Javed Akhtar
-
మందు తాగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు: సినీరచయిత
మందుకు బానిసగా మారి తన జీవితంలో పదేళ్లు వృథా చేసుకున్నానంటున్నాడు సినీరచయిత జావేద్ అక్తర్. ఒకప్పుడు తాగుడుకు బానిసైన ఈయన తర్వాత ఆల్కహాల్ మానేశాడు. తాజాగా అతడు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అదేంటో గానీ తాగితే నేను నేనులా ఉండను. ఈ మందు బాటిల్స్లో ఏం కలుపుతారో కానీ అది తాగగానే కోపంగా మారిపోతాను. నాలో మృగం బయటకు..అంత కోపంతో నేనెప్పుడూ ఊగిపోను. కానీ తాగినప్పుడు మాత్రం నాకు తెలీకుండానే ప్రమాదకరంగా మారిపోతాను. నాలోని ఓ రాక్షసుడు బయటకు వస్తాడు. మందు మానేయడం నేను చేసిన మంచిపనుల్లో ఒకటి. 1991 జూలై 31న చివరిసారిగా తాగాను. అప్పటినుంచి ఇప్పటివరకు దాని జోలికే వెళ్లలేదు. కానీ యుక్తవయసులో మందుకు బానిసవ్వకుండా ఉండాల్సింది. మద్యపానానికి అలవాటు పడి నా జీవితంలో దశాబ్దకాలం వృథా చేసుకున్నాను.సమయం వృథా చేసుకున్నాఫ్రెంచ్, పర్షియన్ వంటి భాష నేర్చుకోవడమో, సంగీతం నేర్చుకోవడమో.. ఇలా ఏవైనా కొత్తగా ప్రయత్నించాల్సింది. కానీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈయన చివరగా గతేడాది వచ్చిన ద ఆర్చీస్, డుంకీ, కో గయే హమ్ కహాన్ వంటి చిత్రాలకు పాటరచయితగా పని చేశాడు.చదవండి: 70కి పైగా ఆడిషన్స్.. కాంప్రమైజ్ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్ -
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న జంట నిండు నూరేళ్లు కలిసి కాపురం చేయడం గగనమైపోయింది. చాలామంది రెండు మూడేళ్లకే మాకొద్దీ భాగస్వామి అని విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరేమో లేటు వయసులోనూ విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్లో 40 ఏళ్లుగా ఏ చీకూచింతా లేకుండా అన్యోన్యంగా కలిసి కొనసాగుతున్నారు అలనాటి హీరోయిన్ షబానా అజ్మీ- గేయ రచయిత జావెద్ అక్తర్.సీక్రెట్ అదే!తాజాగా నటి షబానా తమ వైవాహిక బంధం ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించింది. 'మేమిద్దరం ఎవరి పనిలో వాళ్లం బిజీగా ఉంటాం. దీనివల్ల మేము తరచుగా కలుసుకోలేము. అందుకే మా వైవాహిక బంధం సక్సెస్ఫుల్ సాగుతుందని జావెద్ అంటుంటాడు. ఆయన తండ్రి, మా నాన్న ఇద్దరూ కూడా ఉత్తరప్రదేశ్కు చెందిన కవులు, కమ్యూనిస్టులే! మా పేరెంట్స్ లాగే మా ఇద్దరి ఆలోచనలు కూడా చాలా విషయాల్లో ఒకే విధంగా ఉంటాయి.మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్సంతోషకరమైన విషయం ఏంటంటే.. మా బంధం అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉంది. చెప్పాలంటే ఇంకా ధృడంగా తయారైంది. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తాడు.. షబానా నా బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి వల్ల ఆ బంధమైతే మారలేదనేవాడు!' అని చెప్పుకొచ్చింది. కాగా జావెద్ అక్తర్ గతంలో హనీ ఇరానీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జోయా, ఫర్హాన్ అని ఇద్దరు పిల్లలు సంతానం. హనీతో విడిపోయిన అనంతరం జావెద్ 1984లో షబానాను పెళ్లాడాడు.చదవండి: భయపెట్టేందుకు రెడీ అయిన సూపర్ హిట్ హారర్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే? -
మందుకు బానిసయ్యా.. లేకుంటే కథ వేరేలా ఉండేది!
ప్రముఖ కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత జావెద్ అక్తర్.. తన మాజీ భార్య హనీ ఇరానీ ఇప్పటికీ మంచి స్నేహితులు. విడాకులు తీసుకున్నంతమాత్రాన తాము శత్రువులుగా మారిపోలేదని, తనంటే ఇప్పటికీ ఎంతో గౌరవం అంటున్నాడు జావెద్. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను హుందాగా, తెలివిగా వ్యవహరించి ఉంటే మా కథ వేరేలా ఉండది. కానీ ఈ వ్యసనమే (మందు తాగే అలవాటు) మా రిలేషన్ను ముక్కలు చేసింది. కూతురు జోయా, కుమారుడు ఫర్హాన్ అక్తర్లతో హనీ పదేళ్లు భరించింది.. ఈ తాగుడు వల్లే ఆమె చాలా అద్భుతమైన మనిషి. ఎంతో మంచి వ్యక్తి. తనపై నాకు ఇప్పటికీ అంతే గౌరవం ఉంది.. అది ఎప్పటికీ ఉంటుంది. అందుకే మేము ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగుతున్నాము. మేము పెళ్లి చేసుకున్నా మొదటి పదేళ్లు నన్ను ఎలాగోలా భరించింది. కానీ తనకూ అనిపిస్తుంది కదా.. ఇలాంటి తాగుబోతు భర్తగా దొరికాడేంటి? అని! ఒకానొక రోజు మందు మానేద్దామని డిసైడయ్యాను. అప్పటినుంచి మళ్లీ దాని జోలికే పోలేదు' అని చెప్పుకొచ్చాడు. రెండో పెళ్లి కాగా జావెద్- హనీ 1972లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ అని ఇద్దరు పిల్లలు సంతానం. 1985లో జావెద్ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు మంజూరవడానికి ముందే అతడు తన క్లోజ్ ఫ్రెండ్, నటి షబానా అజ్మీని పెళ్లాడాడు. ప్రస్తుతం ఇతడు లాహోర్ 1947 సినిమాకు పాటలు రాస్తున్నాడు. చదవండి: రెండు ఓటీటీల్లో హనుమాన్.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో! -
సిగ్గుండాలి అంటూ సందీప్ రెడ్డి వంగాపై విరుచుకుపడిన స్టార్ రైటర్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ మరోసారి కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను గతంలో తప్పుబట్టిన జావేద్కు సందీప్ రెడ్డి వంగా కూడా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అక్తర్ కుమారుడు ఫర్హాన్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ను తెరపైకి తీసుకొచ్చి సందీప్ కూడా కడిగిపారేశారు. అంతా సద్దుమనిగింది అనుకుంటే తాజాగా మళ్లీ జావేద్ అక్తర్ ఇదే అంశంపై రియాక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగాపై ఆయన పలు కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని తీసిన డైరెక్టర్ను తాను ఏమీ అనలేదని జావేద్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు. అది రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కు అని.. అయితే ప్రేక్షకుల గురించే తనకు ఆందోళన అని అక్తర్ పేర్కొన్నారు. 'నేను ఫిల్మ్ మేకర్ను ఏమాత్రం నిందించలేదు. ప్రజాస్వామ్య సమాజంలో ఒక యానిమల్ చిత్రమే కాదు.. అలాంటివి ఎన్నో సినిమాలు తీసే హక్కు అతనికి ఉంది. కానీ నా ఆందోళనంతా ప్రేక్షకుల గురించి మాత్రమే.. ఈ సమాజంలో పరిమితి మేరకు ఎలాంటి సినిమా అయినా చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను యానిమల్ చిత్రాన్ని చూడలేదు. కొందరు మిత్రులు షేర్ చేసిన దానిని బట్టి యానిమల్ చిత్రంపై కామెంట్లు చేశాను.' అని జావేద్ అన్నారు. 'నా వ్యాఖ్యలకు సందీప్ రెడ్డి కూడా స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటలో కూడా ఆయన అసభ్యత, తప్పును కనిపెట్టలేకపోయారు. ఇక చేసేది ఏమీ లేకపోవడంతో నా కుమారుడి ఆఫీస్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ను పట్టుకున్నారు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. కేవలం అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ నుంచి చాలా సిరీస్లు వచ్చాయి. అందులో ఇదీ ఒకటి. దాన్నే అతడు పట్టుకున్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పు కూడా వెతకలేకపోయావా.. చేసేది ఏమీ లేక నా కుమారుడి దగ్గరకు పోయావా సందీప్.. ఇదీ సిగ్గుచేటు.' అని జావెద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. గతంలో జావేద్ అక్తర్పై సందీప్ చేసిన కామెంట్లు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా మీ కుమారుడు ఫర్హాన్ అక్తర్కు ఇవ్వాలి. మీ కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. -
బాలీవుడ్లో సందీప్ వంగా కాంట్రవర్సీ.. వాళ్లందరికీ ఒకేసారి కౌంటర్స్
రణ్బీర్ కపూర్ - సందీప్ వంగా కాంబినేషన్లో వచ్చిన 'యానిమల్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 900 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఈ చిత్రంపై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతో సందీప్ కూడా వారికి పలు ఇంటర్వ్యూలలో రివర్స్ ఎటాక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో సందీప్ వంగా పేరు హాట్ టాపిక్గా మారిపోయింది. మీ కుమారుడి 'మీర్జాపుర్' కోసం సలహాలు ఇవ్వండి యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా ఆయన కుమారుడు జావేద్ కుమార్ ఫర్హాన్ అక్తర్కు ఇవ్వాలి. ఆయన కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. నీకు సరిపోయే పాత్ర ఉంటే ఇస్తా.. కంగనాకు కౌంటర్ బాలీవుడ్ హీరోయిన్ కంగనా కూడా యానిమల్ సినిమాపై విమర్శలు చేసింది. 'మహిళలను శృంగార వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే హీరో చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు. మహిళా సాధికారత చిత్రాలను చేస్తున్న తనకు ఇది తీవ్రంగా నిరుత్సాహపరిచిందని ఆమె అన్నారు. దీంతో కంగనాపై కూడా సందీప్ రియాక్ట్ అయ్యాడు. 'కంగనా ఎలాంటి రివ్యూ ఇచ్చినా ఇబ్బంది లేదు. విమర్శించినా తప్పులేదు. నేను తీసే చిత్రాల్లో ఆమెకు సరిపోయే పాత్ర ఉంటే కచ్చితంగా స్టోరీ చెబుతాను.' అని సందీప్ అన్నారు. దీనిపై కంగనా కూడా మళ్లీ ఘాటుగానే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సినిమాను సమీక్షించడానికి, విమర్శించడానికి ఎంతో తేడా ఉంది. ముందుగా అది తెలుసుకోండి 'యానిమల్'పై నా రివ్యూ గురించి మీరు నవ్వుతూ మాట్లాడారు. ఇక్కడ అర్థం అవుతుంది నాపై ఉన్న గౌరవం ఏంటో అని. కానీ, మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్లు అవుతారు జాగ్రత్త. అది మీకే డేంజర్ కావచ్చు. కానీ సినీ ఇండస్ట్రీకి మీరు కావాలి, ఉండాలి' అంటూ కంగనా వ్యంగ్యంగానే సమాధానం ఇచ్చింది. నేను సందీప్ గురించి కామెంట్ చేయలేదు: ఆమిర్ ఖాన్ మాజీ భార్య యానిమల్ చిత్రంపై పరోక్షంగా బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అన్నారు. అందుకు సందీప్ కూడా ముందుగా తన భర్త నటించిన దిల్ సినిమా చూడాలని వ్యాఖ్యానించాడు. దీంతో ఆమె మళ్లీ ఇలా రియాక్ట్ అయింది. 'నేను ప్రత్యేకంగా సందీప్ వంగా సినిమాల గురించి కామెంట్ చేయలేదు. కొన్ని చిత్రాల్లో స్త్రీలను అగౌవపరిచేలా సీన్స్ షూట్ చేస్తున్నారని అన్నాను. ఇదే విషయం గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. మరి ఆయన్నే నేను అన్నట్లు ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు.' అని ఆమె వ్యాఖ్యానించారు. -
యానిమల్ వివాదం.. రచయితకు గడ్డి పెట్టిన మేకర్స్!
రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేర్ చేసింది. దాదాపు రూ.800 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో.. అంతేస్థాయిలో విమర్శలకు గురైంది. ఆర్జీవీ లాంటి సంచలన డైరెక్టర్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు మాత్రం సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూపేలా ఉందంటూ పలువురు మండిపడ్డారు. త తాజాగా యానిమల్ చిత్రంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను ఆయన తప్పుబట్టారు. ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ ఆ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై యానిమల్ చిత్రబృందం స్పందించింది. జావేద్ అక్తర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్లో రాస్తూ..'జోయా, రణ్వీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోలేకపోతే.. మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక స్త్రీని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అని అనవచ్చు. అప్పుడు మీరు దానిని స్త్రీవాదం అనే పేరుతో గొప్పగా చెప్పుకుంటారు. లింగ భేదమనే రాజకీయాల్లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసి.. అతనికి అబద్ధం చెప్పింది. అందుకే ప్రియుడు షూ నాకమని అన్నాడు' అంటూ రిప్లై ఇచ్చింది. అయితే యానిమల్ చిత్రంలో త్రిప్తి డిమ్రీని ఉద్దేశించి.. రణ్బీర్ కపూర్ ఈ విధంగా డైలాగ్ చెప్పారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరొక సీన్లో హీరోయిన్పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్రెడ్డి వంగానే. Writer of your calibre cannot understand the betrayal of a lover (Between Zoya & Ranvijay) then all your art form is big FALSE 🙃 & If a woman (betrayed and fooled by a man in the name of love) would have said "lick my shoe" then you guys would have celebrated it by calling it… — Animal The Film (@AnimalTheFilm) January 7, 2024 -
యానిమల్లో ఆ సీన్ను తప్పుబట్టిన ప్రముఖ రచయిత
రణబీర్ కపూర్ నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ వంటి సినిమాల విజయంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను జావేద్ నిందించారు. భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్ చేశారు. ఔరంగాబాద్లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన ప్రసంగంలో ప్రస్తుత చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన యానిమల్ చిత్రం గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. తాజాగా వచ్చిన ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యమనది కాదని ఆయన చెప్పారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరోక సీన్లో హీరోయిన్పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్రెడ్డి వంగా. పరోక్షంగా సందీప్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా జావేద్ ఇలాంటే వ్యాఖ్యలే చేశారు. ఆనంద్ బక్షి రాసిన సాహిత్యంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలే చేశారు. 90ల నాటి చిత్రం ఖల్ నాయక్ నుంచి 'చోలీ కే పీచే' పాట భారీ విజయాన్ని అందుకుంది. ఆ పాట లిరిక్స్తో పాటు అందులో మగవారి వస్త్రధారణ కూడా మహిళల మాదిరి ఉండటం ఆయన తప్పుబట్టారు. కానీ ప్రేక్షకుల అఖండ మద్దతుతో ఇలాంటివి మరిన్నీ వస్తున్నాయిని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలి అనే విషయంలో కూడా బాధ్యత వహించాలి.. ఇలాంటి వాటిని మెచ్చుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్రాలే ఎక్కువ వస్తాయి. ఇప్పటికైనా ఇటువంటి చిత్రాలకు దూరంగా ఉండాలని జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
హిందువులు సహనశీలురు
ముంబై: ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్(78) హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతంత్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ్లో ఆయన పాల్గొన్నారు. ‘హిందువులు దయామయులు. విశాల హృదయులు. అసహనం కలిగిన కొందరున్నారు. హిందువులు వారిలా ఉండరు. హిందువులకు మాత్రమే దయ, విశాల హృదయం అనే గొప్ప లక్షణాలుంటాయి. వాటిని కోల్పోవద్దు. లేకుంటే మిగతా వారికీ మీకూ బేధం ఉండదు. హిందువుల జీవన విధానం నుంచి మేం నేర్చుకున్నాం. వాటిని మీరు వదులుకుంటారా?’అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయన.. ‘శ్రీరాముడు, సీతాదేవిల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను నాస్తికుడినే అయితే రాముడిని, సీతను ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం’అంటూ జై సియా రాం అని నినదించారు. ‘ఇది హిందూ సంస్కృతి, నాగరికత. మనకు ప్రజాస్వామ్య దృక్పథాలను నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మనమే ఒప్పు, అందరిదీ తప్పు అని భావించడం హిందువుల సిద్ధాంతం కాదు. ఇది మీకు ఎవరు నేర్పించినా తప్పే’అని అన్నారు. అయితే, దేశంలో నేడు వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
రచన ఏదైనా ప్రశ్నించడమే లక్ష్యం!
జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రక టిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. గ్వాలియర్లో పుట్టిన జావేద్ లక్నో అలీగఢ్, భోపాల్లలో ఎదిగారు. బాంబే చేరిన తర్వాత ఆయన పరిధి బాగా విస్తారమయింది. జావేద్ తన మిత్రుడు సలీం ఖాన్తో కలిసి రాసిన స్క్రీన్ ప్లేలు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. దాంతో వారికి మొట్ట మొదటి విజయ వంతమయిన సినిమా రాసే అవకాశం వచ్చింది. ‘హాథీ మేరె సాథీ’. అది సూపర్ హిట్ కావడంతో ఆ జంట హిందీ సినీ రంగంలో హాట్ కేక్గా మారింది. ‘సీతా ఔర్ గీతా’ చిత్రానికి పనిచేసే సమయంలో జావేద్కు ‘హనీ ఇరానీ’తో అయిన పరిచయం పెళ్లిదాకా వెళ్ళింది. వారిద్దరికీ జోయా, ఫర్హాన్లు జన్మించారు. 1979లో తన మొదటి కవిత రాశారు జావేద్. ఇంచుమించు అదే కాలంలో ‘షబానా ఆజ్మీ’తో పరిచయం సాన్నిహిత్యంగా మారింది. 1995లో ఆయన మొట్ట మొదటి కవితా సంకలనం ‘తర్కశ్’ వెలువడింది. మొదటి సంకలనమే కవిత్వాభిమా నుల నుంచీ, విమర్శకుల నుంచీ ప్రశంసను అందు కుంది. అంతేకాదు మన దేశంలో మొదటి ఆడియో బుక్గా కూడా ప్రాచుర్యం పొందింది. 1983లో హనీ ఇరానీ, జావేద్ విడిపోయారు. కానీ స్నేహంగానే ఉన్నారు. సలీం–జావేద్ జంటగా ‘అందాజ్’, ‘యాదోంకీ బారాత్’, ‘జంజీర్’, ‘దీవార్’, ‘షోలే’, ‘డాన్’, ‘త్రిశూల్’ లాంటి సూపర్ డూపర్ హిట్ సిని మాలకు స్క్రిప్టు రాశారు. వాళ్ళు రాసిన 24 సినిమా స్క్రిప్టుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆ జంట విడి పోయింది. 1981లో సలీం, జావేద్ల జంట విడి పోయాక జావేద్ అఖ్తర్ చాలా సినిమాలకు స్క్రిప్ట్ రచన చేశారు. వాటిల్లో ‘సాగర్’, ‘మిస్టర్ ఇండియా’, ‘బెతాబ్’, ‘లక్ష్య’ లాంటి విజయవంత మయిన సినిమాలు ఉన్నాయి. తర్వాత జావేద్ అఖ్తర్ ఫిలిం గీతాలవైపు కదిలారు. అలాగే గొప్ప కవితలూ రాశారు. ఆయన రాసిన కవితలు, గజల్స్ సూటిగా మనసుకు హత్తు కుంటాయి. ‘లావా’ కవితా సంపుటి 2012లో వెలువడింది. దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ‘ఇన్ ఆదర్ వర్డ్స్.’ అందులో ఆయన కాలాన్ని గురించి.. కాలమంటే ఏమిటి, /అలుపూ విరామమూ లేకుండా /సాగిపోతున్నది /అదట్లా ప్రయాణించ కుండా ఉండి వుంటే అదెక్కడుండేది / ఎక్కడో ఒక చోట ఉండేది కదా... అంటూ గొప్ప తాత్వికతతో రాశారు. ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మ నుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల నుండి పెల్లుబుకుతుంది. వర్తమాన అవ్యవస్థ గురించి తనకోపమూ, తన తాత్వికత, వేదన, దుఃఖం, ప్రశ్న–జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించారు. ఇందులో వర్తమాన మత ఛాందసవాదం గురించి ఖండిస్తూ రాశారు, మాట్లా డారు. ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి, కాపీ రైట్ చట్టం గురించీ పోరాడి సాధించారు. ప్రశ్నించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించారు. వ్యాసకర్త సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత (జావేద్ అఖ్తర్కు నేడు సినారె పురస్కార ప్రదానం) -
Javed Akhtar: పాక్ గడ్డపై స్పీచ్తో సర్జికల్ స్ట్రైక్
ప్రముఖ సినీ గేయ రచయిత, ఉర్దూ కవి జావేద్ అక్తర్.. తాజాగా పాకిస్తాన్ గడ్డపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. ముంబై 26/11 దాడులకు కారకులైన ఉగ్రవాదులు ఇప్పటికీ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ఈ పరిణామం భారతీయుల గుండెల్లో చేదు నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. దిగ్గజ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ సంస్మరణార్థం కిందటి వారం లాహోర్(పాక్)లో ఓ కార్యక్రమం జరిగింది. దానికి జావేద్ అక్తర్ హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడున్న ఆడియొన్స్లో కొందరు ఆయనకు పలు ప్రశ్నలకు సంధించారు. మీరు పాకిస్తాన్కు ఎన్నోసార్లు వచ్చారు. మరి మీకు వెనక్కి వెళ్లాక.. మీ ప్రజలకు పాక్ వాళ్లు మంచోళ్లు అని, బాంబులు పేల్చే రకం మాత్రమే కాదు.. పూలమాలతో ప్రేమను కూడా కురిపిస్తారని అక్కడి ప్రజలకు మీరు ఎప్పుడైనా చెప్పారా? అని జావేద్ను ప్రశ్నించారు. దానికి ఆయన.. ఇక్కడి ఎవరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు.ఇరు దేశాల ప్రజల ద్వేషం దేనిని పరిష్కరించదు. ఇక్కడ ఇరు దేశాల మధ్య వాతావరణం ఉత్కంఠభరితంగా మాత్రమే ఉంది. ముంబై ప్రజలమైన మేం.. ఉగ్రవాద దాడులను కళ్లారా చూశాం. దాడికి పాల్పడ్డవాళ్లు ఎక్కడో నార్వే నుంచో, ఈజిప్ట్ నుంచో రాలేదు. వాళ్లు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటప్పుడు భారతీయుల కోపానికి అర్థం ఉంది. దానిపై మీరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు అని కుండబద్ధలు కొట్టారాయన. वाह! शानदार @Javedakhtarjadu बहुत खूब... 👏🙌👏#JavedAkhtarInPakistan pic.twitter.com/snbXKCKmGf — Dr. Syed Rizwan Ahmed (@Dr_RizwanAhmed) February 21, 2023 అంతేకాదు.. పాక్ దిగ్గజాలకు భారతదేశం ఆతిథ్యమిచ్చిన రీతిలో భారతీయ కళాకారులకు పాకిస్తాన్లో స్వాగతం లభించలేదని ఆయన ఎత్తిచూపారు. ఉదాహరణకు.. ఫైజ్ సాబ్ భారత్కు వచ్చినప్పుడు ఆయన్ని ప్రముఖ సందర్శకుడిగా భావించింది భారత్. అదంతా అంతటా ప్రసారం అయ్యింది కూడా. అలాగే భారత్లో నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్, మెహ్దీ హాసన్లకు గౌరవ సూచికంగా పెద్ద ఎత్తున్న వేడుకలను అక్కడ(భారత్) నిర్వహించాం. మరి మీరు(పాక్) లతా మంగేష్కర్ కోసం ఏదైనా వేడుక నిర్వహించగలిగారా? అని నిలదీయడంతో.. అక్కడున్నవాళ్లంతా చప్పళ్లు చరిచారు. Jab main Javed saab ki poetry sunti hoon toh lagta tha yeh kaise Maa Swarsati ji ki in pe itni kripa hai, lekin dekho kuch toh sachchai hoti hai insaan mein tabhi toh khudai hoti hai unke saath mein … Jai Hind @Javedakhtarjadu saab… 🇮🇳 Ghar mein ghuss ke maara .. ha ha 🇮🇳🇮🇳 https://t.co/1di4xtt6QF — Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023 జావేద్ అక్తర్ పాక్ ప్రసంగం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై చాలామంది అభినందనలు కురిపిస్తున్నారు. ఇక జావేద్ అక్తర్ వ్యాఖ్యలు మాటల తుటాలని.. పాక్ గడ్డపై ఆయన చేసిన సర్జికల్ స్ట్రైక్స్గా అభివర్ణిస్తున్నారు. ఇక జావేద్పై ప్రశంసలు గుప్పించిన వాళ్లలో ప్రముఖ నటి కంగనా రౌత్ కూడా ఉన్నారు. -
కథలన్నీ సలీమ్వి... సంభాషణలు నావి
(జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి): బాలీవుడ్ స్టార్ రచయితలు సలీమ్ జావేద్ విడిపోయి ఇంతకాలం అయినా వారు ఇరువురూ ఏనాడూ తాము పని విభజన ఎలా చేసుకున్నారో చెప్పలేదు. ఎన్ని ఇంటర్వ్యూలలో ఆ ప్రశ్న వేసినా సమాధానం దాట వేసేవారు. కాని జైపూర్లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో శుక్రవారం తన పుస్తకం ‘టాకింగ్ లైఫ్’ విడుదల సందర్భంగా జావేద్ మాట్లాడుతూ ‘మేమిద్దరం (సలీం జావేద్) రాసిన సినిమాలన్నింటిలో ప్రతి కథా సలీం నుంచి వచ్చేది. సంభాషణలు నేను రాసేవాణ్ణి. స్క్రీన్ ప్లే ఇద్దరం సమకూర్చేవాళ్లం’ అని తేటతెల్లం చేశాడు. ఈ ఇద్దరి జంట రచనలో జంజీర్, యాదోంకి బారాత్, డాన్, షోలే, దీవార్, శక్తి వంటి సూపర్హిట్ బాలీవుడ్ సినిమాలు రూపుదిద్దుకున్నాయి. రచయితలకు సినిమా రంగంలో స్టార్డమ్ తెచ్చిన జోడి వీరు. ‘మేమిద్దరం అనుకోకుండా కలిశాం. దర్శకుడు రమేష్ సిప్పి వాళ్ల నాన్న దగ్గర నెలకు 750 రూపాయల జీతానికి చేరాం. రాజేష్ ఖన్నా హీరోగా అందాజ్, హాతీ మేరి సాథి రాయడంతో స్థిరపడ్డాం’ అన్నాడాయన. బాలీవుడ్లో యాంగ్రీ యంగ్మేన్ ఇమేజ్ను హీరోకు సృష్టించిన ఈ జంట అనిల్ కపూర్ హీరోగా ‘మిస్టర్ ఇండియా’ (1987) రాశాక విడిపోయారు. (క్లిక్ చేయండి: అవకాశాలు ఇప్పిస్తాం, కోరికలు తీర్చమని అడిగారు) -
Kangana Ranaut: ముంబై కోర్టుకు కంగన
ముంబై: బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్(76) వేసిన పరువు నష్టం కేసులో నటి కంగనా రనౌత్ సోమవారం అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరయ్యారు. కంగన నిర్దోషి అని ఆమె తరఫు లాయర్ పేర్కొన్నారు. మీడియా జోక్యం వద్దంటూ కంగన చేసిన వినతి మేరకు విచారణ సమయంలో లాయర్లు, మీడియా సిబ్బందిని బయటకు వెళ్లాలని మేజిస్ట్రేట్ ఆర్ఎన్ షేక్ విచారణ ఆదేశించారు. అనంతరం, ఇరు పక్షాల లాయర్ల సమక్షంలో కంగన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఓ టీవీ షోలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి జావెద్ అక్తర్ తదితరుల కోటరీయే కారణమంటూ కంగనా చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిందని కోర్టులో ఫిర్యాదు చేశారు. అనంతరం కంగన అదే కోర్టులో.. ఇంటికి పిలిపించుకుని తనపై దౌర్జన్యానికి పాల్పడి, బెదిరించారంటూ జావెద్ అక్తర్పై ఫిర్యాదు చేశారు. చదవండి: (బింబిసార.. అందమైన చందమామ కథ) -
'కంగనా సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఆమె ఓ కేసులో నిందితురాలు'
Kangana Ranaut Permanent Exemption Appeal Rejected In Javed Akhtar Case: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె పలు విమర్శలపాలైంది. కంగనా మాట ధోరణి చూసి ఆమెకు అభిమానులు అయిన వారు కూడా లేకపోలేదు. అయితే తాజాగా కంగనాకు ముంబై కోర్టులో చుక్కెదురైంది. బీటౌన్ ఫైర్బ్రాండ్పై ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ పరువు నష్టం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు హాజరు నుంచి 'శాశ్వత మినహాయింపు' కోసం దరఖాస్తు పెట్టుకుంది. కంగనా పెట్టుకున్న ఆ దరఖాస్తును ముంబై కోర్టు తిరస్కరించింది. చదవండి: కోట్లలో ఆస్తులున్న కంగనా రనౌత్.. వాటి విలువ ఎంతంటే? బాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోయిన్లలో తాను ఒకరినని, వృత్తిపరంగా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటూ వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కంగనా అభ్యర్థించింది. 'కంగనా వృత్తిపరంగా చాలా బిజీగా ఉండొచ్చు.. కానీ, ఆమె ఒక కేసులో నిందితురాలు. ఆ విషయాన్ని ఆమె మర్చిపోవద్దు.' అని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ స్పష్టం చేశారు. కేసు విచారణకు కంగనా సహకరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తనకు ఇష్టం వచ్చిన పద్దతిలో కంగనా వ్యవహరిస్తోందని కోర్టు తెలిపింది. చదవండి: మీరు చాలా హాట్గా ఉన్నారు.. మాకు కోచింగ్ ఇవ్వండి: కంటెస్టెంట్తో కంగనా ఆమె సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఒక నిందితురాలిగా కోర్టు నిబంధనలు పాటించక తప్పదని వెల్లడించింది. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరడం హక్కు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని కోర్టు సూచించింది. బెయిల్ బాండ్ కోసం చట్టపరంగా ఉన్న నియమనిబంధనలను పాటించాలని ఆదేశించింది. నవంబర్ 2020లో ఓ ఇంటర్వ్యూలో కంగనా తనపై అనుచితి వ్యాఖ్యలు చేసిందని జావేద్ అక్తర్ పరువునష్టం దావా వేశారు. చదవండి: కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు: కంగనా -
కోర్టుపై నమ్మకం పోయింది: కంగనా రనౌత్
ముంబై: బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని, లేదంటే వారెంట్లు పంపుతానంటూ కోర్టు పరోక్షంగా బెదిరిస్తోందని, కోర్టుపై నమ్మకం పోయిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు హృతిక్ రోషన్, ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్లను పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది’ అని కంగన అన్నారు. దీంతో కంగనపై జావెద్ అక్తర్ గతంలో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో తమ ముందు హాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. దీంతో ఎట్టకేలకు సోమవారం కంగన కోర్టుకొచ్చారు. బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిందే, లేదంటే వారెంట్ జారీచేస్తామని కోర్టు రెండుసార్లు పరోక్షంగా బెదిరించిందని ఆమె వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తు తమకు వ్యతిరేకంగా సాగుతోందని, వేరే కోర్టుకు కేసును బదలాయించాలని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఆమె సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు అక్టోబర్ ఒకటిన విచారించనుంది. -
Shabana Azmi Birthday: పెద్దగా కోరికలేవీ లేవు..కానీ ఇంకా కావాలి!!
-
Shabana Azmi birthday special: వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పీస్
సాక్షి, హైదరాబాద్: వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. ముందుతరం నటీ నటులకు ఆమె ఒక నిఘంటువు. ఒక చిన్న ముఖ కవళిక, అంతకుమించిన విషాదపు విరుపు, కంటినుంచి జారీ జారని నీటి చుక్క.. ఒకపంటి మెరుపు ఇవి చాలు నటనకు అని చాటిచెప్పిన గొప్ప నటి షబానా అజ్మీ. ఏకకాలంలో 12 చిత్రాలలో పని చేసిన ఘనత ఆమె సొంతం. మన హైదరాబాదీ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ షూటింగ్ సమయంలో గంటల తరబడి వేచి చూడటం అంటే తనకు ఎపుడూ ఇబ్బంది కాలేదనీ ఎందుకంటే నిర్మాతలకు మనం ఒక ఎసెట్గా ఉండాలి తప్ప, భారంగా ఉండకూడదనేది తల్లి ఫౌకత్నుంచినేర్చుకున్న గొప్పపాఠం అంటారామె. తానొక గొప్పనటిగా చెప్పుకోను, సరైన సమయంలో సరైన అవకాశాలు దొరకడం తన అదృష్టం. ఈ ఘనత అంతా తనకు లభించిన చక్కటి శిక్షణ, స్క్రిప్ట్, గొప్ప దర్శకులకే దక్కుతుందన్నారు. సినిమా అనేది సంయుక్త కృషి అసలు సినిమా కథకు మించి ఏ యాక్టర్ ఎదగలేడంటూ స్క్రిప్ట్కు పెద్ద పీట వేశారామె. అలాగే సద్విమర్శలను జాగ్రత్తగా గమనించడంతోపాటు తనన పనిని తాను నిజాయితీగా అంచనా వేసుకుంటానంటారు షబానా. సాధించినదానికి పొంగిపోకుండా ఉండాలని ఎప్పటికే భావిస్తున్నాను ఎందుకుంటే నటన అంటే ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడమే అంటారు. యువతకు స్వేచ్ఛ నివ్వాలని, వారి అభిపప్రాయాలను గౌరవించాలంటారు. తమ తల్లిదండ్రులు తనకు, తనసోదరుడు బాబా (సినిమాటోగ్రాఫర్, బాబా అజ్మీ) అలాగే పెరిగామని, అడగకుండా ఎపుడూ ఎలాంటి సలహా ఇవ్వలేదని ఇపుడు తానూ అదేఆచరిస్తున్నానన్నారు. యువత నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని తానునమ్ముతానన్నారు. సైకాలజీని అవపోసన పట్టిన షబానా పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడం ఈజీ అయింది. బార్బరా స్ట్రీసాండ్ ఏ స్టార్ ఈజ్ బోర్న్లో చెప్పినట్లుగా నాకు పెద్దగా కోరికలు లేవు....కానీ ఇంకా చాలా కావాలి. పాడతా.. అన్నీ కావాలి..భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ను సాగిస్తున్న షబానా అజ్మీ తొలి వెబ్ సిరీస్ ‘ది ఎంపైర్’ ఓటీటీలో సందడి చేస్తోంది. -
కంగనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కోర్టు
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్కు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్ అఖ్తర్ వేసిన డిఫమేషన్ కేసులో గైర్హాజరు కావడంపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తంచేసిన కోర్టు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెస్ట్ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20 కి వాయిదా వేసారు. చదవండి : Terrific Road Accidents: తీరని విషాదాలు జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్ మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. ఇదంతా చూస్తుంటే కావాలనే కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోందని కోర్టు మండిపడింది. ఇకపై ఇదే తరహాలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించింది. వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై అఖ్తర్ తరఫు న్యాయవాది జే భరద్వాజ్ కోర్టులో అభ్యంతరం తెలుపడంతో తాజా హెచ్చరిక చేసింది. కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, కంగనా సినిమా యాక్టింగ్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉండటంతో పా టు, కొన్ని లక్షణాల కారణంగా కోవిడ్ పరీక్ష చేయించుకోనున్నారని, ఒకవేళ పాజిటివ్ వస్తే మరింత మినహాయింపు అవసరం ఉంటుందని కోర్టుకు తెలపడం గమనార్హం కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారని జావేద్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కంగనా. అయితే కంగనా పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
‘జావేద్ అక్తర్ కుట్రపూరిత వ్యాఖలు చేస్తున్నారు’
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోల్చూతు ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దేశంలో వివాదాన్ని రాజేశాయి. జావేద్ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషిత్ ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్పై వీహెచ్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు.. మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటి సంస్థలతో ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్పీలకు పోలికేమిటీ అంటూ దుయ్యబట్టారు. సమాజంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. జావేద్ అక్తర్పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా వీహెచ్పీ నేతలు కోరారు. (చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక) జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: బీజేపీ, ఆరెస్సెస్లతో భారత్కు ప్రమాదం -
సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
-
సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తాలిబన్ల పేరు భారతదేశంలో మార్మోగుతోంది. తాలిబన్లకు ముడిపెట్టి రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్ననే పెట్రోల్ ధరల పెరుగుదలకు తాలిబన్లే కారణమని ఓ బీజేపీ ఎమ్మెల్యే తెలపడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే బాలీవుడ్ ప్రముఖ రచయిత స్కీన్ రైటర్ జావేద్ అక్తర్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. దేశంలో కూడా తాలిబన్ల మాదిరి ఆర్ఎస్ఎస్ తయారైందని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జావేద్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే జావేద్ అక్తర్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆయన సినిమాలు దేశంలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన రెండు చేతులెత్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ శనివారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేశారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని ఘట్కోపర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదాం స్పందించారు. ట్విటర్లో ఓ వీడియో విడుదల చేశారు. చదవండి: తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం ‘జావేద్ అక్తర్ వ్యాఖ్యలు సిగ్గు చేటు. అంతేకాకుండా బాధాకరం. సంఘ్, విశ్వ హిందూ పరిషత్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా విశ్వసిస్తున్న కోట్లాదిమందికి ఆ వ్యాఖ్యలు బాధను కలిగించాయి. సంఘ్కు చెందిన వ్యక్తులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పేంత వరకు మేం అతడి సినిమాలను భరత గడ్డపై విడుదల చేయనీయం’ అని రామ్ కదాం తెలిపారు. ట్విటర్లో ఈ వీడియోను విడుదల చేశారు. జావేద్ అక్తర్ మాజీ ఎంపీ. ప్రముఖ నటి షబానా అజ్మీ భర్త. ఆయన పిల్లలు ఫర్మాన్ అక్తర్ ప్రముఖ నటుడు కాగా, కుమార్తె ప్రముఖ నిర్మాత జోయ అక్తర్. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. -
కంగనాకు ఊరట: జావేద్ అక్తర్కు ఎదురుదెబ్బ!
సాక్షి,ముంబై: వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు కోర్టులో ఊరట లభించింది. ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ కంగనాపై దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విచారణకు బొంబాయి హైకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడో పక్షం మధ్యంతర దరఖాస్తులను అనుమతించలేమనీ, ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు, లేదా న్యాయవాదిని అడుగుతామని తెలిపింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యానికి కోర్టు అనుమతిస్తే సంబంధిత పిటిషన్లు వరదలా వచ్చి పడతాయని కోర్టు వ్యాఖ్యానించింది. కంగనాపై క్రిమినల్ కేసులు ఉన్న నేపథ్యంలో ఆమె పాస్పోర్టు రెన్యువల్ నిలిపివేయాలంటూ జూలై 1న అక్తర్ మధ్యంతర పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. అలాగే జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు సింగిల్బెంచ్ను ఆశ్రయించాలని కంగనాకు కోర్టు సూచించింది. కంగనాపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ, పాస్పోర్ట్ పునరుద్ధరణ కోసం కేసులేవీ లేవని తప్పుడు ప్రకటన చేశారని జావేద్ అక్తర్ ఆరోపించారు. ఇందుకు కంగన తరపు కౌన్సిల్ ప్రాంతీయ పాస్పోర్ట్ అథారిటీకి తప్పుడు పత్రాలు అందించిందంటూ ఆయన మధ్యంతర పిటీషన్ దాఖలు చేశారు. కోర్టులో తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని రనౌత్ చేసిన ప్రకటన అబద్ధమని, ఇది కోర్టును తప్పుదోవ పట్టించేదని జావేద్ అక్తర్ న్యాయవాది బృందా గ్రోవర్ వాదించారు. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ ఎస్ ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమదార్లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఇలాంటి పిటీషన్లను స్వీకరించలేమని జస్టిస్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తామని జావేద్ అక్తర్ న్యాయవాది భరద్వాజ్ తెలిపారు. "కంగనాకు పాస్పోర్టు జారీ చేయబడినప్పటికీ, అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించలేదనే అంశాన్ని పాస్పోర్టు కార్యాలయ దృష్టికి తీసుకెడతామని భరద్వాజ్ చెప్పారు. రెండు ఎఫ్ఐఆర్లలో పేరున్నప్పటికీ ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు పెండింగ్లో లేదని కంగనా న్యాయవాది వాదించారు. సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళవలసి ఉన్న కారణంగా తన పాస్ట్ పోర్టును రెన్యువల్ చేయాలని కోరుతూ జూన్ 28 న ప్రత్యేక డివిజన్ బెంచ్ముందు కంగన పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ కంగనా, ఆమె సోదరి రంగోలిపై నమోదు చేసిన దేశద్రోహం కేసును రద్దు చేయాలని కోరుతూ కంగనా దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 11 వ తేదీకి వాయిదా వేసింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి అనంతరం(జూలై, 2020లో) వివిధ న్యూస్ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ కంగనాపై పరువు నష్టం దావా వేశారు జావేద్ అక్తర్. దీంతో ఫిబ్రవరి 2021లో కోర్టు కంగనాకు నోటీసులు ఇచ్చింది. కానీ కంగన కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆమెకు మార్చిలో బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
మరో వివాదంలో కంగనా
ముంబయి : బాలీవుడ్ వివాదస్పద నటి కంగనా రనౌత్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ కంగనాపై పరువునష్టం దావా వేశారు. వివిధ న్యూస్ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకుభంగం కలిగించేలా వ్యాఖ్యానించిందని కంగనా రనౌత్పై జావేద్ అక్తర్ క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు చేశారు. ముంబైలోని అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ఐపీసీ సెక్షన్ 499, 500 సెక్షన్ల కింద ఆయన ఫిర్యాదు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ చేసిన పలు వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి: ఉద్ధవ్ ఠాక్రేకు ఫైర్ బ్రాండ్ కౌంటర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కంగనా తన పేరును అనవసరంగా లాగిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నటుడు హృతిక్ రోషన్తో తనకు ఉన్న సంబంధం గురించి మాట్లాడవద్దని అక్తర్ తనను బెదిరించారని ఆమె పేర్కొంది. కంగనా రనౌత్ ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూను లక్షల మంది చూశారని, ఇది తన ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని అక్తర్ వాదించారు. దీంతో కంగనాపై క్రిమినల్ పరువు నష్టం దావాను విచారణకు స్వీకరించి తగు న్యాయం చేయాలని జావేద్ అక్తర్ కోర్టును కోరారు. విచారణకు స్వీకరించిన అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 3 తేదీకి వాయిదా వేసింది. కాగా కంగనా రనౌత్ ప్రస్తుతం తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. తన కజిన్ వివాహంలో బిజీగా ఉన్నారు. చదవండి: కంగనాపై మరో కేసు నమోదు.. -
మీడియాపై ఆగ్రహం.. కరణ్కు మద్దతు
బాలీవుడ్లో డ్రగ్స్ వాడకం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణంతో బాలీవుడ్లో మాదకద్రవ్యాల వినియోగం తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇప్పటికే దీపికా పదుకోనె, రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారు కూడా విచారణ కూడా హాజరవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టీవీ చానెళ్లల్లో ఓ వీడియో తెగ ప్రసారం అవుతుంది. గత సంవత్సరం కరణ్ జోహార్ నిర్వహించిన హౌస్ పార్టీని హైలైట్ చేస్తున్న ఈ వీడియోపై మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ శుక్రవారం స్పందించారు. మీడియా పార్లమెంటు ఇటీవల ఆమోదించిన వివాదాస్పద వ్యవసాయ బిల్లుల గురించి మాట్లాడటానికి బదులు గత సంవత్సరం కరణ్ జోహార్ ఇంట్లో నిర్వహించిన పార్టీ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ కన్ను) If Karan johar had invited some farmers too for his party life would have been easier for our TV channels.They would not have had to choose between farmers protest and Karan’s party!. it seems that Karan’s do is the second most favourite PARTY of our channels — Javed Akhtar (@Javedakhtarjadu) September 25, 2020 ‘కరణ్ జోహార్ తన పార్టీ కోసం కొంతమంది రైతులను కూడా ఆహ్వానించినట్లయితే, మన టీవీ చానెళ్ల పని సులభం అయ్యేది. అలా జరిగి ఉంటే ప్రస్తుతం వారు రైతుల నిరసన, కరణ్ పార్టీల మధ్య దేన్నో ఒక దాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఉండేది కాదు! కరణ్ తన రెండో పార్టీని మన చానెళ్లతో చేయాల్సి ఉన్నట్లు అనిపిస్తుంది’ అంటూ అక్తర్ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియోలో కనిపించే ప్రముఖులలో, బాలీవుడ్ తారలు దీపికా పదుకోనె, రణబీర్ కపూర్, విక్కీ కౌషల్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్లతో పాటు చిత్ర నిర్మాతలు జోయా అక్తర్, అయాన్ ముఖర్జీ ఉన్నారు. దీనిలో కనిపించే సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నారనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి -
స్వయంవరానికి అర్హులు.. కానీ
(వెబ్ స్పెషల్): హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందాల రాణులు.. అభిమానుల కలల దేవతలు.. వారితో స్నేహం కోసం ఎందరో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక వివాహం విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మలకు స్వయంవరం పెడితే రాకుమారులు సైతం క్యూ కడతారు. అయితే విచిత్రంగా మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు రెండో భార్యగా వెళ్లి అభిమానులకు షాక్ ఇచ్చారు. స్మితా పాటిల్ మొదలు కరీనా వరకు చాలా మంది హీరోయిన్లు విడాకులు తీసుకున్న వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఓ సారి ఆ జాబితా చూడండి.. 1. స్మితా పాటిల్ 1970 దశకంలో తన అందం, అభినయంతో సినీ లోకాన్ని ఏలిన స్మితా పాటిల్ వివాహం విషయంలో మాత్రం ప్రేక్షకులను ఒకింత షాక్కు గురి చేశారు. అడిగితే ప్రాణాలర్పించే అభిమానులున్న స్మిత అనూహ్యంగా అలనాటి హీరో రాజ్ బబ్బర్ని వివాహం చేసుకున్నారు. ఆయనకు అప్పటికే నాదిరా అనే మహిళతో వివాహం అయ్యింది. కానీ స్మిత పరిచయం తర్వాత రాజ్ బబ్బర్ ఆమెకు విడాకులు ఇచ్చి.. స్మితను వివాహం చేసుకున్నారు. 2. షబానా అజ్మీ హీరోయిన్ అంటే కేవలం ఓ అందాల బొమ్మ అనుకునే ఇండస్ట్రీలో తన అభినయంతో టాప్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు షబానా అజ్మీ. ఐదు సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్టు గెలుచుకున్నారు. నటిగానే కాక సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. అయితే షబానా అజ్మీ కూడా రెండో భార్యగానే వెళ్లారు. ప్రముఖ కవి జావేద్ అఖ్తర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే ఆయన హనీ ఇరానీ అనే ఆమెను వివాహం చేసుకోవడమే కాక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (చదవండి: భలే ఉన్నావు బాబు) 3. శ్రీదేవి ఇక అందాల తార, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవికి అంతర్జాతీయంగా క్రేజ్. బాల్యం నుంచి సినిమాల్లోనే ఉన్న శ్రీదేవి.. ఎందరికో కలల రాకుమారి. చాలా మంది హీరల ఫస్ట్ క్రష్ కూడా అతిలోక సుందరి మీదనే. స్వయం వరం ప్రకటిస్తే.. దేశవిదేశాల బడా బాబులు.. వ్యాపారవేత్తలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తులు శ్రీదేవి కోసం క్యూ కట్టేవారు అంటే ఆశ్చర్యం లేదు. అంతటి క్రేజ్ ఉన్న ఈ నటి.. నిర్మాత బోని కపూర్ని వివాహం చేసుకుని ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చారు. అది కూడా రెండో భార్యగా వెళ్లారు. వర్మ లాంటి చాలా మంది నేటికి ఈ నిజాన్ని జీర్ణించుకోలకపోతున్నారు. శ్రీదేవి కంటే ముందే బోని కపూర్కి మోనా కపూర్తో వివాహం కావడమే కాక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకి విడాకులు ఇచ్చి.. శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి జాహ్నవి, ఖుషి అని ఇద్దరు సంతానం. (చదవండి: నా కథ చెబుతాను) 4. సారిక సారిక కూడా విడాకుల తీసుకున్నవ్యక్తినే పెళ్లాడారు. లోక నాయకుడు కమల్ హాసన్ జీవితంలో రెండో భార్యగా ప్రవేశించారు. కమల్ తన మొదటి భార్య వాణి గణపతికి విడాకులు ఇచ్చి.. సారికను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షరా హాసన్. ఆ తర్వాత సారిక కమల్ నుంచి విడిపోయింది. అది వేరే కథ. 5. మన్యాత దత్ మన్యాత దత్ ఏకంగా మూడో భార్యగా మున్నాభాయ్ సంజయ్దత్ జీవితంలో ప్రవేశించారు. మన్యాత కన్నా ముందు సంజయ్ రిచా శర్మ, రియా పిల్లయ్ అనే ఇద్దరిని వివాహం చేసుకున్నారు. 6. కరిష్మ, కరీనా అక్కాచెళ్లల్లు ఇద్దరు విడాకులు తీసుకున్న వ్యక్తులనే వివాహం చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్, కరిష్మాకు నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వారి పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఆ తర్వాత కరిష్మా సంజీవ్ కపూర్ని వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే అతడు నందిత మహతానీని వివాహం చేసుకున్నాడు. ఇక కరీనా.. చోటా నవాబ్ సైఫ్ అలీఖాన్ని వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే సైఫ్కు అమృతా సింగ్తో వివాహం కావడమే కాక ఇద్దరు పిల్లలు సారా, ఇబ్రహీం ఉన్నారు. అమృతతో విడాకుల అనంతరం సైఫ్, కరీనాను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి తైమూర్ అనే బాబు ఉండగా.. రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. (చదవండి: తగ్గాలమ్మాయ్ అన్నారు!) 7. విద్యా బాలన్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ యాక్టర్ విద్యా బాలన్. లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. ఇక వివాహం విషయానికి వస్తే.. విద్యాబాలన్ కూడా విడాకులు తీసుకున్న వ్యక్తినే వివాహం చేసుకున్నారు. యూటీవీ హెడ్ సిద్ధార్థ్ రాయ్ కపూర్ని పెళ్లాడారు. అయితే అతనికి ఇది మూడవ వివాహం కావడం గమనార్హం. 8. శిల్పా శెట్టి ఇక పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి కూడా రెండో భార్యగానే వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శిల్పా కంటే ముందే రాజ్ కుంద్రాకు కవిత అనే మహిళతో వివాహం అయ్యింది. ఆమెకు విడాకులు ఇచ్చి.. శిల్పా శెట్టిని వివాహం చేసుకున్నాడు. వీరికో కుమారుడు ఉండగా.. తాజగా సరోగసి ద్వారా మరో ఆడబిడ్డ వీరి కుటుంబంలో ప్రవేశించింది. ఇక వీరే కాక లారా దత్త(మహేభట్), కిరణ్ రావ్(అమీర్ ఖాన్), కల్కి కోచ్లిన్ (అనురాగ్ కశ్యప్), అమృత అరోరా (షకీల్ లడఖ్) విడాకులు తీసుకున్న వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఇక మన టాలీవుడ్లో అయితే విజయ నిర్మల, అమల, రాధిక వంటి వారు వివాహం అయిన వ్యక్తులను పెళ్లాడారు. మన హీరోల విషయానికి వస్తే.. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, శరత్బాబు, పవన్ కళ్యాణ్, శరత్ కుమార్, హరికృష్ణ, ప్రకాశ్ రాజ్ వంటి వారు కూడా రెండో వివాహం చేసుకున్నారు. -
‘అద్భుతం! ఉమ్మేయడం మళ్లీ మొదలవుతుంది’
దేశ వ్యాప్తంగా రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్, గేయ రచయిత జావేద్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్డౌన్లో పాన్ సెంటర్లు, గుట్కా, మద్యం షాపులు, తెరుచుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘అద్భుతం.. పాన్, గుట్కా షాపుల తెరుచుకుంటున్నాయి. ఇక ఉమ్మివేయడం కూడా మళ్లీ ప్రారంభమవుతుంది’ అంటూ రవీనా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. (వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?) లాక్డౌన్లో మద్యం ప్రజలపై త్వరగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జావేద్ అక్తర్ అన్నారు. అంతేగాక దేశంలో ఇప్పటికే మద్యం కారణంగా గృహహింస కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ‘‘లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలను తెరవడం వినాశకరమైన ఫలితాలను ఇస్తుంది. ఇక అన్ని సర్వేల ప్రకారం ఈ కాలంలో గృహ హింస కేసులు చాలా వరకు పెరిగాయి. ఈ సమయంలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తే అది మహిళలు, పిల్లలకు మరింత ప్రమాదకరంగా మారుతుంది’’. అని ట్వీట్ చేశారు. అయితే జావిద్ మద్యం సేవించడం మానేసినట్లు కనిపిస్తోందని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 1991 జూలై 30 మద్యం స్వీకరించిన చివరి రోజు అని జావేద్ బదులిచ్చారు. (18 వేల మందిని రాష్ట్రానికి తీసుకొస్తాం : సీఎం ) కాగా భారత్లో మే 3 వరకు ముగియనున్న లాక్డౌన్ను మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రటకించిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్లో దేశంలోని అన్ని రాష్ట్రల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా విభజించి.. మే 4 నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం శుక్రవారం ఆదేశించింది. మద్యం షాపులలో ఒకేసారి అయిదుగురికి మించి ఉండకూదనే నిబంధనలు పెట్టింది. (మళ్లీ ట్రెండింగ్లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! ) -
జావేద్ ట్వీట్.. జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు!
బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెటింటా తెగ హల్చల్ చేస్తోంది. కేవలం ‘ఎమ్(M)’ లేటర్ను మాత్రమే షేర్ చేసి.. నెటిజన్లను అయోమయంలో పాడేశారు జావేద్. నెటిజన్లు దానికి అర్థం ఏంటో తెలిక తల బాదుకుంటున్నారు. ఇందులో ఎమైనా పజిల్ దాగుందేమోనని వారంతా మెదడుకు పదును పెడుతుంటే.. మరి కొంతరూ అదేంటో తెలుసుకొవడాని ఉత్సుకత చూపుతున్నారు. ('అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?') M — Javed Akhtar (@Javedakhtarjadu) April 21, 2020 ‘దీనికి అర్థం ఏంటీ అక్తర్ సార్’ అంటూ ఆయనకే ఎదురు ప్రశ్నలు వెస్తుంటే.. మరికొందరు ‘ఎమ్(M) తర్వాత వచ్చే ఆల్ఫాబేట్స్ను రీట్వీట్ చేస్తున్నారు. ఇక ఒకే సింగిల్ లేటర్ను షేర్ చేసిన ఆయన తీరు చూస్తుంటే లాక్డౌన్లో ఇంట్లో ఖాళీగా ఉన్న వారికి కాస్తా కాలక్షేపం ఇచ్చేందుకు ఇలా ట్వీట్ చేసుంటారని అభిప్రాయ పడుతున్నారు. -
'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?'
మిస్టర్ ఇండియా సినిమాకు బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1987లో రిలీజైన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథను సలీమ్-జావేద్ అక్తర్లు అందించారు. తాజాగా ఈ సినిమాను మిస్టర్ ఇండియా 2గా తీయాలని 'టైగర్ జిందా హై' ఫేమ్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రీమేక్గా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అబ్బాస్ తన ట్విటర్లో వెల్లడిస్తూ.. ' మిస్టర్ ఇండియా సినిమా కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలందుకున్న ఐకానిక్ పాత్రలను మరోసారి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసే పనిలో ఉన్నా.. నటీనటులు ఎవరనేది ఇంకా ఏం నిర్ణయించలేదు' అని పేర్కొన్నారు. (‘అమృతగా తాప్సీ నన్ను ఆకట్టుకుంది’) అయితే మిస్టర్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన అనిల్ కపూర్, చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్ను సంప్రదించకుండా రీమేక్ ఎలా తీస్తారంటూ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. వారి అనుమతి లేకుండా సినిమాను తీస్తే వారిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ ట్విటర్లో స్పందించారు.' మిస్టర్ ఇండియా సినిమా గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా... నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. మిస్టర్ ఇండియా సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా నాకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాపై నాకు హక్కులు ఉండవా ?' అంటూ పేర్కొన్నారు. Shekhar saheb the story the situations the scenes the characters the dialogue the lyrics even the title none of these were yours .I gave it all to you . Yes you execute it very well but how can your claim on the film be more than mine . It wasn’t you idea . It wasn’t your dream — Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020 దీనిపై జావేద్ అక్తర్ శేఖర్ కపూర్ను తప్పుబడుతూ రీట్వీట్ చేశారు.' మిస్టర్ ఇండియా కథ, పాటలు, డైలాగ్లు, సన్నివేశాలు, కనీసం చిత్రం టైటిల్ కూడా మీకు సొంతం కాదు. వాటిన్నంటిని నేను సలీమ్ కలిసి మీకు అందించాం అన్న విషయాన్ని మరిచిపోయారు. నిజమే.. మీరు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ సినిమా మీద మొత్తం హక్కులు నీకే ఉన్నాయనడం ఏం బాగాలేదు. అసలు ఈ సినిమా మీ ఆలోచన కాదు, అది మీ కల కూడా కాదు' అంటూ జావేద్ మండిపడ్డారు. -
‘హమ్ దేఖేంగే’ను ఆలాపించడంపై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత పాకిస్థానీ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దెఖేంగే’ కవితను ఐఐటీ కాన్పూర్లో ఆలాపించడం వివాదంగా మారింది. ఫైజ్ కవిత హిందూ వ్యతిరేకమైనదని, దీనిని పాడటం దేశద్రోహం అంటూ ఈ కవితను పాడిన విద్యార్థులకు వ్యతిరేకంగా కేసు నమోదైంది. ఈ కేసు వివాదంపై ప్రఖ్యాత బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ స్పందించారు. ఫైజ్ కవితను హిందూ వ్యతిరేకమైనదని పేర్కొనడం అసంబద్ధం, హాస్యపూరితమని ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి వివాదాన్ని అసలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. అప్పటి పాకిస్థానీ పాలకుడు జియా ఉల్ హక్ ఛాందసవాద, మతతత్వ, ప్రగతినిరోధక పాలనకు వ్యతిరేకంగా ఫైజ్ ఈ కవిత రాశారని తెలిపారు. అవిభాజ్య భారతం నుంచి వచ్చిన ప్రగతిశీల రచయితల్లో ఫైజ్ ప్రముఖుడని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రం గురించి కవితలు రాసిన ఫైజ్.. ఆ తర్వాత చోటుచేసుకున్న దేశ విభజన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కవితలు రాశారని, దేశ విభజనను వ్యతిరేకించిన కవిని ఇప్పుడు దేశద్రోహి అని అభివర్ణించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఫైజ్ తన జీవితంలో సగభాగం పాక్ వెలుపలే గడిపాడని, అప్పట్లో పాక్ ద్రోహి అని కూడా అతనికి ముద్ర వేశారని గుర్తు చేశారు. -
షబానా, జావేద్లపై పాక్ విమర్శలు
కరాచీ: బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, ఆమె భర్త జావేద్ అక్తర్ తమ దేశ పర్యటన రద్దు చేసుకోవడాన్ని పాకిస్తాన్ ఆర్ట్స్ కౌన్సిల్ విమర్శించింది. కరాచీలో జరగనున్న షబానా తండ్రి కైఫీ అజ్మీ శతజయంతి వేడుకలకు వీరిద్దరూ హాజరుకావాల్సివుంది. జమ్మూకశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. షబానా, జావేద్ నిర్ణయాన్ని పాకిస్తాన్ ఆర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు అహ్మద్ షా తప్పుబట్టారు. తమను షబానా నిరాశకు గురిచేశారని వ్యాఖ్యానించారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. జావేద్ అక్తర్ ధైర్యముంటే కశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ సాగిస్తున్న అరాచకాలపై గళమెత్తాలని సూచించారు. ఈనెల 23, 24 తేదీల్లో కరాచీలో నిర్వహించనున్న కైఫీ అజ్మీ శతజయంతి వేడుకలకు పాకిస్తాన్కు చెందిన ప్రముఖ రచయితలు, కవులతో పాటు ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించారు. -
స్టార్ రైటర్కు బీజేపీ నేత కౌంటర్
సాక్షి, ముంబై : మక్కా మసీదు పేలుడు కేసు తీర్పు బాలీవుడ్ రచయిత, బీజేపీ నేతకు మధ్య ట్వీట్ల యుద్ధానికి దారితీసింది. తీర్పుపై స్పందించిన ప్రముఖ గేయ రచయిత జావెద్ అక్తర్.. ‘మిషన్ పూర్తయ్యింది. మక్కా పేలుడు కేసులో విజయం సాధించిన ఎన్ఐఏకు నా అభినందనలు. ఇక ప్రపంచంలో జరిగే కులాంతర వివాహలపై దర్యాప్తు చేపట్టేందుకు ఎన్ఐఏకు సమయం దొరికింది’ అంటూ బుధవారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ఏపీ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు(యూపీ తరపున ప్రాతినిథ్యం) తన ట్వీటర్లో స్పందించారు. ‘జావెద్ గారూ.. కాంగ్రెస్ చేస్తున్న హిందూ ఉగ్రవాదం ఆరోపణలను ఖండించే నిజాయితీ మీకుందని ఆశిస్తున్నా. సినిమాల్లో పాటలు రాసినట్లుగానే మీరు రాహుల్గాంధీ కోసం కల్పిత కథనాలను రాస్తున్నారేమో అనిపిస్తోంది. విద్వేషపూరిత చర్యలు మానుకుని.. మంచి సలహాలు ఇవ్వండి’ అంటూ నరసింహారావు ట్వీట్లు చేశారు. దీనికి కౌంటర్గా దిగ్గజ రచయిత మరో ట్వీట్ చేయగా.. దానికి బదులిస్తూ బీజేపీ ఎంపీ మరో ట్వీట్ చేశారు. ఇలా వాళ్ల ట్వీట్ల పర్వం కొనసాగుతున్న వేళ.. జావెద్ ట్వీట్లను ఆయన ఫ్యాన్స్, మరోవైపు బీజేపీ నేతలేమో నరసింహారావు ట్వీట్లను వైరల్ చేస్తూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. Mission accomplished !! . My congratulations to NIA for their grand success in Mecca Masjid case. Now they have all the time in the world to investigate inter community marriages !!! — Javed Akhtar (@Javedakhtarjadu) 18 April 2018 Javed Ji, Wish you had the honesty to condemn @INCIndia for "Hindu Terror" formulation. Seems you are in awe of @RahulGandhi for writing a fictional script like you have done so well in films. OR, is "Hindu Terror" also your brainwave as your reported idea of "Maut Ka Saudagar?" https://t.co/35MTCJJal5 — GVL Narasimha Rao (@GVLNRAO) 18 April 2018 Dear Mr Rao , I don’t believe in terms like Hindu or Muslim terror . These terms wrongly accuse a whole community . An average person of every community wants peace and harmony . Troublemakers are the vested interest n the mad fringe and sadly no community is devoid of them — Javed Akhtar (@Javedakhtarjadu) 18 April 2018 Javed Ji, Pl do not attempt fake equivalence on terrorism with Islam. Jehadis wage a war in the name of Islam for "Zannat". Terror preachers like Zakir Naik aren't Buddhists but Islamists. @INCIndia paid a heavy price for your sordid ideas. Pl continue advising @RahulGandhi!! https://t.co/zVmBNO4GlZ — GVL Narasimha Rao (@GVLNRAO) 19 April 2018 -
నువ్వు మతోన్మాదివి; మండిపడ్డ రచయిత
న్యూఢిల్లీ : ఫ్రెంచ్ కాలమిస్ట్ ఫ్రాంకోయిస్ గుటర్పై బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ట్విటర్ వేదికగా తిట్ల వర్షం కురిపించారు. రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్తో భారతీయ ఇతిహాస గాథ మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నారని, ఆ సినిమాను ముఖేశ్ అంబానీ నిర్మించనున్నారని ఊహాగానాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అతి ముఖ్యమైన కర్ణుడు లేదా కృష్ణుని పాత్ర పోషించాలని ఉందని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ఖాన్ ఎన్నోసార్లు తన మనసులో మాట బయటపెట్టారు. దీనిపై ఫ్రాంకోయిస్ స్పందిస్తూ... ‘హిందువులకు చెందిన ఇతిహాస గాథ మహాభారతంలోని పాత్రను ఒక ముస్లిం ఎలా చేయగలడు. లౌకికవాదం పేరిట మోదీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్లాగే ప్రవర్తిస్తుందేమో? ఒకవేళ మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్రలో ఆయన పాత్ర ఒక హిందువు పోషించడానికి ముస్లింలు అంగీకరిస్తారా ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు స్పందనగా.. జావేద్ అక్తర్.. పరుష పదజాలంతో ఫ్రాంకోయిస్పై విరుచుకుపడ్డాడు. ‘యూ స్కౌండ్రల్ మా దేశంలో ద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని చూస్తున్నావేమో. అసలు నీ వెనుక ఏ దేశ హస్తం ఉందో చెప్పు’ అంటూ జావేద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ‘భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి నీకేం తెలుసు, మతోన్మాదం అనే బావిలోని కప్పవు నువ్వు’ అంటూ ట్వీట్ చేశారు. గతంలో కూడా గుర్మెహర్ కౌర్ వివాద సమయంలో, వీరేంద్ర సెహ్వాగ్, ఫొగట్ సిస్టర్స్ విషయంలోనూ జావేద్ కాస్త కఠినంగానే స్పందించారు. Why should @AamirKhan, a Muslim, play in most ancient & sacred of Hindu epics, the Mahabharata? Is @BJP4India Govt of @narendramodi going to be like the @INCIndia & just stand by in name of secularism??? Would Muslims allow a Hindu to play life of Mohamed?https://t.co/fC7bvbHkZE — Francois Gautier (@fgautier26) March 21, 2018 You scoundrel, have you not seen peter brooks production of this great epic Mahabharsta in France . I would like to know which foreign agency is paying you to spread this kind of perverse and poisonous thoughts in our country — Javed Akhtar (@Javedakhtarjadu) March 21, 2018 You ignorant unfortunate imbecile, obviously you know nothing about our Indian traditions and culture . Do you know who were Ras khan bullay shah Waris shah, ,Baba Farid Nazeer Akbarabadi , Nizir Banarasi , Bismillah khan . You are just a frog in the stinking well of communalism — Javed Akhtar (@Javedakhtarjadu) March 22, 2018 -
‘మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉపయోగించకూడదు’
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కిందట ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మసీదుల్లో, ఇతర ఆధ్మాత్మిక ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసి.. దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ రచయిత, కవి జావేద్ అఖ్తర్ కూడా సోనూ నిగమ్కు మద్దతు పలికారు. నివాసప్రాంతాల్లోని మసీదుల్లో, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు వాడరాదని ఆయన తేల్చిచెప్పారు. ‘ఆన్ రికార్డు చెప్తున్నా.. సోనూ నిగమ్తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నివాస ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు’ అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సోనూ నిగమ్కు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తాజాగా ముంబై పోలీసులు సోనూ నిగమ్కు భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో జావేద్ అఖ్తర్ ఈ ట్వీట్ చేశారు. -
ప్రముఖ సినీ రచయితపై కేసు
జైపూర్: ‘పద్మావతి’ ప్రకంపనలు ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. ఈ సినిమాకు మద్దతు ప్రకటించిన సీనియర్ రచయిత జావేద్ అక్తర్పై జైపూర్లో కేసు నమోదయింది. రాజ్పూత్లను అవమానించారనే ఆరోపణలతో సింధి క్యాంప్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత 200 ఏళ్ల చరిత్రలో రాజ్పూత్లు ఎప్పుడూ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదని వ్యాఖ్యానించడంతో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మావతి సినిమా వివాదంపై జావేద్ అక్తర్ స్పందిస్తూ... ‘రాజ్పూత్లు, రాజ్వాడాలు ఎప్పుడు కూడా బ్రిటీష్ పాలకులపై పోరాటం చేయలేదు. కానీ ఇప్పుడు ఒక సినిమా, సినిమా రూపకర్తపై వీధి పోరాటాలు చేస్తున్నారు. రాజస్థాన్కు చెందిన ఈ రాణాలు, రాజులు, మహరాజులు 200 ఏళ్లు బ్రిటీషు కోర్టుల్లో పనిచేశారు. రాజ్పూత్ల గౌరవం, ప్రతిష్ట అప్పుడేమయింద’ని ప్రశ్నించారు. పద్మావతి సినిమాను నిషేధించాలని ఆందోళనలు చేస్తున్నవారిపై కూడా ఆయన విమర్శలు చేశారు. బ్రిటీషర్లను రాజ్పూత్లు ఎదిరించలేదన్న జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయనను రాజస్థాన్లో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. -
ఆరో తరగతి బుక్ ఇవ్వండి!
సాక్షి, ముంబై: ప్రముఖ సినీ రచయిత జావేద్ అఖ్తర్ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ ఏడోవింతగా పరిగణించే తాజ్మహాల్.. భారత సంస్కృతికి మచ్చగా సోమ్ అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. 'సంగీత్ సోమ్కు చరిత్ర తెలియకపోవడం చాలా గొప్ప విషయంగా భావించాలి. ఆయనకు ఎవరైనా ఆరో తరగతి చరిత్ర పుస్తకాన్ని ఇవ్వండి. మొఘల్ చక్రవర్తి జహంగీర్ జమానాలో భారత్కు వచ్చిన డాక్టర్ థామస్ రోయి.. సగటు ఆంగ్లేయుల కంటే భారతీయుల జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని రాశాడు' అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. 'అక్బర్ను ద్వేషించేవాళ్లకు క్లీవ్ (బ్రిటిష్ ఇండియా కమాండర్ ఇన్ చీఫ్)తో ఎలాంటి సమస్యా లేదు. జహంగీర్ను ద్వేషించేవాళ్లు వారన్ హస్టింగ్స్ (బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్) గురించి మాట్లాడరు. నిజానికి వాళ్లే నిజమైన దోపిడీదారులు' అని అఖ్తర్ పేర్కొన్నారు. 'తాజ్మహాల్ భారత సంస్కృతిపై మచ్చ. హిందువులను నాశనం చేయాలనుకున్న చక్రవర్తి దీనిని నిర్మించారు' అంటూ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి దూరం జరిగిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. త్వరలోనే ఆగ్రాలోని తాజ్మహాల్తోపాటు ఇతర చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు. -
ఫ్యామిలీ బ్లడ్
బ్లడ్ రిలేషన్ ఉంటే కానీ బాలీవుడ్లో వర్కవుట్ అయ్యేట్టు కనిపించడం లేదు. హీరోలు, హీరోయిన్లు, విలన్లు, రైటర్లు, కొరియోగ్రాఫర్లు, కెమేరామేన్లు.. లిస్ట్ నెవర్ ఎండింగ్. బాలీవుడ్లో తెర మీద, తెర వెనకా, పక్కనా... అంతా బ్లడ్డే. రక్తం చిందిస్తున్నారనుకోకండి! మరి ఏం చిందిస్తున్నారు? బంధుప్రీతిని చిలకరిస్తున్నారు. దీంట్లో ఏమీ తప్పు లేదు. బంధువులుంటే మాత్రమే గొప్పవారు కాదు. కానీ అవకాశం మాత్రం ‘రిలేటీవ్’లీ ఈజీ.. అక్తర్–ఆజ్మి... ఆల్ ఆర్ టాలెంట్ సుమీ ప్రముఖ హిందీ రచయిత జావేద్ అక్తర్ తండ్రి జాన్ నిసార్ గేయ రచయిత. జావేద్ మొదటి భార్య హనీ ఇరానీ కూడా రైటరే. జావేద్–హనీల తనయుడే దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. ఫర్హాన్ సోదరి జోయా అక్తర్ కూడా దర్శకురాలే. ఇదిలా ఉంటే.. జావేద్ మొదటి భార్య హనీ ఇరానీకి ఓ సోదరి ఉన్నారు. పేరు మేనకా ఇరానీ. ఈ మేనకా కూతురే ప్రముఖ నృత్య దర్శకురాలు–దర్శకురాలు ఫరాఖాన్. ఫరా సోదరుడు సాజిద్ఖాన్ కూడా దర్శక–నటుడే. ఇక, జావేద్ అక్తర్ రెండో వివాహం చేసుకున్న ప్రముఖ హిందీ నటి షబానా ఆజ్మిదీ సినిమా నేపథ్యమే. షబానా తండ్రి కైఫ్ ఆజ్మి పాటల రచయిత. తల్లి షౌకత్ కైఫ్ నటి. షబానా మేనకోడళ్ళు టబు, సయామీ ఖేర్లు కూడా ఫ్యామిలీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బచ్చన్ అండ్... ఎలాంటి రికమండేషన్లు లేకుండా కష్టపడి, పైకొచ్చిన నటుడు అమితాబ్ బచ్చన్. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా అడుగుపెట్టారు. తండ్రీ కొడుకులు అమితాబ్, అభిషేక్... ఇద్దరూ వెండితెరపై తమకు జోడీగా నటించిన హీరోయిన్లు జయా బాధురి, ఐశ్వర్యా రాయ్లను పెళ్లాడారు. అమితాబ్ సోదరుడు అజితాబ్ నిర్మాతగా కొన్ని చిత్రాలు తీశారు. ఈయన కుమార్తె నైనా బచ్చన్ను యంగ్ హీరో కునాల్కపూర్ పెళ్లి చేసుకున్నారు. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ను కపూర్ కుటుంబంలోకి కోడలిగా పంపారు. అమితాబ్ అల్లుడు నిఖిల్ నందా ఎవరో కాదు... ప్రముఖ నటుడు రాజ్కపూర్ మనవడే. భట్... బంచ్ ఆఫ్ టాలెంట్ బాలీవుడ్ దర్శకుల అడ్డా ఏదంటే... భట్ ఫ్యామిలీ అనే చెప్పాలి. దర్శకుడు నానాభాయ్తో బాలీవుడ్లో భట్ ఫ్యామిలీ పురుడు పోసుకుంది. ఓ 50 చిత్రాలు తీసిన నానాభాయ్ భట్కు ఎనిమిది మంది పిల్లలు. వాళ్లు, వాళ్ల పిల్లలూ పుట్టగొడుగుల్లా హిందీలో పాగా వేశారు. నానాభాయ్ కుమారుల్లో రాబిన్ రచయితగా, ముఖేశ్భట్ నిర్మాతగా, మహేశ్భట్ దర్శకుడిగా స్థిరపడ్డారు. ఈ ఫ్యామిలీ మూడోతరంలో ముఖేశ్ కుమారుడు విశేష్భట్ ‘మర్డర్–3’కి దర్శకత్వం వహించారు. ఇక, మహేశ్భట్ మొదటి భార్య కుమార్తె పూజా భట్ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా పలు శాఖల్లో ప్రతిభ చూపారు. మహేశ్భట్ రెండో భార్య కుమార్తె ఆలియా భట్ ప్రజెంట్ స్టార్ హీరోయిన్. యువదర్శకుడు మోహిత్ సూరి నానాభాయ్కు మనవడు. అంటే... కూతురి కొడుకు. ముఖేశ్, మహేశ్లకు మేనల్లుడు. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి కూడా మహేశ్భట్కు మేనల్లుడి వరుస. ఇంకా ఈ ఫ్యామిలీలో నటీనటులు, దర్శకులు బోల్డంత మంది ఉన్నారు. యస్... జోహార్ చోప్రా యశ్చోప్రా... భారతీయ చిత్రసీమకు పరిచయం అక్కర్లేని పేరు. యశ్రాజ్ ఫిల్మ్స్ స్థాపించి, దర్శక–నిర్మాతగా హిట్ సినిమాలు తీశారు. ఆయన అన్నయ్య బల్దేవ్ చోప్రా కూడా దర్శక–నిర్మాతే. యశ్చోప్రా సోదరుల్లో ధరమ్రాజ్ చోప్రా సినిమాటో గ్రాఫర్ కాగా, రాజ్చోప్రా డిస్ట్రిబ్యూటర్. బల్దేవ్ చోప్రా తనయుడు రవిచోప్రా ఫేమస్ టీవీ సీరియల్ ‘మహాభారత్’కు దర్శక–నిర్మాత. యశ్చోప్రా కుమారుల్లో పెద్దోడు ఆదిత్యా చోప్రా దర్శక–నిర్మాతగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. చిన్నోడు ఉదయ్చోప్రా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. నటి, వ్యాఖ్యాత సిమి గరేవాల్.. ఆదిత్యాచోప్రా చిన్నమ్మ కూతురు. ఇవన్నీ పక్కన పెడితే... ‘నెపోటిజమ్’ పేరుతో కంగనా రనౌత్ వేలెత్తి చూపుతోన్న కరణ్ జోహార్ ఎవరో తెలుసా? యశ్చోప్రా మేనల్లుడు. కరణ్ తల్లి హీరూ జోహార్ ఎవరో కాదు... యశ్చోప్రా సొంత చెల్లెలు. కరణ్ తండ్రి యశ్ జోహార్ కూడా నిర్మాతే. ఆయన ‘ధర్మ ప్రొడక్షన్స్’ సంస్థను స్థాపించారు. కపూర్స్... క్యా టాలెంట్! హిందీ సినిమాలనూ, కపూర్ కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. కపూర్ ఫ్యామిలీకి పృధ్వీరాజ్ కపూర్ ఆద్యుడు. మూకీ చిత్రాల యుగం నుంచి ఆయన హీరోగా నటించారు. ఆయన తనయులు రాజ్కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్... ముగ్గురూ హీరోలుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఓ వెలుగు వెలిగారు. కపూర్ ఫ్యామిలీ మూడోతరంలో రాజ్కపూర్ కుమారులు రణధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్... తండ్రిలా నటన, దర్శ కత్వం, నిర్మాణం మూడింటిలోనూ ప్రతిభ చూపారు. షమ్మీ కపూర్ తనయుడు అదిత్యారాజ్ కపూర్ నటుడిగా, నిర్మాతగా సినిమాలు చేశారు. శశికపూర్ కుమారుల్లో పెద్దోడు కునాల్ కపూర్ యాడ్ ఫిల్మ్ మేకర్ గా, చిన్నోడు కరణ్ కపూర్ మోడల్ కమ్ ఫొటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. నాలుగో తరంలో రణధీర్ కుమార్తెలు కరీష్మా, కరీనాలు బోల్డంత పేరు తెచ్చుకున్నారు. రిషి కపూర్ తనయుడు రణబీర్ కపూర్ స్టార్ హీరోగా దూసుకెళుతున్నారు. ఇంకా.. పైన చెప్పిన ఫ్యామిలీలతో పాటు డియోల్ (ధర్మేంద్ర) ఫ్యామిలీ వంటివి మరికొన్ని ఉన్నాయి. ప్రముఖ íహీరోలు సంజయ్దత్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్, హీరోయిన్లు సోనమ్ కపూర్, సోనాక్షీ సిన్హా, శ్రద్ధాకపూర్... ఇలా సినీ నేపథ్యం ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. -
భాగ్ అఖ్తర్ భాగ్
మిల్కా సింగ్ బయోపిక్ చేసిన హీరో ఫర్హాన్ అఖ్తర్. హీరో అవక ముందు ఇతని పెన్ను పరిగెత్తేది. భాగ్ మిల్కా భాగ్ తర్వాత కెరియర్ పరిగెడుతోంది. మరి పరిగెత్తేటప్పుడు పడకుండా ఉంటారా?పడకుండా ఉండము. పడి లేచి పరిగెత్తినవాడే ఫర్హాన్ అఖ్తర్. భాగ్ అఖ్తర్ భాగ్. ♦ రచయిత జావేద్ అఖ్తర్ కుమారుడు. ∙నృత్య దర్శకురాలు ఫర్హా ఖాన్ ఇతనికి పిన్ని కూతురు. ∙‘జిందగీ నా మిలేగీ దుబారా’ దర్శకురాలు జోయా ఇతడి సోదరి. ♦ తండ్రిలానే తనూ విడాకులు తీసుకున్నాడు. ♦ ‘భాగ్ మిల్కా భాగ్’తో ఎనలేని కీర్తి. ♦ నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్లో సమున్నత స్థానం. నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. ‘నేను సూపర్మేన్’ అన్నాడు ఒక పిల్లవాడు. ‘నేను స్పైడర్మేన్’ అన్నాడు ఇంకో పిల్లవాడు. ‘నేను బేట్మేన్’ అన్నాడు మరో పిల్లవాడు. నాలుగో పిల్లవాడికి ఈ మేన్ల మేనియా లేదు. అతడికి తెలిసిన అతడు ఇష్టపడే సూపర్మేన్ ఒక్కడే– అమితాబ్ బచ్చన్. ‘నేను అమితాబ్బచ్చన్’ అన్నాడు ధీమాగా. కాని మొదటి పిల్లవాడికి కోపం వచ్చింది. ‘నో.. నేనే అమితాబ్ బచ్చన్. నువ్వు సూపర్మేన్ వేషం వెయ్యి’ అన్నాడు. ‘నో.. నేనే అమితాబ్ బచ్చన్’ ‘కుదరదు’ ‘ఏం?’ ‘ఏం అంటే ఆయన మా నాన్న కాబట్టి. మా నాన్న వేషం వేసే హక్కు నాకే ఉంది’ నాలుగో పిల్లవాడు నీరసంగా అంగీకరించాడు. ఎందుకంటే మొదటి పిల్లవాడి పేరు అభిషేక్ బచ్చన్. నాలుగో పిల్లవాడి పేరు ఫర్హాన్ అఖ్తర్. చిన్నప్పటి ఆట అది. కానీ ఆటలో అమితాబ్ బచ్చన్ కాలేని ఫర్హాన్ పెద్దయ్యాక అదే అమితాబ్ బచ్చన్ను డైరెక్ట్ చేశాడు ‘లక్ష్య’ సినిమా కోసం. పెద్ద సక్సెస్ ఇది. కానీ దీని స్క్రిప్ట్ మాత్రం అంత సులువుగా లేదు. జావేద్ అఖ్తర్ స్క్రిప్ట్స్ బాగా రాస్తాడు. అయితే తన పిల్లవాళ్ల బాల్యపు స్క్రిప్ట్ను అతడు అంత బాగా రాయలేకపోయాడు. గట్టిగా చెప్పాలంటే ఆ స్క్రిప్ట్ను డిస్ట్రబ్ చేశాడు. గందరగోళం పాలు చేశాడు. జావేద్ అఖ్తర్ భార్య పేరు హనీ ఇరానీ. ఈమె బాలనటి. టీనేజ్లో కూడా సినిమాల్లో నటించింది. హేమమాలిని డబుల్ యాక్షన్ చేసిన ‘సీతా ఔర్ గీతా’లో ఈమె చిన్న పాత్ర పోషించింది. ఆ సినిమాకు సలీమ్–జావేద్ రచయితలు. జావేద్కు అలా హనీ పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వాళ్లు 1972లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి జావేద్ పెద్ద స్టార్ రైటర్ కాలేదు. ‘జంజీర్’, ‘షోలే’, ‘దీవార్’ వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయ్యాయి. సలీమ్ జావేద్లు ఆ రోజుల్లోనే సూపర్స్టార్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అంటే ఒక్కో సినిమాకి లక్ష రూపాయలు తీసుకునేవారు. ఈలోపు హనీ ఇరానీ– జావేద్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దమ్మాయి జోయా. రెండో సంతానం ఫర్హాన్ అఖ్తర్. కాని ఈలోపు జావేద్ అఖ్తర్ ఎక్స్పోజర్ పెరిగింది. గొప్పగొప్పవాళ్లు అతడికి పరిచయమవుతున్నారు. అతనంటే కూడా క్రేజ్ ఏర్పడింది. అలా షబానా ఆజ్మీ అతడి జీవితంలోకి ప్రవేశించింది. ఆమె పుట్టిల్లు హైదరాబాద్ కనుక అతడు మన హైదరాబాద్కు అల్లుడయ్యాడు. బాగుంది కాని హనీ ఇరానీ ముక్కచెక్కలైపోయింది. జావేద్ చర్యను జీర్ణించుకోలేకపోయింది. ఆస్తి అంతస్తు డబ్బు ఉన్న భర్త... కాని అతణ్ణి వదిలేసి ఇద్దరు పిల్లలతో విడిపోయింది. లేదా అతడే ఆమెను వదిలి షబానాతో వెళ్లిపోయాడు. ఫర్హాన్ ఆరేడేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు మొదలైన గొడవ అతడికి పదేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రుల శాశ్వత యెడబాటుతో ముగిసింది. జావేద్– హనీలు లీగల్గా విడాకులు తీసుకున్నారు. ఫర్హాన్ ఇప్పుడు ఒంటరి. అక్క జోయా తప్ప అతడికి ప్రపంచంలో మరెవ్వరూ లేరు. ఈ మొత్తం వ్యవహారంతో డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఫర్హాన్ అల్లరి పిల్లవాడైపోయాడు. తండ్రిని మిస్సవుతున్న విషాదం నుంచి బయట పడటానికి హైపర్ యాక్టివ్ అయిపోయేవాడు. గెంతేవాడు. పడేవాడు. పరిగెత్తేవాడు. వారంలో రెండుమూడుసార్లు గాయాలపాలై డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లాల్సి వచ్చేది. స్కూల్లో పిల్లలతో తాను రోజూ హెలికాప్టర్లో వస్తానని తనను స్కూల్ రూఫ్ మీద దింపి హెలికాప్టర్ వెళ్లిపోతుందని అబద్ధాలు నమ్మకం కలిగేలా చెప్తే మిగిలిన పిల్లలు వాళ్ల తల్లిదండ్రులని హెలికాప్టర్లో దించమని గొడవ చేస్తే ఆ తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి ఫర్హాన్ మీద కంప్లయింట్ చేయాల్సి వచ్చింది. అంతే కాదు స్కూలు ఎప్పుడు నచ్చకపోయినా ఉన్నట్టుండి స్పృహ తప్పినట్టుగా పడిపోయి ఇల్లు చేరుకునేవాడు. చదువు సరిగా రాలేదు. డిగ్రీ అయ్యాక తల్లి లా చేయమని చేరిస్తే అటెండెన్స్ లేదని వాళ్లు బయటకు గెంటేశారు. ఫర్హాన్ తన జీవితంలో బుద్ధిగా కూచుని చేసిన పని ఒకటే ఒకటి. అది సినిమాలు చూడటం. అతడికి అత్యంత ప్రాణప్రదమైన సినిమా – ‘రేజింగ్ బుల్’. అతడికి బాగా నచ్చిన హీరో రాబర్ట్ డి నీరో. ‘డై హార్డ్’ సినిమాని 25 సార్లు కనీసం చూశాడు. ‘షోలే’ అంటే పిచ్చి. అమితాబ్బచ్చన్ అంటే వెర్రి. బహుశా తాను డైరెక్టర్ని అవుతానేమో అనుకునేవాడు. కాని అయ్యేది ఎలా? 2001లో ‘దిల్ చాహ్తా హై’ విడుదలైంది. డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్. అప్పటికి హిందీ సినిమా రంగంలో ‘బేటి నం.1’, ‘బీవీ నంబర్ 1’, ‘అనారీ నం.1’లాంటి సినిమాలు వస్తున్నాయి. యశ్రాజ్ వాళ్లు ‘మొహబ్బతే’ లాంటి బరువైన సినిమాలు తీస్తున్నారు. ఈ ధోరణిని సమూలంగా మార్చాలి అని నిర్ణయించుకున్నాడు ఫర్హాన్ అఖ్తర్. ముంబై మెట్రో యువత ఉద్వేగాలను, వారి ప్రేమలను, ఆశలను, గందరగోళాలను సినిమాటిక్గా కాకుండా నమ్మశక్యంగా తీస్తే బాగుంటుందని భావించాడు. అతడు ఏ స్క్రిప్ట్ రైటర్ దగ్గరా పని చేయలేదు. సినిమాలకు అసిస్టెంట్గా కూడా పని చేయలేదు. అతడికి ఉన్న అనుభవమల్లా ఒక క్రియేటివ్ ఏజెన్సీలో కొన్ని యాడ్స్కు డాక్యుమెంటరీలకు పని చేయడమే. కాని ఇంతకాలంలో చేసిన సినీ శోధన మీద అతడికి నమ్మకం ఉంది. అందుకే తన ఫ్రెండ్స్ జీవితంలో, తన జీవితంలో ఉన్న కొన్ని ఉదంతాలను తీసుకుని ‘దిల్ చాహ్తా హై’ స్క్రిప్ట్ రాశాడు. ఆకాష్, సమీర్, సిద్ధార్థ అనే ముగ్గురు కుర్రవాళ్ల కథ అది. ఆకాష్ తన జీవితం పట్ల నాన్ సీరియస్గా ఉంటాడు. సమీర్కు ప్రతీదీ గందరగోళం, అయోమయమే. సిద్దార్థ మెచ్యూర్డ్ కుర్రవాడే కాని అతడి ప్రేమ అతడి కంటే వయసులో చాలా పెద్దదైన స్త్రీ వైపు మళ్లుతుంది. ఈ అనుభవాల నుంచి ఎలా ఎదిగారన్నదే కథ. దీనికి ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చింది. కొత్త దర్శకుడికి ఎవరు దొరుకుతారు? అందుకే తన చిన్ననాటి స్నేహితుడు రితేష్ సిద్వాని తానే ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చాడు. ఇక యాక్టర్స్... హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ అనుకున్నాడు. ఇద్దరూ ఫర్హాన్ గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. డేట్స్ ఇవ్వలేదు. ఫర్హాన్కు ఏం చేయాలో తోచలేదు. ఆమిర్ఖాన్ గుర్తుకు వచ్చాడు. ప్రయత్నిద్దాం వస్తే కొండ పోతే వెంట్రుక అనుకుని ట్రై చేశాడు. ఆమిర్ ఖాన్ ఎంత తెలివైనవాడంటే తన దగ్గరకు వచ్చింది సామాన్యమైన స్క్రిప్ట్ కాదని చిటికెలో కనిపెట్టేశాడు. అందుకే వెంటనే లీడ్ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించాడు. మిగిలిన రెండు పాత్రలకు సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా ఎంపికయ్యారు. ‘దిల్ చాహ్తాహై’ విడుదలైంది. అప్పటి వరకూ ఉన్న సినిమా ధోరణుల్ని తిరగ రాసింది. హిందీ సినిమాలకు వెళ్లి రామ్గోపాల్ వర్మ ఒకరకమైన మార్పు తెస్తే ఫర్హాన్ అఖ్తర్ తన ‘దిల్ చాహ్ తాహై’తో మరో రకమైన మార్పు తెచ్చాడు. రియలిస్టిక్గా కనిపించే పాత్రలతో కమర్షియల్ సినిమా తీయొచ్చని నిరూపించాడు. సినిమాకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. అంతవరకూ ఫర్హాన్ అఖ్తర్ జావేద్ అఖ్తర్ కొడుకు. ఈ సినిమా నుంచి జావేద్ అఖ్తర్ ఫర్హాన్ అఖ్తర్ వాళ్ల నాన్న. సాధించడం అంటే అదీ. ఆ తర్వాత ఫర్హాన్ అఖ్తర్ కార్గిల్ వార్ నేపథ్యంతో హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలుగా ‘లక్ష్య’ సినిమా తీశాడు. ఆ తర్వాత తన తండ్రి రాసిన ‘డాన్’ సినిమాను ఈ కాలానికి తగినట్టుగా రాసి షారూక్ ఖాన్తో రీమేక్ చేశాడు. అయితే ఈ సమయంలోనే ఫర్హాన్కు ఒక బంగారం లాంటి అవకాశం మిస్ అయ్యింది. ‘రంగ్ దే బసంతీ’లో ముఖ్యపాత్ర ధరించమని దర్శకుడు రాకేష్ మెహ్రా అతణ్ణి అడిగాడు. అప్పటికి ఫర్హాన్ అఖ్తర్ దృష్టి దర్శకత్వం మీదే ఉంది. తను నటుణ్ణో కాదో తేల్చుకోలేకపోయాడు. అంతే కాదు ‘రంగ్ దే బసంతీ’ స్క్రిప్ట్ను సరిగ్గా జడ్జ్ చేయలేకపోయాడు. ఆ సినిమా విడుదలైంది. కనీ వినీ ఎరగని పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాతో నటుడిగా లాంచ్ అయి ఉంటే ఓవర్ నైట్లో ఫర్హాన్ స్టార్ అయి ఉండేవాడు. కాని మెట్లు మెల్లగానే ఎక్కాలని అతడికి రాసి పెట్టి ఉంది. ‘రాక్ ఆన్’ (2008) ఫర్హాన్ అఖ్తర్ మొదటగా నటించిన సినిమా. ఆ సినిమాలో ఒక ర్యాక్ బ్యాండ్లో లీడ్ సింగర్గా నటించాడు ఫర్హాన్. పాటలు కూడా పాడాడు. ఆ తర్వాత ‘కార్తిక్ కాలింగ్ కార్తిక్’, ‘లక్ బై చాన్స్’ సినిమాల్లో నటించాడు. కాని అతణ్ణి పెద్ద స్టార్ని చేసే అవకాశం, అతడిలోని నటుణ్ణి లోకానికి చూపే అవకాశం అతడి అక్క జోయానే ఇచ్చింది. దర్శకురాలిగా ఆమె తన తొలి ప్రయత్నం ‘జిందగీ నా మిలేగీ దుబారా’లో ఫర్హాన్ అఖ్తర్కు మంచి పాత్ర ఇచ్చింది. అందులో అతడు పోషించింది కూడా నిజ జీవితాన్ని పోలిన పాత్రనే. తండ్రి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోగా ఆ తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే కొడుకు పాత్ర పర్హాన్ది. ‘జిందగీ నా మిలేగీ దుబారా’ ఎంత పెద్ద హిట్ అంటే 55 కోట్లతో తీస్తే 150 కోట్లు వసూలు చేసింది. నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ కావడంతో అతడి పంట పండింది. కానీ అంత కంటే పెద్ద పంట ‘భాగ్ మిల్కా భాగ్’ రూపంలో అతడికి దక్కింది. ‘ఫ్లయింగ్ సిక్’గా ఖ్యాతి పొందిన మిల్కా సింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు రాకేష్ మెహ్రా సినిమా తీయాలనుకున్నాడు. ఆ పాత్రకు అడిగితే ఎవరైనా చేయడానికి ఎగిరి గంతేస్తారు. కానీ రాకేష్ ఫర్హాన్ను ఎంచుకున్నాడు. ఫర్హాన్ ఆ పాత్రను ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. ఇది మామూలు పాత్ర కాదు. పరిగెత్తే పాత్ర. పరిగెత్తి అందరి కంటే ముందు రావాల్సిన పాత్ర. దాని కోసం దేహ దారుఢ్యం కావాలి. పరిగెత్తడాన్ని ప్రాక్టీసు చేయాలి. గుండె గొంతులో కొట్లాడేలా ఉరకలెత్తాలి. ఫర్హాన్ అవన్నీ చేయడానికి సిద్ధ్దపడ్డాడు. ఈ సినిమా చూడటానికి ఒకరోజు షూటింగ్ స్పాట్కు వచ్చిన మిల్కా సింగ్ మొదట అపనమ్మకంగా ఫర్హాన్ వైపు చూశాడు. కానీ ట్రాక్ మీద అతడు పరిగెత్తడాన్ని చూసి ముప్ఫై ఏళ్ల క్రితం తాను పరిగెత్తినట్టుగానే భావించాడు. ‘జీతే రహో’(బతుకుతూ ఉండు) అని ఆశీర్వదించాడు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు జీత్ తే రహో (గెలుస్తూ ఉండు) అని ప్రోత్సహించారు. భాగ్ మిల్కా భాగ్ ఫర్హాన్ అఖ్తర్లోని ఒక గొప్ప నటుణ్ణి చూపించింది. ఇప్పుడు ఫర్హాన్ పరిపూర్ణమైన నటుడు. నిరూపించుకున్న దర్శకుడు. ఇంకేం కావాలి? కానీ స్క్రిప్ట్ అంత సులభంగా లేదు. తండ్రి లాంటి కథే పునరావృత్తమైంది. తాను సూపర్స్టార్ కాక మునుపే ఫర్హాన్ ‘అధూనా’ అనే హెయిర్ స్టయిలిస్ట్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముంబైలో సెలూన్స్ ఉన్నాయి. ఆమె కూడా ఇతణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు. కాని బహుశా ఫర్హాన్ అభిరుచులు, ఎదుగుదల, బిజీ, పేరు, కీర్తి వారిలో ఒక దూరాన్ని తీసుకొచ్చింది. గత సంవత్సరం అంటే 2016లో వాళ్లు విడిపోయారు. తన తండ్రి నిర్ణయంతో తాను ఎంత సఫర్ అయ్యాడో తెలిసి కూడా ఆ కఠినమైన నిర్ణయానికి తల ఒంచాడు ఫర్హాన్. ఫర్హాన్ ప్రస్తుతం నిర్మాతగా ఎక్కువ చురుగ్గా ఉన్నాడు. నటుడిగా ‘దిల్ ధడక్నే దో’ వంటి సినిమాల్లో ఆచి తూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఒక ప్రయాణం ముగిసి మళ్లీ మొదటికొచ్చినట్టయ్యింది అతడి పని. తండ్రి ఒక స్క్రిప్ట్ రాశాడు. తను ఒక స్క్రిప్ట్ ప్రయత్నించాడు. కానీ విధి రాసిన స్క్రిప్ట్లో తన ప్రమేయం లేని పాత్రను పోషిస్తున్నాడు. అతడి కోసం విధి ఏం రిజర్వ్ చేసి పెట్టి ఉందో మనం రాబోయే రోజుల్లో చూస్తాం. అందాక ‘దిల్ ధడక్ నే దో’. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పన్నెండేళ్ళ గ్యాప్ తర్వాత...
కొందరు నేతలు ‘భారత మాతా కీ జై’ అనడానికి నిరాకరించినందుకు విమర్శించి, వార్తల్లో నలుగుతున్న బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ దాదాపు 12 ఏళ్ల తర్వాత రెండు సినిమాల స్క్రిప్టు పనుల్లో బిజీ అయిపోయారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘లక్ష్య్’ తర్వాత ఏ చిత్రానికీ జావేద్ రచయితగా పని చేయలేదు. అయితే ఇప్పుడు సామాజిక సమస్యలే ఇతివృత్తంగా ఓ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అప్పులపాలై, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్నే స్క్రిప్ట్గా మార్చే పనుల్లో ఉన్నారు జావేద్. అలాగే, 1947లో ఇండియన్ హాకీ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకున్న సంఘటనను కూడా సినిమా స్క్రిప్ట్గా మారుద్దామని జావేద్ ప్లాన్. ఇంకేం! ఆల్ ది బెస్ట్! -
జావెద్ అఖ్తర్ రాయని డైరీ
మార్చి 21. రేపే! రాజ్యసభలో నా చివరి రోజు. రెప్పపాటులో టెర్మ్ అయిపోయింది! ఆరేళ్లు. ఆరు రెప్పపాట్లు. ఎక్కడిది ఇంత స్పీడ్? ఎవరు తిప్పుతున్నారు ఈ భూగోళాన్ని? తిప్పేవాళ్లు భూగోళాన్ని, రాజ్యసభని ఒకేలా తిప్పకుండా వేర్వేరుగా, వేర్వేరు వేగాలతో తిప్పుతున్నారా?.. ఒకే దేశంలో హిందువుల్ని, ముస్లింలను మత విశ్వాసాలు వేర్వేరుగా నడిపిస్తున్నట్టు!! దేశంలో ఎందరు దేవుళ్లయినా ఉండొచ్చు. కానీ దేవుళ్లందరికీ ఒకటే దేశం ఉండాలి. దేవుళ్లందరూ ఉంటున్నది ఒకే దేశంలో అయినప్పుడు వాళ్లందరిదీ ఒకే దేశం అవుతుందని రాజ్యాంగం పని గట్టుకుని చెప్పనక్కర్లేదు. అర్థమైపోవాలంతే. రాజ్యాంగం చాలా విషయాలు చెప్పదు. ప్రతి మనిషీ ఉదయాన్నే లేచి శుభ్రంగా పళ్లు తోముకోవాలని రాజ్యాంగం చెప్పదు. అయినా మనం తోముకోవడం లేదా? బట్టలు వేసుకుని మాత్రమే ప్రతి మనిషీ బయటికి రావాలని రాజ్యాంగం చెప్పదు. అయినా మనం వేసుకుని రావడం లేదా? విశ్వాసాలు మనుషుల్ని కాకుండా, దేవుళ్లను నడిపిస్తున్నప్పుడే.. ‘రాజ్యాంగంలో అలా లేదు కదా, రాజ్యాంగంలో ఇలా లేదు కదా’ అనే ప్రశ్నలు వస్తుంటాయి. లౌకికరాజ్యంలో ప్రజలు మాత్రమే కాదు, దేవుళ్లూ కలిసి మెలిసి ఉండాలి. ప్రజాస్వామ్యంలోని అందమే అది! సయ్యద్ షాబుద్దీన్ నుంచి ఫోను! ‘నువ్వెప్పటికి మారతావ్ అఖ్తర్’ అని ఆయన ఆవేదన. ‘మారడం’ అంటే ఆయన ఉద్దేశంలో నికార్సయిన ముసల్మాన్గా మారడం! ఎప్పుడూ చెప్పే మాటే చెప్పాను. ‘ఒకటే గుర్తు షాబుద్దీన్ జీ. అల్లర్లు జరిగి, శివసేన నా ఇంటిని తగలబెడితే కనుక నేను ముస్లింగా మారినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు’అన్నాను. రాజ్యసభలో మొన్నటి నా ప్రసంగం ఆయన్ని బాధించిందట. భరతమాతకు జై కొట్టనుగాక కొట్టనని ప్రకటించిన సాటి ముసల్మాన్ని నేను విమర్శించడం ఆయనకు కోపమైతే తెప్పించి ఉంటుంది కానీ, బాధను మాత్రం కలిగించి ఉండదని నాకు తెలుసు. షాబుద్దీన్ బాధపడరు. బైటపడతారు. ఇప్పుడూ అంతే. బాబ్రీ మసీదు కూల్చివేత, రాజ్యసభలో నా సెక్యులర్ ప్రసంగం ఆయనలో ఒకే విధమైన భావాలను రగిలించి ఉంటాయి. నన్నొక అలౌకికవాది ఆపి అడిగాడు. ‘అఖ్తర్జీ.. భారత్ మాతా కి జై అని అనడానికి నిరాకరించిన వారినీ, గోమాంసం తింటున్నారని ముస్లింలను చంపేసినవారినీ మీరు సమానంగా చూడగలరా?’ అని! మత భావనల్లోని తీవ్రత ఎలాంటిదైనా మనం ఖండించవలసిందే అన్నాను. ‘ముందు నీ నాస్తిక భావనల్లోని తీవ్రతను ఖండించుకో. దేవుడే చూసుకుంటాడు.. లోకంలో ఏ గొడవా లేకుండా’ అన్నట్లు చూశాడు! పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెయ్యొద్దన్న పని చేస్తారు. అదే పిల్లలు పెద్దవాళ్లయ్యాక చెయ్యమన్న పని చెయ్యరు. అందుకేనా.. ‘క్యాచ్ దెమ్ ఎంగ్’ అంటున్నాడు మోహన్ భగవత్?! భగవత్ని సపోర్ట్ చేసినందుకు నా ముస్లి సోదరులు నన్ను ఆరెసెస్లోకి తోసేయవచ్చు. ఏ మతం అయితే ఏమిటి? నేనున్నది భారత్లో అయినప్పుడు? భారత్ మాతా కి జై! - మాధవ్ శింగరాజు -
డాక్టర్ ఆర్థో బ్రాండ్ అంబాసిడర్ గా జావేద్ అక్తర్
హైదరాబాద్: ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఇక నుంచి దివిసా హెర్బల్ కేర్కు చెందిన ‘డాక్టర్ ఆర్థో’కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. సమాజంలో మంచి హోదా కలిగి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న జావేద్ అక్తర్ తమ ‘డాక్టర్ ఆర్థో’కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారని దివిసా హెర్బల్ కేర్ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా ఒక ప్రకటనలో తెలిపారు. -
'మిస్టర్ ఇండియా-2'లోనూ శ్రీదేవి, అనిల్ కపూర్!
ముంబై: అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన 'మిస్టర్ ఇండియా' సినిమా విడుదలై నేటికి 27 సంవత్సరాలు. బాలీవుడ్ క్లాసిక్గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ సినిమాకు మళ్లీ సీక్వెల్ తీస్తే.. అందులో మళ్లీ హీరోహీరోయిన్లుగా నటించేందుకు అనిల్ కపూర్, శ్రీదేవి జోడీ నూటికినూరుపాళ్లు సరిపోతుందని ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ పేర్కొన్నారు. 'ఆ సినిమాకు వయస్సైంది కానీ అందులో ముఖ్య పాత్రలు పోషించిన నటులకు కాదు. 'మిస్టర్ ఇండియా'కు సీక్వెల్ తీయాలని బోనీ కపూర్ భావిస్తున్నారు. అందులో మళ్లీ అనిల్ కపూర్, శ్రీదేవీని హీరోహీరోయిన్లుగా పెడితే ఏ సమస్య ఉండదు. ఆ పాత్రలకు వారు ఇప్పుడు కూడా సరిపోతారు' అని ఆయన పేర్కొన్నారు. 17వ జియో మామి ముంబై చలనచిత్రోత్సవం సందర్భంగా 'మిస్టర్ ఇండియా' చిత్రయూనిట్ ఆనాటి జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకున్నది. -
స్నేహం... ప్రేమ కలిస్తే!
దేడ్ కహానీ - దిల్ చాహ్తా హై ‘‘మనసు కోతి లాంటిది. యుక్త వయసులో ఏది పడితే అది కోరుకుంటుంది. బుద్ధి... బుద్ధిగా ఉండమని ఎంత చెప్పినా మనసు వినదు. ఎప్పుడో విధి ఒక హెడ్మాస్టారిలా ఏదన్నా ఒక సంఘటన రూపంలో లాగి మనసుని కొట్టినప్పుడు బుద్ధిగా మాట వింటుంది. ఆ అనుభవాన్ని పాఠంలా అవలోకనం చేసుకుంటుంది. ఆ తర్వాత కూడా నిలబడేవే నిజమైన బంధాలు. అవే ఆ జన్మకి అందాలు.’’ ఈ వ్యాసం రాయడం కోసం ‘దిల్ చాహ్తా హై’ సినిమా మళ్లీ చూసినప్పుడు నాకిలా అర్థమైంది. కొన్ని సినిమాలు మొదటిసారి చూస్తే బావుండీ, బాలేక అటు ఇటుగా అనిపిస్తుంటాయి. తర్వాత వాటి రన్లో వాటి విలువ రోజురోజుకీ పెరిగి చివరికి అవి కల్ట్ ఫిల్మ్గానో, ఎపిక్ ఫిల్మ్గానో నిలుస్తాయి. దిల్ చాహ్తా హై... ఆ కోవకు చెందిన సినిమా. ‘షోలే’ రాసిన గొప్ప రచయితలు సలీమ్, జావేద్లలో జావేద్ అఖ్తర్ కొడుకు ఫర్హాన్ అఖ్తర్. చిన్నప్పట్నుంచీ సినిమా కుటుంబం, ఎగువ మధ్య తరగతి, ఆపైన సంపన్న జీవితాల సావాసం. ఆ యువత జీవనశైలితో ఓ కథ రాసుకున్నాడు. అది కూడా నెలన్నరపాటు అమెరికాలో హాలిడేకి వెళ్లినప్పుడు తన స్నేహితుల్ని కలిసి, వారితో సాగిన ముచ్చట్ల నుంచి, వారి ప్రేమకథల గురించి ఒక కథ రాసుకున్నాడు. అందుకే దిల్ చాహ్తా హై సినిమాలో నిజ జీవిత దర్పణం ఉంది. జీవం ఉంది. ప్రాథమిక హిందీ సినిమా కమర్షియల్ సూత్రాలన్నింటినీ బ్రేక్ చేసినా, కమర్షియల్గా హిట్ అవ్వగలిగిన ఆత్మ ఉంది. ఆకాష్, సమీర్, సిద్ధూల పాత్రల్లో ప్రతి మిలీనియం యువకుడూ తనని తాను చూసుకున్నాడు. పక్కింటి ఆంటీకి సైటు కొట్టడం నుంచి, నచ్చిన ప్రతి అమ్మాయినీ ప్రేమించేయడం నుంచి, అమ్మాయి కోసం ఫ్రెండ్స్తో కూడా దెబ్బలాడి దూరం అవ్వడం నుంచి, ప్రేమ, విరహం, బాధ, నవ్వులు, మళ్లీ కలుసుకోవడం, అనుభూతులు - అన్నింట్లోనూ ఐడెంటిఫై అవ్వక తప్పని బలమైన సహజ పాత్రలు సృష్టించాడు దర్శక రచయిత ఫర్హాన్ అఖ్తర్. అలాగే శాలిని, దీప, ప్రియ, పూజ, తార ఆంటీ - ఆధునిక భారతావని వనితల్లో ప్రతి ఒక్కరూ వీళ్లల్లో కనపడతారు. కన్ఫ్యూజన్లు, కోపాలు, ప్రేమలు, విరహాలు... అన్నీ. పోస్టర్ చూశాక: ఒక మోడర్న్ కామెడీ సినిమా విత్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అనిపించింది. ఆమిర్ఖాన్, ప్రీతిజింతా కోసం, ‘దిల్ చాహ్తా హై’ అని మంచి టైటిల్ పెట్టాడు కాబట్టి ‘దిల్తో పాగల్ హై’లో సగం ఉన్నా చాలనుకుని వెళ్లాలనుకున్నాను. దర్శకుడి మొదటి సినిమా అనగానే కాస్త భయం ఉంటుంది మనసులో నాకెప్పుడూ - అదృష్టవశాత్తూ ఫర్హాన్ అఖ్తర్ రెండో సినిమా ‘లక్ష్య’కి భయపెట్టాడు కానీ, మొదటి సినిమా ‘దిల్ చాహ్తా హై’ని అద్భుతంగా కన్నా కొంచెం ఎక్కువ బాగా తీశాడు. నిజ జీవిత పాత్రల స్వభావాలు, కొన్ని సంఘటనలు స్నేహితుల నుంచి సేకరించినా, మరికొంత డ్రామాని, కథని షేక్స్పియర్ రాసిన ‘మచ్ ఎడో అబౌట్ నథింగ్’ నుంచి ప్రేరణ పొందినట్టు ఉంటుంది. మొదట ఆమిర్ఖాన్కి సిద్ధూ పాత్రని ఆఫర్ చేస్తే, ఆయన కథంతా విని ఆకాష్ పాత్ర నాకు బాగా దగ్గరగా ఉంది, ఆ పాత్రనే చేస్తానని ఎంచుకున్నార్ట. చాలాకాలం తర్వాత డింపుల్ కపాడియాని ఒప్పించి తార పాత్రకి తెచ్చుకోవడం ఫర్హాన్ కృషే. అలాగే అభిషేక్ బచ్చన్ మొదట సిద్ధూ పాత్రని ఒప్పుకుని, చివరి నిమిషంలో డ్రాప్ అయితే, ఆ అవకాశం అక్షయ్ఖన్నా దక్కించుకున్నాడు. అలా, ఆమిర్ఖాన్, సైఫ్ అలీఖాన్, అక్షయ్ఖన్నా స్నేహితుల పాత్రలకి సెట్ అయ్యారు. కథ గురించి చెప్పుకుంటే... ఆకాష్ ధనవంతుల బిడ్డ - ప్రేమ, దోమ లాంటి ఫీలింగ్స్ని నమ్మడు. ఫ్లర్ట్ చేసి వదిలేస్తుంటాడు ఏ అమ్మాయినైనా. సమీర్, సిద్ధూ ఎగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. సమీర్ ఏ అమ్మాయినైనా ఇట్టే ప్రేమించేసి, అదే నిజమని నమ్మేస్తుంటాడు. సిద్ధూ చాలా ముభావి. స్వతహాగా పెయింటర్. వీళ్ల స్నేహంలో వచ్చిపోయే సబ్ క్యారెక్టర్లే హీరోయిన్లు, తల్లిదండ్రులు అందరూ. ఈ స్నేహం విడిపోయినట్టు మొదటి సీన్లో చెప్పి, అక్కణ్నుంచి వీళ్ల ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. విశ్రాంతి సమయానికి సిద్ధూ, ఆకాష్ ఒకరినొకరు తిట్టుకుని విడిపోతారు. సెకెండ్ హాఫ్లో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఒంటరిగా వాళ్లు తీసుకున్న నిర్ణయాలు, వాటి మంచీ చెడులు - చివరికి ముగ్గురూ కలవడం. ఇది కథ కాదు - కొందరి జీవితం. పాత్రల స్వభావాలకు అనుగుణంగా రాసుకున్న సంఘటనలు, వాటివల్ల ఉత్పన్నమయ్యే ఎమోషన్లు - కాబట్టి ఈ సినిమాలో పాత్రలు ఏడిస్తే మనకు ఏడుపొస్తుంది. పాత్రలు నవ్వితే మనకి నవ్వొస్తుంది. పాత్రలు దెబ్బలాడుకుంటే మనకి బాధేస్తుంది. పాత్రలు మళ్లీ కలుసుకుంటే మనకు కళ్లు చెమ్మగిల్లుతాయి. ఈ పాత్రలకి తోడు వాళ్ల స్టైలింగ్, వాళ్లు నివసించే ఇళ్లు, గదులు, ఫర్నిచర్, కాస్ట్యూమ్స్ అన్నీ అంతే న్యాచురల్గా, అంతే అందంగా ఉండటం చెప్పుకోదగ్గ విషయం. శంకర్, ఎహ్సాన్, లాయ్ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. పాటలెక్కడా అసందర్భంగా ఉండవు. సీన్ల మధ్యలో ఒక్కో సీన్లాగే పాట వచ్చి వెళ్తుంది - సాహిత్యం కూడా క్యారెక్టర్లు మాట్లాడుకున్నట్టే ఉంటాయి. డ్యాన్సర్లు, స్టెప్పులు లేకుండా సినిమాలో అన్ని పాటలూ తీయడం ఈ సినిమాకి క్లాస్ని ఆపాదించింది. ‘దిల్ చాహ్తా హై’ టైటిల్ ట్రాక్, జానెక్యూం లోగ్ ప్యార్ కర్తే హై, తన్హాయీ... అన్ని పాటలూ దేనికవే సూపర్హిట్లు. అన్నీ కథను ముందుకు నడిపించేవే. రవి.కె.చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, చెన్నైలో సౌండ్ ఇంజినీరు మీడియా ఆర్టిస్ట్ శ్రీధర్... వీళ్లంతా భారతీయ మిలీనియం సినిమా మీద దక్షిణాది నుంచి బలమైన ముద్ర వేసిన సాంకేతిక నిపుణులు. జావేద్ అఖ్తర్ అన్ని పాటలూ యువతీ యువకుల మనోభావాల, భావాల సంఘర్షణలని, ఆనందాల్ని అక్షరీకరించాయి. పెట్టిన ప్రతి రూపాయికీ మరో రూపాయి లాభాన్ని తెచ్చి పెట్టిన చిత్రం ‘దిల్ చాహ్తా హై’. ఈ సినిమాలో మాటల్లాగ, ఇది ఆకాష్ మ్యాజిక్. ఇది ఫర్హాన్ అఖ్తర్ మ్యాజిక్ - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
మగ్దూం షాయరీలంటే పిచ్చి
జావేద్ అఖ్తర్.. సాహిత్యంలో సుస్థిరమైన పేరు! సినిమారంగానికొస్తే ఆ పేరు తెలియనివారు లేరు! హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అఖ్తర్సాబ్ కాసేపు సాగించిన చిట్చాట్.. భాష.. ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే కాదు.. సంస్కృతికి ప్రతిబింబం. ప్రపంచాన్ని అనుసంధానం చేసే వారధి. ప్రతి భాష దేనికదే గొప్పది. అయితే ప్రపంచంతో కమ్యూనికేషన్ కొనసాగాలంటే ఓ కామన్ భాష మాత్రం ఉండాలి. అందుకే మాతృభాషతో పాటు విధిగా దేశంలో అయితే జాతీయ భాష హిందీని, అంతర్జాతీయంగా ఇంగ్లిష్ను తప్పకుండా నేర్చుకోవాలి. మాతృభాష చెట్టుకు వేరులాంటిదైతే.. ప్రపంచంతో మనం మాట్లాడే భాష కొమ్మలాంటిది. చెట్టుకు కొత్త రెమ్మలతో కొమ్మలు విస్తరించడం ఎంత అవసరమో, నేలలో బలంగా వేళ్లూనుకోవడమూ అంతే అవసరం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే చెట్టు పచ్చగా ఉంటుంది. నీ భాషను ప్రేమించడమంటే ఇతర భాషలను ద్వేషించడమని కాదుకదా! సాహిత్యం.. భాషకు ప్రాణం సాహిత్యం. భాష ద్వారా సంస్కృతిని చాటేది సాహిత్యమే. అలాంటి విలువైన ప్రపంచ సాహిత్యాన్ని చదవాలంటే అనువాదాలు తప్పనిసరి. ఈ అనువాదాలే లేకుండా మాక్సిమ్ గోర్కి నవల ‘అమ్మ’ను మనం చదివుండేవాళ్లం కాదు. ఇలాంటివెన్నో! నా కవిత్వం నాకు తెలియని కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ లాంటి ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. ఉర్దూ.. హైదరాబాద్ పేరు లేకుండా ఉర్దూని ఊహించలేం. ఇక్కడి ఉర్దూ అయితే దక్కనీగా ఓ ప్రత్యేకతను పొందింది. ఈ నేల ఉర్దూ సాహిత్యంతో తరించిపోయింది. మగ్దూం మొహియుద్దీన్లాంటి కవులు తమ కవిత్వంతో ఉర్దూ భాష ఉన్నతిని చాటారు. నిన్న జైపూర్ లిటరరీ ఫెస్టివ ల్లో కూడా ఆయన షాయరీల గురించి ప్రస్తావన వచ్చింది.. కొన్ని షాయరీల్లో ఆయన వ్యక్తపరిచిన భావాలు అద్భుతం. అంతకుముందు నేనెప్పుడూ చదవలేదు. అలాగే షాద్సాబ్.. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయన గజల్స్, షాయరీలంటే నాకు ప్రాణం. నేటి అభివృద్ధికి అద్దం పడుతున్నట్టు ఉంటాయి. ఇలా ఉర్దూ సాహిత్యంలో హైదరాబాద్ కంట్రిబ్యూషనూ వెలకట్టలేనిది. హైదరాబాద్తో అనుబంధం.. చాలా ఉంది. ఇప్పుడే అన్నీ చెప్పేస్తే.. లిటరరీ ఫెస్టివల్ కీనోట్లో చెప్పడానికి ఏమీ ఉండదు. అందుకే చాలా దాస్తున్నాను (నవ్వుతూ) ఇక్కడివాడైన మగ్దూం మొహియుద్దీన్కి పిచ్చి అభిమానిని. అంటే పరోక్షంగా హైదరాబాద్తో అనుబంధం ఉన్నట్టే కదా. ఇక ప్రత్యక్షంగా చూసుకున్నా సంబంధం, అనుబంధం ఉంది. నా భార్య షబానాది హైదరాబాదే.. అంటే ఈ సిటీ నా అత్తగారిల్లన్నట్టే కదా! మా ఇల్లంతా ఇప్పటికీ బగారా బైంగన్, కట్టాసాలన్ వంటలతో ఘుమఘమలాడుతూనే ఉంటుంది. - శరాది -
హరిహరన్, అక్తర్ల 'థీమ్ సాంగ్'
తిరువనంతపురం: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న జాతీయ క్రీడలకు ప్రముఖ గాయకుడు-స్వరకర్త హరిహరన్, రచయిత జావేద్ అక్తర్... ఇతివృత్త గీతం(థీమ్ సాంగ్) అందించనున్నారు. 35వ జాతీయ క్రీడలు జవనరి 31న ప్రారంభంకానున్నాయి. దీనికోసం మూడు నిమిషాల పాటు సాగే ప్రారంభ గీతాన్ని హిందీ భాషలో జావేద్ అక్తర్ రాయనున్నారు. హరిహరన్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ ప్రారంభ గీతావిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిని చాటేలా ఈ పాట ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంఎఫ్ రేడియో ద్వారా దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
సచిన్ కంటే అక్తర్ నయం!
తాము రాణించిన రంగాలకు ఎంతో కొంత చేస్తారని పెద్దల సభకు పంపిస్తే సభకు రావడమే లేదు కొంత మంది సెలబ్రిటీలు. ఈ జాబితాలో క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సీనియర్ నటి రేఖ ముందు వరసలో ఉన్నారు. వీరు రాజ్యసభకు హాజరైన రోజులు వేళ్ల మీదే లెక్కింవచ్చంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సచిన్, రేఖలను యూపీఏ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయడంతో ఆయా రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని భావించారు. మేలు సంగతి పక్కనపెడితే సభలో వీరు కనిపించడమే గగనమైపోయింది. 2012 ఏప్రిల్ 12న నామినేట్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే మాస్టర్ సభకు వచ్చారంటే అవాక్కవలసిందే. గతేడాది నవంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన సచిన్- సభకు హాజరయ్యే విషయంలో స్పీడ్ పెంచలేదు. రిటైర్ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే సభలో కాలుపెట్టారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచిన్ ఇప్పటివరకు పెద్దలసభకు హాజరుకాలేదు. గత డిసెంబర్ నుంచి ఈ జూలై వరకు 35 సెషన్స్ నడిచినా సచిన్ కు సమయం చిక్కలేదు రేఖ ఏడు రోజుల పాటు సభకు హాజరయి సచిన్ బాటలోనే నడిచారు. 2012 మే నుంచి జూలై 2014 మధ్య కాలంలో ఆమె వారం రోజులు సభకు హాజరయ్యారు. సచిన్, రేఖ పాటు నామినేటయిన కవి-రచయిత జావేద్ అక్తర్ వీరి కంటే ఎక్కువ రోజులు సభకు హాజరయి నయమనిపించారు. సభా కార్యక్రమాలను వింటూ ఆయన మౌనమునిగా ఉండిపోయారు. -
అమీర్ ను మెచ్చుకున్న జూవేద్ ఆక్తర్
-
సీఆర్పీఎఫ్ కోసం అక్తర్ గీతం
28న రాష్ట్రపతి ఆవిష్కరణ న్యూఢిల్లీ: దాదాపు 3 లక్షల మంది సిబ్బందితో దేశ భద్రతలో ప్రధాన భూమిక పోషిస్తున్న కేంద్ర పారామిలిటరీ బలగాల(సీఆర్పీఎఫ్) సేవలను కొనియాడుతూ ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ఓ గీతాన్ని రాశారు. ‘హం హే దేశ్కే రక్షక్..’ అంటూ సాగే ఈ గీతాన్ని సీఆర్పీఎఫ్ 75వ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సీఆర్పీఎఫ్కు ఇప్పటికే ఓ గీతం ఉన్నప్పటికీ తాజా సేవలు, పరిణామాల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ దిలీప్ త్రివేదీ ఈ గీతాన్ని రాయించారని వివరించారు. నక్సల్స్ వ్యతిరేక పోరులో విజయం సాధించిన బలగాలకు ఆవిర్భావ దినోత్సవంలో శౌర్య పతకాలను అందించనున్నట్టు తెలిపారు. -
సైనికుల కోసం కలం పట్టిన జావెద్
ముంబై: దేశరక్షణకు అమూల్యమైన సేవలు అందిస్తున్న కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) జవాన్ల కోసం ప్రముఖ సినీకవి జావెద్ అఖ్తర్ ప్రత్యేకంగా పాట రాసిపెట్టారు. ఈ సంస్థ వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఈ గేయాన్ని సృష్టించారు. రాజుసింగ్ సంగీతం అందించిన ఈ పాటను జావెద్ అలీ పాడాడు. ‘దేశ్ కే హమ్ హై రక్షక్, జాన్ భీ దే దే బిషక్, దేశ్ కీ రక్షా మే, వీర్ జియా లే హమ్ హై, శస్త్ర సంభాలే హమ్ హై, దేశ కీ రక్షా మే, జైజై భారత్, జై సీఆర్పీఎఫ్’ అంటూ ఈ గేయం సాగుతుందని సంస్థ ప్రజాసంబంధాల అధికారి బీసీ ఖండూరీ తెలిపారు. సీఆర్పీఎఫ్ వవజ్రోత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీ విజ్ఞాన్భవన్లో ఈ నెల 28న ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పాటను ఆవిష్కరిస్తారు. దీని గురించి అఖ్తర్ మాట్లాడుతూ ‘సీఆర్పీఎఫ్ కొన్ని నెలల క్రితమే నన్ను ఈ విషయమై అడిగింది. పాట రాయడం సులువే అనుకున్నా గానీ పెన్ను పట్టినప్పుడల్లా ఇది వరకు రాసిన పాటల మాదిరే ఉందనిపించేది. నేను ఇప్పటికే ఇండియన్ మిలిటరీ అకాడమీ, సీఐఎస్ఎఫ్కు కూడా పాటలు రాశాను. ఇది మూడోది. పెరైండింటికి విభిన్నంగా ఉండేలా రాయడం సవాల్. ఎట్టకేలకు రచన ముగించాను. రాజు దీనికి మంచి సంగీతం అందించాడు. అందరూ ఈ గేయాన్ని మెచ్చుకున్నారు’ అని అఖ్తర్ వివరించారు. పాట ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా సీఆర్పీఎఫ్ ఈ కవిని ఆహ్వానించింది. సీఆర్పీఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలకు తగ్గట్టుగా పాడడానికి ఎంతో శక్తిని ఉపయోగించాల్సి వచ్చిందని జావెద్ అలీ అన్నాడు. ‘ఈ పాట రికార్డింగుకు దాదాపు 20 రోజులు పట్టింది. సీఆర్పీఎఫ్ పాట పాడినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. అయితే రికార్డింగ్ తరువాత నా గాత్రం కూడా దెబ్బతింది’ అని అలీ వివరించాడు. -
‘జంజీర్’ రీమేక్పై స్టేకు బాంబే హైకోర్టు నిరాకరణ
ముంబై: బాలీవుడ్లో ఘన విజయం సాధించిన 1973 నాటి ‘జంజీర్’ సినిమా రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు సోమవారం నిరాకరించింది. దీనిపై కథా రచయితలు సలీమ్ఖాన్, జావెద్ అక్తర్లు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. పాత జంజీర్ చిత్ర కథ, స్క్రిప్ట్, డైలాగులకు సంబంధించిన కాపీరైట్లు తమ వద్ద ఉన్నాయని...అందువల్ల అదే పేరుతో దాన్ని రీమేక్ చేసిన నాటి నిర్మాత ప్రకాశ్ మెహ్రా కుమారుల నుంచి రూ. 6 కోట్ల పరిహారం ఇప్పించాలని సలీమ్, జావేద్లు కోర్టును కోరారు. అయితే పిటిషనర్లు ఆలస్యంగా కేసు వేసినందున ఈ చిత్రంపై స్టే విధించాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రామ్చరణ్తేజ జంజీర్ రీమేక్ ద్వారా తొలిసారి బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. -
ర్యాంపుపై అదరగొట్టిన షబానా - జావేద్ అఖ్తర్
ముంబైలో జరుగుతున్న భారత అంతర్జాతీయ జ్యూయెలరీ వీక్ వేదికపై బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, ఆమె భర్త, గేయ రచయిత జావేద్ అఖ్తర్ మెరుపులు మెరిపించారు. దంపతులిద్దరూ కలిసి తొలిసారిగా ర్యాంప్పై నడిచి ఆహూతులను అలరించారు. గోలెచా జ్యూయెల్స్ తరఫున వీరు ర్యాంపుపై నడిచి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. 61 ఏళ్ల షబానా ఎరుపు, నలుపు లెహంగా ధరించి, నెక్లెస్ పెట్టుకోగా, జావేద్ అఖ్తర్ నల్లటి షేర్వానీ ధరించి తానూ రకరకాల నగలు పెట్టుకున్నారు. 'రాయల్ ఇండియన్ బ్రైడ్స్' పేరుతో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో అద్భుతమైన కట్ వజ్రాలు, సానపట్టని ముడి వజ్రాలు, ముత్యాలు, పగడాలు, కెంపులు.. ఇలా ఎన్నింటినో ప్రదర్శించారు. ఉమ్రావో జాన్, లక్ బై ఛాన్స్, ద్రోణ లాంటి అనేక సినిమాలకు ఆభరణాలు సమకూర్చడంతో పాటు మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాలను కూడా గోలెచా జ్యూయెలరీ సంస్థ అందించింది. బుధవారం నాటి ప్రదర్శనలో షబానా జంట ధరించిన నగలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విక్రం ఫడ్నిస్ డిజైన్ చేశారు.