iron
-
ఐరన్ లోపానికి అర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్
పుట్టగొడుగులు ఎంతో ఆరోగ్యదాయకమైనవని మనకు తెలుసు. రక్తహీనతకు ఐరన్ లోపం పెద్ద సమస్య. మన దేశంలో ముఖ్యంగా మహిళలు, యుక్తవయసు బాలికలు అధిక శాతంలో రక్త హీనతతో బాధపడుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు బెంగళూరులోని (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి– ఐసిఎఆర్– అనుబంధ సంస్థ) భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) అధిక పాళ్లలో ఐరన్ కలిగి ఉండే పుట్టగొడుగులను రూపొందించింది. ఐరన్ ఎల్మ్ ఆయిస్టర్ మష్రూమ్ను ఉత్పత్తి చేసి, దానితో రసం పొడిని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఎల్మ్ ఆయిస్టర్ పుట్టగొడుగుల్లో సాధారణంగా ఐరన్ 135.60 పిపిఎం స్థాయిలో ఉంటుంది. ఫార్టిఫికేషన్ ప్రక్రియ ద్వారా దీన్ని 338.15 పిపిఎంకు ఐఐహెచ్ఆర్ పెంపొందించింది. అంటే 149.37% పెంచిందన్నమాట. తినే ఆహారంలో ఉన్న పోషకాన్ని కూడా మన దేహం వంట పట్టించుకోగలిగేది తక్కువే ఉంటుంది. సాధారణంగా మొక్కల ఆహారం ద్వారా మనం తీసుకోగలిగే ఐరన్ 5–8% మాత్రమే. అదే ఇన్ఆర్గానిక్ ఐరన్ టాబ్లెట్లు వంటి సప్లిమెంట్ల ద్వారా 10–12% ఐరన్ను మాత్రమే మన దేహం తీసుకోగలదు. అయితే, ఐఐహెచ్ఆర్ రూపొందించిన ఆర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్ పొడితో రసం తయారు చేసుకొని రోజువారీ భోజనంలో తీసుకుంటే 21.68% ఐరన్ను తీసుకోగలుగుతామని ఐఐహెచ్ఆర్ పేర్కొంది. ఐరన్తో ఫార్టిఫై చేసిన పుట్టగొడుగుల పొడిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కుటీర పరిశ్రమగా ఉత్పత్తి చేసి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. చదవండి: ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధనShivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి? ఇతర వివరాలకు.. 080–23086100 – ఎక్స్టెన్షన్ 348, 349. mushroomiihr@gmail.com -
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు తక్షణ రక్షణ కవచం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తరహాలో ఐరెన్ డోమ్ నిర్మించుకుంటామని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్(Israel)పై జరిగే రాకెట్ దాడులను ఐరన్ డోమ్ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో అమెరికాకు ఓ ఐరన్ డోమ్ను నిర్మించుకుంటామని ట్రంప్ అంటున్నారు. రక్షణ కార్యదర్శిగా పీట్ హెగ్స్త్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమం మియామీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్.. ఐరన్ డోమ్(Iron Dome) వ్యాఖ్యలు చేశారు. అత్యవసరంగా ఆ నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకత ఉందని, అతిత్వరలో ఆ దస్త్రంపై సంతకం చేస్తానని వెల్లడించారాయన.👉ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్ డోమ్. నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్ వాసులు ధైర్యంగా తమ పని తాము చేసుకొనేట్లు చేసింది.👉2006లో హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. నాడు వేల రాకెట్లను ఆ సంస్థ టెల్అవీవ్ పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొంది. దీంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు తయారీకి నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. 2008 నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది.👉ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ చిట్టచివరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. హమాస్(Hamas), హెజ్బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేయడంతో ఇది ఆ మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది.👉ఐరన్ డోమ్ సక్సెస్ రేటు 90శాతానికి పైగానే ఉంది. అక్టోబర్ 7న హమాస్ దాడిలో వేల రాకెట్లను ఇది కూల్చేసింది. కానీ, కొన్ని దీని బారినుంచి తప్పించుకొని ఇజ్రాయెల్ వాసుల మరణాలకు కారణమయ్యాయి. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. దూసుకొచ్చే ఒక్కో ముప్పును పేల్చేయడానికి రెండు క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద 10 ఐరన్ డోమ్ బ్యాటరీలు ఉన్నట్లు రేథియాన్ అంచనావేసింది. దీనిని వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చవచ్చు. 2020లో అమెరికాకు రెండు బ్యాటరీలను ఎగుమతి చేశారు. ఐరన్ డోమ్ ఎలా పని చేస్తుందంటే.. ఐరన్ డోమ్ను స్థానికంగా ‘కిప్పాట్ బర్జెల్’ అంటారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి. రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. అదే జనావాసాలు అయితే మాత్రం రాకెట్ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్, రఫెల్ సంస్థలు పనిచేశాయి.ప్రతి ఐరన్ డోమ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు ఉంటాయి. ఒక్కోటి 10 సెకన్లలో 20 క్షిపణులను ప్రయోగించగలవు. అత్యధిక ముప్పులను ఏకకాలంలో ఎదుర్కొనేలా దీనిని డిజైన్ చేశారు. -
అమెరికా-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు.. రంగంలోకి ఎలాన్ మస్క్
వాషింగ్టన్ డీసీ: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు డొనాల్డ్ ట్రంప్ వడివడిగా పావులు కదుపుతున్నారు. ఇందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ని ట్రంప్ రంగంలోకి దించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. సోమవారం ఓ రహస్య ప్రాంతంలో ట్రంప్,ఇరవానిల మధ్య భేటీ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. రెండు నుంచి మూడుగంటల పాటు జరిగిన ఈ భేటీ సానుకూలంగా జరిగినట్లు వెల్లడించింది. అయితే ఈ భేటీపై అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలుఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 1న ఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని ఇరాన్ తెలిపింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ సుప్రీంనేత ఆయాతుల్లా అలీ ఖమేనీ ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్కు హెచ్చరించారు. తమని తక్కువ అంచనావేయొద్దని,తమకు జరిగిన నష్టానికి ఇజ్రాయెల్కు బదులిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.రంగంలోని ఎలాన్ మస్క్అయితే ఖమేనీ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ప్రతిదాడులకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అణు, చమురు క్షేత్రాలపై దాడి చేయకుండా ఇజ్రాయెల్ను నిరోధించామవి.., అలా కాదని ప్రతి దాడులు పాల్పడితే ఆ తర్వాత జరిగే పరవ్యసనాలను తాము బాధ్యులం కాదని తేల్చింది.అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఎలాన్ మస్క్ ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో భేటీ అవ్వడం ప్రపంచ దేశాల్లో ఆసక్తికరంగా మారింది. 👉చదవండి : ఆలయంపై దాడి ఘటన.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు -
తండ్రికొడుకు ప్రాణం తీసిన మంచం
సేలం: ఇనుప మంచం పడి తండ్రి, కుమారుడు మృతి చెందిన ఘటన దిండుగల్ లో ఆదివారం వేకువజా మున చోటు చేసుకుంది. దిండుగల్ సమీపంలో ఉన్న సానర్పట్టి కాలియమ్మన్ కోవిల్ వీధికి చెందిన గోపీకన్నన్ (35) టైలర్గా పని చేస్తున్నాడు. ఇతని భార్య యోగేశ్వరి (32) నత్తం ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తుంది. వీరికి కుమారుడు కార్తిక్ (10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి యోగేశ్వరి పనికి వెళ్లడంతో ఇంట్లో గోపీకన్నన్ మద్యం మత్తులో ఇనుప మంచంపై పడుకుని నిద్రపోయాడు. అతని పక్కన నేలపై కార్తిక్ పడుకున్నాడు. ఈ స్థితిలో వేకువజామున ఇనుప మంచం బోల్టు ఊడి కింద పడింది. దీంతో మంచం మధ్యలో తల చిక్కుకుని గోపికన్నన్ కింద పడుకుని ఉన్న కుమారుడు కార్తిక్పై పడ్డాడు. దీంతో తండ్రీ, కొడుకులు మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున లోగేశ్వరి తన భర్త, కుమారుడిని తనిఖీ చేసేందుకు వెళ్లింది. విరిగిన ఇనుప మంచంలో తన భర్త, కొడుకు చనిపోయి పడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. సానర్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు -
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
లోటస్ సీడ్స్ : అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!
లోటస్ లేదా తామర అనేది నెలంబో జాతికి చెందిన మొక్క. దీని గింజలను లోటస్ సీడ్స్, తామర గింజలు, మఖానా (ఫాక్స్నట్స్) అంటారు. సుమారు 7000 సంవత్సరాలుగా దీన్ని పూజల్లోనే ఔషధంగా కూడా ఉపయోగ పడుతోంది. ఒక విధంగా బాదం, జీడిపప్పు , ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఎండ బెట్టిన తామర గింజలను మంచి పోషకాహారం, ఔషధంగా వినియోగిస్తున్నారు. ఒకటి తెల్ల, రెండు గోధుమ రంగులో ఉన్న లోటస్ విత్తనాలు భారతదేశం, జపాన్ , చైనాలలో విస్తృతంగా సాగవుతున్నాయి.లోటస్ ఫుడ్ను ఆహారంగా చైనా ఆమోదించింది. లోటస్ గింజలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి. తామర గింజల వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం ♦ నిద్రలేమి, జ్వరం ,హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు సాంప్రదాయకంగా తామర గింజలను ఉపయోగిస్తారు. ♦ లోటస్ గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిట్యూమర్ ఎఫెక్ట్లతో సహా వివిధ ఔషధ కార్యకలాపాలను కలిగి ఉంటాయి. ♦ విరేచనాలు ,విరేచనాలు వంటి జీర్ణశయాంతర రుగ్మతలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ సంతానోత్పత్తి , లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ♦ ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. ♦ తేలికగా బరువు తగ్గాలనుకునే వారు లోటస్ సీడ్స్ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ♦ తామర పువ్వు వేర్లలో అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ♦ విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ,ఐరన్ ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ♦ 100 గ్రాముల మఖానాలో, 9.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ♦ లోటస్ సీడ్స్ లేదా ఫాక్స్ నట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది యాంటి ఏజింగ్ ఎలిమెంట్గా పనిచేస్తుంది. ♦ తామర గింజల్లో కెంప్ఫెరోల్ అనే సహజ సమ్మేళనం ఆర్థరైటిస్ రుమాటిజం రోగుల్లో వాపులను నివారిస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు ఇది మంచిది. ♦ గ్లూటెన్ రహిత పదార్తాలకు ప్రత్యామ్నాయంగా మఖానాను తినవచ్చు. -
హెల్త్: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో?
మానవ శరీరం చురుగ్గా పనిచేయలంటే ఐరన్, కాల్షియం అనే రెండూ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. అందుకే వైద్యనిపుణులు వివిధ రకాల కారణాల వల్ల క్యాల్షియం, ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవలసిందిగా పేషెంట్లకు సూచిస్తుంటారు. అయితే, ఈ రెండు సప్లిమెంట్లను కలిపి తీసుకుంటే.. కొన్ని దుష్ఫ్రభావాలు కలుగుతాయి. ఐరన్, కాల్షియం ఒకదానికొకటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందుకే వాటిని కలిపి ఒకేసారి తీసుకోవడం మంచిది కాదు. విటమిన్లు, మినరల్స్ కరిగిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల వాటి ద్వారా అందాల్సిన ప్రయోజనాలు శరీరానికి అందవు. ఈ రెండు సప్లిమెంట్లను ఆరు గంటల తేడాతో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గుర్తుంచుకోవాలి.. ఐరన్ తీసుకునే సమయంలో పాలు, చీజ్, పెరుగు, బచ్చలికూర, టీ, కాఫీ, తృణధాన్యాలు తీసుకునే ముందు కనీసం రెండు గంటల గ్యాప్ తీసుకోండి. ఐరన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు యాంటాసిడ్లను కూడా నివారించాలి. సూచించిన దానికంటే ఎక్కువ కాలం ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవద్దు. ఇవి చదవండి: హెల్త్: మెడనొప్పికి అసలు కారణాలేంటో తెలుసా!? -
వేడి వేడి ప్రెషర్ కుకర్ ఉండగా... ఐరన్ బాక్స్ దండగా
‘లిమిటెడ్ రీసోర్స్ నుంచే కొత్త ఐడియాలు జనించునోయి’ అని మరోసారి చెప్పడానికి ఈ వైరల్ వీడియో క్లిప్ సాక్ష్యం. కోల్కతాకు చెందిన మౌమితా చక్రవర్తి వేడి వేడి ప్రెషర్ కుక్కర్ను ఉపయోగించి షర్ట్ను ఐరన్ చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ట్విట్టర్లో రీపోస్ట్ చేసిన ఈ వీడియో రెండు లక్షల యాభై వేల వ్యూస్ను దాటింది. -
ఇదేందిది.. ప్రజర్ కుక్కర్ను ఇలానూ వాడొచ్చా?
కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా ఇంటిలోని వస్తువులతో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటువంటివాటిని చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేం. ఇన్నాళ్లూ ఈ సంగతి మనకు తెలియలేదే.. అని ఆశ్యర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ వీడియోలో ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఓ యువతి చేసిన పని చూస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే. హాట్ ప్రజర్ కుక్కర్ను ఉపయోగించి ఆ యువతి దుస్తులు ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఆ యువతి ఇండక్షన్ స్టవ్ నుంచి దించి, దానిని తీసుకుని గదిలోకి పరిగెడుతుంది. తరువాత ఆ కుక్కర్ సాయంతో ఒక షర్ట్ ఇస్త్రీ చేస్తుంది. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ 17 సెకన్ల వీడియో @Babymishra_ అనే ఖాతాతో ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల మందికి పైగా వీక్షించగా, ఆరు వందల మందికి పైగా యూజర్లు ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్ ‘ఆమె సృజనాత్మకతకు వందనం’ అని రాయగా, మరొక యూజర్ ‘ఇస్త్రీ పెట్టె నూతన ఆవిష్కరణ. వెంటనే పేటెంట్ తీసుకోవాలి’ అని రాశారు. प्रिय दीदी जी को दंडवत प्रणाम 🙏 pic.twitter.com/ux2XkGpMSX — Shubhangi Pandit (@Babymishra_) March 12, 2024 -
రిఫ్రెష్ అవుదామని టీ తెగ తాగేస్తే..ఆ శక్తి తగ్గిపోతుంది!
అలసిన శరీరాన్ని సేదతీర్చడంలోనూ, మనసును సాంత్వన పరచడంలోనూ టీ ని మించింది లేదని అందరూ అంటారు. అలాగని టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగితే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందంటున్నారు. టీలో అధికంగా ఉండే టానిన్ ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి. టీ లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, వికారం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. జీర్ణ సమస్యలు ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణశక్తిని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. గుండెల్లో మంట ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది. దీని కారణంగా ఆహార నాళంలో యాసిడ్ ఏర్పడి యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలతో పాటు పుల్లని తేన్పులు, వికారం కలుగుతాయి. నిద్ర సమస్యలు... కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు టీ తాగడం అలవాటు. అయితే ఇది వారి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన సమస్యను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు టీ కి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది. పేగులపై దుష్ప్రభావం... అధికంగా తాగే టీ మన పేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా టీ తీసుకునే వ్యక్తులు కెఫిన్, టానిన్ల కారణంగా ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. -
పండ్లను ఇనుములా మార్చి సుత్తిగా తయారుచేయొచ్చా!
ఫొటోలో కనిపిస్తున్న అరటిపండు నిజానికి ఒక సుత్తి. అలాగని అరటిపండు ఆకారంలో ఇనుముతో తయారుచేసిన సుత్తి కాదు. నిజమైన అరటిపండుతోనే రూపొందించిన సుత్తి ఇది. ఆశ్చర్యపోతున్నారా? ఈ మధ్యనే జపాన్కు చెందిన ‘ఐకెడా’ అనే కంపెనీ ఈ అద్భుతమైన అరటి సుత్తిని ప్రవేశపెట్టింది. సాధారణ వాతావరణంలో అరటిపండు మొత్తగా ఉంటుంది. కానీ మైనస్ డిగ్రీ సెల్సియస్ వాతవరణంలో పూర్తిగా గడ్డకట్టి .. బలమైన రాయి, సుత్తి కంటే గట్టిగా, బలంగా ఉంది. అలా ఫ్రీజ్ చేసిన అరటిపండుతో గోడకు మేకులు కొట్టే వీడియోలు ఇప్పటికే యూట్యూబ్లో చాలా ఉన్నాయి. దీని ఆధారంగానే ‘ఐకెడా’ గడ్డకట్టిన అరటిపండును తీసుకొని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో మెటల్ ప్రాసెసింగ్ చేసి ఈ అరటిసుత్తిని తయారుచేసింది. ఇదే విధంగా గతంలోనూ పైనాపిల్, బ్రోకలీ వంటివాటికీ మెటల్ ప్రాసెసింగ్ చేశారు. అయితే కొనుగోళ్లలో వాటన్నింటి కంటే ఈ అరటి సుత్తే టాప్లో నిలిచి వైరల్గా మారింది. ప్రస్తుతం ఇది వివిధ రకాల సైజుల్లో ధర రూ. వెయ్యి నుంచి రూ. ఆరువేల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆన్లైన్లోనూ లభ్యం. (చదవండి: పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?) -
ఇంటర్నెట్లో అసలు ఏం నడుస్తోంది?.. ఆ డైలాగ్ ఒక్కటేనా!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. గీత గోవిందం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి జతకట్టారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?) అయితే ఈ మూవీ గ్లింప్స్లో..' ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?’ అని విజయ్ విలన్కు వార్నింగ్ ఇస్తాడు. ప్రస్తుతం 'ఐరనే వంచాలా ఏంటి' అనే డైలాగ్ నెట్టింట వైరల్గా మారింది. ట్విటర్లో ఈ డైలాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ డైలాగ్ను సైతం విజయ్ దేవరకొండ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. అయితే ఈ డైలాగ్కు ప్రభాస్ మిర్చి సినిమాలో విలన్తో ఫోన్లో మాట్లాడే డైలాగ్ను జోడించారు. ఇంటర్నెట్.. అసలు ఏం నడుస్తోంది? అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ ఐరన్ డైలాగ్ను జతచేసి పోస్ట్ చేయడంతో ఐరనే వంచాలా ఏంటి(#Airanevanchalaenti), ఫ్యామిలీ స్టార్ (#FamilyStar) ట్రెండింగ్లోకి వచ్చాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఏకంగా పోస్టర్నే రిలీజ్ చేసింది. (ఇది చదవండి: వరుణ్తేజ్- లావణ్యల శుభలేఖ ఫోటో చూశారా? ఆరోజే రిసెప్షన్!) అయితే దీని వెనుక మరో కారణం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఐరన్ డైలాగ్, విజువల్స్ యాడ్ను తలపించేలా ఉన్నాయంటూ ట్రోల్స్.. వాటిని తిప్పికొట్టేందుకు టీమ్ ఇలా ప్లాన్ చేసిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Maakkuda 🤣🤣 #AiraneVanchalaEnti #FamilyStar https://t.co/nHkerzL0Zk — Sri Venkateswara Creations (@SVC_official) October 26, 2023 Have you said it yet :) pic.twitter.com/5dWTnHJIEp — Vijay Deverakonda (@TheDeverakonda) October 26, 2023 -
వేదాంతా ఐరన్, స్టీల్ బిజినెస్ షురూ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్ల విడదీత ప్రణాళికల్లో భాగంగా వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 1 ముఖ విలువగల లక్ష ఈక్విటీ షేర్ల అధీకృత మూలధనంతో సంస్థకు తెరతీసింది. గత నెల 29న ప్రకటించిన బిజినెస్ల విడదీత ప్రణాళికలకు అనుగుణంగా ఐరన్, స్టీల్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసినట్లు వేదాంతా వెల్లడించింది. విభిన్న విభాగాలైన అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ తదితరాలను 5 కంపెనీలుగా విడదీసేందుకు గత నెలలో వేదాంతా నిర్ణయించిన విషయం విదితమే. తద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇనుము, స్టీల్ బిజినెస్ నిర్వహణకు తాజాగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బుధవారం వేదాంతా బేస్ మెటల్స్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థకు తెరతీసిన సంగతి తెలిసిందే. -
వినాయక మండపం వద్ద భక్తులకు తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం: విశాఖపట్నంలో వినాయక మండపం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన చాక్లెట్ వినాయక మండపం వద్ద ఈదురు గాలులకు మండపంపై రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో వెనుకనే కూర్చున్న భక్తులపై సిమెంట్ రేకులు పడ్డాయి. భక్తులు తప్పుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తికి తలపై ఇనుప రాడ్డు పడింది. స్వల్ప గాయాలు అయ్యాయి. నిబంధనలు పాటించకుండా స్టాల్స్ ఏర్పాటుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తిరుమల: నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్: భూమన -
మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్
నోయిడా: నోయిడా ఫిలిం సిటీలోని లక్ష్మీ స్టూడియోలో దారుణం చోటుచేసుకుంది. అందాల పోటీల్లో భాగంగా ఓ మోడల్ రాంప్ వాక్ చేస్తుండగా ఇనుప స్తంభం మీద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడు గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందాలపోటీ జరుగుతున్న సమయంలో అందరి దృష్టి రాంప్ మీద తళుకులీనుతున్న అందమైన మోడల్స్ మీదే ఉంది. వారంతా ఫ్యాషన్ షోలో లీనమైపోయారు. వరుసక్రమంలో రాంప్ వాక్ చేయడానికి వచ్చిన మోడల్ వంశిక చోప్రా యధాప్రకారం రాంప్ మీద నడక మొదలుపెట్టింది. అంతలోనే లైట్ల కోసం పైన అమర్చిన ఇనుప స్తంభం ఉన్నట్టుండి కూలింది. అది నేరుగా వంశిక మీద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. కొంచెం దూరంలో ఉన్న బాబీ రాజ్ అనే మరో వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలవడంతో వైద్యం నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణ నేపధ్యంలో అడిషనల్ డిసిపి మోహన్ అశ్వతి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మోడల్ వంశిక చోప్రాగా గుర్తించాము. ఆమె మరణం గురించి తన కుటుంబ సభ్యులకు తెలియజేశాము. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాము. ఈవెంట్ నిర్వహిస్తున్న వ్యక్తి తోపాటు లైటింగ్ అమర్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: మన్మోహన్ సింగ్ ఒక పిరికిపంద.. అమిత్ షా -
2 వేల ఏళ్ల క్రితమే ఇనుము పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: ఇనుము తయారు చేసిన తర్వాత మిగిలిన వ్యర్ధమిది.. దీన్ని చిట్టెంగా పేర్కొంటారు. ఈ చిట్టెం రాళ్ల వయసు దాదాపు 2 వేల ఏళ్లు. శాతవాహనుల కాలంలోనే మన వద్ద ఇనుము పరిశ్రమ విలసిల్లిందనటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులో ఇలాంటి చిట్టెం నిల్వలను గుర్తించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఇనుము పరిశ్రమలకు నిలయంగా ఉండేదని, నాటి పరిశ్రమ తాలూకు అవశేషాలుగా ఇప్పుడు ఈ చిట్టెం రాళ్లు వెలుగుచూస్తున్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. చిట్యాలలో తమ బృందం సభ్యులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యాంసుందర్లు స్థానిక మూలోని గుట్ట సమీపంలోని తాళ్లగడ్డలో వ్యవసాయ క్షేత్రంలో చిట్టెం రాళ్లను గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమిని వ్యవసాయయోగ్యంగా మార్చే పనులు చేస్తున్నప్పుడు 20 అడుగుల చుట్టు కొలతగల ఇటుకల కట్టడం ఆనవాళ్లు వెలుగుచూసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఇనుము కరిగించేందుకు వాడే మూసలు, పెద్ద గొట్టాలు, భారీ గాగుల పెంకులు లభించినట్టు పేర్కొన్నారు. బయటపడిన భారీ ఇటుకలు 16 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న భారీ ఇటుకలు కూడా బయటపడినట్టు వెల్లడిస్తున్నారు. ఇనుము కరిగించగా మిగిలిన బొగ్గు బూడిద కూడా వెలుగు చూస్తోందని పేర్కొంటున్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర పరికరాలకు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇనుము పరిశ్రమలు ఉండేవనటానికి ఈ ఆధారాలు, ఇనుము దేవతగా పేర్కొనే మమ్మాయి దేవతారాధన ఆనవాళ్లు స్థానికంగా ఉన్నాయని హరగోపాల్ పేర్కొన్నారు. చిట్టెం పతం నుంచే చిట్యాల ఊరి పేరు వచి్చందని ఆయన వెల్లడించారు. సమీపంలోని పెద్ద మందడి, చిన్న మందడి, అమ్మాయిపల్లి, గణపురం, మానాజిపేటల్లో నాటి చారిత్రక ఆధారాలున్నాయని తెలిపారు. -
ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా..
ఎండ కన్నెరగని జీవితాల్లో డీ విటమిన్ లోపం సాధారణమైపోయింది. నరాలు, కండరాలు, వ్యాధినిరోధక శక్తి మీద విటమిన్ డీ ప్రభావం ఉంటుంది. దేహంలో డీ విటమిన్ లోపిస్తే... నీరసం, నిస్సత్తువ, తరచూ అంటువ్యాధుల బారిన పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్యాల్షియమ్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకున్నా సరే... దేహం ఆ క్యాల్షియమ్ను స్వీకరించదు. ఆహారంలోని క్యాల్షియమ్ని దేహం చక్కగా స్వీకరించాలంటే దేహంలో డీ విటమిన్ తగినంత ఉండాలి. అలాగే ఐరన్ కూడా. మనం ఆహారంలో తీసుకున్న ఐరన్ని దేహం గ్రహించాలంటే దేహంలో సీ విటమిన్ తగినంత ఉండాలి. విటమిన్ సీ లోపం ఉన్న వాళ్లు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నా సరే దేహం సంగ్రహించుకోలేదు. దాంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాదు... మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజెన్ తగు పాళ్లలో మెదడుకు చేరడం కూడా ముఖ్యమే. అలాగే ఛాతీ నిండుగా గాలి పీల్చుకోగలగడమూ అంతే అవసరం. దైనందిన ఆహారపు అలవాట్లలో భాగంగా అన్నం కూరలు, రొట్టె, పప్పులకు తోడుగా అవసరాన్ని బట్టి ఈ కింద చెప్పిన వాటిని ఆహారంలో భాగం చేసుకుందాం. క్యాల్షియమ్ కోసం... ►రాగులు, నువ్వులు, సబ్జా, అవిశె గింజలు, వాల్నట్, గెనస గడ్డ (స్వీట్ పొటాటో), పాలకూర, పుదీనలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. ►ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్తోపాటు మునగాకు, మునక్కాయలు వారంలో రెండు దఫాలు ఆహారంలో భాగం కావాలి. ►పాలు, పెరుగు లేదా మజ్జిగ రోజూ తీసుకోవాలి. ఐరన్ కోసం... ►మష్రూమ్, క్యాలీఫ్లవర్, లివర్, ట్యూనా ఫిష్, రొయ్యలు, బీట్రూట్, శనగలు, బ్రౌన్ రైస్, పుచ్చకాయ, దానిమ్మ, స్ట్రాబెర్రీలు, ఆపిల్తోపాటు విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పైనాపిల్, పియర్, నారింజ, కమలాలు తీసుకోవాలి. ►డ్రైఫ్రూట్స్లో ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు నమిలి తినాలి. ►అన్ని కాలాల్లో దొరికే సంపూర్ణ పోషకాల అరటి పండ్లు నిత్య ఆహారంగా ఉండాలి. ►పైవన్నీ తీసుకుంటే డీ విటమిన్ కూడా తగినంత అందుతుంది. విటమిన్ డీ కోసం ►మష్రూమ్, సోయా, గుడ్లు, పాలు, పెరుగు, మీగడలు, చేపలు డీ విటమిన్నిచ్చే ఆహారాలు. ►వీటితోపాటు రోజుకు కనీసం పావుగంట సేపు దేహానికి సూర్యరశ్మి తగలాలి. ►సూర్యరశ్మి సోకే చోట మార్నిగ్ లేదా ఈవెనింగ్ వాకింగ్ చేస్తే మంచిది. ►ఇవి సాధారణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ప్రధానమైన ఆహార జాగ్రత్తలు మాత్రమే. ►మనదేహంలో క్యాల్షియమ్, ఐరన్ స్థాయులను బట్టి డాక్టర్ సూచన మేరకు కచ్చితమైన డైట్ ప్లాన్ను అనుసరించాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..!
కొన్ని సార్లు వీపరీతంగా ఆకలి అనిపిస్తుంది. తక్షణం శక్తి కావాలనిపిస్తుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? ఆహారంలో ఏ ఏ రకాలు ఉంటాయి? ఏవి తింటే మంచిది? వాటి గురించి తెలుసుకోండి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీలైనంత త్వరగా శక్తిని పొందవచ్చు. ప్రోటీన్లు: శరీర కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్లు, గింజలు, చీజ్ మరియు లీన్ మీట్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల స్థిరమైన శక్తిని శరీరానికి లభించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడోలు మరియు చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు: కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా తాత్కాలిక శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు: కణాలకు ఆక్సిజన్ను చేరవేసే హిమోగ్లోబిన్ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్ మరియు టోఫు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అలసటను నివారించడంలో మరియు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు తక్షణ శక్తిని అందించగలవని గమనించడం ముఖ్యం. శక్తి స్థాయిలను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి వీలైనంత వరకు తినకూడదు. దీని వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
మీ కన్నయ్య మన్ను తింటున్నాడా?
కొందరు పిల్లలు తల్లిదండ్రుల కళ్లు కప్పి మట్టి, బలపాలు, గోడకు ఉండే సున్నపు బెత్తికలు తింటూ ఉంటారు. మరికొందరు పెద్దవాళ్లు కూడా బియ్యంలో మట్టిగడ్డలు తినడం చూస్తుంటాం. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నట్లు చిన్నప్పుడే పిల్లల్లో ఉండే మట్టి తినే అలవాటును మాన్పించకుంటే వారి ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మట్టితినే అలవాటు మాన్పించడం ఎలాగో చూద్దామా? ఎందుకు తింటారంటే..? చాక్లెట్లు, బిస్కట్లు, లాలీపాప్లు, ఇలా రకరకాల తినుబండారాలు ఉండగా వాటన్నింటికీ బదులు లేదా వాటితోపాటు అప్పుడప్పుడు ఇలా మట్టి ఎందుకు తింటారో తెలుసా? ... విటమిన్ల లోపమే అందుకు కారణం. శరీరంలో ఉండవలసిన దానికన్నా బాగా తక్కువ పరిమాణంలో ఈ విటమిన్లు ఉండటం లేదా అసలే లేకపోవడం వల్ల పిల్లలు మట్టితింటూ ఉంటారు. కాల్షియం, ఐరన్ తగినంత లేకపోవడం వల్ల పిల్లలు ఇలా మట్టి తినడానికి అలవాటు పడతార ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న పదార్థాలు తినేలా చూడాలి. పిల్లలకు మట్టి, బలపాలు తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6 -7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలచేత తాగించండి. అవసరం అనుకుంటే దీనికి కొద్దిగా తేనె కలిపినా మంచిదే. అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు. -
బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక..
భోపాల్: బొగ్గు గనిలో ఇనుము చోరీ చేసేందుకు వెళ్లిన నలుగురు దొంగలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లా కాల్రిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గని నుంచి బయటకు తీశారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ బొగ్గు గనిలోని జంక్ మెషీన్లలో ఇనుమును దొంగిలించేందుకు వెళ్లారు. ఓ వ్యక్తి బయట కాపలాగా నిలబడగా.. మిగిలిన నలుగురూ గనిలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి ఎంతసేపైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో బయట నిలబడిన వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీంతో బొగ్గు గని వద్దకు వెళ్లిన పోలీసులు ఆ నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అయితే వారు అప్పటికే చనిపోయారు. లోపల ఊపిరాడకపోవడం వల్లే వీరు మరణించి ఉంటారని చెప్పారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రూ.44లక్షలు విలువ చేసే 110 టన్నుల తుక్కును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్క్రాప్ డీలర్లపై చర్యలు తీసుకున్నప్పుడు ఇది బయటపడింది. దొంగలు ఇనుమును దొంగిలించి డీలర్లకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. చదవండి: ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య! -
Puneeth Rajkumar: ఐరన్ స్క్రాప్తో పునీత్ రాజ్కుమార్ విగ్రహం
తెనాలి: కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీనటుడు డాక్టర్ పునీత్ రాజ్కుమార్ అభిమానుల వినతిపై ఆయన నిలువెత్తు ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని గుంటూరు జిల్లా తెనాలిలోని సూర్య శిల్పశాల శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తయారు చేశారు. టన్నున్నర ఐరన్ స్క్రాప్ను వినియోగించి నాలుగు నెలలు శ్రమించి తొమ్మిది అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. బెంగళూరులోని ఓ ప్రధాన కూడలిలో ప్రతిష్టించనున్నారు. -
కదిలే ఇల్లు! ధర తక్కువ...ఎక్కడికైనా తీసుకుపోవచ్చు
హనుమకొండ: సొంతిల్లు నిర్మించుకుకోవాలంటే నెలల సమయం పడుతుంది. ఒక ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే శాశ్వతంగా ఆ చోటే ఉంటుంది. కానీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కదిలే ఇళ్లు వస్తున్నాయి. వరంగల్ నగరంలోని వడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన మొబైల్ హౌజ్ నగరవాసులను ఆకట్టుకుంంటోంది. వడ్డేపల్లికి చెందిన బొల్లేపల్లి సుహాసిని, సతీష్ గౌడ్ దంపతులు సుబేదారి–వడ్డేపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సొంత ప్లాట్లో ఇల్లు కట్టాలనుకున్నారు. ఎక్కువ డబ్బులు అవుతుండటంతో రెడీమేడ్ హౌస్ గురించి తెలుసుకుని, వారిని సంప్రదించారు. రూ. 8.50 లక్షలతో కిచెన్, సింగిల్ బెడ్ రూం, అటాచ్డ్ బాత్ రూం, హాల్తో పూర్తిగా ఐరన్ ఉపయోగించిన మొబైల్హౌస్ను నిర్మించారు. లారీలో తీసుకువచ్చి బిగించేశారు. ఈ ఇంటిని ఎక్కడికైనా తరలించుకునే అవకాశముంది. 30 ఏళ్లకుపైగా పటిష్టంగా ఉంటుందని గ్యారంటీ ఇచ్చినట్లు సతీష్గౌడ్ తెలిపారు. ఇల్లు 4 టన్నుల బరువు ఉంది. (చదవండి: 63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్) -
అమితాబ్ బచ్చన్కు గాయం.. విపరీతమైన రక్తస్రావం.. కుట్లు
ముంబై: ఇటీవల తన ఎడమ కాలికి గాయమైందని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఇనుప ముక్క కాలిపిక్కను చీల్చడంతో విపరీతంగా రక్తస్రావమైందని, కుట్లు కూడా పడ్డాయని ఆదివారం తన బ్లాగ్లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని డాక్టర్లు గట్టి సలహా ఇచ్చినా గాయం కట్టుతోనే కౌన్ బనేగా కరోడ్పతి చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎడమ కాలి పిక్కకు బ్యాండేజీతో కౌన్ బనేగా కరోడ్పతి సెట్స్లో పరుగెత్తుతున్న ఫొటోలను శనివారం ఆయన పోస్ట్ చేశారు. -
నిజాయితీకి నిలువెత్తు రూపమై.. రూ.4 లక్షల విలువైన నగను..
సాక్షి, అమలాపురం: స్థానిక భూపయ్య అగ్రహారం మహానంద అపార్ట్మెంట్లో వాచ్మన్గా ఉంటున్న మల్లేశ్వరరావు దంపతులు నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచారు. తమ వద్దకు బ్యాగ్లో ఉన్న రూ.4 లక్షల విలువైన బంగారు నగను సంబంధిత వ్యక్తులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు కుమార్తె డాక్టర్ ఆర్.సాయిశిల్ప పట్టణంలో సాయి సంజీవిని ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. మాసిన తన వస్త్రాలను ఉతికి ఇస్త్రీ చేసేందుకు రజకులైన మల్లేశ్వరరావు దంపతులకు ఆమె ఇస్తారు. ఎప్పటిలాగే రెండు రోజుల కిందట డాక్టర్ సాయిశిల్ప మాసిన వస్త్రాలను ఓ బ్యాగ్లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. అప్పటికే ఆ బ్యాగ్తో ప్రయాణించి వచ్చిన ఆమె తనకు చెందిన రూ.4 లక్షల విలువైన బంగారు నగ ఉన్న కవర్ను అదే బ్యాగ్లో మరచిపోయారు. మాసిన వస్త్రాలను అదే బ్యాగ్లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. ఈలోగా బంగారు నగ కనిపించకపోవడంతో డాక్టర్ సాయిశిల్ప కుటుంబీకులు మధనపడుతున్నారు. ఇంతలో ఆ బ్యాగ్లో మాసిన వస్త్రాలను ఉతికేందుకు బయటకు తీసిన మల్లేశ్వరరావు దంపతులకు ఆ బంగారు నగ కనిపించింది. దీంతో ఆ బంగారు నగను ఆ దంపతులు నిజాయితీగా తీసుకువెళ్లి డాక్టర్ సాయిశిల్పకు అందజేశారు. వారి నిజాయితీకి మెచ్చిన సాయిశిల్ప తల్లిదండ్రులైన మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, ఉషాకుమారి దంపతులు.. మల్లేశ్వరరావు దంపతులను సోమవారం సత్కరించారు. వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. మల్లేశ్వరరావు దంపతుల నిజాయితీని భూపయ్య అగ్రహారం ప్రజలు అభినందించారు. చదవండి: (చెవిలో చెబితే.. కోరికలు తీర్చే స్వామి) -
తుక్కు విక్రయంతో రైల్వేకు రూ.100 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తుక్కు ఇనుము విక్రయం ద్వారా దక్షిణ మధ్య రైల్వే 103 రోజుల్లోనే రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రైల్వేలో ఇనుప తుక్కు విపరీతంగా పేరుకుపోతుండగా.. చోరీలు జరగడంతోపాటు కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా దారితీస్తోంది. దీనికి పరిష్కారంగా దక్షిణ మధ్య రైల్వే ‘జీరో స్క్రాప్ పాలసీ’ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇనుప తుక్కును వదిలించుకునేందుకు దానిని ఎప్పటికప్పుడు విక్రయించేలా అనుమతి ఇచ్చింది. డివిజన్ల పరిధిలోని అన్ని సెక్షన్లలో ఇనుప తుక్కును గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. ట్రాక్ల పక్కన ఇనుప తుక్కు గరిష్టంగా నెల రోజుల కంటే ఉండటానికి వీల్లేదని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు స్పష్టం చేశారు. విరిగిన రైలు పట్టాలు, పీ–వే ఐటమ్స్, లోకోలు, కోచ్లు, వేగన్లకు సంబంధించి తుక్కును ఎప్పటికప్పుడు మ్యాపింగ్ చేసి ఇ–ప్రొక్యూర్మెంట్కు అందుబాటులో ఉంచుతున్నారు. అందుకోసం యూజర్ డిపో మాడ్యూల్ను అన్ని స్టోర్ డిపోల వద్ద ఉంచారు. ఈ విధానం సత్ఫలితాలిస్తోంది. ఇంతకుముందు ప్రతి మూడు నెలలకు ఒకసారి తుక్కును విక్రయించేవారు. దీనివల్ల ఇనుము తుప్పు పట్టి సరైన ధర వచ్చేది కాదు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు తుక్కును విక్రయిస్తుండటంతో అధిక ధర వస్తోంది. రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 103 రోజుల్లోనే తుక్కు విక్రయాలతో ఏకంగా రూ.100 కోట్ల ఆదాయం రావడం విశేషం. 2021–22లో మొదటి మూడు నెలల్లో రూ.51 కోట్ల ఆదాయం రాగా, 2022–23లో రూ.100 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. రానున్న రోజుల్లో జీరో స్క్రాప్ పాలసీని మరింత సమర్థంగా అమలు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు అన్ని డివిజన్ల అధికారులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. -
Munni Devi: ఇస్త్రీ చేసే మున్ని ఎంఎల్సి అయ్యింది
బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి జీవించే 40 ఏళ్ళ మున్నీ రజక్ ఎం.ఎల్.సి. అయ్యింది. అందుకు కారణం ఆమె గట్టిగా మాట్లాడగలగడం. పెద్దగా అరవగలగడం. లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొనే ర్యాలీల్లో ఆమె గొంతు చించుకుని నినాదాలు చేస్తుంది. ధర్నాల్లో ముందు వరుసలో కూచుని టీవీలకు బైట్లు ఇస్తుంది. ఎన్డిఏ గవర్నమెంట్ను విమర్శిస్తూ ధైర్యంగా పాటలు పాడుతుంది. ఇవన్నీ ఆర్.జె.డి నేత లాలూను మెప్పించాయి. ఆమెను నిజమైన కార్యకర్తగా గుర్తించి తమ పార్టీ తరఫున ఎం.ఎల్.సి.ని చేశాడు. 75 మంది సభ్యుల విధాన పరిషత్లో కూచోబోతున్న మున్నీ రాజకీయాల మురికిని కూడా వదలగొడతానంటోంది. కొన్ని ఘటనలు కొందరి మేలుకు జరుగుతాయి. 2019. జుడీషియల్ కస్టడీలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు. బయటంతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు. రాంచీకి 300 కిలోమీటర్ల దూరం ఉన్న భక్తియార్పూర్లో అక్కడి రైల్వేస్టేషన్ పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని జీవించే మున్నీ అంత దూరం నుంచి రాంచీకి లాలూని చూడటానికి వచ్చింది. కాని సెక్యూరిటీ వాళ్లు ఆమెను లోపలకు వదల్లేదు. దాంతో ఆమె టీవీ కెమెరాల ముందు పెద్దపెద్దగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ‘నా దేవుడు లాలూని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తారా...’ అంటూ లాలూకు మద్దతుగా విపరీతంగా మాట్లాడింది. ఇది లాలూ కంట పడింది. ఆయన మెచ్చాడు. కట్ చేస్తే – భక్తియార్పూర్లో నడుచుకుంటూ వెళుతున్న మున్నీ పక్కనే మొన్నటి జూన్ మొదటి వారంలో ఒక జిప్సీ ఆగింది. ‘ఎక్కు’ అన్నారు అందులో ఉన్నవారు. బిహార్లో అధికారంలో ఉన్నది జె.డి.యు, బిజెపి అలెయెన్స్ ప్రభుత్వం. తాను ఆర్.జె.డి కార్యకర్త. పోలీసులు కాదుకదా అని భయపడింది. కాదు తమ పార్టీ వాళ్లే. అక్కడికి గంట దూరంలో ఉన్న పాట్నాలో రబ్రీదేవి బంగ్లాకు తీసుకెళ్లారు. లోపల రబ్రీ దేవి, పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ఉన్నారు. ‘లాలూగారు నిన్ను ఎం.ఎల్.సి చేయడానికి నిశ్చయించుకున్నారు’ అని వారు తెలిపితే మున్నీకి మాట రాలేదు. కృతజ్ఞతలు చెప్పి బయట పడింది. ఈ విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యింది. అయితే ‘అయినప్పుడు చూద్దాం’ అని కొందరు అనుకున్నారు. మరోవైపు పార్టీలో రజక వర్గానికే చెందిన మరొక నాయకుడు చురుగ్గా పని చేస్తున్నాడు. రజకులలో ఇవ్వాలనుకుంటే అతనికే ఇస్తారని ఊహించారు. కాని అంచనాలు తారుమారయ్యాయి. జూన్ 20న జరగనున్న ఎం.ఎల్.సి. ఎన్నికల్లో ఆర్.జె.డి. తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్. ముగ్గురు పిల్లల తల్లి మున్నీ ముగ్గురు పిల్లల తల్లి. భర్త అవదేశ్ రజక్ కూడా వృత్తి పనే చేస్తున్నాడు. వీరికి భక్తియార్పూర్లోని రైల్వేస్టేషన్ పక్కనే ఉండే ఇస్త్రీ బండి ఆధారం. అయితే గత పదేళ్లుగా మున్నీ ఆర్.జె.డి. కార్యకర్తగా మారింది. ఆమె పాటలు పాడగలదు. పార్టీ సభలకు స్టేజ్ మీద పాటలు పాడుతుంది. అంతేకాదు లోకల్ టీవీ చానల్స్లో ఆమె పార్టీ విధానాలకు పెద్ద పెద్దగా అరిచి చెప్తుంది. నితీష్ ప్రభుత్వాన్ని బాగా తిట్టి పోస్తుంది. ఇవన్నీ పార్టీని ఆకర్షించాయి. ‘అట్టడుగు స్థాయి కార్యకర్తలను లాలూ అభిమానిస్తారని చెప్పడానికి, ఆ స్థాయి వారికి కూడా పదవులు దక్కుతాయని చెప్పడానికి మున్నీ ఎంపిక ఒక ఉదాహరణ’ అని ఆర్.జె.డి. నేతలు అంటున్నారు. మున్నీ చాలా ఉత్సాహంగా పని చేయాలనుకుంటోంది. ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడేవాళ్లదే పైచేయి కాబట్టి విధాన పరిషత్లో ఆమె విమర్శలు అధికార పార్టీని ఇరుకున పెట్టడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు. మున్నీ రజక్ గురించి మున్ముందు మనం మరిన్ని విశేషాలు వినడంలో ఆశ్చర్యం లేదు. -
Hair Fall: జుట్టు రాలకుండా ఉండాలంటే..?
జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కోని యువత ఇంచుమించు ఇటీవల కాలంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ ఐరన్, విటమిన్ – సి. ఈ మూడూ పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలిపోవడాన్ని చాలావరకు అరికట్టవచ్చు. జుట్టు రాలిపోకుండా చేసే వాటిలో ఐరన్ కీలకమైనది. మనకు ఐరన్ సమృద్ధిగా అందాలంటే... గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటి తీసుకోవాలి. మాంసాహారంలో.. కాలేయం, కిడ్నీల వల్ల ఐరన్ ఎక్కువగా సమకూరుతుంది. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ. అందుకే ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అవసరం. విటమిన్–సి కోసం: ఉసిరిలో విటమిన్–సి పుష్కలంగా దొరుకుతుంది. అలాగే బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్–సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జింక్: గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారం లో జింక్, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ గట్టిగా సిఫార్సు చేస్తోంది. జింక్కు గుమ్మడి గింజలు మంచి వనరు. దానితోపాటు సీఫుడ్, డార్క్చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలోనూ జింక్ ఎక్కువే. పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. మీరు తినే సమతులాహారంలో ఇవి తీసుకుంటూనే... జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేయండి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. అప్పటికీ జుట్టు రాలుతుంటే మాత్రం... ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యతతో జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఆహారం ద్వారానే ఈ సమస్యను అధిగమించాలనుకుంటే మీ డైట్లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చేసుకొండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే ఓసారి ట్రైకాలజిస్ట్ను కలిసి వారి సలహా మేరకు మందులు, పోషకాలు తీసుకోవడం మంచిది. -
ఏడువారాల గుహలు.. తళుక్కుమంటున్న రాళ్లు
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా సిరాలగ్రామం శివారులోని గుహలు తళుక్కుమంటున్నాయి. ఎవరో రంగులద్దినట్టు ఇంద్రధనస్సు తరహాలో వాటిల్లోని రాళ్లు మెరుస్తున్నాయి. దాదాపు అర కిలోమీటరు వెడల్పుతో నాలుగైదు కిలోమీటర్ల మేర ఈ గుహలు విస్తరించి ఉన్నాయి. లిమొనైట్, హెమటైట్ తదితరాలతో కూడిన ఈ శిలలు ఇనుప ఖనిజంతో ఉన్నందుననే ఇలా రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయని జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల రావు చెప్పారు. ఈ నిక్షేపాలు జీఎస్ఐ అధికారికంగా గుర్తించిన జాబితాలో లేవన్నారు. శిలల్లో ఇనుప ఖనిజ పరిమాణం ఎంత ఉందో శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. 25 కోట్ల నుంచి 17 కోట్ల సంవత్సరాల క్రితం శిలలు ఏర్పడి ఉంటాయని జీఎస్ఐ అంచనా. తాజాగా ఈ గుహలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బలగం రామ్మోహన్ పరిశీలించారు. ఈ ఖనిజం విషయాన్ని పక్కనపెడితే గుహలు సందర్శకులకు కొత్త వినోదాన్ని పంచుతున్నాయని చెప్పారు. వీటి గురించి స్థానికులకు తప్ప ఇతర ప్రాంతాల వారికి పెద్దగా అవగాహన లేదని, అందుకే పెద్దగా పర్యాటకులు రావట్లేదని అన్నారు. స్థానికులు వీటిని ఏడువారాల గుహలంటున్నారని చెప్పారు. రుషులు ఒక్కో రోజు ఒక్కో గుహలో తపస్సు చేసుకునేవారని ప్రచారంలో ఉందని అన్నారు. -
Health Tips: గోరు చిక్కుడు కూర తిన్నారంటే.. అందులోని హైపోగ్లైసియామిక్ గుణాల వల్ల
చాలా మంది గోరు చిక్కుడును ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోరు చిక్కుడు కాయ ఫ్రైలో చారు వేసుకుని తింటే.. ఆ టేస్టే వేరు. కేవలం రుచికి మాత్రమే పరిమితమైపోలేదు మన గోకరకాయ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తనలో ఇముడ్చుకుంది కూడా. సాధారణంగా భారత్లోని పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో, పాకిస్తాన్లోనూ గోరుచిక్కుడు విరివిగా పండుతుంది. అమెరికా, మెక్సికో, ఆఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా దీనిని విస్తారంగా పండిస్తారు. కరువు పరిస్థితులను తట్టుకుని మరీ పెరగడం గోరు చిక్కుడుకు ఉన్న లక్షణం. గోరుచిక్కుడును కూరలు తదితర వంటలతో పాటు, గోరుచిక్కుడు జిగురును పలు రకాల ఆహార ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. గోరు చిక్కుడులో ఉండే పోషకాలు ►గోరు చిక్కుడులో ప్రొటీన్లు అధికం. ►స్వల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఉంటాయి. ►విటమిన్–ఎ, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–కె వంటివి గోరు చిక్కుడులో ఉంటాయి. ►క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలను గోరు చిక్కుడు కలిగి ఉంటుంది. గోరు చిక్కుడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ►మధుమేహంతో బాధపడే వారికి గోరు చిక్కుడు వంటలు ఉపయోగకరం. రక్తంలో చక్కెర స్థాయిని ఇది నియంత్రిస్తుంది. ►అంతేగాక గోరు చిక్కుళ్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ►అదే విధంగా కాల్షియం, ఫాస్పరస్ కలిగి ఉండటం వల్ల ఎముకలకు, కండరాలకు బలాన్నిస్తాయి. ►గోరు చిక్కుడులో ఐరన్ ఉంటుంది. కాబట్టి రక్తహీనతను నివారించడంలోనూ ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ►జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యర్థాలను బయటకు పంపే గుణం దీనికి ఉంటుంది. ►స్థూలకాయాన్ని అరికట్టడంలోనూ గోరు చిక్కుడు పాత్ర చెప్పుకోదగినదే. ►గోరు చిక్కుడులోని హైపోగ్లైసియామిక్ గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. యాంగ్జైటీని తొలగిస్తుంది. చదవండి: Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల.. -
Health Tips: రోజూ గ్లాసు పళ్ల రసం చక్కెర వేయకుండా తాగితే..
Top 5 Health Tips For Women: ఇంట్లో అందరికీ అన్నీ అమర్చాలి. ఈ బాధ్యత ఎప్పుడూ మహిళ మీదనే ఉంటుంది. ఆ మహిళ ఉద్యోగిని అయినా సరే ఇంట్లో వాళ్ల ఆహారం, ఆరోగ్యం అనే రెండు కీలక బాధ్యతలను కూడా తన భుజాల మీదనే మోస్తూ ఉంటుంది. ఇంటిని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకునే క్రమంలో తన జీవితంలో అనేక ప్రాధాన్యాలు వెనుకబడిపోతుంటాయి. వాటిలో ముఖ్యమైనవి తాను తీసుకునే ఆహారం, తన ఆరోగ్యం. ఉన్నత విద్యావంతులైన మహిళలను కూడా వదలకుండా పట్టి పీడిస్తున్న సమస్యలివి. తీవ్రమైన అలసట, అంతకు మించి మానసిక ఒత్తిడి... ఈ రెండూ దేహాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. అప్పుడు పరీక్షించుకుంటే దేహంలో పోషకాలు, సూక్ష్మపోషకాలు గణనీయంగా పడిపోయి ఉంటాయి. ఈ స్థితికి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రొటీన్ డైట్ ప్లాన్లో వీటిని చేర్చుకోవాలి. ► ఉదయం ఒక గ్లాసు తాజా పళ్లరసం చక్కెర వేయకుండా తీసుకోవాలి. ► మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా ఒక కప్పు ఆకుకూర ఉండాలి. ►రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఇది దేహాన్ని చల్లబరుస్తుంది. భోజనం తర్వాత ఐస్క్రీమ్ వంటి డెజర్ట్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. ►రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగాలి. ►ఈ మార్పు వల్ల అవసరమైన క్యాల్షియం అందుతుంది, ఐరన్, ప్రొటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. చదవండి: Legs Swelling- Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే... -
జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్ రోజూ తింటే
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఐరన్ ఒక ముఖ్యమైన అంశం. ఐరన్ లోపం వల్ల శరీరంలో రక్తహీనత వస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. వాస్తవానికి, హిమోగ్లోబిన్ రక్త కణాలలో ఉండే ఐరన్ అధికంగా ఉండే ప్రోటీన్, ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను అందించడానికి పనిచేస్తుంది. ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడితే, చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది సజావుగా పనిచేయాలంటే, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను ఆహారం లో చేర్చడం చాలా ముఖ్యం. నాన్–వెజ్, సీఫుడ్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హిమోగ్లోబిన్ పెంచడానికి మంచి వనరులు. అవి మీ శరీరంలోని ఐరన్ లోపాన్ని పూరిస్తాయి. శరీరంలో హిమోగ్లోబిన్ వేగంగా పెరిగే డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.. ఐరన్ అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు: ఐరన్ అధికంగా ఉంటుంది. మీరు రోజూ కొన్ని జీడిపప్పులను తీసుకుంటే, అది శరీరంలో 1.89 మి.గ్రా ఐరన్ను సరఫరా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, స్నాక్స్ తినాలని అనిపించినప్పుడల్లా, మీరు కొన్ని జీడిపప్పు తినాలి. బాదం పప్పు రోజూ పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పును తీసుకుంటే, అది మీ శరీరంలో రక్తం లేకపోవడాన్ని నయం చేస్తుంది. కొన్ని బాదంపప్పులో 1.05 మి.గ్రా ఐరన్ ఉంటుంది, ఇది ఒక రోజులో శరీర అవసరాన్ని తీర్చగలదు. అందువల్ల, మీ ఆహారంలో బాదంపప్పును చేర్చండి. వాల్ నట్స్: మామూలు గా మెదడుకు పదును పెట్టడానికి అక్రోట్లను తినమని సలహా ఇస్తారు, అయితే ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని కూడా తీర్చగలదు. రోజూ కొన్ని అక్రోట్లను తీసుకుంటే, 0.82 మి.గ్రా ఐరన్ శరీరానికి అందుతుంది. పిస్తా సాధారణంగా పిసా ్తపప్పులను స్వీట్ల రుచి, అందాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు, కాని ఇది ఐరన్తో సమృద్ధిగా ఉందని మీకు తెలియజేయండి, శరీరంలో ఐరన్ కొరత ఉన్నప్పుడు సులభంగా సరఫరా చేయగలదు. మీరు రోజూ కొన్ని పిస్తాపప్పులు తింటుంటే, శరీరానికి 1.11 మి.గ్రా ఐరన్ లభిస్తుంది. -
3 టన్నుల ఇనుముతో 14 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
తెనాలి: తెనాలి శిల్పకారులు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 14 అడుగుల విగ్రహాన్ని ఇనుప వ్యర్థాలతో తయారు చేశారు. సూర్య శిల్పశాల నిర్వహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రలు 3 టన్నుల ఇనుప వ్యర్థాలను ఉపయోగించి, 3 నెలల శ్రమతో అంబేడ్కర్ విగ్రహాన్ని వీరు తీర్చిదిద్దారు. శిల్పశాల ఎదుట ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆదివారం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహంతో ఎమ్మెల్యే శివకుమార్ -
రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తిన్నారంటే..
►రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు (సన్ ఫ్లవర్ విత్తనాలు) తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ►ఈ విత్తనాల్లో ప్రొటిన్ , జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ , విటమిన్ ఈ, బీ, బీ6, మంచి కొవ్వులు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ►ఈ గింజల్లోని విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం రక్త పీడనం నియంత్రణలో ఉండడానికి తోడ్పడతాయి. ►విటమిన్ బి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ గింజలు డైలీ తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు కూడా పెరుగుతాయి. ►బరువుని అదుపులో ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచి ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వదు. ►ఇంకా దీనిలో ఉన్న విటమిన్ ‘ఈ’ చర్మానికి పోషణ అందించి, హానికర కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చదవండి: బ్రేకింగ్ రికార్డ్.. ఏడడుగుల సౌకుమార్యం -
జర చూసి తినండి: పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు
మారిన జీవనశైలితో ప్రజలు వండడం తగ్గించేసి ఆన్లైన్ ఫుడ్ యాప్లపై పడ్డారు. ఇట్ల ఆర్డర్ చేస్తే అలా ఇంటి గడప ముందుకు వస్తుండడంతో ప్రజలు బద్ధకస్తులై వంట గది వైపు చూడడం లేదు. ఇలా ఆన్లైన్లో వచ్చే ఆహారాన్ని కొంచెం చూసి తినాలి. ఫుడ్ యాప్లు అందిస్తున్న ఆహారంలో గతంలో ఎన్నోసార్లు ఆహారం సక్రమంగా లేకపోవడం.. పాడవడం.. లేదా ఇతర పదార్థాలు రావడం జరిగాయి. తాజాగా ఓ మహిళకు పిజ్జా ఆర్డర్ చేయగా పిజ్జాలో ఇనుప నట్లు.. బోల్టులు వచ్చాయి. అది చూసి నోరెళ్లబెట్టిన ఆమె వెంటనే ఫిర్యాదు చేయడంతో న్యాయం జరిగింది. ఈ సందర్భంగా ఆమె కొంచెం చూసి తినాలని సూచిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: ‘అమ్మాయిలూ ‘జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) యూకే (ఇంగ్లాండ్)లోని లాంకషేర్ రాష్ట్రం థార్టన్ క్లెవెలెస్ జంట నగరాలకు చెందిన ఓ మహిళ గతనెల 29వ తేదీన డోమినోస్లో పిజ్జా ఆర్డర్ చేసింది. ఇంటికి చేరిన పిజ్జాను తీసుకుని తింటుండగ ఇనుప నట్లు, బోట్లు కనిపించాయి. ఒక్కసారిగా ఆమె షాక్కు గురయ్యింది. వాటిని ఫొటో తీసి పెట్టుకుని డోమినోస్కు ఫిర్యాదు చేసింది. నట్లు, బోట్లు రావడంపై సంస్థ క్షమాపణ చెప్పింది. తన డబ్బులు చెల్లించమని అడగడంతో సంస్థ తిరిగి ఇచ్చేసింది. అయితే అంతకుముందే ఆమె ఈ విషయాన్ని తన సోషల్మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. (చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో) మహిళ: ‘తినడానికి ముందు మీ పిజ్జాలను ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా థోర్టన్ క్లెవ్లీస్లోని డొమినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ పెట్టేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె సూచించింది. డొమినోస్: ‘అసౌకర్యానికి క్షమాపణలు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు స్టోర్తో మాట్లాడాం. డొమినోస్ వినియోగదారుడి సంతృప్తి, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి. ఇకపై ఇవి కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. -
75 వేల ఇనుప వ్యర్థాలతో గాంధీ విగ్రహం
సాక్షి, తెనాలి: శిల్పకళలో ఖండాంతర ఖ్యాతిని కలిగిన గుంటూరు జిల్లా తెనాలి పట్టణం, ఇనుప వ్యర్థాలతో తీర్చిదిద్దిన కళాకృతుల్లోనూ ఘనత వహిస్తోంది. ఇనుప వ్యర్థాలతో జీవం ఉట్టిపడే శిల్పాలను చేస్తూ, విదేశాల్లోనూ ప్రదర్శిస్తోన్న స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు తాజాగా భారీ ధ్యాన గాంధీ విగ్రహాన్ని రూపొందించారు. 10 అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఈ విగ్రహానికి 75 వేల ఇనుప నట్లను వినియోగించారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం చేసిన ఈ విగ్రహాన్ని ఆదివారం తమ శిల్పశాల ఎదుట ప్రదర్శనకు ఉంచారు. చదవండి: ఐఏఎఫ్లో ఫ్లైయింగ్ ఆఫీసర్గా ఆటో డ్రైవర్ కుమారుడు కృష్ణానది ఒడ్డున ఘాతుకం: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
వీడి తెలివి సల్లగుండ.. ఇళ్లంతా ఐరన్తోనే నిర్మాణం
సాక్షి, సైదాబాద్: అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే కూల్చేస్తారని అతి తెలివితో ఓ వ్యక్తి ఐరన్తో నిర్మాణం చేపట్టాడు. ఐఎస్సదన్ డివిజన్ ఆర్టీసీకాలనీలో ప్రధాన రహదారికి ఆనుకొని ఐరన్తో జీ–ప్లస్ వన్ను నిర్మించాడు. శ్లాబు, గోడలు, మెట్లు అంతా ఐరన్తోనే నిర్మించడం గమనార్హం. కింది భాగంలో నాలుగు షెట్టర్లను ఏర్పాటు చేశాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చామని టౌన్ప్లానింగ్ అధికారి మల్లీశ్వర్ తెలిపారు. స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఢిల్లీ ఐరన్పిల్లర్... తుప్పుపట్టని చరిత్ర
ఇది ఢిల్లీ ఐరన్పిల్లర్... ఎత్తు 23 అడుగుల ఎనిమిది అంగుళాలు. వ్యాసం పదహారు అంగుళాలు. బరువు మూడు టన్నులకు పైమాటే. తుప్పుపట్టని భారత చరిత్రకు ప్రతీక. భారతీయ శాస్త్రనైపుణ్యానికి ప్రతిబింబం. దేశ రాజధానిలో ఇనుప స్తంభం... ఎక్కడ ఉంది? ఢిల్లీ నగరంలో మెహ్రౌలీలో ఉంది. అర్థమయ్యేలా చెప్పాలంటే కుతుబ్మినార్ ఆవరణలో ఉంది. ఎవరు నిలబెట్టారిక్కడ? తోమార్ రాజు అనంగ పాలుడు కావచ్చు, బానిస పాలకుడు ఇల్టుట్మిష్ కావచ్చు. ఈ కావచ్చుల వెనుక ఇంకా మరెన్నో కావచ్చులున్నాయి. దీనిని ఎవరు నిర్మించారనే ప్రశ్నకు సమాధానం ఈ స్తంభం మీదున్న శాసనాలే. సంస్కృత భాషలో బ్రాహ్మి లిపిలో ఉన్న ఈ శాసనాలను చదవడానికి అక్బర్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ ప్రయత్నంలో సఫలమైంది బ్రిటిష్ పాలకులే. లండన్ ఆర్కియాలజిస్టుల మేధోతవ్వకం తర్వాత బయటపడిన వాస్తవం ఏమిటంటే... ఇది పదహారు వందల ఏళ్ల నాటి స్తంభం. గుప్తుల కాలం నాటిది. రెండవ చంద్రగుప్తుడు క్రీ.శ నాలుగవ శతాబ్దంలో మధ్యప్రదేశ్లోని విష్ణుపాద కొండల మీద స్థాపించాడని వెల్లడైంది. ఈ పిల్లర్ మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు భారతదేశంలో గుప్తుల కాలం నాటికే లోహశాస్త్రం అత్యున్నత దశకు చేరి ఉండేదని సూత్రబద్ధంగా నిర్ధారించారు. అంత పెద్ద పుస్తకాలు చదివి అంత గొప్ప సైన్స్ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయినా ఏం ఫర్వాలేదు. ఈ పిల్లర్ని చూసి ఆ మేధోఘనులకు ఒక సెల్యూట్ చేసి, పిల్లర్ ముందు నిలండి ఫొటో తీసుకుంటే ఎప్పటికీ తుప్పు పట్టని ఓ మంచి జ్ఞాపకం మన ఆల్బమ్లో నిక్షిప్తమై ఉంటుంది. నిజమో! కాదో!! కానీ... ఈ పిల్లర్ చూడడానికి సన్నగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ పిల్లర్ మన వీపుకి తగిలేటట్లు నిలబడి రెండు చేతుల్ని వెనక్కి చాచి పిల్లర్ని చుట్టడానికి ప్రయత్నిస్తే చేతులు అందవు. ఈ ప్రయత్నంలో రెండు అరచేతుల్ని పట్టుకోగలిగిన వాళ్లు గొప్ప వ్యక్తులవుతారని అక్కడ ఒక సరదా నమ్మకం ఉండేది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చేతులు అందాయని కూడా చెప్పేవారు. పర్యాటకులందరూ ప్రయత్నించి విఫలమయ్యేవాళ్లు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడానికి కూడా వీల్లేదు. పిల్లర్ చుట్టూ కంచె కట్టేశారు. దూరంగా నిలబడి చూసి ఆనందించాల్సిందే. మధ్యప్రదేశ్లోనే ఎందుకు? కర్కాటక రేఖ మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరామ్.. మొత్తం ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఎక్యునాక్స్డే (పగలు– రాత్రి సమంగా ఉండేరోజు) సూర్యుడి గమనం సాగే రేఖామార్గంలో మధ్యప్రదేశ్లో ఉన్న విష్ణుపాద కొండల మీద ఈ ఇనుపస్తంభాన్ని స్థాపించారు. ఇది ఈ ఇనుపస్తంభ స్థాపన వెనుక ఉన్న ఖగోళ విజ్ఞానం. అంతకు మించిన లోహశాస్త్ర విజ్ఞానం కూడా ఈ పిల్లర్లో నిక్షిప్తమై ఉంది. బ్రిటిష్ కాలంలో ఆర్కియాలజిస్ట్ జేమ్స్ ప్రిన్సెప్ 1817లో ఈ పిల్లర్ మీద అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియచేశాడు. మెటలర్జరిస్ట్ సర్ రాబర్ట్ హోడ్ఫీల్డ్ 1912లో రీసెర్చ్ మొదలు పెట్టాడు. అనేకమంది శాస్త్రవేత్తలు ఇందులోని శాస్త్రీయత మీద పరిశోధనలు చేసి రెండు వందల యాభైకి పైగా పేపర్లు, పుస్తకాలు వెలువరించారు. ఇది ఒక మెటలర్జికల్ వండర్ అని తేల్చేశారంతా. ఈ ఐరన్ పిల్లర్ని తుప్పపట్టనివ్వని లోహపు పూత మందం మిల్లీమీటరులో ఇరవయ్యో వంతు. ఈ టెక్నాలజీ మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. – వాకా మంజులా రెడ్డి -
ప్రయోగం చేశాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు
నేటి తరం పిల్లలు ఒక పట్టాన ఏదీ నమ్మరు. స్వయంగా తమంతట తాము స్వయంగా తెల్సుకుంటేగాని ఒక నిర్ణయానికి రారు. ఈ కోవకు చెందిన వాడే మనం చెప్పుకోబోయే చిచ్చరపిడుగు రిలేమోరిసన్. ఇంగ్లాండ్లోని గ్రేట్ మాంచెస్టర్కు చెందిన 12 ఏళ్ల మోరిసన్ 54 మ్యాగ్నటిక్ బాల్స్ మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఆయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని లె లుసుకున్న మోరిసన్ .. మాగ్నెట్తో తయారు చేసిన బాల్స్ను మింగితే.. తన పొట్ట అయస్కాంతంలా పనిచేస్తుందని అనుకున్నాడు. అసలు అది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకునేందుకు జనవరి 1న కొన్ని బాల్స్, నాలుగున... కొన్ని... మొత్తం 54 మ్యాగ్నటిక్ బాల్స్ను మింగేసాడు. మింగిన తరువాత ఒక ఐరన్ స్టిక్ను తన పొట్ట మీద ఉంచాడు. ఎంతకీ అది అయస్కాంతానికి ఆతుక్కోక పోవడంతో.. తాను మింగిన బాల్స్ టాయిలెట్లో పడిపోయాయేమోనని వాష్రూమ్కు వెళ్లి చూశాడు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో కంగారుపడిపోయాడు. వాటిని ఎలా బయటికి తీయాలో తెలియక నానా అవస్థలు పడిన మోరిసన్ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వాళ్ల అమ్మ పైజ్వార్డ్ను నిద్రలేపి పొరపాటున రెండు మ్యాగ్నటిక్ బాల్స్ను మింగానని చెప్పాడు. వెంటనే మోర్సిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన పైజ్కు విస్తుపోయే నిజం తెలిసింది. చదవండి: రెడ్ హ్యాండెడ్గా దొరికిన కుక్క! కూలో చేరిన కంగనా: ట్విటర్కు కౌంటర్ డాక్టర్లు ఎక్స్రే తీసి మొత్తం 54 బాల్స్ ఉన్నాయని చెప్పారు. ఇవి కడుపులో అలాగే ఉండిపోతే వేరే అవయవాలు పాడై ప్రాణం పోయే అవకాశం ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి సర్జరీని ప్రారంభించారు. ఆరుగంటల పాటు నిర్విరామంగా సర్జరీ చేసి మోరిసన్ మింగిన బాల్స్ అన్నింటినీ బయటకు తీశారు. అప్పటికీ మోరిసన్ పూర్తిగా కోలుకోలేదు. హాస్పిటల్లో 10 రోజుల పాటు ఉండిపోవలసి వచ్చింది. పేగుకు రంధ్రం పడడం వల్ల ఆకుపచ్చని ద్రవం ఒకటి విడుదలవ్వడంతో దానిని పూర్తిగా కక్కిన తరువాత గాని అతను కదల్లేకపోయాడు. ఈ సమయంలో అతనికి ట్యూబ్ ద్వారా ఆహారం అందించారు. రెండు వారాలు తరువాత పూర్తిగా కోలుకుని డిచార్జ్ అయ్యాడు మోరిసన్. మోరిసన్కు సైన్స్ అంటే ఎంతో ఆసక్తి. ప్రయోగాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అందుకే కడుపులో మ్యాగ్నెటిక్ బాల్స్ ఉంటే ఐరన్ స్టిక్ తన పొట్టకు అతుక్కుంటుందా లేదా అనే∙విషయం తెలుసుకోవడానికి ఇలా చేసానని మోరిసన్ చెప్పినట్లు తల్లి చెప్పారు. ఈ విషయం మనకు చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ మోరిసన్ చాలా చిన్నవాడు కావడంతో ఇలా చేసాడని ఆమె వివరించారు. -
ఇనుములో ఓ హృదయం మొలిచెనే!
సాక్షి, గుంటూరు: ఇనుములోనూ ఓ హృదయాన్ని సృష్టించారు. అద్భుత కళానైపుణ్యంతో ఇనుప వ్యర్థాలకు జీవం పోశారు. అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ కళారూపాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. తెనాలికి చెందిన శిల్పకళాకారులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర వీటిని సృష్టించగా, వార్ఫ్రోడ్డులోని వర్క్షాపులో గురువారం ప్రదర్శించారు. ఆటోమొబైల్ పరికరాలతో భారీ శిల్పాలను తయారుచేస్తూ బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పాటు సింగపూర్, మలేసియా వంటి దేశాలకు ఎగుమతి చేశారు. ప్రస్తుతం ప్రపంచ రికార్డు సాధన లక్ష్యంతో ప్రత్యేకించి ఈ తరహాలో భారీ కళాకృతులను రూపొందిస్తున్నారు. ఆరడుగుల ఎత్తులో డోలు, తబల, 15 అడుగుల పొడవైన సన్నాయి, ఎద్దుల బండి, క్రీస్తును శిలువ వేసిన బొమ్మను రూపొందించారు. -
ఎగుమతులకు 12 రంగాల ఎంపిక
న్యూఢిల్లీ: దేశీయ అవసరాలను స్థానికం గానే తీర్చుకోవడంతోపాటు (స్వీయ సమృద్ధి), ఎగుమతులకు అవకాశమున్న 12 రంగాలను ఎంపిక చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. భారత్లో తయారీ కార్యక్రమం కింద ఈ 12 రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. భారత్ తన అవసరాలకు తనపైనే ఆధారపడడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆహార శుద్ధి, సహజ సాగు, ఐరన్, అల్యూమినియం, కాపర్, ఆగ్రో కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెషినరీ, ఫర్నిచర్, లెదర్ అండ్ షూ, ఆటో విడిభాగాలు, టెక్స్టైల్స్, కవరాల్స్, మాస్క్లు, శానిటైజర్లు, వెంటిలేటర్ల విషయంలో భారత్ అంతర్జాతీయ సరఫరాదారుగా అవతరించగలదని మంత్రి చెప్పారు. ఈ రంగాల్లో భారత్ పోటీ పడగలదని, ఇతర దేశాలతో పలిస్తే మన దేశానికి సానుకూలతలు ఉన్నట్టు పేర్కొన్నారు. నేడు బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి సమావేశం ప్యాకేజీలోని పథకాల అమలుపై చర్చ న్యూఢిల్లీ: దేశీ ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్యూ)ల చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (శుక్రవారం) సమావేశంకానున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ. 21 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా అమలుకానున్న పలు పథకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జరిగే ఈ మీటింగ్లో రుణాల జారీ, తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనం బదలాయింపు, మారటోరియం వంటి పలు ఇతరాత్ర అంశాలపై చర్చించనున్నారు. -
అక్కడ పగటిపూట ఐరన్ వర్షం..!
లండన్ : సౌర కుటుంబానికి వెలుపల.. 650 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహానికి సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. అసాధారణ రీతిలో వేడిగా ఉండే ఆ గ్రహంపై ఐరన్ వర్షం కురుస్తోందని గుర్తించారు. స్విట్జర్లాండ్లోని జెనీవా యూనివర్సిటీతో కలిసి నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘డబ్ల్యూఏఎస్పీ-76బీ’గా గర్తించిన ఆ గ్రహంపై పగటిపూట ఉష్ణోగ్రత్తలు దాదాపు 2400 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లోహాలు ఆవిరిగా మారిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. అక్కడ వీచే బలమైన గాలులు రాత్రి వేళను చల్లగా మారేలా చేస్తాయని, ఆ సమయంలో ఇనుము బిందువులుగా ఘనీభవిస్తుందని అంచనా వేశారు. ఆ గ్రహం మాతృ నక్షత్రం చుట్టూ ఎదురుగా తిరుగుతున్న సమయంలో(పగటిపూట) మాత్రమే ఇనుము వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. వాతావరణం చల్లబడ్డాక రాత్రిపూట పూర్తి చీకటి నెలకొంటుందని తెలిపారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు 5 గంటల సమయం తీసుకుంటుందని.. కానీ ఆ గ్రహం మాత్రం తన మాతృ నక్షత్రానికి దగ్గరగా ఉండటంతో పరిభ్రమణానికి కేవలం 48 గంటలు పడుతుందన్నారు. ఆ గ్రహం తన మాతృ నక్షత్రం నుంచి పగటిపూట భూమి సూర్యుని నుంచి గ్రహించే రేడియేషన్ కంటే వేల రేట్లు అధికంగా పొందుతుని ఆ పరిశోధనలో వెల్లడించారు. -
స్త్రీలకు ఐరనే ఆభరణం
-
స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు..
మన దేశంలో స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు.. ఇనుము! స్త్రీ ధనం కింద బంగారాన్ని కాదు ఐరన్ను అందించాలి. కాబట్టి ఈ ధన్తేరస్కి.. అంటే ధనత్రయోదశికి బంగారు నగల మీద కాక ఒంట్లోని ఐరన్ మీద దృష్టిపెట్టండి అంటూ ‘ప్రాజెక్ట్ స్త్రీధన్’ పేరుతో పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవనం గురించి పనిచేసే డీఎస్ఎమ్ అనే సంస్థ ఓ ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా ధన్తేరస్కు బంగారు ఆభరణాల దుకాణాలు విడుదల చేసే కమర్షియల్స్కు భిన్నంగా ఆ సంస్థ తన యాడ్స్ను తయారు చేసింది. ఐరన్ పుష్కలంగా దొరికే ఆహార పదార్థాన్ని తింటున్న మహిళను చూపిస్తూ ‘ఈ ధన్తేరస్కు ఈ మహిళ బంగారం కన్నా ఎంతో విలువైన దాన్ని పొందుతోంది’ అనే క్యాప్షన్తో ఒక యాడ్ను తయారు చేసింది. అలాగే.. చెవికి జూకాలు, మెడలో నగలు, చేతులకు గాజులు, నడుముకు వడ్డాణం, కాళ్లకు పట్టీలు పెట్టుకొని నడుస్తున్న యువతిని చూపిస్తూ.. ఇదే ఐరన్ అయితే మీ నరనరాల్లో ప్రవహిస్తుంది ఆరోగ్యంతో మిమ్మల్ని మెరిపిస్తుంది. అంటూ ఇంకో యాడ్ను రూపొందించింది. ‘ఐరన్ తీసుకోండి’ అంటూ ఇంకొన్ని యాడ్స్ను తయారు చేసి గ్రామీణ, పట్టణ వాసులను చైతన్యపరుస్తోంది. ఈ ప్రచారంలో డీఎస్ఎమ్ తన లాభాపేక్షను చూసుకుంటోందా వగైరా అనుమానాలను పక్కన పెడదాం. మన దేశంలో మహిళలకు ఐరన్ కావాల్సిన అవసరాన్ని గుర్తిద్దాం. 2018 జనవరిలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ –4) విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో దాదాపు యాభై మూడు శాతం మహిళలు రక్తహీనతతో బాధపడ్తున్నారు. కాబట్టి ఈ ధన్తేరస్నే ఆరోగ్య సంరక్షణకు శుభారంభంగా భావించి ప్రతిరోజు ఆహారంలో విధిగా ఐరన్ ఉండేలా చూసుకోండి. స్త్రీ ఆరోగ్యమే దేశానికి మహాభాగ్యం. -
కేటీపీఎస్లో ఇనుము దొంగలు..
సాక్షి, కొత్తగూడెం: కేటీపీఎస్ కర్మాగారంలో ఇంజనీర్ స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే భారీగా జీతభత్యాలు అందుకుంటున్నా అక్రమ ఆదాయానికి కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేటీపీఎస్ గతంలో అనేక స్క్రాప్, ఆయిల్ చోరీలు జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఏడీఈ స్థాయి అధికారే ఇనుమును అక్రమంగా స్టోర్స్ నుంచి తరలించి, సస్పెన్షన్కు గురవడం చర్చనీయాంశంగా మారింది. యాష్ పాండ్లో పైపులైన్లకు సపోర్టింగ్ కోసం వినియోగించే స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లను(రూ. 3.50 లక్షల విలువ) అక్రమంగా తరలిస్తూ పట్టుబడడం, ఇందుకు బాధ్యుడైన ఓఅండ్ఎం ప్లాంట్లోని ‘బి ’స్టేషన్లో యాష్ పాండ్, వాటర్ ట్రీట్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఏడీఈ బి.ఎర్నా సస్పెన్షన్కు గురికావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీఈ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎందరి పాత్ర ఉందనే విషయంపై విచారణ సాగుతోంది. ఇనుప ప్లేట్లను గతంలోనూ అనేక మార్లు బయటకు తరలించి అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్టోర్స్లో ఇప్పటి వరకు ఇలా 40 ప్లేట్లు మాయమైనట్లు సమాచారం. సుమారు రూ.30 నుంచి రూ.40లక్షల వరకు పక్కదోవ పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే తాజాగా బయటకు తరలిస్తూ పట్టుబడిన ప్లేట్లు కొత్తవి. కొత్త ఇనుప పరికరాల విషయంలోనే ఇంతలా అక్రమాలకు పాల్పడుతుండడంతో పాత ఇనుము విషయం లో గతంలో ఎన్ని అక్రమాలు జరిగాయోననే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పట్టుబడిన ఒక్కో ప్లేట్ విలువ సుమారు రూ.1.80లక్షలు. ఈ నేపథ్యంలో పాత ఇనుము రూ. వందల కోట్లలో ఉంటుంది. దీన్ని గుట్టుగా బయటకు అక్రమ మార్గంలో తరలించేందుకు మూసివేతకు సిద్ధంగా ఉన్న ఓ అండ్ ఎం ప్లాంట్లో పోస్టింగ్ల కోసం పలువురు ఇంజినీర్లు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు అంతంతే.. కేటీపీఎస్లో అక్రమాలపై గతంలో అనేకసార్లు విజిలెన్స్ తనిఖీలు, విచారణలు చేసినా చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణ లో తేలితే థర్మల్ ప్లాంట్ల నుంచి హైడల్ విద్యుత్ ప్లాంట్లకు సైతం బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అలా చేస్తుండకపోతుండడంతో ఇష్టారాజ్యంగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతం లో కేటీపీఎస్ ఓ అండ్ ఎం, 5, 6 దశల ప్లాంట్లలో అనేక సార్లు స్క్రాప్, ఫ్యూయల్ ఆయిల్ చోరీ చేస్తు పట్టుబడిన కేసుల్లో ఎవరిపైనా తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆర్టిజన్ కార్మికుల నియామకాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. సంస్థకు సంబంధం లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారు. కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించడంతో మూడు నెలలకే దెబ్బతింది. కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం నుంచి టెండర్లు పిలవకుండా కాంట్రాక్టర్కు పనులు అప్పగించారనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. యాష్ను ఉచితంగా అందించాల్సి ఉండగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శ లు వచ్చాయి. 7వ దశ నిర్మాణంలోనూ భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి బయటకు తరలిపోయినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనల్లో విజిలెన్స్ తనిఖీలు చేసి కూడా సరైన చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. కాగా తాజాగా ఇనుము పక్కదోవ పట్టిన విషయంపై టీఎస్ జెన్ కో విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్ విచారణకు పూనుకున్నారు. శుక్రవారం కర్మాగారాన్ని సందర్శించి సీఈ జె.సమ్మయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అక్రమాలపై ఏడీఈ ఎర్నాను సైతం విచారించారు. స్టోర్స్ను పరిశీలించారు. ఏడీఈ ఎర్నా, మరో నలుగురు ఆర్టిజన్ కార్మికులతో కలసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఈ విషయమై సీఈ జె.సమ్మయ్యను వివరణ కోరగా.. విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్ను వివరణ కోరగా.. విచారణలో ఉన్న కేసుల వివరాలు బయటకు వెల్లడించలేమన్నారు. సంబంధిత ఉన్నత స్థాయి అధికారుల నుంచి వివరాలు తెలుసుకోవాలన్నారు. ప్రజా ధనం దుర్వినియోగం కొందరు స్వప్రయోజనాల కారణంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. విజిలెన్స్ నివేదికలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులకు న్యాయం చేయాలి. –ఎస్కె.సాబీర్పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి చర్యలు తీసుకోవాలి కేటీపీఎస్ అవకతవకలపై విజిలెన్స్ తనిఖీల్లో పారదర్శకత ఉండాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలోను అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిపై విచారణ చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. –బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలు
‘నిప్పురవ్వలు పడి మీ బట్టలు కాలిపోయాయి.. క్షమించండంటూ ఇస్త్రీ వాలాల వేడుకోలు, కరెంటు లేదు బట్టలు ఇస్త్రీ చేయడం కుదరలేదనే సమాధానాలను దుస్తులను ఇస్త్రీకి ఇచ్చినప్పుడు మనం నిత్యం వింటూ ఉంటాం. అయితే ఈ సమస్యలేమీ లేకుండా ఇస్త్రీ వాలాలకు ఓ కొత్త పరిష్కారం దొరికింది. అంతేకాదు బొగ్గులతో ఇస్త్రీ చేయడం వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధ వ్యాధులూ దూరం కానున్నాయి. కరెంటు, బొగ్గులతో వాడే ఇస్త్రీ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఇస్త్రీ వాలాలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. 5 కేజీల సిలిండర్ను ఉపయోగించి 1,100 దుస్తులు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల సిలిండర్తో 4,500 దుస్తులు ఇస్త్రీ చేయొచ్చు. అయితే ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఇస్త్రీ పెట్టెల కంటే ఇవి కాస్త ఖరీదైనవి. రూ.2,500 నుంచి రూ.7,000 మధ్య వీటి ధర ఉంటుంది. సాధారణ పెట్టెలు ఆరు కేజీల బరువు ఉంటే ఇవి ఆరున్నర కేజీల బరువు ఉంటాయి. పుణే కేంద్రంగా ఉన్న ఓ కంపెనీ వీటిని సరఫరా చేస్తోంది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్రలలో వీటిని వినియోగిస్తున్నారు. సిలిండర్ నుంచి పైప్ను గ్యాస్ స్టౌవ్కు ఎలా అమరుస్తామో ఇస్త్రీ పెట్టెకు కూడా అలాగే గ్యాస్ పైప్ను అమరుస్తారు. ఇస్త్రీ పెట్టె వేడిని నియంత్రించేందుకు రెగ్యులేటర్ ఉంటుంది. ఇస్త్రీ పెట్టె లోపలి భాగంలో ఇంధనం మండినా ఇస్త్రీ చేసే వ్యక్తికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు తయారీదారులు. -
రాయి ఇనుముని తినేస్తుంది
-
ఇనుమును తినేస్తున్న రాయి.. వైరల్ వీడియో
మయన్మార్ : ప్రపంచంలో కొన్ని ఘటనలు వినడానికి వింతగా ఉంటాయి. కొన్ని సార్లు వాటిని కళ్లారా చూస్తే తప్ప నమ్మడం కష్టం. అవి ఎలాంటివి అంటే దేవుడి విగ్రహం ముందు పాలు పెడితే తగ్గడం, చెట్ల మొదళ్ల నుంచి పాలు కారడం, విగ్రహాల చుట్టూ జంతువులు చేరి పూజ చేయడం, మరికొన్ని చోట్ల వాటి కళ్ల నుండి నీరు, ఏదైనా ద్రవం రావడం వంటివి. అవి చిత్రంగా ఉంటూ అందరినీ ఆకర్శిస్తాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి మయన్మార్లో జరిగింది. సాధారణంగా ఇనుమును కరగ తీయడం కోసం నిప్పుల్లో ఉంచుతారు. కానీ మయన్మార్లో మాత్రం ఓ రాయి చిత్రంగా ఇనుముని తినేస్తోంది. రాయి ఇనుమును తినడం ఏంటి అనుకోకండి.. కానీ ఇది నిజం. గోడకు కొట్టే మేకుని దానిపై ఉంచితే నిమిశాల్లో కరిగిపోతోంది. ఈ విషయాన్ని ఆదేశ సైనికుడు కనిపెట్టాడు. ఇనుమును రాయి తినేస్తుందంటే ఎవరూ నమ్మలేదు. పైగా పిచ్చివాడిగా చూశారు. దీంతో మేకును రాయిపై ఉంచి వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటి వరకూ ఈ వీడియోని 9 మిలియన్ల మంది చూశారు. ఈ రాయిని పరిశీలించిన శాష్త్రవేత్తలు, ఈ రాయి ఓ విలక్షణమైన లక్షణాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇనుమును కరిగించడానికి గల కారణాలపై పరిశోధనలు చేస్తున్నారు. -
ఉక్కునైనా ఛేదించగల వాటర్గన్
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్కునైనా ఛేదించగల వాటర్గన్ అందుబాటులోకి వచ్చింది. దీనిని షూట్ చేస్తే, ఇందులోంచి పెనువేగంతో దూసుకొచ్చే నీరు.. ఉక్కు, కాంక్రీట్, ఇటుకలు, చివరకు బులెట్ప్రూఫ్ గ్లాస్ను కూడా ఛేదించగలదు. ఏదైనా గోడపై దీనిని గురిచూసి ప్రయోగిస్తే, మూడంగుళాల రంధ్రం ఏర్పడి, అందులోంచి నీరు లోపలకు దూసుకుపోతుంది. అగ్నిమాపక పరికరాలను తయారు చేసే ‘పైరోలాన్స్’ అనే కంపెనీకి చెందిన నిపుణులు ఈ వాటర్గన్ను అల్ట్రా హైప్రెషర్ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ ‘పైరోలాన్స్’ వాటర్గన్స్ను ప్రస్తుతం అమెరికన్ నేవీ, ఎయిర్ఫోర్స్ బలగాలు ఉపయోగిస్తున్నాయి. కొన్ని విమానాశ్రయాల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి సైజును బట్టి ఒక్కొక్కటి 15 వేల డాలర్ల నుంచి 80 వేల డాలర్ల వరకు ఇవి దొరుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక దళాలు వీటిని ఉపయోగించేటట్లయితే చాలా వరకు అగ్నిప్రమాదాలను నిరోధించవచ్చని ‘పైరోలాన్స్’ కంపెనీకి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, షాపింగ్మాల్స్, సినిమా థియేటర్స్ వంటి జనసమ్మర్దం గల ప్రదేశాల్లో వీటిని అందుబాటులో ఉంచితే, అగ్నిప్రమాదాలను తేలికగా అరికట్టడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. -
పేర్లే పట్టించాయి..
ఎంత చాకచక్యంగా దొంగతనం చేసినా.. ఎక్కడో ఒక చోట దొంగలు దొరికిపోవడం ఖాయం. ఏదో ఒక క్లూ వారిని కచ్చితంగా పోలీసులకు చిక్కేటట్టు చేస్తుంది. సరిగ్గా అదే క్లూ ఆ ఇనుప ఊచలు చోరీ చేసే వారిని జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసింది. – రాజానగరం ఐరన్ దుకాణాల వద్ద బయట నిల్వ ఉంచే ఐరన్ (ఇనుప ఊచలు) కట్టలను చాకచక్యంగా దొంగిలించే ముఠా ఒకటి పోలీసులకు చిక్కింది. జిల్లాలోని రావులపాలెం నుంచి తుని వరకు అర్ధరాత్రి సమయాల్లో నిత్యం ఈ చోరీలనే వృత్తిగా చేసుకున్న ఆ ముఠాలోని కొందరిని రవాణాకు ఉపయోగించే లారీతో సహా స్థానిక ఐరన్ వ్యాపారులు జగ్గంపేటలో మంగళవారం పట్టుకుని, రాజానగరం పోలీసులకు అప్పగించారు. రూ.వెయ్యి మాత్రమే ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఐరన్ దొంగతనాలు చేయడం ఈ ముఠాకు అలవాటైంది. అలా దొంగిలించిన ఐరన్ కట్టలను(కట్ట విలువ రూ.5 వేలు వరకు ఉంటుంది) ఒక్కోదాన్ని రూ.వెయ్యికి కత్తిపూడిలో విక్రయిస్తుంటారు. సాధారణంగా లారీకి 50 కట్టలు వేస్తారు. అందుకు సుమారుగా గంటకు పైనే సమయం పడుతుంది. కాని వీరు కేవలం 20 నిమిషాల్లోనే ఎటువంటి శబ్దం రాకుండా లోడు చేసేస్తారు. ఒకవేళ అలికిడై ఎవరైనా వస్తే వారిని హతమార్చడానికి కూడా వెనుకాడరు. వీరు చోరీ చేసిన ఐరన్ను కత్తిపూడిలో ఒక వ్యాపారికి కొనుగోలు చేస్తుంటాడు. అతనికి రాజకీయంగా బలం ఉండడంతోపాటు అతడి ఏరియాకు వెళితే చాలు ఎవరూ ఏమిచేయలేరనే ధీమాను నిందితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా రాజమహేంద్రవరం, కడియం, రావులపాలెం, రాజానగరం, జగ్గంపేట, ఇలా అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వాటి వివరాలను కూపీలాగే పనిలో పోలీసులు ఉన్నారు. చోరులను పట్టించిన దుర్గమ్మ, లక్ష్మి గత నెల 13న రాజానగరంలో ఒక ఐరన్ దుకాణం వద్ద ఉన్న ఐరన్ కట్టలను అర్ధరాత్రి 12.30 గంటల తరువాత ఒక లారీలో వచ్చిన దుండగులు అపహరించుకుపోయారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా దుండగుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే బాగా పాతదిగా ఉన్న ఆ లారీ నంబరు స్పష్టంగా కనిపించకపోవడంతో కేసు ముందుకు వెళ్లలేదు. అయితే ఆ లారీ పై భాగంగా ఒకవైపున దుర్గమ్మ, లక్ష్మి అనే పేర్లు ఇంగ్లిష్లో ఉండటాన్ని బాధితుడు, స్థానిక ఐరన్ వ్యాపారి పాతూరి వీరబాబు గుర్తుంచుకుని, ఆ లారీ కోసం రోజూ గాలిస్తూనే ఉన్నాడు. ఇంతలో రెండు రోజుల క్రితం స్థానిక హైస్కూలు జంక్షన్లో మరో ఐరన్ దుకాణం వద్ద మొత్తం లోడు మాయం చేసేశారు. అది కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడం, లారీ ఒక్కటే కావడంతో బాధితులు ఇరువురూ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం జగ్గంపేట వెళ్లిన వారికి ఫ్లైఓవర్పై ఆగి ఉన్న లారీ కనిపించింది. దానిపై దుర్గమ్మ, లక్ష్మి పేర్లు సీసీ కెమెరాలో చూసిన విధంగానే ఉండడంతో విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారి సాయంతో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన లారీ ఓనర్ కమ్ డ్రైవర్ ఈ చోరీలకు సూత్రధారిగా గుర్తించారు. ఆ సమయంలో జగ్గంపేటలోని ఒక థియేటర్లో సినిమా చూస్తున్న అతడిని, వేరొక చోట హోటల్లో భోజనం చేస్తున్న జట్టు కూలీలు ముగ్గురిని అదుపులోకి తీసుకుని లారీతో సహా రాజానగరం పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. -
రక్తహీనతను తగ్గించే అంజీర్!
శుష్కఫలాల్లో (డ్రైఫ్రూట్స్లో) అంజీర్ది ప్రత్యేకమైన స్థానం. ఎంతో రుచిగా ఉండే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని. ♦ వీటిల్లో ఐరన్ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి డాక్టర్లు అంజీర్ను సిఫార్సు చేస్తుంటారు ♦ ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు కొవ్వులు చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు అంజీర్ తినడం మంచిది. ♦ అంజీర్లో పొటాషియమ్ ఎక్కువ. సోడియమ్ చాలా తక్కువ. అందువల్ల ఇది రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. ♦ అంజీర్లో క్యాల్షియమ్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవి బలంగా ఉండేలా చూస్తుంది. ♦ అంజీర్లో మంచి పోషకాలు ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. -
ఇరాన్ను ఏకాకి చేయండి: టిల్లర్సన్
దోహా: మధ్య ప్రాచ్యంలో ఇరాన్ను ఒంటరిని చేయాలని గల్ఫ్లోని సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ పిలుపునిచ్చారు. ఇరాన్ను దీటుగా ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలు ఒక్కటవ్వాలన్నారు. అరబ్ ఇరుగు పొరుగు దేశాలకు ఖతర్కు మధ్య సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలన్నారు. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ అనుసరిస్తున్న వైఖరిని టిల్లర్సన్ విమర్శించారు. ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కోర్తో ఐరోపా దేశాలు సంబంధాలు పెట్టుకోవద్దన్నారు. ఇరాన్ మద్దతుగల షితే మిలిషీయా తిరుగుబాటుదారులను ఇరాక్ నుంచి వెనక్కి రప్పించాలని లేదా వారిని ఇరాక్ సైన్యంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. -
ఐరన్ ఇచ్చే అరటిపువ్వు!
గుడ్ ఫుడ్ అరటిపువ్వు ఆరోగ్యానికి కలిగించే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూర చేసుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాల్లో కొన్ని... అరటిపువ్వులో ఐరన్ ఎక్కువ, కాబట్టి అనీమియాను సమర్థంగా అరికడుతుంది. అరటిపువ్వులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్–ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులోని ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ను కలిగించే ఫ్రీరాడికల్స్ అనే కాలుష్య పదార్థాలను హరిస్తాయి.వయసుపైబడే ప్రక్రియనూ అరటిపువ్వు మందగింపజేస్తుంది. అలా ఏజింగ్ ప్రక్రియను ఆపుతుంది. అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను కూడా నియంత్రిస్తుంది. -
మీ ఆహారమే...మీకు శిరోజరక్ష
మీరు జుట్టు ఊడిపోతోందంటూ బాధపడే వారి జాబితాలో ఉన్నారా? అయితే ఇది తప్పక చదవండి. మీకు చాలా ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. మీకు తెలుసా? మనం రోజూ దాదాపు నూరు వెంట్రుకల వరకు కోల్పోతుంటాం. ఇది చాలా నార్మలే. అయితే అదే పనిగా జుట్టు ఊడిపోవడం ఎక్కడికి దారితీస్తుందోనని, తమకు బట్టతల వచ్చేస్తుందేమోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. వాళ్ల ఆందోళన తీరాలంటే చేయాల్సిందేమిటంటే... జుట్టుకు అవసరమైన మూడు అంశాలు: జింక్, ఐరన్, విటమిన్-సి... ఈ మూడు పోషకాలు జుట్టు పాలిట మూడు ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు. అందుకే ఈ మూడు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. జింక్ కోసం: జుట్టుకు అవసరమైన జింక్ కోసం... ఏదో ఒక రూపంలో గుమ్మడి గింజలు మీ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ సిఫార్సు చేస్తోంది. జింక్కు ఆహార పదార్థాలన్నింటిలోనూ పుష్కలమైన వనరు గుమ్మడి గింజలే. ఇక దానితో పాటు సీఫుడ్, డార్క్ చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలో జింక్ పాళ్లు ఎక్కువ. దాంతోపాటు పుచ్చకాయ తింటూ వాటి గింజలను ఊసేయకండి. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. ఐరన్ కోసం: మన ఆహారంలో పుష్కలమైన ఐరన్ కోసం గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటి వాటిపై ఆధారపడవచ్చు. ఇక మాంసాహారంలో అయితే కాలేయం, కిడ్నీల్లో ఐరన్ చాలా ఎక్కువ. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువని తెలుసుకుని మీ ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. విటమిన్-సి కోసం: మనకు లభ్యమయ్యే అన్ని ఆహార పదార్థాల్లో కంటే ఉసిరిలో నాణ్యమైన విటమిన్-సి పుష్కలంగా లభ్యమవుతుంది. ఇక నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్-సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. బత్తాయి, నారింజ పండ్లు ఎక్కువగా తినేవారిలో జుట్టు రాలడం ఒకింత తక్కువే. ఇవన్నీ తీసుకుంటూ జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండుసార్లు తలస్నానం చేస్తూ ఉన్నా, జుట్టు రాలిపోతుంటే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యత జుట్టు రాలే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటిదేదైనా ఉంటే దాన్ని డాక్టర్లు పరిష్కరిస్తారు. ఒకవేళ స్వాభావికంగానే ఈ సమస్య లేకుండా చూసుకోవాలంటే చేపలు ఎక్కువగా తినేవారిలో థైరాక్సిన్ అసమతౌల్యత సమస్య చాలా తక్కువని గుర్తుంచుకోండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే అప్పుడు మీరు డర్మటాలజిస్ట్లు, ట్రైకాలజిస్ట్ల వంటి నిపుణులను కలవాల్సి ఉంటుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ - డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
గుట్టపాడు వద్ద ఉక్కు కర్మాగారం
- రూ.2935 కోట్లతో ప్రభుత్వ ఆమోదం - జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఓర్వకల్లు: మండల పరిధిలో గుట్టపాడు వద్ద 370 ఎకరాల్లో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. ఇందుకు రూ.2935 కోట్లతో ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పరిశ్రమలో దశల వారీగా 14,400 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బుధశారం శకునాల గ్రామ సమీపంలో సోలార్ పవర్ప్లాంట్ పనులను కలెక్టర్ విజయమోహన్, ఆర్డీఓ రఘుబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలకొలను గ్రామం వద్ద 2700 ఎకరాల్లో డీఆర్డీఓ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ పరిశ్రమ స్థాపన జరుగుతుందన్నారు. ఇందుకు భూ కేటాయింపులు చేశామని, నవంబరు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద రూ.54 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఓర్వకల్లు సమీంపలో 300 ఎకరాలలో ఎయిర్పోర్టు, 150 ఎకరాలలో ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జూపాడుబంగ్లా మీదుగా రూ.350 కోట్లతో ఓర్వకల్లు వరకు నీటి వనరులను సమకూర్చుతామన్నారు. సోలార్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వానికి నివేదించామని, ఆదేశాలు రాగానే రూ.35 కోట్ల పరిహారం అందజేస్తామన్నారు. -
నిర్భయ కేసులో 'ఐరన్ రాడ్ థియరీ' నిరూపిస్తే 10 లక్షలిస్తా..!!
న్యూఢిల్లీః నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో ఢిఫెన్స్ లాయర్ కొత్త వాదనకు తెరతీశారు. నిర్భయ కేసులో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ సంచలన ప్రకటన చేశారు. కేసులో ఐరన్ రాడ్ థియరీని నిరూపిస్తే 10 లక్షలిస్తానంటూ బహుమతిని ప్రకటించారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను దించి, అవయవాలను బయటకు లాగారన్న పోలీసుల వాదదను ఆయన కొట్టిపారేశారు. అదో కట్టు కథ అని, అది నిరూపిస్తే పదిలక్షలు ఇస్తానంటూ న్యాయవాది శర్మ ప్రకటించడం.. కేసు మరో ట్విస్ట్ గా మారింది. 2012 లో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రపంచదేశాలను కుదిపేసిన నిర్భయ ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సుప్రీంలో చివరి దశలో ఉండగా... విచారణలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కదులుతున్న బస్సులోనే 23 ఏళ్ళ ట్రైనీ ఫిజియోథెరపిస్ట్.. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను గుచ్చి, అవయవాలను బయటకు లాగారని, తీవ్రమైన గాయాలు అవ్వడంతోనే అనంతరం ఆమె మరణించినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. అయితే దీనిపై విచారణ పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు నిందితులకు మరణశిక్ష విధించగా, ఢిల్లీ హైకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది. దీంతో దోషులు సుప్రీంను ఆశ్రయించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ అనే వ్యక్తి తీహార్ జైల్లో మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరొక నిందితుడు.. జువైనల్ కావడంతో మూడేళ్ల పాటు రిఫామ్ హోమ్ లో ఉంచి, అనంతరం విడుదల చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు కేసుపై విచారణ జరిగిన అనంతరం.. దోషుల తరపు న్యాయవాది కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టులో దోషుల తరపున వాదించిన అనంతరం బయటకు వచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ.. ఇనుప రాడ్ థియరీని నిరూపించినవారికి 10 లక్షల బహుమానం ఇస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. బాధితురాలు అత్యాచారం అనంతరం ఆసుపత్రిలో పూర్తి స్పృహలో ఉండగానే వాంగ్మూలం ఇచ్చిందని... ఆమె గానీ, ఆమె స్నేహితుడుగానీ ఇనుపరాడ్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. పోలీసులే ఈ కట్టుకథను అల్లినట్లుగా ఆయన ఆరోపించారు. బాధితురాలు చికిత్స పొందిన సింగపూర్ ఆస్పత్రి ఇచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం బాధితురాలి యుటెరస్ గానీ, ఓవరీస్ గానీ డ్యామేజ్ అయినట్లు ఎక్కడా లేదని న్యాయవాది శర్మ వాదిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ఇనుపరాడ్ ప్రస్తావన లేకున్నా.. పోలీసుల వాదన ఎలా చేరుస్తారని శర్మ ప్రశ్నించారు. నిర్భయ కేసు నిందితుల్లో ముఖేశ్, పవన్ ల తరపున శర్మ.. సుప్రీంలో వాదనలు వినిపించారు. -
సృజన వీచిక
-
ఇంటిప్స్
ఇనుప సామాను తుప్పుపట్టకుండా ఉండడానికి వాటి మధ్య కర్పూరం బిళ్ళలు ఉంచాలి. పండ్లను కోశాక ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే, ముక్కలపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లి తడిబట్టతో కప్పాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వంటి ఆకు కూరలు న్యూస్పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో వుంచితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. గోడలమీద క్రేయాన్తో గీసిన గీతలు పోవాలంటే బూడిదతో రుద్దాలి. కిరోసిన్ లో ముంచిన బట్టతో కిటికీలు, తలుపులు తుడిస్తే తుప్పు మరకలు పోతాయి. ఆ వాసనకు దోమలు కీటకాలు ఇంట్లోకి రావు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, గ్రైండ్ చేసేటప్పుడు ఒక స్పూన్ నూనె కలపాలి. -
చింతకు తక్కువ ఉసిరికి ఎక్కువ
వాక్కాయ అతిగా మాట్లాడేవారు వాగుడుకాయలు... అతిగా తినగలిగేవి వాక్కాయలు... అదీ వాక్కాయ రుచి మరి... పులుపు, వగరు రుచుల సమ్మేళనం వాక్కాయ... చింతకాయకి తక్కువ ఉసిరికాయకు ఎక్కువ... ఒక్కో ప్రాంతం వారు ఒక్కో పేరుతో పిలుచుకుంటారు... ఎవరు ఎలా పిలుచుకున్నా వాక్కాయలు మన వంటింట్లోకి వచ్చాయంటే... ఎంతటివారికైనా మాటలకు మూతలు పడాల్సిందే... గిన్నెలకు మూతలు తెరుచుకోవాల్సిందే... వాక్కాయల్లో ఐరన్ అధికంగా ఉండటం చేత, రక్తహీనతతో బాధపడేవారికిది దివ్యౌషధం. ఇందులో ఉండే సి విటమిన్ అనేక రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ కాయలు కొద్దిగా జిగురుగా ఉండటం వలన జెల్లీ, జామ్, సిరప్, చట్నీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఇవి సాధారణంగా హిమాలయ పర్వత ప్రాంతంలో 300 నుంచి 1800 మీటర్ల ఎత్తులో పడమటి కనుమలలోని సివాలిక్ పర్వతశ్రేణులలో పెరుగుతాయి. ఇంకా నేపాల్, ఆప్ఘనిస్థాన్ ప్రాంతంలో కూడా పెరుగుతాయి. భారతదేశంలో రాజ స్థాన్, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో పండుతాయి. శ్రీలంకలో కూడా పెరుగుతాయి. వాక్కాయ పులిహోర కావలసినవి: వాక్కాయలు - పావు కిలో; బియ్యం - కేజీ; పచ్చి మిర్చి - 10; ఎండు మిర్చి - 10; సెనగ పప్పు - టే బుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; వేయించిన పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 4 రెమ్మలు; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూను; ఇంగువ - అర టీ స్పూను; నూనె - 100 గ్రా. తయారీ: ముందుగా అన్నం వండి పక్కన ఉంచాలి వాక్కాయలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలు చేసి జీడి తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి వాక్కాయ ముక్కలు జత చేయాలి ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, వేయించిన పల్లీలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గాక దింపేయాలి అన్నాన్ని ఒక పెద్ద పళ్లెంలో వేసి ఉండలు లేకుండా పొడిపొడిలాడేలా చేయాలి వేయించి ఉంచుకున్న వాక్కాయ మిశ్రమం వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఊరిన తర్వాత అందించాలి. వాక్కాయ - కొబ్బరి పచ్చడి కావలసినవి: వాక్కాయలు - 20; కొబ్బరి ముక్కలు - కప్పు; పచ్చి మిర్చి - 6; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; నూనె - టేబుల్ స్పూను; ఎండు మిర్చి - 5; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; మెంతులు - పావు టీ స్పూను తయారీ: ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా చేసి పక్కనుంచాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మినప్పప్పు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి తీసేయాలి అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక వాక్కాయ ముక్కలు, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి కాసేపు మగ్గాక తీసి చల్లార్చాలి మిక్సీలో ముందుగా వేయించి ఉంచుకున్న పోపు వేసి మెత్తగా చేయాలి వాక్కాయ ముక్కలు జత చేసి మరోమారు తిప్పాలి చివరగా కొబ్బరి ముక్కలు వేసి బాగా మెత్తగా తిప్పాలి వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది (ఇష్టపడేవారు వేయించిన పల్లీలు కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది) వాక్కాయ-వంకాయ కూర కావలసినవి: వాక్కాయలు - 10; వంకాయలు - పావు కేజీ; ఎండు మిర్చి - 6; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను తయారీ: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి వాక్కాయలను శుభ్రంగా కడిగి, రెండు ముక్కలుగా కట్ చేసి జీడి తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి వంకాయ ముక్కలు వేసి బాగా కలిపాక, వాక్కాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి దించేసి వేడి వేడి అన్నంతో కాని, చపాతీలతో కాని వడ్డించాలి. వాక్కాయ ఆవకాయ కావలసినవి: వాక్కాయలు - అర కేజీ; ఆవ పొడి - 50 గ్రా.; కారం - 50 గ్రా.; ఉప్పు - 50 గ్రా.; నూనె - 200 గ్రా.; మెంతులు - టీ స్పూను తయారీ: ముందుగా వాక్కాయలను శుభ్రంగా కడిగి, కాయకు చిన్న గాటు పెట్టి లోపలి జీడి తీసేసి, కాయలను తడిపోయేవరకు ఆరబెట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వాక్కాయలను అందులో వేసి కొద్దిసేపు వేయించి తీసి చల్లార్చాలి ఒక పాత్రలో ఆవ పొడి, కారం, మెంతులు, ఉప్పు వేసి బాగా కలపాలి వాక్కాయలు జత చేసి బాగా కలిపి, నూనె పోసి మరోమారు కలిపి గాలి చొరని పాత్రలో ఉంచాలి మూడవ నాడు బాగా కలిపితే సరి. -
3 వేల ఏళ్లనాడే ఇనుము వినియోగం
పుల్లూర్లో కొనసాగుతున్న తవ్వకాలు సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మం డలం పుల్లూర్ శివారులో కొనసాగిస్తున్న తవ్వకాల్లో శనివారం పలు రకాల పనిముట్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు చేపడుతున్న విషయం విదితమే. సూక్ష్మరాతి, ఉలి లాంటి పనిముట్లు, మృణ్మయ పాత్రలు వెలుగుచూశాయి. సూక్ష్మరాతి పనిముట్లతో పక్షులను, జంతువులను వేటాడటానికి, ఉలిని బండలను పగులగొట్టడానికి వినియోగించినట్లు పురావస్తు శాఖ సాంకేతిక సహాయకుడు టి. ప్రేమ్కుమార్, రిటైర్డు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తిలు పేర్కొంటున్నారు. బయట పడుతున్న పనిముట్ల ఆధారంగా చూస్తే.. 3వేల సంవత్సరాల నాడే ఇనుమును వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఎండు ద్రాక్షలో... మెండుగా పోషకాలు!
ఆరోగ్యమే మహాభాగ్యం ఎండుద్రాక్షల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అది రక్తహీనత ఏర్పడకుండా చూస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి రక్తకణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఆకలిని ఎక్కువ చేసే లెప్టిన్ని ఎండు ద్రాక్షలు నియంత్రిస్తాయి. కాబట్టి డైటింగ్ చేసేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండగలుగుతారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటివి దరి చేరవు. రక్తంలో ఉండే యాసిడోసిస్ అనే టాక్సిన్... చర్మవ్యాధులు, ఆర్థరైటిస్, క్యాన్సర్, ట్యూమర్లు వంటి వాటిని కలిగిస్తుంది. ఎండుద్రాక్షల్లో ఉండే పొటాసియం, మెగ్నీసియం యాసిడోసిస్ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎండుద్రాక్షల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కనుక ఎముకలు దృఢంగా అవుతాయి. ఎండు ద్రాక్ష దంతక్షయాన్ని దరిచేరనివ్వదు. -
8 లారీల ఇనుము పట్టివేత
అనంతపురం : తుక్కు ఇనుమును అక్రమంగా తరలిస్తుండగా అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. స్థానిక ఉక్కు తయారీ పరిశ్రమల నుంచి స్క్రాప్ను ఎనిమిది లారీల్లో బెంగళూరుకు తరలిస్తున్నట్టు తెలిసింది. అయితే, వీటికి పన్నులు చెల్లించకుండా రవాణా చేస్తుండడంతో పోలీసులు వాటిని సీజ్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. (హిందూపురం అర్బన్) -
ఐరన్ దొంగల అరెస్టు
అనంతపురం: నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఐరన్ సామగ్రిని దొంగలిస్తున్న ఆరుగురు దుండగులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.అనంతపరం జిల్లాలోని హిందూపురం మండలానికి చెందిన ఆరుగురు బృందంగా ఏర్పడి మండలంలో పలు చోట్ల ఇనుప వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హిందూపురం పోలీసులు శనివారం దుండగులను అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. (హిందూపురం) -
సన్నబియ్యం మేలు చేస్తాయా ?
తెలంగాణలో వందల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో జనవరి 1 నుంచి సన్నబియ్యంతో భోజన పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. నిరుపేద పిల్లలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థుల బాగో గులపై ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఏదోరకమైన శ్రద్ధ ఉండటం అభినందించదగినదే. అయితే, ఎముకలు కొరికే చలికి అల్లల్లాడే చిన్నారులకు దుప్పట్లు, సబ్బులు, తలనూనె వంటి కనీసావసరాలపై దృష్టి పెట్టకుండా సన్నబియ్యం వంటి వ్యర్థమైన, ఆరోగ్య వ్యతిరేకమైన సౌకర్యాన్ని హాస్టళ్లకు అనవసరంగా అంట కట్టడం విజ్ఞత అనిపించు కోదు. వడ్ల గింజగా ఉన్న బియ్యాన్ని ఒకసారి మరపట్టి, తిరిగి మరపట్టి సదరు గింజలో పిసరంత పిండి పదార్ధం (కార్బొహైడ్రేట్స్) మినహా మరేమీలేని స్థితిని తేవడాన్నే సన్న బియ్యమని మనం వ్యవహరిస్తుం టాం. బియ్యం గింజ పైపొరలో స్వాభావికంగా ఉండే జింక్, ఐరన్, విటమిన్లు, ఇతర పోషక పదార్థాలను తెల్ల రంగుపై వ్యామోహంతో వదులుకోవడం హాస్టళ్లలో చిన్నారులకు ఎలా ఆరోగ్యకరమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. చూడటానికి ముత్యాల్లా, నాజూకుగా, నోరూరించేలా కనిపించే సన్న బియ్యం సారహీనమైనవని వైద్య పరిశోధనల్లో తేలిన సత్యం. ఈ బియ్యంతో వండిన అన్నం జంక్ ఫుడ్, గడ్డితో సమానం. అనారోగ్య హేతువు. గత రెండు మూడు దశాబ్దాలుగా పూర్వపు ఏపీలోనూ, తమిళనాడులోనూ డయాబిటీస్ (సుగర్ వ్యాధి), రక్తపోటు (బీపీ) రోగులు ఊహాతీతంగా అధికం కావడానికి సన్న, తెల్ల బియ్యం వాడకం పెరగడమే ప్రధాన కారణమని ఆరోగ్య సంస్థలు ఎప్పుడో నివేదికలు ఇచ్చాయి. మన హైదరాబాద్ నగరం దేశంలోనే సుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న డయాబెటిక్ రాజధానిగా ఇప్పటికే పేరుమోసింది. హాస్టళ్లలో ఉండే పిల్లలకు నిస్సారమైన తెల్ల బియ్యం సరఫరా చేయడాన్ని తమ పోరాట ఫలితంగా ఆర్.కృష్ణయ్య వంటి బీసీ నేతలు ఘనంగా చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుదలగా ఈ పథకాన్ని అమలు చేయించడానికి కంకణం కట్టుకున్నారు. ఇదంతా ఎవరి ఆరోగ్యం కోసం? ప్రతిరోజూ తెల్ల బియ్యంతో వండిన అన్నం తింటే అందులో పీచు లేకపోవడంతో కొద్ది సమయానికే ఆకలి వేస్తుం ది. దాని ఫలితంగా అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని ఆబగా తింటారు, శరీరంలో ఖర్చుకాని కేలరీలు అధికంగా జమపడి శరీరం బరువు పెరుగుతుంది. సన్నబియ్యం త్వరగా అరగడంతో జీర్ణక్రియకు రోజంతా పనిలేక ఆ వత్తిడి ఇతర శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపు తుంది. ఈ బియ్యానికి అలవాటు పడిన వారిని జీవన శైలి వ్యాధులు యవ్వనంలోనే పలకరిస్తాయి. దాని కంటే గింజ పైపొరని యథాతథం గా ఉంచే సోనా మసూరి లేదా హెచ్ఎంటి బియ్యం ఈ వయస్సులో చిన్నారులకు మేలు చేస్తాయి. వేల టన్నుల సన్న బియ్యాన్ని వండించి పిల్లల ఆరోగ్యాన్ని అపాయంలో పడవేయడం తగదు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకంపై పునరాలోచన చేయడం మంచిది. - వీణవంక మార్కండేయ చెన్నూరు -
పోచమ్మ గుట్టపై లేటరైట్ ఖనిజం
వేమనపల్లి : మండలంలోని మారుమూల ముక్కిడిగూడెం గ్రామ సమీపంలో పోచమ్మ గుట్టపై ఇనుము, లేటరైట్ ఖనిజం సమృద్ధిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టపైకి వెళ్లి ఇనుప ఖనిజం ఉన్న ప్రాంతాన్ని అన్వేషించారు. గుట్టపై దొరికిన నలుపు వర్ణంలో బరువుగా ఉండే ఖనిజాన్ని లాబరేటరీ పరీక్షల కోసం తీసకెళ్లారు. హైదరాబాద్కు చెందిన సమృత్ అనే ప్రైవేట్ కంపెనీ సౌజన్యంతో సర్వే చేపట్టినట్లు అసిస్టెంట్ జియాలజిస్ట్ రఘుబాబు తెలిపారు. ఖనిజం ఉన్న ప్రాంతం గిరివెల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధి కిందకు వస్తుందని మ్యాప్ ద్వారా అంచనా వేశారు. వారి వెంట తహశీల్దార్ రమేశ్గౌడ్, సర్పంచ్ వెంకటేశం, అటవీ బీట్ అధికారి రషీద్, మైన్స్ సర్వేయర్ వెంకటేశ్వర్లు, సమృత్ కంపెనీ రిప్రెజెంట్ సుధీర్, వీఆర్వో మల్లేశ్ పాల్గొన్నారు. -
పెరుగుతున్న రక్తహీనత
రాయచూరు : జిల్లాలోని మహిళలు, చిన్నారుల్లో రోజురోజుకూ రక్తహీనత పెరుగుతోంది. ముఖ్యంగా 6 నుంచి 59 నెలల పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రక్తహీనతను నివారించేందుకు పంపిణీ అవుతున్న ఐరన్, పోలిక్ ఆసిడ్ మాత్రల కొరత తీవ్రంగా ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2013-14కుగాను జరిపిన సర్వేలో జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లే పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సర్వే వివరాల మేరకు 6 నుంచి 50 నెలల వయసు పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో 77.3 శాతం మంది, అలాగే నగర ప్రాంతాల్లో 73.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 6 నుంచి 9 ఏళ్ల గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో 64.1 మంది, అలాగే నగరాల్లో 58.5 శాతం మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో 62 శాతం మంది, నగరాల్లో 57.7 శాతం మంది ఆడపిల్లలు రక్తహీనత బారిన పడ్డారు. వయస్సుకురాని వారిని కూడా రక్తహీనత వెంటాడుతోంది. 15 నుంచి 19 ఏళ్లలోపు వారిలో 53.6 శాతం మంది, అలాగే నగరాల్లో 48.3 యువతు రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామీణుల్లో 67 శాతం మంది, నగరాల్లో 60.6 శాతం మంది గర్భిణులు దీంతో సతమతమవుతున్నారు. తద్వారా తల్లీబిడ్డలు మృత్యువాతపడుతున్నారు. ఇటీవల ఆహారశైలి మారడంతో పౌష్టికాహారం అందడం లేదు. ముఖ్యంగా ఇనుము ధాతువు ఎక్కువగా ఉన్న కాయగూరలు, ఆహారాలు తినడం లేదు. ఈ విషయమై జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నారాాయణ మాట్లాడుతూ రక్తహీనత పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు. శాఖ ఆధ్వర్యంలో తగినంత శ్రద్ధ తీసుకుని రక్తహీనత నివారణకు కృషిచేస్తామన్నారు. స్థానిక నిధుల ద్వారా 3 లక్షల ఐరన్ మాత్రలు కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని తెలిపారు. -
సారీ.. పనులు చేయలేం!
గద్వాల: సిమెంట్, ఇనుము తదితర వాటి ధరలు పెరిగిన దృష్ట్యా రేట్లు పెంచాలని నెట్టెం పాడు ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్లు మొం డికేశారు. నిధులేమి పేరుతో ముఖ్యమైన పనులను నత్తనడకన కొనసాగిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో రెండు ప్యాకేజీలు మినహా మిగతా పది ప్యాకేజీల్లో పనులు పూర్తిగా స్తం భించిపోయాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మొత్తం 109 వరకు ఉన్నాయి. ఇం దులో 104, 107 మినహా మిగతాప్యాకేజీల్లో పనులు నామమాత్రంగా కొనసాగుతున్నా యి. ఇదే పరిస్థితి కొనసాగితే ముందే ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది జులైలోనూ నెట్టెంపాడు ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సా గునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. మ హబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల ను చేపట్టడంలో భాగంగా జలయజ్ఞం ద్వారా గ ద్వాల, అలంపూర్ నియోజకవర్గంలోని రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా అప్పటి ప్రభుత్వం మంజూరుఇచ్చింది. 2009 వరకు పనులు వేగవంతంగా కొనసాగాయి. ఆ తర్వాత మూడేళ్ల పాటు పనులు నత్తను తలపించాయి. 2012 నుంచి పనులు కాస్త వేగవంతమైనా కొత్తరేట్లు ఇవ్వాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నారు. ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో పనులవేగం మరింత తగ్గింది. ఇలా కారణం ఏదైనా కేవలం ఐదేళ్లలో పూర్తికావాల్సిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఇప్పటివరకు పూర్తి కాలేదు. 80శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పాత ధరలపై 15 నుంచి 25శాతం పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే సుమారు రూ.100కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు పెండింగ్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ఐదేళ్లలోపు పూర్తిచేయాలన్న లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం మొత్తం 14 ప్యాకేజీలుగా పనులు విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇందులో కాల్వలు, రిజర్వాయర్ల పనులను ప్యాకేజీ 99 నుంచి 109 వరకు చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలకు ఇచ్చారు. పంప్హౌస్ల నిర్మాణాన్ని విడిగా రెండు కాంట్రాక్టు సంస్థలకు 13,14 ప్యాకేజీలుగా అప్పగించారు. ఇలా మొత్తం 14 ప్యాకేజీల్లో నెట్టెంపాడు పనులను చేపట్టే విధంగా రూపొందించారు. పంప్హౌస్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. రిజర్వాయర్లు, ప్రధానకాల్వల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు మట్టి పనులను పూర్తిచేశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి కీలకమైన సిమెంట్ నిర్మాణ పనులు, రిజర్వాయర్ల వద్ద గేట్ల నిర్మాణాలు, డిస్ట్రిబ్యూటరీల మళ్లింపు గేట్లు, ప్రధానకాల్వల నుంచి నీటి మళ్లింపు పనులు చేపట్టాల్సి ఉంది. వీటితో పాటు ఫీడర్ చానల్స్, పొలాలకు నీటిమళ్లింపు గేట్లు, పిల్లకాల్వల పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం పంపుహౌస్లు, రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసే ప్రధానకాల్వలను మాత్రమే పూర్తిచేసి, చెరువులకు నీళ్లు వదులుతున్నారు. ఇలా ముఖ్యమైన సిమెంట్ నిర్మాణపనులు అసంపూర్తిగా ఉండడంతో సాగునీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. జూలై 2015 నాటికి ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా పనులు సిద్ధంచేయాలని హైద రాబాద్లో నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్రావు సమావేశాలు తరచూ నిర్వహిస్తున్నారు. -
‘అనంత’లో అరేబియన్ పంట
ప్రయోగాత్మకంగా ఖర్జూరం సాగు ఖర్జూరం పండులో క్యాల్షియం, సల్ఫర్, ఇనుము, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, రాగి, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ను నివారించే శక్తి ఈ పండుకు ఎక్కువ. ఖర్జూరం శాస్త్రీయ నామం ఫీనిక్స్డాక్టిలిఫెరా. తాటిచెట్టు మాదిరిగా పెరిగే ఈ చెట్లు ఆడ, మగ వేరువేరుగా ఉంటాయి. రాయదుర్గం : అరబ్ దేశాల్లో పండించే ఖర్జూరం పంట ఇప్పుడు మన ప్రాంతానికీ విస్తరించింది. కరువు పీడిత ప్రాంతంగా పేరొందిన ‘అనంత’ నేలలో పండించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం బెణకల్లుకు చెందిన రామక్రిష్ణారెడ్డి తన స్నేహితుడి సలహా మేరకు ఆరేళ్ల క్రితం 15 ఎకరాల విస్తీర్ణంలోని నల్లరేగడిలో దాదాపు 1500 మొక్కలు నాటాడు. రెండు వ్యవసాయబోర్ల ద్వారా మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తున్నాడు. మొదట్లో ఇరుగుపొరుగు రైతులు ఎగతాళి చేసినా పట్టించుకోకుండా కంటికి రెప్పలా ఖర్జూరం మొక్కలను కాపాడుకుంటూ వచ్చాడు. పశువుల ఎరువును ఎక్కువశాతం వాడుతూ, అడపాదడపా క్రిమిసంహారక మందు కూడా తక్కువ మోతాదులో ఉపయోగిస్తున్నాడు. మొక్కకూ.. మొక్కకూ 20 అడుగుల దూరం పాటించాడు. కట్టెల నుంచి కాల్చిన బొగ్గును కూడా ఎరువుగా ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం వంద ఖర్జూరం చెట్లు కాపుకొచ్చాయి. ఆరు నెలల క్రితం అంతర్ పంటగా 1500 దానిమ్మ మొక్కలు నాటాడు. ఫలదీకరణ ప్రక్రియ :ఖర్జూరం పంట మొగ్గదశలో మగచెట్ల పరాగరేణువులను తీసుకుని, ఆడ ఖర్జూర చెట్లకు సంబంధించిన పండ్ల గుత్తిలో పెట్టి వల ఏర్పాటు చేస్తారు. 50 ఆడ చె ట్లను ఫలవంతం చేయడానికి ఒక మగచెట్టు పరాగరేణువులు ఉపయోగపడుతాయి. ఈ పంట 5 నుంచి 8 సంవత్సరాలకు కాపుకొస్తుంది. -
నో డేట్ ఫర్ డేట్స్
గంగి గోవు పాలు గరిటెడైన ను చాలు... అన్నాడు వేమన! మంచి ఖర్జూరాలు రెండు తిన్న చాలు... అంటోంది వైద్యం! ఖర్జూరం... ఎడారులలోని ఒయాసిస్సుల దగ్గర పండి... ఒంటెల మీద ప్రయాణించి... మానవ సమాజంలోకి ప్రవే శించి... మన నాలుకల మీద కూర్చుని... తియ్య తియ్యగా... రంజు రంజుగా నడయాడుతూ... మనకి శక్తి నిచ్చి... మన చేత తైతక్కలాడిస్తూ... తన రాజసాన్ని నిలుపుకుంటోంది... ఖజురహో శిల్పంలా ఎడారిలో ఠీవిగా నిలబడుతోంది! ఎన ర్జీ సలాడ్, బొబ్బట్లు, ఖీర్, పికిల్, షేక్... ఎలా కావాలంటే అలా మలుచుకుని... తయారుచేసుకుని... ఆస్వాదించండి... 365 డేస్ దొరికే డేట్స్కి ప్రత్యేకమైన డేట్ లేదు... 24x7 దొరుకుతూనే ఉంటాయి..! ఖర్జూరం షేక్ కావలసినవి: ఖర్జూరాలు - 100 గ్రా. (సన్నగా తరగాలి); పాలు - 2 కప్పులు; వెనిలా ఐస్క్రీమ్ - 4 స్కూపులు; మీగడ - 8 టీ స్పూన్లు (చిక్కగా చిలకాలి); చెర్రీలు - 4 (ముక్కలుగా తరగాలి) తయారీ: మిక్సీలో కప్పు పాలు, ఖర్జూరం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్లా చేయాలి మిగిలిన ఒక కప్పు పాలు, వెనిలా ఐస్క్రీమ్ జత చేసి మరో మారు మిక్సీ తిప్పాలి తయారైన మిశ్రమాన్ని పొడవుగా ఉండే గ్లాసులలో పోసి, పావు గంటసేపు ఫ్రిజ్లో ఉంచాలి రెండు టీ స్పూన్ల మీగడ, చెర్రీ ముక్కలతో అలంకరించి, వెంటనే అందించాలి. ఖర్జూరాల ఊరగాయ కావలసినవి: సన్నగా తరిగిన ఖర్జూరాలు - కప్పు; ఆవాలు - అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; మిరప్పొడి - 2 టీ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి అర కప్పు నీళ్లు, ఖర్జూరం ముక్కలు వేయాలి నీళ్లు మరుగుతుండగా మంట తగ్గించి మూత పెట్టి ఉడికించాలి ఖర్జూరాలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు, మిరప్పొడి, చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి చివరగా ఇంగువ వేసి బాగా కలిపి దించేయాలి బాగా చల్లారిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసుకుని, ఫ్రిజ్లో నిల్వ చేయాలి ఆపిల్ - డేట్స్ ఖీర్ కావలసినవి: ఆపిల్ - 1 (సన్నగా తరగాలి); పంచదార - టీ స్పూను; పాలు - రెండున్నర కప్పులు (ఫ్యాట్ తక్కువ ఉన్నవి); సన్నగా తరిగిన ఖర్జూరాలు - కప్పు; గార్నిషింగ్ కోసం: వాల్నట్స్ - టేబుల్ స్పూను (సన్నగా తరగాలి); ఆపిల్ - చిన్న ముక్క (సన్నగా తరగాలి) తయారీ: నాన్స్టిక్ పాత్రలో... ఆపిల్ ముక్కలు, పంచదార, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి సన్న మంట మీద ఆపకుండా కలుపుతూ, కొద్దిసేపు ఉడికించి దించేయాలి చల్లారాక ఫ్రిజ్లో ఉంచాలి ఒక పాత్రలో పాలు, ఖర్జూరం తరుగు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి సన్నని మంట మీద పది నిముషాలు ఆపకుండా కలుపుతూ ఉడికించి దించేయాలి చల్లారాక ఫ్రిజ్లో ఉంచి తీయాలి సర్వ్ చేసే ముందు ఉడికించిన ఆపిల్ మిశ్రమాన్ని, ఖర్జూరం మిశ్రమానికి జత చేసి నెమ్మదిగా కలపాలి వాల్నట్స్ తరుగు, ఆపిల్ ముక్కలతో అలంకరించి చల్లచల్లగా అందించాలి. డేట్స్ ఎనర్జీ సలాడ్ కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు - అర కప్పు; సన్నగా తరిగిన ఖర్జూరాలు - అర కప్పు; అరటిపండు - 1 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కమలాపండు - 1 (తొనలు తీయాలి); ఆపిల్స్ - 2 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); నిమ్మరసం - అర టేబుల్ స్పూను; సన్నగా ముక్కలు చేసిన నిమ్మ తొనలు - అర టీ స్పూను; నూనె - అర టేబుల్ స్పూను; వెనిగర్ - అర టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - తగినంత కమలాపండ్ల డ్రెసింగ్ కోసం... గట్టి పెరుగు - ముప్పావు కప్పు; కమలాపండ్ల రసం - 4 టీ స్పూన్లు; ఆవ పొడి - అర టీ స్పూను; పంచదార పొడి - అర టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: ఒక పాత్రలో గట్టి పెరుగు, కమలాపండ్ల రసం, ఆవ పొడి, పంచదార పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి సుమారు అరగంట సేపు ఫ్రిజ్లో ఉంచాలి ఒక పాత్రలో సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్కి కొద్దిగా నీళ్లు జత చేసి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి, చల్లార్చాలి నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఊరనివ్వాలి ఒక పాత్రలో ఉడికించిన క్యాలీ ఫ్లవర్, సన్నగా తరిగిన ఖర్జూరాలు, అరటిపండు ముక్కలు, కమలాపండు తొనలు, ఆపిల్ ముక్కలు, నిమ్మరసం, సన్నగా తరిగిన నిమ్మ తొనలు, నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి తయారుచేసి ఉంచుకున్న కమలాపండ్ల డ్రెసింగ్ వేసి చల్లగా అందించాలి ఖర్జూరం బొబ్బట్లు కావలసినవి: గోధుమపిండి - కప్పు పాలు - 4 టేబుల్ స్పూన్లు గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరాలు - ముప్పావు కప్పు నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు (వేయించి మెత్తగా పొడి చేయాలి) బ్రౌన్ సుగర్ - పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) పాలు - 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి - కొద్దిగా (చపాతీలకు అద్దడానికి) నెయ్యి - టీ స్పూను (కరిగించాలి) తయారీ: ఒక పాత్రలో గోధుమపిండి, పాలు వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి పైన మూత ఉంచి సుమారు గంట సేపు నాననివ్వాలి పిండిని ఉండలుగా చేసుకుని ఒక్కోదానిని చపాతీలా వత్తాలి ఒక పాత్రలో ఖర్జూరం తరుగు, నువ్వుల పొడి, బ్రౌన్ సుగర్, పాలు వేసి కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ముందుగా ఒత్తి ఉంచుకున్న చపాతీలో ఖర్జూరం మిశ్రమాన్ని తగినంత పరిమాణంలో ఉంచాలి నాలుగు వైపులా మూసేసి, పిండి అద్ది, చపాతీలా ఒత్తాలి అంచులను చేతితో జాగ్రత్తగా పల్చగా వచ్చేలా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి, ఒక్కో బొబ్బట్టు వేసి చుట్టూ నెయ్యి వేసి బాగా కాల్చి, రెండవ వైపు తిప్పాలి రెండో వైపు కూడా నెయ్యి వేసి కాల్చి తీసేయాలి వేడివేడిగా అందించాలి ఇందులో క్యాల్షియమ్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఎండు ఖర్జూరంలో ప్రతి 100 గ్రాములకు ఖర్జూరం చెట్లు సుమారు 10 - 20 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. తాటి చెట్ల మాదిరిగానే వీటిలోనూ ఆడ చెట్లు, మగ చెట్లు వేర్వేరుగా ఉంటాయి. ఆడ చెట్లు మాత్రమే ఫలాలనిస్తాయి. ఈ చె ట్లను పండ్ల కోసమే కాకుండా నీడ, పశువుల మేత, కలప, ఆయుధాలు, తాళ్లు... కోసం సుమేరియన్లు పెంచినట్లుగా చరిత్ర చెబుతోంది. 5 - 8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూరపు చెట్లు కాపుకొస్తాయి. శక్తి - 280 కిలో క్యాలరీలు పిండి పదార్థాలు - 75 గ్రా. చక్కెర - 60 గ్రా. పీచుపదార్థాలు - 8 గ్రా. కొవ్వు పదార్థాలు - 0.4 గ్రా. మాంసకృత్తులు - 2.5 గ్రా. నీళ్లు - 21 గ్రా. విటమిన్‘సి’ - 0.4 గ్రా. ఒక పండుఖర్జూరంలో శక్తి - 23 కిలో క్యాలరీలు కొవ్వు పదార్థాలు - 0.03 గ్రా. పిండి పదార్థాలు - 6.23 గ్రా. మాంసకృత్తులు - 0.2 గ్రా. ఖర్జూరాలను ఒకప్పుడు అత్యధికంగా సాగు చేసిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరం పంట ఇక్కడే పండేది. ఇక్కడి నాణేల మీద, స్టాంపుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు కనిపిస్తాయి. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ ఈజిప్టు ప్రథమ స్థానంలో వుంది. సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు. ఏ పండైనా పండుగా ఉన్నప్పుడే రుచిగా ఉంటుంది. కాని ఖర్జూరం ఎండినా రుచిగానే ఉంటుంది. ఎండు ఖర్జూరాలను వేసవిలో వడ దెబ్బ నుండి కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు. రంజాన్ మాసంలో ఈ పండ్లతోనే ఉపవాస దీక్ష విరమిస్తారు. మహమ్మద్ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహార ంగా పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూరం చెట్లేనని చెబుతారు. లేత ఆకుల్ని కూరగా వండుతారు, ఖర్జూరపు మొగ్గల్ని సలాడ్లలో వాడతారు. కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు. -
చార్జీల కూత
స్లీపర్, ఏసీ చార్జీల పెంపు 14.2 శాతం వాత ప్రయాణికులపై రూ.50 కోట్లు భారం వాల్తేరు డివిజన్కు రూ.500 కోట్లుఅదనపు ఆదాయం విశాఖపట్నం : రైలు ప్రయాణికులపై చార్జీల భారం పడింది. రైల్వే బడ్జెట్ ప్రకటించకమునుపే బీజేపీ ప్రభుత్వం ఊహించని రీతిలో 14.2 శాతం చార్జీలను వడ్డించింది. రైల్వేలో వసతులు మెరుగుపరుస్తామంటూ అదనపు భారం వేశారు. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. చార్జీల పెంపు వల్ల వాల్తేర్ డివిజన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ఏటా దాదాపు రూ.50 కోట్ల అదనపు భారం పడనుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఇనుము, పెట్రోలియం, ఫెర్టిలైజర్స్, ఆహార ధాన్యాల ఋఎగుమతుల రవాణా వల్ల కూడా వాల్తేరు డివిజన్పై అధిక భారం పడనుంది. కొత్తగా ఎలాంటి సరకు రవాణా పెరగకపోయినా గత ఏడాదిలాగే రవాణా జరిగితే అదనంగా రూ.450 కోట్ల ఆదాయం వాల్తేరు డివిజన్కు సమకూరనుంది. ప్రయాణికుల చార్జీలు పెంపు, సరకు రవాణా పెంపు వల్ల వాల్తేరు డివిజన్కు రూ.500 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్టు రైల్వే వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే వాల్తేరు రైల్వే ఆదాయం రూ.6265.28 కోట్లకు చేరింది. తాజా పెంపుతో రూ. 6765 కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. సమీపంలో ఇంత భారీ ఆదాయాన్ని ఆర్జించే రైల్వే డివిజన్లు లేవు. విజయవాడ రైల్వే డివిజన్ ఏటా రూ.3279 కోట్లు, గుంతకల్ రూ. 1300 కోట్లు, గుంటూరు రూ. 452 కోట్లు, సంబల్పూర్ రూ. 630 కోట్లు, కుర్దా డివిజన్ రూ. 3630 కోట్లు మాత్రమే ఆర్జిస్తున్నాయి. విశాఖ నుంచి రోజూ దాదాపు 90 రైళ్లలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచే రోజూ 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్, విజయవాడ, భువనేశ్వర్, హౌరా, చెన్నై ప్రాంతాలకు ఎక్కువ మంది విశాఖ నుంచి బయల్దేరుతుంటారు. సికింద్రాబాద్కు ఎన్ని రైళ్లు వేసినా అవన్నీ నిత్యం రద్దీగానే నడుస్తుంటాయి. తాజాగా పెరిగిన రవా ణా చార్జీలతో నిత్యావసర ధరలు చుక్కలనంటే ప్రమాదం ఉందని సామాన్యులు భయపడుతున్నారు. ఆహార ధాన్యాలన్నీ రైళ్లలోనే రవాణా అవుతుం టాయి. పెట్రోలియం ఉత్పత్తులకు కూడా ఈ చార్జీల మోత తోడైతే రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. సౌకర్యాలేవీ...! : ప్రస్తుతం పెంచిన చార్జీల్లో 4.2 శాతం మౌలిక వసతుల కల్పనకేనని రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం సౌకర్యాలేవీ కనిపించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. టాయిలెట్లు నిత్యం కంపుకొడుతూనే ఉంటున్నాయని, నీళ్లు కూడా రాని పరిస్థితి ఉందని చె బుతున్నారు. ప్రయాణికుల నుంచి 4.2 శాతం అదనపు చార్జీలను వసూలు చేయడం సరికాదని రైల్వేపై నిప్పులు చెరుగుతున్నారు. వసతులు, సదుపాయాలు, పరిశుభ్రతకు పెద్దపీట వేయకుండా చార్జీలు పెంచడాన్ని రైల్వే వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. ఉపసంహరించుకోవాలి బీజేపీ ప్రభుత్వం రైల్వే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి. గత ప్రభుత్వంలా కాకుండా తమ హయాంలో అందరికీ మేలు చేకూరుతుందంటూ అధికారం చేపట్టిన నెలరోజులకే ప్రయాణికులపై భారం మోపడం శోచనీయం. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. -సీహెచ్. మైఖేల్, న్యాయవాది, అనకాపల్లి. సామాన్యులకు కష్టమే.. ప్రయాణ,రవాణా చార్జీలను రైల్వే పెంచడంతో పరోక్షం గా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉం ది. ఇప్పటికే పెరిగిన బస్సు చార్జీలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇక నుంచి రైలు ప్రయాణం కూడా కష్టమవుతుంది. -ఎ. పరమేశ్వరావు, ఉద్యోగి అనకాపల్లి. చార్జీల పెంపు దారుణం అధికారం ఉంది కదాని ప్రయాణికులపై ఇలా భారం మోపడం సరికాదు. ఏసీ ప్రయాణికులపై కాకుండా సాధారణ ప్రయాణికులు వెళ్లే స్లీపర్ క్లాస్పై వడ్డించడం బాధాకరం. పెంచిన ధరలు తగ్గించేందుకు బీజేపీ, టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి పోరాటాలు చేయాలి. - గుడివాడ అమరనాథ్, వైఎస్సార్సీపీ నేత -
సొంతిల్లు కలే!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్లిమాటెలా ఉన్నా రోజురోజుకు భవన నిర్మాణ సామగ్రి ధరలు చుక్కల నంటుతుండటంతో ఇల్లు కట్టే పరిస్థితి లేకుండా పోతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానేమిగిలిపోతోంది. భవన నిర్మాణం చేపట్టాలంటే పునాది వేసింది మొదలు ఇటుక,ఇసుక, ఇనుము, సిమెంటు తదితర సామగ్రి కొనాలంటే తడిచి మోపెడవు తోంది. దీంతో నిర్మాణ రంగం కూడా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.గత ఏడాది శరవేగంగా సాగిన పనులు ప్రస్తుతం మందగించాయి.ఫలితంగా కూలీలకూ ఉపాధి కరువైంది. సొంతింటి నిర్మాణం సామాన్యుడికి మరింత భారమైంది. భవన నిర్మాణ సామగ్రి ధరలు అమాంతంగా పెరిగి పోయా యి. జిల్లాలో రోజుకు దాదాపు 60 వేల బస్తాల సిమెంట్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా గతంతో పోల్చితే బస్తాకు 70 రూపాయల భారం పడింది. కొందరు నేరుగా కంపెనీల నుంచి, మరికొందరు ప్రభుత్వ రంగ, నిర్మాణ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 50 కేజీల సిమెంటు (సాధారణ ) బస్తా ధర రూ. 235 వరకు ఉండగా, తాజాగా రూ. 295కు చేరింది. అదే 53 గ్రేడ్ రకం, రూ. 240 నుంచి రూ. 305కు చేరడం గమనార్హం. కృతిమ కొరతే.... సిమెంటు పరిశ్రమలపై ప్రభుత్వానికి పట్టు లేకపోవడందో ధరలను అదుపు చేయలేకపోతుందని భవన నిర్మాణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ధరలను కంపెనీలు పెంచాయి. డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేయడంలేదు. ఫలితంగా మార్కెట్లో సిమెంటు అమ్మకాల జోరు తగ్గింది. కృత్రిమ కొరత కారణంగా నిర్మాణాల సీజన్ కాకపోయినా సిమెంటు ధరలు అమాంతం పెరిగాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రుతుపవనాల రాకతో, వర్షాలు ప్రారంభం కానుండటంతో నిర్మాణాలు పెద్దగా జరగడం లేదు. మరో 7, 8 నెలలపాటు ఇదే పరిస్థితి ఉండే అవకావశం ఉంది. అమాంతం పెరిగిన ఇనుము ధర... గత ఏడాది టన్ను ఇనుము రూ. 42వేలు ఉంది. ప్రథమ, ద్వితీయ, ప్రథమ శ్రేణి రకాల ధరలు పెరిగి పోయాయి. నాణ్యత తక్కువగా ఉండే స్టీలు టన్ను ధర రూ. 47వేలు, మేలు రకం రూ. 54వేల వరకు ఉంది. గృహనిర్మాణాల్లో పిల్లర్లు, బెడ్లు, పైకప్పు నిర్మాణాలే కీలకం, వాటికి కంకర వినియోగం తప్పనిసరి. కంకర కోనుగోలు నిర్మాణదారులకు తలకు మించిన భారంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యూనిట్ కంకరకు రూ.700 పెరిగింది. దీనికి తోడు కూలీ, రవాణా ఖర్చులు అదనంగా భారం తప్పడం లేదు. అదేవిధంగా ఇటీవల వరకు రూ.3800 పలికిన వెయ్యి ఇటుకలు ప్రస్తుతం రూ. 4,250 పలుకుతున్నాయి. నేనేమీ తక్కువ కాదన్నట్లు ఇసుక ధర చుక్కలనంటుతోంది. టన్ను రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు పలుకుతోంది. ఇందిరమ్మ పథకం ద్వారా ఇచ్చే డబ్బుకు ఇల్లు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో నిర్మాణం కోసం రుణం చేయాల్సిన పరిస్థితి నెలకొందని లబ్దిదారులు వాపోతున్నారు. వ్యాపారాలు వెలవెల.. విద్యుత్ కోత కారణంగా సిమెంటు ఉత్పత్తి కష్టమవుతోంది. దీంతో కంపెనీలు ధరలు పెంచాయి. విద్యుత్ కోతలు మార్చి నుంచి మొదలైన ధరల పెరుగుదల మాత్రం మే నెల నుంచి జరిగింది. కంపెనీలన్నీ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. నెల రోజులుగా వ్యాపారం 60 శాతం మందగించింది. -పి. రవిచంద్రకుమార్, సిమెంటు వ్యాపారి కొత్తపనులు మొదలు కావడం లేదు భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి పోతుండటంతో కొత్త పనులు మొదలు కావడం లేదు. భవన నిర్మాణ పనుల్ని వృత్తిగా ఎంచుకున్న కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. ఆర్థిక స్తోమత ఉన్నవారు మాత్రమే పనులు కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో పనులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. - ఊట్ల శివ, తాపి మేస్త్రీ -
‘గ్రేటర్’ ఆదాయం ఢమాల్
రాజకీయ అనిశ్చితే కారణం స్థిరాస్తి రంగానికి గడ్డుకాలం వాణిజ్య రంగం కుదేలు తగ్గిన పన్నుల చెల్లింపులు సర్కారు ఖజానాపై ప్రభావం సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ఖజానాకు కీలకమైన హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల ఆదాయం ఈసారి పడిపోయింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో ఆర్థిక వనరుల శాఖలన్నీ చతికిలబడ్డాయి. మహానగరంలో స్థిరాస్తి క్రయవిక్రయాలు నిలిచిపోగా.. యావత్తు వ్యాపార, వాణిజ్యరంగం కుదేలైంది. వెరసి ప్రభుత్వ రాబడి భారీగా పడిపోయింది. సర్కార్ ఖజానాకు కల్పతరువైన వాణిజ్య పన్నుల శాఖ రాబడి వెనకబడిపోగా.. రిజిస్ట్రేషన్, రవాణా తదితర శాఖల ఆదాయాలకు సైతం దెబ్బ తగిలింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 56,474 కోట్లు ఆదాయం సమకూరగా 2013-14 సంవత్సరానికి ఇది 60 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాణిజ్యపన్నుల శాఖ, రిజిస్ట్రేషన్, రవాణా సంస్థలు 2013-14 ఆర్థిక సంవత్సరం రూ.19,071 కోట్ల లక్ష్యానికి కేవలం రూ.13,280 కోట్ల సాధనకే పరిమితయ్యాయి. మిగతా శాఖల ఆదాయం లక్ష్యసాధన కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో సుమారు 12 శాతం మంది జంట జిల్లాల్లోనే ఉన్నందున ఏటా వివిధ పద్దుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుంది. మరోవైపు అధికశాతం పన్నుల చెల్లింపులు సైతం ఇక్కడి నుంచే జరుగుతుండటంతో రాబడీ అధికంగా ఉంటుంది. కానీ ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విభజన ప్రభావంతో రాజకీయ అనిశ్చితి నెలకొని జంట జిల్లాల రాబడి మందగించింది. మందగించిన వాణిజ్య రాబడి.. మహానగరంలోని వ్యాపార, వాణిజ్య రంగాల టర్నోవర్ 2013-14 ఆర్థిక సం వత్సరంలో భారీగానే కుదేలైంది. ఫలితంగా సర్కార్కు అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ పన్నుల చెల్లింపులు తగ్గాయి. రాష్ట్రం మొత్తం మీద వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల రాబడి అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74 శాతం వరకు ఇక్కడ నుంచే జమవుతోంది. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆథారిత పన్ను), అమ్మకం పన్నులు ప్రధానమైనవి. ఇవే కాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంత రాబడి లభిస్తుంది. మొత్తం వసూళ్లలో వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతం, మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది. జంట జిల్లాల్లో వాణిజ్య పన్నుల శాఖకు గల ఏడు డివిజన్లలో పన్నుల వసూళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా క్షీణించాయి. రాజకీయ అనిశ్చితి, ఆందోళనలు, ఉద్యమాలు తదితర అడ్డంకులతో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల రాకపోకలు తగ్గి వ్యాపార, వాణిజ్య రంగ లావాదేవీలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా వాహనాల రాకపోకలు తగ్గడంతో పెట్రోల్ ఉత్పత్తుల వినియోగం మందగించింది. పంజగుట్ట, అబిడ్స్, సికింద్రాబాద్, బేగంపేట డివిజన్లకు పెట్రోల్, డీజిల్, లిక్కర్, సిమెంట్, ఐరన్, గోల్డ్, హోటల్ ఇండస్ట్రీ, షాపింగ్ మాల్స్ తదితర సంస్థల నుంచి భారీగా పన్నులు వసూలవుతా యి. ఆయా సంస్థల లావాదేవీలు తగ్గడంతో పన్నుల చెల్లింపులు తగ్గిపోయాయి. తగ్గిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్, స్టాంప్ల శాఖకు 2013-14 ఆర్థిక సంవత్సరం అచ్చిరాలేదు. మహానగరంలో భూముల క్రయ, విక్రయాలు తగ్గి ఆదాయం పడిపోయింది. రాష్ట్ర విభజన స్థిరాస్తి రంగాన్ని అచేతనంగా మార్చినట్లయింది. భూములు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడంతో పాటు ధర కూడా పడిపోయింది. గతంలో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సైతం క్రయవిక్రయాలు పడిపోగా.. తిరిగి ఊపందుకుని లక్ష్యానికి మించి గత ఆర్థిక సంవత్సరం ఆదాయం సమకూరింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సెగతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఈ ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి కొట్టినట్లయింది. ఫలితంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో స్థిరాస్తి లావాదేవీలు తగ్గి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పడిపోయింది. ఆశావహంగా లేని ‘రవాణా’ ఆదాయం ఇటీవల కాలంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి తదితర పరిణామాల నేపథ్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరం రవాణా శాఖ ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని సంపాదించలేకపోయింది. వాహనాల అమ్మకాలు తగ్గడం వల్ల జీవిత కాల పన్ను తగ్గిపోయిం ది. అలాగే రవాణా వాహనాలకు ప్రతి 3 నెలలకు ఒకసారి వసూలు చేసే క్వార్టర్లీ ట్యాక్స్ కూడా టార్గెట్ చేరుకోలేకపోయింది. హైదరాబాద్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.669.64 కోట్ల రెవెన్యూ టార్గెట్ను పెట్టుకోగా, రూ.478.45 కోట్లు మాత్రమే సాధించింది. అలాగే రంగారెడ్డి జిల్లాలో రూ.783 కోట్లు లక్ష్యం. కాగా రూ.రూ.599.06 కోట్లు మాత్రమే లభించింది. -
కోల్గొట్టారు!
మంచిర్యాల సిటీ, న్యూస్లైన్: సింగరేణి సంస్థ దళారులకు అక్షయపాత్రగా మారింది. అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు దళారులతో కుమ్మక్కై సింగరేణి సామగ్రిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కార్మికులు చెమటోడ్చి కూడబెట్టిన ఆస్తులను చుక్క చెమట పడకుండా దళారులు దోచుకుంటున్నారు. సింగరేణి నుంచి ఏడాదికి రూ.100 కోట్ల కుపైగా బొగ్గు అక్రమంగా చేతులు మారుతోంది. బొగ్గుతోపాటు ఇనుము, రాగి, బెల్టు కూడా ఏడాది కి రూ.5 కోట్ల వరకు అక్రమంగా అమ్ముకొని దళారు లు సొమ్ము చేసుకుంటున్నారు. సంస్థ ఆస్తులు రక్షించేవారు ఉన్నతాధికారుల కనుసన్నల్లో నడుచుకుంటూ ఉండటంతో సింగరేణి సామగ్రి యథేచ్ఛగా తరలుతున్నాయి. ‘బొగ్గ’వుతున్న ఆస్తులు దేశంలోని వివిధ భారీ పరిశ్రమలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది. టెండర్లు నిర్వహించి విక్రయాలు జరుపుతోంది. స్థానిక డీలర్లు టెండర్లు దక్కించుకుని పరిశ్రమలకు గూడ్స్ వ్యాగన్ల ద్వారా బొగ్గును సరఫరా చేస్తారు. ఒక గూడ్స్ రైలులో 59 వ్యాగన్లు ఉంటాయి. దీనిని ఒక ర్యాకు అంటారు. ఒక వ్యాగనులో 80 టన్నుల బొగ్గును నింపాలి. వ్యాగనుకు 15 టన్నుల బొగ్గును తక్కువగా నింపి వే బిల్లు మాత్రం 80 టన్నులు నింపినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం నింపితే ఒక ర్యాకులో 4,720 టన్నులు వెళ్లాలి. 15 టన్నులు తక్కువగా నింపితే ఒక ర్యాకులో 885 టన్నుల బొగ్గు తక్కువగా వెలుతుంది. ఈ విధంగా మిగిలించుకున్న బొగ్గును ఒక ర్యాకుకు సరిపడా తయారు చేసుకుని ఇతర పరిశ్రమలకు టన్నుకు రూ.3,500 చొప్పున రూ.1,65,20,000 అమ్ముకుంటారు. నెలలో ఐదు ర్యాకుల చొప్పున ఏడాదికి 60 ర్యాకుల బొగ్గును అమ్మితే రూ.100 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. కాసులుకురిపిస్తున్న ‘రాగి’ సింగరేణిలోని భారీ యంత్రాలకు కేబుళ్ల ద్వారా విద్యుత్తు సరఫరా అవుతోంది. ఈ కేబుళ్లు అధిక బరువు ఉండటంతోపాటు నాణ్యతగల రాగితో తయారవుతాయి. రాగికి బాగా డిమాండ్ ఉంటుంది. రెండు ఫీట్ల పొడవు కేబుల్లో కిలోపైగా రాగి ఉంటుంది. సెలవు రోజుల్లో, యంత్రాలు మరమ్మతు కోసం ఆగినపుడు, విరామ సమయంలో, గనుల ఆవరణలో ఉన్న కేబుల్ను దొంగలు ఎత్తుకెళ్లి కాల్చివేస్తారు. దీంతో కేబుల్లో ఉన్న రాగి బయటకు వస్తుంది. ఈ రాగిని దొంగలు కిలో రూ.250 చొప్పున దళారులకు అమ్ముతారు. దళారులు హైదరాబాద్లోని బాలానగర్లో కిలో రూ.500 అమ్ముకుంటారు. కరిగించని రాగిని మాత్రమే రశీదు లేకుండా బాలానగర్లో కొంటారు. దళారులు కనీసం నెలలో పదిహేను సార్లు అయినా హైదరాబాద్లో అమ్ముతారు. ఈ విధంగా నెలకు పది క్వింటాళ్ల రాగి అమ్ముతారు. పది క్వింటాళ్లకు కిలో రూ.500 చొప్పున అమ్మితే రూ.5 లక్షలు అవుతాయి. దొంగలకు ఇవ్వగా దళారులకు రూ.2.50 లక్షలు మిగులుతాయి. ఏడాదికి దళారులు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారు. వరంగా మారిన ‘బెల్టు’ భూగర్భ గనులతోపాటు ఓసీపీలలో బొగ్గును బంకర్లలోకి తరలించడానికి బెల్టును ఉపయోగిస్తారు. బెల్టు ఒక ఇంచు మందంతోపాటు రెండున్నర ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఈ బెల్టును దొంగిలించడానికి గోదావరిఖనికి చెందిన ముఠా ఒకటి ఉంది. ఈ ముఠా దొరికి కేసులు గనుక అయితే దళారులే వారిని విడిపించేంత వరకు ఖర్చులు భరిస్తారు. దొంగల వద్ద దళారులు ఒక ఫీటు బెల్టును రూ.250 కొంటారు. ఈ బెల్టును దళారులు తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులోని బియ్యం మిల్లుల యజమానులకు ఒక ఫీటుకు రూ.1000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బెల్టు సైజులుగా కత్తిరించి ట్రాన్సుపోర్టులో గోనె సంచుల ద్వారా పాలకొల్లుకు తరలిస్తారు. కొనుగోలు చేసిన వారు దళారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ట్రాన్సుపోర్టు వారికి రూ.1000 ఇస్తే పాలకొల్లుకు బెల్టు వెలుతుంది. దళారులు నెలకు రూ.10 లక్షలు, ఏడాదికి రూ.కోటికిపైగా సంపాదిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో వారు కూడా మామూలుగానే తీసుకుంటున్నారు. లక్షణంగా ఇనుము చోరీ బొగ్గు ఉత్పత్తికి ఉపయోగించే ఇనుప సామగ్రిని దొంగలకు కాసులు కురిపిస్తోంది. దొంగలు తస్కరించిన ఇనుమును బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెం ప్రాంతాల్లో కొందరు వ్యాపారస్తులు ఒక కిలోకు రూ.10 చొప్పున కొంటారు. కొనుగోలు చేసిన ఇనుమును హైదరాబాద్లో కిలోకు రూ.15 చొప్పున అమ్ముకుంటారు. నెలకు ఈ ప్రాంతాల నుంచి పది లారీల ఇనుము తరలుతోంది. ఏడాదికి రూ.18 లక్షల ఇనుప సామగ్రి దొంగలపాలవుతోంది. ఆస్తుల రక్షణలో అధికారులు విఫలం సింగరేణి ఆస్తులు కాపాడటానికి ఎస్అండ్పీసీ సిబ్బంది సుమారు 2వేల మంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది 800 మంది ఉన్నారు. ఎస్అండ్పీసీ సిబ్బందికి నెలకు సుమారు రూ.6 కోట్లు, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సుమారు రూ.2.50 కోట్లు సింగరేణి వేతనాల రూపంలో చెల్లిస్తోంది. అయినప్పటికీ చోరీలు ఆగడం లేదు. ఇప్పటికైన సింగరేణి రూ.కోట్ల ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది.