International Flights
-
మరో రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులు
శంషాబాద్ (హైదరాబాద్): హైదరాబాద్ నుంచి మరో రెండు అంతర్జాతీయ గమ్యస్థానాలకు త్వరలోనే విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. వియత్నాంలోని చిమిన్హ్ నగరం నుంచి.. హైదరాబాద్కు వారంలో రెండు విమాన సర్వీసులు నడపనున్నట్లు వీయెట్జెట్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. మార్చి 18 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి మంగళ, శనివారాల్లో ఈ సర్వీసులుంటాయి. దీంతో పాటు బెంగళూరు నగరం నుంచి కూడా హో చిమిన్హ్ నగరానికి కూడా సోమ, బుధవారాల్లో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ సమయంలో విమాన ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కూడా ప్రకటించింది. ఫుకెట్కు నేరుగా..: ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ కూడా.. త్వరలోనే హైదరాబాద్ నుంచి థాయ్లాండ్లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వీటికి సంబంధించిన బుకింగ్లు కూడా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. -
డబ్బు లేకపోయినా ఫ్లైట్ బుకింగ్.. వినూత్న ఆఫర్
ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్ మేక్మైట్రిప్ (MakeMyTrip) దేశంలో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. విమానాల్లో విదేశాలకు (international flights) వెళ్లేవారికి పార్ట్ పేమెంట్ (part payment) ఆప్షన్ను ప్రవేశపెట్టింది. మొత్తం ఛార్జీలో తొలుత 10 నుండి 40 శాతం మధ్య చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా టికెట్ బుక్ చేసిన 45 రోజుల్లోగా పూర్తి చేయాలి.పార్ట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకునే కస్టమర్లు చార్జీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత నిబంధనల ప్రకారం ధృవీకరించిన బుకింగ్లను సవరించుకోవచ్చని మేక్మైట్రిప్ తెలిపింది. ‘పెద్ద కుటుంబాలు, బృందాలు ఒకేసారి మొత్తం టికెట్ చార్జీని చెల్లించడం భారం అవుతుంది. అటువంటి వారికి పార్ట్ పేమెంట్ ఆప్షన్ సౌకర్యవంతంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది’ అని కంపెనీ సీవోవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.కాగా, ఎక్కువ మందిని అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సహించేందుకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ దోహద పడుతుందని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. ‘ఇటువంటి సౌకర్యంతో విమానయాన సంస్థలకు క్యాష్ రొటేషన్ అవుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది’ అని వివరించారు. ఈ కొత్త ఫీచర్ సుదూర, స్వల్ప-దూర అంతర్జాతీయ విమానాలను, ముఖ్యంగా రూ. 1 లక్షకుపైగా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులను ఆకట్టుకుంటోందని కంపెనీ పేర్కొంది. దీనిపై సానుకూల ప్రారంభ స్పందన వచ్చిందని చెప్పిన కంపెనీ ఈ ఫీచర్ కస్టమర్లకు ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తోంది.ఇలా పని చేస్తుందంటే..కొత్తగా ప్రవేశపెట్టిన పార్ట్ పేమెంట్ ఆప్షన్ మొత్తం ఛార్జీలో కేవలం 10-40% ముందుగా చెల్లించడం ద్వారా నిర్ధారిత బుకింగ్లను పొందేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. ఖచ్చితమైన శాతం విమానయాన సంస్థ, ప్రయాణ మార్గం, బుకింగ్ విండో వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా బుకింగ్ చేసిన 45 రోజులలోపు, ఏది ముందు అయితే అది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. పూర్తి చెల్లింపు చేసిన తర్వాత, వినియోగదారులు ఛార్జీల నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన బుకింగ్లను సవరించవచ్చు.ఇది కాకుండా జీరో క్యాన్సిలేషన్, ఫేర్ లాక్ ఫీచర్లతో పాటు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును కూడా మేక్మైట్రిప్ కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు బయలుదేరడానికి రెండు గంటల ముందు వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
మరో 25 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ/ముంబై: దేశీయ విమానయాన సంస్థల విమానాలకు బాంబు బెదిరింపులు ఆగేలా కనిపించడం లేదు. శుక్రవారం మరో 25కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బాంబులు పెట్టామని, పేల్చాస్తామంటూ బెదిరింపులు అందాయి. పూర్తి తనిఖీల అనంతరం ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఉత్తుత్తి బెదిరింపులేనని అధికారులు తేల్చారు. కోజికోడ్–దమ్మమ్ (సౌదీ)సర్వీసు సహా మొత్తం ఏడు విమానాలకు హెచ్చరికలు అందాయని ఇండిగో సంస్థ తెలిపింది. విస్తారా, స్పైస్జెట్ సంస్థలకు చెందిన ఏడేసి విమానాలు, ఎయిరిండియాకు చెందిన ఆరు విమానాలకు బెదిరింపులు అందినట్లు సమాచారం. దీంతో, గత 12 రోజుల్లో 275కు పైగా విమానాలకు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా బాంబు హెచ్చరికలు అందాయి. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు సహకరించాల్సిందిగా కేంద్రం ఎక్స్, మెటా నిర్వాహకులను కోరింది. -
ఈసారి 95 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్కతా–హైదరాబాద్, కోల్కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది.మెటా, ఎక్స్లను సమాచారం కోరిన కేంద్రంవిమానాలకు బాంబు బెదిరింపులు కొనసా గుతుండటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజా సంక్షేమంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో పలు విమానయాన సంస్థలకు పదేపదే అందుతున్న బెదిరింపు హెచ్చరికలకు సంబంధించిన పూర్తి డేటాను అందజేయాలని సామాజిక మాధ్యమ వేదికలైన మెటా, ఎక్స్లను కోరింది. -
మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: ముంబై నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవా రం బాంబు బెదిరింపులు రావడంతో భద్ర తా సంస్థలు ఉలిక్కిపడ్డాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమా నంతో పాటు మస్కట్ (ఒమన్), జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తున్న రెండు ఇండిగో విమా నాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చా యి. న్యూయార్క్ బయలుదేరని విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఇండిగో విమానాలకు టేకాఫ్కు ముందే బెదిరింపులు రావడంతో భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ బేలకు తరలించారు. ఢిల్లీకి దారి మల్లించిన ఎయిర్ ఇండియా విమానంలో 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను దింపేసి.. క్షుణ్ణంగా తనిఖీ చేశామని, విమానం లోపల ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 14న ముంబై నుంచి జేఎఫ్ కెనడీ విమానా శ్రమయానికి వెళ్తున్న ఏఐ 119 విమానానికి నిర్దిష్ట భద్రతా హెచ్చరికలు అందాయని, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీకి మళ్లించామని ఎయి రిండియా ఒక ప్రకటనలో తెలిపింది. -
విమాన సంస్థల వేసవి షెడ్యూల్ విడుదల
ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. మార్చి 31 నుంచి అక్టోబర్ 26 వరకు 2024 ఏడాదికిగాను సమ్మర్ షెడ్యూల్ను ప్రకటించాయి. దేశీయంగా ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించాయి. గతంతో పోలిస్తే ఇది 6 శాతం అధికమని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ వెల్లడించింది. ఇండిగో, ఎయిరిండియా, విస్తారాలు అత్యధికంగా విమాన సర్వీసులు నడపనుండగా..స్పైస్జెట్ మాత్రం తన సర్వీసుల సంఖ్యను తగ్గించుకుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో దేశీయ విమానయాన సంస్థలు అమెరికాతోపాటు బ్రిటన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవ్స్, జార్జియా.. వంటి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపాయి. దేశంలోని 27 విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ రూట్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. వారానికి 1,922 అంతర్జాతీయ సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తాయి. అందులో భాగంగా ఈ నెల 28 నుంచే ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ రూట్లో విమాన సేవలు ప్రారంభించనుంది. ఇండిగో ఈ సీజన్లో 13,050 విమాన సర్వీసులను నడపబోతున్నట్లు తెలిపింది. ఎయిరిండియా 2,278, విస్తారా 2,324, ఆకాశ ఎయిర్ 903 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. అంతర్జాతీయ రూట్లో ఎయిరిండియా 455 విమానాలు నడపనుండగా, ఇండిగో 731, విస్తారా 184కి పెంచుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, స్పైస్జెట్ మాత్రం తన సర్వీసులను 1,657కి కుదించింది. ఈ సీజన్ నుంచి కొత్తగా అజామ్గఢ్, అలిగఢ్, చిత్రకూట్, గోండియా, జలగాన్, మోరదాబాద్, పిథోర్గర్ విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించనున్న ప్రపంచ నం1 కంపెనీ.. కారణం.. -
ఆకాశ ఎయిర్.. ఇక అంతర్జాతీయ సర్వీసులు
న్యూఢిల్లీ: రియాద్, జెడ్డా, దోహా, కువైట్కు సర్వీసులు నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ట్రాఫిక్ అనుమతులు లభించినట్టు ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే వెల్లడించారు. ఇది తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే దశగా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి కూడా అనుమతులు తీసుకుని, త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆకాశ ఎయిర్ కార్యకలాపాలకు ఈ ఏడాది ఆగస్ట్తో ఏడాది ముగిసింది. సంస్థ నిర్వహణలోని బోయింగ్ 738 మ్యాక్స్ విమానాల సంఖ్య 20కు చేరుకుంది. దీంతో అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది చివరికి మరో రెండు విమానాలు సంస్థకు అందుబాటులోకి రానున్నాయి. బలమైన ఆర్థిక మూలాలతో, వృద్ధి దశలో ఉన్నట్టు దూబే తెలిపారు. సంస్థ వద్ద నగదు నిల్వలు తగినన్ని ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి మూడంకెల స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్ చేయనున్నట్టు చెప్పారు. తొలి అంతర్జాతీయ సర్వీసు ఎప్పుడు ప్రారంభించేది ఇప్పుడే చెప్పడం కష్టమని దూబే పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆకాశ ఎయిర్ వారానికి 700 సర్వీసులను, 16 పట్టణాలకు నిర్వహిస్తోంది. దేశీ మార్కెట్లో 4.2 శాతం వాటా కలిగి ఉంది. నిధుల సమస్య లేదు ఆకాశ ఎయిర్ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న వార్తలను ప్రస్తావించగా, అలాంటిదేమీ లేదని వినయ్ దూబే బదులిచ్చారు. సానుకూల నగదు ప్రవాహాలు ఉన్నాయని, మా నిల్వలను పెంచుకుంటూనే ఉంటామన్నారు. కొత్త విమానాలు ఆర్డర్ చేసేందుకు తమకు నిధుల అవసరం లేదన్నారు. జున్జున్వాలా కుటుంబం సంస్థను వీడుతున్నట్టు వచ్చిన వార్తలు అసంబద్ధమని స్పష్టం చేశారు. తాము దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసినట్టు వారు స్పష్టం చేశారని తెలిపారు. పైలట్ల ఆకస్మిక రాజీనామా, వారికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీని గురించి ప్రస్తావించగా, అది ముగిసిపోయిందంటూ.. ప్రస్తుతం వృద్ధి దశలో ఉన్నట్టు చెప్పారు. -
గుడ్న్యూస్.. త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి విమానాశ్రయానికి 2017లోనే అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వచ్చింది. అయితే, ఇప్పటివరకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, తిరుపతి నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు నడిచేలా కృషి చేస్తోంది. ముందుగా తిరుపతి విమానాశ్రయం నుంచి కువైట్కు సర్వీసులు ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు విమానయాన సంస్థలతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్), స్థానిక ఎంపీ, ఎయిర్పోర్టు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విమాన సర్వీసులు ప్రారంభించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఓపెన్ స్కై పాలసీ కింద కువైట్కు విమాన సర్వీసులు ప్రారంభించాలని స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు. ఈ పాలసీ కింద 400 సీట్లు కేటాయించాలని కోరగా కేంద్రం నుంచి సానుకూల స్పందన వచి్చనట్లు అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి కువైట్కు సర్వీసులు నడపడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని తిరుపతి ఎయిర్పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు. ఇండిగో, ఎయిర్ఏíÙయా సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తక్షణం అంతర్జాతీయ సరీ్వసులు నడపడానికి వీలుగా ఎయిర్పోర్టులో కస్టమ్స్, ఇమిగ్రేషన్కు అవసరమైన సౌకర్యాలతో పాటు విదేశీ ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు, కన్వేయర్ బెల్ట్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి సరీ్వసులు ప్రారంభిస్తే ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులను నియమించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తీరునున్న అవస్తలు రాయలసీమ ప్రాంత వాసులు విదేశాలకు వెళ్లేందుకు తిరుపతి విమానాశ్రయం చాలా అనుకూలంగా ఉంటుంది. రాయలసీమ నుంచి ముఖ్యంగా చిత్తూరు, రాజంపేట, రాయచోటి, నెల్లూరు ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వ్యయప్రయాసలకోర్చి చెన్నై వెళ్లి, అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. అదే తిరుపతి ఎయిర్పోర్టు నుంచి సరీ్వసులు అందుబాటులోకి వస్తే ఈ అవస్థలు తప్పుతాయని, చాలా సౌకర్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించడానికి ఎంపీ గురుమూర్తి కేంద్రస్థాయిలో సంప్రదింపులు నడుపుతున్నారని, ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయని, త్వరలోనే తిరుపతి నుంచి అంతర్జాతీయ సరీ్వసులు ప్రారంభమవుతాయని ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్ రెడ్డి తెలిపారు. -
ఈ ప్రయాణం నరకప్రాయం!
ప్రయాణమంటే... సుఖవంతంగా సాగాలని కోరుకుంటాం. సుఖంగా, సౌకర్యంగా, సత్వరంగా, సకాలంలో చేరడం కోసమే విమాన ప్రయాణాలను ఎంచుకుంటాం. కానీ, మన దేశంలో ఇప్పుడు అవి నరకప్రాయంగా మారుతున్నాయా? కొండవీటి చేంతాడంత క్యూలు... బోర్డింగ్ కోసం గంటల కొద్దీ నిరీక్షణ... చీకాకుపరిచేటన్ని చెకింగ్లు... నిలిచే జాగా లేని రద్దీ... ఎటుచూసినా లగేజ్... ట్రాలీల కొరత... విమానాల జాప్యం... ఇదీ ఇప్పుడు పరిస్థితి. రోజూ 1200 విమానాలతో, ఏటా 6.9 కోట్ల ప్రయాణికులతో దేశంలోకెల్లా బిజీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత వారంగా ఇవే దృశ్యాలు. ఎయిర్పోర్ట్ కాస్తా చేపల బజారులా తయారైందంటూ ఫోటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. సాక్షాత్తూ పౌర విమానయాన మంత్రి సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని, రద్దీ నివారణ చర్యలపై చర్చించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రాయాల్లోని లోటుపాట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం గంటలో గమ్యం చేరే దేశీయ విమాన ప్రయాణికులు సైతం గడువు కన్నా కనీసం మూడున్నర గంటల ముందే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాల్సిన దుఃస్థితి. వేరే లగేజ్ లేకుండా, 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీ ఒక్కటే తెచ్చుకొమ్మని ఇండిగో లాంటి విమానయాన సంస్థలు సూచి స్తున్న పరిస్థితి. దేశంలోకెల్లా అతి పెద్దదైన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టీ1, టీ2, టీ3 అని మూడు టెర్మినల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు కొన్ని దేశీయ సర్వీసులూ టీ3 నుంచే నడు స్తుంటాయి. తాజా పరిణామాలతో రద్దీ ఎక్కువగా ఉండే కీలక సమయాలైన ఉదయం, సాయంత్ర వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించాలనే యోచన చేస్తున్నారు. కొన్ని సర్వీసులను టీ3 నుంచి ఇతర టెర్మినల్స్కు మార్చాలని భావిస్తున్నారు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. పది రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామంటున్న మంత్రివర్యులు దృష్టి పెట్టాల్సింది శాశ్వత పరిష్కారాలపైన! ఒక్క ఢిల్లీలోనే కాదు... పుణే, ముంబయ్, బెంగళూరుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. హైదరాబాద్లో సైతం మొన్నటిదాకా వేర్వేరుగా ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నిష్క్రమణ మార్గాన్ని ఇటీవల టెర్నినల్ విస్తరణ కోసమంటూ ఒకేచోటకు మార్చారు. అలా ఒకేచోట జనం కేంద్రీకృతమై, ఒత్తిడి పెరిగినట్లు వార్త. ప్రపంచీకరణతో పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు కొన్నేళ్ళుగా దేశంలో పలు విమానాశ్రయాల ఆధునికీకరణ సాగింది. తీరా ఢిల్లీ వ్యవహారంతో అవన్నీ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జరగలేదని అనుమానం కలుగుతోంది. కొత్తగా గోవాలో మోపా వద్ద కట్టిన ఎయిర్ పోర్ట్ యాత్రిక సామర్థ్యం 44 లక్షలే. అది ఇప్పటికే ఉన్న డాబోలిమ్ ఎయిర్పోర్ట్ కన్నా తక్కువ సత్తా కావడం విడ్డూరం. అనేక దేశాల్లో కోవిడ్ నిర్బంధాలు ఎత్తివేసేసరికి దేశీయంగా, అంతర్జాతీయంగా కసికొద్దీ ప్రయాణాలు చేయడం పెరిగింది. ఇబ్బడిముబ్బడైన ఈ జనంతో ఎయిర్పోర్టుల్లో, ఎయిర్లైన్స్లో ఇప్పుడున్న వసతులపై ఒత్తిడి అధికమైంది. గత ఆదివారం ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచే 4.27 లక్షల మందికి పైగా ప్రయాణించారనేది పరిస్థితికి చిరు సూచన. కోవిడ్ నిబంధనలు ఎత్తేశాక ఈ ఏడాది జూలైలో యూరప్లోని పలు విమానాశ్రయాల్లో ఇలాంటి గందరగోళమే నెలకొంది. లండన్లోని ప్రసిద్ధ హీత్రూ విమానాశ్రయంలోనూ ఇదే కథ. కరోనా కాలంలో విస్తరణ ప్రణాళిక లకు బ్రేకులు పడ్డ విమానాశ్రయాలు ఇప్పుడు మళ్ళీ ఆ పనులను పట్టాలెక్కించాల్సి ఉంది. ప్రయాణికుల చెకింగ్ పద్ధతి ప్రకారం సాగకపోవడం, విమానాశ్రయ అధికారుల్లో అలసత్వం లాంటి కారణాలతో ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఎయిర్లైన్స్ చెక్–ఇన్ కౌంటర్లలో సిబ్బంది లేకపోవడం, ఉన్నా అరకొరగా ఉండడం రద్దీకి దారి తీస్తోంది. సెక్యూరిటీ చెక్ చేయాల్సిన నిపుణు లైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బంది కూడా తక్కువున్నారు. సీఐఎస్ఎఫ్ ఉద్యోగాలను 3 వేలకు పైగా రద్దు చేసి, వాటి స్థానంలో అనుభవం లేని 2 వేల కన్నా తక్కువ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని పెట్టడం లాంటి స్వీయ తప్పిదాలు సవాలక్ష. వీటిని తక్షణం సరిదిద్దాలి. బ్యాగేజ్, బిల్లింగ్ నుంచి బోర్డింగ్ దాకా అన్నిటా 5జి సహా ఆధునిక సాంకేతికతను ఆశ్రయించడం ఓ మార్గం. అంతర్జాతీయ ప్రయాణం చేసి వస్తున్నవారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఇప్పటికీ గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. ప్రస్తుతానికి విమానంలోనే వివరాలు నింపే పద్ధతి పెడతా మంటున్నా, డిజిటలీకరణ మంచి పరిష్కారం. సంవత్సరాంతపు సెలవులు, పండగలతో రానున్నది ప్రయాణాల కాలం. దాంతో, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది సరైన వ్యూహరచన, ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వసతులు. కౌంటర్లనూ, సిబ్బందినీ పెంచాలి. స్మార్ట్ సిటీల్లా స్మార్ట్ ఎయిర్పోర్ట్లు కావాలి. ప్రపంచశ్రేణి టెర్మినల్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా ఢిల్లీ, హైదరాబాద్, ముంబయ్ – ఇలా ఊరికో రకం కాక అన్నిచోట్లా ఒకే ప్రామాణిక సెక్యూరిటీ ప్రోటోకాల్ తేవాలి. ముఖం చూసి గుర్తించే బయోమెట్రిక్ పద్ధతే అదే బోర్డింగ్ పాస్గా ‘డిజి యాత్ర’ విధానాన్ని ఇటీవలే 3 ఎయిర్పోర్టుల్లో తెచ్చారు. మొక్కుబడిగా కాక దాన్ని అన్నిచోట్లా విస్తరించడం, అవగాహన పెంచడం అవసరం. ప్రపంచంలోని 10 రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ, ముంబయ్ చేరనున్న వేళ ఇలాంటి క్షేత్రస్థాయి అంశాలపై శ్రద్ధ కీలకం. అలసత్వం వహిస్తే, పదేపదే ఢిల్లీ కథే! -
అక్టోబర్ 31 నుంచి షార్జా–విజయవాడ విమానం
గన్నవరం: సుమారు మూడున్నరేళ్ల తర్వాత విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్లు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ పస్ట్వేవ్ తర్వాత నుంచి ఇప్పటివరకు వందేభారత్ మిషన్లో భాగంగానే ఇక్కడికి సర్వీస్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లోని షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు డైరెక్ట్ విమాన సర్వీస్లు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ముందుకొచ్చింది. షెడ్యూల్ను ప్రకటించడంతోపాటు టికెట్ల బుకింగ్ను కూడా ప్రారంభించింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రతి సోమ, శనివారాల్లో షార్జా–విజయవాడ మధ్య ఈ సర్వీస్లు నడవనున్నాయి. 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 737–800 విమానం భారతీయ కాలమానం ప్రకారం షార్జాలో మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.35 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుకుంటుంది. ఇక్కడి నుంచి షార్జాకు ప్రారంభ టికెట్ ధరను రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీస్ ప్రారంభమైతే ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగవచ్చని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ ప్రయాణానికి ఊతం ఈ విమానాశ్రయానికి 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. 2019లో ఆరునెలల పాటు విజయవాడ–సింగపూర్ మధ్య నడిచిన వారానికి ఒక సర్వీస్ సాంకేతిక కారణాలతో రద్దయింది. తర్వాత దుబాయ్, సింగపూర్కు అంతర్జాతీయ విమాన సర్వీస్లు నడిపేందుకు జరిగిన ప్రయత్నాలు కోవిడ్ పరిస్థితులతో నిలిచిపోయాయి. కేవలం వందేభారత్ మిషన్లో భాగంగా ఇక్కడి నుంచి ఒమన్ రాజధాని మస్కట్కు వారానికి ఒక సర్వీస్, షార్జా, కువైట్, మస్కట్ల నుంచి వారానికి ఐదు సర్వీస్లు ఇక్కడికి నడుస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ విమాన సర్వీస్లపై కేంద్రం నిషేధం ఎత్తేయడంతో ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో విదేశాలకు సర్వీస్లు నడిపేందుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. షార్జా–విజయవాడ మధ్య పూర్తిస్థాయి విమాన సర్వీస్లు అందుబాటులోకి రానుండడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వీస్ వల్ల యూఏఈలోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మన్, పుజిరా, రస్ ఆల్ ఖైమా నుంచి ఇక్కడికి సులభంగా రాకపోకలు సాగించొచ్చు. అంతేగాకుండా గల్ఫ్లోని పలు దేశాలకు వెళ్లేందుకు షార్జా నుంచి సులభమైన కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. భవిష్యత్లో ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా దుబాయ్, కువైట్ల నుంచి ఇక్కడికి పూర్తిస్థాయిలో సర్వీస్లు నడిపేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం, దేశీ విమానయాన సంస్థలకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై చేస్తున్న వ్యయాలకు అనుగుణంగా విదేశీ సర్వీసులు నడిపే దేశీయ విమానయాన సంస్థల వ్యయాలూ ఉండే కీలక నిర్ణయాన్ని ఆర్థికశాఖ తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి కొనుగోలు చేసే ఏటీఎఫ్పై ఎక్సైజ్ సుంకం చెల్లింపుల నుంచి (బేసిస్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) దేశీయ విమానయాన సంస్థలను కేంద్రం మినహాయించింది. వివరాల్లోకి వెళితే, జూలై 1వ తేదీన కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ, పెట్రోల్, డీజిల్తోపాటు ఏటీఎఫ్పై 11 శాతం సుంకాన్ని విధించింది. దీనివల్ల అంతర్జాతీయ సర్వీసులు నడిపే విమానయాన సంస్థలపై భారం పడుతుందని పరిశ్రమ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. దీనితో కేంద్రం నుంచి తాజా నిర్ణయం వెలువడింది. అయితే దేశీయంగా నడిపే విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్పై విమానయాన సంస్థలు 11 శాతం ఎక్సైజ్ సుంకం చెల్లింపులు కొనసాగుతాయి. -
అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త
న్యూఢిల్లీ: కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పూర్తిస్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి (ఆదివారం) నుంచి పునఃప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత విమానాల రాకపోకలు జరగనున్నాయి. ఈ మేరకు విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు రెడీ అయ్యాయి. మహమ్మారి ప్రభావంతో ఒడిదుడుకులు గురైన విమానయాన పరిశ్రమ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో అంతర్జాతీయ సర్వీసుల పునరుద్దరణ ఆ రంగానికి మరింత ఊతమివ్వనుంది. ఇప్పటికే భారతీయ విమానయాన సంస్థలు విమానలు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా.. వివిధ విదేశీ సంస్థలు సైతం భారత్ నుంచి రాకపోకలకు ప్రణాళికలు రచించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20, 2020 నుంచి భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. కడప విమానాశ్రయం నుంచి పునః ప్రారంభమైన విమాన సర్వీసులు వైఎస్సార్ జిల్లా: కడప విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో విమాన సేవలను ప్రారంభించారు. చెన్నై నుంచి తొలి విమానం కడప చేరుకుంది. అనంతరం కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసు బయల్దేరనుంది. కడప విమానాశ్రయంలో ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు ఇండిగో ఫ్లైట్ టికెట్లను అందజేశారు. కడప నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుకు నేటి నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించింది. -
ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు
న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 27 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో కరోనా వ్యాప్తిని నివారించే లక్ష్యంతో 2020 మార్చి 23వ తేదీ నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సేవలను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రత్యేక ఏర్పాట్ల కింద 37 దేశాలకు జూలై 2020 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను మాత్రం కొనసాగిస్తోంది. మార్చి 27వ తేదీ నుంచి షెడ్యూల్డ్ విమాన సర్వీసులు మొదలయ్యాక ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా నడిచే విమాన సర్వీసులు రద్దవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ నిబంధనలను యథాప్రకారం అమలు చేస్తామన్నారు. (చదవండి: న్యాయ చరిత్రలోనే అరుదైన సందర్భం...కేరళ హైకోర్టులో మహిళా ధర్మాసనం) -
షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రద్దును పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ రద్దు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. -
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అలర్ట్
అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేసులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని Directorate General of Civil Aviation తెలిపింది. అయితే ఎయిర్ బబూల్ ఆరేంజ్మెంట్స్ విమానాలకు ఈ కొత్త రెగ్యులేషన్స్ వర్తించవు. డీజీసీఏ అప్రూవ్ చేసిన విమానాలకు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లకు ఈ ఆంక్షలు వర్తించబోవని సివిల్ ఏవిషేయన్ జనరల్ డైరెక్టర్ నీరజ్ కుమార్ ఒక సర్క్యులర్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిసెంబర్ 31వ తేదీ వరకు డీజీసీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చి 29, 2020 కరోనా టైం నుంచి చాలావరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా వరకు రద్దు అయ్యాయి. కాకపోతే వందేమాతం మిషన్ లాంటి కొన్ని సర్వీసులను ‘ఎయిర్ బబూల్’ అరేంజ్మెంట్స్తో ఎంపిక చేసిన దేశాలకు జులై 2020 వరకు నడిపించారు. యూఎస్, యూకే, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్తో పాటు మొత్తం 32 దేశాలకు ఎయిర్బబూల్ అగ్రిమెంట్ ద్వారా విమానాలు నడిపిస్తోంది భారత్. pic.twitter.com/5KCcDlZHMX — DGCA (@DGCAIndia) January 19, 2022 పునరుద్ధరణపై వెనక్కి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానాలన్నింటిని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ఇంతలోనే వేరియెంట్లు, కేసులు పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంది. -
అలెర్ట్! అంతర్జాతీయ విమానాలు రద్దు.. డీజీసీఏ కొత్త ఆదేశాలు
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ విషయంలో మళ్లీ మెళిక పడింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత మార్గదర్శకాలను జారీ చేసింది. అప్పటి నుంచి ఆంక్షలే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా 2020 మార్చి 29న భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. ఆ తర్వాత 2020 మే నుంచి వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడిపించారు. ఆ తర్వాత ఎయిర్ బబుల్ ఒప్పందం కింద 32 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీనికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. పునరుద్ధరిస్తాం కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానలు అన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ డీజీసీఏ నుంచి ప్రకటన వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ వేరియంట్ గురించి సమాచారం దక్షిణాఫ్రికా బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ వెంటనే పరిమితంగా నడుస్తున్న విమాన సర్వీసులు, ప్రయాణికుల విషయంలో ఆంక్షలు తెరపైకి వచ్చాయి. దీంతో విమానాల పునరుద్ధరణ నిర్ణయం వాయిదా వేస్తున్నట్టు డిసెంబరు 1న డీజీసీఏ ప్రకటించింది. జనవరి 31 వరకు గత పది రోజుల వ్యవధిలో ఇండియాతో సహా అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 2021 డిసెంబరు 9న ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపింంచాలనే నిర్ణయాన్ని 2022 జనవరి 31 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. pic.twitter.com/EXPkDc8Ejw — DGCA (@DGCAIndia) December 9, 2021 వీటికి గ్రీన్సిగ్నల్ ఎయిర్ బబుల్ ఒప్పందం ఉన్న 32 దేశాల నుంచి పరిమిత సంఖ్యలో ప్రస్తుతం నడుస్తున్నట్టుగానే కొన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 32 దేశాల జాబితాలో యూకే, యూఎస్, కెన్యా, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఉన్నాయి. అదే విధంగా కార్గో విమాన సర్వీసులు కూడా యథావిధిగా ఉంటాయి. చదవండి: హైదరాబాద్ వచ్చే ఎన్నారై, విదేశీయులకు గుడ్న్యూస్ ! -
కరోనా నియంత్రణలో ఘోర వైఫల్యం
న్యూఢిల్లీ: కోవిడ్ మేనేజ్మెంట్పై కేంద్ర ప్రభుత్వ తీరును లోక్సభలో ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కరోనా వ్యాక్సినేషన్, బూస్టర్ డోసుపై రోడ్మ్యాప్ గురించి సభకు తెలియజేయాలని సూచించాయి. ఈ వైరస్ కారణంగా అసలు ఎంతమంది చనిపోయారో వాస్తవ గణాంకాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా మహమ్మారిపై లోక్సభలో గురువారం తొలుత శివసేన సభ్యుడు వినాయక్ రౌత్ చర్చ ప్రారంభించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని, వైరస్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ డోసులు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ డోసులు ఇస్తోందని దుయ్యబట్టారు. దేశంలోని 130 కోట్ల మంది బాధ్యత ప్రధానమంత్రిపై ఉందని గుర్తుచేశారు. జనాభాను బట్టి రాష్ట్రాలకు టీకా డోసులు కేటాయించాలన్నారు. దేశంలో ఇప్పటివరకు కేవలం 38 శాతం జనాభాకే టీకా రెండు డోసులు ఇచ్చారని అన్నారు. దీంతోనే సంతృప్తి చెందుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ సభ్యుడు జగదాంబికా పాల్ మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాల మధ్య కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. పేదలను ఆదుకోలేరా? కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తలెత్తే అవకాశం ఉందని ముందుగానే నిపుణులు హెచ్చరించినా కేంద్ర సర్కారు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు. కరోనా వల్ల నష్టపోయినా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసి మరిన్ని కష్టాలకు గురిచేస్తోందని అన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి గానీ పేదలను ఆదుకోవడానికి ఉండవా? అని నిలదీశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం.. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కానీ, రూ.50 వేలు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని విమర్శించారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు నిర్వాకం వల్లే కరోనా సెకండ్ వేవ్లో అధికంగా మరణాలు సంభవించాయని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ బిల్లుకు ఎగువ సభలో ఆమోదం దేశంలో డ్యామ్ల భద్రత కోసం సంస్థాగత యంత్రాంగం ఏర్పాటుకు ఉద్దేశించిన డ్యామ్ సేఫ్టీ బిల్లు–2019 గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. రెండు అధికారిక సవరణతో బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. ఎగువ సభలో సవరణలు చేయడంతో ఈ బిల్లు మళ్లీ లోక్సభకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. డ్యామ్ల భద్రత విషయంలో నిబంధనలు పాటించని రాష్ట్రాలు, ప్రజలకు జరిమానా విధించే అధికారం ఈ అథారిటీకి ఉంటుందన్నారు. ఎన్సీడీఎస్ చేసే సిఫార్సుల అమలును సైతం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఆయా అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు కోరగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిరాకరించారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోందని చెప్పారు. దీంతో ముందుగా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, డీఎంకే, వామపక్షాల సభ్యులు సైతం వాకౌట్ చేశారు. అది అప్రజాస్వామికం కాదు: వెంకయ్య సభలో సభ్యుల హద్దుమీరిన ప్రవర్తనను అంగీకరించకపోవడం అప్రజాస్వామికంగా పరిగణించరాదని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. 12 మంది సభ్యుల సస్సెన్షన్పై ప్రతిపక్షాలు రాజ్యసభలో గత నాలుగు రోజలుగా నిరసన కొనసాగిస్తున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వస్తోంది. ఈ పరిణామంపై వెంకయ్య మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి ప్రతిష్టంభనకు తెరదించాలని సూచించారు. రాజ్యసభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. 1962 నుంచి 2010 వరకూ 11 సార్లు సభ్యులను సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. అదంతా అప్రజాస్వామికమేనా? అని ప్రశ్నించారు. -
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా
న్యూఢిల్లీ/ జెనీవా/లాగోస్: అంతర్జాతీయ విమానాలను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కరోనా వైరస్లోని ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో విమానాలను అనుకున్న ప్రకారం నడపకూడదని బుధవారం డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. విమానాల రాకపోకలకు సంబంధించిన కొత్త తేదీపై నిర్ణయం తీసుకోలేదు. కోవిడ్ నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కేంద్రం రద్దు చేసింది. ఈనెల 15 నుంచి పునరుద్ధరించాలని గత నెల 26న నిర్ణయించింది. తర్వాత ఒమిక్రాన్ కలకలం రేగడంతో పునరుద్ధరణను వాయిదావేసింది. దేశంలో ఈ కేసు లు లేకున్నా గట్టి చర్యలు తీసుకుంటోంది. నిషేధంతో అరికట్టలేరు: డబ్ల్యూహెచ్వో అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించినంత మాత్రాన ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పట్నుంచి ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకొని పలు దేశాలు విమానాల రాకపోకల్ని నిషేధిస్తూ ఉండడంతో డబ్ల్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రాయాసెస్ స్పందించారు. ప్రయాణాలను నిషేధిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్ల పైబడిన వారు ప్రయాణాలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, అమెరికాలో ఒమిక్రాన్ తొలి కేసు కాలిఫోర్నియాలో బుధవారం నమోదైంది. దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఒమిక్రాన్ పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఒమిక్రాన్ వేరియెంట్ అక్టోబర్లో బయటపడింది. ఈ వేరియెంట్పై ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా హెచ్చరించడానికి ముందే నైజీరియాలో ఇది వెలుగులోకి వచ్చిందని ఆ దేశ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. ‘గత వారంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నమూనాలో జన్యుక్రమాన్ని పరిశీలిస్తే ఒమిక్రాన్ కేసులు అని తేలింది. ఆ నమూనాలు పరీక్షించినప్పుడే అక్టోబర్లో సేకరించిన శాంపిళ్లనూ పరీక్షిస్తే ఒమిక్రాన్ వేరియెంట్గా నిర్ధారణ అయింది. అంటే రెండు నెలల కిందటే ఒమిక్రాన్ వేరియెంట్ పుట్టుకొచ్చిందని అర్థమవుతోంది’ అని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. -
హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. సందిగ్ధంలో ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ నుంచి ఓ కుటుంబం డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్కు వచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. రెండేళ్ల పాటు కోవిడ్ కారణంగా ఎక్కడికీ వెళ్లకుండా ఉండిపోయారు. కొద్ది రోజులుగా వివిధ దేశాల మధ్య ఆంక్షలను సడలించడంతో న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఉంటున్న ఆ కుటుంబం కూడా నగరానికి వచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్కు వెళ్లి, చివరి వారంలో తిరిగి న్యూజిలాండ్కు చేరుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆకస్మికంగా ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగించడంతో సందిగ్ధంలో పడ్డారు. ఇండియాకు వెళ్లి తిరిగి న్యూజిలాండ్కు చేరుకోగలమా లేదా అనే ఆందోళన నెలకొంది. మరోవైపు ఉన్నపళంగా ఒమిక్రాన్ విజృంభింవచ్చనే భయాందోళన పట్టుకుంది. దీంతో వారు ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. చదవండి: మళ్లీ ఆంక్షల చట్రంలోకి..మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి పారిస్లోని ఓ విద్యాసంస్థలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డీడీ కాలనీకి చెందిన అనుపమ కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకొనేందుకు కొద్ది రోజుల పాటు సెలవుపై వచ్చిన ఆమెకు ఇప్పుడు తిరుగు ప్రయాణంపై ఆందోళన నెలకొంది. తిరిగి పారిస్కు వెళ్లే సమయానికి విమానాల రాకపోకలు ఆగిపోవచ్చనే భయంతో పాటు ఏదో ఒక విధంగా వెళ్లినా మరోసారి ఇండియాకు రావడం కుదరకపోవచ్చనే సందేహం నెలకొంది. హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.... ఈ నెల మొదటి వారంలో అమెరికా కోవిడ్ ఆంక్షలను సడలించి ప్రపంచ దేశాలకు స్వాగతం పలికిన అనంతరం పెద్దఎత్తున ఊరట లభించింది. యూరప్ దేశాలు సైతం ఆంక్షలను సడలించాయి. వివిధ దేశాల మధ్య రాకపోకలు పెరిగాయి .సొంత కుటుంబాలకు, సొంత ఊళ్లకు దూరంగా ఉంటున్న ఎన్నారైలు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు డిసెంబర్, జనవరి నెలల్లో చాలా వరకు ఆంక్షలను తొలగించి పర్యాటకులను సైతం ఆహ్వానించేందుకు పలు దేశాలు చర్యలు చేపట్టాయి. రెండేళ్లుగా కుదేలైన పర్యాటక రంగాన్ని తిరిగి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. మరోవైపు విదేశీ ప్రయాణాలపైన కేంద్రం సైతం ఆంక్షలను సడలించేందుకు సన్నద్ధం కావడంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐఆర్సీటీసీ, తెలంగాణ పర్యాటకాభివృద్ధిసంస్థ, పలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు రకరకాల ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ పిడుగులా వచ్చి పడడంతో అంతటా సందిగ్ధం నెలకొంది. డిసెంబర్ ప్రయాణాలు కష్టమే... హైదరాబాద్ నుంచి ప్రస్తుతం బ్రిటన్తో పాటు దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పర్యాటక దేశమైన మాల్దీవులుకు ప్రతి రోజు ఒక ఫ్లైట్ అందుబాటులో ఉంది. సాధారణంగా డిసెంబర్ నెలలో పర్యాటక ప్రయాణాలు బాగా పెరుగుతాయి. నూతన సంవత్సర వేడుకల కోసం నగరవాసులు తమకు నచ్చిన పర్యాటక ప్రాంతానికి వెళ్తారు. రెండేళ్ల పాటు నిలిచిపోయిన ఈ ప్రయాణాలు వచ్చే డిసెంబర్ నెలలో ఊపందుకోవచ్చని భావించారు. కానీ డిసెంబర్ నాటికి ప్రయాణాలు బాగా తగ్గవచ్చని పలు పర్యాటక సంస్థలు అంచనా వేస్తున్నాయి. -
15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పౌర విమానాల సర్వీసుల్ని డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తున్నట్టుగా కేంద్ర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంతో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్రం పూర్తిగా దానిని ఎత్తేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలంటూ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ (డీసీజీఏ)కి కేంద్ర విమానయాన శాఖ లేఖ రాసింది. ‘డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వీసుల్ని పునరుద్ధరణ కోసం హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆరోగ్య శాఖలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం’ అని విమానయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించినప్పటికీ గత ఏడాది జూలై నుంచి వందే భారత్ పేరుతో కొన్ని ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న 28 దేశాలకు ఈ ప్రత్యేక విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని విమానాలను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
పాక్ నుంచి అఫ్గాన్కు విమానం
ఇస్లామాబాద్: కాబూల్ ఎయిర్పోర్ట్కు అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాబూల్కు పాకిస్తాన్ సోమవారం తొలి కమర్షియల్ విమానాన్ని నడిపింది. అఫ్గాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కాబూల్ వెళ్లిన మొదటి కమర్షియల్ విమానం పాకిస్తాన్కు చెందినదే కావడం గమనార్హం. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్లైన్ (పీఐఏ) విమానం –పీకే 6429 పలువురు జర్నలిస్టులతో కలసి కాబూల్ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన బృందంతో వచ్చిందని రేడియో పాకిస్తాన్ వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలు కూడా త్వరలోనే తిరుగుతాయని భావిస్తున్నారు. -
విమానాల నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు విమానాల నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆది వారం తెలిపింది. కరోనా కారణంగా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే వందే భారత్ మిషన్తో పాటు, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కొనసాగుతోంది. తాజా నిషేధ పొడిగింపు కార్గో విమానాలకు వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. -
కుదేలవుతున్న ఏవియేషన్, విమానాల రాకపోకలపై నిషేధం
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఏవియేషన్ రంగానికి మరో ఎదురు దెబ్బతగిలింది. కరోనా కారణంగా అంతర్జాతీయ రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. మనదేశంలో ఏవియేషన్ రంగాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో ఇండియన్ ఎయిర్ లైన్స్ కుదేలవుతోంది. భారతదేశంలోని విమానయాన సంస్థలు 2022 ఆర్థిక సంవత్సరంలో 4.1 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసినట్లు ఏవియేషన్ కన్సల్టెన్సీ సిఏపీఏ అంచనా వేసింది. అందులో 1.1 బిలియన్ డాలర్లు ఐపివోలు, క్యూఐపిలు ఇతర పరికరాల రూపంలో అవసరం ఉన్నాయని తెలిపింది. అయితే ఈ నష్టాలు ఇప్పట్లో ఆగిపోయేలా లేవని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో..డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జులై 31వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. తాజాగా,ఆ నిషేధాన్ని ఆగస్ట్ 31 వరకు 31వ తేదీ వరకు పొడిగించింది. వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కోవిడ్-19 కేసుల పెరుగుదలతో విధించిన ట్రావెల్ బ్యాన్ను ఎత్తేస్తే అంతర్జాతీయ విమాన సర్వీసులతో ఇండియన్ ఏవియేషన్ కు ఉపశమనం కలుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కేంద్రం ఆంక్షల్ని కొనసాగించడంతో నష్టాలు పెరిగే అవకాశం ఉంది. కాగా, ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ జున్జున్వాలా విమానయాన రంగంలో పెట్టుబడులను పెట్టనున్న విషయం తెలిసిందే. వచ్చే నాలుగు సంవత్సరాల్లో సుమారు 70 ఎయిర్క్రాఫ్ట్లతో కొత్త ఎయిర్లైన్ను మొదలుపెట్టాడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు రాకేష్ జున్జున్వాలా ప్రకటించారు. మరి ఆయన పెట్టుబడులతో ఏవియేషన్ రంగం ఎలాంటి వృద్ది సాధిస్తోంది చూడాల్సి ఉంది. -
అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
-
అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల వివనాలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. అయితే, కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో రద్దును జూలై 31వ తేదీ దాకా పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) బుధవారం వెల్లడించారు. అయితే, ఎంపిక చేసిన వర్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమానాల రాకపోకలను అనుమతించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ కార్గో విమానాల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికుల వివన సేవలను ప్రభుత్వం 2020 మార్చి నుంచి రద్దు చేసిన సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్ కింద 2020 మే నుంచి ప్రత్యేక అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను అనుమతిస్తోంది. చదవండి: పిల్లలపై కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్కు నో -
DGCA:అంతర్జాతీయ విమానాల నిషేధంపై కీలక నిర్ణయం
ఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరో 30 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని డీజీసీఏ తన ట్విటర్లో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలపై నిషేధం ఉన్నా పలు దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా విమానాల రాకపోకలు జరుగుతుంది. కాగా భారత్ అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చదవండి: మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేత pic.twitter.com/IueesZFoiV — DGCA (@DGCAIndia) May 28, 2021 -
అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం పొడిగింపు
న్యూదిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కరోనాతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కార్గో విమానాలను ఎటువంటి షరతులు వర్తించవని స్పష్టంచేసింది. దీనికి సంబందించిన ఒక సర్క్యులర్ ను డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్ కుమార్ జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్’ మిషన్లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్లను నడుపుతున్నారు.(చదవండి: ఫేస్‘బుక్’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!) -
విమానాలపై గల్ఫ్ నిషేధం
మోర్తాడ్ (బాల్కొండ): కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్ సహా పలు దేశాల్లో విస్తరిస్తుండటంతో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్ అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. సోమవారం నుంచి వారంపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులపై సౌదీ, ఒమన్ నిషేధం విధించగా జనవరి 1 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కువైట్ తెలిపింది. అవసరమైతే నిషేధాన్ని మరో వారంపాటు పొడిగిస్తామని సౌదీ పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి భారత్ నుంచి విమాన సర్వీసులను నిలిపేసిన సౌదీ... తమ దేశం నుంచి భారత్ తిరిగి వెళ్లాలనుకొనే వారికి మాత్రం అనుమతించింది. తాజాగా వాటిపైనా నిషేధం విధించింది. (చదవండి: దేశానికి ‘గల్ఫ్’ కష్టాలు) మరోవైపు ఒమన్లో క్షమాభిక్ష అమల్లో ఉన్న తరుణంలో విమాన సర్వీసులపై నిషేధంతో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒమన్లో చాలా సంవత్సరాల తరువాత క్షమాభిక్ష అమలు చేస్తుండటంతో అక్కడ చట్టవిరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు క్షమాభిక్ష పొందడానికి గడువు ఉంది. ఒమన్ ఆకస్మిక నిర్ణయంతో వారు ఇప్పట్లో స్వదేశానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఒమన్లో ఉపాధి పనులకు వీసాలు పొందినవారు కూడా ఇప్పట్లో ఆ దేశానికి వెళ్లే పరిస్థితి లేదు. -
అంతర్జాతీయ విమాన సర్వీస్ల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: నవంబర్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్’ మిషన్లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్లను నడుపుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్ వంటి 18 దేశాలతో భారత్ అంతర్జాతీయ సర్వీస్లను నడపడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ముంబై విమానాలను అనుమతించం: హాంకాంగ్ గత వారం ముంబై నుంచి వచ్చిన విమానంలో కొంత మంది ప్రయాణికులకు కోవిడ్ ఉన్నట్టు తేలటంతో నవంబర్ 10 వరకు ముంబై నుంచి వచ్చే ఎయిర్ ఇండియా విమానాలను అనుమతించబోమని హాంకాంగ్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్తో మాత్రమే భార తీయులు హాంకాంగ్కి ప్రయాణిం చవచ్చునని హాకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. -
అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సోమవారం వెల్లడించింది. అయితే సంబంధిత అధికార యంత్రాంగం ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయా దేశాలతో పరస్పర ఒప్పందాలతో పాటు వందే భారత్ మిషన్ కింద కొద్ది నెలలుగా ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను ప్రభుత్వం నడుపుతోంది. ఇక కార్గో కార్యకలాపాలకు, డీజీసీఏ నిర్ధిష్టంగా అనుమతించిన విమానాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రకటన పేర్కొంది.అన్లాక్ 4.0లో భాగంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్కూళ్లు, విద్యాసంస్ధల మూసివేతను సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. మరోవైపు సినిమా థియేటర్లు, బార్లు తెరవడానికి మరికొంత సమయం పట్టనుండగా, కంటైన్మెంట్ జోన్లలలో ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి. చదవండి : అన్లాక్ 4.0 : మెట్రోకు గ్రీన్ సిగ్నల్ -
మరో నెల రోజులు విదేశీ ప్రయాణాలు లేనట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక విషయాన్ని ప్రకటించింది. ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కొనసాగుతుందని శుక్రవారం వెల్లడించింది. అయితే డీజీసీఏ ప్రత్యేక అనుమతులు ఉన్న సర్వీసులు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అలాగే కార్గో విమానాలు, వందేమాతరం మిషన్లో భాగంగా నడుస్తున్న విమానాలకు ఎలాంటి అంతరాయం ఉండదని కూడా డీజీసీఏ జారీ చేసిన ఒక సర్క్యులర్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరిగిన నేపథ్యంలో, జూలై నెల ఆరంభంలో అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని జూలై 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిషేధాన్ని మరింత పొడిగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. వందే భారత్ మిషన్ కింద మే 6 - జూలై 30 మధ్యకాలంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ల ద్వారా మొత్తం 2,67,436 మందిని, ఇతర చార్టర్ల ద్వారా 4,86,811మంది ప్రయాణీకులను స్వదేశానికి తరలించినట్టు వెల్లడించింది. కాగా కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి గాను విధించిన లాక్డౌన్ కారణంగా మార్చి 23న జాతీయ అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల విరామం తర్వాత మే 25న ప్రత్యేక నిబంధనలతో దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమైనాయి. మరోవైపు అన్లాక్ 3.0 లో భాగంగా లాక్డౌన్ నిబంధనలను సడలించిన కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. -
అమెరికాకు 180 ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు
సాక్షి, న్యూఢిల్లీ : వందే భారత్ మిషన్ కింద అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. జులై 22 నుంచి ఆగస్ట్ 31 వరకూ అమెరికాకు 180 ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఆరు నగరాల నుంచి విమాన సర్వీసులు న్యూయార్క్, చికాగో, నెవార్క్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలకు ప్రయాణీకులు ఈ విమానాల ద్వారా రాకపోకలు సాగించవచ్చు. భారత్ నుంచి అమెరికా వెళ్లే ప్రయాణీకులు స్టార్ అలయన్స్ భాగస్వాముల ద్వారా అక్కడ తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది. కాగా వందేభారత్ మిషన్లో తొలి రెండు దశల్లో విమాన ఛార్జీలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో మూడవ దశలో ఎయిర్ ఇండియా విమాన చార్జీలను గణనీయంగా తగ్గించింది. ఆయా దేశాలతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాలు సోమవారం నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించేందుకు అనుమతించారు. ఇక ఫ్రాన్స్, జర్మనీలతో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఎయిర్ ఫ్రాన్స్ ఈనెల 18 నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూర్, పారిస్ల మధ్య జులై 18 నుంచి ఆగస్ట్ 1 వరకూ 28 విమానాలను నడపనుంది. కాగా జులై 16 వరకూ వందే భారత్ మిషన్ కింద 2362 విమానాలు నడిచాయని, 3,16,000 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. చదవండి : స్పెషల్ విమానం.. అందులో ఒక్కడే -
నేటి నుంచి యూఎస్కు విమానాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించే దిశగా భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విమాన సర్వీసు లను ప్రారంభించేందుకు వీలుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలతో ప్రత్యేక ద్వైపాక్షిక ఒడంబడికలను కుదుర్చుకుంది. త్వరలో యూకేతోనూ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ వివరాలను విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. పారిస్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, ముంబైలకు జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ 28 విమాన సర్వీసులను నడుపుతుంది. అలాగే, ఈరోజు నుంచి 31 వరకు ఇరుదేశాల మధ్య అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ 18 విమాన సర్వీసులను నడుపుతుంది. ఆ సంస్థ ఢిల్లీ– నెవార్క్ల మధ్య ప్రతీరోజు ఒక సర్వీసును, ఢిల్లీ– శాన్ఫ్రాన్సిస్కోల మధ్య వారానికి మూడు సర్వీసులను నడుపుతుంది. యూకేతో ఒప్పందం కుదిరిన తరువాత.. ఢిల్లీ, లండన్ల మధ్య రోజుకు రెండు సర్వీసులు ఉంటాయని పురి తెలిపారు. జర్మనీ నుంచి లుఫ్తాన్సా సర్వీసులుంటాయన్నారు. భారత్ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ ఆయా దేశాలకు విమాన సర్వీసులను నడుపుతుందని వివరించారు. అంతర్జాతీయ సర్వీసులపై భారత్ ఇప్పటికే యూఏఈతో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దీపావళి నాటికి దేశీయ ట్రాఫిక్ కరోనా ముందున్న స్థాయితో పోలిస్తే.. 55 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. భౌతిక దూరంపై ప్రయాణికుల ఆందోళన కరోనా సమయంలో కొందరు విమాన ప్రయాణికులు భౌతిక దూరం నిబంధనను సరిగ్గా పాటించకపోవడాన్ని మిగతావారు ప్రధాన సమస్యగా భావిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. జూన్ 20 నుంచి జూన్ 28 వరకు ఆన్లైన్లో సుమారు 25 వేల మంది ప్రయాణికులను సర్వే చేశామని ఇండిగో ప్రకటించింది. -
అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తితో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌరవిమానయాన మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తెలిపారు. మొదటగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు విదేశీ విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాలతో చర్చలు జరిపామని చెప్పారు. శుక్రవారం అమెరికా నుంచి, శనివారం ఫ్రాన్స్ నుంచి భారత్కు అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవుతాయని అన్నారు. జులై 17 నుంచి జులై 31 వరకూ భారత్ అమెరికా మధ్య 18 యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాలు నడుస్తాయని వెల్లడించారు. జులై 18 నుంచయి ఆగస్ట్ 1 వరకూ పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూర్ మధ్య ఎయిర్ ఫ్రాన్స్ 28 విమానాలను నడపనుందని వెల్లడించారు. జర్మనీతో కూడా విమాన సర్వీసులపై సంప్రదింపులు జరిపామని చెప్పారు. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్తో ఒప్పందం కొలిక్కివచ్చిందని మంత్రి హర్ధీప్సింగ్ తెలిపారు. విదేశీ విమాన సర్వీసులపై ఈ నిర్ణయంలో పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆయా దేశాలతో ఒప్పందాలకు అనుగుణంగా విదేశీ విమాన సేవలను పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. చదవండి : కరోనా వైరస్ : రికవరీ అనంతరం అవే లక్షణాలు! -
అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: దేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జూలై 31 వరకు కొనసాగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. పరిస్థితులను బట్టి, కొన్ని ఎంపికచేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమానాలను కొనసాగించవచ్చునని వెల్లడించింది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. జూలై 15 వరకు షెడ్యూల్ అయిన సర్వీసులను నిలిపివేసి, జూన్ 26న ఇచ్చిన సర్క్యులర్ని సవరిస్తూ, జూలై 31 వరకు విమానాల రద్దును కొనసాగించాలని నిర్ణయించింది. వివిధ దేశాల విమానయాన సంస్థలు అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ అరవింద్ సింగ్ చెప్పారు.అమెరికా, యుకె, జర్మనీ, ఫ్రాన్స్లతోనూ చర్చలు జరుపుతున్నట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది. -
31వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉధృతి వల్ల అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఇండియా నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకూ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్గో, ముందుగా అనుమతి పొందిన విమానాలను కొన్ని రూట్లలో మాత్రమే రాకపోకలకు అనుమతిస్తామని వెల్లడించింది. (భూకంపంలోనూ నడిచే బుల్లెట్ ట్రైన్!) గత నెల 26వ తేదీన జులై 15 వరకూ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలను నిషేధిస్తున్నట్లు డీజీసీఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు మే 6 నుంచి వందే భారత్ మిషన్ కింద ఎయిర్ ఇండియాతో సహా పలు ప్రైవేట్ ఎయిర్లైన్స్ అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. మే 25 నుంచి దేశీయ విమానయాన సర్వీసులను నడిపేందుకు డీజీసీఏ అనుమతిచ్చింది. (‘కరోనా వ్యాక్సిన్కు రెండున్నర ఏళ్లు పడుతుంది’) -
త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అమెరికా, కెనడా, పలు యూరోప్, గల్ఫ్ దేశాలతో చర్చలు ప్రారంభించింది. ఆయా దేశాలతో విమాన సర్వీసుల అనుమతులకు సంబంధించి వేర్వేరుగా ప్రత్యేక ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకునే దిశగా చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఆయా దేశాలకు చెందిన అనుమతించిన విమాన సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ దిశగా అమెరికా, కెనడాలతో చర్చలు పురోగతి సాధించినట్లు పౌర విమానయాన శాఖ ద్వారా తనకు సమాచారం అందిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అరవింద్ సింగ్ వెల్లడించారు. యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకునే విషయమై ఆలోచిస్తున్నామని పౌర విమానయాన శాఖ జూన్ 23వ తేదీననే ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలనే విషయంలో దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని అరవింద్ సింగ్ గురువారం జీఎంఆర్ గ్రూప్ నిర్వహించిన ఒక వెబినార్లో తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే ఉద్దేశంతో మార్చ్ 23 నుంచి అన్ని అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
దశలవారీగా అంతర్జాతీయ విమాన సర్వీసులు
సాక్షి, న్యూఢిల్లీ : అన్లాక్ 2.0లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను దశలవారీగా ప్రారంభమవుతాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్త లాక్డౌన్తో మార్చి చివరివారం నుంచి దేశ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రెండు నెలల అనంతరం పరిమిత రూట్లలో దేశీయ విమాన సేవలను అనుమతించినా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత కొనసాగుతోంది. కాగా లాక్డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను నడిపింది. వందే భారత్ మిషన్లో భాగంగా 50కి పైగా దేశాల పెద్దసంఖ్యలో భారతీయులను స్వదేశానికి రప్పించామని పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. చదవండి: తమిళనాడు మంత్రికి కరోనా -
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం మరోసారి నిషేధాన్ని పొడిగించింది. జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కార్గో సర్వీసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని డీజీసీఏ స్పష్టం చేసింది. (విమానయాన సంస్థలకు భారీ ఊరట) కాగా, మార్చి చివరి వారంలో కరోనా లాక్డౌన్ విధించడానికి కొద్ది రోజుల ముందే అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే మే 25 నుంచి పలు రూట్లలో దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం అనుమతించింది. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం నిషేధాన్ని కొనసాగించారు. కొద్ది రోజుల కిందట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్.. కరోనా కేసుల సంఖ్యను బట్టి జూలై నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతోనే విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకన్నట్టుగా సమాచారం. మరోవైపు లాక్డౌన్తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. pic.twitter.com/qDqtyit14Q — DGCA (@DGCAIndia) June 26, 2020 -
‘జులై నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్డౌన్తో నిలచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9000కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి. చదవండి : క్వారంటైన్ నుంచి తప్పించుకునేందుకు.. -
విమానాల్లో ఆ సీట్లు ఖాళీగా ఉంచండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం విమానయానంపై కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు నడుస్తున్న అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీట్లను తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. వాణిజ్య విమానయాన సంస్థల కన్నా పౌరుల ఆరోగ్యం గురిచి ప్రభుత్వాలు ఆందోళన చెందితే బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మే 7న ప్రారంభమైన వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఎయిర్ ఇండియా వెనక్కి రప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మధ్య సీట్లను భర్తీ చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బహిరంగ ప్రదేశాల్లో ఆరు అడుగుల దూరం పాటించాలంటున్నారు. మరి విమానం లోపల ఏం చేస్తున్నారు?' అని ప్రశ్నించారు. (ఆ కుటుంబానికి రూ.7.64 కోట్లివ్వండి) దీనిపై కేంద్రం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. సీట్లు వదిలేయడం కాన్నా టెస్టింగ్, క్వారంటైన్ అత్యుత్తమ విధానాలని, నిపుణుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు వివరించారు. ఆయన వ్యాఖ్యలతో విభేదించిన కోర్టు విమాన ప్రయాణికులకు వైరస్ సోకదని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది. జూన్ 6 వరకు బుకింగ్స్ జరిగాయని తుషార్ పేర్కొనగా.. ఆ తర్వాతి నుంచి మధ్య సీట్లు బుకింగ్ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. కావాలనుకుంటే దేశీయ విమానాల్లోనూ ఈ సమస్య గురిచి హైకోర్టులు జూన్ 2న విచారించవచ్చని న్యాయస్థానం సూచించింది. కాగా నేటి నుంచి దేశీయ విమానయానం పునఃప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సర్వీసులను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున అవి మరింత విజృంభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి. (నేటి నుంచి టేకాఫ్..) -
ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!
న్యూఢిల్లీ: ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ శనివారం చెప్పారు. మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాల సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని రాష్ట్రాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో విమానాల రాకపోకలకు ఇప్పట్లో అనుమతి ఇవ్వొద్దని కోరుతున్నాయి. విమానాల్లో ప్రయాణించేవారు మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ కలిగి ఉండడం తప్పనిసరి కాదని హర్దీప్సింగ్ పురీ చెప్పారు. దాని బదులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, తమకు ఈ వైరస్ సోకలేదంటూ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం ఇస్తే సరిపోతుందని వెల్లడించారు. దేశీయ విమానాల్లో వచ్చేవారి ఆరోగ్యసేతు యాప్లో గ్రీన్ స్టేటస్ చూపిస్తే వారిని క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం లేదని చెప్పారు. వందే భారత్ మిషన్ కింద ఈ నెలాఖరు నాటికి విదేశాల నుంచి 50 వేల మంది భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపారు. మే 7 నుంచి మే 21వ తేదీ మధ్య 23 వేల మందిని ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి తీసుకొచ్చారు. -
మే 3 వరకు దేశీయ,అంతర్జాతీయ సర్వీసులు బంద్
శంషాబాద్: దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ ఉంటుందని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేయడంతో ఈ మేరకు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. లాక్డౌన్ నేపథ్యంలో మే 3 వరకు దేశవ్యాప్తంగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు సాగించవని మంగళవారం ట్విట్టర్లో పేర్కొంది. మే 15 నుంచి బుకింగ్లు చేపట్టిన ఎయిర్లైన్స్ల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. డీజీసీఏ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేనిదే టికెట్ల బుకింగ్ ఎలా ప్రారంభించారని పలువురు ప్రశ్నించారు. భారత్లో చిక్కుకుపోయిన విదేశీయులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన వారిని కూడా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు. -
కరోనా: రష్యా కీలక నిర్ణయం
మాస్కో: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అర్ధరాత్రి (మార్చి 27) నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి రెగ్యులర్ విమానాలతో పాటు చార్టర్ ఫ్లైట్స్ను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖను రష్యా ప్రభుత్వం ఆదేశించింది. అయితే విదేశాల నుంచి తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చే విమానాలకు సడలింపు ఉంటుందని రష్యా అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోజువారి విమానాల నియంత్రణకు ఇంతకుముందే రష్యా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (కరోనా పోరుకై మరో అవకాశం సృష్టించుకోండి) రష్యాలో కోవిడ్ బారిన పడి వారి సంఖ్య బుధవారం నాటికి 653కు చేరింది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 163 కరోనా పాజివ్ కేసులు నమోదయ్యాయి. అంతముందు వారాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రష్యా కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది. కాగా, కరోనా వైరస్ కట్టడికి భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. దేశీయంగా కూడా విమానాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి. (కరోనాపై యుద్ధం: భారత్పై చైనా ప్రశంసలు) -
పూర్తి లాక్డౌన్లో భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తూ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా (యూటీ)ల్లోని 548 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించింది. చండీగఢ్, ఢిల్లీ, గోవా, జమ్మూకశ్మీర్. నాగాలాండ్ కూడా ఇందులో ఉన్నాయి. అంతేగాక వాయు, జల, భూ మార్గాల ద్వారా భారత్లోకి ప్రవేశించగల 107 ఇమిగ్రేషన్ పోస్టులను మూసేస్తూ రాత్రి నిర్ణయం తీసుకుంది. దేశీ విమానాలన్నీ రద్దు రానున్న బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అన్నిరకాల దేశీ విమానయాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు, కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానాయాన శాఖ మంత్రి తెలిపింది. అంతర్జాతీయ సర్వీసుల్ని ఆపేయడం తెల్సిందే. దేశీ విమానాలపై నిషేధం మార్చి 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తుందని విమానయాన శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సరుకుల రవాణా చేసే విమానాలకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. దేశీ, అంతర్జాతీయ సరుకు రవాణా విమానాల రాకపోకలు ఉంటాయి. కార్గో విమానాలకు మాత్రమే అనుమతి శంషాబాద్: కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి శంషాబాద్ నుంచి వెళ్లే విమానాలు సహా అన్ని దేశీయ విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రతిరోజూ 380కి పైగా దేశీయ సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 8.38 గంటలకు చికాగో నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి రాత్రి 10 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరింది. ఇది మినహా మిగతా అన్నీ ఆదివారం అర్థరాత్రి నుంచి పూర్తిగా టేకాఫ్, ల్యాండింగ్ నిలిపివేశాయి. అంతర్జాతీయంగా మొత్తం 37 ప్రాంతాలకు శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎయిర్పోర్టులో ప్రయాణికుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. -
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. కరోనా మూడో దశకు వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. మార్చి 22 నుంచి వారం రోజులపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 65 ఏళ్లకు పైబడినవారు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించింది. పౌరవిమానయాన, రైల్వేల్లో పాసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వారం పాటు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నట్టు పేర్కొంది. అత్యవసర సర్వీసులు మినహా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కోరింది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటివరకు భారత్లో 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పంజాబ్లో కరోనా సోకిన వృద్ధుడు గురువారం మరణించడంతో.. భారత్లో వైరస్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. చదవండి : భారత్లో మరో ‘కరోనా’ మరణం ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్ -
జెట్ సంక్షోభం : మరో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. పీటీఐ సమాచారం ప్రకారం శుక్రవారం మరో మూడు రోజుల పాటు అంటే ఏప్రిల్ 15, సోమవారం దాకా అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. ఇప్పటికే రెండు రోజులపాటు అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రిత్వ కార్యాలయం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిశ్రాను కలవనున్నారు. జెట్ ఎయిర్వేస్ సమస్య, పరిష్కాలపై సమీక్షించనున్నారు. ఇది ఇలా ఉంటే తమకు జీవితాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జెట్ ఎయిర్వేస్ సిబ్బంది ఆందోళనకు దిగారు. దాదాపు 2వేల మంది ఉద్యోగులు ముంబైలో ర్యాలీ నిర్వహించారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం తమకు క్లారిటీ ఇవ్వాలని కోరారు. అంతేకాదు మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్, సీఈవో వినోద్ దువే, యాజమాన్యంపై లేబర్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. 25 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జెట్ దేశీయంగా కూడా 10 విమానాలను రద్దు చేసింది. దీంతో అద్దె బకాయిలు చెల్లించలేక నిలిపి వేసిన విమానాల సంఖ్య 79కి చేరింది. మరోవైపు అనూహ్యంగా జెట్ విమానాలను రద్దు చేయడంతో విమాన ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. కోలకతా, ముంబై విమానాశ్రయాల్లో టికెట్ల డబ్బులు రిఫండ్ కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. అలాగే క్యాన్సిల్ అయిన టికెట్ల డబ్బులను తిరిగి ఇచ్చేందుకు రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణీకులు వాపోయారు. అసలు దీనిపై నిర్దిష్టమైన సమాచారం ఏదీ అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జెట్ ఎయిర్వేస్లో నెలకొన్న సమస్యను పరిశీలించాల్సిందిగా సివిల్ ఏవియేషన్ మంత్రి సురేష్ ప్రభు నేడు (శుక్రవారం) పౌర విమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ సమస్యను చక్కదిద్దాలంటూ సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్ వాటాల కొనుగోలుకు బిడ్లకు సమర్పించేందుకు గడువు ఈ సాయంత్రంతో ముగిసింది. -
రెండు రోజులు అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతూ విమాన సర్వీసులను నిలిపివేస్తున్న జెట్ ఎయిర్వేస్ తాజాగా మరోషాకింగ్ న్యూస్ చెప్పింది. ఇవాళ, రేపు( ఏప్రిల్ 11,12) అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆమ్స్టర్డాం, ప్యారిస్, లండన్కు సర్వీసులను నిలిపి వేసింది. నిధుల లేమి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి తోడు లీజు చెల్లించలేక మరో 10 విమానాలను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ గురువారం బీఎస్ఈ ఫైలింగ్లో ప్రకటించింది. దీంతో బకాయిలు చెల్లించలేక నిలిచిపోయిన విమానాల సంఖ్య మొత్తం 79 కి చేరింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను అటు ప్రభుత్వం, ఇటు డీజీసీఏ పరిశీలిస్తోంది. నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపాలంటే ఎయిర్లైన్స్ కనీసం 20 విమానాలను కలిగి వుండాలి. అయితే గత నెలనుంచి కేవలం14 విమానాలను మాత్రమే నడుపుతోంది. ఇది అంతర్జాతీయ కార్యకలాపాలను నిలిపి వేయడానికి దారి తీయనుంది. ఒకవైపు జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించే ప్రయత్నాలు కొనసాగుతుండగానే, తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్వేస్ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్టు దారుణంగా తయారవుతోంది. -
అక్టోబర్ నుంచి విస్తార విదేశీ సర్వీసులు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తార అక్టోబర్ నుంచి విదేశీ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ముందుగా న్యూఢిల్లీ నుంచి కొలంబో (శ్రీలంక), ఫుకెట్ (థాయ్లాండ్) ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన అనుమతులు పొందడం, అంతర్జాతీయ కార్యకలాపాల ప్రణాళికలు ఖరారుకి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టినట్లు వివరించాయి. -
ఇక ఉడాన్ ఇంటర్నేషనల్
సాక్షి, హైదరాబాద్: చౌక ధరకే విమాన సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఉడాన్ పథకం దేశీయంగా విజయవంతం కావడంతో దీన్ని అంతర్జాతీయ సేవలకు కూడా విస్తరించ నున్నామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న ముడి చమురు ధర పరిశ్రమను దెబ్బతీసిందన్నారు. దీంతో గత మూడేళ్ల కాలంలో భారత్లో విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 20 శాతం చొప్పున పెరుగుతున్నాఈ ఏడాది వృద్ధి 17.5 శాతానికి పరిమితం కానుందన్నారు. ముడి చమురు బ్యారెల్ ఇంధన ధర 80 డాలర్ల కంటే తక్కువగా ఉంటే వచ్చే 20 ఏళ్లలో యేటా విమానయాన రంగం 15 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న ‘వింగ్స్ ఇండియా 2018' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్లోబల్ గా మూడవ అతిపెద్ద ఏవియేషన్ హబ్ గా ఇండియా ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న ఇంధన ఛార్జీల వల్ల విమానయాన కంపెనీలు భారంగా ఉన్నప్పటికీ..టికెట్ల ధరలు తగ్గిస్తేనే సమాన్యుని విమాన ప్రయాణ కల నెరవేరుతుందన్నారు. ప్రాంతీయంగా విమాన సేవలు అందించే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీంలో గత రెండేళ్లలో 56 నూతన విమానాశ్రయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇండియాలో 395 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా. ప్రస్తుతం వీటి సంఖ్య 900 ఎయిర్ క్రాఫ్ట్స్ చేరుకుందని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక అరవయేళ్ళలో 75 ఎయిర్ పోర్టులు డెవలప్ చేశాం..ప్రతీ ప్రధాన పట్టణానికి ఎయిర్ కనెక్టివిటీ ఉంది..ఉడాన్ పథకం ద్వారా 51 ఎయిర్ పోర్టులను డెవలప్ చేస్తున్నాం..అందులో ఇప్పటికే 18 ఎయిర్ పోర్టులు తమ ఆపరేషన్స్ ప్రారంభించాయని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు చేయడం వల్ల వచ్చే 6-8 నెలల్లో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చే వీలు ఉందున్నారు. వచ్చే నాలుగేళ్లలో వంద పట్టణాలను కనెక్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.వచ్చే నాలుగేళ్లలో వ్యాపారాన్ని భారీగా విస్తరించేందుకు, విమానాశ్రయాలను ఆధునీకీకరణకు రూ.18వేల కోట్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు చౌబే ప్రకటించారు. అలాగే ఎయిర్పోర్ట్ అఫ్ ఇండియాయాక్ట్ (ఏఏఐ)లో మార్పులు తెస్తామని చౌబే ప్రకటించారు. ఏఏఐ సవరణ బిల్లుపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోగానీ, ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం త్వరలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉడాన్ ఇంటర్నేషనల్ పథకంలో అంతర్జాతీయ రూట్లలో సేవలు అందించడానికి తాము మార్గనిర్దేశనం, బిడ్డింగ్ వ్యవహారాలు మాత్రమే చేయనున్నామని, అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చు కోవాలన్నారు. ఇప్పటికే దీనిపై అసోం ప్రభుత్వం ఆసక్తిని చూపినట్టు తెలిపారు. దాదాపు మూడేళ్లపాటు 100కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకువచ్చినట్టు చౌబే వివరించారు. మిగతా రాష్ట్రాలు ఇంకా స్పందించాల్సి ఉందన్నారు. -
గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు: అశోక్
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈనెల 19వ తేదీన గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పౌర విమాన రంగంలో మన దేశం ప్రపంచంలో 14వ స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. నీటిలో, గాలిలో ప్రయాణించగలిగిన సీ ప్లేన్ను ప్రారంభిస్తున్నామన్నారు. 👉🏿అమరావతిలో కూడా సీప్లేన్ ప్రదర్శన చేయాలని స్పైస్ జెట్ సీఎండీని కోరానన్నారు. -
విశాఖ విమానాశ్రయం.. ఇక 24 గంటల సేవలు
గోపాలపట్నం (విశాఖపశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ గ్రేడ్ హోదా సాధించటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగనున్నాయి. ఇంతవరకు రాత్రి 11 గంటలతో సర్వీసులు నిలిపివేసే పరిస్థితి ఉండగా... ఇకపై 24 గంటలూ సర్వీసులు నడపినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడి విమానాశ్రయానికి ఇప్పటికే దుబాయ్, సింగపూర్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా కొలంబోకు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ సంస్ధ జులై 8 నుంచి సర్వీసులు అందుబాటులోకి తేబోతోంది. థాయ్ ఎయిర్లైన్స్ సర్వీసు వచ్చే అక్టోబరు 29 నుంచి బాంకాక్కు ప్రారంభం కాబోతోంది. ఈ విమానం రాత్రి 12.30కి బాంకాక్ నుంచి విశాఖకు వచ్చి తిరిగి 1.30కి బ్యాంకాక్కు బయలుదేరుతుంది. ఇలా రాత్రి 12 తర్వాత సర్వీసులకు ఇప్పటివరకు అత్యవసరమయితే గాని అనుమతించడంలేదు. రాత్రి వేళ సర్వీసులకు చర్యలు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్ ఎయిర్లైన్స్ విమానం అర్ధరాత్రి వేళల్లో వచ్చి వెళ్లడానికి ఎయిర్పోర్టు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఎయిర్పోర్టు డైరెక్టరు ప్రకాష్ రెడ్డి సమీక్షించారు. సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాల సంఖ్య పెంచడానికి తాను ఇప్పటికే కేంద్రానికి నివేదించానని, దీనికి ఆమోదం వచ్చిందని ప్రకాష్రెడ్డి తెలిపారు. -
2018 నుంచివిస్తారా విదేశీ సర్వీసులు!
ముంబై : దేశీ విమానయాన సంస్థ ‘విస్తారా’ అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇది 2018 ప్రధమార్దంలో విదేశాలకు విమానాలను నడిపే అవకాశముంది. ‘ఇప్పటికిప్పుడే ఏదోరకంగా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని మేం ఊవ్విళ్లూరడం లేదు. కానీ కచ్చితంగా విదేశాలకు విమానాలను నడుపుతాం. దీనికి మేం పూర్తిగా సన్నద్ధం కావాల్సి ఉంది.’ అని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఇందులో ఆయన యాక్సిస్ బ్యాంక్తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రధమంగా సార్క్, గల్ఫ్ దేశాలకు విదేశీ సర్వీసులను నడుపుతామని సంజీవ్ తెలిపారు. తమ వద్ద ఉన్న విమానాలు ఈ ప్రాంతాలకు మాత్రమే రాకపోకలు నిర్వహించగలవని పేర్కొన్నారు. కాగా విస్తారా దేశంలో తన కార్యకలాపాలను గతేడాది జనవరి 9న ప్రారంభించింది. ప్రస్తుతం 17 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతోంది. అక్టోబర్ నుంచి పోర్ట్బ్లెయిర్కు కూడా విమానాలు నడపనున్నది. ప్రస్తుతం విస్తారా వద్ద 11 విమానాలు ఉన్నాయి. సంస్థ అక్టోబర్లో మరో రెండింటిని డెలివరీ చేసుకోనున్నది. -
విమానయానంపై ఆఫర్లే... ఆఫర్లు
-
విమానయానంపై ఆఫర్లే... ఆఫర్లు
ముంబై: విమాన టికెట్లకు సంబంధించి ఆఫర్ల వర్షం కురుస్తూనే ఉంది. జెట్ ఎయిర్వేస్ రూ.908కే విమాన యానాన్ని(అన్ని చార్జీలు కలుపుకొని) అందిస్తోంది. దీనికి ప్రతిగా రూ.690కే విమాన యానాన్ని అందిస్తామని ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది. మరోవైపు స్పైస్జెట్ సంస్థ ఎంఎస్ఎంఈ సంస్థల వ్యక్తులకు 10 శాతం డిస్కౌంట్కే విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది. జెట్ ఎయిర్వేస్: ఎయిర్ఏషియాకు గట్టిపోటీనివ్వడానికి ఆ సంస్థ నడిపే రూట్లలోనే జెట్ ఎయిర్వేస్ రూ.908కే విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది. బెంగళూరు నుంచి చెన్నై, చంఢీగర్, కోచి, జైపూర్ విమాన టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని జెట్ తెలిపింది. ఎయిర్ఏషియా ఆఫర్ రూ.690 నుంచి జెట్ ఎయిర్వేస్ ఆఫర్కు ప్రతిగా ఎయిర్ఏషియా కంపెనీ రూ.690 నుంచి ప్రారంభమయ్యే ధరలకే విమానయానాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా 15 లక్షల ప్రమోషనల్ సీట్లను అందిస్తున్నామని తెలిపింది. బెంగళూరు నుంచి చెన్నై, కోచి, గోవాలకు రూ.690కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. బెంగళూరు నుంచి జైపూర్, చండీగర్లకు రూ.2,390లకు విమాన టికెట్ను అందిస్తోంది. చెన్నై, కోచి, కోల్కత, తిరుచిరాపల్లి, బెంగళూరు నుంచి కౌలాలంపూర్కు రూ.4,999(అన్ని చార్జీలతో, కనీస ధర). చెన్నై నుంచి బ్యాంకాక్కు రూ.4.500కు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్కు బుకింగ్స్ సోమవారం నుంచే మొదలయ్యాయని, వచ్చే నెల 5 వరకూ ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 15-జూన్ 30 వరకూ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఎంఎస్ఎంఈ ప్రయాణికులకు స్పైస్జెట్ ఆఫర్ లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు చెందిన వ్యక్తులకు స్పైస్జెట్ 10% డిస్కౌంట్నిస్తోంది. ఎస్ఎంఈ ట్రావెలర్ పేరుతో దీన్ని అందిస్తోంది. -
గుజరాత్ కు రెండు విమాన సర్వీసులు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు రెండు అంతర్జాతీయ విమానాలు సర్వీసులు దక్కాయి. అహ్మదాబాద్-లండన్, సూరత్- దుబాయ్ అంతర్జాతీయ విమానాలకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆమోదం తెలిపింది. ఏఏఐ చైర్మన్ ఎస్ రహేజాతో అహ్మదాబాద్ లో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి సౌరభ్ పటేల్ సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో గుజరాత్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. -
శరవేగంగా ఎయిర్ పోర్టు అభివృద్ధి
సాక్షి, విజయవాడ : బందరు పోర్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్టును శరవేగంగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రతిపాదనలు, సర్వేలు పూర్తి చేసి త్వరితగతిన పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం జిల్లా అభివృద్ధి, ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడ నగరాభివృద్ధి, గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి, విజయవాడ-గుండుగొలను జాతీయ రహదారి నిర్మాణం, విజయవాడలోని కాలువల ఆధునికీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు సంబంధిత విభాగాల అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రానున్న 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గన్నవరం ఎయిర్పోర్టును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రధానంగా అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని పెంచేందుకు ఏ మేరకు చర్యలు తీసుకోవాలి.. ప్రయాణికుల సంఖ్య కూడా బాగా పెరగడానికి ఏంచేయాలి.. అనే అంశాలపై సమీక్షించాలని కలెక్టర్ను ఆదేశించారు. సింగపూర్ తరహాలో కాలువలపై కూడా రన్వే నిర్మించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయో.. లేదో.. సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని చెప్పారు. విజయవాడలో కాలువల ఆధునికీకరణకు తొలి విడతగా రూ.11.6 కోట్లు విడుదలకు తక్షణమే అనుమతులిస్తానని ప్రకటించారు. ఎక్కడా లేనివిధంగా విజయవాడలో కాలువలు ఎక్కువగా ఉన్నాయనీ, వాటిని సుందరీకరించడం ద్వారా జలమార్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, దీనిపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జలరవాణాకు తక్కువ ఖర్చు కేంద్ర ప్రభుత్వంతో తాను జరిపిన చర్చల్లో జలమార్గాన్ని ప్రస్తావించానని సీఎం చెప్పారు. జలమార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా బొగ్గు, ఖనిజ సంపద తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి వీలుందటుందనీ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. విజయవాడను మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చేయడానికి అధికారులు కసరత్తు చేయాలని ఆదేశించారు. విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న పట్టణాలను కలుపుతూ మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా ఫ్లై ఓవర్లను నిర్మించాలన్నారు. బెంజిసర్కిల్ నుంచి నాలుగు ఆధునిక ఫ్లైఓవర్లను నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని చెప్పారు. దీని కోసం మంచి కన్ల్టెన్సీలను సంప్రదించాలని సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సలహాలను తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపకల్పన చేయాలన్నారు. విజయవాడను లాజిస్టిక్ హబ్గా తీర్చుదిద్దుతానని సీఎం చెప్పారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని శ్రీవల్లి కాల్వల సుందరీకరణపై రూపొందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను సీఎం తిలకించారు. అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్రావు, బొండా ఉమా, వల్లభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, బోడే ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్, సీపీ శ్రీనివాస్, జేసీ జె.మురళి, ఎస్పీ ప్రభాకర్రావు పాల్గొన్నారు. -
అక్రమార్కులకు..బంగారు బాట
స్మగ్లర్ల అడ్డాగా వైజాగ్ ఎయిర్పోర్టు ఏడాదిలో నాలుగుసార్లు రూ.1.80కోట్ల బిస్కెట్ల పట్టివేత తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో పసిడి తరలింపుపై నిఘా పెంపు తప్పించుకునేందుకు విశాఖను కేంద్రంగా ఎంచుకుంటున్న అక్రమార్కులు సాక్షి, విశాఖపట్నం: ప్రశాంత విశాఖ నగరం రకరకాల నేరాలకు అడ్డాగా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైజాగ్ ఎయిర్పోర్టు క్రమక్రమంగా బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది.ఇక్కడి నుంచి దుబాయ్కు ఏకైక అంతర్జాతీయ విమాన సర్వీసు ఉండడంతో పసిడి అక్రమార్కులు ఈ విమానం ద్వారా ఎయిర్పోర్టు నుంచి సులువుగా బంగారం దారి మళ్లించేస్తున్నారు. చెన్నయ్, హైదరాబాద్ ఎయిర్పోర్టులో నిఘా పెరగడంతో పసిడి దొంగలు ప్రత్యామ్నాయంగా పెద్దగా నిఘా ఉండని వైజాగ్ ఎయిర్పోర్టును వ్యాపారానికి కేంద్రంగా ఎంచుకుంటున్నారు. రానురాను ఇక్కడి నుంచి అక్రమ రవాణా పెరిగిపోతోంది. గడిచిన ఏడాదిలో ఇప్పటివరకు నాలుగుసార్లు రూ.1.80 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు వెళ్లే విమానాలు చాలా తక్కువ. అందులోనూ దుబాయ్కు వెళ్లే ఏకైక సర్వీసు గతేడాది ప్రారంభమైంది. ఇది కూడా నేరుగా కాకుండా విశాఖ-హైదరాబాద్-దుబాయ్ మీదుగా వెళ్తుంది. దీంతో విశాఖ నుంచి నిత్యం అనేకమంది ప్రయాణికులు వచ్చి పోతుంటారు. కొందరు అక్రమార్కుల కన్ను ఈ సర్వీసుపై పడింది. తిరుగు ప్రయాణంలో దుబాయ్ విమానం హైదరాబాద్ మీదుగా వస్తుండడంతో పసిడి అక్రమార్కులకు మంచి వరంగా మారుతోంది. దుబాయ్ విమానం హైదరాబాద్లో దిగగానే పసిడి రవాణా చేసే వారి తరఫు వ్యక్తి హైదరాబాద్ నుంచి విశాఖకు రావడానికి దుబాయ్ విమానం టికెట్ తీసుకుంటున్నారు. తీరా ఫ్లైట్ విశాఖకు రాగానే సరకు హైదరాబాద్లో విమానం ఎక్కిన వ్యక్తికి కట్టబెడుతున్నారు. విశాఖలో విమానం దిగిన వెంటనే కేవలం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణిలకులను మాత్రమే కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఎక్కిన ప్రయాణికులపై నిఘా పెద్దగా ఉండడంలేదు. దీన్ని అడ్డంగా పెట్టుకుని పసిడిని విశాఖ ఎయిర్పోర్టునుంచి సులువుగా తరలించేస్తున్నారు. విశాఖ నుంచి దుబాయ్ సర్వీసు మొదలైన గతేడాదినుంచి ఇప్పటివరకు మొత్తం నాలుగుసార్లు దఫదఫాలు రూ.25లక్షలు, రూ.32లక్షలు, 2 కేజీల విలువైన రూ.60లక్షలు, 2.15 కేజీల విలువైన 61.02లక్షల సరకును పట్టుకున్నారు.అంటే పట్టుబడని సరకు ఇంకా ఎంతుంటుందో మరి.