచరీని బాది ఓవరాల్గా బ్రియాన్ లారా లాంటి దిగ్గజాన్ని దాటి అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్గా నిలిచాడు. కోహ్లి జోరు మొదలైన గత 17 నెలల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో మరే కెప్టెన్ కూడా డబుల్ సెంచరీ నమోదు చేయలేకపోవడం విరాట్ ఘనతను రెట్టింపు చేస్తోంది. న్యూఢిల్లీ: శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత్ ఆధిపత్యానికి ఎక్కడా లోటు రాలేదు. మ్యాచ్ రెండో రోజు వేగంగా పరుగులు సాధించిన భారత జట్టు, తర్వాత లంక బ్యాటింగ్ను దెబ్బ తీసి టెస్టుపై పట్టు బిగించింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (118 బంతుల్లో 57 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చండిమాల్ (25 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 371/4తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 7 వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లి (287 బంతుల్లో 243; 25 ఫోర్లు) డబుల్ సెంచరీని పూర్తి చేసుకోగా, రోహిత్ శర్మ (102 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. లంక బౌలర్లలో సందకన్కు 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం లంక మరో 405 పరుగులు వెనుకబడి ఉంది. కొనసాగిన జోరు... తొలి రోజు ఆటలో ప్రదర్శించిన దూకుడును భారత్ ఆదివారం కూడా కొనసాగించింది. ఆరంభంలో స్పిన్నర్లు వేసిన తొలి ఆరు ఓవర్లలో రోహిత్ రెండు ఫోర్లు, సిక్సర్తో ధాటిని ప్రదర్శించగా, ఆ తర్వాత పేస్ బౌలింగ్లో కోహ్లి జోరు మొదలైంది. లక్మల్, గమగే వేసిన తర్వాతి ఆరు ఓవర్లలో వీరిద్దరు 32 పరుగులు రాబట్టారు. 195 పరుగుల వద్ద పెరీరా ఓవర్లో కోహ్లి ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం శ్రీలంక రివ్యూ చేసింది. అయితే బంతి బ్యాట్కు తగిలిందని తేలడంతో విరాట్కు సమస్య రాలేదు. కొద్ది సేపటికే లక్మల్ బౌలింగ్లో డీప్ మిడ్వికెట్ దిశగా ఆడి రెండు పరుగులు తీసిన భారత కెప్టెన్... 238 బంతుల్లో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పెరీరా బంతిని భారీ సిక్సర్ బాది రోహిత్ అర్ధసెంచరీని అందుకున్నాడు. అయితే సందకన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన తర్వాత అదే ఓవర్లో రోహిత్ వెనుదిరగడంతో 135 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. కోహ్లి బ్యాడ్లక్... లంచ్ బ్రేక్ తర్వాత ఫోర్తో కోహ్లి టెస్టుల్లో తన అత్యధిక స్కోరు (235)ను అధిగమించాడు. అయితే ఇదే సమయంలో ‘కాలుష్య విరామాలు’ భారత జట్టు లయను దెబ్బ తీశాయి. మొదట గమగే బౌలింగ్లో అశ్విన్ (4) వెనుదిరగగా... ఆ తర్వాత మరో విరామంలో కోహ్లి తన వికెట్ ఇచ్చుకున్నాడు. సందకన్ బౌలింగ్లో లోపలికి దూసుకొచ్చిన బంతిని ఫ్లిక్ చేయడంలో విరాట్ విఫలమయ్యాడు. దాంతో బంతి ప్యాడ్లకు తగలడంతో అంపైర్ అవుట్గా నిర్ధారించారు. కోహ్లి రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అప్పటి వరకు ఏమాత్రం శ్రమ లేకుండా అలవోకగా పరుగులు సాధిస్తున్న కోహ్లి సునాయాసంగా ట్రిపుల్ సెంచరీ సాధిస్తాడని అనిపించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. మరికొద్ది సేపటికే లంక ఫీల్డింగ్ ఇబ్బందిని గమనించిన కోహ్లి... భారత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసేందుకు సిద్ధమైపోయాడు. తొలి బంతికే... కొండలాంటి స్కోరు ముందుండగా బరిలోకి దిగిన శ్రీలంకకు తొలి బంతికే షాక్ తగిలింది. షమీ వేసిన చక్కటి బంతికే కరుణరత్నే (0) కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటికే ధనంజయ డి సిల్వా (1)ను ఇషాంత్ అవుట్ చేశాడు. అయితే సమరవిక్రమ స్థానంలో రెండో ఓపెనర్గా వచ్చిన దిల్రువాన్ పెరీరా (54 బంతుల్లో 42; 9 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పెరీరా 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు లైఫ్ లభించింది. షమీ వేసిన బంతిని పెరీరా స్లిప్లోకి ఆడగా మొదటి స్లిప్లో పుజారాకు చక్కటి అవకాశం ఉండగా...రెండో స్లిప్ నుంచి పుజారాకు అడ్డంగా వచ్చిన ధావన్ దానిని పట్టుకోలేక వదిలేశాడు. బంతి మైదానంలో ఉన్న హెల్మెట్కు కూడా తగలడంతో లంకకు ఐదు పెనాల్టీ పరుగులు లభించాయి. ఆ వెంటనే ఇషాంత్ బౌలింగ్లో మాథ్యూస్ (6 పరుగుల వద్ద) ఇచ్చిన సునాయాస క్యాచ్ను స్లిప్లో కోహ్లి వదిలేయగా... ఇషాంత్ తర్వాతి ఓవర్లోనే మాథ్యూస్ మూడు బౌండరీలు బాది చిరునవ్వులు చిందించాడు! చివరకు పెరీరాను జడేజా ఎల్బీగా అవుట్ చేయడంతో 61 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత అశ్విన్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మాథ్యూస్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా మరో వికెట్ తీయలేకపోయారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) డిక్వెలా (బి) సందకన్ 155; ధావన్ (సి) లక్మల్ (బి) పెరీరా 23; పుజారా (సి) సమరవిక్రమ (బి) గమగే 23; కోహ్లి (ఎల్బీ) (బి) సందకన్ 243; రహానే (స్టంప్డ్) డిక్వెలా (బి) సందకన్ 1; రోహిత్ (సి) డిక్వెలా (బి) సందకన్ 65; అశ్విన్ (సి) పెరీరా (బి) గమగే 4; సాహా (నాటౌట్) 9; జడేజా (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 8; మొత్తం (127.5 ఓవర్లలో 7 వికెట్లకు డిక్లేర్డ్) 536. వికెట్ల పతనం: 1–42; 2–78; 3–361; 4–365; 5–500; 6–519; 7–523. బౌలింగ్: లక్మల్ 21.2–2–80–0; గమగే 25.3–7–95–2; పెరీరా 31.1–0–145–1; సందకన్ 33.5–1–167–4; డి సిల్వా 16–0–48–0. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కరుణరత్నే (సి) సాహా (బి) షమీ 0; పెరీరా (ఎల్బీ) (బి) జడేజా 42; డి సిల్వా (ఎల్బీ) (బి) ఇషాంత్ 1; మాథ్యూస్ (బ్యాటింగ్) 57; చండిమాల్ (బ్యాటింగ్) 25; ఎక్స్ట్రాలు 6; మొత్తం (44.3 ఓవర్లలో 3 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–0; 2–14; 3–75. బౌలింగ్: షమీ 11–3–30–1; ఇషాంత్ 10–4– 44–1; జడేజా 14.3–6–24–1; అశ్విన్ 9–3–28–0. కోహ్లి కెరీర్లో ఇది ఆరో డబుల్ సెంచరీ. కెప్టెన్గా ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా అతను వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (5 డబుల్ సెంచరీలు)ను అధిగమించాడు. భారత్ తరఫున అత్యధిక (6) డబుల్ సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కూడా కోహ్లి సమం చేశాడు. టెస్టుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఆరో ప్లేయర్గా కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో వాలీ హామండ్ (ఇంగ్లండ్; 1928, 1933లో) రెండుసార్లు ఈ ఘనత సాధించగా... డాన్ బ్రాడ్మన్ (ఆస్ట్రేలియా–1934లో), వినోద్ కాంబ్లీ (భారత్–1993లో), కుమార సంగక్కర (శ్రీలంక–2007లో), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా–2012లో) ఒక్కోసారి ఇలా చేశారు. వినూ మన్కడ్ (1955) తర్వాత ఒకే సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మన్గా కోహ్లి నిలిచాడు. విరాట్ వరుసగా రెండేళ్ల పాటు మూడేసి ద్విశతకాలు సాధించడం విశేషం. -
వియత్నాం ఓపెన్ విజేత సాకేత్ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని మరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. హోచి మిన్ సిటీలో ఆదివారం జరిగిన వియత్నాం ఓపెన్ టోర్నమెంట్లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–విజయ్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గో సొయెదా–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంటపై విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ ద్వయం నాలుగు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ కెరీర్లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్–విజయ్ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత్ శుభారంభం
జొహర్ బారు (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 3–2తో జపాన్ను ఓడించింది. భారత్ తరఫున దిల్ప్రీత్ సింగ్ (11వ, 53వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుఖ్జీత్ సింగ్ (41వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. జపాన్ జట్టుకు క్యోహి ఒగవా (23వ, 31వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. సోమవారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
ఢాకాలో విజయ ఢంకా
చాలా రోజుల తర్వాత భారత హాకీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆద్యంతం తమ ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించింది. ఆరంభం నుంచి అంతిమ సమరందాకా తమ జోరును కొనసాగించింది. పదేళ్ల తర్వాత మళ్లీ ఆసియా చాంపియన్గా అవతరించింది. కొత్త కోచ్ మరీన్ జోర్డ్ ఆధ్వర్యంలో ఒక్క ఓటమి కూడా లేకుండా ఈ టోర్నీని అజేయంగా ముగించింది. తొలిసారి ఫైనల్కు చేరిన మలేసియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఆడిన భారత్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ముచ్చటగా మూడోసారి ఆసియా కప్ను ముద్దాడింది. ఢాకా: టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసింది. ఆద్యంతం అద్భుత ఆటతీరును కనబరిచిన టీమిండియా మూడోసారి ఆసియా చాంపియన్గా నిలిచింది. సీనియర్ పురుషుల హాకీ ఆసియా కప్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత్ 2–1 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. దశాబ్దకాల ఎదురుచూపులకు తెర దించింది. టోర్నీలో అజేయంగా నిలిచి సగర్వంగా ట్రోఫీని హస్తగతం చేసుకుంది. ఎనిమిదోసారి ఆసియా కప్లో ఫైనల్కు చేరిన భారత్ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచి... 1982, 1985, 1989, 1994, 2013లలో రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో భారత్ తరఫున రమణ్దీప్ సింగ్ (3వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (29వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... మలేసియా జట్టుకు షాహ్రిల్ సాబా (50వ నిమిషంలో) ఏకైక గోల్ను అందించాడు. మరోవైపు కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 6–3 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. ఆది నుంచి దూకుడు... గత జూన్లో వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో మలేసియా చేతిలో అనూహ్య ఓటమితో సెమీఫైనల్ దశకు అర్హత పొందలేకపోయిన భారత్... ఈ టోర్నీలో మాత్రం ఆ జట్టును తేలిగ్గా తీసుకోలేదు. సూపర్–4 దశలో 6–2తో మలేసియాను చిత్తు చేసిన టీమిండియా ఫైనల్లోనూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలో ఎస్వీ సునీల్ నుంచి క్రాస్ షాట్ను అందుకున్న రమణ్దీప్ కొట్టిన షాట్ పోల్ను తాకి వెనక్కి వచ్చినా.. వెంటనే అందుకుని నెట్లోకి పంపడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ వెంటనే చిన్గ్లెన్సనా సింగ్ రివర్స్ షాట్ అతి సమీపం నుంచి వైడ్గా వెళ్లడంతో మరో గోల్ మిస్ అయ్యింది. 13వ నిమిషంలో మలేసియాకు పెనాల్టీ కార్నర్ దక్కినా భారత రక్షణశ్రేణి వమ్ము చేసింది. రెండో క్వార్టర్ మరో నిమిషంలో ముగుస్తుందనగా లలిత్ ఉపాధ్యాయ్ జట్టు ఖాతాలో రెండో గోల్ను చేర్చాడు. సుమిత్ ఎడమ వైపు నుంచి ఇచ్చిన చక్కటి రివర్స్ షాట్ను అందుకున్న లలిత్ ఎలాంటి తప్పిదం లేకుండా గోల్పోస్ట్లోనికి పంపించాడు. నాలుగో క్వార్టర్లో మలేసియా ఒక్కసారిగా చెలరేగింది. గోల్ కోసం తీవ్రంగా చేసిన ప్రయత్నాలు 50వ నిమిషంలో ఫలించాయి. అప్పటికే వారి రెండో పీసీ కూడా వృథా కాగా... అతి సమీపం నుంచి సాబా జట్టుకు గోల్ అందించి ఆధిక్యాన్ని తగ్గించాడు. ఇక చివరి 10 నిమిషాల్లో స్కోరును సమం చేసేందుకు మలేసియా చేసిన ఎదురుదాడికి భారత్ ఆందోళనలో పడింది. ఇదే సమయంలో మలేసియాకు మూడో పీసీ లభించడంతో ఉత్కంఠ పెరిగింది. మ్యాచ్ షూటౌట్కు దారి తీస్తుందా అని భావించినా భారత డిఫెన్స్ వారి ఆటలను సాగనీయలేదు. దీంతో భారత్ 2–1 తేడాతో విజయాన్ని ఖాయం చేసుకొని చాంపియన్గా నిలిచింది. టోర్నీ అవార్డులు ► మ్యాన్ ఆఫ్ ద ఫైనల్: ఆకాశ్దీప్ సింగ్ (భారత్) ► గోల్ ఆఫ్ ద ఫైనల్: లలిత్ ఉపాధ్యాయ్ (భారత్) ► టోర్నీ బెస్ట్ గోల్: హర్మన్ప్రీత్ సింగ్ (భారత్) ► ప్రామిసింగ్ ప్లేయర్: అర్షద్ హుస్సేన్ (బంగ్లాదేశ్) ► బెస్ట్ గోల్కీపర్: ఆకాశ్ చిక్టే (భారత్) ► టాప్ స్కోరర్స్: హర్మన్ప్రీత్ సింగ్ (భారత్–7 గోల్స్), ఫైజల్ సారి (మలేసియా–7 గోల్స్) ► బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: ఫైజల్ సారి (మలేసియా) తాజా విజయంతో భారత్ ఆసియా హాకీలో జరిగే నాలుగు టోర్నీ టైటిల్స్ను తమ ఖాతాలో జమచేసుకుంది. ప్రస్తుతం ఆసియా క్రీడలు (2014), జూనియర్ ఆసియా కప్ (2015) ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (2016), ఆసియా కప్ (2017) టైటిల్స్ భారత్ వద్దే ఉన్నాయి. -
అదే జోరు...అదే హోరు
♦ శ్రీలంకపై భారత్ గెలుపు ♦ టీమిండియాకు వరుసగా నాలుగో విజయం ♦ రాణించిన దీప్తి శర్మ, మిథాలీ రాజ్ భారత మహిళల జట్టు విజయపరంపర కొనసాగుతోంది. ఓపెనర్లు విఫలమైనా...బ్యాటింగ్లో దీప్తి శర్మ, మిథాలీ రాజ్ తమ సూపర్ ఫామ్ను చాటారు. బౌలింగ్లో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ లంక జట్టును దెబ్బతీయడంతో వన్డే ప్రపంచకప్లో టీమిండియా మరో ఎదురులేని విజయాన్ని నమోదు చేసింది. వరుసగా నాలుగో విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. డెర్బీ: మళ్లీ మిథాలీ సేనదే గెలుపు. ఈ సారి లంకను ఓడించింది. తద్వారా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 16 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 232 పరుగులు చేసింది. దీప్తి శర్మ (110 బంతుల్లో 78; 10 ఫోర్లు), మిథాలీ రాజ్ (78 బంతుల్లో 53; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తర్వాత శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులే చేసి ఓటమి పాలైంది. దిలాని సురంగిక (75 బంతుల్లో 61; 6 ఫోర్లు) రాణించింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్, జులన్ గోస్వామి చెరో 2 వికెట్లు తీశారు. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 8న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. దీప్తి, మిథాలీ ఫిఫ్టీ–ఫిఫ్టీ... అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు స్మృతి మంధన (8), పూనమ్ రౌత్ (16) శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ మిథాలీ రాజ్... వన్డౌన్ బ్యాట్స్మన్ దీప్తి శర్మతో కలిసి ఇన్నింగ్స్ను కుదుటపరిచింది. దీప్తి శర్మ 89 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకుంది. మిథాలీ 71 బంతుల్లో అర్ధశతకం సాధించింది. ఈ టోర్నీలో భారత కెప్టెన్కిది మూడో ఫిఫ్టీ కాగా కెరీర్లో 48వ అర్ధశతకం కావడం విశేషం. కాంచన వేసిన ఇదే ఓవర్లో దీప్తి... ఇనొక రణవీరకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. దీంతో మూడో వికెట్కు 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో హర్మన్ప్రీత్ కౌర్ (20), వేద కృష్ణమూర్తి (29) ధాటిగా ఆడటంతో భారత్ ప్రత్యర్థి ముందు 233 పరుగుల గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించింది. పోరాడిన సురంగిక... ఊరించే లక్ష్యమే అయినా లంక టాపార్డర్ను పూనమ్ యాదవ్ కట్టడి చేయడంతో ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఓపెనర్ హన్సిక (29), జయాంగని (25)లు పూనమ్ బౌలింగ్లో వెనుదిరిగారు. జులన్ ధాటికి హాసిని (10) ఔటయ్యింది. ఈ దశలో సిరివర్ధనే (37), సురంగిక నాలుగో వికెట్కు 60 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా... లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: పూనమ్ రౌత్ (సి) జయాంగని (బి) శ్రీపాలి 16; స్మృతి మంధన (సి) సిరివర్ధనె (బి) చండిమా 8; దీప్తి శర్మ (సి) రణవీర (బి) కాంచన 78; మిథాలీ ఎల్బీడబ్ల్యూ (బి) రణవీర 53; జులన్ (సి) జయాంగని (బి) రణవీర 9; హర్మన్ప్రీత్ (సి) రణసింఘే (బి) శ్రీపాలి 20; వేద (సి) చండిమా (బి) శ్రీపాలి 29; సుష్మ నాటౌట్ 11, మాన్సి రనౌట్ 2; ఏక్తా బిష్త్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 232. వికెట్ల పతనం: 1–21, 2–38, 3–156, 4–169, 5–169; 6–219, 7–219, 8–230. బౌలింగ్: శ్రీపాలి 9–2–28–3, చండిమా 10–1–52–1, సిరివర్ధనే 10–1–24–0, రణవీర 10–0–55–2, రణసింఘే 3–0–22–0, కాంచన 8–0–50–1. శ్రీలంక ఇన్నింగ్స్: హన్సిక (స్టంప్డ్) సుష్మ (బి) పూనమ్ యాదవ్ 29; హాసిని (సి) స్మృతి (బి) జులన్ 10; జయాంగని (బి) పూనమ్ యాదవ్ 25; సిరివర్ధనే (సి) వేద (బి) జులన్ 37; సురంగిక (స్టంప్డ్) సుష్మ (బి) దీప్తి శర్మ 61; కాంచన రనౌట్ 7; శ్రీపాలి (సి) వేద (బి) ఏక్తా బిష్త్ 12; ప్రసాదని నాటౌట్ 21; ఒషది రణసింఘే నాటౌట్ 9; ఎక్స్ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1–17, 2–57, 3–70, 4–130, 5–143, 6–171, 7–191. బౌలింగ్: జులన్ 8–2–26–2, మాన్సి 5–0–36–0, దీప్తి శర్మ 10–3–46–1, ఏక్తా 10–0–48–1, హర్మన్ప్రీత్ 7–0–33–0, పూనమ్ 10–1–23–2. శతక్కొట్టిన సారా, బీమోంట్... బ్రిస్టల్: దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ టామి బీమోంట్ (145 బంతుల్లో 148; 22 ఫోర్లు, 1 సిక్స్), సారా టేలర్ (104 బంతుల్లో 147; 24 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగుల భారీస్కోరు చేసింది. బీమోంట్, సారా టేలర్ రెండో వికెట్కు 275 పరుగులు జోడించారు. మహిళల వన్డే క్రికెట్లో ఏ వికెట్కైనా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. తర్వాత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసి పోరాడి ఓడింది. మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో పాకిస్తాన్పై జయభేరి మోగించింది. ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 290 పరుగులు చేయగా... పాక్ 131 పరుగులకే కుప్పకూలింది. -
కుల్దీప్ తిప్పేశాడు
♦ వెస్టిండీస్తో రెండో వన్డే ♦ 105 పరుగులతో భారత్ విజయం ♦ 30న మూడో వన్డే పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అజింక్య రహానే అద్భుత సెంచరీతో భారీ స్కోరు సాధించిన భారత్... ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (3/50) తన మేజిక్ బౌలింగ్తో వెస్టిండీస్ భరతం పట్టాడు. దీంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 105 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాయ్ హోప్ (88 బంతుల్లో 81; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే భారత బౌలింగ్ను దీటుగా ఎదుర్కోగలిగాడు. ఐదు వన్డేల సిరీస్లో కోహ్లి సేన 1–0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఈనెల 30న ఆంటిగ్వాలో జరుగుతుంది. ఇక తొలి ఓవర్ మూడో బంతికే పావెల్ వికెట్ తీసిన భువనేశ్వర్ తన మరుసటి ఓవర్లో జేసన్ మొహమ్మద్ను కూడా పెవిలియన్కు పంపడంతో విండీస్ ఆది నుంచే తడబడింది. ఆ తర్వాత కుల్దీప్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసిరి తన ‘తొలి’ వన్డేలోనే ఆకట్టుకోగలిగాడు. హోప్, లూయిస్ (21) మధ్య మూడో వికెట్కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అయితే 26వ ఓవర్లో హోప్ను కుల్దీప్ ఎల్బీగా అవుట్ చేశాక పరుగుల వేగం తగ్గింది. అటు రన్రేట్ కూడా 12కు పెరిగిపోవడంతో విండీస్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసినా లక్ష్యం వైపు పయనించలేకపోయింది. రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 310/5; విండీస్ ఇన్నింగ్స్: పావెల్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 0; హోప్ ఎల్బీడబ్ల్యూ (బి) కుల్దీప్ 81; జేసన్ మొహమ్మద్ (సి) పాండ్యా (బి) భువనేశ్వర్ 0; లూయిస్ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్ 21; కార్టర్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 13; హోల్డర్ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్29; చేజ్ నాటౌట్ 33; నర్స్ నాటౌట్ 19; ఎక్స్ట్రాలు 9; మొత్తం (43 ఓవర్లలో ఆరు వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–0, 2–4, 3–93, 4–112, 5–132, 6–174. బౌలింగ్: భువనేశ్వర్ 5–1–9–2; ఉమేశ్ యాదవ్ 6–0–36–0; హార్దిక్ పాండ్యా 9–0–32–0; అశ్విన్ 9–0–47–1; కుల్దీప్ 9–0–50–3; యువరాజ్ 5–0–25–0. ♦ వన్డేల్లో 300కు పైగా పరుగులు స్కోరు చేయడం భారత్కిది 96వ సారి. గతంలో ఆసీస్ (95)పేరిట ఈ రికార్డు ఉంది. ♦ కరీబియన్లో విండీస్పై భారత్కిదే అతిపెద్ద విజయం. ♦ ధావన్, రహానే భాగస్వామ్య సగటు 76. వన్డేల్లో ఏ జోడీకి కూడా ఈ స్థాయి సగటు లేదు. ♦ రాహుల్ ద్రవిడ్ తర్వాత వెస్టిండీస్లో వన్డే సెంచరీ చేసిన ఓపెనర్గా రహానే. రహానే మాపై ఒత్తిడి తగ్గించాడు... అజింక్య రహానేతో జట్టులో చక్కటి సమతూకం ఏర్పడింది. కొద్దికాలంగా రహానే జట్టు వన్డే సెటప్లో ఉన్నాడు. టాప్ ఆర్డర్లో అతను కీలకం అవుతాడని మేం ముందే ఊహించాం. మూడో ఓపెనింగ్ బ్యాట్స్మన్గా అతను సిద్ధంగా ఉంటున్నాడు. ఈ సిరీస్లో రెండు మ్యాచ్ల్లోనూ అతడి ఆట అద్భుతం. తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకుని స్వేచ్ఛగా ఆడగలుగుతున్నాడు. మిడిలార్డర్లో కూడా తను రాణించగలడు కాబట్టి ప్రపంచకప్లాంటి పెద్ద టోర్నీలో అదనపు బౌలర్తో బరిలోకి దిగేందుకు అనువుగా ఉంటుంది. డ్రై వికెట్పై తాను ఎంత ప్రమాదకరమో కుల్దీప్ చాటిచెప్పాడు. ఇక వచ్చే ప్రపంచకప్ గురించి మాట్లాడుకుంటే 15 మంది ఆటగాళ్లు ఇక్కడ ఉన్నారు. మరో 12 మంది భారత్లో సిద్ధంగా ఉన్నారు. ఒత్తిడిని జయించి మధ్య ఓవర్లలో ఎవరు మెరుగ్గా రాణించగలరో గుర్తించాల్సి ఉంది. –కోహ్లి, భారత్ కెప్టెన్ -
న్యూజిలాండ్పై భారత్ గెలుపు
క్రైస్ట్చర్చ్: తొలి మ్యాచ్లో ఎదురైన ఓటమి నుంచి భారత పురుషుల హాకీ జట్టు తేరుకుంది. న్యూజిలాండ్తో బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దాంతో నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. తొలి మ్యాచ్లో భారత్ 0-2తో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో భారత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది.13వ నిమిషంలో బీరేంద్ర లాక్రా అందించిన పాస్ను రమణ్దీప్ సింగ్ గోల్గా మలిచాడు. ఆ తర్వాత 45వ నిమిషంలో కేన్ రసెల్ గోల్తో న్యూజిలాండ్ స్కోరును 1-1తో సమం చేసింది. అయితే ఏడు నిమిషాల తర్వాత లలిత్ ఉపాధ్యాయ్ గోల్తో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషంలో నికిన్ తిమ్మయ్య గోల్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. శుక్రవారం ఇదే వేదికపై మూడో మ్యాచ్ జరుగుతుంది. -
ఊరట విజయం
♦ ఆఖరి వన్డేలో భారత్ గెలుపు ♦ 2-1తో సిరీస్ బంగ్లా వశం ♦ రాణించిన ధావన్, ధోని హమ్మయ్య... ఇక భారత జట్టు కాస్త ధైర్యంగానే స్వదేశానికి రావచ్చు. సిరీస్ ఓటమితో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనిసేన.. బంగ్లాదేశ్తో ఆఖరి వన్డేలో ఊరట విజయాన్ని దక్కించుకుంది. సిరీస్లో తొలిసారి భారత్ అసలు సిసలు ఆటతీరుతో చెలరేగడంతో... బంగ్లా‘వాష్’ ఆశ నెరవేరలేదు. మిర్పూర్ : సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి అరుదైన రికార్డును అందుకోవాలనుకున్న బంగ్లాదేశ్కు భారత్ కళ్లెం వేసింది. సిరీస్లో తొలిసారి అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించిన ధోనిసేన మూడో వన్డేలో 77 పరుగులతో ఘన విజయం సాధించింది. షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 317 పరుగులు చేసింది. ధావన్ (73 బంతుల్లో 75; 10 ఫోర్లు), ధోని (77 బంతుల్లో 69; 6 ఫోర్లు, 1 సిక్స్), రాయుడు (49 బంతుల్లో 44; 3 ఫోర్లు), రైనా (21 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మొర్తజా 3, ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. షబ్బీర్ రెహమాన్ (38 బంతుల్లో 43; 6 ఫోర్లు), సౌమ్య సర్కార్ (34 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లిట్టన్ దాస్ (50 బంతుల్లో 34; 3 ఫోర్లు), నాసిర్ హుస్సేన్ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు)లు మెరుగ్గా ఆడారు. రైనా 3, అశ్విన్, ధవల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరచిన సురేశ్ రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ముస్తాఫిజుర్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు. ధావన్ జోరు జడేజా, భువనేశ్వర్ల స్థానంలో బిన్నీ, ఉమేశ్లను భారత్ తుది జట్టులోకి తెచ్చింది. ఓపెనర్లలో ధావన్ ఫామ్ను కొనసాగించగా, రోహిత్ (29 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి నిరాశపర్చాడు. వన్డౌన్లో కోహ్లి (35 బంతుల్లో 25; 1 ఫోర్) విఫలమయ్యాడు. 50 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధావన్... రెండో వికెట్కు కోహ్లితో కలిసి 75 పరుగులు జోడించాడు. తర్వాత ధావన్తో జతకలిసిన ధోని వేగంగా ఆడాడు. నాసిర్ ఓవర్ (23)లో సిక్సర్, ఫోర్తో కెప్టెన్ టచ్లోకి వచ్చాడు. అయితే 27వ ఓవర్లో మొర్తజా.. ధావన్ను అవుట్ చేయడంతో మూడో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన రాయుడు స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ధోనితో పోటీగా పరుగులు చేయడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 58 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధోనితో పాటు రాయుడు కూడా స్వల్ప వ్యవధిలో అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 93 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను పటిష్టపరిచారు. చివర్లో రైనా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. బిన్నీ (11 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) కూడా జోరు పెంచడంతో భారత్కు భారీస్కోరు లభించింది. ఆకట్టుకున్న బౌలర్లు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ను భారత్ బౌలర్లు బాగా కట్టడి చేశారు. రెండో ఓవర్లోనే తమీమ్ (5)ను అవుట్ చేసిన ధవల్.. పవర్ప్లే ముగియకముందే సౌమ్య సర్కార్నూ పెవిలియన్కు చేర్చాడు. వన్డౌన్లో లిట్టన్ దాస్, తర్వాత ముష్ఫికర్ (24) ఓ మాదిరిగా ఆడారు. అయితే రైనా, అక్షర్లు స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దర్ని అవుట్ చేయడంతో బంగ్లా 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో షకీబ్ (20), మొర్తజా (0)లు నిరాశపరిచారు. షబ్బీర్ రెహమాన్, నాసిర్ హుస్సేన్లు కాసేసపు పోరాడినా టెయిలెండర్ల నుంచి సహకారం లభించలేదు. ఓవరాల్గా బంగ్లా 122 పరుగుల తేడాలో చివరి 6 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ ప్రపంచ రికార్డు మూడో వన్డేలో రెండు వికెట్లు తీసిన ముస్తాఫిజుర్... మొత్తం 13 వికెట్లతో సిరీస్లో అత్యధిక వికెట్ల రికార్డు నెలకొల్పాడు. గతంలో హారిస్ (ఆస్ట్రేలియా) కూడా 13 వికెట్లు తీసినా... ఐదు వన్డేల సిరీస్లో సాధించాడు. భారత్పై బంగ్లాదేశ్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. రెండు ఓటముల తర్వాత పౌరుషం పొడుచుకొచ్చిందో... లేక ప్రతిష్ట గుర్తొచ్చిందో... మొత్తానికి ధోనిసేన తమ సత్తా చూపెట్టింది. నిజానికి భారత్, బంగ్లాదేశ్ల బలాలను పరిశీలిస్తే... మూడు వన్డేల్లోనూ ధోని సేన సులభంగా గెలవాల్సింది. కానీ తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిపోయి, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఆలస్యంగా కోలుకుంది. ఈసారి కూడా ఓడిపోయి ఉంటే పరువు పాతాళంలోకి పోయేది. సిరీస్లో తొలిసారి భారత బ్యాట్స్మెన్ స్థాయికి తగ్గట్టు ఆడారు. రోహిత్ విఫలమైనా, ధావన్ నిలకడగా ఆడటంతో లోటు తెలియదు. ఇక కోహ్లి సిరీస్ ఆసాంతం విఫలమయ్యాడు. సిరీస్కు ముందు ఊహించినట్లే ధోని తనని తాను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసుకున్నాడు. ఇన్నాళ్లూ ఆరో స్థానంలో ఆడిన కెప్టెన్... ఇకపై నాలుగో నంబర్లో ఆడతానని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లోనూ కీలక దశలో వచ్చిన ధోని క్రీజులో ఎక్కువ సేపు గడపడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. మొత్తానికి ఓ అర్ధసెంచరీతో విమర్శకులకు కొంతమేర సమాధానం చెప్పాడు. నిజానికి ధోని సహజశైలిలో ఆడిన షాట్లు తక్కువ. అయితే ఇకపై గతంలో లాగా హెలికాప్టర్ ఎగరదనేది ధోనికి కూడా అర్థమైంది. అందులో మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పడమనే బాధ్యత తీసుకుంటున్నాడు. రాయుడు, రైనా కూడా రాణించడంతో భారత్ సిరీస్లో తొలిసారి 300 మార్కును దాటింది. తొలి రెండు వన్డేల విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం బంగ్లాదేశ్ జట్టులో కనిపించింది. పవర్ప్లేలో సర్కార్ ఆడిన తీరు... రెండు వికెట్లు పడ్డాక కూడా ముష్ఫికర్, దాస్ ఆడిన షాట్లు చూస్తే... కచ్చితంగా మరో విజయం కోసమే ఆ జట్టు తపన పడిందని అర్థమైంది. అయితే భారీ లక్ష్యం ఛేదించే సమయంలో కచ్చితంగా టాపార్డర్లో ఎవరో ఒకరు సెంచరీ చేసి నిలబడాలి. లేకపోతే ఎంత పెద్ద జట్టుకైనా 300 ఛేదించడం కష్టం. కాబట్టి బంగ్లా క్లీన్స్వీప్ ఆశ తీరలేదు. ఇక కొంత విశ్రాంతి ప్రస్తుతం భారత జట్టుకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. షెడ్యూల్ ప్రకారం జులైలో జింబాబ్వే వెళ్లాల్సి ఉన్నా ఆ సిరీస్కు ద్వితీయ శ్రేణి జట్టును పంపుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రావచ్చు. ఒకవేళ సీనియర్లు విశ్రాంతి తీసుకుంటే... ఆగస్టులో శ్రీలంక వెళ్లేదాకా వీళ్లకి క్రికెట్ లేదు. కాబట్టి భారత క్రికెటర్లకు పూర్తిగా నెలరోజులకు పైగా విశ్రాంతి దొరుకుతుంది. మూడో వన్డేలోనూ భారత్ ఓడిపోయి ఉంటే ధోని రాజీనామా చేసేదాకా గోల జరిగేది. కానీ మూడో వన్డేలో జట్టు గెలవడం, ధోని ఆడటంతో తాత్కాలికంగా విమర్శలకు తె రపడుతుంది. చాలా లోపాలు ఉన్నాయి బంగ్లాదేశ్ పర్యటన ద్వారా భారత్కు పరాభవం ఎదురైనా... ఆకాశంలో విహరిస్తున్న స్టార్ ఆటగాళ్లను ఈ సిరీస్ కొంత మేరకు నేలకు దించింది. స్టార్ హోదా ఉంటే పరుగులు రావని, చిన్న జట్టయినా కచ్చితంగా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలని తెలిసొచ్చింది. బౌలింగ్ విభాగంలో మాత్రం చాలా లోపాలు కనిపించాయి. అశ్విన్తో సమస్య లేకపోయినా రెండో స్పిన్నర్ పాత్రను జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ సరిగ్గా పోషించలేకపోయారు. చివరకు రైనా రెండో స్పిన్నర్గా జట్టును ఆదుకోవాల్సి వచ్చింది. ఇక పేస్ విభాగంలో ఏ ఒక్కరు కూడా మూడు మ్యాచ్లు ఆడలేకపోయారు. బంగ్లాదేశ్ కుర్రాడు ముస్తాఫిజుర్ చూపించిన దారిలో కూడా బంతులు వేయలేకపోయారు. కాబట్టి భారత సెలక్టర్లు ఈ సిరీస్ ఫలితాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇప్పటికిప్పుడు జట్టును పూర్తిగా మార్చకపోయినా... దేశవాళీ క్రికెట్లో నిలకడ చూపుతున్న కుర్రాళ్లను ఒకరిద్దరిని తీసుకుని అవకాశాలివ్వాలి. కోచ్ కావాలి తాను జట్టుతో ఉండగా ప్రత్యేకంగా కోచ్ అవసరం లేదని రవిశాస్త్రి అంటున్నాడు. కోహ్లి, ధోని కూడా దీనికి వంత పాడుతున్నారు. కోచ్ లేకుండా తమ సమస్యలు సరిదిద్దుకునే ప్రొఫెషనలిజమ్ ఈ క్రికెటర్లలో ఉంటే ఈ సిరీస్లో ఓడిపోయేవారే కాదు. కాబట్టి ఢాంబికాలు పక్కనబెట్టి సరైన కోచ్ను వెతుక్కోవడమే మేలు. సలహా కమిటీ సచిన్, లక్ష్మణ్, గంగూలీ ఈ సిరీస్ ఫలితాన్ని ఎలా విశ్లేషిస్తారనేది అన్నింటికంటే ఆసక్తికర అంశం. -సాక్షి క్రీడావిభాగం స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) లిట్టన్ (బి) ముస్తాఫిజుర్ 29; ధావన్ (సి) నాసిర్ (బి) మొర్తజా 75; కోహ్లి (బి) షకీబ్ 25; ధోని (సి) ముస్తాఫిజుర్ (బి) మొర్తజా 69; రాయుడు (సి) లిట్టన్ (బి) మొర్తజా 44; రైనా (బి) ముస్తాఫిజుర్ 38; బిన్నీ నాటౌట్ 17; అక్షర్ పటేల్ నాటౌట్ 10; ఎక్స్ట్రాలు: 10; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 317. వికెట్ల పతనం : 1-39; 2-114; 3-158; 4-251; 5-268; 6-301. బౌలింగ్ : ముస్తాఫిజుర్ 10-0-57-2; మొర్తజా 10-0-76-3; అరాఫత్ సన్నీ 6-0-42-0; రూబెల్ హుస్సేన్ 9-0-75-0; నాసిర్ హుస్సేన్ 6-0-27-0; షకీబ్ 9-1-33-1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : తమీమ్ ఎల్బీడబ్ల్యు (బి) కులకర్ణి 5; సౌమ్య సర్కార్ (సి) అశ్విన్ (బి) కులకర్ణి 40; లిట్టన్ దాస్ (బి) అక్షర్ 34; ముష్ఫికర్ (సి) ధోని (బి) రైనా 24; షకీబ్ (సి) కులకర్ణి (బి) రైనా 20; షబ్బీర్ (బి) బిన్నీ 43; నాసిర్ హుస్సేన్ (సి) రాయుడు (బి) అశ్విన్ 32; మొర్తజా (బి) అశ్విన్ 0; అరాఫత్ సన్నీ నాటౌట్ 14; రూబెల్ హుస్సేన్ (సి) అక్షర్ (బి) రైనా 2; ముస్తాఫిజుర్ ఎల్బీడబ్ల్యు (బి) రాయుడు 9;ఎక్స్ట్రాలు: 17; మొత్తం: (47 ఓవర్లలో ఆలౌట్) 240. వికెట్ల పతనం : 1-8; 2-62; 3-112; 4-118; 5-148; 6-197; 7-205; 8-216; 9-222; 10-240 బౌలింగ్ : స్టువర్ట్ బిన్నీ 6-0-41-1; ధవల్ కులకర్ణి 8-0-34-2; ఉమేశ్ 4-0-33-0; అశ్విన్ 10-1-35-2; అక్షర్ 9-1-44-1; రైనా 8-0-45-3; రాయుడు 2-1-5-1. -
అమెరికాపై భారత్ గెలుపు
బెల్జియం: ఎఫ్ఐహెచ్ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా జరిగిన మూడో ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 4-0తో అమెరికాపై విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సర్దార్సేన అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం కనబర్చింది. రూపిందర్ పాల్ (20, 52వ ని.), లలిత్ ఉపాధ్యాయ (49వ ని.), యువరాజ్ వాల్మీకి (60వ ని.)లు భారత్కు గోల్స్ అందించారు. మరోవైపు మహిళల విభాగంలో భారత్ 1-2తో ఇటలీ చేతిలో ఓడింది. రీతూ రాణి పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్కు ఏకైక గోల్ అందించింది.