IT act
-
నూతన ఐటీ చట్టంలో కొత్త పన్నులుండవ్
న్యూఢిల్లీ: కొత్త ప్రత్యక్ష పన్నుల కోడ్(ఐటీ చట్టం) లో ఎలాంటి కొత్త పన్నులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే(Tuhin Kanta Pandey) స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్ 2025 ద్రవ్యోల్బణానికి ఆ జ్యం పోసేది కాదన్నారు. ద్రవ్యలోటు తగ్గింపుతో, ద్రవ్యోల్బణాన్ని పెంచని బడ్జెట్ను అందించినట్టు చెప్పారు. వృద్ధికి మద్దతునిచ్చే ద్రవ్య విధానానికి అనుగుణంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వడ్డీ రేట్లలో మార్పు ఉండొచ్చన్న సంకేతాన్నిచ్చినట్టయింది.మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు అంశాలపై గందరగోళం, అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు పాండే. మూలధన లాభాల పన్ను లేదా సెక్యూరిటీల లావాదేవీల పన్ను పెంపు రూపంలో ఊహించనిది ఏదైనా ఉంటుందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వారం వ్యవధిలో కొత్త ఆదాయపన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త బిల్లు, తిరగ రాసిందంటూ దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉందన్నారు పాండే.‘‘ఇది పన్ను రేట్లను మార్చదు. నిర్మాణాత్మకంగా పూర్తి మార్పునకు గురికానుంది. హేతుబద్దీకరణతోపాటు ప్రక్రియలను సులభంగా మార్చడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో ఎన్నో సంస్కరణలు ఉంటాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది’’అని పాండే వివరించారు. ప్రస్తుత పన్ను చట్టంతో పోల్చితే సగమే ఉంటుందన్న ఆర్థిక మంత్రి ప్రకటనను గుర్తు చేశారు. వృద్ధి నిలకడగా కొనసాగాలంటే ద్రవ్యోల్బణంపై మంచి నియంత్రణ అవసరమని, రెండింటి మధ్య సమతుల్యం అవసరమన్నారు. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఈ నెల 5న ప్రారంభం కానుంది. 7వ తేదీన నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ సమావేశంలో రేట్ల కోత నిర్ణయం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. పరిస్థితిని వారు తెలుసుకున్నారని, దీనిపై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పాండే బదులిచ్చారు. -
ఐటీ ఎదుట దిల్ రాజు
-
మొత్తం ఇండస్ట్రీ పై రైడ్లు జరుగుతున్నాయి: దిల్రాజు
-
నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు
-
వివాద్ సే విశ్వాస్ పై సందేహాల నివృత్తి
ఆదాయపన్ను శాఖ ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి సంబంధించి సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. తరచూ అడిగే ప్రశ్నలకు (ఎఫ్ఏక్యూలు) సమాధానాలు విడుదల చేసింది. 2024 జులై 22 నాటికి అపరిష్కృతంగా ఉన్న అన్ని రకాల అప్పీళ్లకు వివాద్ సే విశ్వాసం పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద పన్ను వివాదాలను పరిష్కరించుకోవాలని భావించే వారు ఈ నెల 31లోపు ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్ కింద డిక్లరేషన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి.ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధరతాజా స్పష్టతతో పన్ను చెల్లింపుదారులు అందరికీ కేసుల పరిష్కారంలో సమాన అవకాశాలు లభిస్తాయని నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ సచిన్ గార్గ్ తెలిపారు. జులై 22 నాటికి పెండింగ్లో ఉన్నవి, కొట్టేసిన వాటికి సైతం ఈ పథకం కింద పరిష్కారానికి అర్హత ఉంటుంది. వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2024–25 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 1న దీన్ని నోటిఫై చేశారు. డిసెంబర్ 31లోపు డిక్లరేషన్ దాఖలు చేసిన వారు పరిష్కారానికి వీలుగా వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి. 2025 జనవరి 1, ఆ తర్వాత డిక్లరేషన్ దాఖలు చేస్తే వివాదంలోని పన్ను మొత్తంలో 110 శాతాన్ని చెల్లించాలని ఆదాయపన్ను శాఖ తెలిపింది. -
IT Raid : దుల్హన్ హమ్ లేజాయేంగే..
ఐటీ టీమ్ల గ్రేట్ డ్రామాదుమ్మురేపిన బారాత్బడాబాబులు బేజారు రెండేళ్ల కిందట.. మహారాష్ట్ర, జాల్నా.. ప్రధాన రహదారంతా పెళ్లి బారాత్తో నిండిపోయింది. అవును మరి.. ఒకటా రెండా.. దాదాపు 120 కార్లలో బయలుదేరారు మగపెళ్లివారు. ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అనే స్టికర్స్ని విండ్ షీల్డ్స్ మీద అతికించుకుని! పాటలు పాడుతూ, మధ్యమధ్యలో ఆ కార్లను స్లో చేసుకుంటూ.. బ్యాండ్ మేళం వాయించే బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ.. పెళ్లి కొడుకు చేత డాన్స్ చేయిస్తూ.. లోకంలోని పెళ్లి కళ, సందడంతా వాళ్లతోనే అన్నట్లుంది ఆ సంబడం! ఆ దారి పొడవున ఉన్న జాల్నా వాసులంతా ఆశ్చర్యపోయారు ‘ఎవరింటికబ్బా.. ఇంత ఘనమైన బారాత్’ అనుకుంటూ! ఓ కూడలి దాకా వెళ్లగానే ఆ 120 కార్లు అయిదు టీమ్లుగా విడిపోయాయి. ఓ టీమ్ జాల్నాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీని, ఇంకో టీమ్ టెక్స్టైల్ మిల్ను, మరో టీమ్ ఆ రెండు ఫ్యాక్టరీలకు చెందిన యజమానుల ఇళ్లను, వేరే టీమ్ ఫామ్హౌసెస్ను, ఒక టీమేమో అక్కడి కో ఆపరేటివ్ బ్యాంక్కి.. వెళ్లాయి. ఆయా చోట్లకు చేరుకోగానే ఆ బృందాల్లోని సభ్యులంతా ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. ‘ఫ్రమ్ నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్’ అని ఐడీ చూపిస్తూ రెయిడ్స్కి దిగారు. సదరు యజమానులు హతాశులయ్యారు. బ్యాంక్ వాళ్లు .. ఐటీ ఉద్యోగులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సోదాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీల్లో, ఇళ్లల్లో ఏమీ దొరకలేదు. ఫామ్హౌసెస్ను అంగుళం అంగుళం గాలించారు. అక్కడ సీక్రెట్ రూమ్స్ బయటపడ్డాయి. వాటిల్లోనే లెక్కతేలని డబ్బు కోట్లలో దొరికింది. డాక్యుమెంట్స్ కూడా కనిపించాయి. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల వివరాలు తెలిశాయి. వెంటనే వీళ్లు కో ఆపరేటివ్ బ్యాంక్లో తనిఖీలో ఉన్న ఐటీ టీమ్కి సమాచారమిచ్చారు. దాంతో బ్యాంక్లోని టీమ్ పని సులువైపోయింది. ఆ వివరాల ప్రకారం అకౌంట్స్ చెక్ చేశారు. లాకర్స్లో ఉన్న నగలను తీశారు. అదే సమయంలో యజమానులకు సంబంధించి ఔరంగాబాద్, నాసిక్, ముంబైల్లో ఉన్న ఇళ్లు, ఆఫీస్లలోనూ సోదా జరిగింది. రూ. 56 కోట్ల డబ్బు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాలను సీజ్ చేశారు. మొత్తం అన్ని చోట్లా దొరికిన ఆ ఆస్తుల విలువ రూ. 390 కోట్లు. లెక్కాపత్రాల్లేని ఆ డబ్బునంతా జాల్నా స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్కి తీసుకెళ్లి లెక్కించారట. దాన్ని లెక్కించడానికి ఐటీ టీమ్కి పదమూడు గంటల సమయం పట్టింది. స్టీల్, టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పేరుమోసిన వ్యాపార సంస్థలు ఎస్సార్జే పీటీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కలికా స్టీల్ మాన్యుఫాక్చర్స్కి సంబంధించిన యజమానులపై జరిగిన ఈ రెయిడ్ దాదాపు అయిదురోజుల పాటు సాగింది. ఇందులో నాసిక్, పుణే, ఠాణే, ముంబై ఐటీ డిపార్ట్మెంట్లోని సుమారు 260 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. జాల్నాకు చెందిన ఓ సోర్స్ ద్వారా సమాచారం అందుకున్న నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్ ఈ రెయిడ్కి రూపకల్పన చేసింది. యజమానులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. డిపార్ట్మెంట్ వాహనాలు వాడితే యజమానులు అప్రమత్తమవుతారని భావించి 120 వాహనాలను అద్దెకు తీసుకున్నారు. అలాగే ఫార్మల్గా వెళితే వాళ్లకు ఉప్పందే ప్రమాదం ఉంటుందని అలా పెళ్లి బృందంలా తయారయ్యారు. ఆ ఆపరేషన్కి ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అని పేరుపెట్టుకున్నారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ రెయిడ్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. -
విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ రంగంలో దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్రైజ్ పేరుతో విశాఖలో ఐటీ అనుబంధ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చి ంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయాన్ని శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఎపిటా, ఏసీఎన్ ఇన్ఫోటెక్ అనే బీపీవో సంస్థ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక్కడ 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. రుషికొండ ఐటీ హిల్స్లో మంత్రి అమర్నాద్తో హెల్త్రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ ఫార్బ్మెన్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ ఎండీ చమన్బైద్, ఎపిటా సీఈవో కిరణ్కుమార్రెడ్డి, ఏపీ ఐటీ సలహాదారు శేషిరెడ్డి శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. సంస్థ అందించే సేవలు, కల్పించే ఉద్యోగావకాశాలపై చర్చించారు. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. బీచ్ ఐటీ కారిడార్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఏటా 1,20,000 మంది వివిధ కోర్సులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అమెరికాలోని వివిధ టెక్ కంపెనీలలో పని చేస్తున్న ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉంటాడని అమెరికా సంస్థ బృందానికి వివరించారు. స్టార్టప్స్లోనూ తెలుగు విద్యార్థులు బాగా రాణిస్తున్నారన్నారు. విశాఖలో మెడ్ టెక్ జోన్ మెడికల్ రీసెర్చ్కు, వైద్య రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. హెల్త్రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచేందుకు హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్కు సహకారం అందిస్తుందన్నారు. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్, హెల్త్ కోడింగ్, వైద్య సంస్థలకు ఐటీ సర్విసులు సైతం అందించేలా విశాఖ నుంచి సంస్థ పనిచేస్తుందని తెలిపారు. -
చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీల కేంద్రంగా ఐటీ తనిఖీలు
-
కోవిడ్ తర్వాత కొత్త నగరాలకు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఢిల్లీ, ముంబై, పుణే, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఒకప్పుడు ఇవే దేశంలో ప్రధాన ఐటీ హబ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఐటీ కంపెనీలు రూటు మారు స్తున్నాయి. చండీగఢ్, మంగళూరు, అహ్మదా బాద్, కాన్పూర్, తిరువనంతపురం, భోపా ల్, జైపూర్, వరంగల్, విశాఖపట్నం,విజయ వాడ లాంటి నగరాలు తెరపైకి వస్తున్నాయి. కోవిడ్కు దేశంలోని కేవలం ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన సమాచార సాంకేతిక రంగం.. కోవిడ్ తదనంతర పరిణా మాల నేపథ్యంలో దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బహుళజాతి సంస్థలు నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవాలని భావి స్తుండటమే ఇందుకు కారణమని ఐటీ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నగరాల్లోనే 11–15% నైపుణ్యం ఉన్న యువత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే 11–15 శాతం సాంకేతిక నైపుణ్యం ఉన్న యువత ఉన్నట్లు ఐటీ కంపెనీలు గుర్తించాయి. దాదాపు 60 శాతం పట్టభద్రులు ఈ పట్టణాల నుంచే ఉత్తీర్ణులు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉత్తీర్ణులయ్యే వారిలో 30 శాతం మేరకు ఉద్యోగాల కోసం ప్రథమ శ్రేణి నగరాలకు తరలి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల వైపు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్లు ఎక్కువగా ఇక్కడే.. 2022లో దాదాపు 7 వేల (39%) స్టార్టప్లు ఈ కొత్త నగరాల నుంచే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో 13 శాతం స్టార్టప్ కంపె నీల ఫండింగ్ ఈ ద్వితీయ శ్రేణి నగరాలకే వెళ్లినట్లు తెలిపింది. పెట్టుబ డిదారులు కూడా ప్రథమ శ్రేణి నగరాల్లోని వాటికంటే ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికే ముందుకు వస్తున్నట్లుగా అధ్యయనంలో తేలినట్లు నివేదిక పేర్కొంది. కొత్త హబ్లు ఎక్కడెక్కడ? దేశంలోని ద్వితీ య, తృతీయ శ్రేణి నగరాలైన టువంటి చండీగఢ్, నాగ్పూర్, అహ్మదా బాద్, మంగళూరు, కాన్పూర్, తిరువనంతపుర, లఖ్నవూ, గౌహతి, రాంచీ, భోపాల్, జైపూర్, ఇండోర్, నాసిక్, భువనేశ్వర్, రాయ్పూర్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, హుబ్బళి, విజయవాడ, తిరు పతి, మైసూరు, వెల్లూరు, మధురై, తిరుచిరా పల్లి, కొచ్చి నగరాలపై ఐటీ సంస్థలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తెలంగాణలోని పలు నగరాల్లో హబ్లు ఐటీ రంగాన్ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లాలని 2015–16 నుంచే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్లలో ఐటీ హబ్లు నిర్మించారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్లలో ఐటీ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే నల్లగొండ, రామగుండంలోనూ ఐటీ హబ్లు ఏర్పాటు చేయ బోతున్నారు. మొత్తం మీద 2026 నాటికి 20 వేల మందికి నేరుగా ఈ పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వికేంద్రీకరణతో సానుకూల మార్పులు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం ప్రధాన నగరాలు, పట్టణాలకు పరిమితం కాకుండా రెండో, మూడో శ్రేణి నగరాలు, ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ వల్ల చాలా సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కోవిడ్ తర్వాత చాలావరకు ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నా మంచి ఉత్పాదకత వస్తుండటంతో కంపెనీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. నిర్వహణ వ్యయం మరింత తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి మరోవైపు వికేంద్రీకరణ కారణంగా ఉద్యోగులకు కూడా ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు తగ్గుతాయి. రాబోయే రోజుల్లో వికేంద్రీకరణ మరింత జరిగి శాటిలైట్ సెంటర్ల ద్వారా చిన్న చిన్న హబ్లు కూడా ఏర్పడబోతున్నాయి. ఇంటర్నెట్ స్పీడ్, నిరంతర కరెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్లే అవకాశాలుంటాయి. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ప్రత్యామ్నాయ హబ్లు అత్యంత ఆవశ్యకం దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఏ విధంగా ఐటీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్న అంశంపై డెలాయిట్, నాస్కామ్ సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించి నివేదికను తయారు చేశాయి. ‘ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ఇన్ ఇండియా’ పేరిట ఇది రూపొందింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ప్రస్తుతం మరో 26 నగరాలకు విస్తరించిందని ఆ నివేదిక వెల్లడించింది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు నాస్కామ్ అధిపతి సుకన్యరాయ్ తెలిపారు.కాగా ఆయా ప్రాంతాల్లో విస్తరించడానికి గల కారణాలను, అక్కడ ఉన్న అవకాశాలను, ఇతర అంశాలను వివరించింది. ఏడు ప్రధాన నగరాల్లో విస్తరించిన ఐటీ రంగంలో దాదాపు 54 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. అయితే నైపుణ్యం, నిర్వహణ వ్యయం, కొత్త నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి వారు ఉన్నచోటే ఉపాధి కల్పించేలా ఆ ప్రాంతాల్లోనే కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని ఐటీ సంస్థలు భావిస్తున్నాయని నివేదిక చెబుతోంది. కోవిడ్ తరువాత ఈ వికేంద్రీకరణ వేగం పుంజుకుందని తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలకు ప్రత్యామ్నాయంగా ఐటీ హబ్ల ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు నాస్కామ్, డెలాయిట్ స్పష్టం చేశాయి. 2030 నాటికి నైపుణ్యం మిగులు.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ నిపుణుల కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని అంచనా వేశారు. అయితే 2030 నాటికి ఈ పరిస్థితి మారుతుందని, డిమాండ్ కంటే అధికంగా ఐటీ నిపుణులు ఉంటారని సుకన్యరాయ్ చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్ల ఏర్పాటు వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ రంగం వైపు మళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేలా తగిన మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావడం ఐటీ రంగానికి కలిసివచ్చే అంశమని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మౌలిక వసతుల కల్పనతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని, మరోవైపు భవనాల కోసం చెల్లించే అద్దె కానీ, సొంత భవనాల నిర్మాణ వ్యయం కానీ ప్రధాన నగరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎమర్జింగ్ సిటీస్ (కొత్త నగరాలు)లో 25 నుంచి 30 శాతం వరకు తక్కువ వేతనాలకే నిపుణులు లభిస్తుండటం, 50 శాతం వరకు తక్కువకు అద్దెకు భవనాలు లభించడం వంటి అనుకూల పరిణామాలు ఐటీ రంగం వికేంద్రీకరణకు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. -
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
ఐటీ నోటీసులిస్తే మీకది వార్త కాదా?
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు జర్నలిజంపై గౌరవాన్ని పూర్తిగా దిగజారుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిస్తే ఆ పత్రికల్లో కనీసం వార్త కూడా ప్రచురించకపోవటానికి మించి దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో మీకు నచ్చిందే రాస్తారా? అని నిలదీశారు. మంగళవారం సచివాలయం వద్ద మంత్రి సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పకపోవటాన్ని బట్టి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చాలాసార్లు తప్పించుకున్నారు. ఆయన అక్రమాల్లో ఐటీ శాఖ గుర్తించింది అవగింజంతే. ‘సీబీఐ, ఈడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తక్షణం అదుపులోకి తీసుకోవాలి. చంద్రబాబు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో అందరికీ తెలుసు. రాజధానిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రూ.ఐదు లక్షలు దాటిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా పోలవరంలో నామినేషన్పై రూ.వేల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఎంతో కాలం తప్పించుకోలేరు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్లా జైలుకు వెళ్లక తప్పదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాననే పవన్కళ్యాణ్ దీనిపై ఎందుకు స్పందించరు?’ అని మంత్రి సత్య నారాయణ నిలదీశారు. -
తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్స్టర్లే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్స్టర్లేనన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్ బయటకొచ్చిందని చెప్పారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు, ఫైబర్నెట్ స్కామ్లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగిందని చెప్పారు. ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. -
నోటీసులపై నోరు విప్పు
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. విజనరీగా చెప్పుకునే ఆయన పొలిటికల్ స్కామ్స్టర్ అని ధ్వజమెత్తారు. కమీషన్లుగా దండుకున్న రూ.118.98 కోట్లపై నోరు మెదపకుండా నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమార్జనలో ఇది చిన్న భాగం మాత్రమేనని, క్షుణ్నంగా విచారిస్తే భారీ కుంభకోణాలు బహిర్గతం కావడం ఖాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కుంభకోణాలను అప్పట్లోనే తెహల్కా బయటపెట్టింది. అక్రమార్జనపై 17 కేసుల్లో చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నారు. ఢిల్లీలో రూ.700–రూ.800 కోట్లతో అత్యద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని కేంద్రం నిర్మిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.500 – రూ.600 కోట్లతో సచివాలయ భవనాన్ని నిర్మించింది. ఏసీ, ఇంటీరియర్స్ సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేల నుంచి రూ.మూడు వేలు వ్యయం అవుతుంది. చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ.13 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు పెట్టి రేకుల షెడ్డు లాంటి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి చదరపు అడుగుకు రూ.పది వేలకుపైగా ముడుపులు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరాయి. పోలవరంలో వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను నిర్మించకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను చంద్రబాబు చేపట్టారు. దీంతో 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలు ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడ్డాయి. వాటిని యధాస్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత నష్టానికి కారకుడు చంద్రబాబే. ఈ పాపానికి చంద్రబాబు పాల్పడకుంటే పోలవరం ఈ పాటికి ఎప్పుడో పూర్తయ్యేది. చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్టంలో 2014–19 మధ్య పేదరికం 11.66 శాతం ఉండగా, సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల 6 శాతానికి తగ్గింది. -
కస్టడీలోకి తీసుకుని విచారించాలి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది. సమాధానం చెప్పడంలో ఆలస్యం అయితే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా ఆయనే చెబుతారా? కేంద్రంలో అనేక ప్రభుత్వాలను నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? తన చేతికి కనీసం ఒక రింగు కూడా లేదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమంటారు? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. విక్కీ జైన్ ఎవరో తెలియదని చంద్రబాబును చెప్పమనండి. వాళ్ల వాట్సాప్ చాట్స్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయటపడతాయి. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి. అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే. అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకుంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయదు. ఆ చానళ్లలో ఒక్కరూ చర్చించరు. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి బాబు అవినీతిపై ఎందుకు దాస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలను ప్రజలకు అందివ్వరా?’ అని మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. -
ఇసుకపై పదేపదే వక్రీకరణలు
సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్ రీచ్లు, స్టాక్ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు.. అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్ యార్డ్ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్లలో సమీపంలోనే స్టాక్ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు. గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు! గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు. మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది. ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్ రీచ్ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది. రీచ్లకు ఎవరైనా వెళ్లవచ్చు ఓపెన్ రీచ్లు, ఇసుక శాండ్ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. కాంట్రాక్ట్ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్ రీచ్ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్ చేసిన యార్డ్లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్లో ఇసుక తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టాం ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది. అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్ వెంచర్స్ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్ దక్కించుకున్నది జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ ఒక్కటే. అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్ కాంట్రాక్టర్ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది? -
మాన్యుఫాక్చరింగ్ హబ్గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్ఆర్వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
వచ్చే ఫిబ్రవరిలో 21వ బయో ఏసియా సదస్సు
సాక్షి, హైదరాబాద్: బయో ఏసియా 21వ వార్షిక సదస్సు తేదీలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో జరుగుతుందన్నారు. ‘డేటా అండ్ ఏఐ–రీడిఫైనింగ్ పాజిబిలిటీస్’అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్లో డేటా ఆధారిత సాంకేతికత, కృత్రిమ మేధస్సు పోషించే పాత్రపై 2024 బయో ఏసియా సదస్సులో చర్చిస్తారన్నారు. అన్ని రంగాల్లో డిజిటల్ ఆవిష్కరణల ఫలితాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, లైఫ్సైన్సెస్ సంగమం ద్వారా అద్భుత ఫలితాలు సాధించే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్యరక్షణ రంగంలో ఆవిష్కరణ శకం నడుస్తున్న ప్రస్తుత సమయంలో బయో ఏసియా సదస్సుకు అత్యంత ప్రాధాన్యం ఉందని కేటీఆర్ వెల్లడించారు. ప్రగతిభవన్లో బయో ఏసియా తేదీల ప్రకటన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వివేకానంద, బీఆర్ఎస్ సోషల్ మీడియా కనీ్వనర్లు మన్నె క్రిషాంక్, పాటిమీది జగన్మోహన్రావు, వై.సతీశ్రెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. 15 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారం సీజ్
కర్ణాటక: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ ఆరంభం కాగా, బెంగళూరులో ఐటీ అధికారులు ముమ్మరంగా దాడులు చేశారు. శనివారం బెంగళూరులో శాంతినగర, కాక్స్టౌన్, శివాజీనగర, ఆర్ఎంవీ ఎక్స్టెన్సన్, కన్నింగ్హ్యామ్ రోడ్డు, సదాశివనగర, కుమారపార్కు వెస్ట్, ఫేర్ఫీల్డ్ లేఔట్లో ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో రూ.15 కోట్లు నగదు, రూ.5 కోట్లు విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఏ అభ్యర్థులతో సంబంధాలు ఉన్నాయి అనే దానిపై విచారణ చేపట్టారు. మైసూరులో కూడా ఐటీ దాడులు జరిగాయి. -
ఐటీ రూల్స్లో సవరణలు ఉపసంహరించండి
న్యూఢిల్లీ: ఐటీ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలను ఉపసంహరించుకోవాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షుడు కేఆర్పీ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్యపక్షాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సవరణలను ఈ నెల 6న నోటిఫై చేశారని పేర్కొన్నారు. ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తించే అధికారాన్ని ఈ సవరణలు ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఇప్పటిదాకా ఇలాంటి సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీ ఐఎన్ఎస్కు ఉందని గుర్తుచేశారు. మీడియా వృత్తి, విశ్వసనీయతతో ముడిపడి ఉన్న ఏ అంశంపై అయినా నోటిఫికేషన్ జారీ చేసేముందు మీడియా సంస్థలు, విలేకరుల సంఘాలతో విస్తృత, అర్థవంతమైన సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజ నిర్ధారణ కోసం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు? న్యాయ సహాయం కోరవచ్చా? అప్పీల్ చేసే హక్కు ఉంటుందా? తదితర కీలక అంశాలను నోటిఫైడ్ రూల్స్లో ప్రస్తావించలేదని కేఆర్పీ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బహిర్గతం చేసిన ముసాయిదా సవరణల కంటే ఈ నెల 6న నోటిఫై చేసిన కొత్త ఐటీ రూల్స్ ఏమాత్రం భిన్నంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా ఐటీ రూల్స్లో సవరణలు చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని ఐఎన్ఎస్ సెక్రెటరీ జనరల్ మేరీ పాల్ స్పష్టం చేశారు. సవరణలు నోటిఫై చేసే ముందు మీడియా సంస్థలతో చర్చల కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. -
పన్ను భారం తగ్గించుకోవాలంటే..
వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది. ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు. ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్ఎస్ఎస్ అన్నది సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్పీఎస్– మూడు ప్రయోజనాలు ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్ వరకు లాకిన్లోనే ఉంటాయి. డెట్ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్కు అలోకేషన్ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్పీఎస్కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్పీఎస్కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కనుక ఎన్పీఎస్ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్పీఎస్లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ (గిల్ట్ ఫండ్స్) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ విభాగం కూడా ఉంది. జీవిత బీమా పథకాలు జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్లు మెరుగైనవి. లేదంటే ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్ ప్లాన్లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు ఎన్ఎస్సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్ చేస్తుంటే, యాక్సిస్ బ్యాంక్ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్ఎస్సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్లు ఆన్లైన్లోనూ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎస్సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్ఎస్సీలో పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. యులిప్లు యులిప్లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్లోనూ ఎన్పీఎస్లో మాదిరే ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్పీఎస్లో మాదిరి ఇందులో ఫండ్ మేనేజర్ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పీపీఎఫ్ ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్ ఎఫ్డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను సైతం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్ తక్కువ. తక్కువ రిస్క్ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్ ఫండ్స్ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు. -
ఐటీ పరిధిలో ఆట
ఆన్లైన్ గేమింగ్లో అతి పెద్ద మార్కెట్ అయిన మనం ఎట్టకేలకు కళ్ళు తెరిచి, కష్టనష్టాలను నియంత్రించే పనిలో పడ్డాం. ఆన్లైన్ గేమింగ్ను ఐటీ నిబంధనల కిందకు తెస్తూ, కొన్ని ముసాయిదా సవరణలను కేంద్ర ఐటీ శాఖ సోమవారం విడుదల చేసింది. ఆన్లైన్ గేమ్స్ అన్నీ భారత చట్టాలకు అనుగుణంగా ఉండేలా, వాడకందార్లకు హాని కలగకుండా కాపాడేందుకే ఈ చర్యలని సర్కారు మాట. ముసాయిదాలో స్వీయ నియంత్రణ వ్యవస్థను ప్రతిపాదించిన మంత్రి, భవిష్యత్తులో గేమింగ్ కంటెంట్ను సైతం నియంత్రించే అవకాశం ఉందని చెప్పడం గమనార్హం. సాధారణంగా ఆన్లైన్ గేమింగ్ 3 రకాలు. ఒకటి – 1990లలో వీడియో పార్లర్లలోని ఆటల్లాగా ఇప్పుడు ఆన్లైన్లో వ్యవస్థీకృతంగా ఆడే ‘ఇ–స్పోర్ట్స్’. రెండోది – వేర్వేరు జట్లలోని నిజజీవిత ఆట గాళ్ళను ఒక జట్టుగా ఎంచుకొని, పాయింట్ల కోసం ఆన్లైన్లో ఆడే ‘ఫ్యాంటసీ గేమ్స్’. మూడోది – మానసిక, శారీరక నైపుణ్యంపై, లేదంటే పాచికలాట లాంటి సంభావ్యతపై ఆధారపడ్డ ఆన్లైన్ సరదా ఆటలు. సంభావ్యతపై ఆధారపడ్డ ఆటల్ని డబ్బులకు ఆడితే జూదం. ఇదీ స్థూలమైన లెక్క. తాజా ప్రతిపాదనల్లో ‘ఆన్లైన్ ఆట’ను నిర్వచించడమే కాక, ఆపరేటర్లు నియమ నిబంధనలన్నీ వాడకందారుకు ముందే చెప్పాలంటూ పారదర్శకతకు ప్రయత్నించడం బాగుంది. అలాగే çసమయం దాటి ఆడుతుంటే, అది ఓ వ్యసనంగా మారకుండా హెచ్చరిక సందేశాలు పంపాలనడమూ భేష్. కేంద్ర చట్టం పరిధిలోకి ఆన్లైన్ ఆటల్ని తీసుకొస్తున్న పాలకుల చొరవను స్వాగతిస్తూనే, లోపా లనూ నిపుణులు వేలెత్తి చూపుతున్నారు. గతంలో ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ ‘ఐటీ చట్టం–2000’ పరిధిలోది కాదు. తాజాగా ఐటీ శాఖను ఆన్లైన్ గేమింగ్ చూసే కేంద్ర మంత్రిత్వ శాఖగా నియమిం చారు. అది జరిగిన వారానికే ఈ కొత్త ముసాయిదా సవరణలు తెచ్చారు. నిజానికి, ఆన్లైన్ గేమింగ్ ఏ శాఖ కిందకు వస్తుందనే పాలనాపరమైన స్పష్టత ఇవ్వడం వరకు ఓకే కానీ, ఆ అధికారాన్ని సదరు శాఖ వినియోగించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ పని చేయకుండానే ఐటీ చట్టం నియంత్రణ పరిధిలోకే ఆన్లైన్ గేమింగ్ను తెస్తూ, ఐటీ నిబంధనలు చెయ్యడం విడ్డూరం. అలాగే, ఈ సరికొత్త ముసాయిదా సవరణలపై ఈ నెల 17 లోగా ప్రజలు సలహాలు, సూచనలి వ్వాలని కోరారు. కానీ, ఈ సంప్రతింపుల ప్రక్రియలో వచ్చిన అభిప్రాయాలను ప్రజా క్షేత్రంలో ఉంచట్లేదు. ఇటీవల ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ –2022’లోనూ ఐటీ శాఖ ఇదే పని చేసింది. దీనివల్ల ఈ విధాన నిర్ణయంలో ప్రభుత్వ చర్యల పట్ల ప్రజల్లో ఏ మేరకు నమ్మకం ఉంటుం దంటే సందేహమే. ముందుగా ఎలాంటి చర్చ, శ్వేతపత్రం లేకుండానే, కనీసం ప్రభుత్వ ఆలోచన ఏమిటో చెప్పకుండానే కొత్త ముసాయిదా సవరణల్ని కేంద్రం తేవడం కొంత వివాదాస్పదమైంది. భౌతికంగా అన్ని రకాల జూదం, పందాలపై దేశంలో గోవా, సిక్కిమ్, కేంద్రపాలిత డామన్ మినహా మిగతా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. బ్రిటీష్ కాలపు బహిరంగ జూద చట్టం 1867 సహా, వివిధ రాష్ట్రాల చట్టాలున్నాయి. కొన్నిచోట్ల నైపుణ్య ఆధారిత ఆటలకూ షరతులున్నాయి. పాపులర్ ఆన్లైన్ ఆట లూడోలోనూ జూదం సాగుతోందని వివాదమైంది. ఇప్పుడు ఆన్లైన్ ఆటల్ని సైతం ఒక కేంద్ర చట్టం కిందకు తేవడంతో విదేశాల నుంచి నడిచే చట్టవిరుద్ధ, దేశవిద్రోహ జూద వేదికల ముప్పును అరికట్టవచ్చు. అయితే, పరిమాణం, రిస్క్తో సంబంధం లేకుండా ఆన్లైన్ ఆటల్ని అందించే సైట్లు, మొబైల్ యాప్లు (ఇంటర్మీడియరీలు) అన్నిటినీ ఒకే గాట కట్టడంపై పునరాలోచించాలి. అంతర్జాతీయ సంస్థలు తమ సేవల్ని భారత్లో ఆరంభించడానికి ఇక్కడ ఆఫీసర్లను పెట్టుకోవడం ఎంత ఆచరణాత్మకమో చెప్పలేం. డబ్బుతో జూదంపై మరింత కఠిన నిబంధనలుండాలని తమిళనాడు కోరుతోంది. మరి రాష్ట్రాలు అదనపు షరతులు పెట్టవచ్చేమో స్పష్టత లేదు. నిజానికి, కరోనాలో మనం వినోదాన్ని ఆస్వాదించే విధానం మారిపోయింది. ఓటీటీ ఛానల్స్ విస్తరణతో పాటు ఆన్లైన్ గేమింగ్ బాగా పెరిగింది. ఆన్లైన్ ఆటలపై వెచ్చించే సగటు సమయం కోవిడ్ ముందుతో పోలిస్తే, 65 శాతం హెచ్చింది. ఏకంగా 43 కోట్ల మందికి పైగా ఈ వర్చ్యువల్ గేమింగ్పై సమయం వెచ్చిస్తున్నారని లెక్క. కరోనాతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టెక్నాలజీని వాడి, డిజిటల్ తెరను వీక్షించే వ్యవధి పెరగడం తిప్పలు తెచ్చింది. యువతరానికి ఆన్లైన్ ఆట ఓ వ్యసనమై, రోజూ 6 నుంచి 8 గంటలు వెచ్చిస్తున్నారు. చదువు, మానవ సంబంధాలు, చివరకు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. గతంలో పబ్జీ, బ్లూ వేల్ ఛాలెంజ్ లాంటి ఆన్లైన్ గేమ్స్ హింస, ఆత్మహత్యలను ప్రేరేపించేసరికి, వాటిని నిషేధించాల్సి వచ్చిన సంగతి మరిచిపోలేం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గేమింగ్ వ్యసనాన్ని ఆరోగ్య సమస్యగా గుర్తించడం గమనార్హం. చైనా ఇప్పటికే ఈ ఆటల్ని ‘మెదడుకు మత్తుమందు’ అంటూ, 18 ఏళ్ళ లోపు పిల్లలు వారానికి 3 గంటలు మించి ఆడే వీల్లేకుండా చేసింది. భారత్లోనూ క్యాసినో లాగే ఆన్లైన్ ఆటల్లోనూ పిల్లలకు కనీస వయఃపరిమితి విధించవచ్చు. ముఖ్యంగా వీటి దుష్ఫలితాలపై తల్లితండ్రులు, అధ్యాపకులు పిల్లల్లో చైతన్యం తేవాలి. వచ్చే 2025 కల్లా 65.7 కోట్ల యూజర్లతో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ రూ. 29 వేల కోట్లకు పైగా ఆదాయం తెస్తుంది. 15 వేల ఉద్యోగాలొస్తాయట. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దే క్రమంలో ఆర్థిక అవకాశాలెన్ని ఉన్నా, ఈ ఆటలపై అదుపు లేకుంటే సామాజిక నష్టమూ ఎక్కువే. కాబట్టి పట్టువిడుపులతో పాలకుల నియంత్రణ చర్యలే శరణ్యం. -
రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి ఇళ్లలో కొనసాగిన దాడులు
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్/రసూల్పుర/మేడ్చల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు బుధవారం రెండోరోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించింది. వైద్య కళాశాలల్లో సీట్లకు నిర్దేశిత ఫీజు కంటే అధిక మొత్తాన్ని నగదు రూపంలో తీసుకుని రియల్ ఎస్టేట్కు, సూరారం ఆసుపత్రికి తరలించినట్లు బయటపడింది. మరోవైపు మల్లారెడ్డి కుమారుడు మహేందర్రెడ్డికి ఛాతీలో నొప్పి రావడం, ఆస్పత్రిలో చేరడం, ఈ విషయం తెలిసి ఐటీ అధికారులను, సీఆర్పీఎఫ్ జవాన్లను నెట్టేసి మంత్రి ఆస్పత్రికి వెళ్లడం, కుమారుడిని చూడనీయలేదంటూ అక్కడ ధర్నాకు దిగడం, మహేందర్రెడ్డిని జవాన్లు చిత్రహింసలు పెట్టారని ఆరోపించడం, ఆయన కోడలు ప్రీతిరెడ్డిని ఐటీ అధికారులు మంత్రి ఇంటికి తీసుకురావడం.. తదితర పరిణామాలతో బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. బుధవారం రాత్రివరకు తనిఖీలు కొనసాగుతుండగా, గురువారం కూడా ఇవి కొనసాగే అవకాశం ఉందని తెలిసింది. ఐటీ అధికారులకు సహకరిస్తున్నామని, ఆస్తులు, కాలేజీల వివరాలన్నీ ఇచ్చామని మంత్రి వెల్లడించారు. సోదాలు గురువారం ముగిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో చేరిన మహేందర్రెడ్డి, ప్రవీణ్రెడ్డి ఐటీ దాడులు కొనసాగుతుండగా.. మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతీలో నొప్పిరావడంతో బుధవారం సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చేరారు. మరో బంధువు ప్రవీణ్రెడ్డి కూడా ఆసుపత్రిలో చేరి సాయంత్రానికి డిశ్చార్జి అయ్యారు. మంత్రి ఇంట్లో పనిచేసే పనిమనిషి ఫిట్స్తో అనారోగ్యానికి గురయ్యారు. కుమారుడు ఆసుపత్రిలో చేరారని టీవీల ద్వారా తెలుసుకున్న మంత్రి తన నివాసం నుంచి.. సోదాలు చేస్తున్న ఐటీ అధికారులను, సీఆర్పీఎఫ్ జవాన్లను నెట్టేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట ఐటీ అధికారులు కూడా ఆసుపత్రికి వెళ్లారు. మహేందర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వద్దకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రావడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడటం, సీఆర్పీఎఫ్ జవాన్లు..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు జవాన్లు లాఠీలు ఝళిపించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఐటీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నన్నూ, సీఎంను బద్నాం చేయాలని చూస్తున్నారు.. ‘మేము దొంగలమా..దొంగ వ్యాపారం చేస్తున్నామా..? కేసినో నడిపిస్తున్నామా.? హవాలా దందా చేస్తున్నామా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామా.? తక్కువ మొత్తంతో పేద పిల్లలకు ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్య అందిస్తున్నాం. మేము ఏమైనా అవినీతికి పాల్పడితే.. కేసులు పెట్టుకోండి. మా ఇళ్లు వేలం వేయండి.. స్వాధీనం చేసుకోండి..? కానీ మమ్మల్నెందుకు క్షోభకు గురి చేస్తున్నారు? కాలేజీలు, హాస్టళ్లకు సంబంధించిన ఫీజుల చెల్లింపులు మొత్తం ఆన్లైన్లోనే జరుగుతాయి. ఎవరి దగ్గరో డబ్బు దొరికితే దానిని నాతో ముడిపెట్టడం ఏమిటి? నన్ను, ముఖ్యమంత్రి కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తున్నారు. నేను టీఆర్ఎస్ మంత్రిని కావడం వల్లనే దాడులు చేస్తున్నారు. వందల మంది అధికారులతో దాడులు చేయడం ఏమిటి? నా కొడుకు ఛాతీపై కొట్టారు. వాడు తీవ్రంగా భయపడుతున్నాడు. వాడికి ఏమైతుందోనని భయంగా ఉంది. సోదాల్లో ఏమీ దొరకకపోయినా ప్రధాని నరేంద్రమోదీ మాపై కక్షతో వ్యవహరిస్తున్నారు..’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడినుంచి మల్లారెడ్డి బోయిన్పల్లిలోని ఇంటికి వచ్చిన తరువాత ఆయన కోడలు ప్రీతిరెడ్డిని కూడా ఐటీ అధికారులు తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీల వ్యవహారం ఆమె చూస్తారని చెబుతున్నారు. ఇలావుండగా మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలను చూసే సంతోష్రెడ్డి కొంపల్లి నివాసంలో ఐటీ అధికారులు దాదాపు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకుని ఐటీ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. సంతోష్రెడ్డి డిలీట్ చేసిన కంప్యూటర్ డేటాను రిట్రీవ్ చేసినట్లు సమాచారం. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి కక్ష సాధింపులు మంచివి కాదని, వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టే ఓపికతో ఉన్నామని, కానీ ఐటీ అధికారుల తీరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉందని ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, ఎల్.రమణలు విమర్శించారు. సూరారం ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ.. బహిరంగంగా వ్యాపారాలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేసి, ఇలా దాడులతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇకనైనా కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం మర్రి రాజశేఖర్రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలను నిరసిస్తూ కంటోన్మెంట్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పలు కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్లారెడ్డి నివాసం వద్ద నిరసన చేపట్టారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మర్రి రాజశేఖర్రెడ్డి లాకర్లపై దృష్టి.. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డికి చెందిన లాకర్లపై ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయనకు ఎనిమిది బ్యాంకుల్లో 12 లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. రాజశేఖర్రెడ్డి ప్రస్తుతం టర్కీలో ఉండటంతో మంత్రి కూతురు శ్రేయారెడ్డిని తీసుకెళ్లి లాకర్లను తెరవడానికి ప్రయత్నించారు. అందులో నాలుగు లాకర్లను తెరిచినట్లు ఐటీ అధికార వర్గాల సమాచారం. కాగా లాకర్లలో పెద్దయెత్తున నోట్ల కట్టలు కనుగొన్నట్లు తెలిసింది. రూ.4 కోట్ల నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాజశేఖర్రెడ్డి గురువారం నగరానికి చేరుకుంటారని తెలుస్తోంది. ఇదీ చదవండి: తెలంగాణలో సోదాలు, దాడుల కాలమిది! -
డిజిటల్ ఇండియా చట్టం వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇందులోని కీలక అంశాలపై మరింతగా సంప్రదింపులు జరగాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘వినియోగదారులు, పరిశ్రమ, స్టార్టప్లు, లాయర్లు, న్యాయమూర్తులు, పౌరులు మొదలైన వర్గాలన్నింటి సంప్రదింపులతో రూపొందాలి. వారందరి అభిప్రాయాలకు ఆ చట్టాల్లో స్థానం లభించాలి. ప్రభుత్వం చేయబోతున్నది ఇదే‘ అని మంత్రి చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల నాటి ఐటీ చట్టం 2000 స్థానంలో డిజిటల్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. -
దాదాపు 27 లక్షల ఖాతాలపై వేటువేసిన వాట్సాప్
సాక్షి,ముంబై: మెటాకు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ ఈ నెలలో కూడా పెద్ద ఎత్తున ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ 30 వరకు ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది.సెప్టెంబర్ నివేదిలో సంబంధిత వివరాలను సంస్థ వెల్లడించింది. ఇందులో 8 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్లనుఎలాంటి ఫిర్యాదలు రాకముందే తొలగించినట్లు వాట్సాప్ పేర్కొంది. ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో తప్పుడు, నకిలీ ఖాతాలను బ్యాన్ చేసింది. అలాగే భారత ఐటీ రూల్స్ 2021కి (IT Rules 2021) అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను నిలిపి వేస్తుంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు 2022 సెప్టెంబర్ యూజర్ సేఫ్టీ రిపోర్ట్ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. అలాగే సెప్టెంబర్లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు ప్రతిస్పందించడం, వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్లాట్ఫారమ్లో హానికరమైన కంటెంట్ను నివారిస్తున్నామని, ఎందుకంటే హాని జరిగిన తరువాత గుర్తించడం కంటే ముందునేగా నివారించడానికే తమ ప్రాధాన్యత వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. -
New IT Rules: కేంద్రం కొత్త రూల్స్.. డిజిటల్ మీడియాలో ఇకపై అలాంటివి కుదరవు!
డిజిటల్ మీడియాలో చోటుచేసుకుంటున్న ఆగడాలపై కేంద్రం కొరడా ఝళిపించబోతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం(ఐటీ యాక్ట్) ద్వారా ఆంక్షల కత్తికి మరింత పదును పెట్టింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 28న జారీ చేసింది. ► ఐటీ యాక్ట్ను 2020లో ఆమోదించగా.. 2021 ఫిబ్రవరిలో రూల్స్(నిబంధనల)ను అమలులోకి తెచ్చారు. రానురాను డిజిటల్ మీడియాలో అనేక పోకడలు ఇబ్బందికరంగా మారడంతో తాజాగా మరోసారి ‘ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) సవరణ నియమాలు–2022 నోటిఫికేషన్ను కేంద్రం జారీ చేసింది. ► దీంతో సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్రచార మాధ్యమాలు తదితర డిజిటల్ పాల్ట్ఫామ్లపై మరిన్ని ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ► అసత్యాలు, అర్థసత్యాలు, అశ్లీలం, మోసాలు, హింసను ప్రేరేపించడం, కించపరిచే చర్యలతో అడ్డూ అదుపులేకుండా రెచ్చిపోయే కొందరు డిజిటల్ మీడియా నిర్వాహకులపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవు. ► ప్రధానంగా లోన్ యాప్స్ మోసాల నేపథ్యంలో లోన్ యాప్స్ను డిజిటల్ మీడియాలో ప్రోత్సహించినా, వాటికి అనుకూలంగా ప్రచారం చేసినా ఐటీ యాక్ట్ పరిధిలోకి తెచ్చి చర్యలు తీసుకుంటారు. ► డిజిటల్ మీడియా ఖాతా కోసం ఒక వ్యక్తి ఇచ్చే వ్యక్తిగత సమాచారంపై మరొక వ్యక్తికి ఎలాంటి హక్కు ఉండదు. దీన్ని ఉల్లంఘించి వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించేలా వేరొకరు వ్యవహరించకూడదు. ► డిజిటల్ మీడియాలో తమ ఖాతాల ఏర్పాటుకు ప్రైవసీ పాలసీలో భాగంగా వినియోగదారులు ఇంగ్లిష్, తనకు నచ్చిన భాషలో ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని నిర్వాహకులు, వేరొకరు ప్రచారం చేయడం, మార్పులు(మార్ఫింగ్) చేయడం, అప్లోడ్ చేయడం వంటివి నేరంగానే పరిగణిస్తారు. ► అశ్లీల పోస్టింగ్లు, అశ్లీల చిత్రాలు, శారీరక అవయవాల గోప్యతకు భంగం కలిగించడం, లింగ వివక్షతో కూడిన వేధింపులు, మహిళలు, చిన్నారులను కించపరచడం, వేధించడం, హాని కల్గించడం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ► లోన్ యాప్లు, మనీ లాండరింగ్, ఆన్లైన్ జూదం వంటి వాటిని డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రోత్సహిస్తే ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. ► ఏదైనా పేటెంట్, ట్రేడ్మార్క్, కాపీరైట్ తదితర యాజమాన్య హక్కులను ఉల్లంఘించేలా డిజిటల్ మీడియాను వాడుకుంటే ఐటీ యాక్ట్ పరిధిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ► కులం, మతం, జాతిపరంగా వివాదాలు సృష్టించడం, హింసను ప్రేరేపించడం నేరమే. ► తప్పుడు సమాచారం ఇవ్వడం, ఉద్దేశపూర్వకంగా వదంతులు, కట్టుకథలు, తప్పుడు సమాచారంతో సమాజాన్ని తప్పుదారి పట్టించడం, అసత్యాలను ప్రచారం చేయడం, మోసగించడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిలా మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం నేరం. ► భారతదేశం ఐక్యత, సమగ్రత, రక్షణ, భద్రత, సార్వభౌమాధికారం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా డిజిటిల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ► కంప్యూటర్ సాఫ్ట్వేర్, కోడ్, ఫైల్, ప్రోగ్రామ్ తదితర వాటిని నాశనం చేయడానికి, దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. చదవండి: వస్తున్నాయ్.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు ఇవి కొత్త తరం కార్లు! -
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు: ‘పే లేటర్’ జోలికి వెళ్లకండి, ఎందుకంటే!
ప్ర. నేను 31–07–2022న రిటర్న్ దాఖలు చేశాను. ఆ రోజు నాటికి రూ. 1,00,000 ట్యాక్స్ చెల్లించాలి. నగదు లేకపోవటం వల్ల ‘పే లేటర్‘ అని ఆప్షన్ పెట్టి ఫైల్ చేశాను. నిన్ననే ఆర్డర్లు వచ్చాయి. రూ. 5,000 పెనాల్టీ కట్టమని. ఏం చేయాలి? – విశ్వనాధ లక్ష్మీ, హైదరాబాద్ జ. చట్టప్రకారం ట్యాక్స్ కట్టలేని పరిస్థితుల్లో గడువు తేదీ లోపల రిటర్ను వేసుకోవడానికి అవకాశం ఇది. సాధారణంగా పూర్తిగా పన్నులు చెల్లించి, రిటర్నులు వేయాలి. విధిలేని పరిస్థితుల్లో ‘పే లేటర్‘ ఆప్షన్ను ఉపయోగించి కూడా రిటర్ను వేయవచ్చు. నిజానికి చాలామంది మీలాగే రిటర్నులు వేశారు. కానీ పెనాల్టీ రూ. 5,000 పడకుండా బయటపడవచ్చు. అయితే, జరుగుతున్నది ఏమిటంటే.. ► సాధారణంగా ఇలాంటి రిటర్నుని డిఫెక్టివ్ రిటర్నుగా భావిస్తారు. ►డిఫెక్టివ్ రిటర్నుగా భావించినప్పుడు నోటీసు ఇచ్చి 15 రోజుల లోపు సర్దుబాటు చేస్తారు. ►అలా చేయకపోతే రిటర్ను వేసినట్లు కాదు. 31–07–2022 లోపల రిటర్ను వేసి, ఆ తేదీలోపల ‘వెరిఫికేషన్‘ పూర్తయితే, ఇటువంటి కేసుల్లో రూ. 5,000 చెల్లించమని ఆర్డర్లు రావటం లేదు. కానీ ఏదో ఒక కారణం వల్ల .. ఉదాహరణకు, సైటు మొరాయించడమో, రిజక్ట్ అవ్వటమో, ఇతర సాంకేతికలోపం వల్లో 31–07–2022 లోగా రిటర్ను వెరిఫికేషన్ పూర్తి కాకపోతే, రూ. 5,000 చెల్లించమని నోటీసులు వస్తున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ►మీ రిటర్ను ..డిఫెక్టివ్ రిటర్ను అయినట్లు ►మీరు పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఎందుకంటే, రిటర్ను లేటుగా వేశారు కాబట్టి. ►ఆలస్యంగా వేసినందుకు 234 అ ప్రకారం వడ్డీ కూడా చెల్లించాలి. ►పన్నుభారం లేకపోతే 234 అ వడ్డీ పడదు. ►రిఫండు మీద వడ్డీ రాదు. ►నష్టాలుంటే రాబోయే సంవత్సరానికి సర్దుబాటు చేయరు. ►చెల్లించాల్సిన పన్నులు చెల్లించాలి. ►రివైజ్డ్ రిటర్న్ వేయనవసరం లేదు. రిటర్న్ని రివైజ్ చేయనక్కర్లేదు. ►నోటీసుకి జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వటం అంటే కట్టిన చలాన్ల వివరాలు ఇవ్వడమే. చివరిగా చెప్పాలంటే ఈ ‘పే లేటర్‘ ఆప్షన్ కంటికి ఆకర్షణీయంగా కనబడేది. ‘దూరపు కొండలు నునుపు‘ అన్న సామెతలాంటిది. ఇదొక ‘చిక్కు‘ లాంటిది. పెనాల్టీ తప్పదు. వడ్డీ తప్పదు. వివరణ తప్పదు. సవరణ తప్పదు. జవాబు తప్పదు. చెల్లింపూ తప్పదు. అందుకే ‘పే లేటర్‘ జోలికి పోకండి. ఎలాగూ ట్యాక్స్ చెల్లించక తప్పదు, రిటర్ను వేయకాతప్పదు. ’ఆలస్యం అమృతం విషం’ అని గుర్తెరిగి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్కు పంపించగలరు. -
రోజువారీ కూలీకి ఝలక్.. రూ. 37 లక్షలు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసు!
పాట్నా: కూలీకి వెళ్తూ వచ్చే అరకొర డబ్బులతో బతుకు బండిని లాగుతోన్న వ్యక్తికి లక్షలు, కోట్లు అన్న మాట వినటమే గగనం. ఆదాయ పన్ను అంటే ఏంటో తెలిసే అవకాశం చాలా తక్కువ. అలాంటి వ్యక్తికి ఏకంగా రూ.37.5 లక్షలు ఆదాయ పన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. ఈ సంఘటన బిహార్లోని ఖజారియా జిల్లాలో జరిగింది. జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరిష్ యాదవ్ రోజువారీ కూలీ. రోజుకు రూ.500లు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. రూ.37.5 లక్షల పన్ను బకాయిలు ఉన్నాయని, వెంటనే చెల్లించాలంటూ ఇటీవలే ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందటంతో కంగుతిన్నాడు గిరిష్ యాదవ్. ఏం చేయాలో పాలుపోక.. పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. ‘గిరిష్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇది మోసానికి సంబంధించిన కేసుగా అర్ధమవుతోంది. ’ అని అలౌలి పోలీస్ స్టేషన్ ఎస్సై పూరేంద్ర కుమార్ తెలిపారు. బాధితుడి పాన్ నెంబర్పై జారీ అయిన నోటీసులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గతంలో గిరిష్ ఢిల్లీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వాడని, ఆ సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా పాన్కార్డ్ కోసం ప్రయత్నించినట్లు చెప్పాడని వెల్లడించారు. ఆ తర్వాత ఆ మధ్యవర్తి కనిపించకుండా పోయినట్లు తెలిపాడన్నారు. గిరిష్కు వచ్చిన నోటీసులు రాజస్థాన్లోని ఓ కంపెనీకి సంబంధించినవిగా గుర్తించారు పోలీసులు. అయితే, తానెప్పుడూ రాజస్థాన్కు వెళ్లలేదని గిరిష్ వాపోయాడు. ఇదీ చదవండి: దళిత యువకుడిపై దాడి.. గ్రామ సర్పంచ్ అరెస్ట్.. వీడియో వైరల్! -
‘తోపుడు బండిపై ఆస్పత్రికి’.. వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ చట్టం కింద కేసు!
భోపాల్: అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబం పడిన బాధను వివరిస్తూ వార్త ఇచ్చారు స్థానిక జర్నలిస్టులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. ముగ్గురు స్థానిక జర్నలిస్టులపై చీటింగ్, వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టటం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. వారు ఇచ్చిన వార్త పూర్తిగా తప్పు, ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, వీడియోలోని కుటుంబం తాము పడిన ఇబ్బంది నిజమేనని, వార్తల్లో వచ్చిందంతా నిజమేనని పేర్కొనటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్, భింద్ జిల్లాలోని లహర్ ప్రాంతం మార్పురా గ్రామంలో జరిగింది. జిల్లా కలెక్టర్ సతీశ్ కుమార్ ఏర్పాటు చేసిన రెవెన్యూ, ఆరోగ్య విభాగాల దర్యాప్తు బృందాలు.. బాధిత కుటుంబం అంబులెన్స్ కోసం ఎలాంటి ఫోన్కాల్ చేయలేదని నివేదించాయి. వృద్ధుడు జ్ఞానప్రసాద్ విశ్వకర్మను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని, గవర్నమెంట్ ఆసుపత్రికి కాదని పేర్కొన్నాయి. ఈ నివేదిక ఆధారంగా.. డాక్టర్ రాజీవ్ కౌరవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్త రాసిన కుంజ్బిహారీ కౌరవ్, అనిల్ శర్మ, ఎన్కే భతేలేపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అంబులెన్స్ రాకపోవటంతో తోపుడు బండిపై 5 కిలోమీటర్లు తాము ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవటంతో 5 కిలోమీటర్లు తోపుడు బండిపై తీసుకెళ్లినట్లు బాధితుడి కుమారుడు హరిక్రిష్ణ, కూతురు పుష్ప తెలిపారు. తమ కుటుంబం వివిధ ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందినట్లు దర్యాప్తు బృందాలు నివేదించటాన్ని తప్పుపట్టారు పుష్ప. తమకు పీఎం ఆవాస్ యోజన కింద ఒకే ఇన్స్టాల్మెంట్ వచ్చిందని, అధికారులు మా సోదరుడి ఇంటి ముందు నిలబెట్టి ఫోటోలు తీసుకెళ్లారని అధికారులపై విమర్శలు గుప్పించారు. ఇటీవల తమ గుడిసె వద్దకు వచ్చి తెల్లపేపర్పై సంతకాలు చేయించుకుని వెళ్లారన్నారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
ఇన్కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?
తగిన జాగ్రత్తలు తీసుకుని వేసినా.. యథాలాపంగా వేసినా.. మొక్కుబడిగా వేసినా.. మమ అనిపించినా 31–7–22 నాటికి రిటర్నులు వేయడం జరిగిపోయింది. ఏదేని కారణాన వేయకపోయినా.. ఒక అంచనా ప్రకారం గత సంవత్సరం వేసినంత మంది ఈసారి వేయలేదు. మరిచిపోయినా.. మానేద్దామనుకున్నా.. ఏదైనా సరే.. రిటర్నులు దాఖలు చేయండి. ఎప్పటికైనా రిటర్ను వేయటమే మంచిది. ప్రస్తుతం మీరు వేసే రిటర్నులను, వేయని వారితో వేయించి (దాఖలు), ఆ తర్వాత వేయించడం (మూకుడులో కాదు).. ఇలా అసెస్మెంట్ ప్రక్రియను సక్రమంగా, సత్వరంగా, సమగ్రంగా, సమిష్టిగా చేపట్టటానికి మొత్తం అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. సాధారణంగా మీరు ఆన్లైన్లో దాఖలు చేసిన వెంటనే చాలా త్వరగా అసెస్మెంట్ అవుతుంది. ముఖ్యంగా పాన్తో అనుసంధానమైన కేసులో 24 గంటల్లోనే రిఫండు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. చాలా మందికి రెండు మూడు రోజుల్లోనే వారి సెల్ఫోన్కి ఒక సందేశం వచ్చింది. ‘మీరు వేసిన రిటర్నుని ప్రాసెస్ చేశాం.. అంటే మీ ఇన్కం ట్యాక్స్ అసెస్మెంటు పూర్తి చేశాం. మీ రిజిస్టర్డ్ ఈ–మెయిల్కి సెక్షన్ 143 (1) సమాచారం పంపుతున్నాం. చెక్ చేసుకోండి. అందకపోతే మీ సిస్టంలో spam (సాధారణంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులకు పంపే మెయిల్స్) వెళ్లి వెతకండి‘ అని సమాచారం వస్తోంది. కానీ ఈ సందేశం రాగానే, అది చదవగానే అందరూ భయపడుతున్నారు. ఏదో ‘శ్రీముఖం’ వచ్చిందని వాపోతున్నారు. దాఖలు చేసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే నోటీసా అని నుదురు కొట్టుకుంటున్నారు. ఏమి కొంప మునిగిందిరా అని రామచంద్రుణ్ని తలుచుకుంటున్నారు. అప్పుడే ‘మొదలెట్టావా సీతమ్మ తల్లి’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ గారి మీద శివమెత్తుతున్నారు. ఆగమేఘాల మీద ఆడిటర్గారి దగ్గరికి పరిగెడుతున్నారు. దయచేసి ఏమీ గాభరా పడక్కర్లేదు.ఎందుకంటే .. దీనర్థం ఏమిటంటే.. ►మీరు రిటర్ను వేసినట్లు (మీ బాధ్యత తీరింది) ►సదరు రిటర్ను అసెస్మెంట్ పూర్తయినట్లు (ఈ సంవత్సరం బెడద వదిలింది) ►ఆర్డరు మీ చేతిలో పడినట్లు (ఫైల్లో భద్రపర్చుకోండి) ►ఇది కేవలం సమాచారం మాత్రమే (ఉత్తర్వులు కాదు) ►రిఫండులు రావచ్చు (బ్యాంక్ అకౌంటు చెక్ చేసుకోండి) ►తప్పొప్పులు సరిదిద్దుతారు (సరిదిద్దుకోండి) ►మిమ్మల్ని చెల్లించమంటే, అది నిజమైతే చెల్లించండి ►అది తప్పయితే వివరణతో జవాబులివ్వండి ► ఏ తప్పు లేకపోతే ఆర్డరు ఇవ్వరు ► కొంత మంది కావాలని తప్పు చేసి, ఆర్డరు వచ్చాకా, డిమాండు చెల్లించి హమ్మయ్య అనుకుంటారు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్కు పంపించగలరు. -
హోరెత్తుతున్న ఐటీ రిటర్న్స్..గంటలోనే 4లక్షల మంది దాఖలు!
గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల దాఖలుకు మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో పన్ను చెల్లింపు దారులు అప్రమత్తమయ్యి రికార్డ్ స్థాయిలో ఐటీ రిటర్న్ దాఖలు చేసినట్లు ఇన్ ట్యాక్స్ అధికారులు తెలిపారు. దీంతో ఆదివారం సాయంత్రం 6గంటల వరకు మొత్తం 44,99,038 మంది ఐటీ రిటర్న్ ఫైల్ చేయగా.. 5నుంచి 6గంటల మధ్యలో సుమారు 5,17,030 ఐటీఆర్ దాఖలు చేశారని ట్వీట్ చేసింది Statistics of Income Tax Returns filed today. 53,98,348 #ITRs have been filed upto 2000 hours today & 4,95,505 #ITRs filed in the last 1hr. For any assistance, pl connect on orm@cpc.incometax.gov.in or on our help desk nos 1800 103 0025 & 1800 419 0025. We will be glad to assist! — Income Tax India (@IncomeTaxIndia) July 31, 2022 ఆదివారం సాయంత్రం 8.50 గంటలకు మొత్తం 53,98,348లక్షల మంది ఐటీ రిటర్న్ ఫైల్ చేయగా చివరి గంటలో అంటే 7.50 నుంచి 8.50 మధ్యలో సుమారు 4,95,505మంది ఐటీ రిటర్న్ దాఖలు చేసినట్లు ట్విట్లో పేర్కొంది. -
సోషల్ మీడియాకు కేంద్రం కళ్లెం!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలకు సంబంధించి యూజర్లు చేసే ఫిర్యాదులను ఇకపై ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. నిబంధనల మేరకు వాటికి పరిష్కారం చూపాల్సిందే. యూజర్ల హక్కులను గౌరవించాల్సిందే. ఇందుకు వీలుగా..సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల గ్రీవెన్స్ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాలపై యూజర్లు అప్పీల్కు వెళ్లేందుకు గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తమ ముందుకు వచ్చిన అప్పీల్స్ను 30 రోజుల్లోపు అప్పిలేట్ కమిటీ పరిష్కరించాల్సి ఉంటుంది.కమిటీ నిర్ణయాలను సోషల్ మీడియా సంస్థలు అమలు చేయాలని సవరించిన ఇన్ఫర్మేషట్ టెక్నాలజీ ముసాయిదా నిబంధనలు, 2021 నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. నిబంధనలను ఉల్లంఘించారంటూ సోషల్ మీడియా వేదికలు కొందరు సెలబ్రిటీలు, ఇతరుల ఖాతాలను బ్లాక్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ తాజా చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువే గ్రీవెన్స్ కమిటీలను ఏర్పాటు చేయవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ తెలిపింది. ప్రతిపాదిత నిబంధనల కింద సోషల్ మీడియా గ్రీవెన్స్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయంపై బాధిత వ్యక్తి 30 రోజుల్లోపు అప్పీలేట్ కమిటీ ముందు సవాల్ చేయవచ్చు.ఈ ముసాయిదా నిబంధనలపై జూన్ 22 వరకు అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అనంతరం వీటిని అమల్లోకి తీసుకురానుంది. సోషల్ మీడియా సంస్థలకు 2021 మే 26 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రావడం తెలిసిందే. దీని కింద 50 లక్షలు అంతకుమించి యూజర్లు ఉన్న సంస్థలు తమ ప్లాట్ఫామ్లో ఏదైనా ఒక సందేశం మొదట ఎక్కడ ఆరంభమైందో గుర్తించాల్సి ఉంటుంది. అలాగే, ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, నిబంధనల అమలును చూసేందుకు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ను నియమించాలని నాటి నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
సంసిద్ధంగా ఉన్నారా! పన్ను చెల్లింపు దారులకు ముఖ్యగమనిక!
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే రోజు రానే వచ్చింది. వెబ్సైట్లో ఫారం 1 అలాగే 4 దాఖలు చేయటాన్ని ఎనేబుల్ చేశారు. సంసిద్ధం కండి. ముందుగా ముఖ్యమైన విషయాలు. ►31–03–2022 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడువు తేదీ 31–07–2022. ►ఫారాలు 1, అలాగే 4లో చిన్న మార్పులు మినహా పెద్ద మార్పులు లేవు. ►మీ దగ్గర పూర్తి సమాచారం కాగితాల రూపంలో ఉంటే మీరు ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు. ►సమాచారం, కాగితాలు కావాలన్నా, రావాలన్నా కసరత్తు మొదలెట్టండి. ఐటీఆర్ 1 ఫారం గురించి.. ►దీన్నే ’సహజ్’ అని అంటారు. పేరుకు తగ్గట్లుగానే సరళంగానే ఉంటుంది. ►ఆన్లైన్లో వేసుకోవచ్చు. ఆఫ్లైన్ వేసుకోవాలంటే ఫారం ‘‘వినియోగ స్థితి’’ ( Utility) ద్వారా డౌన్లోడ్ చేసుకుని వేసుకోవచ్చు. ►రెసిడెంట్ వ్యక్తి మాత్రమే వేయగలరు. ►31–03–2022 సంవత్సరానికి మొత్తం ఆదాయం అంటే ట్యాక్సబుల్ ఆదాయం రూ. 50,00,000 మించకూడదు. ►జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం, ఫ్యామిలీ పెన్షన్, వ్యవసాయ ఆదాయం రూ. 5,000 లోపలున్న వారు మరియు ఇతర ఆదాయం ఉన్న వారు మాత్రమే వేయగలరు. ►ఇతర ఆదాయం అంటే బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ, డిపాజిట్లు (బ్యాంకు, పోస్టాఫీసు, సహకార సంస్థలు) మీద వడ్డీ.. ఇతర వడ్డీల ఆదాయం ఉన్నవారు వేయొచ్చు. ఐటీఆర్ ఫారం 4 గురించి.. ►ఈ ఫారం వేతన జీవులకు వర్తించదు. ►వ్యాపారం, వృత్తి చేసే వారికి మాత్రమేవర్తిస్తుంది. ► రెసిడెంట్ వ్యక్తులు, హిందూ ఉమ్మడి ►కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు వేయవచ్చు. ►ట్యాక్సబుల్ ఇన్కం రూ. 50,00,000 దాటకూడదు. ►44ఏడీ, 44 ఏడీఏ, 44ఏఈల ప్రకారం వ్యాపారం,వృత్తుల మీద .. బుక్స్తో నిమిత్తం లేకుండా, లెక్కలతో నిమిత్తం లేకుండా ఊహాజనితంగా .. అంటే టర్నోవరుపై నిర్దేశిత శాతం లేదా ఎక్కువ శాతం లాభాన్ని లెక్కించే వేయాలి. ►మిగతా విషయాలన్నీ ఫారమ్ 1కి వర్తించేవే వర్తిస్తాయి. ఈ కింది పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోండి. ►అన్ని కాగితాలు, సమాచారం పెట్టుకుని ఒక స్టేట్మెంటు తయారు చేసుకోండి. ►ప్రీ–ఫిల్డ్ రిటర్న్ కాబట్టి సమాచారం ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది. ►అలాంటి సమాచారం తప్పని తోచినా, మీది సంబంధించినది కాకపోయినా విభేదించవచ్చు. మార్పులు చేయవచ్చు. ►ఫెలింగ్ ప్రాసెస్ మొదలెట్టండి. ►ఈ–వెరిఫై చేయండి. ఇంతటితో ప్రక్రియ పూర్తి అయినట్లే .. ఎప్పటికప్పుడు డిపార్ట్మెంటు వెబ్సైట్లో మార్గదర్శకాలు ఉంటాయి. అవసరం అయితే రిఫర్ చేయండి. -
దేశ చరిత్రలో ఇదే తొలిసారి! కరోనా ఉన్నా..అదరగొట్టిన పన్నువసూళ్లు, ఏకంగా!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) రెండు కరోనా వేవ్లను తట్టుకుని పటిష్ట రికవరీ బాటన పయనించిందనడానికి సంకేతంగా పటిష్ట పన్ను వసూళ్ల గణాంకాలు వెలువడ్డాయి. అధికారిక గణాంకాల ప్రకారం మార్చి 15వ తేదీ వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 48 శాతంపైగా పెరిగితే, అడ్వాన్స్ పన్ను చెల్లింపులు 41 శాతం ఎగశాయి. ఈ స్థాయి వసూళ్లు భారత్ చరిత్రలో ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం కోవిడ్–19 సవాళ్ల నుంచి బయటపడుతున్న సమయంలోనే 2021 ఏప్రిల్, మేలలో రెండవవేవ్ దేశాన్ని కుదిపివేసింది. 2021 ప్రారంభంలో వచ్చిన థర్డ్ వేవ్ తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగించకపోయినా, స్థానిక ఆంక్షల వల్ల బిజినెస్ సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసింది. అయినప్పటికీ పన్ను వసూళ్లు చరిత్ర సృష్టించిన పన్ను వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే... ►2022 మార్చి 16 వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తులు, కార్పొరేట్ల నుంచి) గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే 48 శాతం పెరిగి రూ.9,18,431 కోట్ల నుంచి 13,63,038 కోట్లకు ఎగశాయి. దేశంలోకి కరోనా సమస్య ప్రవేశించకముందు పరిస్థితితో పోల్చినా (2019–20లో రూ.9.56 లక్షల కోట్లు) తాజాగా వసూళ్లు 42 శాతం పెరిగాయి. ► రిఫండ్స్ రూ.1.87 లక్షల కోట్లు మినహాయించగా, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఆదాయపు పన్ను పరిమాణం రూ.7,19,035 కోట్లుకాగా, ఎస్టీటీసహా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.6,40,588 కోట్లు. రిఫండ్స్ను కూడా కలుపుకుంటే, మొత్తం వసూళ్లు రూ.11,20,639 కోట్ల నుంచి రూ.15,50,364 కోట్లకు చేరింది. ► ఇక మార్చి 15వ తేదీతో ముగిసిన నాల్గవ విడత ముందస్తు (అడ్వాన్స్) ట్యాక్స్ చెల్లింపుల గడువును పరిశీలిస్తే, సమీక్షా కాలంలో ఈ పరిమాణం 40.75 శాతం పెరిగి రూ.6.62 లక్షల కోట్లకు ఎగసింది. 2020–21 ఇదే కాలంలో ఈ వసూళ్లు రూ.4,70,984.4 కోట్లు. మొత్తం అడ్వాన్స్ పన్నులు రూ.6,62,896.3 కోట్లలో రూ.4,84,451.8 కోట్లు కార్పొరేట్ల నుంచి రాగా, వ్యక్తిగత పన్నుల పరిమాణం రూ.1,78,441.1 కోట్లుగా ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. ► మొత్తం వసూళ్లలో అడ్వాన్స్ ట్యాక్స్ రూ.6,62,896.3 కోట్లుకాగా, 6,86,798.7 కోట్లు మూలం వద్ద పన్ను మినహాయింపునకు సంబంధించినది. రూ. 1,34,391.1 కోట్ల స్వీయ–అసెస్మెంట్ పన్ను, సాధారణ మదింపు పన్ను రూ. 55,249.5 కోట్లు, డివిడెండ్ పంపిణీ పన్ను రూ. 7,486.6 కోట్లు. ఇతర మైనర్ హెడ్ల కింద వసూళ్లు రూ. 3,542.1 కోట్లు. ► మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో దాదాపు 53 శాతం కార్పొరేట్ పన్ను నుండి వచ్చింది. 47 శాతం షేర్లపై సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) సహా వ్యక్తిగత ఆదాయ పన్ను నుండి లభించింది. ► 2021–22లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల బడ్జెట్ అంచనా రూ.11.08 లక్షల కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దీనిని రూ.12.50 లక్షల కోట్లకు సవరించారు. ఈ అంచనాలకన్నా అధికంగా నికర పన్ను వసూళ్లు అధికంగా ఉండడం గమనార్హం. 6.63 కోట్ల ఐటీఆర్లు గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020–21) సంబంధించి ఈ నెల 15 నాటికి 6.63 కోట్ల ఐటీఆర్లు ఈ ఫైలింగ్ పోర్టల్పై దాఖలయ్యాయి. గతేడాదితో పోలిస్తే 16.7 లక్షల రిటర్నులు అధికంగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ (ఐటీ) ప్రకటించింది. కార్పొరేట్లు, ఆడిట్ రిపోర్ట్లు దాఖలు చేయాల్సిన ఇతర పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్లు దాఖలు చేసేందుకు గడువు మార్చి 15తో ముగిసింది. ఒక్క చివరి తేదీనే 5.43 లక్షల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఈ మేరకు రిటర్నుల గణాంకాలను ఐటీ శాఖ బుధవారం విడుదల చేసింది. ఐటీఆర్–1 (3.03 కోట్లు), ఐటీఆర్–2 (57.6లక్షలు), ఐటీఆర్–3 (1.02 కోట్లు), ఐటీఆర్–4 (1.75 కోట్లు), ఐటీఆర్–5 (15.1లక్షలు), ఐటీఆర్–6 (9.3లక్షలు), ఐటీఆర్–7 (2.18లక్షల) చొప్పున ఉన్నాయి. -
యూజర్లపై విరుచుకుపడ్డ వాట్సాప్..! హద్దు మీరారో...అంతే సంగతులు!..
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ రూల్స్ను ఉల్లంఘించిన యూజర్లపై విరుచుకుపడింది. ఏకంగా 20 లక్షల అకౌంట్స్ను బ్యాన్ చేసినట్లు పేర్కొంది. కొత్త ఐటీ చట్టాల ఉల్లంఘన..! భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలను ఉల్లంఘించిన యూజర్ల అకౌంట్స్ను పూర్తిగా బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. 2021 డిసెంబర్ నెలలో ఏకంగా 20, 79,000 బ్యాన్ చేసినట్లు వాట్సాప్ తెలిపింది. గత డిసెంబర్ నెలలో సుమారు 528 ఫిర్యాదుల నివేదికలను స్వీకరించి వాటిపై చర్యలు తీసుకున్నట్లుగా వాట్సాప్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.అంతకుముందు నవంబరులో 17లక్షల 59వేల అకౌంట్లను తొలగించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా..! వాట్సాప్లో యూజర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా సైంటిస్టుల సహాయంతో మరింత భద్రతను యూజర్లకు అందిస్తున్నామని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉండగా కొత్త ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా డిసెంబర్లో ఫేస్బుక్లో 13 కేటగిరీలలో 19.3 మిలియన్లకు పైగా చెడు కంటెంట్లను, ఇన్స్టాగ్రామ్లో 12 కేటగిరీలలో 2.4 మిలియన్లకు కంటెంట్ పోస్ట్లను తొలగించినట్లు మెటా సోమవారం వెల్లడించింది. చదవండి: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..! అదే జరిగితే మీ జేబులు గుల్లే..! -
17 లక్షల యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్..!
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ తన 17.5 లక్షల యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. దేశంలోని ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా నవంబర్ నెలలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. అదే నెలలో 602 గ్రీవియెన్స్ రిపోర్టులు వచ్చాయని వాటిలో 36 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ వినియోగించే యూజర్లకు భద్రత పరంగా మెరుగైన సేవలు అందించేందుకు సందేశాలకు ఎండ్-టు-ఎండ్ రక్షణ కలిపిస్తున్నట్లు తెలిపింది. అలాగే, కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల భద్రత కోసం కృత్రిమ మేధస్సు, ఇతర అత్యాధునిక సాంకేతికత, డేటా శాస్త్రవేత్తలు, నిపుణుల మీద నిరంతరం పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ భారతదేశంలో అక్టోబర్ నెలలో 20 లక్షల ఖాతాలకు పైగా నిషేదించింది. అలాగే, అదే నెలలో 500 గ్రీవియెన్స్ రిపోర్టులు వచ్చాయి. మనదేశంలో 40 కోట్లకు మందికి పైగా ప్రజలువాట్సాప్ను వినియోగిస్తున్నారు. మేలో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనలకు మేరకు.. 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న ప్రతి డిజిజల్ ప్లాట్ఫామ్ ప్రతి నెలా తమకు అందిన ఫిర్యాదుల వివరాలు, తీసుకున్న చర్యలను వెల్లడించాలి. ఈ క్రమంలో కొత్త ఐటీ చట్ట ప్రకారమే.. బ్యాడ్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటోంది వాట్సాప్. (చదవండి: టెస్లా ఆటో పైలెట్ టీమ్కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!) -
ఆ వయస్సు దాటితే.. పన్ను మినహాయింపు ఉంటుందా?
నా వయస్సు 76 సంవత్సరాలు. రిటైర్ అయ్యాను. పెన్షన్ వస్తోంది. సంస్థ యజమాని పన్ను రికవర్ చేసి, చెల్లించేశారు. నేను ఇక రిటర్న్ వేయాల్సిన అవసరం లేదా? – ఎం. నీలకంఠం, హైదరాబాద్ వయో వృద్ధులకు (75 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి) ఈ తరహా మినహాయింపునిచ్చే దిశగా 2021 బడ్జెట్లో సెక్షన్ 194పి పొందుపర్చారు. 1–4–2021 నుండి ఇది అమల్లోకి వచ్చింది. అంటే ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరం మొదలు.. (అసెస్మెంటు సంవత్సరం 2022–23) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. 2021 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వర్తించదు. దీన్ని పొందేందుకు కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి. ఆ విషయాన్ని వయో వృద్ధులు గమనించగలరు. ఇది ఎవరికి వర్తిస్తుందంటే.. - ఇది వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది - వారు కచ్చితంగా రెసిడెంట్ అయి ఉండాలి - ఈ ఆర్థిక సంవత్సరంలో 75 సంవత్సరాలు పూర్తి అవ్వాలి (మొదలై, పూర్తి అవకపోవడం కాదు) - వారి ఆదాయంలో రెండే రెండు అంశాలు ఉండాలి. పెన్షన్, నిర్దేశిత బ్యాంకు నుండి వడ్డీ - ఏదేని కారణం వల్ల జీతం ఉంది అనుకోండి. ఈ మినహాయింపు వర్తించదు. - ఇతరత్రా ఆదాయం, వ్యాపారం, వృత్తి, ఇంటి అద్దె, మూలధనం లాభాలు, డివిడెండ్లు .. ఇలా ఏ ఆదాయం ఉన్నా వర్తించదు బ్యాంకులకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. A) నిర్దేశిత బ్యాంకు .. అంటే బోర్డు నోటిఫై చేసిన బ్యాంకులకు రూలు 26డి ప్రకారం 12బీబీఏ ఫారం రూపంలో డిక్లరేషన్ ఇవ్వాలి B) డిక్లరేషన్లో ఈ అంశాలు ఉండాలి. పేరు, పాన్ లేదా ఆధార్ వివరాలు, ఆర్థిక సంవత్సరం, పుట్టిన తేదీ, నిర్దేశిత బ్యాంకు బ్రాంచి వివరాలు, పెన్షన్ చెల్లిస్తున్న యజమాని వివరాలు, పెన్షన్ పేమెంట్ నంబరు C) డిక్లరేషన్ తీసుకుని, ఆ నిర్దేశిత బ్యాంకు ట్యాక్సబుల్ ఇన్కం లెక్కించి, ట్యాక్స్ని నిర్ధారించి, పన్నుని డిడక్ట్ చేస్తుంది D) ఈ ప్రహసనం సక్రమంగా పూర్తయితే, రిటర్ను దాఖలు చేయనవసరం లేదు. ఇలాంటి ప్రయోజనం కల్పించేందుకు సంబంధిత సెక్షన్లలో కొన్ని మార్పులు చేశారు. అయితే, దీనివల్ల చాలా మందికి ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. పన్ను భారం తప్పదు. రిటర్ను వేసే బదులు ముందుగానే డిక్లరేషన్ ఇస్తే సదరు బ్యాంకు.. పన్ను చెల్లించి, ధృవీకరణ చేస్తారు. ఇదేం ఉపశమనం? ఆన్లైన్లో రిటర్న్ వేయడం తప్పుతుంది తప్ప ఇంకేమీ తప్పదు. కేవలం వడ్డీ ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుందా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఏదైతేనేం.. ఇది కేవలం కంటితుడుపు చర్యే కాని ఉపశమనం కాదు. నేతి బీరకాయలో నెయ్యిలాంటిది. అంతే! - కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
Whatsapp: మీ వాట్సాప్ బ్యాన్ అయ్యిందా?
Whatsapp Banned? Find Reasons, How to Recover Whatsapp Blocked Number: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ను మన దేశంలో కోట్ల మంది వాడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. మెటా కంపెనీ పరిధిలో పని చేస్తున్న వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్ ఆధారిత మెసేజ్ల దగ్గరి నుంచి వీడియో కాల్స్ దాకా, వ్యక్తిగత అవసరాల నుంచి ఆఫీసుల పనుల దాకా.. అన్నీ నడిచిపోతున్నాయి. అయితే ఐటీ రూల్స్ 2021 అమలులోకి వచ్చాక.. వాట్సాప్ భారత్లో తన యూజర్లపై ఎక్కువ అజమాయిషీ చెలాయిస్తోంది. ఈ తరుణంలో వాట్సాప్ అకౌంట్లను క్రమం తప్పకుండా భారత్లో అకౌంట్లను బ్యాన్ చేస్తూ వస్తోంది. పైగా Intermediary Guidelines and Digital Media Ethics Code ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన అకౌంట్లనే బ్యాన్ చేస్తున్నట్లు మంత్లీ కంప్లైయన్స్ రిపోర్టుల్లో చెబుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి దాదాపు రెండు కోట్ల వాట్సాప్ అకౌంట్లను నిషేధిత జాబితాలోకి చేర్చిందని తెలుస్తోంది. ఇంతకీ వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్ చేస్తుందో కారణాలు తెలుసా? ►ఫేక్ అకౌంట్లు వేరే వ్యక్తి పేరు మీద, నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఇలాంటి వ్యవహారాలు దృష్టికి వస్తే వాట్సాప్ వాటిని బ్యాన్ చేస్తుంది. ►కాంటాక్ట్ లిస్ట్లో లేనోళ్లకు.. కాంటాక్ట్ లిస్ట్లో లేని నెంబర్లకు ఎక్కువ మెసేజ్లు పంపడాన్ని.. అనుమతులు లేని సంభాషణలుగా గుర్తిస్తుంది వాట్సాప్. అందుకే బ్యాన్ విధిస్తుంది. ఒకవేళ తెలిసిన వ్యక్తి అయినా సరే, నోటికి నెంబర్ గుర్తున్నా సరే.. కచ్చితంగా కాంటాక్ట్లో సేవ్ చేసుకున్నాకే ఛాటింగ్ చేయండి. ►థర్డ్ పార్టీ యాప్లతో.. వాట్సాప్ మెసేంజర్ కాకుండా థర్డ్ పార్టీలు యాప్లు ఉపయోగించినా ఈ సమస్య ఎదురవుతుంది. ఉదాహరణకు.. వాట్సాప్ డెల్టా, జీబీ వాట్సాప్, వాట్సాప్ ఫ్లస్.. ఇలాంటివన్నమాట. వీటిని వాట్సాప్ ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు. ప్రైవసీ కోణంలో ఆ అకౌంట్లను నిషేధిస్తుంది. కాబట్టి, వాటిని డిలీట్ చేయండి. అఫీయల్ యాప్కు మొమరీ స్పేస్ ఎక్కువైనా వాడేయండి. ►ఎక్కువమంది బ్లాక్ చేసినా.. ఒక వాట్సాప్ అకౌంట్ను ఎక్కువ మంది యూజర్లు బ్లాక్ చేసినా సరే.. ఆ అకౌంట్ను వాట్సాప్ నిషేధిస్తుందని తెలుసా?. కాబట్టి, అడ్డగోలు కాంటాక్ట్లను సేవ్ చేసుకోవడం, అవసరం లేకున్నా వాళ్లకు మెసేజ్లు పంపడం, ఫార్వార్డ్ మెసేజ్లు పంపడం చేయడం తగ్గిస్తే మంచిది. ►ఫిర్యాదుల ఫలితం కూడా.. ఒక వాట్సాప్ అకౌంట్ను ఎక్కువ మంది రిపోర్ట్ చేసినా, ఎక్కువ మంది ఫిర్యాదులు చేసినా.. ఆ అకౌంట్ను వాట్సాప్ బ్యాన్ చేసేస్తుంది. ►మాల్వేర్ లింక్స్ మాల్వేర్(వైరస్)తో కూడిన లింక్స్, స్మార్ట్ఫోన్లకు ప్రమాదం కలిగించే లింక్స్గానీ, ఏపీకే ఫైల్స్ రూపంలో ఉండే ఫైల్స్ను ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపినా వాట్సాప్ ఆ అకౌంట్లను నిషేధిస్తుంది. ►అసభ్య సందేశాలు.. పోర్న్ సంబంధిత కంటెంట్, అసభ్య సందేశాలు, ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే సందేశాలు, బెదిరింపులు, వేధింపులు, విద్వేషపూరిత సందేశాలు.. ఇతరులకు పంపినా సరే బ్యాన్ తప్పదు!. ►హింసను ప్రేరేపించినా.. ఈరోజుల్లో సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ల నుంచే ఫేక్ కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అందుకే హింసను ప్రేరేపించేవిగా ఉండే కంటెంట్ను ఫార్వార్డ్ చేసినా బ్యాన్ వేస్తుంది వాట్సాప్. వీటితో పాటు ఘర్షణలకు ప్రేరేపించే పోస్టులు, పిల్లలపై జరిగే అకృత్యాలకు సంబంధించిన కంటెంట్ ప్రమోట్ చేసినా వాట్సాప్ బ్యాన్ తప్పదు. కాబట్టి, బ్యాన్ పరిధిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడడండి. అలాగే వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేయడం అనేది రిపోర్ట్ లేదా అవతలి వాళ్ల ఫిర్యాదుల ఆధారంగా జరుగుతుంటుంది. పర్సనల్ అకౌంట్లతో పాటు గ్రూపులు ఇందుకు అతీతం కాదు. గ్రీవియెన్స్ చానెల్తో పాటు రకరకాల టూల్స్ ఇబ్బందికారక అకౌంట్ల(ఫిర్యాదుల ఆధారంగా)ను నిశీతంగా పరిశీలించాకే.. వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేస్తుంది. ఈ బ్యాన్ టెంపరరీగా లేదంటే శాశ్వతంగా ఉండొచ్చు. తాత్కాలిక నిషేధం ఎత్తివేతకు వాట్సాప్ సపోర్ట్ టీంకి మెయిల్ పెడితే సరిపోతుంది. ఏం చేయాలంటే.. వాట్సాప్ బ్యాన్ అని కనిపించే స్క్రీన్ షాట్ను.. అన్బ్యాన్(బ్యాన్ ఎత్తేయమంటూ) రిక్వెస్ట్ చేస్తూ support@whatsapp.com కు మెయిల్ పెట్టాలి. అప్పుడు ఎందుకు బ్యాన్ చేసిందో వివరణ ఇస్తూనే.. వీలైతే అన్బ్యాన్ చేయడానికి వాట్సాప్ ప్రయత్నిస్తుంది. ఒకవేళ అన్బ్యాన్ కన్ఫర్మ్ మెసేజ్ గనుక వస్తే.. యాప్ను అన్-ఇన్స్టాల్ చేసి, తిరిగి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే ప్లేస్టోర్లో అప్డేట్ కొట్టినా సరిపోతుంది. ఒకవేళ మళ్లీ మళ్లీ బ్యాన్ మెసేజ్ వస్తుంటే.. ఈసారి support@whatsapp.com కు మరోసారి రిక్వెస్ట్ మెయిల్ (ఇంతకు ముందు.. ఇప్పటివి స్క్రీన్ షాట్స్తో) పెట్టొచ్చు. అప్పుడు సరైన వివరణ దక్కుతుంది. ఒకవేళ పర్మినెంట్ బ్యాన్ సంకేతాలు గనుక అందితే మాత్రం.. నెంబర్ మార్చేడయం తప్ప మరో మార్గం ఉండదని వాట్సాప్ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొని ఉంది. మీ తరపున గనుక ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు లేకుంటే.. grievance_officer_wa@support.whatsapp.comకు మెయిల్ చేయడం ద్వారా సమస్యకు ఓ పరిష్కారం పొందవచ్చు. చదవండి: ఇంట్లో కరెంట్ బిల్లును ఆదా చేసే సింపుల్ టిప్స్.. పాటించండి -
Google: ఇంటర్నెట్తో ముందు ముందు కష్టమే!
ఇంటర్నెట్లో ఏదైనా కంటెంట్ను పోస్ట్ చేస్తున్నారా? అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? అది అసలు అర్థమయ్యేలా ఉంటోందా? లేదంటే అవతలి వాళ్లను రెచ్చగొట్టేదిగా ఉందా? పోనీ పోస్ట్ చేసేముందు విషయాన్ని ఒకసారి సమీక్షించుకుంటున్నారా?.. ఇలాంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్నెట్లో వ్యవహరిస్తే మంచిది. ఎందుకంటే ఎలా పడితే అలా కంటెంట్ పోస్ట్ చేస్తామంటే ఇక మీదట కుదరదు. కొత్త ఐటీ చట్టాల్ని (మే 26) నుంచి బలవంతంగా రుద్దిన కేంద్రం.. కంటెంట్ కట్టడి విషయంలో తనపని తాను చేసుకుంటూ పోతోంది. ఈ తరుణంలో ఇంటర్నెట్ దిగ్గజాలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నాయి. పారదర్శకంగా, సమ్మతి ఉన్న కంటెంట్ను మాత్రమే అనుమతి ఇస్తూ.. ఫిర్యాదులు, అభ్యంతరకర కంటెంట్ను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. అంతేకాదు నెలనెలా ఆ సమీక్ష వివరాల్ని నివేదికల రూపంలో సైతం విడుదల చేస్తున్నాయి. కంప్లయింట్ చేస్తే చాలు భారత్ విషయానికొస్తే.. ఆగష్టు నెలకుగానూ గూగుల్ కంటెంట్ విషయంలో మొత్తం 35, 191 ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా 93, 550 పీసుల కంటెంట్ను తొలగించింది గూగుల్. ఇది కాకుండా యూజర్ల నుంచి వచ్చిన రిపోర్ట్స్(ఫిర్యాదులు) ఆధారంగా ఆటోమేటెడ్ డిటెక్షన్ ద్వారా మరో ఆరున్నర లక్షల కంటెంట్ పీసులను తీసిపడేసింది. జులై నెలలో ఫిర్యాదులు 36, 934 ఫిర్యాదులు అందగా.. 95, 680 పీసుల కంటెంట్ను తొలగించింది. ఇక ఆటోమేటెడ్ డిటెక్షన్ ద్వారా ఐదున్నర లక్షలకు పైగా కంటెంట్ పీసుల్ని తొలగించింది. కాపీనే టాప్ వీటిలో చాలావరకు థర్డ్ పార్టీ కంటెంట్కు సంబంధించిన ఫిర్యాదులు ఉండడం విశేషం. స్థానిక చట్టాల్ని ఉల్లంఘించే కంటెంట్(పోస్టులు), వ్యక్తిగత హక్కుల్ని భంగం కలిగించడం, పరువుకు నష్టం వాటిల్లడం, మనోభావాల్ని దెబ్బతీయడం లాంటి ఫిర్యాదుల ఆధారంగా ఈ కంటెంట్ను తొలగించినట్లు గూగుల్ ప్రకటించుకుంది. ఫిర్యాదులు కేటగిరీల వారీగా.. ► కాపీరైట్స్ - 92, 750 ► ట్రేడ్మార్క్- 721 ► కోర్ట్ ఆర్డర్ - 12 ► గ్రాఫిక్ సెక్సువల్ కంటెంట్- 12 ► ఇతరత్ర లీగల్ రిక్వెస్టులు - 4 అశ్లీల, అనుచిత కంటెంట్ను(పోస్టులు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలు ఏవైనా సరే) ఫిర్యాదుల ఆధారంగా తొలగించింది గూగుల్. ఒకే కంటెంట్ లేదంటే ఒకే తరహా కంటెంట్ విషయంలో పదే పదే ఫిర్యాదులు అందిన తరుణంలో వాటిని తొలగించినట్లు తెలిపింది. కంటెంట్ విషయంలో ‘యూఆర్ఎల్’ ఆధారంగానే తొలగించిన కంటెంట్ను లెక్కగట్టినట్లు స్పష్టం చేసింది. అంతేకాదు పదేపదే కాపీ కంటెంట్ ఫిర్యాదులు అందితే మాత్రం కఠినచర్యలు తప్పవని, అవసరమైతే లీగల్ యాక్షన్స్..నిషేధం(తాత్కాలికం/శాశ్వతం) తప్పదని హెచ్చరిస్తోంది గూగుల్. ఆగష్టు నెలలో మిగతా ప్లాట్ఫామ్స్ తీసుకున్న చర్యల్ని పరిశీలిస్తే.. ఫేస్బుక్.. 31.7 మిలియన్ల కంటెంట్(పది కేటగిరీలుగా విభజించి) పీసులను తొలగించింది ఇన్స్టాగ్రామ్.. 2.2 మిలియన్ పీసుల కంటెంట్(తొమ్మిది కేటగిరీలుగా విభజించి)ను తీసేసింది వాట్సాప్ 2 మిలియన్ల అకౌంట్లను నిషేధించింది. కంటెంట్తో పాటు ఫొటోలు, వీడియోలు, కామెంట్లు ఏదీ అతీతం కాదు కంటెంట్ రెచ్చగొట్టేదిగా, అవతలి వాళ్లను నేరాలకు ప్రేరేపించేదిగా.. వుసిగొల్పేదిగా ఉండకూడదు ‘వార్నింగ్’ ‘గ్రాఫిక్స్ వార్నింగ్’ ఇచ్చిన కంటెంట్ను సైతం ఫిర్యాదు అందితే తొలగించడమే ఇక! రిపోర్టుల ఆధారంగానూ కంటెంట్ తీసేయాల్సిందే! కంటెంట్ గందరగోళంగా ఉన్నాసరే రిపోర్ట్/ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ఆ కంటెంట్ను తొలగిస్తారు. -
డిజిటల్ మీడియాకు భారీ ఊరట
ముంబై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు శనివారం మధ్యంతర స్టే విధించింది. ఆన్లైన్ ప్రచురణకర్తలంతా నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని ఐటీ రూల్స్లో పొందుపర్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలపై న్యాయస్థానం మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఐటీ చట్టంలోని క్లాజ్ 9 కింద పేర్కొన్న సబ్ క్లాజెస్ 1 అండ్ 3లపై స్టే విధిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సబ్క్లాజ్లు పిటిషనర్ వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తున్నట్లుగా తాము ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది. కొత్త ఐటీ రూల్స్లోని నిబంధనలను సవాలు చేస్తూ లీగల్ న్యూస్ పోర్టల్ ‘ద లీఫ్లెట్’, జర్నలిస్టు నిఖిల్ వాగ్లే బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనలో ఏకీభవించింది. వివాదాస్పద కొత్త ఐటీ నిబంధనల్లోని సబ్ క్లాజ్లపై మధ్యంతర స్టే విధించింది. చదవండి : 53 కోట్లు దాటిన వ్యాక్సినేషన్ -
నెటిజన్లకు షాక్, పోస్ట్లపై 'కూ' యాప్ కొరడా
ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ యాప్ 'కూ' యూజర్లపై కొరడా ఝుళిపించింది.కేంద్ర ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అకౌంట్లను బ్లాక్ చేసే పనిలో పడింది. దేశ భద్రత దృష్ట్యా కేంద్రం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021కు వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా అకౌంట్లపై ఆయా సోషల్ మీడియా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 'కూ' యాప్ 3,431 సోషల్ మీడియా పోస్టులపై దృష్టిసారించింది. జులై నెలలో కమ్యూనిటీ గైడ్లైన్స్ విరుద్దంగా ఉన్న 498 పోస్ట్లను డిలీట్ చేసింది. మరో 2,933 పోస్ట్లను పర్యవేక్షించనుంది. కూ యాప్ వివరాల ప్రకారం.. 'ప్రో యాక్టీవ్ మోడరేట్'లో భాగంగా మొత్తం 65,280 పోస్ట్ లను దృష్టిసారించగా..వాటిలో 1,887 పోస్ట్లను డిలీట్ చేసినట్లు మిగిలిన 63,393 పోస్ట్లపై హెచ్చరికలు జారీ చేయడం, బ్లర్ చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అకౌంట్ వెరిఫికేషన్ జులైలో ఐటీ రూల్స్ అనుగుణంగా ఉన్న ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లను బ్లూటిక్ వెరిఫికేషన్కు అప్లయ్ చేయాలని సూచించింది. తాజాగా కూ యాప్ సైతం ఎల్లో టిక్ వెరిఫికేషన్కు అప్లయ్ చేయాలని కోరింది. కాగా, బ్లూటిక్, ఎల్లో టిక్ వెరిఫికేషన్ అకౌంట్ కావాలంటే ప్రముఖులై ఉండాలి. ఉదాహరణకు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినిమా స్టార్స్, స్పోర్ట్స్ పర్సన్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలా ఆయా రంగాల్లో రాణిస్తున్న వారి సేవలకు గుర్తుగా ఆయా సోషల్ మీడియా సంస్థలు ఈ వెరిఫికేషన్ అకౌంట్లను అందిస్తుంటాయి. -
అవసరం లేకున్నా డైరెక్టర్ ఆ సీన్ తీశాడు!
స్ట్రీమింగ్ సర్వీసుల్లో అభ్యంతరకర కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్రం కొరడా జులిపించడం మొదలైంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ తీసిన ఓ షార్ట్ఫిల్మ్పై తొలి ఫిర్యాదు నమోదు అయ్యింది. అనురాగ్ తీసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ అంథాలజీ షార్ట్ ఫిల్మ్ కిందటి ఏడాది జవనరిలో రిలీజ్ అయ్యి.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఓ సీన్లో నటి శోభితా ధూళిపాళ పాత్రకి గర్భస్రావం అవుతుంది. ఆ టైంలో ఆ క్యారెక్టర్ మృత శిశువును చేతిలో పట్టుకుని కూర్చుంటుంది. ఈ సీన్ ఆ కథకు అవసరం లేదని, అయినా మేకర్లు ఆ సీన్ తీయడం మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపెట్టే అంశమని జులై 27న నమోదు అయిన ఆ ఫిర్యాదు పేర్కొని ఉంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అవుతుందా? లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత వీలైనంత త్వరగా(24 గంటల్లో!) ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో ఉంది. అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకి సైతం తెలియజేసినట్లు నెట్ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్ను కఠినతరం చేసింది. అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బతీయడం, వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీద అయినా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్ మేకర్స్ను హెచ్చరించింది. ప్రత్యేక మార్గదర్శకాలతో పాటు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట కఠినమైన నిబంధనలతో ‘రూల్స్-2021’ను రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ‘సాక్రెడ్ గేమ్స్, ఏ సూటబుల్ బాయ్’ ద్వారా నెట్ఫ్లిక్స్ వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
దెబ్బకు దిగొచ్చిన ట్విట్టర్, గ్రీవెన్స్ ఆఫీసర్ ఎవరంటే..
Twitter Grievance Officer భారతీయ ఐటీ చట్టాలకు లోబడి పని చేసేందుకు ఇంతకాలం ససేమిరా అంటోన్న ట్విట్టర్ బెట్టు వీడింది. భారత్లో ట్విట్టర్ గ్రీవెన్స్ ఆఫీసర్గా వినయ్ ప్రకాశ్ను నియమించింది. ట్విట్టర్ అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని పేర్కొంది. సోషల్ మీడియాకు సంబంధఙంచి ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాల ప్రకారం మూడు కీలక పోస్టులైన చీఫ్ కంప్లైయిన్స్, గ్రీవెన్స్, నోడల్ అధికారులను నియమించాలని చెప్పింది. కాగా ట్విట్టర్ భారతీయులు కానీ వ్యక్తులను ఈ పోస్టులో నియమించి వివాదానికి తెర తీసింది. తాజాగా ఓ మెట్టు దిగి వచ్చిన ట్వీట్టర్ కేంద్ర సూచనలకు తగ్గట్టుగా గ్రీవెన్స్ ఆఫీసర్గా భారతీయున్ని నియమించింది. -
ఫేస్బుక్ 3 కోట్ల యూజర్లకు షాక్: ఏం చేసిందంటే..
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్పై వేటు వేసింది. దేశీయంగా ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ రూల్స్కు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తన తొలి నెలవారీ కంప్లయిన్స్ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. తమ తదుపరి నివేదికను జూలై 15న ప్రచురిస్తామని, అందులో వినియోగదారుల ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలుంటాయని పేర్కొంది. ఐటీ నిబంధనల ప్రకారం దేశంలో మే 15 - జూన్ 15 మధ్యకాలంలో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో తొమ్మిది వర్గాలలోని రెండు మిలియన్ల యూజర్ల కంటెంట్పై ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ చర్యలు తీసుకుంది. ఇందులో స్పామ్ (25 మిలియన్లు), హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ (2.5మిలియన్లు), వయోజన నగ్నత్వం, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్లు కంటెంట్ ఉంది. ఉగ్రవాద ప్రచారానికి సంబంధించి 106,000 పోస్ట్లు, విద్వేషపూరిత ప్రసంగాలపై 311,000, వేధింపులకు సంబంధించిన కంటెంట్ 118,000 పోస్ట్లున్నట్టు తెలిపింది. కొత్త కొత్త ఐటి నిబంధన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం, ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లు (5 మిలియన్లకు పైగావినియోగదారులతో) ప్రతి నెలా కంప్లయిన్స్ నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. ఆయా వేదికలపై ఫిర్యాదుల వివరాలను, దానిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలి. స్వేచ్చాయుత భావవ్యక్తీకరణతోపాటు, ఆన్లైన్ భద్రత,రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఫేస్బుక్ ప్రతినిధి వెల్లడించారు. ఫిర్యాదులు, కృత్రిమ మేధస్సు, తమ సమీక్షా బృందం నివేదికల ఆధారంగా తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్ను గుర్తిస్తామని తెలిపింది. -
ఆ లెక్కలు చెబుతామంటున్న ఫేస్బుక్
భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ చట్టాలను అమలు చేయడం విషయంలో ట్విట్టర్, కేంద్రం మధ్య పరిస్థితి జటిలంగా మారుతుండగా మరోవైపు భారత ఐటీ చట్టాలకు లోబడి తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఫేస్బుక్ సిద్ధమవుతోంది. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు అనుగుణంగా ‘కంటెంట్’కి సంబంధించి లెక్కలు చెబుతామంటూ ఎఫ్బీ ప్రకటించింది. జులై 2న సోషల్ మీడియా దిగ్గజం స్థానిక చట్టాల ప్రకారం నడుచుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మే 15 నుంచి జూన్ 15 వరకు తాము ఫేస్బుక్ ఫ్లాట్ఫామ్ నుంచి తొలగించిన కంటెంట్కు సంబంధించిన వివరాలతో కూడిన మధ్యంతర నివేదికను జూన్ 2న సమర్పిస్తామని తెలిపింది. అంతేకాదు పూర్తి వివరాలతో కూడిన నివేదికను జులై 15 కల్లా అందుబాటులో ఉంచుతామంది. ఈ మేరకు ఫేస్బుక్ అధికార ప్రతినిధి ప్రకటన జారీ చేశారు. ఆ వివరాలు ఇప్పుడే కాదు తమ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ మే 15 నుంచి జూన్ 15 వరకు ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా తొలగించిన కంటెంట్ వివరాలు చెప్పేందుకు సిద్ధమైనా... అదే సమయంలో ఫేస్బుక్లో ఉన్న కంటెంట్పై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు వెంటనే వెల్లడించలేమని చెప్పింది. జులై 15 నాటికి ఆ వివరాలు అందుబాటులోకి వస్తాయంది. ఈ మేరకు వెబ్పేజీలో పోస్ట్ చేసింది. ఐటీ చట్టాలు మే 26 నుంచి కొత్త ఐటీ చట్టాలను కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం సోషల్ మీడియా సంస్థలు ప్రతీ నెల, తమకు అందిన ఫిర్యాదులు తీసుకున్న చర్యల వివరాలను ప్రచురించాల్సి ఉంటుంది. దీంతో పాటు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఫేస్బుక్ చర్యలు తీసుకుంటోంది. కాగా ట్విట్టర్ , కేంద్రం మధ్య ఈ విషయంపై వివాదం రోజురోజుకి ముదురుతోంది. చదవండి : ఫేస్బుక్కు భారీ ఊరట..! -
బాబోయ్ పైరసీ.. వేల కోట్లు ఉఫ్!
సాక్షి, న్యూఢిల్లీ: పైరసీ కారణంగా మీడియా, వినోద పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని, ఏటా సగటున రూ.2,100 కోట్ల మేర పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పైరసీని కట్టడి చేయడం కోసం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిందని, సినిమా హాళ్లలో పైరసీకి పాల్పడేవారికి భారీ జరిమానాలు విధించేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయని ఎంపీలు సుకాంత మజుందార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం పైరసీ కట్టడికి కొన్ని సిఫార్సులు చేసిందని, వాటిని పరిశీలించి సినిమాటోగ్రఫీ బిల్లు –2021లో చేర్చుతామన్నారు. వీటితో పాటు కాపీరైట్ చట్టం–1957 ప్రకారం పైరసీపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా పైరసీకి పాల్పడితే ఐటీ యాక్ట్ –2000లోని సెక్షన్ 79 ద్వారా చర్యలు తీసుకోవచ్చని జవడేకర్ పేర్కొన్నారు. చదవండి: ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరో.. వీడియో వైరల్ హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు -
పన్ను ఆదా : వీటిని గమనించారా?
మరో 30 రోజుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది. పన్ను ఆదా కోసం ఇప్పటి వరకు ఏమీ చేయకపోతే.. ఇప్పటికి అయినా మించిపోయింది ఏమీ లేదు. సాధారణంగా సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీల గురించి ఎక్కువ మందికి అవగాహన ఉంది. కానీ, పన్నును ఆదా చేసే మరెన్నో సెక్షన్లు కూడా ఐటీ చట్టంలో ఉన్నాయి. వీటి కింద మరింత మొత్తాన్ని పన్ను లేకుండా ఆదా చేసుకునే మార్గాలున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలను గరిష్టంగా సెక్షన్ 80సీ కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను ఆదా చేసుకోవచ్చు. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల వరకు ఉన్నా.. పన్ను రాయితీకి కేంద్రం అవకాశం కల్పిస్తోంది. దీనికి అదనంగా రూ.1.5 లక్షలు సెక్షన్ 80సీ రాయితీలను పూర్తిగా వినియోగించుకున్నట్టయితే రూ.6.5లక్షల ఆదాయంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నమే నేటి ప్రాఫిట్ ప్లస్ కథనం. హెల్త్ కవరేజీ (సెక్షన్ 80డీ) ఆరోగ్య రక్షణ అవసరాన్ని గతంతో పోలిస్తే కరోనా ఆగమనం తర్వాత చాలా మంది తెలుసుకున్నారు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఆరోగ్యానికే కాదు, ఆర్థికంగానూ కలిసొస్తుంది. ఏటేటా వైద్య చికిత్సల ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్న తరుణంలో.. ఆస్పత్రి పాలైతే ఊహించని ఆర్థిక భారం పడకుండా చూసుకోవడంతోపాటు.. ఏటా హెల్త్ప్లాన్కు చెల్లించే ప్రీమియంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. సెక్షన్ 80డీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో హెల్త్ప్లాన్కు చెల్లించే ప్రీమియం రూ.25,000 వరకు పన్ను లేదు. దీన్ని మరింత వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సెక్షన్ కింద రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. ► కరుణాకర్ (60 ఏళ్లలోపు), తన జీవిత భాగస్వామి, తన పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూపేణా చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25వేల మొత్తంపై పన్ను మినహాయింపు కోరొచ్చు. ఒకవేళ ఇదే వ్యక్తి వయసు 60 ఏళ్లు దాటి ఉంటే, తనకు తన కుటుం బం కోసం చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.50,000 మొత్తంపైనా పన్ను మిన హాయింపునకు చట్టం అవకాశం కల్పిస్తోంది. ► ఒకవేళ కరుణాకర్ వయసు 60 ఏళ్లలోపు అయి ఉండి తన కుటుంబానికి, అలాగే, తన తల్లిదండ్రుల కోసం (60 ఏళ్లలోపు వయసు) మరో హెల్త్ ప్లాన్కు ప్రీమియం చెల్లిస్తున్నాడని అనుకుంటే.. అప్పుడు కరుణాకర్ రూ.25,000, ఆయన తల్లిదండ్రుల పేరిట మరో రూ.25,000 కలిపి మొత్తం రూ.50,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు. ► మరో కేసులో కరుణాకర్ 60 ఏళ్లు దాటి ఉంటే, సహజంగానే ఆయన తల్లిదండ్రులు కూడా సీనియర్ సిటిజన్లు అయి ఉంటారు కనుక ఇద్దరికీ రూ.50,000 చొప్పున గరిష్టంగా రూ.లక్ష వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ► నగదు కాకుండా డిజిటల్ రూపేణా చెల్లింపులపైనే పన్ను మినహాయింపు పొందగలరు. ప్రీమియం నుంచి జీఎస్టీ, ఇతర సెస్సులను మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తానికే పన్ను ఆదా పొందాల్సి ఉంటుంది. ► ఒక వ్యక్తి తన కుటుంబానికి, తన తల్లిదండ్రుల హెల్త్ కవరేజీ మినహా మరే ఇతర బంధుత్వాలకు సంబంధించి పన్ను మినహాయింపు కోరడానికి లేదు. ► తల్లిదండ్రుల కవరేజీకి ప్రీమియంను తల్లిదండ్రులు కొంత.. వారి కుమారుడు లేదా కుమార్తె కొంత చెల్లించినట్టయితే అప్పుడు ఇరువురూ చెల్లించిన మేరకు నిబంధనలకులోబడి పన్ను ప్రయోజనానికి అర్హులు. ► హిందూ అవిభాజ్య కుటుంబానికి, ఎన్ఆర్ఐలకు సంబంధించి సెక్షన్ 80డీ కింద గరిష్ట పరిమితి రూ.25వేలు అని గుర్తుంచుకోవాలి. హెల్త్ చెకప్ ఒకవేళ హెల్త్ పాలసీ ప్రీమియం గరిష్ట పరిమితి కంటే తక్కువే ఉందనుకుంటే.. ఉదాహరణకు కరుణాకర్ ఏటా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి రూ.20,000 ప్రీమియంగా చెల్లిస్తున్నాడనుకుంటే.. మరో రూ.5 వేలకు హెల్త్ చెకప్లకు చేసే ఖర్చును చూపించుకోవచ్చు. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.5వేల మొత్తానికి సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంది. ► సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, న్యూరో సంబంధిత డిమెన్షియా, మోటార్ న్యూరాన్ డిసీజ్, పార్కిన్సన్స్ వ్యాధులకు, ఎయిడ్స్ తదితర తీవ్ర వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చుపై అదనంగా పన్ను రాయితీని క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.40,000 లేదా వాస్తవంగా అయిన ఖర్చు ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై దీన్ని పొం దొచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లు అయినా లేదా పన్ను చెల్లింపుదారుపై ఆధారపడిన వ్యక్తి సీనియర్ సిటిజన్ అయినా వారికి సంబంధించి ఈ వ్యాధుల కోసం చేసే ఖర్చు రూ.1,00,000 వరకు ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంతిల్లు.. (24బీ/80ఈఈ/80ఈఈఏ) సెక్షన్ 80సీ: ఇంటి రుణంలో అసలుకు (ప్రిన్సిపల్) చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఐదేళ్లలోపు విక్రయించకుండా ఉంటేనే ఈ మినహాయింపులకు అర్హులు. ఒకవేళ విక్రయిస్తే తిరిగి పన్ను చెల్లించాల్సి వస్తుంది. సెక్షన్ 24బీ: ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే నూతన ఇల్లు కొనుగోలు/నిర్మాణం అన్నది రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటి కొనుగోలు, నిర్మాణం లేదా ఇంటి నవీకరణ కోసం తీసుకున్న రుణాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. రుణంతో సమకూర్చుకున్న ఇంటిని అద్దెకు ఇచ్చేసి, ఉద్యోగం లేదా వ్యాపారం, వృత్థి కారణాల రీత్యా మరో చోట నివాసం ఉంటున్నట్టు అయితే అప్పుడు కూడా ఇదే పరిమితి అమలవుతుంది. ఒకవేళ సొంతానికి కాకుండా.. అద్దెకు ఇచ్చేందుకు రుణం తీసుకుని సమకూర్చుకున్న ఇంటికి.. వడ్డీ చెల్లింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా ఎంత ఉంటే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఈ ఉదాహరణలో రూ.2లక్షల పరిమితి ఉండదు. రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకునే కాలంలోనూ చేసిన వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. కొనుగోలు లేదా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి ఐదు సమాన వాయిదాల్లో దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నవీకరణ లేదా పునర్నిర్మాణం కోసం రుణం తీసుకుంటే మాత్రం.. అది పూర్తయ్యే వరకు పన్ను మినహాయింపులు లభించవు. గరిష్ట పరిమితి మేరకు మినహాయింపు పొందాలంటే.. తీసుకున్న రుణంతో మూడేళ్లలోపు ఇంటిని పూర్తి చేసుకోవాల్సి/ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అప్పుడు వడ్డీ చెల్లింపులపై గరిష్ట మినహాయింపు రూ.30,000కు తగ్గిపోతుంది. అద్దెకు ఇచ్చిన ఇంటి కోసం తీసుకున్న రుణంపై పన్ను మినహాయింపులు నూతన పన్ను విధానంలోనూ ఉన్నాయి. కాకపోతే కొన్ని పరిమితులను విధించారు. సెక్షన్ 80ఈఈ: ఈ సెక్షన్ కింద రూ.50,000 వడ్డీ చెల్లింపులపై అదనపు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రుణం రూ.35 లక్షలకు మించకూడదు. ప్రాపర్టీ విలువ రూ.50 లక్షలు మించకూడదు. సెక్షన్ 80ఈఈఏ: రూ.45 లక్షలకు మించని, మొదటిసారి ఇల్లు కొనుగోలుపై సెక్షన్ 80ఈఈఏ కింద అదనంగా (24బీకి అదనంగా) మరో రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునే వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.50,000ను క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. 80జీజీ: అసంఘటిత రంగంలో ఉద్యోగం చేస్తూ హెచ్ఆర్ఏ సదుపాయం లేని వారు లేదా స్వయం ఉపాధిలోని వారు ఇంటి అద్దె కోసం చేసే చెల్లింపులపై సెక్షన్ 80జీజీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.60,000 మేరకు పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు. సొంతిల్లు ఉండి కూడా అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్టయితే ఈ ప్రయోజనానికి అనర్హులు. అదే విధంగా మరో ప్రాంతంలో ఇంటి కొనుగోలుకు తీసుకున్న రుణంపై సెక్షన్ 24 కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న వారికీ 80జీజీ కింద ప్రయోజనానికి అర్హత ఉండదు. వార్షిక వేతనంలో 25 శాతం.. లేదా వాస్తవంగా చెల్లించే వార్షిక అద్దె నుంచి 10 శాతం వార్షిక వేతనాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం.. లేదా రూ.60,000.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తానికే మినహాయింపు పొందగలరు. ఎన్పీఎస్ (సెక్షన్ 80సీసీడీ) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అన్నది పింఛను స్కీమ్. రిటైర్మెంట్ కోసం నిధిని సమకూర్చుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో సాధనాల్లో ఇదీ ఒకటి. కానీ, దీనికి పన్ను ప్రయోజనాలు అదనం. పైగా ఫండ్ నిర్వహణ చార్జీలు కూడా ఇతర పథకాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్పీఎస్లో రూ.2లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద.. మరో రూ.50వేలను సెక్షన్ 80సీసీడీ కింద చూపించుకునేందుకు అవకాశం ఉంది. 5 శాతం పన్ను పరిధిలోని వారికి రూ.50వేలపై రూ.2,600 వరకు పన్ను ఆదా అవుతుంది. అదే 30 శాతం పన్ను పరిధిలోని వారు రూ.15,600 ఆదా చేసుకోవచ్చు. ఏటా ఈ స్థాయి పన్ను ఆదాకు అదనంగా, పథకం నిర్వహణ చార్జీలు తక్కువగా ఉండడం ఆకర్షణీయతలు. విద్యా రుణాలు (80ఈ) విద్యారుణాల చెల్లింపులపైనా సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి తన చదువుకు లేదా తన జీవిత భాగస్వామి, పిల్లలు, చట్టపరంగా ఎవరికైనా సంరక్షకుడిగా ఉంటూ తీసుకునే విద్యా రుణాలపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. కాకపోతే ప్రభుత్వం గుర్తించిన కోర్సుల కోసం తీసుకుంటేనే ఈ ప్రయోజనానికి అర్హులు. గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థ (బ్యాంకు/ఎన్బీఎఫ్సీ) లేదా చారిటబుల్ ట్రస్ట్ నుంచి రుణాన్ని తీసుకోవాలన్నది నిబంధన. ఇలా విద్యా రుణాలపై వడ్డీ చెల్లింపుల మొత్తానికి పన్ను ప్రయోజనాన్ని ఎనిమిదేళ్లపాటు పొందే అవకాశం ఉంది. విద్యా రుణం ఏ సంవత్సరంలో తీసుకున్నారనే దానితో సంబంధం లేకుండా.. రుణ చెల్లింపులు ప్రారంభించిన ఏడాది నుంచి ఎనిమిదేళ్ల పాటు ఈ మినహాయింపు అమల్లోకి వస్తుంది. ఏ రుణానికి అయినా ఈఎంఐ వాయిదా అసలు, వడ్డీ భాగాలతో ఉంటుంది. వడ్డీ చెల్లింపులను సెక్షన్ 80ఈ కింద చూపించుకోవచ్చు. అలాగే, అసలుకు చేసే చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద అనుమతించిన మేరకు గరిష్టంగా పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. సేవింగ్స్ వడ్డీ (80టీటీఏ/బీ) బ్యాంకుల సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీ, అదే విధంగా పోస్టాఫీసు లేదా కో–ఆపరేటివ్ సొసైటీల ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీని కూడా ఆదాయపన్ను వార్షిక రిటర్నుల్లో ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. కాకపోతే ఇలా వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మొత్తంపై సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందడానికి వీలుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఆదాయానికి ఈ విధమైన మినహాయింపు లేదు. కనుక ఎఫ్డీల ఆదాయాన్ని ఇందులో కలపకూడదు. 60 ఏళ్లు నిండిన వారికి ప్రయోజనాలు మరొక రకంగా ఉన్నాయి. వృద్ధులకు సేవింగ్స్ డిపాజిట్లతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనూ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపై సెక్షన్ 80టీటీబీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. 80టీటీబీ కింద క్లెయిమ్ చేసుకున్న వారికి, 80టీటీఏ కింద క్లెయిమ్కు అర్హత ఉండదు. విరాళాలు (80జీ) సంస్థలకు, ప్రభుత్వం ఆమోదించిన నిధులకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. నగదు రూపంలో ఇస్తే రూ.2,000కే పరిమితి. ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే చెక్కు లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ తదితర నగదేతర రూపాల్లో ఇవ్వాలి. ప్రభుత్వ నిర్వహణలోని చాలా సంస్థలకు ఇచ్చే విరాళాలకీ ఈ సెక్షన్ కింద పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. నాన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇచ్చిన విరాళంలో 50 శాతానికే పన్ను మినహాయింపు పొందగలరు. ఇతర ప్రయోజనాలు.. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80జీజీసీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం అమల్లో ఉంది. సెక్షన్ 80డీడీ లేదా 80యూ కింద పన్ను చెల్లింపుదారు లేదా వారిపై ఆధారపడిన వారు 40 శాతం వైకల్యంతో ఉంటే లేదా ఆటిజమ్, సెరబ్రల్ పాల్సీ తదితర తీవ్ర వైకల్య సమస్యలతో ఉంటే, వాటి కోసం చేసే చికిత్సల వ్యయాన్ని గరిష్టంగా రూ.1.25 లక్షలను స్థూల ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. ఇంకా వార్షిక ఆదాయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000తోపాటు.. ఎల్టీసీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ (ఉద్యోగానికి వీడ్కోలు పలికే సమయంలో)పైనా పన్ను మినహాయింపులున్నాయి. -
బాయ్స్ లాకర్ రూం: షాకింగ్గా ఉంది..
న్యూఢిల్లీ: మహిళలు, బాలికల అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘బాయ్స్ లాకర్ రూం’ గ్రూప్ సభ్యులపై సుమోటో యాక్షన్ తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది నీలా గోఖలే ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్కు లేఖ రాశారు. అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడాలంటూ అశ్లీల సంభాషణకు తెరతీసిన పాఠశాల విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోక్సో, ఐటీ చట్టం, ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని మే 4న రాసిన లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి కట్టడి చర్యల్లో ఢిల్లీ పోలీసులు, పాలనా యంత్రాంగం నిమగ్నమై ఉన్నదని.. బాయ్స్ లాకర్ రూం సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. (బాలుడి ఆత్మహత్య.. ఢిల్లీలో కలకలం) ‘‘ఢిల్లీకి చెందిన కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను లైంగికంగా వేధించడం, వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడటం వంటి విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చించారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు. అనుచిత ప్రవర్తన తీవ్రత దృష్ట్యా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. వారి అశ్లీల సంభాషణ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉండటం షాకింగ్గా ఉంది. మహిళల ప్రైవేటు భాగాల గురించి, లైంగిక హింస వారు విపరీత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నగ్న చిత్రాలు వైరల్ చేస్తామంటూ మహిళలను బెదిరింపులకు గురిచేశారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోండి’’అని నీలా గోఖలే లేఖలో పేర్కొన్నారు. కాగా బాయ్స్ లాకర్ రూం పేరిట ఇన్స్టాగ్రామ్ గ్రూప్చాట్లో మహిళలు, బాలికలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ కొంతమంది విద్యార్థులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. ఈ విషయాన్ని గుర్తించిన ఓ బాలిక వీరి వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. దీంతో ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. (పోలీసుల అదుపులో ‘బాయ్స్ లాకర్ రూం’ సభ్యుడు) -
21 రోజుల్లోపు స్పందించండి
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలు నిర్వహించి 2018– 19 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయని వారు 21 రోజుల్లోపు వారి స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) కోరింది. రిటర్నులు దాఖలు చేయని విషయమై ఐటీ శాఖ నుంచి ఈ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ అందిన తేదీ నుంచి 21 రోజుల గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ గడువులోపు ఎటువంటి రిటర్నులు లేదా స్పందన రాకపోతే ఆదాయపన్ను చట్టం 1961 కింద చర్యలు తీసుకుంటామని, ప్రొసీడింగ్స్ మొదలుపెడతామని స్పష్టంచేసింది. భారీ లావాదేవీలు నిర్వహించిన కొందరు 2017–18 ఆర్థిక సంవత్సరానికి రిటర్నుల దాఖలు చేయలేదని పరిశీలనలో తేలినట్టు తెలిపింది. ఎంత మంది దాఖలు చేయలేదన్న దానిపై గణాంకాలను విడుదల చేయలేదు. రిటర్నులు దాఖలు చేయని వారు తాము చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని లెక్కించి 2018–19 అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ సమర్పించాలని లేదా ఆన్లైన్లో 21 రోజుల్లోపు స్పందన తెలియజేయాలని కోరింది. ఇందు కోసం ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, మొత్తం ప్రక్రియను ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చని సూచించింది. -
ఐటీ విచారణకు యశ్
యశవంతపుర : సంచలనం సృష్టించిన నటులు, నిర్మాతలపై ఐటీ దాడుల వ్యవహారంలో ఇప్పుడు విచారణ మొదలైంది. శుక్రవారం రాకింగ్ స్టార్, కేజీఎఫ్ హీరో యశ్ తన తల్లి పుష్పతో కలిసి ఇక్కడి క్వీన్స్ రోడ్డులో ఉన్న ఆదాయ పన్ను శాఖ ముందుకు వచ్చారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన యశ్విలేకరులతో మాట్లాడుతూ... ఐటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. తన ఆదాయ వనరులపై ఐటీ అధికారులు అడిగినట్లు తెలిపారు. తన సంస్థలో పనిచేస్తున్న వారి గురించి ప్రశ్నించారని, తన ఆడిటర్ ఇంటిపై ఎలాంటి ఐటీ దాడి జరగలేదన్నారు. తనకు రూ. 40 కోట్ల రుణం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఖండించారు. కొందరు తనను వేధించటానికి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇకపై ఇలాంటివి సహించనన్నారు. కొన్ని చానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా యశ్ ఆడిటర్ బసవరాజ్ కార్యాలయంపై గురు వారం నిర్వహించిన ఐటీ దాడుల్లో అధికారులకు ఒక డెయిరీ లభ్యమైనట్లు తెలిసింది. -
బాధ్యతతోనే ఆన్లైన్ భద్రత
ఆన్లైన్ వేదికల్లో చట్టవిరుద్ధమైన క్రియాశీలక అంశాలను నియంత్రించడమే ప్రధాన అంశం. ఇందుకు ఆయా అంశాల చట్టబద్ధతను గుర్తించే స్థితిలో మధ్యవర్తులు ఉండాలి. దీనిపై అవగాహన లేకుండా ఆయా అంశాలను సెన్సార్ చేయడం అసాధ్యం. అత్యాధునిక ఫిల్టరింగ్ సాంకేతికత కూడా చట్టసమ్మతమైన అంశాలను సెన్సార్ చేసి, చట్టవిరుద్ధమైనవాటిని వదిలేస్తూంటుంది. నియంత్రణ బాధ్యతను మధ్యవర్తులు స్వీకరించడం ప్రమాదకర స్థాయికి చేరుకుని మన ఆన్లైన్ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్రిమినల్ చర్యలకు గురవుతామనే ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తి, ప్రభుత్వ అధికారిఅనే తేడాలేకుండా ఫిర్యాదు అందితే ఎటువంటి అంశాలనైనా తొలగించివేస్తున్నారు. వివిధఇంటర్నెట్ సంస్థలు,ఫేస్బుక్,ట్విట్టర్ వంటి సామాజికమాధ్యమాలతో ‘రహస్య సంప్రదింపులు’ జరిపి సమాచార సాంకేతిక(ఐటీ) చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా దాన్ని మరింత అస్పష్టతలోకి నెడుతోంది. టెలికాం సంస్థలు, ఆన్లైన్ వేదికలను ‘మధ్యవర్తులు’గా పేర్కొంటూ రూపొందిన ఐటీ చట్టం ఇప్పటికే సుదీర్ఘంగా, అస్పష్టతతో నిండి ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఐటీ శాఖ ముసాయిదా సవరణలు ఆమోదం పొందితే దేశంలో ప్రై వేటు సెన్సార్షిప్ మొదలవుతుంది. భావ ప్రకటనాస్వేచ్ఛపై ప్రై వేటు నిఘా పెరుగుతుంది. పైగా ఆన్లైన్ ప్రపంచం వాస్తవంగా ఎదుర్కొంటున్న అప్రజ్వామిక, అభద్రత సమస్యల జోలికి మాత్రం ఇది పోవడం లేదు. ఈ ముసాయిదాను వెనక్కు తీసుకోవడమేకాక ఆన్లైన్ వేదికల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడమని ప్రభుత్వాన్ని అందరూ కోరడం తక్షణావసరం. టెలికాం కంపెనీలవంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఆన్లైన్ వేదికలైన ఫేస్బుక్, ట్వీటర్వంటి ‘మధ్యవర్తుల’కు ఐటీ చట్టంలోని సెక్షన్ 79 రక్షణ కల్పిస్తోంది. కనుక ఈ సర్వీసుల్ని ఉపయోగించుకునే మూడో పక్షంవారు ఉపయోగించే పదాలకూ లేదా చర్యలకూ ఈ సంస్థలు నేరుగా బాధ్యులు కాకుండా ఆ నిబంధన కాపాడుతోంది. ఈ నిబంధనే లేకపోతే చట్టవిరుద్ధమైన అంశాల విషయంలో మధ్యవర్తి సంస్థలపై సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి పుష్కలంగా అవకాశం ఉంటుంది. దీని పర్యవసానమేమంటే అత్యంత నియంత్రిత ఇంటర్నెట్ వ్యవస్థ రూపొందుతుంది. ఆన్లైన్ వేదికలు, ఇతర సర్వీసులు విస్తతమైన సెన్సార్షిప్కు సిద్ధపడతాయి. ఆన్లైన్ వినియోగదారులు పోస్టు చేసే అంశాలపై నిఘా పెడతాయి. ఆ రకంగా ఒక ప్రై వేటు నిఘా వ్యవస్థ రూపొందుతుంది. ఎగ్జిక్యూటివ్ రూపొందించిన రూల్స్తో పోల్చి చూసి, చురుకుగా పరిశీలించి, వాస్తవాల ఆధారంగా చట్టవిరుద్ధమైన సమాచారాన్ని తొలగించినప్పుడే సెక్షన్ 79 మధ్యవర్తులకు రక్షణ కల్పిస్తుంది. మధవర్తులకు మార్గదర్శక సూత్రాలపేరిట 2011లో ఈ నిబంధనలను రూపొందించారు. ప్రమాదకరమైన, వేధింపులకు గురిచేసే, పరువు నష్టం కలిగించే, అశ్లీల, నగ్న, మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే, ద్వేషపూరితమైన, నైతిక విరుద్ధమైన, జూదాన్ని ప్రోత్సహించే లేదంటే మరేవిధంగానైనా చట్టవిరుద్ధమైన అంశాలు వేటినైనా తొలగించడానికి ఈ నిబంధనలు దోహదం చేస్తాయి. సెక్షన్ 79, 2011 నిబంధనల్లోని అస్పష్టత కారణంగా తాము ఎప్పుడు బాధ్యులమవుతామో తెలియక సెన్సార్ చేసే వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. క్రిమినల్ చర్యలకు గురవుతామనే ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తి, ప్రభుత్వ అధికారి అనే తేడా లేకుండా ఫిర్యాదు అందితే చాలు ఎటువంటి అంశాలనైనా తొలగించివేస్తున్నారు. అయితే, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు దీనిని తోసిపుచ్చింది. న్యాయ ఆదేశం లేదంటే తగిన ప్రభుత్వ నోటిఫికేషన్వంటి వాస్తవమైన ఆధారాలు సెక్షన్ 79 కింద అవసరమవుతాయని కోర్టు స్పష్టం చేసింది. గూగుల్, ఫేస్బుక్ వంటివి ఆయా అంశాల చట్టబద్ధతను నిర్ధారించడం, తమ వేదికలపై వాటిని వడబోయడంలో వుండే క్లిష్టతను, ప్రమాదాన్ని కోర్టు గుర్తించింది. ఇటీవలి అంశాలు మధ్యవర్తులను బాధ్యులను చేయడంపై భారత ప్రభుత్వం పునరాలోచించుకునేలా చేశాయి. ఫేస్బుక్లో కేంబ్రిడ్జ్ అనలైటికా ఎన్నికల వ్యవహారంలో వేలుపెట్టడం, వాట్సాప్ తప్పుడు సమాచారంవంటి అంశాలపై మాత్రమే ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. సుప్రీంకోర్టు చేతులు కట్టేయడంతో చట్టవ్యతిరేక ప్రసంగాలను మధ్యవర్తులు తగ్గించాలని ప్రభుత్వం ముందుకొచ్చింది. మధ్యవర్తులు సాంకేతికతకమైన స్వయం నియంత్రిత సాధనాలు లేదా అందుకు తగినటువంటి విధానం, తగినటువంటి నియంత్రణల ఆధారంగా చట్టవిరుద్ధమైన సమాచారంగానీ, అంశాలను గానీ గుర్తించి, తొలగించడానికి నెలకొల్పాలని రూల్ 3(9)లో పేర్కొనడం జరిగింది. దీంతోపాటు సమాచారాన్ని ఇతరులు పొందే వీలులేకుండా వాట్సాప్ అనుసరిస్తున్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను దృష్టిలో పెట్టుకుని సమాచారం మూలాన్ని తెలుసుకునే అవకాశం మధ్యవర్తులకు కల్పించే విధంగా నిబంధనలను సడలించాల్సి ఉంది. సమాచారం మూలాన్ని తెలుసుకునే వెసులుబాటును వ్యతిరేకించేప్పుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69కింద ఇప్పటికే ఈ వెసులుబాటు మధ్యవర్తులకు కల్పించిన విషయాన్ని గుర్తించాలి. అయితే, సమాచారాన్ని డీక్రిప్ట్ చేయడంలో అస్పష్టత, సురక్షితం కాకపోవడం వంటి అంశాలు చాలా వరకు చట్టవిరుద్ధమైనవేగాక, ప్రాథమిక గోప్యతా హక్కుపై సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకమైనవి. చట్టవిరుద్ధమైన క్రియాశీలక అంశాలను నియంత్రించడమే ప్రధాన అంశం. ఇందుకు మొదట ఆయా అంశాల చట్టబద్ధతను గుర్తించే స్థితిలో మధ్యవర్తులు ఉండాలి. ఇది పూర్తిగా న్యాయపరిధిలోని అంశం. దీనిపై అవగాహన లేకుండా ఆయా అంశాలను సెన్సార్ చేయడం అసాధ్యం. అలాగే న్యాయపరమైన అవగాహన అవసరం లేని నిగ్రహంతో కూడిన అంశాల చట్టబద్ధతను నిర్ణయించడం కూడా ప్రైవేట్ సెన్సార్షిప్లో భాగంగా రాజ్యాంగ విరుద్ధమవుతుంది.అంతేగాక, స్వయం నియంత్రిత సాధనాలు కేవలం చట్టవిరుద్ధమైన అంశాలను మాత్రమే నియంత్రించగలవని విశ్వసిస్తాం. కానీ, వాస్తవం వేరుగా ఉంటుంది. అత్యాధునిక ఫిల్టరింగ్ సాంకేతికత కూడా చట్టసమ్మతమైన అంశాలను సెన్సార్ చేసి, చట్టవిరుద్ధమైనవాటిని వదిలేస్తూంటుంది. భారత్లో మధ్యవర్తులు బాధ్యతవహించాలనే అంశంపై రూపొందించిన నిబంధనలు కొంత ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆ నిబంధనలపై అటు ప్రభుత్వం, ఇటు కోర్టులు పెనుగులాడుతున్నాయి. శ్రేయా సింఘాల్ కేసు అనంతరం కోర్టు ఆదేశాలతో మాత్రమే ఆయా అంశాలను తొలగించాల్సి ఉంది. అయితే సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ కారణంగా మధ్యవర్తులు తమ వేదికలపై నుంచి చట్టవిరుద్ధమైన అంశాలను తొలగించడంలో అలసత్వం చూపడంతో అవి వినియోగదారులపైకి వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ యాక్ట్లోని అంశాలను పక్కనబెట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆటో బ్లాకింగ్ను సుప్రీంకోర్టు అనుమతించింది. కొత్త ముసాయిదా నిబంధనల్లో ఉన్న ఈ అంశం ఇవే కారణాల వల్ల ప్రమాదకరమైనది. ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్లు తమను తాము నిష్పాక్షికమైన మధ్యవర్తులుగా చూపుకుంటున్నప్పటికీ ఆయా అంశాల సెన్సార్, వడబోత, ప్రాధాన్యత, తొలగింపు అనేవే వాటి ప్రాథమిక అంశాలు. ఈవిధంగా చట్టపరమైన నిబంధనలు అడ్డుపడకపోవడంతో వినియోగదారుల అంశాలను నియంత్రించే బాధ్యతను మధ్యవర్తులు స్వీకరించడం ప్రమాదకర స్థాయికి చేరుకుని మన ఆన్లైన్ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాజకీయ ప్రకటనలతో తప్పుదారి పట్టించడానికి ఫేస్బుక్ ప్రాధాన్యతనిస్తుంటే, అట్టడుగు వర్గాలవారిపై జరుగుతున్న హింసపై స్పందించడంలో ట్విట్టర్ విఫలంకావడం ఆన్లైన్ వేదికలను మరింత ప్రజాస్వామికీకరించాల్సిన ఆవశ్యకతను, వాటిని బాధ్యులుగా చేయాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి. ఆన్లైన్ వేదికలను బాధ్యులను చేసే, పారదర్శకతను పెంచే విషయంలో ఐటీ రూల్స్ ముసాయిదా ఎటువంటి పరిష్కారం చూపకపోవడంతోపాటు; పబ్లిక్ అంశాలపై వారి ప్రైవేట్ సెన్సార్షిప్ను మరింత బలోపేతం చేసే విధంగా ఉన్నాయి. మధ్యవర్తుల ప్రైవేట్ సెన్సార్పై చట్టపరమైన జోక్యమైనా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఆయా అంశాలను నియంత్రించడంపై వారు తీసుకుంటున్న చర్యలు మరింత పారదర్శకంగా వుండేలా, నివేదికలు వెల్లడించేలా చేయడానికి చట్టం జోక్యం చాలా అవసరం. తమ వేదికలపై ఆయా అంశాలను నియంత్రించడంలో వారిని బాధ్యులను చేయడం ద్వారా వారు ఒక విధానాన్ని అనుసరించేలా చేయొచ్చు. అసంబద్ధమైన, చట్టవిరుద్ధమైన ప్రవర్తన గురించి వినియోగదారులకు తెలియజేయడం, దాన్ని నియంత్రించడానికి తీసుకున్న చర్యలను వివరించడం వంటి ఒక విధానాన్ని వారు రూపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడే సురక్షితమైన, ప్రజాస్వామికమైన ఆన్లైన్ స్పేస్ వినియోగదారులకు లభిస్తుంది. అంతేగానీ, ప్రభుత్వమో, ఆన్లైన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లో ముందు నిలబడి చట్టవిరుద్ధమైన అంశాలను అడ్డుకోవడం వల్ల కాదు. ఈ విషయమై మీ అభిప్రాయాలను కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు ఈ నెల 15లోగా తెలియజేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని సెన్సార్షిప్ను వ్యతిరేకిస్తూ సురక్షితమైన, ప్రజాస్వామికమైన ఆన్లైన్ కమ్యూనిటీని పొందవచ్చు. వ్యాసకర్త: దివిజ్ జోషి, రీసెర్చ్ ఫెలో, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, బెంగళూరు. -
దాపరికంపైనా దాడేనా?
నీ సమాచారం మేం తీసుకుంటాం, నువ్వే సమాచారం అడిగినా ఇవ్వం. ఇదీ ప్రభువుల ఉవాచ. తస్మాత్ జాగ్రత్త. పది పోలీసు నిఘా విభాగాలు ప్రజల కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని పర్యవేక్షించి, జోక్యం చేసుకుని డీక్రిప్ట్ చేయవచ్చునని కేంద్ర ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 69(1) కింద, 2009 నియమాల్లో నాలుగో నియమం ప్రకారం, ఇంటెలిజెన్స్బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి జెన్స్, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, కేబినెట్ సెక్రటేరియట్ (రా), జమ్మూకశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసులు పౌరుల కంప్యూటర్లలోకి తొంగి చూడవచ్చు. జోక్యం చేసుకోవచ్చు. దోచేయవచ్చు. పాలకుల దుర్మార్గ లక్షణాలలో ముఖ్యమైంది పౌరుల సమాచారాన్ని సేకరించడం. తన దగ్గరున్న సమాచారాన్ని ప్రజలకు ఏం చేసినా ఇవ్వకపోవడం. ఒకవైపు ఆర్టీఐని బలహీనం చేస్తూ, మరోవైపు పౌరుల ప్రైవసీని హరించే ప్రకటనలు చేస్తున్నది. మనం ఉత్తరాలు రాసుకుంటే కవర్లు తెరిచి చూసే అధికారం తనకు తాను ఇచ్చుకున్నది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ అధికారాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాలకులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వాడుకుంటూ వస్తున్నారు. టెలిగ్రాఫ్ చట్టంలో కూడా పౌర సమాచార తస్కరణ అధికారాలను రాసుకున్నది బ్రిటిష్ సర్కార్. ఇప్పుడు కంప్యూటర్లలో జనం సమాచారాన్ని కైవసం చేసే అధికారదాహంతో ఉంది. ఇప్పుడు ఉత్తరాలు రాసుకునేవారు తక్కువ. టెలిగ్రాముల కథ ఏనాడో ముగిసిపోయింది. ఈమెయిల్స్ ఇచ్చుకోవడం, సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసుకోవడం జరుగుతూ ఉన్నది. బ్లాగుల ద్వారా ప్రతిపౌరుడూ ఒక స్వయం జర్నలిస్టుగా మారాడు. సెల్ఫోన్ పట్టుకున్న ప్రతివాడూ ఇన్స్టాగ్రామ్లో పౌర పత్రికా ఫొటోగ్రాఫర్గా మారాడు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అని ఆలోచనలను వాక్యాలుగా మలచగల ప్రతి పౌరుడూ తన వాక్ స్వాతంత్య్రాన్ని వినియోగించుకుంటున్నాడు. ప్రింట్ చేయాల్సిన పని లేకుండానే వేలాది మంది ప్రజలకు చేరువయ్యే టెక్నాలజీ సామాన్య మానవుడిని పక్కవాడి భావజాలాన్ని ప్రభావితం చేసే ప్రభావశాలిగా మార్చేసింది. కంప్యూటర్ మాధ్యమాన్ని విరివిగా వాడుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్లలో నిశితమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా కోపతాపాలు బయటపెట్టుకుంటూ హద్దులు మీరి తీవ్ర పదజాలాన్ని కూడా వాడుతున్నారు. టెలిగ్రాములు, ఉత్తరాలు తెరచి తరచి చూసే అధికారం సొంతం చేసుకున్న ప్రభుత్వం రహస్యంగా టెలిఫోన్ భాషణలను కూడా వింటున్నది. వ్యక్తుల ఆలోచనా విధానాలను, వారి వ్యక్తీకరణను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఇంకా అధికారం కావాలంటున్నది. జనం స్వేచ్ఛను ఎంత తాగేసినా ప్రభువుల అధికార దాహం తీరడం లేదు. ఇప్పుడు మన సెల్ఫోన్లో సిల్లీ కబుర్లు వింటారట, చూస్తారట. బ్లాగ్లు, వెబ్సైట్లు వెతుకుతారట. పౌరులు వాడుకునే ఆధునిక సంచారఫోన్లు కూడా కంప్యూటర్లే. ఫేస్బుక్ అందరికీ కనిపించేదే. వాట్సాప్ సమాచారం గ్రూప్ సభ్యులకే పరిమితం. ఇప్పుడీ పది సంస్థలు వాటిని కూడా చూడవచ్చు. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో జరిగే జాతి వ్యతిరేక కార్యక్రమాలను పసిగట్టడానికి ఈ అధికారం అవసరమట. కానీ టోకున పౌరులందరి కంప్యూటర్లు చూస్తాననటం. సమాచారం తీస్తాను అనడమంటే అపారమైన అధికారాన్ని సొంతం చేసుకోవడమే. వేల కేసుల్లో రహస్యంగా టెలిఫోన్లు వింటూనే ఉన్నారని కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అధికార వర్గాల్లో వినబడుతూంటాయి. పై స్థాయిలో ఉన్న అధికారులు కూడా ట్యాపింగ్ జరుగుతుందని భయపడుతూ ఉంటారు. అందుకే ఎన్క్రిప్టెడ్ (అంటే తొంగి చూడడానికి వీల్లేని) సేవలందించే వాట్సాప్ వంటి వాటి ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరూ వినలేరనే నమ్మకంతో. ఈ ఉత్తర్వుతో వాట్సాప్ మాత్రమే కాదు మరే ఇతర ఎన్క్రిప్టెడ్ సమాచార ప్రసారాలనయినా డీక్రిప్ట్ చేసి తెలుసుకోవచ్చు. ప్రజల మెదళ్లమీద నియంత్రణకు అధికారం వాడడం, వారి ఆలోచనలు తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. పౌరుల స్వేచ్ఛకు భంగకరమైన అధికార దుర్వినియోగానికి ఇవి దారి తీస్తాయి. ఇది ఏకపక్ష నియంతృత్వ చర్య. 2017 ఆగస్టు 24న సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో ప్రైవసీని ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ, వెంటనే దానికి సంబంధించిన చట్టం చేయాలని సూచించింది. కానీ ప్రైవసీని నిర్వచించి చట్టం చేయవలసిన ప్రభుత్వానికి పార్లమెంటుకు తీరికే లేదు. ప్రైవసీ పేరుమీద ప్రజలకు ప్రభుత్వాధికారుల సమాచారాన్ని ఇవ్వకుండా తీవ్రంగా ప్రతిఘటించే ప్రభు త్వం, ప్రజల ప్రైవసీ మీద చేయదలచుకున్న మూకుమ్మడి దాడికి ఈ ప్రకటన నాంది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
భద్రత సాకుతో నిఘా!
‘పాలకులు ప్రజా సేవకులు గనుక వారి గురించి మనకు ప్రతీదీ తెలియాల్సిందే. మనం ప్రైవేటు వ్యక్తులం గనుక మన గురించి వారికి తెలియకూడదు. వారు తెలుసుకోకూడదు’ అని పులిట్జర్ గ్రహీత, పాత్రికేయుడు గ్లెన్ గ్రీన్వాల్డ్ ఒక సందర్భంలో అన్నారు. అమెరికా, బ్రిటన్లు స్వదేశాల్లోని పౌరులపైనేగాక ప్రపంచవ్యాపితంగా ఎన్నో దేశాల్లో సాగించిన నిఘా వ్యవహారాలను స్నోడెన్తో పాటు ఆయన బట్టబయలు చేశారు. గ్రీన్వాల్డ్ ఏం చెప్పినా జనంపై నిఘా పెట్టడం పాలకులకు నిత్యకృత్యంమవుతోంది. సాంకేతికత పెరిగే కొద్దీ ఇది మరింత సులభంగా మారుతోంది. వ్యక్తిగత గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు నిరుడు తీర్పునిచ్చింది. దాన్ని మూణ్ణెల్ల క్రితం ఇచ్చిన ఆధార్ తీర్పులో సైతం ధ్రువీకరించింది. కానీ కేంద్రం మాత్రం తన దోవన తాను పౌరులపై నిఘాకు వీలుకల్పించే నోటిఫికేషన్ను గురువారం అర్థరాత్రి విడుదల చేసింది. ఆ విష యంలో విమర్శలు వెల్లువెత్తుతుండగానే కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని సెక్షన్ 79ని సవరించాలని సంకల్పించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని వివిధ సామాజిక మాధ్యమాలకు పంపింది. వాటిపై వచ్చే నెల 7లోగా స్పందించాలని కోరింది. నోటిఫికేషన్ అయినా, ఆ తర్వాత ప్రతిపాదించిన ఐటీ చట్ట ముసాయిదా సవరణలైనా ఆశ్చర్యం కలిగిస్తాయి. దేశ భద్రతకూ, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగే పరిస్థితులపై బహి రంగ చర్చ జరిపితే, వివరాలన్నీ వెల్లడిస్తే ప్రజలు సంతోషిస్తారు. దేశ భద్రతకు తమ వంతు సహ కారం అందిస్తారు. కానీ హఠాత్తుగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసి, ఐటీ చట్టానికి సవరణ ప్రతిపా దించి ఇదంతా దేశం కోసమే అంటే ఎవరూ విశ్వసించలేరు. లోగడ ఇందిరాగాంధీ కూడా ఇలాంటి కారణాలే చెప్పి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రస్తుత బీజేపీ నేతలు అనేకులు జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. దానికి వ్యతిరేకంగా పోరాడినవారే ఇప్పుడు అధికారంలోకొచ్చి ఆ ధోరణుల్నే ప్రదర్శిం చడం విస్మయం కలిగిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో మొదలుకొని మొత్తం పది సంస్థలు ఎవరి కంప్యూటర్లలో భద్రపరిచిన సమాచారాన్నయినా రాబట్టడానికి... పౌరులు ఒకరికొకరు పంపుకునే అన్ని రకాల సమాచారాన్ని అడ్డగించి డీక్రిప్ట్ చేయడానికి గురువారం అర్ధరాత్రి వెలువడిన నోటిఫికేషన్ అవకాశమిస్తోంది. ఈ అధికారాలను వినియోగించుకోవడానికి ముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవా లన్న నిబంధనొకటి విధించారు. ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందట. నిఘా అధికారాలు దుర్వినియోగం కాకుండా చేసిన ఏర్పా ట్లలో ఇవన్నీ భాగమని ప్రభుత్వం చేస్తున్న వాదన నిలబడదు. అధికారంలో ఉన్నవారు ఎవరిపైన అయినా చర్య తీసుకోదల్చుకుంటే అధికారులు దానికి అడ్డు చెబుతారని ఎవరూ అనుకోరు. సీబీఐ మొదలుకొని అనేక సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని స్వయానా బీజేపీయే విపక్షంలో ఉండగా ఆరోపణలు చేసింది. ఆఖరికి సర్వోన్నత న్యాయస్థానమే పాలకులు చెప్పినట్టల్లా ఆడుతు న్నారని సీబీఐని విమర్శించింది. ఇక అవి స్వతంత్రంగా వ్యవహరించగలవని నమ్మేదెవరు? ఏదో ఒక సాకుతో ఇలా విశేషాధికారాలు సంక్రమింపజేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించడమే అవుతుంది. నోటిఫికేషన్ పర్యవసానంగా గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, అమెజాన్, ట్వీటర్, షేర్ చాట్ తదితర సామాజిక మాధ్యమాలన్నీ ప్రభుత్వ సంస్థలు అడిగిన ఎలాంటి సమాచారాన్నయినా 72 గంటల్లో అందజేయాలి. ఆఖరికి ఎన్క్రిప్షన్(సంకేత భాష) సదుపాయం ఉన్న వాట్సాప్వంటివి కూడా వారడిగే సమాచారం మూలాలెక్కడివో చెప్పడానికి దాన్ని డీక్రిప్ట్ చేయాల్సిందే. వాట్సాప్లో ఒకరినుంచి ఒకరికెళ్లే సమాచారం ఇవ్వాలని ఆమధ్య కేంద్రం కోరినప్పుడు అది తమకు సైతం తెలియదని ఆ సంస్థ నిర్వాహకులు జవాబిచ్చారు. ఇప్పుడు దాన్ని దారికి తెచ్చుకోవడమే ధ్యేయంగా నోటిఫికేషన్ విడుదలచేసినట్టు కనబడుతోంది. ఆవుల్ని కబేళాలకు తరలిస్తున్నారని, గోమాంసం తింటున్నారని ఆరోపణలుచేస్తూ గత మూడు న్నరేళ్లుగా పలు ముఠాలు చెలరేగి ఎందరినో కొట్టి చంపాయి. పిల్లల్ని అపహరించుకుపోతున్నారని వదంతులు సృష్టించి హత్యలు చేసిన సందర్భాలున్నాయి. వీటిని అరికట్టేందుకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని చాలామంది కోరారు. మూక దాడులకు వర్తింపజేయగల అనేక సెక్షన్లు మన భార తీయ శిక్షాస్మృతిలో ఇప్పటికే ఉన్నాయని కూడా చెప్పారు. దీని గురించి కేంద్రం ఏం ఆలోచిస్తున్నదో ఎవరికీ తెలియదు. కానీ వదంతుల వ్యాప్తికి వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలు కారణ మంటూ వాటిని అదుపు చేయడానికి మాత్రం చర్యలు మొదలయ్యాయి. అసలు నోటిఫికేషన్ 2009లో యూపీఏ ప్రభుత్వం విడుదల చేసిందని, తాము చేసిందల్లా దాన్ని పొడిగించడమేనని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంటున్నమాట నిజమే కావొచ్చు. కాంగ్రెస్ పాలనలోని అవకతవ కలను నిశితంగా విమర్శిస్తున్న బీజేపీ నేతలకు ఈ నోటిఫికేషన్ తప్పుగా కనబడకపోవడం విచిత్రం. ఎవరెవరి ఫోన్ సంభాషణలు ప్రభుత్వం వింటున్నదో వివరాలివ్వాలని కొన్నేళ్లకిత్రం ఆర్టీఐ చట్టం కింద అడిగినప్పుడు నెలకు 10,000 కాల్స్పై నిఘాకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతిచ్చారని వెల్లడైంది. అంటే రోజూ దాదాపు కొత్తగా 300మంది అదనంగా నిఘా పరిధిలో కొస్తున్నట్టు లెక్క. ఇంత విచక్షణారహితంగా నిఘా అమలవుతున్న తీరును గుర్తించి సరిచేయా ల్సింది పోగా, తాజాగా సామాజిక మాధ్యమాలను కూడా అందులో చేర్చాలనుకోవడంలోని ఔచిత్యం ఏమిటో అర్ధంకాదు. దేశ భద్రత విషయంలో రాజీ పడాలని ఎవరూ చెప్పరు. కానీ తమ కిచ్చిన అధికారాలను దుర్వినియోగపరిచే అధికారులపై బాధిత పౌరులు ఎలాంటి చర్యలు తీసుకో వచ్చునో కూడా నోటిఫికేషన్ చెప్పాలి. చట్టంలో సైతం దానికి సంబంధించిన నిబంధనలుండాలి. అంతేతప్ప ఏదో ఒక సాకుతో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. -
‘వ్యక్తిగత స్వేచ్ఛ’పై రాద్దాంతం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటర్ నుంచి వచ్చే ఏ సమాచారంపైనైనా నిఘా కొనసాగించి, దాన్ని మధ్యలో అడ్డుకోవడంతోపాటు సదరు సమాచారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేశంలోని పది ప్రభుత్వ సంస్థలకు అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర హోం శాఖ గురువారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్పైనా శుక్రవారం నాడు పార్లమెంట్లో తుపానే చెలరేగింది. స్వేచ్చా వ్యవస్థ స్వరూపమే సర్వ నాశనం చేస్తుందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించగా, సుప్రీం కోర్టు సమర్థించిన రాజ్యాంగబద్ధ వ్యక్తిగత స్వేచ్ఛను ఈ నోటిఫికేషన్ హరిస్తోందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఘాటుగా విమర్శించారు. నోటిఫికేషన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గొడవ చేయడంతో పార్లమెంట్ సమావేశం కూడా పలు సార్లు వాయిదా పడింది. (సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు) ఇక పార్లమెంట్ వెలుపల ఈ నోటిఫికేషన్ను పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, సైబర్ భద్రతా నిపుణులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకు పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కంప్యూటర్లోని ఎవరి సమాచారమైనా, అది ఎలాంటి సమాచారమైన నిఘావేసి, అడ్డుకొని, తస్కరించే అధికారాలు అధికారులకు ఇప్పటికే ఉన్నాయన్న విషయాన్ని మరచిపోతున్నారు. 2000 నాటి సమాచార సాంకేతిక చట్టంలోనే ఈ ప్రత్యేకాధికారాలను సంస్థలు లేదా అధికారులకు కల్పిస్తూ 2008లో అప్పటి యూపీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. నాడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సీపీఎం అప్పుడు మౌనం వహించి ఇప్పుడు గోల చేయడం విడ్డూరమే. సమాచార సాంకేతిక చట్టంలోని 69 (1) సెక్షన్ ప్రకారం ‘దేశ సార్వభౌమా«ధికారానికి లేదా దేశ రక్షణకు లేదా రాష్ట్ర భద్రతకు ముప్పుందని భావించినట్లయితే, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కోసం లేదా పాలనాపరమైన సంబంధాల కోసం అవసరమైతే, ఎలాంటి నేరాన్నైనా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని భావించినట్లయితే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిగల అధికారులు ఎవరి కంప్యూటర్ సమాచారంపైనైనా నిఘా పెట్టవచ్చు. ఆ సమాచారాన్ని మధ్యలోనే అడ్డుకొని, స్వాధీనం చేసుకోవచ్చు. అయితే దర్యాప్తు అధికారులు ఏ కారణంతోని సమాచారాన్ని సేకరిస్తున్నారో మాత్రం లిఖితపూర్వకంగా స్పష్టం చేయాల్సి ఉంటుంది’ అని చెబుతోంది చట్టం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం లేదా? మాటి మాటికి లేదా కేసుబై కేసుకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర హోం మంత్రి అరుణ్ జైట్లీ దేశంలోని ‘ది ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, క్యాబినెట్ సెక్రటేరియట్, జమ్మూ కశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసు కమిషనర్’లకు అధికారాలను కట్టబెట్టారు. ఈ సంస్థలకు చెందిన అధికారులకు సమాచారాన్ని సేకరించడంలో సహకరించడానికి ఎవరు నిరాకరించినా చట్ట ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారన్న హెచ్చరిక కూడా ఉంది. సమాచార సాంకేతిక చట్టంలోనే దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని సేకరించే వెసులుబాటు లేకపోయినట్లయితే నేడు అరుణ్ జైట్లీ జారీ చేసిన నోటిఫికేషనే చెల్లేదికాదు. ఇదంతా తెలిసే కాంగ్రెస్, సీపీఎం పార్టీలు రాద్ధాంతం చేయడం ఎందుకు? నిజంగా ఆ పార్టీలకు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగా ‘వ్యక్తిగత గోప్యత’ భద్రతకు చట్టం తీసుకురావాలి. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది. అప్పుడు దొడ్డి దారిన కూడా వ్యక్తిగత గోప్యతకు ఎవరూ ఎసరు పెట్టలేరు! -
సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: కంప్యూటర్లు వాడే భారతీయులకు షాకింగ్ న్యూస్. మన కంప్యూటర్లలోని ప్రయివేటు మెసేజ్లుకు, ఈమెయిల్స్ ఇక నిఘా నీడలోకి వెళ్లబోతున్నాయి. హోం శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం దేశంలో ప్రతీ ఒక్కరు వాడే కంప్యూటర్ల పై భారత ప్రభుత్వం డేగ కన్ను వేయనుంది. ఈ మేరకు 'సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ' డివిజన్ గురువారం రాత్రి 10 సెంట్రల్ ఏజన్సీలకు అనుమతినిచ్చేశారు హోం శాఖ సెక్రటరీ రాజీవ్ గుబాబా. అంటే అనుమతి లేకుండానే కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడి మొత్తం సమాచారాన్ని పరిశీలించేందుకు,అవసరమైతే అడ్డుకునేందుకు పూర్తి అధికారాన్ని కల్పించిందన్నమాట. ఇందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోతో సహా 10 దర్యాప్తు సంస్థలకు అనుమతి అంశంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. “కంప్యూటర్ లలో ఉన్న సమాచారంతో పాటు సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న సమాచారంపై నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. అవసరమైతే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకుంటాయని కూడా హోంశాఖ తెలిపింది. ఐటీ చట్టం 2000 సెక్షన్ 69 కింద ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, క్యాబినెట్ సెక్రటేరియేట్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, డైరక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్( జమ్ము అండ్ కశ్మీర్, నార్త్ ఈస్ట్, అసోం) , ఢిల్లీ పోలీస్ తదితర సంస్థలు ఉన్నాయి. విచారణ ఎదుర్కొనే వారు దర్యాప్తు సంస్థలకు అన్ని విధాల సహరించాల్సి ఉంటుంది. సహకరించకపోతే 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానాను, ఎదుర్కోవాల్సి ఉంటుంది. మండిపడుతున్న ప్రతిపక్షాలు ప్రభుత్వం చర్యను కాంగ్రెస్, సీసీఎం, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదల్, తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఇది రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులపై దాడి అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ ప్రాథమిక హక్కు అయిన గోప్యతా హక్కుకు వ్యతిరేకం అని విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల తరుణంలో ఇలాంటి ఎత్తుగడలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. Why is every Indian being treated like a criminal? This order by a govt wanting to snoop on every citizen is unconstitutional and in breach of the telephone tapping guidelines, the Privacy Judgement and the Aadhaar judgement. https://t.co/vJXs6aycP0 — Sitaram Yechury (@SitaramYechury) December 21, 2018 The sweeping powers given to central agencies to snoop phone calls and computers without any checks is extremely dangerous. This step is a direct assault on civil liberties in general and fundamental right to privacy of citizens in particular, guaranteed by Indian constitution. — N Chandrababu Naidu (@ncbn) December 21, 2018 India has been under undeclared emergency since May 2014, now in its last couple of months Modi govt is crossing all limits by seeking control of even the citizens computers. Can such curtailment of fundamental rights be tolerated in world's largest democracy? — Arvind Kejriwal (@ArvindKejriwal) December 21, 2018 మరోవైపు ఆయా ఏజెన్సీలకు డాటా ఎన్క్రిప్షన్ అధికారం గతంనుచీ ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమర్ధించుకున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించిన నియమాల ప్రకారమే ఉందని చెప్పుకొచ్చారు. తాము కొత్తగా జారీ చేసిన ఆదేశాలేవీ లేవని, 2009 నుంచే ఇవి ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
మంథనిలో కరెన్సీ కలకలం..
సాక్షి, మంథని: ఎన్నికల వేళ పెద్దపల్లి జిల్లా మంథనిలో ఐటీ శాఖ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. మంథని మండలం గుమునూరు–1 అంగన్వాడీ కేంద్రం టీచర్ వరహాల సత్యభామ మంథని పట్టణంలోని నడివీధిలో నివాసముంటున్నారు. ఈమె ఇంట్లో పెద్దఎత్తున నగదు నిల్వఉన్నట్లు ఐటీశాఖ అధికారులకు ఫిర్యాదు అందడంతో మంగళవారం కరీంనగర్కు చెందిన ఆరుగురు సభ్యుల ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రాత్రి 8.30 వరకు సోదాలు జరిగాయి. దాడిలో రూ.22 లక్షల నగదు దొరికినట్లు సమాచారం. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిసింది. కాగా.. సత్యభామ కుమారుడు సురేందర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఈయనను సైతం అధికారులు విచారించినట్లు తెలిసింది. ఎనిమిది గంటలకుపైగా ఐటీ అధికారులతో పాటు ఎన్నికల నియమావళి డివిజన్ పర్యవేక్షణ కమిటీ దాడులు సమాచారం మంథనిలో దావనంలా వ్యాపించడంతో సత్యభామ ఇంటి వద్ద పెద్దఎత్తున జనం గుమిగూడారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు ఐటీ అధికారులు నిరాకరించారు. తాము సమాచారం చెప్పడానికి లేదని.. తమ ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని చెప్పారు. దాడిలో పాల్గొన్న వారి పేర్లను సైతం చెప్పేందుకు నిరాకరించారు. అంగన్వాడీ టీచర్ వద్ద ఇంత పెద్ద మొత్తం డబ్బు ఎలా నిల్వఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కూడగట్టిన సొమ్ముతో హైదరాబాద్లో గృహం కొనుగోలు చేసేందుకు సమాయత్తమవుతుందని.. డబ్బు ఉన్న సమాచారం ఎవరో గిట్టనివారు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. -
సైబర్ శాడిస్టు బాగోతం వెలుగులోకి..
సాక్షి, విజయవాడ : మహిళలను లక్ష్యంగా చేసుకొని వేదింపులకు గురిచేస్తున్న సైబర్ శాడిస్టు బాగోతం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన ఓ కీచకుడు రుణాలు, స్కాలర్ షిప్లు ఇప్పిస్తానని మహిళలకు మోసపూరిత మాటలు చెప్పి, వారి దగ్గర నుంచి ఫొటోలు, ఫోన్ నంబర్లు సేకరించేవాడు. ఆ తర్వాత ఆ మహిళలు వేశ్యలంటూ వారి సమాచారాన్ని సోషలో మీడియాలో షేర్ చేస్తూండేవాడు. అయితే ఈ కీచకుడి దురాగతాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు నమ్మలేని నిజాలు తెలిసాయి. కోచింగ్ సెంటర్లు, కళాశాలల వద్ద కాపు కాసి వారిని మాయమాటలతో మభ్య పెట్టి పూర్తి సమాచారం తెలుసుకునేవాడు. అలా ఇప్పటివరకు 50 మంది మహిళల వివరాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి నిందితుడి పూర్తి సమాచారం లభించలేదని కానీ ఆ కీచకుడు నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆ సైబర్ శాడిస్టుపై ఐటీ యాక్ట్ 67, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు, ఆ నిందుతుడి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు
చైనీస్ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. మీ వ్యక్తిగత సమాచారాన్ని మీ ఫోనే తీసుకెళ్లి, చైనా చేతుల్లో పెట్టే అవకాశాలున్నాయట. డేటా లీకేజీ, దొంగతనంపై తాజాగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో 21 స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. మొబైల్ ఫోన్ల భద్రత కోసం, కంపెనీలు తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలేమిటో తమకు తెలియజేయాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన కంపెనీల్లో ఎక్కువగా చైనీస్ సంస్థలే ఉన్నాయి. కంపెనీలు అందిస్తున్న భద్రతా భరోసాలో డివైజ్, దాని ఆపరేటింగ్ సిస్టమ్, డివైజ్ బ్రౌజర్, ప్రీ-లోడెడ్ యాప్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్లు లేదా స్మార్ట్ఫోన్ భద్రతా, రక్షణ ఎంతో అవసరమని, విలువైన సమాచారాన్ని యూజర్లు దీనిలో కలిగి ఉంటారని ఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. డిజిటల్ పేమెంట్స్ నుంచి వ్యక్తిగత డేటా వరకు ప్రతిదానికి మొబైల్ను వాడుతున్నారన్నారు. ఒకవేళ అవసరమైన తనిఖీలో, ఆడిట్లో డివైజ్లు కనుక పట్టుబడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. థర్డ్ పార్టీకి డేటా లీకయ్యే విషయంలో తాము అసలు తలొగ్గేది లేదని తెలిపారు. ప్రస్తుతం డేటా పాత్ర చాలా కీలకమని, దాన్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ఉందని అధికారి పేర్కొన్నారు. ఐటీ యాక్ట్, సెక్షన్ 43(ఏ) కింద యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచే బాధ్యత కంపెనీలదేనని కూడా తెలిపారు. నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా కాంటాక్ట్ జాబితాలు, టెక్ట్స్ మెసేజ్లు లీకవుతున్నట్టు కేసులు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. అదేవిధంగా ఈ సమస్య రిమోట్ సర్వర్లలో ఉందన్నారు. భారత్లో చాలా చైనీస్ కంపెనీలు స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నాయని, కానీ వారందరికీ భారత్లో సర్వర్లు లేనట్టు తెలిపారు. మరోవైపు డొక్లామ్ వివాద పరిస్థితుల నేపథ్యంలో స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. -
పసిడిపై భయం వద్దు
ఆభరణాల రూపంలో ఉంటే పరిమితులుండవు కడ్డీలు, బిస్కెట్ల రూపంలో ఉంటేనే పరిమితుల వర్తింపు వారసత్వ బంగారానికి బిల్లుల్లేవనే ఆందోళన అక్కర్లేదు ఐటీ చట్టంలో బంగారంపై ఎలాంటి కొత్త సవరణలూ లేవు ప్రస్తుత నిబంధనలే ఇక ముందూ అమలు.. ‘సాక్షి’తో ఐటీ అధికారులు, కన్సల్టెంట్ల స్పష్టీకరణ సాక్షి, బిజినెస్ విభాగం: రెండు రోజులుగా బంగారంపై పరిమితులకు సంబంధించి వదంతులు షికారు చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ గురువారం దీనిపై ప్రకటన చేశాక కూడా జనంలో ఇంకా కొన్ని సందేహాలు ఉండిపోయాయి. దీనికి తోడు బ్యాంకుల్లో ఉన్న లాకర్లకు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సీల్ వేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. అహ్మదాబాద్లోని ఓ ఎస్బీఐ బ్రాంచిలో ఇలా సీల్ వేశారంటూ ఓ ఫోటో కూడా వాట్సప్లో షేర్ అవుతోంది. ఈ నేపథ్యంలో బంగారంపై వివిధ అంశాలకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘సాక్షి’ బిజినెస్ విభాగం పలువురు ఇన్కంట్యాక్స్ అధికారులు, కన్సల్టెంట్లను సంప్రదించింది. వారు చెప్పిన అంశాల సారాంశం ఒక్కటే. బంగారానికి సంబంధించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. బంగారాన్ని బిస్కెట్లు, కడ్డీల రూపంలో దాచుకున్న వారికి మాత్రమే పరిమితులు వర్తిస్తాయని, నగల రూపంలో ఉంచుకున్న వారికి ఎలాంటి పరిమితులూ వర్తించవని వారు స్పష్టంగా చెప్పారు. ఆ వివరాలివీ.. లాకర్లకు సీల్ వేసేస్తారా? లాకర్లకు సీల్ వేసేస్తున్నారన్నది నిజం కాదు. నిజానికి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సీల్పై.. ఐటీ చట్టంలోని సెక్షన్-132 ప్రకారం లాకర్లకు సీల్ వేస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ వాటిని ఆపరేట్ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. అంటే.. ఆ సెక్షన్ ఇప్పటిది కాదు కదా.. ఎప్పటి నుంచో ఉన్నట్టేగా! ఆ ప్రక్రియ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నదేగా! దీనిపై ఐటీ అధికారులు వివరణ ఇస్తూ.. ‘‘ఐటీ చట్టాన్ని ఉల్లంఘించారని సమాచారం వచ్చినపుడు, మా మార్గాల్లో మేం కనుక్కున్నపుడు పలువురి ఇళ్లలో సోదాలు చేస్తుంటాం. ఆ సోదాల్లో వారి బ్యాంకు లాకర్ల వివరాలు కూడా దొరుకుతాయి. వాటిని ఆయా వ్యక్తుల సమక్షంలోనే తెరిపిస్తాం. అందులో ఉన్న బంగారం, విలువైన వస్తువుల వంటివి ఖాతాల్లో చూపించినవైతే వదిలేస్తాం. లెక్కల్లో చూపించనివి ఉంటే.. తను వాటిని అంగీకరించకపోతే విషయం కోర్టుకు వెళుతుంది. వ్యవహారం కోర్టులో ఉన్నపుడు తదుపరి ఆపరేషన్లు చేయకుండా ఆయా లాకర్లకు సీల్ వేస్తాం. కోర్టు ఉత్తర్వులు వచ్చాక సీల్ తీసేస్తాం. ఇది ఎప్పటి నుంచో సహజంగా జరుగుతున్నదే. సోషల్ మీడియాలో కనిపిస్తున్న నోటీసు అలాంటిదే. దానికి తాజా పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదు..’’ అని వివరించారు. బంగారానికి పరిమితి ఉందా? వ్యవసాయంపై వచ్చిన ఆదాయంతో గానీ, పన్ను చెల్లించిన ఆదాయంతో గానీ కొనుక్కునే బంగారంపై ప్రస్తుతం ఎలాంటి పరిమితులూ లేవు. ఇక ముందు కూడా ఇవే కొనసాగుతారూ.10వేల కోసం వస్తే రూ.2 వేలే ఇచ్చారు ‘‘ఒకటో తారీకొచ్చింది. ఖర్చులు చాలా ఉన్నాయి. నా పింఛన్ రూ.15 వేలు బ్యాంకులో జమ అరూ.10వేల కోసం వస్తే రూ.2 వేలే ఇచ్చారు ఈ డబ్బుతో నా ఖర్చులన్నీ ఎలా తీరుతాయి..’’ంది. అందులోంచి రూ.10 వేలు తీసుకుందామనుకున్నా. కానీ సంగెం ఆంధ్రాబ్యాంకు వస్తే నగదు లేదని చెప్పి రూ.2 వేలే ఇచ్చారు. ఈ డబ్బుతో నా ఖర్చులన్నీ ఎలా తీరుతాయి..’’. కాకపోతే ఐటీ అధికారులు సోదాలు చేసినపుడు ఒక పరిమితికి మించి బంగారం ఉంటే వాటిని లెక్కల్లో చూపనివిగా పరిగణిస్తున్నారు. నగలకు సంబంధించి వివాహిత మహిళ దగ్గరైతే 500 గ్రాముల బంగారం, అవివాహిత మహిళ దగ్గరైతే 250 గ్రాముల బంగారం, మగవారి దగ్గరైతే 100 గ్రాముల బంగారం ఉండొచ్చు. ఎలాంటి బిల్లులూ లేకున్నా.. వారి ఆదాయానికీ, సదరు ఆస్తులకూ సంబంధం లేకున్నా వాటిని పట్టించుకోరు. ఈ విషయంపై రిటైర్డ్ ఐటీ అధికారి, ఐటీ కన్సల్టెంట్ శాంతకుమార్ను సంప్రదించగా.. ‘‘ఈ నిబంధనలన్నీ ఎప్పటి నుంచో ఉన్నారూ.10వేల కోసం వస్తే రూ.2 వేలే ఇచ్చారు ‘‘ఒకటో తారీకొచ్చింది. ఖర్చులు చాలా ఉన్నాయి. నా పింఛన్ రూ.15 వేలు బ్యాంకులో జమ అయింది. అందులోంచి రూ.10 వేలు తీసుకుందామనుకున్నా. కానీ సంగెం ఆంధ్రాబ్యాంకు వస్తే నగదు లేదని చెప్పి రూ.2 వేలే ఇచ్చారు. ఈ డబ్బుతో నా ఖర్చులన్నీ ఎలా తీరుతాయి..’’. బంగారానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎలాంటి నిబంధనలూ తేలేదు. పరిమితుల విషయానికొస్తే.. మీ దగ్గర ఉండే నగలు పూర్వీకుల నుంచి వచ్చినవో, మీరు కొనుక్కున్నవో అయి ఉంటాయి. వాటికి బిల్లులు కూడా పెద్దగా ఉండవని మాకు తెలుసు. అందుకని ఆభరణాల జోలికెపుడూ వెళ్లం. అదే బంగారం గనక బిస్కెట్లు, బార్ల రూపంలో ఉంటే దానికి పరిమితులు వర్తిస్తారుు. పరిమితి దాటితే బిల్లులు చూపించాల్సి ఉంటుంది. నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునే వారు ఎక్కువగా కడ్డీలు, బిస్కెట్లనే ఆశ్రరుుస్తుంటారు..’’ అని వివరించారు. దీన్నిబట్టి చెప్పాలంటే బంగారం ఆభరణాల రూపంలో ఉన్న వారికి ఎలాంటి భయమూ అక్కర్లేదని స్పష్టమవుతోంది. చట్టబద్ధంగా కొంటే ఎంత ఉన్నా ఓకే! బంగారంపై ఎలాంటి కొత్త పన్నును, పరిమితులను ప్రతిపాదించలేదని కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టం చేశాయి. చట్టబద్ధంగా సమకూరినదైతే ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చని, దానిపై పరిమితులేమీ పెట్టబోవడం లేదని పేర్కొన్నాయి. ఈ మేరకు గురువారం ప్రకటనలు విడుదల చేశాయి. వ్యవసాయరంగం లాంటి మినహాయింపున్న రంగం నుంచి వచ్చిన ఆదాయంతో బంగారం కొన్నా కొత్త పన్నేమీ వేయరని స్పష్టం చేశాయి. ఆదా చేసిన డబ్బుతో కొన్నా ఇబ్బందేమీ లేదని.. అయితే ఆదా చేయగలిగేది ఎంత, కొన్నది ఎంతనే దానికి పొంతన ఉండాలని వివరించాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వంచించి..వేధించాడు
సాక్షి, సిటీబ్యూరో: క్లాస్మేట్ అయిన స్నేహితురాలిని వంచించడంతో పాటు బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్న యువకున్ని సీసీఎస్ నేతత్వంలోని 'షీ-టీమ్స్' బుధవారం అరెస్టు చేశాయి. నిందితుడిపై ఐటీ యాక్ట్తో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు సీపీ స్వాతి లక్రా వెల్లడించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన బి.తిలక్ అలియాస్ తిలక్ చౌదరి చెన్నైలోని ఓ సంస్థలో బయో ఇన్ఫర్మాటిక్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం సిటీకి వచ్చి బేగంపేటలో నివసిస్తున్నాడు. కొంతకాలం పాటు జూబ్లీహిల్స్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. తిలక్ క్లాస్మేట్, స్నేహితురాలు అయిన ఓ యువతి ఉద్యోగం కోసం గత ఏడాది జూలైలో సిటీకి వచ్చి మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఆమెతో సన్నిహితంగా మెలిగిన తిలక్ ఆమె నమ్మకం సంపాదించాడు. గత ఏడాది సెప్టెంబర్లో ఓ ముఖ్యవిషయం మాట్లాడాలంటూ గదికి పిలిచాడు. కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి యువతికి ఇచ్చిన తిలక్ ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు నగ్న చిత్రాలను తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచు యువతిని వేధిస్తున్న తిలక్ తన మాట వినకుంటే ఆమె పేరుతోనే ఫేస్బుక్ ఖాతా తెరిచి, అందులో అప్లోడ్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఓ సందర్భంలో తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా ఆ ఫొటోనే పెట్టడంతో పాటు స్నేహితులకూ ఫార్వర్డ్ చేశాడు. ఆమె ఉంటున్న హాస్టల్కు వెళ్ళి దురుసుగా ప్రవర్తించడంతో పాటు వాట్సాప్కు అసభ్య సందేశాలు పంపేవాడు. ఈ వేధింపులు మితిమీరడంతో బాధితురాలు 'షీ-టీమ్స్'కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ల్యాప్టాప్, సెల్ఫోన్, ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు. తిలక్ను కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
IT చట్టంలో 66 సెక్షన్ ఎ చెల్లదు-కోర్టు
-
సీబీఐ దర్యాప్తునకు అనుమతించండి!
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం, హ్యాకింగ్ సహా ఐటీ చట్టంలోని నేరాలకు సంబంధించిన దర్యాప్తుల్లో సీబీఐకి వీలైనంత త్వరగా అనుమతి ఇవ్వాల్సిందిగా సంబంధిత రాష్ట్రాలను సోమవారం కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిపై సిబ్బంది, శిక్షణ విభాగం మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రాష్ట్రాల అనుమతి పొందిన తరువాతే ఆయా రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, బొగ్గు స్కాం, హ్యాకింగ్ తదితర కేసుల అనుమతిని ఇచ్చే విషయంలో రాష్ట్రాలు భిన్న విధాలుగా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా, తమకు మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టులను ప్రారంభించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు కోరుతున్నాయి. విశాఖపట్నంలో సీబీఐ ప్రత్యేక కోర్టు మంజూరైంది. -
గూగుల్ హైదరాబాద్ కార్యాలయంపై కేసు నమోదు!
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ పై ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ ను వారణాసిలో నమోదు చేశారు. మైనర్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ మోబైల్ పోన్లలో సులభంగా ఆశ్లీల సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడంపై గూగుల్ పై కేసు నమోదు చేశారు. గూగుల్ ఇండియా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని మేనేజర్ పై వారణాసి లోని పటేల్ నగర్ కు చెందిన వినీత్ కుమార్ సింగ్ కేసు నమోదు చేశారు. వినియోగదారుల వయస్సు, ఇతర వివరాలతో సంబంధంలేకుండా అశ్లీల సమాచారాన్ని గూగుల్ ప్లే స్టోర అప్లికేషన్ లో ఆండ్రాయిడ్ మోబైల్ ఫోన్లలో అందుబాటులో గూగుల్ సంస్థ ఉంచిందని పిటిషన్ వినీత్ పేర్కోన్నారు. గూగుల్ సరియైన చర్యలు తీసుకోకపోవడం వలన పిల్లలు అశ్లీల సమాచారానికి చాలా సులభంగా ఆకర్షింపబడుతున్నారనే పిటిషన్ లో తెలిపారని పోలీసు అధికారులు తెలిపారు.