indian ocean
-
సముద్రంపై సాహస సంతకం
‘జీరో’ అంటే చాలామందికి చిన్న చూపు. అయితే ఎంత పెద్ద విజయమైనా ‘జీరో’ తోనే మొదలవుతుంది. హీరోలను చేస్తుంది. తాజా విషయానికి వస్తే.... త్రివిధ దళాలకు చెందిన 11 మంది మహిళా అధికారులు హిందూ మహాసముద్రంలో 55 రోజుల ‘సముద్ర ప్రదక్షిణ’కు శ్రీకారం చుట్టారు. గతంలో వీరికి సముద్ర సాహస యాత్ర అనుభవం లేదు. జీరో నుంచి మొదలు పెట్టి ప్రతి విషయాన్నీ ఓపికగా నేర్చుకొని సాహసయాత్రకు కదిలారు.హిందూ మహాసముద్రం స్త్రీ శక్తికి వేదిక కానుంది. త్రివిధ దళాలకు చెందిన పదకొండుమంది మహిళా అధికారులు నిన్నటి (సోమవారం) నుంచి హిందూమహాసముద్రంలో ‘సముద్ర ప్రదక్షిణ’ మొదలుపెట్టారు. ముంబైలోని ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ (ఐఎన్డబ్ల్యూటీసీ) ఈ యాత్రప్రారంభ కేంద్రం. 55 రోజుల్లో హిందూ మహా సముద్రంలోని 4,000 నాటికల్ మైళ్లను ఈ బృందం అధిగమించనుంది. వీరిలో ఆరుగురు ఆర్మీ అధికారులు, ఒక నేవీ అధికారి, నలుగురు వైమానిక దళ అధికారులు ఉన్నారు.త్రివిధ దళాల నుంచి...భారత సైన్యం నుంచి లెఫ్టినెంట్ కల్నల్ అనుజ, మేజర్ కరంజీత్, మేజర్ తాన్యా, కెప్టెన్ ఒమితా, కెప్టెన్ దౌలీ, కెప్టెన్ ప్రజక్త, భారత వైమానిక దళం నుంచి స్క్వాడ్రన్ లీడర్ విభా, స్క్వాడ్రన్ లీడర్ శ్రద్ధ, స్క్వాడ్రన్ లీడర్ అరువి, స్క్వాడ్రన్ లీడర్ వైశాలి, భారత నావికాదళం నుంచి లెఫ్టినెంట్ కమాండర్ ప్రియాంక ఈ బృందంలో ఉన్నారు.కఠినమైన ఎంపిక ప్రక్రియఈ సాహస యాత్రకు ఎంపిక ప్రక్రియ ఏడాది పాటు కొనసాగింది. ఎంపికకు ఫిజికల్ ఫిట్నెస్, టీమ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్, అకడమిక్ నాలెడ్జ్, బోట్–హ్యాండ్లింగ్ కేపబిలీటీస్... మొదలైన వాటినిప్రామాణికంగా తీసుకున్నారు. త్రివిధ దళాలకు చెందిన 41 మంది మహిళా అధికారుల బృందం నుంచి 11 మంది మహిళా అధికారులను సముద్ర సాహస యాత్ర కోసం ఎంపిక చేశారు.పుణెలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ పరిధిలోని ‘ఆర్మీ అడ్వెంచర్ నోడల్ సెంటర్ ఫర్ బ్లూ వాటర్ సెయిలింగ్’లో త్రివిధ దళాల మహిళా అధికారులు రెండు సంవత్సరాల పాటు కఠోర శిక్షణ ΄÷ందారు, ఈ బృందం జీరో నుంచి శిక్షణ మొదలుపెట్టింది. నౌకాయానానికి సంబంధించిన సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలలోప్రావీణ్యం సాధించారు. సముద్రయానానికి అవసరమైన శారీరక బలాన్ని సమకూర్చుకున్నారు. నావిగేషన్, వాతావరణ శాస్త్రం, సీమన్షిప్ గురించి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్లాంటి సెయిలింగ్ నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. రూట్ ΄్లానింగ్, వెదర్ ఫోర్ కాస్టింగ్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, స్టాకింగ్ అండ్ సేఫ్టీ ్రపోటోకాల్స్తోపాటు అంతర్జాతీయ సముద్ర చట్టాల గురించి కూడా తెలుసుకున్నారు.చిన్న అడుగులతో పెద్ద సాహసం వైపు...మొదట షార్ట్ డే ట్రిప్స్ చేసేవారు. భవిష్యత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమలోని నైపుణ్యాలకు పదును పెట్టడానికి, సముద్ర ప్రయాణానికి సిద్ధం కావడానికి ముంబై నుండి గోవా, కొచ్చి, పోర్బందర్, లక్షద్వీప్ వరకు ఎన్నో యాత్రలకు వెళ్లారు. అయితే ఊహించని వాతావరణ పరిస్థితుల నుంచి సాంకేతిక సమస్యల వరకు సముద్ర యాత్రలో అడుగడుగునా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి సవాలు నుంచి పాఠం నేర్చుకున్నారు. అధికారిక నౌక ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెసెల్(ఐఎఎస్వీ)‘త్రివేణి’ నుంచి మొదలైన ఈ ప్రపంచ యాత్ర చరిత్ర సృష్టించనుంది.‘నారీశక్తి’ స్ఫూర్తితో మొదలైన ఈ ప్రయాణం చారిత్రాత్మకమే కాకుండా భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. పంచభూతాల సందేశంసముద్రంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సాహసికులుగా త్రివిధ దళాల మహిళా జట్టు ప్రపంచ రికార్డ్ నెలకొల్పనుంది. ఈ యాత్ర కేవలం సముద్రయానం మాత్రమే కాదు మహిళా సాధికారతకు శక్తిమంతమైన ప్రతీక. మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు వారు మహా సముద్రాలను కూడా జయించగలరు అని పంచభూతాల సాక్షిగా ఇచ్చే శక్తిమంతమైన సందేశం.యాత్ర లక్ష్యంముంబై నుంచి సీషెల్స్ వరకు మా మొదటి అంతర్జాతీయ యాత్ర మొదలైంది. రోజుల తరబడి, వారాల తరబడి భూమికి దూరంగా లోతైన జలాల్లో సాగే ఈ యాత్ర మా సహనానికి, నావిగేషన్ నైపుణ్యాలకు పరీక్ష. మహిళా సాధికారతలో బలాన్ని చూపించడమే ఈ యాత్ర లక్ష్యం.– కెప్టెన్ దౌలీ -
కర్వార్ నేవీ బేస్లో ‘సాగర్’ జలప్రవేశం
కర్వార్ (కర్నాటక): వ్యూహాత్మకంగా కీలకమైన కర్నాటకలోని కర్వార్ నేవీ బేస్లో శనివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియన్ ఓషన్ షిప్ ఐవోఎస్ సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్)ను జెండా ఊపి జల ప్రవేశం చేయించారు. దీంతోపాటు ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మిలటరీ హెలికాప్టర్లో కర్వార్కు చేరుకున్న రాజ్నాథ్ ‘సీబర్డ్’లో భాగమైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారని రక్షణ శాఖ తెలిపింది. జల ప్రవేశం చేయించిన ఐవోఎస్ సాగర్లో 9 దేశాల నావికా దళాలకు చెందిన 44 మంది సిబ్బంది ఉంటారని పేర్కొంది. హిందూ మహా సముద్ర ప్రాంత భవిష్యత్తును నిర్ణయించడంలో ఐవోఎస్ సాగర్ కీలకంగా మారనుందని రక్షణ శాఖ ‘ఎక్స్’లో తెలిపింది. ఈ ప్రాంత దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్కు ఇది ఎంతో సాయపడుతుందని తెలిపింది. సీబర్డ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విస్తరణ పనులతో కర్వార్ నేవీ బేస్లో 32 యుద్ద నౌకలు, సబ్మెరీన్లను నిలిపేందుకు అవకాశమేర్పడింది. -
ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
వాషింగ్టన్: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్చుప్గా ఆసియా రీజియన్లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్లోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా.. షెల్టర్లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్ రీజియన్లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్ఎస్ నిమిట్జ్హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్, యెమెన్లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ వద్ద యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారీయర్ను, మిడిల్ ఈస్ట్లో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది. -
2 లక్షల మందిని మింగేసిన రాకాసి అల
-
భాగ్య నగర కీర్తి ‘కెరటం’.. ఇంకాయిస్
హిందూ మహాసముద్రంతో అనుబంధం ఉన్న 28 దేశాలకు సునామీ హెచ్చరికలు మన భాగ్యనగరం నుంచే వెళ్తుంటాయి. సముద్రాల్లో ఏర్పడే భూప్రకంపనల నుంచి సునామీ రాక, సముద్రపు అలల ఎత్తు, వేగం, వాటి తీవ్రత ఏమేర ఉంటుందో క్షణాల్లో భారత్తోపాటు ఆయా దేశాలకు చేరవేసే విజ్ఞాన వాహిని భాగ్యనగర సొంతం. నగర కీర్తి కెరటంగా ‘ఇంకాయిస్’ (భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం) పరిఢవిల్లుతోంది.సనత్నగర్ (హైదరాబాద్): ప్రపంచంలో మూడు దేశాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉంటే అందులో హైదరాబాద్లోని ఇంకాయిస్ ఒకటి. మిగతా రెండు ఇండోనేసియా,ఆ్రస్టేలియాలో ఉన్నాయి. 2004 హిందూమహాసముద్ర సునామీ 20వ వార్షికోత్సవాన్ని గురువారం ప్రగతినగర్లోని ఓషన్ వ్యాలీలో గల ఇంకాయిస్లోజరపనున్నారు. దీనికి కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. నాటి సునామీలో ప్రాణాలు విడిచిన వారికి నివాళులు అర్పించనున్నారు.ఈ సందర్భంగా ఇంకాయిస్ అందిస్తున్నసేవలపై ప్రత్యేక కథనం.తొలుత మత్స్యకారుల సేవల కోసం..1999లో మత్స్యకారులకు సేవలు అందించేందుకు పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ (పీఎఫ్జెడ్)గా ఇంకాయిస్ ఆవిర్భవించింది. సముద్రంలో చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి సమాచారాన్ని వారికి చేరవేసే కేంద్రంగానే ఉండేది. ఆ తరువాత కొద్దికాలానికి సముద్రంలో వాయు దిశ, అలల వేగం, వాటి ఎత్తు, ఉష్ణోగ్రత వివరాలను అందిస్తూ ఓషియన్ స్టేట్ ఫోర్కాస్ట్ సేవలకు అంకురార్పణ చేసింది. 2004కు ముందు వరకు సునామీ అంటే భారత్కు పరిచయం లేని పదం. 2004లో వచ్చిన సునామీతో 2,40,000 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. 14 దేశాలపై సునామీ ప్రభావం పడింది. ఆ సమయంలోనే సునామీ అంటే ఏంటో అందరికీ తెలిసింది. అప్పటివరకు సునామీ వస్తుందన్న ముందస్తు సమాచారం ఇచ్చే కేంద్రం ప్రపంచదేశాల్లో ఎక్కడా లేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా తేరుకుని సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అప్పటికే ఇంకాయిస్ ద్వారా మహాసముద్ర సమాచార సేవలు అందుతుండటంతో దీనికి అనుబంధంగానే సునామీ హెచ్చరిక కేంద్రం నెలకొల్పింది. 2005లో ప్రక్రియ ప్రారంభించి 2007లో పూర్తిస్థాయిలో హిందూ మహాసముద్ర సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రంగా అవతరించింది.సునామీలు ఎలా ఏర్పడతాయంటే..? సముద్రంలో భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలతో సునామీలు ఉత్పన్నమవుతాయి. అయితే ఎక్కువ శాతం భూకంపాల ద్వారానే సునామీలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. భూకంప తీవ్రత 6.5 కంటే ఎక్కువ ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ సమయంలో సముద్రం మధ్య భాగంలో వాయువేగం గంటకు 800 కి.మీ., కెరటాల ఎత్తు ఒక మీటరు కంటే తక్కువగా ఉంటాయి. అదే తీరప్రాంతాన్ని తాకే సమయంలో వాయువేగం గంటకు 30 కి.మీ.కు పడిపోయి అలల ఎత్తు మాత్రం 30 మీటర్లకు పెరిగిపోతుంది. అందుకే సునామీ వచ్చే ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తారు. తీరాన్ని తాకుతున్న కొద్దీ అలల ఎత్తు పెరుగుతుంది. సునామీ రాకను సామాన్య ప్రజలు కూడా గుర్తించవచ్చు. ఆ సమయంలో సముద్రం వెనుకకు వెళ్లిపోతుంది. అలల శబ్ద తరంగాల్లో మార్పు గమనించవచ్చు. ఇంకాయిస్ ఎలా గుర్తిస్తుందంటే.. సునామీకి ముందు మొదట సముద్రంలో భూమి కంపిస్తుంది. అలా భూప్రకంపనలు జరిగిన 5–6 నిమిషాలకు ఇంకాయిస్కు సమాచారం అందుతుంది. సముద్ర భూభాగంలో అమర్చిన సిస్మో మీటర్ల ఆధారంగా శాటిలైట్ ద్వారా భూప్రకంపనలు జరిగిన సమాచారం ఇంకాయిస్కు చేరుతుంది. ఆ తరువాత భూకంపం ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై దృష్టిసారిస్తారు. సముద్ర జలాలకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన ‘సునామీ బోయ్ నెట్వర్క్’ పరికరాల ఆధారంగా కెరటాల ఎత్తు, వాయు దిశను పరిశీలించి సునామీని గుర్తిస్తారు. సాధారణ రోజుల్లో బోయ్ నెట్వర్క్ పరికరాలు శాటిలైట్ ద్వారా 15 నిమిషాలకో మారు అలలు, సముద్ర స్థితిగతులకు సంబంధించిన సమాచారం ఇంకాయిస్కు చేరవేస్తుంది.అదే సునామీ వస్తుందంటే నిమిషానికోమారు సందేశం పంపుతుంది. దాని ఆధారంగా సునామీని పసిగడతారు. ఒక్కో బోయ్ నెట్వర్క్ పరికరం రూ.6 కోట్ల వరకు ఉంటుంది. నిమిషాల్లో సమాచారం...ఇంకాయిస్ సేకరించిన సమాచారాన్ని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉండే విపత్తు నిర్వహణ కేంద్రాలకు, భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖకు వెబ్సైట్, మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా కేవలం పది నిమిషాల లోపే చేరవేస్తుంది. మూడుస్థాయిల్లో ఇంకాయిస్ సమాచారం అందిస్తోంది. వార్నింగ్, అలర్ట్, వాచ్ స్థాయిల్లో సందేశం పంపుతుంది. వార్నింగ్ అని సందేశం పంపారంటే తీవ్రత అధికంగా ఉన్నట్లు అర్ధం. సాధారణంగా భూ ప్రకంపనలు జరిగిన తరువాత సునామీ తీరాన్ని చేరుకోవడానికి రెండు గంటలు పడుతుంది.ఆ లోపు సునామీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే అవకాశం ఉంటుంది. ఒక్క అండమాన్ దగ్గర సునామీ ఏర్పడితే మాత్రం 20 నిమిషాల వ్యవధిలోనే తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునెస్కో ఆదేశాల మేరకు 2011 నుంచి సునామీకి సంబంధించిన సమాచారాన్ని హిందూ మహాసముద్రానికి అనుబంధంగా ఉన్న 28 దేశాలకు ఇంకాయిస్ చేరవేస్తుంది. ఆయా దేశాల ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. -
తీర భద్రతా 'నిర్దేశక్'
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సాగర గర్భంలో ఏం జరుగుతోంది? ఉపరితలంపై ముంచుకొస్తున్న మప్పు ఏంటి? సముద్రంలో శత్రుదేశాల నుంచి తలెత్తే ఆపదలేంటి? ఇలా సుదీర్ఘ భారత సముద్ర తీరంలో అణువణువూ సర్వే చేసి... నావికాదళానికి అందించేందుకు నిర్దేశకుడు వస్తున్నాడు. సంధాయక్ క్లాస్లో రెండో అతి పెద్ద సర్వే వెసల్గా ఐఎన్ఎస్ నిర్దేశక్ బుధవారం జల ప్రవేశం చేసింది. 2014 వరకూ సేవలందించిన నౌక నిర్దేశక్ను గుర్తుచేసుకుంటూ ఈ కొత్త నౌకకూ అదే నామకరణం చేశారు. ఇండియన్ నేవీలో కీలక పాత్ర పోషిస్తున్న తూర్పు నౌకాదళం నుంచి సేవలందించేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ సిద్ధమవుతోంది. కోల్కతాలో రూపుదిద్దుకున్న నిర్దేశక్... విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో...! దేశంలోనే అతిపెద్ద సర్వేనౌక ఐఎన్ఎస్ సంధాయక్ తర్వాత... రెండో అతి పెద్ద సర్వే వెసల్ ఐఎన్ఎస్ నిర్దేశక్ భారత నౌకాదళంలో ప్రవేశించింది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) సంస్థ 2020లో దీని తయారీ ప్రారంభించింది. నౌకాదళం కోసం జీఆర్ఎస్ఈ తయారుచేస్తున్న నాలుగు అధునాతన సర్వే నౌకల్లో నిర్దేశక్ రెండోది కావడం విశేషం. ఓడరేవులు, నావిగేషనల్ ఛానెళ్లు, ఎకనమిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహించడం, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో నిర్దేశక్ కీలక పాత్ర పోషించనుంది. దీంతోపాటు శోధన– రెస్క్యూ, సముద్ర పరిశోధనతో పాటు విపత్తు సమయంలో వైద్య సేవలందించే హాస్పిటల్ షిప్గానూ నిర్దేశక్ను తయారు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో బలీయమైన శక్తిగా తూర్పు నౌకాదళం ఎదుగుతున్న నేపథ్యంలో ఈ అత్యాధునిక సర్వే వెసల్ని విశాఖపట్నం కేంద్రంగా సేవలందించేందుకు కేటాయించాలని భారత నౌకాదళం నిర్ణయించినట్టు సమాచారం. అయితే.. తొలి షిప్ సంధాయక్ ఇప్పటికే విశాఖ కేంద్రంగా సేవలందిస్తున్న నేపథ్యంలో రెండింటిలో ఒక నౌకని పశ్చిమ నౌకాదళానికి కేటాయించే అవకాశం ఉందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. రూ.2,435 కోట్లతో 4 సర్వే వెసల్స్ నిర్మాణం 1968 నుంచి సంధాయక్ సర్వే వెసల్ భారత నౌకాదళంలో విశిష్ట సేవలందించి 2021లో సేవల నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో ఇండియన్ నేవీకి సర్వే నౌకలు అవసరమని భావించిన రక్షణ మంత్రిత్వ శాఖ 2017లోనే నాలుగు సంధాయక్ క్లాస్ సర్వే వెసల్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. రూ.2,435.15 కోట్లతో బిడ్ను జీఆర్ఎస్ఈ దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ షిప్లను నిర్మిస్తున్నారు. ఈ క్లాస్ షిప్లలో మొదటిది జే18 పేరుతో ఐఎన్ఎస్ సంధాయక్ను 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించగా... జే 19 పేరుతో ఐఎన్ఎస్ నిర్దేశక్ని 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తర్వాత ఐఎన్ఎస్ ఇక్షక్, ఐఎన్ఎస్ సంశోధక్ షిప్లు 2025 నాటికి భారత నౌకాదళంలోకి చేరనున్నాయని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. నిర్దేశక్కు గుర్తుగా...!గతంలో నిర్దేశక్ పేరుతో సర్వే నౌక దేశానికి సుదీర్ఘంగా 31 ఏళ్ల పాటు సేవలందించింది. అనంతరం దీన్ని 2014 డిసెంబర్ 19న ఉపసంహరించారు. 1983 అక్టోబర్ 4న దీన్ని జాతికి అంకితం చేశారు. కేవలం సర్వే సేవలతో పాటు ఆపద సమయాల్లో ఇది ఆస్పత్రి నౌకగా కూడా మారిపోయింది. ప్రధానంగా కాండ్లాలో వచ్చిన భూకంపం సమయంలో, శ్రీలంకలో సంభవించిన సునామీ సమయంలో ఈ నౌక విశేష సేవలందించింది. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ కేంద్రంగా ఇది పనిచేసింది. 18 మంది అధికారులతో పాటు 160 మంది సిబ్బంది ఇందులో సేవలందించేవారు. 1980 టన్నుల బరువు, 87.8 మీటర్ల పొడవైన ఈ నౌక... గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదే పేరుతో వస్తున్న కొత్త నౌక మాత్రం 3,800 టన్నుల బరువు కలిగి ఉండటంతో పాటు 110 మీటర్ల పొడవు ఉంది. ఇది గంటకు 33 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. జాతికి అంకితంవిశాఖ సిటీ: హిందూ మహాసముద్రంలో భారత్ తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకునేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక సేవలు దోహదపడతాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ పేర్కొన్నారు. భారీ అత్యాధునిక సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్ను ఆయన బుధవారం విశాఖలోని నేవల్ డాక్ యార్డ్లో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్–ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను నిర్మించిందని చెప్పారు. ఈ నౌకలో మల్టీ బీమ్ ఎకో సౌండర్లు, సైడ్ స్కాన్ సోనార్లు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ వంటి అధునాతన హైడ్రోగ్రాఫిక్ సిస్టమ్లు పొందుపరిచినట్టు వెల్లడించారు. ఓడరేవులు, నావిగేషనల్ చానల్స్, ఎకనావిుక్ ఎక్స్క్లూజివ్ జోన్లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహణ, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో నిర్దేశక్ కీలక పాత్ర పోషించనుందని వివరించారు. శోధన–రెస్క్యూ, సముద్ర పరిశోధనతో పాటు విపత్తుల సమయంలో వైద్య సేవలందించే హాస్పిటల్ షిప్గానూ సేవలు అందించనుందని చెప్పారు. ఈ నౌక హిందూ మహాసముద్రంలో భద్రతతోపాటు పర్యావరణ, శాస్త్రీయ అన్వేషణ, శాంతి పరిరక్షక కార్యక్రమాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. అత్యాధునిక సర్వే సాంకేతికతతూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ మాట్లాడుతూ.. 110 మీటర్ల పొడవున్న నిర్దేశక్ నౌక అత్యాధునిక సర్వే సాంకేతికతను కలిగి ఉందని తెలిపారు. హిందూ మహా సముద్ర పరిసర ప్రాంతాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేస్తూ భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ఈ నిర్దేశక్ నౌక కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 2025 నాటికి మరో రెండు నౌకలు భారత నౌకాదళంలోకి చేరనున్నాయని వెల్లడించారు. -
‘ఐఎన్ఎస్ సంధాయక్’ జాతికి అంకితం
సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్గా భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుకోవడంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ సంధాయక్ సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐఎన్ఎస్ సంధాయక్’ను శనివారం విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డులో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్తో కలిసి రాజ్నాథ్ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. ‘దేశీయంగా తయారు చేస్తున్న నాలుగు భారీ సర్వే వెసల్స్లో సంధాయక్ మొదటిది. భారత నౌకాదళానికి ఇదొక చరిత్రాత్మక దినం. దేశీయంగా యుద్ధనౌకల తయారీలో చరిత్ర సృష్టించాం. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సంధాయక్ ఉపయోగపడుతుంది. ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రపు దొంగల బారి నుంచి కాపాడిన ఘనత భారత నౌకాదళం సొంతం. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు మన నౌకాదళం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఒకప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి.. నేడు ప్రపంచ దేశాలకు రక్షణ కల్పించేస్థాయికి భారత్ ఎదిగింది. స్నేహపూర్వక దేశాలను కూడా రక్షించుకునే సామర్థ్యం భారత్ సొంతం. హిందూ మహా సముద్రంలో పెద్ద మొత్తంలో అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతున్న నేపథ్యంలో సముద్రపు దొంగల బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. సముద్రపు దొంగలను ఎట్టి పరిస్థితిలోనూ సహించం. భారత సముద్ర జలాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఇటీవల పలువురు మత్స్యకారులు, మెరైన్లను రక్షించడంతో పాటు దాడులకు గురైన నౌకలకు సాయం అందించిన భారత నౌకాదళాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్, కలెక్టర్ డా.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సంధాయక్ షిప్ విశేషాలు ► నాలుగు భారీ సర్వే వెసల్స్ నిర్మాణంలో భాగంగా 2019లో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ)లో ఐఎన్ఎస్ సంధాయక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ► 2021 నాటికి నౌక నిర్మాణం పూర్తయింది. 2023 డిసెంబర్ 4న భారత నౌకాదళానికి షిప్ని అప్పగించారు. ► దీని పొడవు 110 మీటర్లు. వెడల్పు 16 మీటర్లు. బరువు 4,130 టన్నులు. ప్రయాణ వేగం గంటకు 18 నాటికల్ మైళ్లు. ► 3.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంది. ► 80 శాతానికి పైగా దేశీయ సాంకేతిక సామర్థ్యంతో రూపుదిద్దుకున్న యుద్ధనౌక ఇది. ► సముద్ర జలాలు, అంతర్జాతీయ ప్రాదేశిక సరిహద్దులు నిర్ణయించేందుకు ఈ నౌకను వినియోగించనున్నారు. ► ఇతర దేశాల నౌకల మ్యాపింగ్లో కీలకపాత్ర పోషించనుంది. ► అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, సర్వే మోటర్ బోట్స్, డిజిటల్ సైడ్ స్కానర్ సోనార్, రిమోట్ ఆపరేటింగ్ వెహికల్స్ ఇందులో ఉంటాయి. ► సముద్రగర్భంలో వెయ్యి మీటర్ల లోతులో అతి సున్నితమైన, కీలకమైన సూక్ష్మ సమాచారాన్ని గ్రహించగల సామర్థ్యంగల పరికరాలు అమర్చారు. ► అండర్ వాటర్ వెహికల్స్, వెపన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ► సముద్రజలాల సర్వే మ్యాప్ కోసం అవసరమైన మల్టీ బీమ్ ఎకో సౌండర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ► అత్యవసర సమయాల్లో పరిమిత సౌకర్యాలతో హాస్పిటల్ షిప్గాను సేవలందించగలదు. ► పరిశోధన, రెస్క్యూ, డిజాస్టర్ రిలీఫ్ పాత్రల్ని కూడా సంధాయక్ సులువుగా నిర్వర్తించగలదు. ► సంధాయక్ నౌకకు మొదటి కమాండింగ్ అధికారి కెప్టెన్ ఆర్.ఎం.థామస్. దేశీయంగానే సబ్మెరైన్ల తయారీ అంతర్జాతీయ, దేశీయ జలాల మ్యాపింగ్లో సంధాయక్ కీలక పాత్ర పోషించనుంది. హైడ్రోగ్రాఫిక్ సహాయకారిగా అంతర్జాతీయ నౌకలకు కూడా ఇది ఉపయోగపడాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం. హిందూ మహాసముద్రంలో శాంతి పరిరక్షణే మన ప్రధానమైన లక్ష్యం. 66 షిప్లు, సబ్మెరైన్లలో దేశీయంగానే 64 తయారు చేస్తున్నాం.– అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఇండియన్ నేవీ చీఫ్ -
ఏడెన్ పోర్టు సమీపంలో నౌకపై డ్రోన్ దాడి
న్యూఢిల్లీ: ఏడెన్ సింధుశాఖ సమీపంలో మార్షల్ ఐల్యాండ్కు చెందిన వాణిజ్య నౌకపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్ దాడి చోటుచేసుకుంది. బాధిత నౌక ఎంవీ గెంకో పికార్డీ నుంచి విపత్తులో ఉన్నామన్న సమాచారం అందుకున్న భారత నావికాదళం సత్వరమే స్పందించింది. హిందూ మహా సముద్రంలోని ఏడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకలో 9 మంది భారతీయులు సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని నౌకలో మంటలను వెంటనే ఆర్పి వేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర జలాల్లో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంవీ గెంకో పికార్డీ నుంచి బుధవారం అర్ధరాత్రి 11.11 గంటలకు ప్రమాద సమాచారం అందిన వెంటనే నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే నిపుణుల బృందంతో బయలుదేరింది. 12.30 గంటలకల్లా ఘటనా ప్రాంతానికి చేరుకుంది. నిపుణులు ఎంవీ గెంకో పికార్డీలో క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించారు. దీంతో నౌక తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించిందని అధికారులు చెప్పారు. జనవరి 5న అరేబియా సముద్రంలో ఎంవీ లిలా నార్ఫోక్ అనే లైబీరియా నౌకను నేవీ సిబ్బంది హైజాకర్ల నుంచి కాపాడారు. డిసెంబర్ 23న ఎర్ర సముద్రంలో భారత్ వైపు చమురుతో వస్తున్న ఎంవీ చెక్ ప్లుటో అనే నౌకపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. -
నేవీ షిప్పై మొదటిసారిగా మహిళా అధికారికి బాధ్యతలు
న్యూఢిల్లీ: నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరిగిన నేపథ్యంలో భారత నావికా దళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు గత ఏడాదిగా వ్యూహాత్మకంగా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. -
ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు
శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఇండోనేషియా ఉలిక్కిపడుతోంది. తాజాగా.. రిక్టర్ స్కేల్పై దాదాపు 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాందా సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయ్యింది. అంబోన్కు 370 కిలోమీటర్ల దూరంలో.. 146 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బాందా సముద్రంలో టానింబర్ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్ర నమోదు అయ్యిందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం ప్రకటించింది. ఈ దీవి జనాభా లక్షా 27 వేలు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం.. మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించింది. ఏడాది వేల భూకంపాలు ఇండోనేషియా జనాభా 27 కోట్లను పైనే. ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్లో ఈ దేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన టెక్టోనిక్ ప్లేట్ల బెల్ట్గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ను చెబుతుంటారు. ఈ కారణంగానే అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఇండోనేషియా ఉంది. అందుకే ఆ దేశాన్ని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక.. గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై వరుసగా 7, 6.9, 5.1 తీవ్రతతో నమోదు అయ్యాయి. గత వారంగా 15సార్లు భూమి కంపించింది. నెల వ్యవధిలో 68 సార్లు భూమి కంపించగా.. ఏడాది కాలంగా 782సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 1.5 తీవ్రతతో చిన్నపాటి ప్రకంపనల నుంచి శక్తివంతమైన ప్రకంపనలే వాటిల్లాయి ఇక్కడ. 2020లో ఇండోనేషియాలో 8,260సార్లు భూకంపాలు సంభవించాయి. కానీ, అంతకు ముందు ఏడాదిలో 11,500 సార్లు భూమి కంపించింది. -
చైనా ‘జియాన్-6’తో భారత్పై నిఘా పెట్టిందా? హిందూ మహాసముద్రంలో ఏం జరుగుతోంది?
చైనా తన మరో గూఢచార నౌక జియాన్-6ను హిందూ మహాసముద్రంలోకి దింపింది. ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో 90 డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది. ఇది నిరంతరం శ్రీలంక వైపు కదులుతోంది. ఇది భారత్కు ముప్పుగా పరిణమించినున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2022 నవంబర్లో భారతదేశం బంగాళాఖాతంలో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాలనుకుంది. క్షిపణిని పరీక్షించబోయే ప్రాంతంలో నో ఫ్లై జోన్ హెచ్చరిక కూడా జారీ చేసింది. అయితే అదే సమయంలో చైనా తన గూఢచార నౌక యువాన్ వాంగ్-6ను హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రయోగించింది. ఈ చైనా నౌక కారణంగా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష తేదీని భారత్ కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే అక్టోబర్ 2023లో భారత్ బంగాళాఖాతంలో మరో క్షిపణిని పరీక్షించబోతోంది. ఈ నేపధ్యంలో అక్టోబర్ 5 నుండి 9 వరకు సుదీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష కోసం బంగాళాఖాతం నుండి హిందూ మహాసముద్రం వరకు హెచ్చరిక జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పరీక్షకు ముందే హిందూ మహాసముద్రంలో చైనా మరో గూఢచార నౌక జియాన్-6ను ప్రయోగించింది. ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో 90 డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది. జియాన్-6 అనేది చైనీస్ పరిశోధన నౌక. చైనా తెలిపిన వివరాల ప్రకారం ఈ నౌక నేషనల్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (నారా)తో కలసి పరిశోధనలు సాగిస్తుంది. అయితే ఇది చైనా గూఢచార నౌక అని నిపుణులు భావిస్తున్నారు. జియాన్-6 సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడానికి చైనా 13వ పంచవర్ష ప్రణాళికలో కీలకమైన ప్రాజెక్ట్. ఇది ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత, ఓడ 2022లో తూర్పు హిందూ మహాసముద్రంలో తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా చేసింది. శ్రీలంకకు చెందిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం అక్టోబర్లో కొలంబో నౌకాశ్రయంలో ఈ చైనా పరిశోధన నౌకను డాక్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ చైనా గూఢచార నౌక హిందూ మహాసముద్రంలో భారత్ బాలిస్టిక్ క్షిపణిని యూజర్ ట్రయల్ నిర్వహించబోతున్న సమయంలో ల్యాండ్ అయింది. అటువంటి పరిస్థితిలో భారతదేశం పరీక్ష నిర్వహిస్తే.. ఈ గూఢచార నౌక భారత క్షిపణి అందించే నిఘా సమాచారాన్ని తెలుసుకోగలుగుతుంది. ఈ క్షిపణి వేగం, పరిధి, కచ్చితత్వాన్ని చైనా తెలుసుకోగలుగుతుంది. ఈ విధంగా భారత్ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఈ చర్యతో స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 2020లో తూర్పు లడఖ్లోని గాల్వాన్ వ్యాలీలో సైనిక ఘర్షణ జరిగినప్పటి నుండి భారతదేశం - చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు హిందూ మహాసముద్రంపై పెరుగుతున్న చైనా ఆధిపత్య ప్రభావం భారత్కు శాశ్వత సవాలుగా నిలవనుంది. చైనా తన సముద్ర సరిహద్దులో చాలా బలమైన ఉనికిని కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో విస్తరణవాద విధానాన్ని అనుసరిస్తున్న చైనా విషయంలో భారతదేశం ఆందోళన చెందక తప్పదని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది? -
అండమాన్ను కుదిపేసిన భూకంపం
ఢిల్లీ: అండమాన్ నికోబార్ను ఈ ఉదయం భూకంపం కుదిపేసింది. పది కిలోమీటర్ల లోతున.. రిక్టర్ స్కేల్పై 6 తీవ్రతతో నమోదు అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. హిందూ మహాసముద్రంలో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలుస్తోంది. అండమాన్తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. 2 #earthquakes in the Indian Ocean, magnitude 6.1 Andaman Is, & mag 5.9 southwest Indian Ridge nearer to Africa. @rrichcord @LaytenHolland pic.twitter.com/1W2Vk7blFs — Cecilia Sykala (@CeciliaSykala) July 28, 2023 -
భారత్కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: మధ్య హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన చేపల ఓడ మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు నావికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఓడలోని మిగతా 37 మంది నావికులను కాపాడేందుకు భారత నేవీ రంగంలోకి దిగి సాయం చేసింది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని చైనాకు ఆపన్నహస్తం అదించింది. దీంతో భారత్ సహా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని తమ వంతు సాయం అందించించిన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవ్కు చైనా విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో సాయం చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించింది. చైనాకు చెందిన లుపెంగ్ యువాన్యు 028 చేపల ఓడ మంగళవారం హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఇందులో మొత్తం 39 మంది నావికులు ఉన్నారు. వీరిలో చైనాకు చెందన వారు 17 మంది, ఇండోనేషియాకు చెందినవారు 17 మంది, ఫిలిప్పైన్స్కు చెందిన ఐదుగురు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. చైనాకు చెందిన 10 ఓడలు ఆ ఆపరేషన్లో భాగమయ్యాయి. ఇంకా మరిన్ని ఓడలను ఘటనా స్థలానికి చేర్చుతున్నారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఓడను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్కు అతిపెద్ద విజయం.. ‘రాణాను అప్పగించండి’ -
మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్
న్యూఢిల్లీ: కీలకమైన మిత్రదేశమైన మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్లను కానుకగా అందివ్వనుంది. మే ఒకటి నుంచి మూడో తేదీ వరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీటిని అందజేస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొంతకాలంగా పెరుగుతున్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా భారత్ తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని చెబుతున్నారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా సాహిత్, రక్షణ మంత్రి మరియా దీదీతోనూ రాజ్నాథ్ చర్చలు జరుపుతారు. -
తీర ప్రాంతంలో విషాదం.. 34 మంది జలసమాధి
ఆంటనానారివో(మడగాస్కర్): బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు. మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్లో కంటే మయోటేలో జీవనం కాస్త మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని అధికారులు చెప్పారు. -
హిందూ సాగరంలోకి చైనా నిఘా నౌక.. భారత క్షిపణి పరీక్ష వాయిదా!
న్యూఢిల్లీ: చైనాకు చెంది నిఘా నౌక యువాన్ వాంగ్-5 ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్టోట పోర్టుకు చేరుకున్న క్రమంలో భారత్-చైనాల మధ్య దౌత్యపరమైన సమస్య తలెత్తింది. ఇప్పుడు మళ్లీ చైనాకు చెందన మరో నిఘా నౌక వల్ల భారత్ చేపట్టబోయే క్షిపణి పరీక్షపై ప్రభావం పడుతోంది. డ్రాగన్కు చెందన నిఘా నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిందని, దాని కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. నవంబరు 10-11 తేదీల్లో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు ఇటీవలే నోటమ్ (నోటీస్ టు ఎయిర్మెన్) జారీ చేసింది భారత్. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. 2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి.. శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. అయితే నోటమ్ జారీ చేసిన తర్వాత చైనాకు చెందిన యువాన్ వాంగ్-6 అనే నిఘా, పరిశోధక నౌక.. హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత క్షిపణులు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఆ నిఘా నౌకకు ఉండటమే అందుకు కారణం. ఈ నౌక ఇండోనేషియాలోని బాలీ తీరం నుంచి శుక్రవారం ఉదయమే బయల్దేరింది. భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను హిందూ మహా సముద్రంలోకి పంపించడం.. మన ఆయుధ పాటవంపై కన్నేసి ఉంచడానికే డ్రాగన్ చేసిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాలు.. ఓపీఎస్ పునరుద్ధరణ.. మహిళలకు రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం -
చైనాకు చెక్ పెట్టడంలో ‘భారత్’ కీలక పాత్ర: అమెరికా
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాను ఎదుర్కోవటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది అమెరికా. రానున్న భవిష్యత్తులో అమెరికాకు భారత్ కీలకమైన భాగస్వామిగా మారనుందని పేర్కొన్నారు ఆ దేశ నౌకాదళ అడ్మిరల్ మైక్ గిల్డే. ఈ వ్యాఖ్యలు.. చైనా-భారత్ల మధ్య సరిహద్దు వివాదంతో బీజింగ్పై ఒత్తిడి పెంచేందుకు వీలు కలుగనుందనే అమెరికా వ్యూహకర్తల ఆలోచన నేపథ్యంలో చేయటం ప్రాధాన్యం సంతరించుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ సెమినార్లో ఈ మేరకు అమెరికా-భారత్ సంబంధాలపై మాట్లాడారు నేవి ఆపరేషనల్ అడ్మిరల్ మైక్ గిల్డే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే తాను ఎక్కువ సమయం పర్యటించినట్లు చెప్పారు. అప్పుడే.. సమీప భవిష్యత్తులో అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా మారనుందని భావించినట్లు తెలిపారు గిల్డే. గత ఏడాది ఐదురోజుల పాటు ఢిల్లీ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘హిందూ మహాసముద్రం అమెరికాకు చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ప్రస్తుతం చైనా-భారత్లు సరిహద్దు వివాదంలో ఉన్నాయి. అది వ్యూహాత్మకంగా చాలా కీలకం. చైనాను తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని బలవంతం చేయొచ్చు. కానీ, భారత్ వైపు చూడాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు గిల్డే. ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలు.. భారత్-అమెరికాలు సంయుక్తంగా హిమాలయ పర్వతాల్లో నిర్వహించే వార్షిక సైనిక విన్యాసాలు అక్టోబర్లో జరగనున్నాయి. ఈ సైనిక ప్రదర్శనపై చైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడనుందని నిక్కీ ఆసియా పేర్కొంది. యుద్ధ అభ్యాస్ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాలు అక్టోబర్ 18 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో జరగనున్నాయి. ఇదీ చదవండి: తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు -
భారత్ టార్గెట్గా చైనా స్పెషల్ ఆపరేషన్.. జిన్పింగ్ అసలు ప్లాన్ ఇదే!
China's New 'Mission Indian Ocean'.. చైనా.. ఈ పేరు వింటేనే అందరిలో కయ్యానికి కాలుదువ్వే దేశం అని గుర్తుకు వస్తుంది. ఇటీవలే తైవాన్పై దాడులకు తెగబడిన డ్రాగన్ కంట్రీ.. భారత్ను కూడా కవ్విస్తోంది. హిందూ మహాసముద్రంపై ఫోకస్ పెట్టి భారత్ను రెచ్చగొడుతోంది. అయితే, హిందూ మహాసముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా చైనా.. ఓ స్పెషల్ ఆపరేషన్ను ప్రారంభించింది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు సమాచారం. ‘మిషన్ ఇండియన్ ఓషన్’ పేరుతో సైనిక కార్యకలాపాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇక, చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవులో యువాన్ వాంగ్ యుద్ధ నౌకను మోహరించిన సంగతి తెలిసిందే. కాగా, చైనా 590 మిలియన్ డాలర్లతో 2016లో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో నౌకా స్థావరాన్ని నిర్మించింది. అయితే, ఈ స్థావరం.. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్ కాలువ మార్గంలో ఉంది. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ను వేరుచేసే వ్యూహాత్మక బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి వద్ద చైనా మాస్టర్ ప్లాన్తో ఈ స్థావరాన్ని నిర్మించింది. ఇక, ఈ ప్రాంతంలోనే తాజాగా చైనా.. యుజావో యుద్ధనౌకను మోహరించినట్లు శాటిలైట్ ఫొటోల ఆధారంగా తెలుస్తోంది. ఈ స్థావరంలో నౌకపై భారీ సైనిక సామర్థ్యం గల వాహనాలతో పాటు జెట్ ఫైటర్లను చైనా మోహరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నౌక ద్వారా భారత్ కు సంబంధించిన కీలక ఉపగ్రహ సమాచారాన్ని చైనా సేకరించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవులో యువాన్ వాంగ్ యుద్ధ నౌకను మోహరించిన విషయం తెలిసిందే. -
క్వాడ్తో మనకు ఒరిగేదేమిటి?
క్వాడ్ సభ్యదేశాలకు చెందిన ప్రత్యేక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరిట అమెరికా వంటి ప్రాంతీయేతర శక్తులు విహరించడాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్ రూపొందించలేదు. భారత్కు హిందూ మహాసముద్ర రీజియన్ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడినుంచే జరుగుతున్నాయి. విదేశీ ఆధిపత్య శక్తుల ద్వారా హిందూ మహా సముద్ర ప్రాంతంలో సైనికీకరణ, పోటీ నెలకొంటే అది భారత్ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంత సమీప దేశాల ప్రయోజనాలను కాపాడటంలోనూ భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో, ఇటీ వలే జపాన్లో ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా మధ్య ముగిసిన నాలుగుదేశాల సంభాషణ లేదా క్వాడ్ సదస్సు పలువురు అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులను విశేషంగా ఆకర్షించింది. తైవాన్పై చైనా దాడిచేస్తే సైనికపరంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. సదస్సు తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటన... 2021 మార్చ్ 12న జరిగిన తొలి సదస్సులో చేసిన ప్రకటనలోని క్వాడ్ స్ఫూర్తిని నొక్కి చెప్పింది. అమెరికా ఇంతవరకూ 1982 నాటి సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ను ఆమోదించలేదు కానీ 1958 నాటి నడి సము ద్రంపై కన్వెన్షన్ (సీహెచ్ఎస్)లో మాత్రం భాగం పుచ్చుకుంది. అయితే నడిసముద్రంపై కన్వన్షన్ని తదుపరి వచ్చిన సముద్ర చట్టాలపై ఐరాస కన్వెన్షన్ తోసిపుచ్చిందనుకోండి! అమెరికా దీన్నే లాంఛనప్రాయమైన అంతర్జాతీయ చట్టంగా గుర్తించినప్పటికీ, 1982 నాటి తాజా కన్వెన్షన్ని అమెరికా ఇంకా ఆమోదించకపోవడం వల్ల యూఎన్సీఎల్ఓఎస్ ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఈఈజెడ్) భావనకు గణనీయంగా సవాలు ఎదురవుతోంది. తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల దూరం వరకు సముద్ర అన్వేషణలపై, సముద్ర వనరుల ఉపయోగంపై, నీటినుంచి, గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తిపై ఆయా దేశాలకు ఉండే ప్రత్యేక హక్కులను ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల భావన గుర్తిస్తోంది. గత సంవత్సరం క్వాడ్ దేశాల మధ్య తొలి సదస్సు జరిగిన నెల రోజుల్లోపే అంటే 2021 ఏప్రిల్ 7న అమెరికా భారత్కు నిజంగానే షాక్ కలిగించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉండే లక్షద్వీప్ దీవుల సమీపంలోని భారత ప్రత్యేక ఆర్థిక మండలి జలాల లోపలికి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ (ఎఫ్ఓఎన్ఓఎఫ్) పేరిట తన భారీ నౌకను పంపించినట్లు అమెరికా తెలిపింది. అయితే తీరప్రాంత దేశం సమ్మతి లేకుండా అలాంటి విన్యాసం నిర్వహించడం చట్టవిరుద్ధమని భారత్ తీవ్రంగానే స్పందించింది. సముద్ర మండళ్ల చట్టం 1976 ప్రకారం తన ప్రాదేశిక జలాల్లోకి, ప్రత్యేక ఎకనమిక్ జోన్లోకి విదేశీ నౌకలు ప్రత్యేకించి సైనిక నౌకలు ప్రవేశించాలంటే ముందస్తు సమా చారం, అనుమతి తీసుకోవాలని భారత్ చెబుతోంది. దీని ప్రకారం చూస్తే అమెరికా చేపట్టిన నౌకా విన్యాసం సముద్ర చట్టాలపై ఐక్య రాజ్య సమితి కన్వెన్షన్ని మాత్రమే కాదు, భారత జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించినట్లే అవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అన్ని దేశాలకూ వర్తిస్తుందనీ, క్వాడ్ డిక్లరేషన్ ఏ ప్రత్యేక దేశాన్నీ లక్ష్యంగా చేసుకోదని చెబుతూనే, చైనాకు బలమైన సందేశాన్ని పంపడంలో భాగంగా అమెరికా అలాంటి చర్యకు పాల్పడిందని కొంతమంది పరిశీలకులు సమర్థిస్తుండవచ్చు. అమెరికా పాదముద్రల్లో నడిచి, చైనాతో సహా ఇతర విదేశీ శక్తులు కూడా ఇదే వాదన వినిపించి భారత ప్రత్యేక ఆర్థిక జోన్లోకి స్వేచ్ఛగా తమ నౌకలను పంపిస్తే, భారత్కు ఇది తక్షణ ఆందోళన కలిగించక మానదు. ఈ అర్థంలో క్వాడ్ ప్రకటన స్థూలంగానే భారత భద్రతా పరమైన ఆందోళనలను విస్మరించిందనే చెప్పాలి. అంతేకాకుండా యూరేషి యన్ భౌగోళిక వ్యూహాన్ని దక్షిణాసియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతంతో సహా ఓ ఒక్క శక్తీ లేదా సంకీర్ణ శక్తులు కూడా డామినేట్ చేయడాన్ని అనుమతించకూడదనే అమెరికన్ వ్యూహాన్ని మాత్రమే క్వాడ్ ప్రకటన సంతృప్తి పర్చనుంది. ‘చైనా–ఇండియా గ్రేట్ పవర్ కాంపిటీషన్ ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజియన్ ఇష్యూస్ ఫర్ కాంగ్రెస్’ శీర్షికతో అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ పేపర్ని 2018లో ట్రంప్ పాలనా కాలంలో ప్రచురించారు. భారత్, చైనా మధ్య పోటీ, శత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో ఒక సమతుల్య శక్తిగా అమెరికా వ్యవహరించాలని ఈ పత్రం స్పష్టం చేసింది. తమ హిందూ మహాసముద్ర తీర ప్రాంత వ్యూహంలో భారత్ అతిముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటని ట్రంప్, బైడెన్ పాలనా యంత్రాంగాలు రెండూ ప్రకటించాయి గానీ, భారత ప్రత్యేక ఆర్థిక జోన్లో అమెరికా యుద్ధ నౌకా విహారం దాని విశ్వసనీయతకు తూట్లు పొడిచింది. అలాగే ఒక ప్రాంతీయ శక్తిగా ఈ మొత్తం రీజియన్ ప్రయోజనాలను పరిరక్షించే మాట దేవుడెరుగు, భారత్ తన సొంత ప్రయోజనాలనైనా కాపాడుకునే సామర్థ్యం కలిగివుందా అనే సందేహాలను ఇతర తీరప్రాంత దేశాల్లో పెంచి పోషించింది. తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ఇతరులు ప్రవేశించడానికి భారత్ తీసుకున్న వైఖరి లాగానే, ఇతర దేశాలు కూడా తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ప్రవేశించడానికి ముందుగా అనుమతి తీసుకోవలసి ఉందని చైనా పేర్కొంటోంది. అయితే ఈ ప్రత్యేక ఆర్థిక మండలి తనదే అని చైనా చెబుతుండటం వల్ల జపాన్, దక్షిణ కొరియా, పిలిఫ్పైన్స్, వియత్నాంతో దానికి వివాదాలు ఎదురవుతున్నాయి. అమెరికాకు ఈ దేశాలతో భద్రతాపరమైన బాధ్యతలు ఉంటున్నాయి. ప్రస్తుతానికి అయితే తూర్పు, దక్షిణ తీర ప్రాంతంలో భారత్ తన ఉనికిని ప్రదర్శించుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి చైనా తీరప్రాంతంపై క్వాడ్ చేసిన ప్రకటన భారత్కు ఉపకరించదు. అదే సమయంలో అమెరికాకు, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని తన పొత్తుదారుల ప్రయోజనాలను మాత్రమే ఈ ప్రకటన నెరవేరుస్తుందని గ్రహించాలి. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని లేదా ఇండో పసిఫిక్ రీజియన్లోని భౌగోళిక ప్రాంతాన్ని క్వాడ్ గుర్తించడం లేదు. 2017 నాటి జాతీయ భద్రతా వ్యూహం ప్రకారం, భారత పశ్చిమ తీర ప్రాంతం నుంచి అమెరికా పశ్చిమ తీరప్రాంతం వరకు వ్యాపించిన ప్రాంతాన్ని ఇండో–పసిఫిక్ ప్రాంతమని అమెరికా నిర్వచించింది. కాగా, ఆఫ్రికా కొమ్ము అని చెబుతున్న ప్రాంతం నుంచి పసిఫిక్ రీజియన్ తీరం వరకు ఉన్నదే ఇండో–పసిఫిక్ ప్రాంతమని భారత్ భావిస్తోంది. ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు చాలావరకు ఆగ్నేయాసియా దేశాలతోనే ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ పేరిట పెరుగుతున్న చైనా మదుపు ప్రాజెక్టులు, మిలిటరీ వ్యవస్థల నిర్మాణం భారత్ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలకు ప్రత్యక్ష ప్రమాదంగా మారుతున్నాయి. భారతీయ హిందూ మహాసముద్ర వ్యూహంలో రెండు కీలక అంశాలున్నాయి. ఒకటి, భారత ప్రాంతీయ నౌకల ఉనికిని బలోపేతం చేయడం. దీనివల్ల విదేశీ శక్తుల ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చు. రెండు, ఆర్థిక, సాంకేతిక సహకార చర్యలను ప్రోత్సహించడం. సభ్యదేశాలకు చెందిన ప్రత్యక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరిట ప్రాంతీ యేతర శక్తులు విహరించడాన్ని సామూహికంగా అడ్డుకునేందుకు ఇంతవరకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్ రూపొందించలేదు. భారత్కు సంబంధించినంతవరకూ హిందూ మహాసముద్ర రీజియన్ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఈ ప్రాంతం ద్వారానే జరుగుతున్నాయి. విదేశీ శక్తుల ద్వారా హిందూ మహాసముద్ర రీజియన్లో సైనికీకరణ, పోటీ నెల కొంటే అది భారత్ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడు కోవడం కోసమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంతం సమీప దేశాల ప్రయోజనాలను కూడా కాపాడటంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. దీనికోసం స్వతంత్ర హిందూ మహాసముద్ర వ్యూహాలను భారత్ బలోపేతం చేసుకోవలసి ఉంది. అప్పుడే ఈ రీజి యన్లో నిజమైన నికర భద్రతా ప్రదాతగా భారత్ ఆవిర్భవిస్తుంది. వ్యాసకర్త: డాక్టర్ గద్దె ఓంప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ మొబైల్: 79089 33741 -
చైనా నీడలో హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం చైనా ప్రభావిత ప్రాతంగా శరవేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కెన్యా, కమరోజ్, సీషెల్స్ లాంటి హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో సంబంధాలకు చైనా విశేష ప్రాధాన్యమిస్తోంది. అలాగే తమ ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల నిమిత్తం చైనా పెట్టుబడుల కోసం శ్రీలంక, మాల్దీవులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో భారతదేశం నుంచి కూడా ఇవి మద్దతు కోరుకుంటున్నాయి. తన భద్రతా ప్రయోజనాలను అడ్డుకోనంతవరకు, ఈ రెండు దేశాలతో ఆర్థిక సంబంధాలు భారత్కు ఆమోదనీయమే అవుతాయి. అయితే సరైన ప్రతిస్పందనలు కరువైనప్పుడు ఈ అవగాహన పూర్తిగా నీరుగారిపోవచ్చు కూడా! ఏమైనా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా చొరబాటు వల్ల ఎదురవుతున్న సవాళ్లకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో భారత్కు కీలక పాత్ర ఉంటుంది. పశ్చిమ హిందూ మహా సముద్ర ప్రాంతంలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత 32 సంవత్సరాలుగా చైనా విదేశాంగమంత్రి నూతన సంవత్సర సఫారీ, ఆఫ్రికాకే పరిమితమై ఉంటూ వస్తోంది. సాధారణంగా అయిదు ఆఫ్రికా దేశాలను చైనా విదేశీ మంత్రి సందర్శించేవారు. కానీ ఈ ఏడాది ఆయన సందర్శన జాబితాలో మరికొన్ని దేశాలు వచ్చి చేరాయి. ఎరిత్రియా, కెన్యా, కమరోజ్ దేశాలతోపాటు మాల్దీవులు, శ్రీలంకను కూడా చైనా విదేశీ మంత్రి వాంగ్ యీ సందర్శించడం విశేషం. ఈ సంవత్సరం చైనా మంత్రి సందర్శించిన దేశాల్లో నాలుగు హిందూ మహాసముద్ర ప్రాంతానికి చెందినవి. అంటే చైనా సఫారీ ఆఫ్రికాకు మాత్రమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతానికి కూడా విస్తరించింది. కమరోజ్, కెన్యా ఇప్పటికే ఈ ప్రాంతానికి చెంది ఉన్నాయి. 2021 జనవరిలో వాంగ్ యీ సీషెల్స్తో సహా హిందూ మహా సముద్ర ప్రాంతంలోని అయిదు ఆఫ్రికన్ దేశాలను సందర్శించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా పాదముద్రలు ఇతర దేశాల ప్రభావానికి సవాల్ విసురుతున్నాయి. 2008లో గల్ఫ్ ఆఫ్ ఈడెన్ చుట్టూ చైనా సముద్ర బందిపోట్ల వ్యతిరేక నావికా బలగాల మోహ రింపుతో ఇది ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ ప్రాంతంలో ఓడలకు రవాణా పరమైన మద్దతుకోసం అది రిహార్సల్స్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో భాగంగా దాని నీలిరంగు నావికా బలగాలు చాలా దూరం పయనించాయి. తన తొలి ఆఫ్రికన్ సైనిక స్థావరాన్ని చైనా 2017లో జిబూతిలో ప్రారంభించింది. జిబూతి ఆఫ్రికా కొమ్ము అని పిలిచే ప్రాంతంలో వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఇక్కడ ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, జపనీస్ స్థావరాలు ఉంటున్నాయి. చైనా ఇప్పుడు అట్లాంటిక్ తీరప్రాంతంలోని ఈక్వేషనల్ గినియాలో కూడా సైనిక స్థావరం ఏర్పర్చుకున్నట్లు వార్తలు వస్తు న్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రం గుండా చైనా సరఫరా మార్గాలకు ఇదెంతో అవసరం. ఈ కోణంలో కమరోజ్, సీషెల్స్ దేశాలతో సంబంధాలు చైనాకు చాలా ముఖ్యం. హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల్లో చైనా విదేశీమంత్రి ఇటీవలి సందర్శన ప్రభా వాన్ని అంచనా వేయడానికి కెన్యా స్పష్టమైన ముఖచిత్రాన్ని ఇస్తుంది. తన కెన్యా సందర్శనలో వాంగ్ యీ, మొంబాసా రేవులో చమురు టెర్మినల్ని ప్రారంభించారు. హిందూ మహసముద్ర తీరంలో ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. మొంబాసా–నైరోబీ రైల్వే మార్గం కోసం 3.5 బిలియన్ డాలర్లను చైనా విరాళమిచ్చింది. చైనా నిర్మిస్తున్న బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్లో కెన్యాకు కీలక స్థానముంది. పైగా మౌలిక వసతుల కల్పనకు చైనానుంచి సహాయం కోసం కెన్యా చూస్తోంది. అయితే చాలా సంవత్సరాల తర్వాత కమరోజ్ దేశాన్ని చైనా మంత్రి సందర్శించడం అసాధారణమే. చైనా విరాళాలను భరాయిం చుకునే సామర్థ్యం కమరోజ్కు తక్కువే. అయినా ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ దేశం చూస్తోంది. 2030 నాటికి సార్వత్రిక రోగనిరోధక శక్తిని పెంచడం, మలేరియా నిర్మూలన లాంటి కమరోజ్ ప్లాన్ కోసం రెండు దేశాలు పథక రచన చేస్తున్నాయి. పైగా సెనెగల్లో నిర్వహించిన చైనా, ఆఫ్రికా సహకార వేదిక భేటీలో తొమ్మిది కీలక మైన పథకాలను కూడా చైనా 2021 డిసెంబర్లో కుదుర్చుకుంది. అయితే కమరోజ్ దేశాన్ని చైనా మంత్రి సందర్శించడం ఈ ప్రాంతంలో ఫ్రాన్స్ ప్రభావాన్ని సవాలు చేస్తోంది. ఈ యేడు ఇతర ఆఫ్రికన్ దేశాలను సందర్శించడానికి బదులుగా, మాల్దీవులతో సంబంధాలు ఏర్పర్చుకుని 50 సంవత్సరాలైన సంద ర్భంగా వాంగ్, ఆ దేశాన్ని సందర్శించారు. ఇక శ్రీలంకతో రబ్బర్–రైస్ ఒడంబడిక కుదుర్చుకుని 70 ఏళ్లు పూర్తి చేసుకోవడం, దౌత్య సంబంధాలు కుదుర్చుకుని 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ దేశాన్ని కూడా చైనా మంత్రి సందర్శించారు. కాబట్టి హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ సంవత్సరం చైనా సఫారీ కేంద్రీకరించింది. ఇప్పటికే తమ ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల నిమిత్తం చైనా పెట్టుబడుల కోసం శ్రీలంక, మాల్దీవులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో భారతదేశం నుంచి కూడా ఇవి మద్దతు కోరుకుంటున్నాయి. ఇండియాను ఒక పొరుగు దేశంగా, చైనాను ఎదుగుతున్న అగ్రరాజ్యంగా భావిస్తూ రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలను ఎలా కొనసాగించాలో ఇవి పాఠాలు నేర్చుకుం టున్నాయి. తన భద్రతా ప్రయోజనాలను అడ్డుకోనంతవరకు, ఈ రెండు దేశాలతో ఆర్థిక సంబంధాలు భారత్కు ఆమోదనీయమే అవు తాయి. అయితే సరైన ప్రతిస్పందనలు కరువైనప్పుడు ఈ అవగాహన పూర్తిగా నీరుకారిపోవచ్చు కూడా. ఈ పొరుగు ద్వీపదేశాలకు చెందిన రాజకీయ నేతలు ఒక విధానంగా భారత్కు మద్దతు నివ్వాలని సూచిస్తూ వస్తున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా చొరబాటుతో ఎదుర్కోవాలంటే భారత్ చేయవలసింది చాలానే ఉంది. అందుకే మారిషస్, సీషెల్స్, మడగాస్కర్తో పాటు శ్రీలంక, మాల్దీవులు, కమరోజ్ వంటి తీరప్రాంత దేశాలను కూడా భారత్ నిరం తరం బలపరుస్తూ వస్తోంది. భారత్తో స్నేహాన్ని కోరుకుంటున్న ఈ దేశాల్లో చైనా బలంగా పాతుకుపోతోందని ఆధారాలు చెబుతున్నాయి. మరి హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రమేయాన్ని భారత్ ఎలా ఎదుర్కోవాలి? మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో కరెన్సీ సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు ద్వైపాక్షిక తోడ్పాటును ఇండియా గణనీయ స్థాయిలో విస్తరిస్తోంది. కుట్ర ప్రయత్నం, ఉగ్రదాడి, నీటి సంక్షోభం, మహమ్మారి వంటి సంక్షోభం పరిస్థితుల్లో భారత్ ఈ దేశాలను ఆదుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల శ్రీలంకకే ఎక్కువ ప్రయోజనం కలిగేలా రెండు దేశాల భాగస్వా మ్యంలో మార్పు వచ్చింది. కమరోజ్లో ఒక ఒకేషనల్ శిక్షణా కేంద్రాన్ని, విద్యుత్ ప్లాంట్ని నిర్మిచడంలో భారత్ తోడ్పడింది. కానీ ఇవి ఇంకా పూర్తి కాలేదు. ఇక భారత సంతతి ప్రజలపై కెన్యా బలమైన ఆర్థిక ప్రభావం కలిగి ఉంది. కెన్యాతో పెట్టుబడి ఆధారిత సంబంధాలను భారత్ కొనసాగిస్తోంది. రివాటెక్స్ బట్టల మిల్లు పునరుద్ధరణ కోసం కెన్యా భారత్ నుంచి రుణం స్వీకరించింది. అయితే ఈ దేశాల్లో భారత్, చైనా మధ్య పోలికల గురించి చర్చ ప్రారంభమైంది. కాబట్టి ఈ దేశాలకు ఎలాంటి మంచి తలపెట్టాలి, ఏం చేయగలగాలి అనేది ఇండియానే తేల్చు కోవల్సి ఉంది. చైనా రుణకల్పనకు ప్రత్యామ్నాయాన్ని అందించేం దుకు విస్తారమైన పొత్తులను ఇండియా రూపొందించాల్సి ఉంది. భారత్, పసిఫిక్ సాగర విధానంలో వాయవ్య హిందూ మహాసముద్ర ప్రాంతం ఒక భాగం. జపాన్, ఫ్రాన్స్, అమెరికా కూడా హిందూ మహాసముద్రాన్ని ప్రభావితం ప్రాంతంగా చూస్తున్నాయి. కాబట్టే 1997లోనే భారత్ 14 దేశాలను కలుపుకొని ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ని ఏర్పర్చింది. ఇప్పుడు వీటి సంఖ్య 23కి చేరింది. ప్రారంభంలో ఆర్థిక సహకారంపైనే దృష్టి సారించినప్పటికీ ఈ కూటమి సముద్ర భద్రత, సాంప్రదాయేతర భద్రతా ప్రమాదాల వరకు విస్తరించింది. ఈ కూటమిలో ఫ్రాన్స్ కూడా భాగస్వామి. చైనా ఒక సంభాషణా భాగస్వామిగా ఉంటోంది. పాకిస్తాన్ని మినహాయిం చిన ఈ కూటమి భారత్కు అధిక అవకాశాలను అందజేస్తోంది. ఇండో–పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ని కూడా భారత్ ఉపయో గించుకుని ఈ ప్రాంతంపై తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. దీన్ని 2019లో భారతదేశమే ప్రకటించింది. అలాగే క్వాడ్ దేశాల కూటమిని కూడా భారత్ ఆహ్వానించడంలో ముందంజ వేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతం, ఫసిఫిక్ ప్రాంతంలో చైనా చొర బాటు వల్ల ఎదురవుతున్న సవాళ్లకు ప్రత్యామ్నాయాన్ని రూపొందిం చడంలో భారత్కు కీలక పాత్ర ఉండబోతోంది. – గుర్జీత్ సింగ్ భారత మాజీ రాయబారి -
భారత్కు కరువు, వడగాల్పుల ముప్పు
న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతోందని వాతావరణ మార్పుపై విడుదల చేసిన ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావంతో భారత్లో వడగాలులు, వరదలు పెచ్చురిల్లుతాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రం వేడెక్కడంతో దేశం చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు భారీ వరదలు, ముంపునకు గురవుతాయని, నేలలో తేమ తగ్గడంతో పలు చోట్ల కరువు సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది. ఇండియా లాంటి జనసాంద్రత అధికంగా ఉన్న దేశంలో వడగాలులు పెరగడాన్ని ఏరోసాల్స్(గాలిలో ఉండే సూక్ష్మమైన ధూళి కణాలు) కొంతవరకు అడ్డుకుంటాయని, అయితే దీనివల్ల గాలిలో నాణ్యత లోపిస్తుందని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశంలో వానలు, వరదలు పెరగడం, హిమనీ నదాలు కరిగిపోవడం, ఇదే సమయంలో సముద్ర మట్టాలు పెరగడం కలగలిపి భారీ ఇక్కట్లు కలగజేస్తాయని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంత తొందరగా ఆగకపోవచ్చని నివేదిక రూపకర్తలో ఒకరైన ఫ్రెడరిక్ ఒట్టో చెప్పారు. దేశీయంగా సముద్ర మట్టాల పెరుగుదలకు 50 శాతం కారణం అధిక ఉష్ణోగ్రతలేనని మరో సైంటిస్టు స్వప్న చెప్పారు. 21 శతాబ్దమంతా భారత్ చుట్టూ సముద్ర మట్టాలు పెరగడాన్ని గమనించవచ్చని, అలాగే వందల సంవత్సరాలకు ఒకమారు వచ్చే సముద్ర బీభత్సాలు ఈ శతాబ్దం చివరకు సంభవించవచ్చని అంచనా వేశారు. వచ్చే 20– 30 ఏళ్లలో భారత్లో వర్షపాతం పెద్దగా మారకపోవచ్చని కానీ శతాబ్దాంతానికి తేడా వస్తుందని పేర్కొంది. భారత్, దక్షిణాసియాల్లో అసాధారణ రుతుపవన గమనాలుంటాయని ఐపీసీసీ తెలిపింది. దీనివల్ల స్వల్పకాలిక వర్షపాత దినాలు ఎక్కువైతాయని, దీర్ఘకాలిక వర్షదినాలు తగ్గుతాయని తెలిపింది. పట్టణీకరణ(అర్బనైజేషన్)తో పెరుగుతున్న ప్రమాదాలను వివరించింది. మానవ తప్పిదాలే ఈ పరిస్థితులకు కారణమని నివేదిక తెలిపింది. 1970 నుంచి మానవ చర్యల కారణంగా సముద్ర పర్యావరణంలో మార్పులు వస్తున్నాయని, 1990తో పోలిస్తే ఆర్కిటిక్ సముద్రం 40 శాతం కుంచించుకుపోయిందని తెలిపింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించకపోతే ఊహించని ప్రమాదాలు తప్పవని, ఇప్పటినుంచే మేల్కొని తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. -
భూమ్మీద మరో మహా సముద్రం.. ఇది చాలా డిఫరెంట్!
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమి ఉపరితలంపై 70% నీళ్లేనని, నాలుగు మహా సముద్రాలు ఉన్నాయని చిన్నప్పుడు బడిలో వల్లెవేసే ఉంటాం. వాటి పేర్లు బట్టీపట్టే ఉంటాం. మరి ఆ నాలుగు మహా సముద్రాలకు తోడుగా ఇప్పుడు ఇంకో మహా సముద్రం వచ్చి కలిసింది తెలుసా? ఆ నాలుగింటికి భిన్నంగా ఉండే ఈ కొత్త మహా సముద్రానికి ఎన్నో ప్రత్యేకతలు, దానితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మహా సముద్రం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? ఇప్పటిదాకా ఆ నాలుగే.. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నట్టు పసిఫిక్, హిందూ, అట్లాంటిక్, ఆర్కిటిక్.. ఈ నాలుగూ మహా సముద్రాలు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య నిలువుగా ఉండేది అట్లాంటిక్ మహా సముద్రం.. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య హిందూ మహా సముద్రం.. ఆసియా, ఆస్ట్రేలియాలకు, ఉత్తర, దక్షిణ అమెరికాలకు మధ్య అత్యంత భారీగా ఉండేది పసిఫిక్ మహా సముద్రం.. పైన ఉత్తర ధ్రువం ప్రాంతంలో ఉండేది ఆర్కిటిక్ మహా సముద్రం.. ఇప్పుడు కొత్తగా గుర్తించినది దక్షిణ (సదరన్) మహా సముద్రం. భూమి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అంటార్కిటిక్ ఖండానికి చుట్టూ ఆవరించి ఉంది. ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీనే నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ దీనిని కొత్త మహా సముద్రంగా గుర్తిస్తూ.. మ్యాప్లో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆమోదం రావాల్సి ఉంది. ఈ మహా సముద్రం.. చాలా డిఫరెంట్.. నిజానికి వివిధ ఖండాల మధ్య సువిశాల నీటి భాగాలను మహా సముద్రాలుగా గుర్తించారు. ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ మహా సముద్రం కూడా భూభాగాల మధ్యనే ఉంటుంది. కానీ దక్షిణ ధ్రువ ప్రాంతంలోని సదరన్ మహా సముద్రానికి మాత్రం సరిహద్దులుగా భూభాగాలు లేవు. చుట్టూ సముద్రాలే సరిహద్దులు. ఇదేగాక మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏ మహా సముద్రానికి కూడా మధ్యలో చిన్నా, పెద్ద దీవులు తప్ప ఖండాల వంటి భారీ భూభాగాలు లేవు. కానీ సదరన్ మహా సముద్రానికి మధ్యలో అంటార్కిటిక్ ఖండం ఉంటుంది. కొత్త సముద్రం.. సరిహద్దులు ఎలా? ప్రతి మహా సముద్రాన్ని ఖండాల మధ్య సరిహద్దులతో గుర్తిస్తే.. సదరన్ మహా సముద్రాన్ని దాని చుట్టూ ఉండే భారీ సముద్ర ప్రవాహాం (ఓసియన్ కరెంట్)తో నిర్ధారించారు. అంటార్కిటిక్ ఖండానికి రెండు, మూడు వేల కిలోమీటర్ల దూరంలో చుట్టూ.. పైన ఉపరితలం నుంచి సముద్రం అడుగు వరకు అత్యంత భారీ ప్రవాహం తిరుగుతూ ఉంటుంది. దానిని ‘అంటార్కిటిక్ సర్కమ్పోలార్ కరెంట్ (ఏసీసీ)’అంటారు. పసిఫిక్, హిందూ, అట్లాంటి మహా సముద్రాల నుంచి చిన్న ప్రవాహాలు దీనిలో కలిసిపోతాయి. ఈ భారీ ప్రవాహం నుంచి మధ్యలో పాయలు పాయలుగా చిన్న ప్రవాహాలు ఏర్పడి బయటికి వెళతాయి. ఈ ఏసీసీ మాత్రం కిలోమీటర్ల కొద్దీ వెడల్పుతో.. వేల కిలోమీటర్ల పొడవున తిరుగుతూనే ఉంటుంది. భూమ్మీద వేడి, చలువ సమస్థితికి కారణమిదే.. ఏసీసీ ప్రవాహానికి బయట పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల్లో నీళ్లు బాగా ఉప్పగా, కాస్త వేడిగా, తేలికగా ఉంటే.. ప్రవాహానికి లోపల సదరన్ మహా సము ద్రంలో నీళ్లు తక్కువ ఉప్పగా, బాగా చల్లగా, కాస్త మందంగా ఉంటాయి. భూమ్మీద ఎక్కువ ఉపరితలాన్ని ఆక్రమించిన మూడు సముద్రాల నుంచి వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉన్న నీళ్లు ఏసీసీ ప్రవాహంలో కలిసిపోతాయి. ప్రవాహంలో సమాన ఉష్ణోగ్రతకు చేరిన నీళ్లు.. మధ్యలో చిన్న పాయలుగా ఈ సముద్రాల్లోనే కలుస్తాయి. దీనివల్ల వేడిగా ఉన్న నీళ్లు చల్లగా, చల్లగా ఉన్న నీళ్లు వేడిగా మారుతూ.. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి కారణమవుతాయి. దీనిద్వారా మొత్తం భూమి మీద ఉష్ణోగ్రతల్లో స్థిరత్వం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రవాహం లేకుంటే.. ప్రమాదమే.. అంటార్కిటిక్ కరెంట్ సముద్రాల్లో స్థిర ఉష్ణోగ్రతలకు తోడ్పటమే కాకుండా.. భూవాతావరణంపై చాలా ప్రభావం చూపుతుందని, అది లేకుంటే చాలా సమస్యలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏసీసీ మిగతా సముద్రాల్లోని వేడి నీళ్లు అం టార్కిటికా ఖండానికి చేరకుండా ఆపు తుంది. అది లేకుంటే వేడి నీళ్లు చేరి అం టార్కిక్ మంచు వేగంగా కరిగిపోతుంది. అంటార్కిక్ ప్రాంతంలోని మంచు, నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వంటివి అక్కడి సముద్రపు లోతుల్లో భారీ స్థాయిలో కార్బన్ నిక్షేపం అవడానికి కారణమయ్యా యి. అలాకాకుండా ఉంటే భూవాతావరణంలో కార్బన్ వాయువుల శాతం పెరిగి.. గ్లోబల్ వార్మింగ్ మరింత పెరుగుతుంది. మంచు కరగడం, గ్లోబల్ వార్మింగ్ పెరిగితే.. వరదలు, తుఫాన్లు, లోతట్టు ప్రాం తాలు మునిగిపోవడం, అధిక ఉష్ణోగ్రతలు వంటి సమస్యలకు కారణమవుతాయి. ‘గుర్తింపు’పై గొడవలెన్నో.. నిజానికి దక్షిణ మహా సముద్రానికి 1937లోనే ఈ గుర్తింపు ఇచ్చారు. కానీ ప్రపంచ దేశాల మధ్య కొన్ని వివాదాలు తలెత్తడంతో 1953లో ఆ హోదా తొలగించారు. కేవలం ఓ సముద్ర భాగంగానే పరిగణించారు. దీనికి ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో మహా సముద్రంగా గుర్తించాలని, ఆ ప్రాంతంలోని జీవజాతుల రక్షణ, ఇతర అంశాలకు అది తోడ్పడుతుందని చాలా కాలంగా శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన జియోగ్రఫిక్ నేమ్స్ బోర్డ్.. 1999లో దీనికి మహా సముద్రంగా గుర్తింపు ఇచ్చింది. తాజాగా నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ మ్యాప్లలో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, ఇతర జల భాగాలకు గుర్తింపు ఇచ్చే ‘ఇంటర్నేషనల్ హైడ్రోఫోనిక్ ఆర్గనైజేషన్ (ఐహెచ్ఓ)’ఓకే చేయాల్సి ఉంది. చదవండి: చైనాలో మరో విపత్తు! -
హమ్మయ్య.. గండం తప్పింది
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనకు గురిచేసిన చైనా లాంగ్మార్చ్ 5బీ రాకెట్ శకలాల కథ సుఖాంతమయ్యింది. ఈ శకలాలు ఆదివారం హిందూ మహా సముద్రంలో మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. శకలాలన్నీ సురక్షితంగా సాగర గర్భంలోకి చేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ విషయాన్ని అంతరిక్ష సంస్థ అధికారికంగా ప్రకటించింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం.. లాంగ్మార్చ్ రాకెట్ శకలాలు ఆదివారం ఉదయం 10.24 గంటలకు భూవాతావరణంలోకి ప్రవేశించాయి. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం(లాంగీట్యూడ్), 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం(లాటీట్యూడ్) వద్ద సముద్రంలో కూలిపోయినట్లు చైనా స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ వెల్లడించింది. చాలా శకలాలు భూవాతావరణంలో మండిపోయి, నీళ్లల్లో కూలాయి. ఇక రిలాక్స్ కావొచ్చు చైనా రాకెట్ శకలాల కథ సుఖాంతం కావడాన్ని నాసా కూడా ధ్రువీకరించింది. లాంగ్మార్చ్ 5బీ పునరాగమనాన్ని ఉత్కంఠతో పరిశీలిస్తున్నవారంతా ఇక రిలాక్స్ కావొచ్చని, రాకెట్ సముద్రంలో కూలిపోయిందని స్పష్టం చేసింది. ఈ గండం నుంచి చైనా ఇప్పటికిప్పుడు గట్టెక్కింది గానీ దాని నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదని హార్వర్డ్ వర్సిటీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ జోనాథన్ మెక్డొవెల్ తప్పుపట్టారు. చైనా ప్రభుత్వం తియాన్గాంగ్ పేరిట అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 29న హైనన్ ప్రావిన్స్లోని వెన్చాంగ్ స్పేస్క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి లాంగ్మార్చ్ 5బీ (సీజెడ్–5బీ) రాకెట్ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రానికి అవసరమైన కీలక భాగాన్ని (కోర్ మా డ్యుల్) ఈ రాకెట్ మోసుకెళ్లింది. అయితే, మా డ్యుల్ను విజయవంతంగా రోదసీలో ప్రవేశపెట్టాక నియంత్రణ కోల్పోయింది. అంతరిక్షంలోనే పేలి పోయింది. దాని శకలాలు మళ్లీ భూమి పైకి దూసుకొచ్చాయి. అవి ఎక్కడ పడతాయన్న దాని పై భిన్న వాదనలు వినిపించాయి. ఒక దశలో ఇం డియా రాజధాని ఢిల్లీని ఢీకొట్టడం ఖాయమన్న పుకార్లు కూడా వినిపించాయి. చివరకు సముద్రంలో కూలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాకెట్ శకలాలకు సంబంధించి బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా విఫలమైందని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రతినిధి బిల్ నెల్సన్ విమర్శించారు. -
హిందూ మహా సముద్రలో పడిన చైనా రాకెట్ శకలాలు
-
తప్పిన ముప్పు: హిందూ మహాసముద్రంలో రాకెట్ శకలాలు
న్యూఢిల్లీ: ఇటీవల చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5-బీ రాకెట్ ముప్పు తప్పింది. వారం రోజులుగా ఎక్కడ పడుతుందా అని టెన్షన్ పెట్టిన చైనా రాకెట్ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ శకలాలు అధికభాగం మండిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి వైపు దూసుకొచ్చి సముద్రంలో 18 టన్నుల శకలాలు పడిపోయాయి. అవి పశ్చిమ మాల్దీవుల సమీపంలోని సముద్రంలో నేలకూలినట్లు నిర్ధారించారు. ఈ రాకెట్ శకలాలు సముద్రంలో కూలడం కంటే ముందే దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఏప్రిల్ 29న చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ అనే భారీ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. ఇక అప్పటి నుంచి ఎక్కడ పడతాయని అందరూ టెన్షన్ పడిన సంగతి తెలిసిందే. అమెరికా మిలిటరీ మాత్రం.. ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించగానే ఆ శకలాలు పూర్తిగా బూడిద అయిపోతాయిని, జనావాసాలపై పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా మిలిటరీ మాత్రం.. ఆ శకలాలు తుర్కిమెనిస్తాన్లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు పడుతాయిని చెప్పాయి. కానీ చివరికి హిందూ మహా సముద్రంలో ఆ రాకెట్ శకలాలు పడిపోవటం గమనార్హం. ( చదవండి: చైనా కుతంత్రం: జీవాయుధంగా కరోనా ) -
అమెరికా అవాంఛనీయ చర్య
ముందస్తు అనుమతి లేకుండా హిందూ మహాసముద్ర జలాల్లోని మన ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్) సమీపంలోకి అమెరికా నావికా దళం ఈ నెల 7న సంచరించింది. పైగా అదొక ఘన కార్యమన్నట్టు చాటింపు వేసుకుంది. పర్యాటక ఆసక్తితో దేశాలు సందర్శించేవారికి సైతం వర్తమాన ప్రపంచంలో నిబంధనలున్నాయి. అక్కడి ప్రభుత్వాలు రూపొందించుకున్న నిబంధనలు అనుమ తించినమేరకు మాత్రమే ఆ దేశాలు పర్యటించటానికైనా, అక్కడ శాశ్వత నివాసం ఏర్పరుచు కోవటానికైనా అవకాశం వుంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన నౌక సాధారణమైనది కాదు. అది అమెరికా నావికా దళంలోని సప్తమ విభాగానికి చెందిన యుద్ధ నౌక. దానికి క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యముంది. యుద్ధకాలంలో మినహా ఇతరత్రా సమయాల్లో మిత్ర దేశమైనా, శత్రు దేశ మైనా వేరొకరి గగనతలంలోకి లేదా వారి సముద్ర జలాల పరిధి సమీపంలోకి ప్రవేశించదల్చుకున్న ప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వటం ఆనవాయితీ. ఇందువల్ల అనవసర ఘర్షణలు నివారిం చటం లేదా దౌత్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూడటం వీలవుతుంది. హిందూ మహా సముద్రంలోని లక్షద్వీప్ సమీప జలాల గుండా అమెరికా యుద్ధ నౌక వెళ్లటం ఈ కోణంలో అవాంఛనీయమైనది. ఈ నెల 7న తాము ఇటువైపుగా వచ్చామని అమెరికా నావికా దళం మరో మూడురోజుల తర్వాత ప్రకటించేవరకూ ఆ విషయం మన దేశ పౌరులెవరికీ తెలియదు. మన విదే శాంగ శాఖ ఆ యుద్ధ నౌక కదలికల గురించి ముందే కన్నేసివుంచామని ప్రకటించింది. అది పర్షి యన్ జలసంధి నుంచి మలకా జలసంధిలోకి వెళ్లేవరకూ నిరంతరాయంగా దాని కదలికలను పర్య వేక్షించామని, దౌత్య మార్గాల్లో నిరసన ప్రకటించామని తెలిపింది. ఆ సంగతిని మన ప్రభుత్వం అమెరికా ప్రకటనకన్నా ముందే వెల్లడించివుంటే బాగుండేది. మనం ఐక్యరాజ్యసమితి సముద్ర ఒడంబడికకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని, దాని ప్రకారమే సముద్ర జలాల్లో 12 మైళ్ల ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలుగా, మరో 24 మైళ్ల ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలకు ఆనుకొని వుండే ప్రాంతంగా, దాన్నుంచి 200 మైళ్ల వరకూ ఈఈజడ్గా పరిగణిస్తున్నామని, ఒక సార్వభౌమాధికార దేశంగా అది మన హక్కని విశ్వసిస్తున్నప్పుడు అమెరికా వైఖరి తప్పని ఆ క్షణమే బహిరంగంగా ప్రక టించాల్సింది. కానీ ఒడంబడికను ఉల్లంఘించిన దేశం ఆ పని చేసి మన నిస్సహాయతను చాటింది. అంతర్జాతీయ ఒడంబడికపై మన అవగాహనకూ, అమెరికా అవగాహనకూ తేడావుంది. ఈ విషయంలో మనకే కాదు... ప్రపంచంలోని వేరే దేశాలకు కూడా అమెరికాతో విభేదాలున్నాయి. ఈ జాబితాలో అమెరికా మిత్ర, అమిత్ర దేశాలు రెండూ వున్నాయి. గత డిసెంబర్ 24న దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కాన్ దావో దీవుల సమీప జలాల గుండా అమెరికా యుద్ధ నౌక వెళ్లింది. మొన్న ఫిబ్రవరిలో మరో యుద్ధ నౌక అక్కడే స్పార్టీ. దీవుల సమీపం నుంచి వెళ్లింది. మార్చి 31న దక్షిణ కొరియాకు చెందిన కుక్–టో దీవుల సమీపంనుంచి, ఈ నెల 3న శ్రీలంక సముద్ర జలాల పరిధి మీదుగా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించాయి. ఈనెల 7న మనతోపాటు మాల్దీవుల హక్కును కూడా అది ధిక్కరించింది. 1995లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికను వాస్తవానికి అమెరికా ఇంతవరకూ ధ్రువీకరించలేదు. దాన్ని ధ్రువీకరించిన మన దేశం అందుకొక షరతు విధిం చింది. ఈఈజడ్ పరిధిలోకి విదేశీ యుద్ధ నౌకలు ప్రవేశించాలంటే ముందస్తుగా భారత్కు తెలియ జేయాలన్నది దాని సారాంశం. వాణిజ్య నౌకలకు ఈ నిబంధన వర్తించదు. చైనా మాత్రం తమ ఈఈజడ్ పరిధిలోకి అనుమతిలేకుండా అన్యులెవరూ రాకూడదని నిర్దేశించింది. అన్నిరకాల నౌక లకూ ఇది వర్తిస్తుంది. అంతేకాదు... విశాల సముద్ర ప్రాంతం తన ఈఈజడ్గా చెప్పుకోవటం కోసం అది కృత్రిమంగా పగడాల దిబ్బలు నెలకొల్పింది. దాంతో ఆ ప్రాంతంలో వేరే దేశాల వాణిజ్య నౌకల గమనానికి అవకాశం వుండటంలేదు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో చైనాకూ, అమెరి కాకూ నడుస్తున్న లడాయి అదే. ఇందుకు మన దేశం కూడా మద్దతునిస్తోంది. అసలంటూ అంత ర్జాతీయ ఒడంబడిక వున్నప్పుడు ఏ దేశానికా దేశం దానికి తూట్లు పొడిచేలా సొంత నిబం ధనలు ఏర్పాటు చేసుకోవటం ఏమిటన్నది అమెరికా ప్రశ్న. కానీ ఇలా ప్రశ్నించడానికి నైతికంగా తన కేమి హక్కుందో ఆ దేశం తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆ ఒడంబడికను పాతికేళ్లుగా ధ్రువీకరించ కుండా కాలక్షేపం చేస్తున్న అమెరికా... దాన్ని ధ్రువీకరిస్తూనే తమ తమ అవసరాలకు అనుగుణంగా ఒకటి రెండు షరతులు విధిస్తున్న దేశాలను తప్పు పట్టడం పరమ విడ్డూరం. అమెరికా తూర్పు ప్రాంతాన అట్లాంటిక్ మహా సముద్రం వుంది. దాని పడమరన పసిఫిక్ మహాసముద్రముంది. ఆ ప్రాంతాల్లోకి వేరే దేశానికి చెందిన యుద్ధ నౌక సంగతలావుంచి, వాణిజ్య నౌకనైనా అమెరికా అను మతించకపోవచ్చు. అదేమంటే...అంతర్జాతీయ ఒడంబడికను ధ్రువీకరించలేదని చెప్పవచ్చు. కానీ వేరే దేశాల విషయానికొచ్చినప్పుడు ‘ధ్రువీకరించాక సొంతంగా నిబంధనలెందుకు విధిస్తార’ని ప్రశ్నించవచ్చు. ఈ తర్కంతో ఒకపక్క స్వప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే మరోపక్క దబా యించటం అమెరికాకే చెల్లింది. అనుమతిలేకుండా మన ఈఈజడ్ పరిధి సమీపంలోకి రావటం ఎంత తప్పో, దాన్ని సమర్థించుకుంటూ అది చేసిన ప్రకటన కూడా అంతే తప్పు. అందులో మిత్ర స్వరం లేదు. స్వేచ్ఛాయత నౌకా హక్కును చాటడం కోసంభారత్తోసహా ఎక్కడైనా మున్ముందు కూడా ఇలాగే చేస్తామని ఆ ప్రకటన చెబుతోంది. దేశాల మధ్య మిత్ర సంబంధాలు పరస్పర గౌరవ మర్యాదల ప్రాతిపదికగా వుండాలి. ఇచ్చిపుచ్చుకునే వైఖరితో మెలగాలి. పెద్దన్న పాత్ర పోషిస్తా మని, పెత్తనం చలాయిస్తామని... దానికి అందరూ తలొగ్గి వుండాలని భావిస్తే అది చెల్లదని అమె రికా గుర్తెరిగేలా చేయటం మన తక్షణ కర్తవ్యం. -
సాగర గర్భంలో శోధన
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో కంటికి కనిపించే వివిధ రకాల జీవరాశుల గురించి మనకు తెలుసు. మరి అవి కాకుండా సాగర గర్భంలో ఇంకా ఏముంది? అక్కడి జీవ వైవిధ్యం.. వాతావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? తదితర అంశాలను అన్వేషించేందుకు విశాఖ నుంచి శాస్త్రవేత్తల బృందం ఈ నెల 15న బయల్దేరింది. ఆర్వీ సింధు సాధన నౌకలో వెళ్లిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(సీఎస్ఐఆర్–ఎన్ఐవో)కి చెందిన 30 మంది శాస్త్రవేత్తల బృందం హిందూ మహా సముద్ర గర్భంలోని విశేషాలను అన్వేషిస్తున్నారు. ఇతర మహా సముద్రాలతో పోలిస్తే హిందూ సముద్రంలో పరిశోధనలు చాలా తక్కువగా జరిగాయి. అందుకే ఇక్కడ సముద్ర గర్భంలో ఏం దాగుందో అన్వేషించే బాధ్యతను సీఎస్ఐఆర్–ఎన్ఐవో భుజానికెత్తుకుంది. జీవుల జన్యు వైవిధ్య మ్యాపింగ్.. సీఎస్ఐఆర్–ఎన్ఐవో సముద్ర గర్భంలోని జీవుల జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్ చేయడమే లక్ష్యంగా ప్రాజెక్టును ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో కంటికి కనిపించని జీవరాశులు ఎన్ని రకాలున్నాయి, లోహాలు, వాతావరణ పరిస్థితులు, బ్యాక్టీరియా తదితరాలను అన్వేషించనున్నారు. ఈ ప్రాజెక్ట్కు ‘ట్రేస్ బయోమీ’ అని పేరు పెట్టారు. ► 30 మంది శాస్త్రవేత్తల బృందం 90 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించనుంది. వీరి యాత్ర దాదాపు 9,000 నాటికల్ మైళ్ల దూరం సాగనుంది. మే నెలలో గోవాలో వీరి పరిశోధన ముగియనుంది. ► ఒక జీవి పుట్టుక, పెరుగుదల, జీవితచక్రం విశేషాలపై పరిశోధన, నీటిలో ఉన్న లోహనిక్షేపాల వివరాలతో పాటు అవక్షేపాలు ఎంత మేర ఉన్నాయనే దానిని పరిశీలిస్తారు. ► అలాగే సముద్ర గర్భంలోని నీటి సాంద్రత, ఫ్లోరైడ్, వాటర్ టోటల్ హార్డ్నెస్, పీఏ లెవల్స్ ఎంతమేర ఉన్నాయి? జీవరాశులకు అవసరమైన ఆహారముందా? లేదా? మొదలైన వాటిపై పరిశోధనలు నిర్వహిస్తారు. ► హిందూ మహాసముద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నీరు, పాచి, జీవరాశుల విస్తృత నమూనాల్ని సేకరించి అధ్యయనం చేస్తారు. ఇందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ► సేకరించిన నమూనాల్లో ఉన్న లోహాలు, సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ జీవుల దశలు.. మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తారు. ముఖ్యంగా గ్లోబల్ ట్రాన్్రస్కిప్టోమ్, మెటాజెనోమ్ విశ్లేషణలు నిర్వహిస్తారు. ► మనకు కావల్సిన మెడిసిన్లకు అవసరమైన బ్యాక్టీరియా, శిలీంద్రాల పరిశోధన జరగనుంది. భవిష్యత్లో వాతావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని తెలుసుకోడానికి కూడా ఈ పరిశోధన ఉపయోగపడుతుంది. సాగర గర్భ లోతుల్ని అన్వేషిస్తాం.. హిందూ మహా సముద్రం అడుగు భాగంలో అతి తక్కువ పరిశోధనలు జరిగాయి. ఇప్పటివరకు ఉపరితలంపైనా.. అక్కడ్నుంచి కొన్ని కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే పరిశోధనలు చేశారు. ఈసారి మా శాస్త్రవేత్తల బృందం సాగర గర్భ లోతుల్ని అన్వేషించనుంది. సముద్ర జీవుల్లో జన్యు పరమైన మార్పులు, వాటి ప్రత్యేకతలు, ఆ జీవుల వల్ల కలిగే లాభనష్టాల్ని పరిశోధిస్తాం. సముద్ర గర్భంలోని వాతావరణ మార్పులు, వాటి వల్ల భవిష్యత్లో వచ్చే మంచి, చెడులపైనా సమాచారం సిద్ధం చేస్తాం. 90 రోజుల్లో ఈ యాత్ర పూర్తయినా.. ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి మాత్రం మూడేళ్లు పడుతుంది. – డా.జి.ప్రభాకర్ ఎస్ మూర్తి, సీఎస్ఐఆర్–ఎన్ఐవో చీఫ్ సైంటిస్ట్ -
హిందూ మహాసముద్రంలో వింత జీవి
మహాసముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో రకమైన సముద్ర జీవులు, రకరకాల జంతు జాతులు ఉంటాయి. ఇలాంటి మహాసముద్ర గర్భంలో ఏముందో తెలుసుకోవడానికి కొందరు ఔత్సహికులు ప్రయత్నిస్తారు. కానీ, కొన్నిసార్లు వారి అన్వేషణలో సైతం తెలియని మిస్టీరియస్ వండర్స్ ఎన్నో ఉంటాయి. రీసెర్చర్లకు, జంతు నిపుణులకు సైతం ఇవి అంతు బట్టవు. తాజాగా హిందూ మహాసముద్రంలో సుమారు 3,700 అడుగుల లోతున కనీవినీ ఎరుగని ఒక విచిత్ర జీవి కనబడి అందరిని ఒకింత ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఈ వింత జీవి కదిలికలు అన్ని కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది పలు రకాల షేపులు మారుస్తూ, అతి వేగంగా లోతుగా నీటి అడుగు భాగానికి వెళ్లి అక్కడ తన ఆకారాన్ని మార్చుకుని అకస్మాత్తుగా ఒక చిన్న నల్ల బంతి ఆకారంలో మళ్ళీ పైకి వచ్చిన వెంటనే తన షేపు మారుస్తూ కనిపించింది. కొందరు దీన్ని సముద్ర ‘ఏలియన్’ అని అంటే మరికొందరు ఇది చేప లేదా తిమింగలం జాతికి చెందిన కొత్తరకం జీవి అంటున్నారు. కొంతమంది జేమ్స్ కేమరూన్ మూవీ ‘ఏలియన్’ని గుర్తు చేస్తున్నారు. ఇది రకరకాల విన్యాసాలు చేయడాన్ని ఇంత లోతున రీసెర్చర్లు అమర్చిన రిమోట్ కెమెరా క్యాప్చర్ చేసింది. ఈ క్లిప్ ను 2013లో ఆన్లైన్లో ప్రసారం చేసినప్పటికీ ఇది బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో ఆఫ్రికా తూర్పు తీరంలో తీయబడింది. ఇప్పుడు యూట్యూబ్లో దీనిని 1.5 మిలియన్లకు పైగా చూశారు. నాటి నుంచి నేటి వరకు ఈ విచిత్ర జీవి ఏమిటో అనేది ఎవరు చెప్పలేక పోతున్నారు. చదవండి: గడ్డకట్టే చలిలో డాన్స్ అంటే మాటలా... -
సహకరించుకుందాం.. సవాళ్లను ఎదిరిద్దాం..
న్యూఢిల్లీ: దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలు తమ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయా దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో ఈ దేశాలన్నీ సహకరించుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాల మధ్య అనుసంధానం పెరగకపోతే 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబోదని తేల్చిచెప్పారు. 10 ఇరుగు పొరుగు దేశాలతో కలిసి ‘కోవిడ్–19 మేనేజ్మెంట్: ఎక్స్పీరియన్స్, గుడ్ ప్రాక్టీసెస్, వే ఫార్వర్డ్’ పేరిట గురువారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మోదీ ఆన్లైన్లో మాట్లాడారు. ప్రత్యేక వీసా పథకం తీసుకొద్దాం.. వర్క్షాప్లో మోదీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాసియా దేశాలు ప్రత్యేక వీసా పథకాన్ని తీసుకురావాలని కోరారు. దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడానికి వీలుగా డాక్టర్లు, నర్సులు ఒక దేశం నుంచి మరో దేశానికి సులభంగా, వేగంగా ప్రయాణించేలా వీసాలు ఇవ్వాలని అన్నారు. అలాగే ఎయిర్ అంబులెన్స్ ఒప్పందంపైనా దక్షిణాసియా దేశాల పౌర విమానయాన శాఖ మంత్రులు దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్లు చూపుతున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడిగా ఒక స్థానిక వేదికను సృష్టించుకుంటే బాగుంటుందని అన్నారు. ‘పరీక్ష పే చర్చ’ ఆన్లైన్లోనే.. సాక్షి, న్యూఢిల్లీ: వార్షిక పరీక్షల ముందు విద్యార్థుల్లో భయాందోళనలను దూరం చేయడానికి మోదీ ప్రతిఏటా ‘పరీక్ష పే చర్చ’ నిర్వహిస్తున్నారు. 9–12 తరగతుల విద్యార్థులతో మాట్లాడేవారు. కోవిడ్ కారణంగా ‘పరీక్ష పే చర్చ’ను ఈ ఏడాది ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. చర్చలో పాల్గొనేందుకు ఎంపికైన వారికి ప్రత్యేకంగా పీపీసీ(పరీక్ష పే చర్చ) కిట్ ఇస్తారు. విద్యుత్ సంస్కరణల్లో ముందడుగు విద్యుత్ పంపిణీ, నియంత్రణ రంగాల్లో సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ రంగంలో ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డిస్కమ్లకు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగానికి బడ్జెట్లో కేటాయించిన నిధుల సమర్ధ వినియోగానికి సంబంధించి గురువారం జరిగిన ఒక వెబినార్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇతర నిత్యావసరాలను నచ్చినవారి నుంచి కొనుక్కునే వీలున్నట్లే.. విద్యుత్ను కూడా వినియోగదారులు తమకు నచ్చిన పంపిణీదారు నుంచి కొనుగోలు చేసుకునే వీలుండాలని ప్రధాని వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం ప్రత్యేక రంగంగా పరిగణిస్తుందని, పరిశ్రమ రంగంలో భాగంగా చూడదని వివరించారు. గత ఆరేళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్ధ్యం రెండున్నర రెట్లు, సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 15 రెట్లు పెరిగిందని వెల్లడించారు. 139 గిగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సాధించి ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్.. వన్ ఫ్రీక్వెన్సీ’లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. దేశీయ తయారీ కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నది తమ అభిమతమన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగం మధ్య నెలకొన్న విశ్వాసానికి ఈ వెబినార్ ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘పీఎం కుసుమ్’పథకం ద్వారా, రైతులు తమ క్షేత్రాల్లో చిన్న, చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా చూస్తామన్నారు. అలా, 30 గిగావాట్ల సౌర విద్యత్ ఉత్తత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
హిందూ మహాసముద్రంలో 24 గంటల్లో అల్పపీడనం
మహారాణిపేట(విశాఖ దక్షిణం): మాల్దీవులు, దానిని అనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో మాల్దీవుల ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. -
భారత జలాల్లోకి చైనా నౌక.. తరిమికొట్టిన నేవీ!
న్యూఢిల్లీ: భారత సముద్ర జలాల్లో పోర్ట్ బ్లెయిర్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా చైనా నౌక ఏవో అనుమానాస్పద అన్వేషణలు సాగిస్తోంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో చైనా నౌకను గుర్తించిన భారత నేవి అధికారులు వెంటనే తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో అక్కడి నుంచి చైనా నౌక తిరిగి వెళ్లింది. రహస్యంగా సమాచారం సేకరించేందుకు చైనా ఆ నౌకను పంపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చైనా రీసెర్చ్ నౌక 'షి యాన్ 1' పోర్ట్ బ్లెయిర్ సమీపంలోని అనుమానాస్పదంగా కనిపించింది. అక్కడ మన జలాంతర్భాగంలో పరిశోధనలు చేస్తున్నట్టు గుర్తించారు. అప్రమత్తమైన ఇండియన్ నేవీ చైనా అధికారులకు హెచ్చరికలు పంపడంతో అక్కడి నుంచి షి యాన్ 1 నౌక తిరుగు పయనమైంది. గూఢచర్యానికి పాల్పడి ఉండవచ్చని భారత నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా.. చైనా తన సముద్ర భాగం నుంచి ఇండియన్ నేవీకి చెందిన పీ-81 మారిటైమ్ సర్వెయిలెన్స్ను పరిశీలిస్తున్నట్టుగా ఇటీవల గుర్తించారు. ఎప్పటికప్పుడు చైనా కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు నేవీ అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం విదేశీ జలభాగంలో పరిశోధనలు, అన్వేషణలు విరుద్దమని నేవీ అధికారులు వెల్లడించారు. -
విషాదం : ఉంగరంతో తన భర్తను గుర్తుపట్టింది
లండన్ : హిందూ మహాసముద్రంలోని ఓ దీవికి విహారయాత్రకని వెళ్లిన దంపతులకు విషాదమే మిగిలింది. ఈతకు వెళ్లిన వ్యక్తిని ఏకంగా ఒక సొరచాప మింగేసింది. వివరాల్లోకి వెళితే.. ఎడిన్బర్గ్కు చెందిన రిచర్డ్ మార్టిన్ టర్నర్ అనే వ్యక్తి ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. తన భార్య 40వ పుట్టిన రోజును వినూత్నంగా జరుపుకోవాలని నవంబర్ 2న హిందూ మహాసముద్రంలోని రీ యూనియన్ దీవికి వచ్చారు.అయితే అక్కడి నుంచి లాగూన్ బీచ్ ప్రాంతానికి వెళ్లిన రిచర్డ్ 6 అడుగుల లోతు ఉన్న సముద్రంలోకి ఈతకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అప్రమత్తమై భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పడవలు, హెలికాప్టర్, గజ ఈతగాళ్లను రప్పించి దీవి మొత్తం వెతికించినా ఎలాంటి ఫలితం రాలేదు. అయితే లాగూన్ బీచ్లో షార్క్ చేపలు తిరుగుతున్నాయని తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్లను అక్కడికి పంపించి నాలుగు షార్క్ చేపలను బంధించారు. వాటిని చంపి షార్క్ అవశేషాలను పరిశీలించగా ఒక షార్క్ కడుపులో చేయితో పాటు ఉంగరం కూడా దొరికింది. ఆ ఉంగరాన్ని పరిశీలించిన రిచర్డ్ భార్య అది తన భర్తదేనని తెలిపారు. అలాగే అధికారులు చేయిని, ఇతర అవశేషాలను డీఎన్ఏ టెస్ట్కు పంపిచంగా అది రిచర్డ్దేనని స్పష్టం చేశారు. అయితే రిచర్డ్ను మింగిన షార్క్ 13 అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
భారత్కు దగ్గర్లో చైనా యుద్ధనౌకలు
న్యూఢిల్లీ: నావికా బలాన్ని అమాంతం పెంచుకుంటున్న చైనా, హిందూ మహాసముద్రం మీదుగా ఏడు యుద్ధ నౌకలను తరలించింది. అయితే భారత నిఘా విమానాలు ఈ యుద్ధనౌకల ఫొటోలను చిత్రీకరించి ఉన్నతాధికారులకు పంపాయి. దాదాపు 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైనిక వాహనాలు, హెలికాప్టర్లను తరలించే సామర్థ్యమున్న గ్జియాన్–32తో పాటు ఆరు యుద్ధనౌకలు సెప్టెంబర్ నెల ఆరంభంలో ‘గల్ఫ్ ఆఫ్ అడెన్’కు బయలుదేరాయి. అక్కడికి చేరుకునేందుకు వీలుగా ఏకైక మార్గమైన హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాయి. ‘భారత తీరానికి దగ్గరగా వచ్చే నౌకలను మేం గమనిస్తూనే ఉన్నాం. గల్ఫ్ ఆఫ్ అడెన్లో పైరెట్లను ఎదుర్కొనేందుకు వీలుగా చైనా ఈ నౌకలతో విన్యాసాలు నిర్వహించనుంది’ అని భారత నేవీ అధికారి ఒకరు తెలిపారు. -
నేవీకి మరింత శక్తి
వాషింగ్టన్: సముద్రంలో గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేకించిన ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను భారత్కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. 24 హెలికాప్టర్లకు మొత్తంగా ధర రూ.1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో చైనా క్రియాశీలకంగా మారుతున్న నేపథ్యంలో యుద్ధ సమయాల్లో భారత నావికాదళానికి ఈ హెలికాప్టర్లు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. శత్రు దేశాల సబ్మెరైన్లు, నౌకలను వెంటాడి వాటిని ధ్వంసం చేసేందుకు వీలుగా వీటిని రూపొందించారు. సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. యుద్ధనౌకల నుంచి, విధ్వంసక నౌకల నుంచి, క్రూజర్ల నుంచి, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ప్రయోగించగలిగే హెలికాప్లర్లలో ఇవే అత్యాధునికమైనవని నిపుణులు చెబుతున్నారు. ఇవీ ప్రత్యేకతలు... ♦ అమెరికాలో ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను ‘రోమియో’అని కూడా పిలుస్తారు. ♦ లాక్హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ (ఓవిగో) సంస్థ ఈ హెలికాప్టర్లను తయారుచేసింది. ♦ ఈ హెలికాప్టర్లలో సబ్మెరైన్లను ధ్వంసం చేసే పరికరాలతో పాటు సర్చ్, రెస్క్యూ, గన్ సపోర్ట్, నిఘా, సమాచారం చేరవేసే సాంకేతికతను అనుసంధానం చేసింది. ♦ సరుకులు, వ్యక్తుల తరలించే వెసులుబాటు ఉంది. ♦ 2721 కిలోగ్రాముల బరువైన సామగ్రిని తాడుతో తరలించే సదుపాయం కూడా ఇందులో ఉంది. ♦ జూలై 2001లో తొలి హెలికాప్టర్ తయారైంది. ♦ ఇందులో ముగ్గురు లేదా నలుగురు సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ♦ దీనికి సెన్సర్లను అమర్చారు. దీనివల్ల హెలికాప్టర్ను లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చే వాటిని గుర్తిస్తుంది. ♦ చిన్న ఆయుధాలు, మంటలు అంటుకున్నా కూడా ఎలాంటి హాని కలగకుండా ఏర్పాట్లు చేశారు. ♦ 1,425 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు టర్బో షాఫ్ట్ ఇంజన్లను దీనికి అమర్చారు. -
9 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన ‘దెయ్యం ఓడ’
థోంగ్వా(మయన్మార్): కొన్ని సంఘటనల వెనుక మర్మమేమిటో ఎంత ఆలోచించినా అంతుపట్టదు. వాటికి సమాధానం తెలుసుకోవాలన్నా దొరకదు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల క్రితం పసిఫిక్ మహాసముద్రంలో అదృశ్యమైన ఓ భారీ నౌక.. గతవారం హిందూ మహాసముద్రంలో కన్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘దెయ్యం ఓడ’గా పిలుచుకుంటున్న సామ్ రత్లుంగి పీబీ 1600 అనే నౌక వేల టన్నుల సరుకులతో ఇండోనేషియా జెండాతో బయలుదేరింది. ఈ నౌక చివరిసారిగా 2009లో తైవాన్ సముద్ర జలాల్లో కనిపించింది. తర్వాత అది కనిపించకుండా పోయింది. పలు దేశాలకు చెందిన అధికారులు ఎంత గాలింపు చేపట్టిన షిప్ జాడ కనిపెట్టలేకపోయారు. ఎంత వెతికినా నౌక ఆచూకీ లభ్యం కాకపోవడంతో అది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో మునిగిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా ఇటీవల ఆగస్టు 30వ తేదీన ఆ నౌకను మయన్మార్ తీరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ మత్స్యకారులు గుర్తించారు. అందులోకి వెళ్లి చూడగా అందులో ఎవరూ కనబడలేదు. అందులో ఎటువంటి సరకులు కూడా లేవు. దీంతో వారు తీరప్రాంత పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా దానిని పరిశీలించారు. అయిన కూడా ఆ నౌక ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోలేకపోయారు. 9 ఏళ్ల తరువాత నౌక వెలుగులోకి రావడంపై రకరకాలు కథనాలు వినిపిస్తున్నప్పటికీ.. ఆ నౌక ఇంతకాలం ఎక్కడ ఉంది, అందులోని సరుకులు, సిబ్బంది ఎమయ్యారు అనే ప్రశ్నలు సమాధానాలు లేనివిగానే మిగిలాయి. కాగా, 177.35 మీటర్ల పొడవు, 27.91 మీటర్ల వెడల్పుతో 2001లో ఈ ఓడను నిర్మించారు. -
కడలి అలజడి.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: కడలిలో అకస్మాత్తుగా అలజడి రేగింది. ఒకపక్క పెనుగాలులతో కూడిన వర్షం, మరోపక్క ఎగసిపడుతున్న సముద్ర కెరటాలను చూసి జనం ఆందోళన చెందారు. మళ్లీ సునామీ వచ్చేస్తోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇదంతా ప్రచారమేనని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..? సోమవారం అర్థరాత్రి నుంచి సముద్రంలో కెరటాల ఉధృతి మొదలైంది. మంగళవారం ఉదయానికి వాటి తీవ్రత మరింత పెరిగింది. హిందూ మహాసముద్రానికి (భూమధ్యరేఖకు) బాగా దిగువన మడగాస్కర్ ప్రాంతంలో గాలుల వేగం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా అలలు సుమారు 2 మీటర్లకు పైగా ఎగసిపడుతున్నాయి. ఈ ప్రభావం మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తాలో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో పాటు అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. తీరప్రాంతంలో గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో నైరుతి దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. అప్రమత్తం చేసిన ఇన్కాయిస్.. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరంలో లంగరేసిన బోట్లు దెబ్బతినకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలని మత్స్యకారులకు సూచించింది. బుధవారం అర్ధరాత్రి వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. సునామీ ప్రచారం నమ్మొద్దు.. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం, అలలు ఎగసి పడడంతో మీడియా, సోషల్ మీడియాలో సునామీ రాబోతోందంటూ మంగళవారం విపరీతమైన ప్రచారం జరిగింది. కొన్ని టీవీ చానళ్లలోనూ ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే సముద్రంలో భూకంపాలు సంభవించినప్పుడు మాత్రమే సునామీ వస్తుంది తప్ప కెరటాలు ఎగసిపడినా, అకాల వర్షాలు కురిసినా సునామీ రాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. -
మాల్దీవుల్లో మళ్లీ అశాంతి
నాలుగు దశాబ్దాలుగా ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి పయనిస్తున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశం మాల్దీవులు మళ్లీ అశాంతితో అట్టుడుకుతోంది. జైళ్లలో ఉన్న విపక్ష నేతలందరినీ విడుదల చేయాలని, కొందరు ఎంపీ లపై అనర్హత వేటు వేయడం చెల్లదని గురువారం రాత్రి అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తాజా పరిణామాలకు మూలం. ఈ ఉత్తర్వులను తాను అమలు చేసేది లేదంటూ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రభుత్వం ప్రకటించడంతో దేశమంతా ఆందోళనలు మొదలయ్యాయి. రాజకీయపుటెత్తులు, పైయెత్తుల్లో అక్కడి న్యాయ వ్యవస్థ కూడా భాగం కావడం, ఇష్టానుసారం వ్యవహరిస్తుండటం తదితర కారణాల వల్ల సుప్రీంకోర్టుపై కూడా ఎవరికీ పెద్దగా విశ్వాసం లేదు. గత మూడు నాలుగేళ్లుగా రాజకీయ ప్రాధాన్యమున్న కేసుల్లో ఆ న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పుల్నే ఇచ్చింది. ఈ కేసులో సైతం అలాంటి తీర్పే వెలువ డుతుందని ప్రభుత్వం భావించింది. కానీ అందుకు భిన్నంగా విపక్ష నేతలను విడుదల చేయమని, అనర్హత వేటు చెల్లదని వెలువడిన ఆదేశాలతో ప్రభుత్వం ఖంగుతింది. మాల్దీవులతో భారత్ సంబంధాలు సంక్లిష్టమైనవనే చెప్పాలి. హిందూమహాసముద్రం–అరేబియా సముద్ర కూడలిలో ఉన్న మాల్దీవులలో మన భద్రతా కారణాలరీత్యా అక్కడ చైనా ప్రాబల్యం పెరగకుండా చూసుకోవాలని మన దేశం భావిస్తోంది. అందుకే ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని, సంయమనం పాటించమని అన్ని పక్షాలనూ కోరడం మన దేశానికి రివాజు. ఇందుకు భిన్నంగా 1988లో ఒకసారి జరిగింది. అప్పట్లో మాల్దీవుల అధ్యక్షుడు గయూమ్కు వ్యతిరేకంగా సైనిక కుట్ర జరగబోతున్నదన్న సమాచారం అందుకున్న రాజీవ్గాంధీ ప్రభుత్వం హుటాహుటీన అక్కడికి మన సైన్యాన్ని తరలించి కుట్రదార్లందరినీ నిర్బంధించింది. ఆ ఉదంతం అప్పట్లో రెండు విధాలుగా ప్రకంపనలు రేపింది. ఈ ప్రాంతంలో భారత్ పెద్దన్న పాత్ర వహిస్తున్నదని, అక్కడేం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మెరుపు దాడులు నిర్వ హించగల సత్తా భారత్కు ఉన్నదని అమెరికాతోసహా చాలా దేశాలకు అర్ధమైంది. అదే సమయంలో గయూమ్ నియంతృత్వానికి భారత్ వంతపాడుతున్నదని అప్పటికే విపక్షాల్లో నెలకొన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ ఘటన తర్వాత గయూమ్ మరింత రెచ్చిపోయారు. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపారు. ఎలా ఉద్యమించాలో, నిర్బంధాన్నెలా ధిక్కరించాలో ప్రజలకు నియంతలే నేర్పుతారు. మూడు దశాబ్దాలపాటు సైన్యాన్ని, పోలీసులను, న్యాయవ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన గయూమ్కు 2004లో మొదలై దాదాపు రెండేళ్లపాటు వెల్లువెత్తిన ఉద్యమాలను అణచడం సాధ్యం కాలేదు. చివరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరిం చాడు. 2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పటికి జైల్లోనే ఉన్న మహమద్ నషీద్ గయూమ్పై విజయం సాధించారు. అంతా సవ్యంగా ఉంటే మాల్దీవుల్లో ప్రజా స్వామ్యం వేళ్లూనుకునేది. కానీ అదే సంవత్సరం పుట్టుకొచ్చిన ఆర్థిక మాంద్యం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. కొత్తగా అధికారంలోకొచ్చిన నషీద్ ఆర్థిక, రాజకీయ సంస్కరణలు ప్రారంభించి చక్కదిద్దుతున్న సమయంలోనే నిత్యా వసరాల ధరలు ఆకాశాన్నంటడం, ఉపాధి అవకాశాలు తగ్గడం వగైరా కారణాలతో జనంలో అసంతృప్తి పెరిగింది. అనంతర పరిణామాల్లో నషీద్ సైతం నియంతృత్వ విధానాలనే ఆశ్రయించారు. మాజీ అధ్యక్షుడు గయూమ్పై వచ్చిన అవినీతి కేసుల్లో చర్యలకు అడ్డుపడుతున్నారన్న కారణంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా మహమద్ను 2012లో అరెస్టు చేయించారు. చివరకు పోలీసులు, సైన్యమూ తన ఆదేశాలను ధిక్కరించడం ప్రారంభించాక నషీద్ రాజీనామా చేయాల్సివచ్చింది. అయితే తనకు వ్యతిరేకంగా సైనిక కుట్ర జరిగిందన్నది ఆయన ఆరోపణ. ఒకప్పుడు సైన్యాన్ని తరలించి గయూమ్ను కాపాడిన భారత్ తన విషయంలో కనీసం వ్యతిరేకంగా ప్రకటన కూడా చేయ లేదన్న అసంతృప్తి నషీద్కు ఉంది. అయితే మన దేశం ఆయనను మొదటినుంచీ నమ్మదగ్గ మిత్రుడిగా పరిగణించలేదు. నషీద్ చైనాకు సన్నిహితంగా ఉండటం, భారత్–పాక్ల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా ఉంటానని ప్రకటించడం లాంటివి మన దేశానికి రుచించలేదు. 2013లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నషీద్ను ఓడించారు. అయితే ఆ ఎన్నికల్లో పెద్దయెత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎప్పుడూ సంక్షోభంతో కొట్టుమిట్టాడే మాల్దీవుల విషయంలో మన దేశం అంటీముట్టనట్టు వ్యవహరించడం ప్రారంభించాక చైనా ఆ దేశానికి సన్నిహిత మైంది. చైనా బృహత్తర ప్రాజెక్టు వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్)లో పాలుపంచు కోవాలని మాల్దీవులు నిర్ణయించింది. జీఎంఆర్ సంస్థ అక్కడ నిర్మించ తలపెట్టిన విమానాశ్రయం ప్రాజెక్టును సైతం చైనా ఒత్తిడితో ఏకపక్షంగా రద్దుచేసి అందుకు భారీమొత్తంలో ఆ సంస్థకు పరిహారం చెల్లించింది. మాజీ అధ్యక్షుడు గయూమ్కు ప్రస్తుత అధ్యక్షుడు యమీన్ సమీప బంధువే. వారిద్దరి సంబంధాలూ చెడి ఆయన నషీద్తో చేతులు కలపడంతో నిరుడు ఉద్యమాలు ఊపందుకున్నాయి. అప్పట్లో గయూమ్ అనుకూల ఎంపీలు విపక్షంలోకి ఫిరాయించడంతో ప్రభుత్వం మైనారి టీలో పడింది. ఇలా ఫిరాయించినవారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించడం చెల్ల దన్న సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ‘సూర్యుడు ముద్దాడే దేశం’గా, 26 పగడాల దీవుల సముదాయంగా, కేవలం 4,30,000 జనాభా ఉన్న మాల్దీవులు వ్యూహాత్మకంగా కీలకప్రాంతం కావడం వల్లే ఆ దేశంపై మన దేశానికి ఆదుర్దా. అధికార, విపక్షాల నిరంతర ఘర్షణలతో అట్టు డుకుతున్న మాల్దీవుల్లో ఈ ఏడాది ఆఖరులో జరగబోయే ఎన్నికలతోనైనా ప్రశాం తత ఏర్పడుతుందా అన్నది చూడాలి. -
7 నెలల తర్వాత భూమిపై అడుగు
-
ఏడు నెలల తర్వాత భూమిపై అడుగు
సాక్షి, వెబ్ డెస్క్ : బిగ్నీ రెకెట్ ఓ యాత్రా ఔత్సాహికుడు. ప్రపంచయానం చేయాలనే ఉద్దేశంతో 2014లో అమెరికాను వదిలి ఇండియాకు వచ్చాడు. అక్కడి నుంచి పోలెండ్ వెళ్లేందుకు చిన్న పడవను కొనుగోలు చేశాడు. దానికి మరమ్మత్తులు చేయించి హిందూ మహా సముద్రంలో తన ప్రయాణాన్ని ఆరంభించాడు. అలా ప్రయాణం మొదలు పెట్టిన రెకెట్ పడవ సముద్ర జలాల ఉరవడికి దారి తప్పి మొజాంబిక్ దేశానికి చేరువలో గల కొమొరోస్ ఐలాండ్కు చేరింది. దీంతో అక్కడి నుంచి దక్షిణాఫ్రికా చేరుకుందామని భావించాడు రెకెట్. మొజాంబిక్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే రూటు వాణిజ్య నౌకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ మార్గంలో నీటి ఉధృతి కూడా అధికమే. ఆ మార్గంలో ప్రయాణించడం రెకెట్కు పెను సవాలుగా మారింది. నీటి వేగానికి అదుపుతప్పిన పడవ హిందూ మహా సముద్రంలో తప్పిపోయింది. దాదాపు ఏడు నెలలుగా సముద్రంలోనే ఉండిపోయారు. ఈ సమయంలో కేవలం చైనీస్ సూప్, చేపలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ప్రాణం నిలుపుకుంటూ వచ్చారు. రెకెట్ ఒంటరి ప్రయాణంలో తోడుగా నిలిచింది ఆయన పెంపుడు పిల్లి. దారి తప్పి తమ జలాల్లోకి వచ్చిన రెకెట్ను ఫ్రెంచ్ కోస్ట్ గార్డు సైనికులు రక్షించారు. ఏడు నెలలు సముద్రంలో తప్పిపోవడంపై మాట్లాడిన రెకెట్.. ఎన్నోసార్లు భూ భాగం కళ్ల ముందు కనిపించినా అక్కడకు పడవను మళ్లించలేని పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ సమయంలో రెండు వేల కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసినట్లు వెల్లడించారు. చైనీస్ సూప్, వేటాడిన చేపలను తింటూ బతికినట్లు తెలిపారు. రెకెట్కు వైద్య పరీక్షలు చేయించిన ఫ్రెంచ్ కోస్ట్ గార్డు మాల్న్యూట్రిషన్ మినహా ఆయనకు ఎలాంటి సమస్యా లేదని పేర్కొంది. -
హిందూ మహాసముద్రం కోసమే చైనా కయ్యం
బీజింగ్ : భారత్-చైనాల మధ్య డోక్లాం తరువాత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎన్ఎస్జీ, ఒన్బెల్ట్ ఒన్రోడ్, వంటి వివాదాలు ఇరు దేశాల మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో చైనా సంబంధాలను మరీ బలోపేతం చేసుకోవడం కూడా భారత్ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య హిందూమహాసముద్రం వేదికగా మరిన్ని కొత్త వివాదాలు ఏర్పడనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్, చైనా మధ్య హిమాలయాలకంటే అధికంగా హిందూ మహాసముద్రమే వివాదాలకు, ఒకరకంగా చెప్పాలంటే యుద్ధానికి కూడా కారణమవుతుందని చైనాకు చెందిన ప్రముఖ విశ్లేషకుడు బ్రెర్టిల్ లిన్టర్ చెబుతున్నారు. బ్రెటిల్ తాజాగా రచించిన ‘చైనాస్ ఇండియా వార్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలను కలుపుతూ చైనా నిర్మిస్తున్న ఒన్బెల్ట్ ఒన్రోడ్, సిల్క్ రోడ్లు ఇందుకు కారణంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. సముద్రంపై చైనా అసక్తి చైనా దాదాపు 60 ఏళ్లుగా హిందూ మహాసముద్రంపై పట్టు సాధించలేదు. అయితే ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంతో పాటు.. హిందు మహాసముద్రంపై చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హిమాలయాలకన్నా.. చైనాకు ఇప్పుడు హిందూమహాసముద్రమే చాలా విలువైంది. 1959లో యుద్ధం జరగాల్సింది! భారత్పై చైనా 1959లోనే యుద్ధం చేయాలని భావించినట్లు ఆయన తన పుస్తకంలో తెలిపారు. అయితే భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ.. సరిహద్దు సమస్యలపై చైనాతో చర్చించడంతో యుద్ధాన్ని వాయిదా వేసుకుంది. అయితే 1962లో మాత్రం చైనా యుద్ధానికి దిగింది. -
ఆపరేషన్ చైనా
హిందూ మహాసముద్రం మీద చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెరికా నుంచి డ్రోన్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డ భారత్.. పూర్తిగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో నేవీ బలగాన్ని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీ : హిందూ మహాసముద్రంపై నౌకా వాణిజ్యానికి చాలా కీలకం. భారత్-చైనాలు హిందూ మహాసముద్రంపై ఆధిపత్యంకోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాయి. తాజాగా భారత్.. ఇండియన్ ఓషియన్ రీజియన్లో తన నేవీ బలగాలను మరింత శక్తివంతం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి మలాకా జలసంధి వరకూ.. 24 గంటలు పహారా కాసేలా.. యుద్ధనౌకలను ఏర్పాటు చేస్తోంది. సముద్ర జలాల నుంచి ఉగ్రవాదులు ఎక్కడైనా.. ఎప్పుడైనా విరుచుకుపడొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతోనే నేవీని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది. 24 X 7.. పహారా హిందూ మహాసముద్రంలో ప్రతిక్షణం కాపు కాసేందుకు 12 నుంచి 15 డెస్ట్రాయర్లు, భారీ, చిన్నపాటి యుద్ధనౌకలు, గస్తీ నౌకలను ఏర్పటు చేశారు. అంతేకాక నావల్ శాటిలైట్ అయిన జీశాట్-7తో అంతరిక్షణం నుంచి ప్రతిక్షణం పరిశీలన చేయనున్నారు. మిషన్ రెడీ వార్షిప్స్ పేరుతో ఇండియన్ నేవీ హిందూ మహాసముద్రాన్ని దాదాపు తన అదుపులోకి తీసుకున్నట్లేనని సీనియర్ నేవీ అధికారులు చెబుతున్నారు. పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఏడెన్, మలాకా జలసంధి వరకూ.. 24 గంటలే ఇండియన్ నేవీ గస్తీ కాస్తుందని.. ఏ చిన్న సహాయం, ఇతర అవసరాలు ఏర్పడ్డా నేవీ అధికారులు వేగంగా స్పందిస్తారని అధికారులు చెబుతున్నారు. అన్ని వైపులా..! శివాలిక్ తరగతికి చెందిన యుద్ధవిమానం బంగాళాఖాతంలో.. బంగ్లాదేశ్, మయన్మార్లవైపు గస్తీ కాస్తోంది. అలాగే టెగ్ తరగతికి చెందిన మరో యుద్ధ విమానం మడగాస్కర్, మారిషస్ చుట్టూ పహారా కాస్తోంది. ఐఎన్ఎస్ త్రిషూల్.. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, కోరో యుద్ధ నౌక అండమాన్ సముద్రంలో గస్తీ కాస్తున్నాయి. చైనాకు అడ్డుకట్ట చైనా యుద్ధ నౌకలు, సభమెరైన్స్ కొన్నేళ్లనుంచీ తరుచుగా హిందూమహాసముద్ర జలాల్లోకి వచ్చి వెళుతున్నాయి. ఈ మధ్యే న్యూక్లియర్ సబ్మెరైన్స్ సైతం ఈ జలాల్లో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత నేవీ దళాలు.. పూర్తిస్థాయిలో హిందూ మహాసముద్రంపై గస్తీ తిరుగుతంటే.. చైనా నౌకలు ఇటు వచ్చే అవకాశం ఉండదు. మరింత బలొపేతం! ప్రస్తుతం ఇండియన్ నేవీ వద్ద 138 యుద్ధనౌకలు, 235 ఎయిర్క్రాఫ్ట్ , హెలీకాప్టర్లు ఉన్నాయి. 2027 నాటికి వీటి సంఖ్యను భారీగా పెంచేందుకు నేవీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా యుద్ధ నౌకలను 212కు, హెలీకాప్టర్లను 458 పెంచుకోవాలని.. నేవీ అధికారులు భావిస్తున్నారు. -
చైనాకు శ్రీలంక షాక్.. భారత్ కోరిక తీరింది
-
చైనాకు శ్రీలంక షాక్.. భారత్ కోరిక తీరింది
కొలంబో: ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె నేతృత్వంలోని శ్రీలంక కేబినేట్ చైనాకు షాకిచ్చింది. శ్రీలంకలోని హంబన్తోటలో చైనా ఓడరేవును నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. హిందూ మహాసముద్రంలో జలరవాణా జరిగే అత్యంత కీలకమైన ప్రదేశంలో చైనా ఓడరేవును నిర్మించడానికి సిద్ధపడటంతో భారత్, జపాన్, అమెరికాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. తమకు భద్రతాపరమైన సవాళ్లు ఉంటాయని చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని మరోమారు పరిశీలించుకోవాలని ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు స్ధానిక ప్రజల నుంచి కూడా చైనా విషయంలో శ్రీలంక ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. దీంతో ఓడరేవు ఒప్పందాన్ని రివ్యూ చేసిన శ్రీలంక కేబినేట్.. ఓడరేవుపై చైనాకు ఉండబోయే విస్తృతమైన అధికారాలకు కత్తెర వేసింది. దీంతో భారత్కు పొంచి ఉన్న పెను భద్రతా ముప్పు తప్పినట్లయింది. హంబన్తోట ఓడరేవు అంతర్జాతీయ జల మార్గాల దృష్ట్యా అత్యంత కీలకమైనది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ పోర్టును నిర్మించేందుకు చైనా ముందుకు వచ్చింది. నిర్మాణానికి భారీ మొత్తంలో వెచ్చిస్తుండటంతో రేవులో 80 శాతం వాటా చైనాకు ఇచ్చేందుకు శ్రీలంక ఓకే చెప్పింది. ఇరు దేశాలు ఒప్పందపత్రాలపై సంతకాలు కూడా చేశాయి. ప్రజలు, సామాజిక కార్యకర్తల ఆందోళనలకు తలొగ్గిన శ్రీలంక కేబినేట్.. భద్రతా కారణాల దృష్ట్యా వాణిజ్యానికి సంబంధించి పోర్టులో జరిగే కార్యక్రమాల్లో చైనా అధికారాల పరిధిని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా హంబన్తోటలో మిలటరీ సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుపడదు. 2014లో హంబన్తోట ఓడరేవులో చైనా తన సబ్మెరైన్ను ఉంచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ విషయంపై భారత్, శ్రీలంకతో చర్చలు జరిపింది. ఈ ఏడాది మేలో మరోమారు సబ్మెరైన్ను ఓడరేవులో ఉంచుతామన్న చైనా ప్రతిపాదనను శ్రీలంక తిరస్కరించింది. శ్రీలంక కేబినేట్ ఆమోదించిన ప్రతిపాదన ఈ వారంలో ఆ దేశ పార్లమెంటు ముందుకు రానున్నట్లు కేబినేట్ అధికార ప్రతినిధి దయాసిరి జయశేఖర తెలిపారు. అయితే, ప్రతిపాదనలోని అంశాలను ఆయన వెల్లడించలేదు. శ్రీలంక కేబినేట్ నిర్ణయంపై చైనా అధికార ప్రతినిధిని ప్రశ్నించగా.. ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే, రహస్య సమాచారం ప్రకారం.. శ్రీలంక నిర్ణయానికి చైనా ఓకే చెప్పినట్లు తెలిసింది. -
దూసుకొచ్చిన చైనా యుద్ధనౌకలు
హిందూ మహా సముద్రంలో చక్కర్లు న్యూఢిల్లీ: ఒకవైపు సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం.. మరోవైపు భారత్-చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చైనా యుద్ధనౌకలు హిందూ మహాసముద్రంలో చక్కర్లు కొడుతుండటం కలకలం రేపుతోంది. చైనీస్ యుద్ధనౌకలు అనూహ్యరీతిలో భారత్కు ఆనుకొని ఉన్న హిందూమహాసముద్రంలో సంచరిస్తుండటం గమనార్హం. సిక్కిం సరిహద్దుల్లో నెలరోజులుగా ఇరుదేశాల ఆర్మీ మధ్య ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలతో ఇప్పుడున్న భారత్ 1962నాటి భారత్ కాదంటూ రక్షణమంత్రి జైట్లీ వ్యాఖ్యానించగా.. ఆయన ప్రకటనపై చైనా స్పందించింది. ‘జైట్లీ సరిగ్గానే చెప్పారు. 1962 కన్నా 2017నాటి భారతం భిన్నంగా ఉంది. ప్రస్తుత చైనా కూడా అప్పటి చైనా కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ సోమవారం హెచ్చరించారు. 1890 నాటి చైనా బ్రిటిష్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత ఆర్మీ మోసం చేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా తమ భూభాగంలోకి సైన్యం చొచ్చుకొచ్చిందని ఆయన ఆరోపించారు. వెంటనే భారత బలగాలను వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో భౌగోళిక సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చైనా అన్ని అత్యవసర చర్యలు చేపడుతుందని పరోక్షంగా యుద్ధానికైనా సిద్ధమనే సంకేతాలిచ్చారు. సిక్కిం ప్రాంతంలో భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దులు ముందుగా నిర్ణయించినట్లుగానే ఉన్నాయన్నారు. ‘మా భూభాగంలోకి ప్రవేశించటం, మా సైనికుల కార్యక్రమాలకు అడ్డుతగలటం ద్వారా అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో శాంతికి ఆటంకం కలిగిస్తోంది. వెంటనే భారత ఆర్మీ వెనక్కు వెళ్లిపోవాలి’ అని గెంగ్ అన్నారు. ‘సిక్కింపై 1890 నాటి చైనా–బ్రిటిష్ ఒప్పందాన్ని తొలి భారత ప్రధాని నెహ్రూ 1959లో నాటి చైనా ప్రధాని చౌ ఎన్లైకి రాసిన లేఖలో ఆమోదించారు. తర్వాతి భారత ప్రధానులందరూ దీన్ని గౌరవిస్తూనే వచ్చారు. కానీ ఈ మధ్య సిక్కిం సరిహద్దుల్లో భారత్ తీసుకున్న చర్య మోసపూరితం. డోకా లా చైనాకు సంబంధించిన ప్రాంతం. అందుకే భారత్ వెనక్కు వెళ్లిపోవాలి’ అని గెంగ్ హెచ్చరిక స్వరంతో తెలిపారు. అయితే దౌత్యపరంగా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. భూటాన్ను భారత్ రక్షణ కవచంలా వినియోగించుకుంటోందని గెంగ్ ఆరోపించారు. అవసరమైతే భూటాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల (భారత్) జోక్యం లేకుండా ఉండేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని గెంగ్ తెలిపారు. చైనాతో ఎటువంటి దౌత్యపరమైన సంబంధాల్లేని భూటాన్కు మిలటరీ పరంగా, దౌత్యపరంగా భారత్ రక్షణ పూర్తి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ టిబెట్ ప్రాంతమైన చుంబీ లోయపై ఆధిపత్యం ప్రదర్శించటం ద్వారా భారత–భూటాన్ సరిహద్దుల్లో జరిగే కార్యకలాపాలపై దృష్టిపెట్టాలని చైనా ప్రయత్నిస్తోందని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు. నెలాఖర్లో బీజింగ్కు దోవల్ భారత్–చైనా సరిహద్దు చర్చల ప్రత్యేక ప్రతినిధి అయిన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జూలై 26న బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏల సమావేశానికి హాజరుకానున్నారు. ఆ సమయంలోనే చైనా ఎన్ఎస్ఏ యాంగ్ జీచీతో సిక్కింపై చర్చించే అవకాశం ఉంది. చైనా సరిహద్దుల్లో ఉన్న సిక్కిం 1976లో భారత్లో అంతర్భాగమైంది. 1898లో చైనాతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సిక్కిం సరిహద్దులను నిర్ణయించారు. సిక్కింలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవటం.. మోదీ అమెరికా పర్యటనలో ట్రంప్ను ఆకట్టుకునేందుకేనని చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. -
పైరేట్స్ ఆఫ్ ది వరల్డ్
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సముద్రపు దొంగల బెడద సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఇటీవల కొన్నేళ్లుగా సముద్రపు దొంగల బెడద విపరీతంగా పెరిగిపోయింది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల అపహరణ, సిబ్బంది నిర్బంధం, సరుకుల దోపిడీ, దాడుల వార్తలు మళ్లీ నిత్యకృత్యంగా మారాయి. ప్రత్యేకించి ఈ నెల ఒకటో తేదీన భారతదేశానికి చెందిన సరుకుల నౌక మాందావిని పైరేట్లు అపహరించి, అందులోని 11 మంది సిబ్బందిని నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆ నౌక దుబాయ్ నుంచి యెమెన్ అల్ ముకాలా రేవుకు వెళుతుండగా సోమాలియా సమీపంలోని హోబ్యో వద్ద పైరేట్లు దాడి చేశారు. గత నెలలో ఏరిస్ 13 అనే చమురు నౌకను పుంట్లాండ్ తీరం నుంచి పైరేట్లు అపహరించుకుపోయారు. తాజాగా.. ఏడెన్ తీరంలో ఒక చైనా నౌకను పైరేట్ల దాడి నుంచి బయటపడటానికి భారత నౌకాదళ సిబ్బంది సాయం చేశారు. ఈ సముద్రపు దోపిడీలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ఈ ప్రమాదం విస్తరిస్తోంది. పైరేట్ల ముప్పు తీవ్రంగా ఉన్న పది ప్రాంతాలివీ... ► మలక్కా జలసంధి: హిందూ మహాసముద్రంలో ఉన్న మలక్కా జలసంధి వద్ద పైరేట్ల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఇది భారత్ – చైనా సముద్రయాన మార్గాల్లో చాలా ముఖ్యమైనదే కాదు.. సూయిజ్ కెనాల్, ఈజిప్ట్, యూరప్ల వాణిజ్యయాన గవాక్షం కూడా. ► దక్షిణ చైనా సముద్రం: దక్షిణ చైనా సముద్రంలో మలేసియన్లు, ఇండోనేసియన్లు పైరసీకి పాల్ప డుతున్నారు. వారిని అత్యంత ప్రమాదకరమైన వారిగా పరిగణిస్తారు. మలేసియా జలాల్లో ప్రధానంగా దోపిడీలు జరుగుతుండటం ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారింది. ► ఏడెన్ సింధుశాఖ: ఎర్ర సముద్రానికి గవాక్షమైన ఏడెన్ సింధుశాఖలో కూడా పైరేట్ల బెడద చాలా ఎక్కువ. సూయిజ్ కెనాల్కు దారితీసే ముఖ్యమైన వాణిజ్య మార్గంలో ఉన్న ప్రాంతమిది. భౌగోళికంగా సోమాలియాకు దగ్గరగా ఉండటంతో ఆ దేశపు పైరేట్లు ఇక్కడ బీభత్సం సృష్టిస్తున్నారు. ► గినియా సింధుశాఖ: వాయవ్య – దక్షిణ ఆఫ్రికా (అంగోలా)లో చాలా భాగం విస్తరించి ఉన్న గినియా సింధుశాఖ యూరప్ దేశాలు, అమెరికా దేశాలకు చమురు రవాణా చేసే చాలా ముఖ్యమైన మార్గం. దీంతో ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే నౌకలపై పైరేట్ల ఆగడాలు పెరుగుతున్నాయి. ► బెనిన్: ఆఫ్రికాలోని బెనిన్ ప్రాంతం కూడా సముద్రపు దొంగల దాడుల ప్రమాదం ఎక్కువగా ఉండే జాబితాలో చేరింది. అంతర్జాతీయ సముద్రయాన సంస్థలు ఇక్కడ పైరసీని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నా ఇంతవరకూ సానుకూల ఫలితాలు కనిపించలేదు. ► నైజీరియా: ఆఫ్రికా పశ్చిమ ప్రాంతాన గల నైజీరియాను.. సముద్రపు దొంగల దాడులకు మరో కేంద్రంగా పరిగణిస్తున్నారు. దీనిని సముద్ర వాణిజ్య రవాణాకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా జాబితాలో చేర్చారు. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం నుంచి సరుకుల రవాణా చేయాలంటే.. ఆ సరుకులకు బీమా కవరేజీ చాలా ఎక్కువగా చేయించాల్సిన పరిస్థితి. ► సోమాలియా: సోమాలియాలో సముద్రపు దోపిడీలు అత్యధికం. ఈ దేశంలో అంతర్యుద్ధం, ప్రభుత్వ అసమర్థతల వల్ల ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతుండటంతో పాటు సోమాలియా సముద్ర జలాల్లో సముద్ర వ్యర్థాలు భారీ స్థాయిలో ఉండటం కూడా ఇక్కడ పైరసీ భారీగా ఉంటోంది. ఈ మార్గం గుండా ప్రయాణించే సరుకులకు బీమా చేయడానికి కూడా భారీ మొత్తం చెల్లించాల్సిందే. ► ఇండోనేసియా: ఇండోనేసియాలో కూడా పైరసీ అధికంగా ఉంది. అనాంబాస్, నాటునా, మెరుండుంగ్ తదితర దీవులను పైరేట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక్కడ రాత్రి పూట దాడులు చేయడం ఎక్కువ. ► అరేబియా సముద్రం: అరేబియా సముద్రంలోని ఒమన్ సింధుశాఖ వద్ద పైరేట్ల తాకిడి ఎక్కువ. ఏడెన్ సింధుశాఖ, సోమాలీ తీరాలతో పోలిస్తే ఇక్కడ అంతర్జాతీయ సముద్ర సంస్థలు కల్పించే భద్రత తక్కువ కావడం కూడా దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. ► హిందూ మహాసముద్రం: సోమాలియా పైరేట్లు హిందూ మహాసముద్ర జలాల్లో దాడులకు పాల్పడుతున్నారు. సరకు నౌకలకు ఇది ప్రధానమార్గం కావడంతో.. ముఖ్యంగా భారతదేశపు నౌకలు, ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే ఇతర దేశాల నౌకలనూ లక్ష్యంగా చేసుకుంటున్నారు. -
ఆ విమానం ఆచూకీ ఎప్పటికీ మిస్టరీయే
కౌలాలంపూర్: మూడేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 ఆచూకీ ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోనుంది. ఈ విమానం ఆచూకీ కోసం హిందూ మహాసముద్రంలో చేపట్టిన గాలింపు చర్యలను నిలిపి వేయాలని నిర్ణయించారు. దీంతో ఎంహెచ్ 370 జాడ గుర్తించకుండానే ఆపరేషన్ ముగిసింది. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతికను ఉపయోగించుకుని, నిపుణులు సలహాలు తీసుకుని సముద్రంలో విస్తృతంగా గాలించామని, అయితే విమానం ఆచూకీ తెలుసుకోలేకపోయామని ఆస్ట్రేలియాలోని జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకటించింది. 2014 మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. బయల్దేరిన కొద్ది సేపటికే ఆ విమానం సముద్రంలో కూలినట్లు అప్పట్లో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. ఈ విమానం ఆచూకీ కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నౌకా దళాలు గాలించాయి. భారత్కు చెందిన సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయినా ఫలితం లేకపోయింది. గతంలో కనబడకుండా పోయిన విమానాలు, ఓడల్లాగా ఇది కూడా ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. -
'ఆ శకలం ఎంహెచ్ 370 విమానానిదే'
కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో లభించిన మరో శకలం ఎంహెచ్ 370 విమానానిదిగా నిర్థారణ అయినట్టు మలేషియన్ ప్రధానమంత్రి నజీబ్ రజక్ వెల్లడించారు. అయితే ఈ శకలాన్ని పరీక్షల నిమిత్తం దానిని ఫ్రాన్స్ కు పంపిన సంగతి తెలిసిందే. ఆదివారం కనుగొన్న ఆ శకలం.. రీయూనియన్ ద్వీప రాజధాని సెయింట్ డెనిస్ నగరంలో దొరికింది. మొదట దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదేనని, ఏడాదిన్నర కిందట అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం కూడా ఇదే రకానికి చెందినదని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ రెండు శకలాలూ ఎంహెచ్ 370వే అయివుంటాయనే తొలుత భావించారు. కాగా, అదృశ్యమైన విమానంపై దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా.. దొరికిన శకలం ఎమ్హెచ్ 370 విమానానిదైనా.. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని పేర్కొంది. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. -
ఆ శకలం బోయింగ్దే!
హిందూ మహాసముద్రంలో దొరికిన శకలంపై మలేసియా కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలో దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదేనని మలేసియా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దీంతో ఏడాది కిందట అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన బోయింగ్ రకానికి చెందిన ఎమ్హెచ్ 370 విమానానికి సంబంధించిన శకలం అదేనని అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇటీవల హిందూ మహాసముద్రంలోని రినియన్ ద్వీపం వద్ద దొరికిన విమాన శకలం బోయింగ్ 777 రకానికి చెందినదేనని మలేసియా ఉప రవాణా మంత్రి అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీపై దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారికి కూడా ఈ విషయం తెలిపామన్నారు. రినియన్ ద్వీపానికి ఒక బృందాన్ని పంపుతామని, ఆ శకలం ఎమ్హెచ్ 370కి సంబంధించినదా... కాదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తెలుస్తుందని తెలిపారు. ఇప్పటివరకైతే ఆ శకలం ఎమ్హెచ్ 370 దేనని నిర్ధారణ కాలేదన్నారు. విమాన ఆచూకీపై ఫ్రాన్స్ సంస్థతో తాము సేకరించిన సమాచారం పంచుకుంటామని చెప్పారు. మరింత కచ్చితమైన ఆధారాలు లభించకుండా దొరికిన శకలం ఎమ్హెచ్ 370 దేనని చెప్పడం తొందరపాటు చర్య అవుతుందన్నారు. మరోవైపు దొరికిన శకలంపై ఉన్న 637 బీబీ నంబర్.. బోయింగ్ విమానానిదేనని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, అదృశ్యమైన విమానంపై దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా.. దొరికిన శకలం ఎమ్హెచ్ 370 విమానానిదైనా.. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని పేర్కొంది. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. కాగా, ఇన్నాళ్లుగా గాలిస్తున్నా అదృశ్యమైన విమానానికి సంబంధించి ఏలాంటి ఆధారాలను దర్యాప్తు అధికారులు కనుక్కోలేకపోయారు. -
సముద్రంపై సత్తాకు మోదీ సర్కార్ యోచన
న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రంపై తన గుత్తాధిపత్యాన్ని, నావికా బలగంలో తన సత్తాను భారత్ ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటుంది. ఇందుకోసం ప్రపంచ అగ్ర రాజ్యాలైన అమెరికా, జపాన్తో కలిసి సంయుక్తంగా సముద్రంపై ప్రత్యేక యుద్ధక్రీడను నిర్వహించనుంది. గతంలో ఎనిమిదేళ్ల కిందట చైనా ఇలాంటి డ్రిల్ డ్రిల్ చేసింది. ఇటీవల కాలంలో హిందూమహాసముద్రం నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ సముద్రంపై పరోక్షంగా ఆధిపత్యం చెలాంయించేందుకు చైనా పోటీదారుగా భారత్ నిలుస్తోంది. అటు భూసరిహద్దు విషయంలోను చైనా వ్యవహారం శృతిమించుతున్న నేపథ్యంలో పరోక్షంగా భారత్ సత్తాను చూపించాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో సముద్ర తలంపై మోదీ సర్కార్ భారత నౌకా విభాగంతో భారీ యుద్ధ క్రీడను నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్, అమెరికా, జపాన్ మిలటరీ అధికారులు జపాన్లోని యోకోసుకా అనే నేవీ స్థావరం బుధవారం, గురువారం రెండు రోజులపాటు చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. భారీ స్థాయిలో ఈ ఎక్సర్సైజ్ మూడు దేశాలు ఉమ్మడిగా నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
విమానం కోసం 'రెండింతల' గాలింపు!
కౌలాలంపూర్:ఎమ్ హెచ్ 370.. మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం. మార్చి 8, 2014న ఐదుగురు భారతీయులతో సహా 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరిన ఆ విమానం అదృశ్యమై సంవత్సరం పైగా కావొస్తున్నా.. ఇప్పటి వరకూ ఆచూకీ అయితే లేదు. ఎమ్ హెచ్ 370 విమాన అదృశ్య ఘటనకు సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తున్నా.. ఆ విమాన జాడ కనిపెట్టేందుకు మలేషియా ప్రభుత్వం మాత్రం తమ కార్యాచరణను యథావిధిగా కొనసాగిస్తోంది. విమాన శకలాలను కనుగొనేందుకు ప్రపంచ దేశాల సహాయం తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యంగా మిగలడంతోమరో అడుగు ముందుకేయాలని యత్నాలు చేస్తోంది. ఇప్పటివరకూ దక్షిణ హిందూ మహా సముద్రంలో అరవై వేల చదరపు కిలోమిటర్ల మేర విమాన ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో.. అదనంగా మరో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర అన్వేషణ చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ విమాన ఆచూకీ మే నెల లోపు దొరకపోతే మాత్రం ఈ మేరకు ప్రయాత్నాలు చేపట్టాలని మలేషియా యోచిస్తోంది. అందుకు మలేషియాతో పాటు ఆస్ట్రేలియా, చైనాలు మరోసారి భాగస్వామ్యం కావడానికి సన్నద్ధమవుతున్నాయి. -
కన్నీళ్లకు పదేళ్లు
-
ఎమ్హెచ్ 370 కోసం మళ్లీ వేట
మెల్బోర్న్: ఆరునెలల కిత్రం గల్లంతైన ఎమ్హెచ్ 370 మలేసియా విమానం కోసం మరోసారి వేట ప్రారంభకానుంది. అందుకోసం రెండు నౌకలు రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఆ రెండు నౌకలు వేర్వేరుగా బంగాళాఖాతంలో అణువణువు జల్లెడ పట్టనున్నాయి. ఫీనిక్స్ నౌక రేపు పశ్చిమ ఆస్ట్రేలియా తీరం నుంచి ప్రారంభంకానుంది. అలాగే మరో నౌక ఫుగ్రో డిస్కవరీ కూడా తన పని ప్రారంభించి అక్టోబర్ మాసం చివరినాటికి సముద్రం అడుగుభాగంలో పూర్తిగా తనిఖీ చేసి నివేదిక అందించనుంది. అయితే శాటిలైట్ నివేదిక ఆధారంగా విమానం దక్షిణ ప్రాంతంలోనే అదృశ్యమైన నేపథ్యంలో... ఆ ప్రాంతంలోనే గాలింపు చర్యలు తీవ్రతరం చేయనున్నారు. ఇప్పటికే మలేసియా ప్రభుత్వం నౌకలతో ఒప్పందం కుదుర్చుకుంది. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే న్యూజిలాండ్లో విమాన ప్రమాదాలపై విచారణాధికారి ఇవాన్ విల్సన్ 'గుడ్ నైట్ మలేసియా 370: ద ట్రూత్ బిహైండ్ ద లాస్ ఆఫ్ ఫ్లైట్ 370' పేరిట ఓ పుస్తకం రాశాడు. అందులో ఎమ్హెచ్ 370 పైలట్ కెప్టెన్ జహీర్ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకున్నాడని అందువల్లే ఆ విమానం గల్లంతైందని పేర్కొన్నారు. విమానంపై సస్పెన్స్ కు తెరదించాలని స్థానిక ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. , దీంతో మలేసియా విమానం ఆచూకీ కోసం నౌకలు రంగంలోకి దిగాయి. -
సముద్రంలో 122 ‘విమాన శకలాలు’
ఫ్రాన్స్ శాటిలైట్ చిత్రాల్లో గుర్తింపు కౌలాలంపూర్/పెర్త్: గల్లంతైన మలేసియా విమానం ఆచూకీ తెలుసుకోవడానికి అత్యంత విశ్వసనీయ ఆధారాలు దొరికాయి. దీని శకలాలుగా భావిస్తున్న 122 వస్తువులు దక్షిణ హిందూ మహాసముద్రంలో కనిపించాయి. ఫ్రాన్స్ ఉపగ్రహం వీటిని ఆదివారం గుర్తించి ఫొటోలు తీసింది. ఆస్ట్రేలియాలోని పెర్త్కు 2,557 కి.మీ దూరంలో వీటి ని గుర్తించినట్లు మలేసియా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ బుధవారం తెలిపారు. ‘400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 122 వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక మీటరు నుంచి 23 మీటర్ల సైజులో ఉంది. కొన్ని ప్రకాశవంతంగా కనిపిస్తుడడంతో అవి దృఢపదార్థాలతో తయారై ఉండొచ్చని భావిస్తున్నాం. ఇవి ఇదివరకు చైనా, ఆస్ట్రేలియాలు.. శకలాలుగా భావిస్తున్న వస్తువులను గుర్తించిన చోటికి సమీపంలోనే ఉన్నాయి. ఇవి బోయింగ్వని భావించొచ్చు. కానీ కచ్చితంగా చెప్పలేం. నిర్ధారణ అయ్యాక తర్వాతి దశ గాలింపు మొదలుపెడతాం’ అని అన్నారు. మరోపక్క.. శకలాల కోసం గాలిస్తున్న విమానాలకు నీలిరంగు వస్తువు సహా మూడు వస్తువులు కనిపించాయి. మలేసియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఈ నెల 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతవడం, అది దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని మలేసియా ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. కాగా, మలేసియా ఎయిర్లైన్స్, బోయింగ్ కంపెనీలు కోట్లాది డాలర్ల పరిహారంతో ముడిపడిన దావాలో చిక్కుకున్నాయి. ఈ విమానం డిజైన్, కూలిపోయేందుకు దారి తీసిన లోపాల వివరాలివ్వాలని షికాగోలోని ఒక లా సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. -
అవి మలేషియా విమాన శకలాలేనా?
మలేషియా విమానం ఆస్ట్రేలియాకి దగ్గర్లో సముద్రంలో కుప్పకూలిపోయిందనడానికి మరిన్ని ఆధారాలు దొరికాయి. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్తలు తమ ఉపగ్రహ చిత్రాలలో ఆస్ట్రేలియాకి దాదాపు 2500 కి.మీ దూరంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో సముద్రంలో పలు శకలాలు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ చిత్రాలను వారు మలేషియా ప్రభుత్వపు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి అందచేశారు. ఈ ఉపగ్రహ చిత్రాల్లో దాదాపు 122 వస్తువులు కనిపించాయి. ఇందులో కొన్ని వస్తువులు దాదాపు 23 మీటర్ల పొడవున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మలేషియన్ ప్రభుత్వం దక్షిణ హిందూ మహాసముద్రంలోనే విమానం కుప్పకూలినట్టు ప్రకటించింది. మరో వైపు సముద్రంలో జాడ తెలియకుండా పోయిన విమానం తాలూకు బ్లాక్ బాక్సును కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బ్లాక్ బాక్స్ ను కనుగొనేందుకు అమెరికా నుంచి నిపుణులు మలేషియా వచ్చారు. మామూలుగా బ్లాక్ బాక్సులు 30 రోజుల వరకూ పనిచేస్తాయి. వాటి బ్యాటరీల చార్జింగ్ అప్పటి వరకూ పనిచేస్తుంది. వాటికి అండర్ వాటర్ లోకేటర్ బీకన్లు అమర్చి ఉంటాయి. ఇవి నీటి అట్టడుగున 14000 అడుగుల లోతున ఉన్నా సందేశాలు పంపగలుగుతాయి. అయితే ఇప్పటికే విమానం నీట మునిగి 17 రోజుల, 13 గంటల, 49 నిమిషాలు అయింది. అంటే ఇంకా పదకొండు రోజుల్లో బ్లాక్ బాక్సును కనుగొనలేకపోతే అది శాశ్వతంగా దొరకకుండా పోతుందన్నమాట. ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా బ్లాక్ బాక్సులో విమాన ప్రయాణ కాలంలో కాక్ పిట్ లో జరిగిన సంభాషణలను రికార్డు చేస్తాయి. దీని ఆధారంగా అసలేం జరిగిందో అంచనా వేయడానికి వీలుంటుంది. -
ఆ విమానం హిందూమహాసముద్రంలోనే కూలిందా?
పది రోజులకు పైగా కనిపించకుండా పోయిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం హిందూ మహాసముద్రంలో ఉందన్న తాజా వాదన ఒకటి తెరమీదకు వచ్చింది. 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయల్దేరిన ఈ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్న విషయం తెలిసిందే. వీరి క్షేమ సమాచారం ఏదీ ఇంతవరకు అందకపోవడంతో ప్రయాణికుల బంధుమిత్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈనెల 8వ తేదీన బయల్దేరిన ఈ విమానం ఇప్పుడు బహుశా హిందూ మహా సముద్రంలో దక్షిణ దిశగా ఉండొచ్చని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న మలేషియన్ అధికార వర్గాలు ఇప్పుడు భావిస్తున్నాయి. అది దక్షిణ దిశగానే వెళ్లిందని, ఇండోనేసియాకు దక్షిణ దిశ నుంచి ఆస్ట్రేలియాకు పశ్చిమదిశగా హిందూ మహాసముద్రంలో కూలిపోయి ఉండొచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆసియా వైపు వెళ్తే మాత్రం అత్యంత శక్తిమంతమైన భారత్, చైనా రాడార్ల దృష్టిని కన్నుగప్పి ప్రయాణం చేసే అవకాశం లేనే లేదని దర్యాప్తు అధికారులు గట్టిగా చెబుతున్నారు. చైనా సరిహద్దుల్లో అత్యంత శక్తిమంతమైన సైనిక రాడార్లున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా ఆధీనంలో ఇవి పనిచేస్తాయి. అలాగే, భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు కూడా అత్యంత సున్నితమైనది కావడంతో అక్కడ సైతం సైనిక పర్యవేక్షణ చాలా పటిష్ఠంగా ఉంటుంది. ఇటువైపు నుంచి ఒక జెట్ విమానం వెళ్లడం, దాన్ని ఏ దేశం వాళ్లూ గుర్తించలేకపోవడం అనేది అసాధ్యమేనని ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. పైపెచ్చు, విమానం నుంచి ఏ సిగ్నల్ వెళ్లినా.. దాన్ని కచ్చితంగా గుర్తించే పరిజ్ఞానం ఉందని, అందువల్ల అది హిందూ మహాసముద్రంలో కూలిపోయే ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.