Jayant Sinha
-
గంభీర్ బాటలో.. ఎన్నికలకు దూరంగా కేంద్ర మాజీ మంత్రి
ఢిల్లీ: బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని.. రాజకీయాల నుంచి వైదొలగానుకుంటున్నట్లు గౌతం గంభీర్ ప్రకటించిన వేళ.. మరోనేత అదే రీతిన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సీనియర్.. ఎంపీ జయంత్ సిన్హా వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. జయంత్ సిన్హా.. గతంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్లోని హజారీబాగ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.‘నన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరుతున్నా. నేను ప్రపంచ పర్యావరణ మార్పుల విషయంలో భారత్పై పూర్తి దృష్టి సారించాలనుకుంటున్నా. నేను ఆర్థిక, ప్రభుత్వపరమైన విషయాల్లో బీజేపీ పార్టీకి అన్ని రకాలుగా సేవలందిస్తా. .. గత పదేళ్లుగా హజారీబాగ్కు సేవలు అందించినందుకు గర్వపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ నాయకత్వం ఆశీస్సులతో చాలా మంచి అవకాశాలు పొందాను. వారందరికీ నా కృతజ్ఞతలు. జైహింద్’ అని జయంత్ సిన్హా ఎక్స్( ట్విటర్) వేదికగా ప్రకటించారు. I have requested Hon’ble Party President Shri @JPNadda ji to relieve me of my direct electoral duties so that I can focus my efforts on combating global climate change in Bharat and around the world. Of course, I will continue to work with the party on economic and governance… — Jayant Sinha (@jayantsinha) March 2, 2024 ఐఏఎస్ మాజీ అధికారి.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే జయంత్ సిన్హా అని తెలిసిందే. సుదీర్ఘకాలం బీజేపీతో రాజకీయాల్లో ఉన్న యశ్వంత్ సిన్హా.. తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. 2022లో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షల తరఫున అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇలా ఇద్దరూ సిట్టింగ్ ఎంపీలు తాము వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయమని.. రాజకీయాలకు దూరం ఉంటామని ప్రకటించటం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే మరోవైపు బీజేపీ ప్రకటించే ఎంపీ అభ్యర్థుల జాబితాలో వీరికి టికెట్ లభించకపోవచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకేవారు రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక..బీజేపీ మొదటి జాబితాలోనే సుమారు వంద మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయ. ఆ దిశగా బీజేపీ రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి ఎన్నికలు: మరి ఆయన మద్దతు ఎవరికో?
న్యూఢిల్లీ: మొత్తానికి రాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో.. అధికార, విపక్షాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, సుమారు 22 పార్టీల మద్ధతుతో ప్రతిపక్షాల సంయుక్త అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్లు వేయనున్నారు. అయితే.. కుటుంబమా? లేదంటే రాజకీయమా? అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా నడుస్తోంది. బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా తండ్రి యశ్వంత్ సిన్హా.. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల బరిలో, అదీ ప్రత్యర్థి వర్గం నుంచి ఉన్నారు. అదే సమయంలో పార్టీ బలపరుస్తున్న ద్రౌపది ముర్ముకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు. పేద, వెనుకబడిన వర్గాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు. అందుకోసమే ఆమెకు ఈ గౌరవం దక్కింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు.’’ అలాగే.. ఎన్నికల బరిలో నా తండ్రి(యశ్వంత్ సిన్హా) కూడా ఉన్నారు. అలాగని.. ఈ వ్యవహారాన్ని కుటుంబ వ్యవహారంగా చూడొద్దని కోరుతున్నారు ఆయన. ఒక బీజేపీ కార్యకర్తగా, పార్లమెంటేరియన్గా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటా అని తెలిపారాయన. -
సిన్హా వ్యాఖ్యలతో ఇరకాటంలో కాషాయ పార్టీ
పట్నా : కేంద్ర మంత్రి, హజారిబాగ్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి జయంత్ సిన్హా గ్లోబల్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ను మసూద్ అజర్జీ అని సంభోదించడం కాషాయ పార్టీలో కలకలం రేపుతుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ‘దేశ భద్రతకు ఇది మైలురాయి వంటిది..మేం చేపట్టిన ప్రయత్నాలు నెరవేరి మసూద్ అజర్జీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింద’ని జయంత్ సిన్హా వ్యాఖ్యానించారు. బిహార్లోని రామ్గఢ్ జిల్లాలో ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మసూద్ అజర్ను సాహెబ్గా పిలిచిన బిహార్ మాజీ సీఎం, మహాకూటమి నేత జితన్ రాం మాంఝీని బీజేపీ మందలించిన కొద్ది గంటల్లోనే సిన్హా నోరుజారడం గమనార్హం. మన్మోహన్ సింగ్ హయాం నుంచి మసూద్ అజర్ సాహెబ్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించే ప్రయత్నాలు సాగినప్పటికీ ఇప్పటికి ఆ నిర్ణయం వెలువడటం కాకతాళీయమేనని జితన్ రాం మాంఝీ వ్యాఖ్యానించారు. మాంఝీ వ్యాఖ్యలపై కాషాయ పార్టీ అభ్యంతరం లేవనెత్తగా తాజాగా తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా మసూద్జీ అంటూ సంభోదించడం ఆ పార్టీని ఇరకాటంలో పడవేసింది. -
మీడియాతో మంత్రి.. అమ్మాయి కొంటెపని!
న్యూఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి జయంత్ సిన్హా మీడియాతో సీరియస్గా మాట్లాడుతుండగా.. ఓ అమ్మాయి చేసిన తమషా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలోనే ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో రైతులు, వేతన జీవులపై వరాల జల్లు కురిపించారు. అయితే బడ్జెట్ సెషన్ అనంతరం జయంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. ఆయన సీరియస్గా తమ ప్రభుత్వ బడ్జెట్పై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడుతుండగా.. ఆయన వెనకాల ఉన్న ఓ అమ్మాయి కొంటె పనిచేసింది. కెమెరాను చూసి నాలుకను బయటపెట్టి వెక్కిరిచ్చింది. అయితే ఆమె తమాషా కొద్ది చేసిన ఈ పని ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఆ అమ్మాయి బడ్జెట్పై తన అభిప్రాయాన్ని తెలిపిందని ఒకరు, బడ్జెట్కు సూపర్బ్ రివ్యూ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల అనంతరం భారత్ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి తాజా బడ్జెట్ ట్రైలర్ మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడగా.. ప్రతిపక్షాలు మాత్రం కేవలం ఎన్నికల జిమ్మిక్కేనని విమర్శిస్తున్నాయి. Who's this kid? Photo bombing a minister outside parliament on budget day is no mean feat. #Budget2019 pic.twitter.com/pwIpGXaF9e — Devjyot Ghoshal (@DevjyotGhoshal) February 1, 2019 -
‘వైజాగ్ ఎయిర్పోర్ట్ మూతపడదు’
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు యధావిధిగానే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ గత నవంబర్ 26న జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలాంటి మేజర్ ఎయిర్పోర్ట్ను మూసేయడం వలన దానిపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పెట్టిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని, కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలను కొనసాగించాలని స్టీరింగ్ కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఏఏఐఈ సమాచారాన్నిఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీఎల్)కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. కొండపల్లి ఆయిల్ పైపులైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ చట్టబద్ధంగానే పరిహారం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వినిమయ హక్కు కింద జరిగే భూసేకరణలో యాజమాన్యం మారదని స్పష్టం చేశారు. భూమి సొంత దారుడే యజమానిగా కొనసాగుతారని చెప్పారు. అలాగే పైప్లైన్ నిర్మాణం సందర్భంగా పంటలు, చెట్లు, కట్టడాలకు ఏదైనా నష్టం జరిగిన పక్షంలో సంబంధింత అధికారులు ఆ నష్టాన్ని మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లించడం జరుగుతుందని కూడా వివరించారు. -
డ్రోన్ ద్వారా అవయవాలు!
న్యూఢిల్లీ: ఓ నగరంలోని ఆసుపత్రిలో దాత నుంచి సేకరించిన అవయవాలను నిమిషాల వ్యవధిలో మరో ఆసుపత్రిలోని రోగికి అమర్చవచ్చు. ఒకచోటి నుంచి మరోచోటికి అత్యవసర పరిస్థితుల్లో మందుల్ని అప్పటికప్పుడు చేరవేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త డ్రోన్ ద్వారా ఈ రెండు ఘటనలు వాస్తవరూపం దాల్చనున్నాయి. ఈ విషయమై పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ..‘ఆసుపత్రుల మధ్య డ్రోన్ల రాకపోకల కొత్త డ్రోన్ విధానానికి సంబంధించి డిసెంబర్ 1(నేటి) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరించిన నెలరోజుల తర్వాత డ్రోన్ల వినియోగానికి లైసెన్సులు జారీచేస్తాం. దేశవ్యాప్తంగా కొన్నిప్రాంతాల్లో డ్రోన్ల ప్రయాణ దూరాన్ని విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ కొత్త విధానానికి సంబంధించిన నిబంధనలను 2019, జనవరి 15న భారత్లోని ముంబైలో జరిగే ప్రపంచ విమానయాన సదస్సులో విడుదల చేస్తాం. అంతేకాకుండా కొత్త డ్రోన్ విధానంలో భాగంగాసరుకుల రవాణాకు ఒకే ఆపరేటర్ బహుళ డ్రోన్లను వినియోగించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది’’ అని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో భారత్ తొలి డ్రోన్ విధానాన్ని, నియమనిబంధనల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందిస్తూ..‘సహాయక చర్యలు, ఏరియల్ సర్వే, పంటల అంచనా, సరుకుల చేరవేత తదితర రంగాల్లో డ్రోన్ల సేవలను గణనీయంగా వాడుకోవచ్చు. వీటి వినియోగానికి డిజిటల్ ‘కీ’ని జారీచేస్తాం. ఓటీపీ ద్వారా రిజస్టర్ అయ్యాక మాత్రమే డ్రోన్లు టేకాఫ్ కాగలవు’ అని ఆయన వెల్లడించారు. -
కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు
సాక్షి, న్యూఢిల్లీ : వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు రెండో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నేడు రాజ్యసభలో ఆర్టీఐ అనుబంధ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు లోక్సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. చెన్నై విమానాశ్రయం విస్తరణ పనులపై అన్నాడీఎంకే సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జయంత్ సిన్హా సమాధానం చెబుతున్న సమయంలో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించాయి. స్పీకర్ వారించిన కూడా వారు వినిపించుకోలేదు. సిన్హా మాట్లాడుతున్న సమయంలో విపక్ష నాయకులు ఆయనకు వ్యతిరేకంగా, హేళన చేసేలా వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్లో ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు ఆయన పూలమాలలు వేసి, స్వీట్లు పంచి సన్మానం చేసిన సంగతి తెలిసిందే. హత్యకేసులో నిందితులకు సన్మానం చేసిన సిన్హా.. ఈ విషయమై సభకు సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఆయన నిలదీశారు. సిన్హాకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
విద్వేషానికి వీర సత్కారం
-
విద్వేషానికి వీర సత్కారం
సాక్షి, న్యూఢిల్లీ : అది రాంచీలోని జయప్రకాష్ నారాయణ్ కేంద్ర కారాగారం. శుక్రవారం వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రెండు బృందాలు జైలు వెలుపల ఆత్రుతతో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. జైలు తలుపులు తెరుచుకున్నప్పుడల్లా ఆ రెండు బృందాలు ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో జైలు తలుపులు తెరచుకోగానే ఆరుగురు వ్యక్తులు బయటకు వచ్చారు. అంతే రెండు బృందాలు పోటీ పడి వారి వద్దకు దూసుకెళ్లి వారి మెడల్లో దండలు వేశాయి. తమ వెంట రావాలంటే తమ వెంట రావాలంటూ ఆ ఆరుగురు వ్యక్తులను ఆహ్వానించాయి. ఆ రెండు బృందాల్లో ఒకటి రామ్గఢ్ మాజీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు శంకర్ చౌధరి అనుచర బృందం కాగా, మరో బృందం కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా విధేయుడైన రామ్గఢ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పప్పు బెనర్జీ అనుచర బృందం. చివరకు ఆ రెండు బృందాల మధ్య ఏదో అంగీకారం కుదిరింది. ఆ ఆరుగురు నిందితులు పప్పు బెనర్జీ వెంట కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఇంటికి వెళ్లారు. ఆయన అక్కడ ఆ ఆరుగురు వ్యక్తులకు బంతిపూల దండలతో సాదరంగా స్వాగతం చెప్పారు. ఆయన వారికి స్వీట్లు కూడా తినిపించారు. అటు జైలు ముందు, ఇటు జయంత్ ఇంటి ముందు సత్కార ఆర్భాటాలు చూస్తుంటే బ్రిటీష్ కాలం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లి తిరుగొచ్చిన వీరులకు ఇలాగే సత్కారం లభించేది. ఇప్పుడు సత్కారం అందుకుంటున్న ఈ వీరులెవరు? వారు దేనికోసం పోరాటం జరిపారు? సత్కారం అందుకున్న ఆరుగురు వ్యక్తులు ఏడాది క్రితం జరిగిన అమీలుద్దీన్ అన్సారీ హత్య కేసులో శిక్ష పడిన నేరస్థులు. వారికి జార్ఖండ్ ట్రయల్ కోర్టు ఆ ఆరుగురు సహా 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, అది పెద్ద శిక్షంటూ దాన్ని రద్దు చేసిన జార్ఖండ్ హైకోర్టు జూన్ 29న బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లాంఛనాలు పూర్తిచేసి ఏడుగురు నేరస్థుల్లో ఒకరు గురువారమే జైలు నుంచి విడుదలకాగా, ఆరుగురు శుక్రవారం విడుదలయ్యారు. మరో నలుగురు జైలు నుంచి ఇంకా విడుదల కావాల్సి ఉంది. వారి న్యాయపోరాటానికి మొత్తం ఖర్చును జయంత్ సిన్హా పెట్టారని పప్పు బెనర్జీ చెబుతుండగా, ఆయన క్రెడిట్ కోసం కేసు చివరి దశలో జోక్యం చేసుకున్నారని, మొదటి నుంచి కేసుకు ఖర్చు పెడుతున్నదే తానని మాజీ బీజేపీ ఎంపీ శంకర్ చౌధరి మీడియాతో వ్యాఖ్యానించారు. హంతకులతో కలిసి దిగిన జయంత్ సిన్హా ఫొటో జాతీయ పత్రికల్లో ప్రముఖంగా రావడంతో చౌధరి నొచ్చుకున్నారు. నాడు ఏంజరిగింది? అమీలుద్దీన్ అన్సారీ హత్య 2017, జూన్ 27వ తేదీ ఉదయం జరిగింది. రామ్గఢ్ జిల్లాలోని మనువా గ్రామానికి చెందిన అన్సారీ బొగ్గుల వ్యాపారి. ఆ రోజున మారుతీ వ్యాన్లో రామ్గఢ్కు వెళ్లారు. అక్కడ ఓ అల్లరి మూక ఆయన కారును అడ్డగించి ఆవును చంపి మాంసాన్ని కారులో తరలిస్తున్నావంటూ వాగ్వాదానికి దిగారు. రామ్గఢ్ జిల్లా బీజేపీ మీడియా ఇంచార్జి నిత్యానంద్ మెహతో (శిక్షపడిన వారిలో ఒకరు) అన్సారీని కారు నుంచి లాగగా అల్లరి మూక ఆయన్ని కొట్టడం మొదలుపెట్టింది. దీన్ని అల్లరి మూకలో ఒకరిద్దరు సెల్ఫోన్ ద్వారా వీడియో తీసి ఎప్పటికప్పుడు వాట్సాప్లో పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అన్సారీ 16 ఏళ్ల కుమారుడు సహబాన్ ఆ వీడియోను చూశారు. తండ్రిని కాపాడుకోవాలనే తొందరలో ఆ కుర్రాడు డ్రైవింగ్ రాకపోయినా తండ్రి స్కూటర్ను తీసి స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా గేర్ మార్చి వదిలేయడంతో అది ముందుకు ఎగిరి పడిపోవడంతో కాలుకు గాయం అయింది. తల్లి వచ్చి స్కూటర్ ఎందుకు తీశావంటూ కొట్టబోతే వాట్సాప్ వీడియోను చూపించారు. అప్పుడు అన్సారీ భార్య, కుమారుడు ఇరుగు పొరుగు వారి సహాయంతో హుటాహుటిన రామ్గఢ్ వచ్చారు. అప్పటికే అన్సారీ రోడ్డుపై శవంగా పడి ఉండగా, ఆయన మారుతి వ్యాన్ను అల్లరి మూక ధ్వంసంచేసి తగులబెట్టింది. ఆ వీధిలో దాదాపు 200 కిలోల మాంసం ముద్దలు పడి ఉండడం కూడా ఫొటోల్లో కనిపించింది. అవి కారులో నుంచి పడ్డాయనే దానికి వీడియోలో కూడా ఎలాంటి ఆధారం లభించలేదు. అంత పెద్ద మొత్తంలో మాంసం తీసుకెళ్లడానికి అన్సారీ మాంసం వ్యాపారీ కాదు. ఇంట్లో ఫంక్షన్ కూడా లేదు. ఆ మాంసం ముద్దలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ మిస్టరీనే. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష కేసును విచారించిన రామ్గఢ్ పోలీసులు నిందితులందరిని వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసును త్వరితగతిన విచారించి మొత్తం 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గోరక్షణ పేరిట జరిగిన దాడి కేసులో శిక్ష పడిన మొదటి కేసు, పెద్ద కేసు ఇదే. కేసు విచారణ సందర్భంగా కీలక సాక్షి తన భార్యతో పాటు కోర్టుకు వచ్చారు. అన్సారీ కుమారుడు సహబాన్తో (అప్పటికి స్కూటర్ నడపడం నేర్చుకున్నారు) ఆమెను స్కూటర్పై పంపారు. స్కూటర్పై వెళుతున్న వీరిని వెనక నుంచి ఓ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన సాక్షి భార్య మరణించింది. సాక్షిని బెదిరించడంలో భాగంగానే ఈ యాక్సిడెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేసినా భయపడకుండా అన్సారీ భార్య, కుమారుడు పోరాడటం వల్ల నేరస్థులకు శిక్ష పడింది. నేరస్థులకు ఎలాంటి శిక్షను కోరుకుంటున్నారని తుది విచారణలో కోర్టు జడ్జీ ప్రశ్నించినప్పుడు కూడా అన్సారీ భార్య ‘నా భర్త హత్య కేసులో న్యాయం చేయండని కోరుతున్నాను. అంతుకుమించి నేనేమి చెప్పలేను. నాకేమీ అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. శిక్ష పడిన నేరస్థుల్లో స్థానిక బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు. అంత ఉన్నత చదువులు చదివి కూడా విడుదలైన వారిని స్వాగతించడంలో బీజేపీ నాయకులు ఇక్కడ పోటీ పడుతుంటే అంత ఉన్నత చదువులు చదివిన జయంతి సిన్హాకు ఏమైందంటూ సోషల్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది. ఢిల్లీ ఐఐటీలో డిగ్రీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ఎంఎస్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన జయంత్ సిన్హా కొంతకాలం బాస్టన్లోని ‘మ్యాక్కిన్సే అండ్ కంపెనీ’లో పనిచేసి భారత్కు వచ్చి రాజకీయాల్లో స్థిరపడ్డారు. జయంత్ సిన్హాను బీజేపీ హయాంలో కేంద్రంలో విదేశాంగ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన తండ్రి యశ్వంత్ సిన్హా కూడా ఘాటుగానే విమర్శించారు. అప్పుడు నేను ‘నాలాయక్’:యశ్వంత్ సిన్హా ‘ఒకప్పుడు నేను మంచి కొడుక్కి మంచి తండ్రిని కాదు (నాలాయక్ బాప్ ఆఫ్ లాయక్ బేటా). ఇప్పుడు మా పాత్రలు తిరగబడ్డాయి. అదే ట్విట్టర్ మహిమ. నా కొడుకు చర్యను నేను ఎప్పటికీ ఆమోదించలేను. నాకు తెలుసు ఇది కూడా మరింత ఛండాలానికి దారితీస్తుంది. అయినా నీవెప్పటికీ గెలవవు’ యశ్వంత్ సిన్హా తన కుమారుడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. Earlier I was the Nalayak Baap of a Layak Beta. Now the roles are reversed. That is twitter. I do not approve of my son's action. But I know even this will lead to further abuse. You can never win. — Yashwant Sinha (@YashwantSinha) 7 July 2018 -
హంతకులకు కేంద్ర మంత్రి సన్మానం!
హజారీబాగ్: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వివాదంలో చిక్కుకున్నారు. గతేడాది ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు శుక్రవారం ఆయన పూల మాలలు వేసి సన్మానించారు. ప్రతిపక్షాలు మంత్రి చర్యను ఖండించాయి. నిందితులకు మిఠాయిలు తినిపించిన జయంత్ సిన్హా..న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, తప్పకుండా న్యాయం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన వారంతా విడుదలవడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి న్యాయం జరిగేలా చూడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తమకు లాయర్ను ఏర్పాటుచేసిన మంత్రికి 8 మంది నిందితులు ధన్యవాదాలు తెలిపారు. విద్వేషపూరిత, విభజన రాజకీయాలు సమాజాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. జయంత్ సిన్హా తీరు హేయమైనదని జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎయిర్ ఇండియాలో వాటా విక్రయిస్తాం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక వాటా విక్రయానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా డైరెక్టర్ల బోర్డ్ ఒక ప్రణాళికను రూపొందించిందని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాలో తాము ఆఫర్ చేసిన 76 శాతం వాటా విక్రయానికి ఏ కంపెనీ కూడా స్పందించకపోవడంతో ఈ వాటా విక్రయాన్ని ప్రసుత్తం పక్కకు పెట్టామని పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరుణంలో భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరైనది కాదనే భావనతో ఎయిర్ ఇండియా వాటా విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపేశామని మంగళవారమే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. విదేశీ రూట్లలో ’మహారాజా’ సీట్లు: మరింత మంది ప్రయాణికులను ఆకర్షించే దిశగా అంతర్జాతీయ రూట్లలో నడిపే ఎయిరిండియా ఫ్లయిట్స్లోని బిజినెస్ తరగతిలో ’మహారాజా’ సీట్లు, సిబ్బందికి కొత్త యూనిఫాం, కొంగొత్త వంటకాలు మొదలైన హంగులను ప్రవేశపెట్టనున్నట్లు జయంత్ సిన్హా తెలిపారు. సుదీర్ఘ, స్వల్ప దూరాల ప్రయాణాలకు ఉపయోగించే బోయింగ్ 777, 787 విమానాల్లో ప్రస్తుతమున్న ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ సీట్లను ఈ మేరకు మార్చనున్నట్లు వివరించారు. -
మహారాజాను బికారీ చేశారు!
రాంచీ: యూపీఏ సర్కారు ‘మహారాజా’ (ఎయిరిండియా)ను బికారీ (బిచ్చగాడి)గా మార్చిందని పౌర విమానయాన మంత్రి జయంత్ సిన్హా విమర్శించారు. మహారాజాకు మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే ఎయిరిండియా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టిందన్నారు. ఎయిరిండియాను మళ్లీ లాభాల బాట పట్టిస్తామన్నారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాలను విక్రయిస్తామని తెలిపారు. ఎయిరిండియా సంస్థకు ‘మహారాజా’ లోగో ఉన్న సంగతి తెలిసిందే. ఇకనుంచి ఈ సంస్థ నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ ప్రైవేటు సంస్థ చేతిలో ఉంటుందని అన్నారు. అయితే సంస్థ ఉద్యోగులే పెద్ద మొత్తంలో వాటాలను సొంతం చేసుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. తద్వారా సంస్థ పురోగతి మరింత వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన వివేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాల్ని వెల్లడించారు. ‘మీ తండ్రి యశ్వంత్ సిన్హా బుధవారం బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కలిశారు కదా.. దాని పై మీ స్పందన? అని విలేకరులు అడగ్గా.. అది పూర్తిగా ఆయన సొంత వ్యవహారం. అయినా రాజకీయల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం అని బదులిచ్చారు. -
‘ఆటో కంటే విమానయానమే చౌక’
ఇండోర్: దేశంలో ఆటోల కంటే విమానాల్లో ప్రయాణమే చౌకగా మారిందని కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఇండోర్ మేనేజ్మెంట్ అసోసియేషన్ శనివారం నాడిక్కడ నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో సిన్హా మాట్లాడారు. ‘ప్రస్తుతం భారత్లో విమానాల్లో ప్రయాణం ఆటో రిక్షాల కంటే చౌకగా మారింది. కొందరు వ్యక్తులు నేను అర్థం లేకుండా మాట్లాడుతున్నానని అనుకుంటారు. కానీ నేను చెప్పేది వాస్తవం. ఈ రోజుల్లో ఇండోర్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లాలంటే కిలోమీటర్కు రూ.5 వరకూ అవుతోంది. అదే ఆటోలో వెళ్లాలంటే కి.మీకు రూ.8–10 ఖర్చు చేయాల్సి వస్తుంది’ అని సిన్హా తెలిపారు. -
ట్రాఫిక్ చిక్కులకు డ్రోన్లతో చెక్!
ముంబై: ప్రయాణికుల్ని తరలించే డ్రోన్ల తయారీతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ను తగ్గించవచ్చని కేంద్ర విమానయాన సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఐఐటీ విద్యార్థులు ఈ డ్రోన్లకు సంబంధించి అధునాతన పరికరాలను అభివృద్ధి చేయవచ్చని వెల్లడించారు. ఆదివారం ఐఐటీ–బాంబే నిర్వహించిన టెక్ఫెస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో డ్రోన్ల తయారీరంగం వేగంగా విస్తరించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల్ని తీసుకెళ్లే డ్రోన్ల రూపకల్పనపై పలువురు దృష్టి సారించారనీ.. ఈ రంగంలో భారీ వాటా పొందేందుకు మనం కూడా దేశీయంగా ఆ తరహా డ్రోన్ల అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. సమర్థవంతంగా డ్రోన్లను తయారుచేయగలిగితే వాటి రవాణా వ్యయం ఆటో ప్రయాణానికయ్యే స్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎలక్ట్రానిక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. తగిన చర్యలు తీసుకుంటే త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఎలక్ట్రానిక్ వాహనాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ నిలుస్తుందని సిన్హా తెలిపారు. -
‘ఎయిర్పోర్టుల్లో వీఐపీ కల్చర్ లేదు’
న్యూఢిల్లీ : ఇంఫాల్ ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్థానమ్ వివాదంపై పౌర విమానయాన శాఖామంత్రి జయంత్ సిన్హా తొలిసారి స్పందించారు. దేశంలోని ఏ విమానాశ్రయంలోనూ వీవీఐపీ కల్చర్ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే భద్రతాపరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చని ఆయన తెలిపారు. విమానాశ్రయాల్లో తీసుకునే భద్రతా చర్యలు ప్రయాణికులు సెక్యూరిటీ కోసమేనని ఆయన తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంతేకాక భద్రత కల్పించాల్సిన ముఖ్యవ్యక్తులు విమానశ్రయాలకు వచ్చినపుడు సెక్యూరిటీ స్క్రీనింగ్ తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఇది వీవీఐపీ కల్చర్ కాదని జయంత్ సిన్హా స్పష్టం చేశారు. వీరు తప్ప మిగిలిన ఎవరినైనా విమానాశ్రయాల్లో ఎవరినైనాన సాధారణ ప్రయాణికుడిగానే అధికారులు చూస్తారని ఆయన తెలిపారు. నా బ్యాగ్ను నేను మోసుకుంటూ విమానం ఎక్కుతాను.. వీవీఐపీ కల్చర్ లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల కిందట ఇంఫాల్ విమానాశ్రయంలో ఒక మహిళ.. వీవీఐపీ కల్చర్పై కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్థానమ్ను నిలదీయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇంఫాల్ ఎయిర్పోర్టుకు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ రావడంతో.. మిగతా విమాన ప్రయాణికులను నిలిపేశారు. దీంతో మిగిలిన విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. మంత్రి రాకవల్ల ఇబ్బందుల పడ్డవారిలో ఒక మహిళా డాక్టర్ ఉన్నారు. ఆమె అత్యవసరంగా ఒకరికి చికిత్స అందించే క్రమంలో పట్నా వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చారు. వీవీఐపీ కల్చర్ వల్ల ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ఆమె.. నేరుగా కేంద్రమంత్రినే ఎయిర్పోర్టులో నిలదీశారు. -
ఇక ఆ బుకింగ్లకు డిజిటల్ ఐడీ
న్యూఢిల్లీ: విమాన టికెట్ బుకింగ్కు ప్రత్యేకమైన డిజిటల్ ఐడిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విమానాశ్రయంలోకి ప్రవేశించేటప్పుడు ఎయిర్ ట్రావెలర్లు ఆధార్, పాన్ లాంటి ఇతర గుర్తింపుకార్డుల కాపీలను తీసుకెళ్లడం తప్పనిసరి. అయితే ఇక మీదట విమాన ప్రయాణికుల సౌలభ్యం కోసం డిజిటల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ను పద్ధతిని ప్రవేశ పెట్టేందుకు విమానయాన మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. మరో మూడు నెలల్లో దీన్ని మాండేటరీ చేయనుంది. దీనికోసం ఒక టెక్నికల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఎయిర్ టికెట్ బుకింగ్ సమయంలో "డిజిటల్ ప్రత్యేక గుర్తింపు" అవసరాన్ని ప్రవేశపెట్టాలని మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రస్తుతం ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), పాప్పోర్ట్ నంబర్ లాంటి ఇతర అనలాగ్ యూనిక్ ఐడీ ఉన్నప్పటికీ ఈ తరహాలోనే ఒక డిజిటల్ ప్రత్యేక గుర్తింపు కోసం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి తగిన సలహాలను అందించడంకోసం డిజిటల్ ట్రావెలర్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 30 రోజులలో తన రిపోర్ట్ సమర్పించమని కోరినట్టు చెప్పారు. అనంతరం ఇతర పరిశ్రమ వాటాదారుల సలహాలను కూడా ఆహ్వానించనున్నట్టు సిన్హా తెలిపారు. ఈ ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోందనీ, ప్రయాణీకుల భద్రత, సౌకర్యం గోప్యతల ఆధారంగా విస్తృతమైన సంప్రదింపుల అనంతరం నిర్ణయం తీసుకుంటా మన్నారు. ఈ పథకంలో ఆధార్ తప్పనిసరి కాదు. కానీ ఇతర డిజిటల్ గుర్తింపు ఒక ఆప్షన్గా ఉంటుందని మంత్రి చెప్పారు. అయితే ప్రయాణీకులు కోరుకుంటే ఇప్పటికీ బోర్డింగ్ పాస్ను తీసుకునే అవకాశం ఉంటుందని విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు. Air travellers already require analog unique ID. A digital unique ID such as Aadhar, PAN, passport number, etc. is now proposed 2/2 — Jayant Sinha (@jayantsinha) June 8, 2017 Chaired a discussion on #DigiYatra with industry stakeholders and asked them to submit recommendations in 30 days. pic.twitter.com/snq3omLX83 — Jayant Sinha (@jayantsinha) June 8, 2017 -
ఇక్కడే విమాన చార్జీలు చౌక
⇒ ఈ రంగంలో పోటీవల్లే: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ⇒ ఇంధన ధరలు, పన్నులు ఎక్కువే న్యూఢిల్లీ: విమాన చార్జీలు చౌకగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. విమానాలతో పాటు ఇంధనం ధరలు, పన్నులు కూడా అధికంగా ఉన్నప్పటికీ, అత్యంత పోటీ ధరలున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటని ఆయన తెలియజేశారు. విమానయానం మరింత చౌకగా ఉండేందుకు, సర్వీసులు లేని విమానాశ్రయాల అనుసంధానత కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతీయ అనుసంధానత స్కీమ్ను అందుబాటులోకి తెచ్చిందని తెలియజేశారు. ఈ ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమ్లో భాగంగా గంట విమాన ప్రయాణానికి రూ.2,500 పరిమితిని విధించామని చెప్పారాయన. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ప్రయాణికురాలి కోసం కేంద్రమంత్రి త్యాగం
అనారోగ్యంతో ఉన్న ఒక ప్రయాణికురాలి కోసం తన సీటును కేంద్ర మంత్రి జయంత్ సిన్హా త్యాగం చేశారు. దాంతో ఎంతగానో ఆనందపడిన ఆమె కూతురు.. 'అచ్ఛేదిన్' అంటే ఇవేనంటూ ట్వీట్ చేసి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. బెంగళూరు నుంచి రాంచీ వెళ్లే ఇండిగో విమానంలో శ్రేయా ప్రదీప్ తన తల్లితో కలిసి ప్రయాణిస్తోంది. అయితే శ్రేయా తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె కాళ్లు చాపుకుని పడుకోవాల్సి వచ్చింది. కానీ, వాళ్లు ప్రయాణించేది ఎకానమీ క్లాస్లో కావడంతో అది సాధ్యం కాలేదు. అదే విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నారు. విషయం తెలిసిన ఆయన.. తమ రెండు సీట్లను తల్లీ కూతుళ్లకు ఇచ్చి, తాను భార్యతో సహా ఎకానమీ క్లాస్లోకి వెళ్లారు. దాంతో శ్రేయా తల్లికి కాస్త ఊరట లభించింది. ఈ విషయాన్ని శ్రేయాప్రదీప్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ పోస్టును 3,000 మంది రీట్వీట్ చేయగా, 2,900 మంది లైక్ చేశారు. మంత్రి జయంత్ సిన్హాతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను కూడా ఆమె ట్వీట్ చేసింది. అప్పటినుంచి ఆమె ట్విట్టర్ ఖాతా మోతెక్కిపోతూనే ఉంది. పలువురు ఆమెను, మంత్రి జయంత్ సిన్హాను, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. విషయం తెలియగానే స్పందించి, సమస్యలను పరిష్కరించడంలో ముందున్నందుకు జయంత్ సిన్హా కూడా మరికొందరు మంత్రులతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ముందంజలో ఉన్నారు. పెళ్లి గురించిన సలహాల దగ్గర్నుంచి అత్యవసరంగా రైల్లో తమ పిల్లలకు డైపర్లు కావాలని కూడా వాళ్లకు జనాలు ట్వీట్ చేస్తున్నారు. మరోవ్యక్తి తన ఖరీదైన కారు రోడ్డు మధ్యలో ఆగిపోయిందని.. ఆ కంపెనీవాళ్లు సరిగా స్పందించడం లేదని సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశాడు. @jayantsinha @IndiGo6E Ache din is wen Aviation Minister gives his 1st class seat 2 me n my ill mother, sits in d eco class himself Thnx Sir pic.twitter.com/A8Ys7hJ8Wa — SHREYA PRADIP (@ShreyaPradip) 6 November 2016 -
ఏవియేషన్ శాఖ సరికొత్త నిర్ణయం
న్యూఢిల్లీ :విమానప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కార దిశగా ఏవియేషన్ మంత్రిత్వశాఖ అడుగులు వేస్తోంది. విమానసంస్థలకు వ్యతిరేకంగా ప్రయాణికులు తమ ఫిర్యాదులను దాఖలు చేసేందుకు వీలుగా ఓ వెబ్సైట్ను లాంచ్ చేయాలని ఏవియేషన్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆ ఫిర్యాదులను విమానసంస్థలకు పంపించి, సత్వరమే సమస్య పరిష్కారం అయ్యేలా ఆ వెబ్సైట్ను రూపొందించనున్నారు. ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆలోచన మేరకు ఈ ప్లాట్ఫాంను ఏర్పాటుచేయనున్నట్టు ఆ మంత్రిత్వశాఖ తెలిపింది. విమానయానం చేసేటప్పుడు ఏదైన సమస్య ఎదురై మనోవేదనకు గురైనప్పుడు.. ఆ సమస్యను విమానసంస్థలకు తెలియజేయడానికి ఇప్పటివరకు సరియైన ప్లాట్ ఫామే లేదు. ఈ నేపథ్యంలో ఏవియేషన్ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లోని సభ్యులు ఈ ప్లాట్ఫాంను నిర్వహించనున్నట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా ఎవరన్నది తెలియరాలేదు. సోషల్ మీడియా లాంటి వివిధ సమాచార మాధ్యమాల ద్వారా విమానసంస్థలకు ఫిర్యాదులను అందిస్తున్న ప్రయాణికులకు, ఈ వెబ్సైట్ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ ప్లాట్ఫామ్లాగా దోహదం చేయనుంది. ప్రయాణికులు ఫిర్యాదును విమానసంస్థలకు తెలియజేయాలనుకున్నప్పుడు.. ప్రయాణికుల ఏవియేషన్ అందించే ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయి, ఫిర్యాదును నమోదుచేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఫిర్యాదును విమానసంస్థకు పంపిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదును విమానసంస్థలు పరిష్కరిస్తాయి. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమాన ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. అయితే ప్రయాణికులు సమస్యలు తెలియజేయడానికి తమ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయని విమాన సంస్థలు అంటున్నాయి. సోషల్ మీడియా సైట్ల ద్వారా సమస్యలు తెలుసుకుని, ఫిర్యాదులను పరిష్కృతం చేస్తున్నామని ఓ ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. దానికంటే ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఈ వెబ్సైట్ దోహదం చేయగలదా అని ప్రశ్నిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్లాట్ఫామ్ను ఏర్పాటుచేయడం అద్భుతమైన అడుగని ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. -
ఎయిర్ పోర్టులో మంత్రి ఆకస్మిక తనిఖీ
న్యూఢిల్లీ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పుణ్యమా అని ఆయా శాఖల కేంద్ర మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తుండటం అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. నిన్నటికినిన్న సమాచార శాఖ మంత్రిత్వ శాఖకు చెందిన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఉద్యోగుల ఆలస్యంపై మండపడ్డారు. ఇప్పుడు అదే తరహాలో పౌరవిమాయనయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీ టెర్మినల్(టెర్మినల్1) కు వెళ్లిన మంత్రి అక్కడ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరాతీశారు. గతవారం ఇదే టెర్మినల్ లో ఎయిర్ కండీషనర్ పనిచేయక ప్రయాణికులు ఉక్కపోతను అనుభవించిన సంఘటన దృష్యా ఏసీ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. జులై 5 నాటి పునర్ వ్యవస్థీకరణలో ఆర్థిక శాఖ నుంచి పౌరవిమానయానానికి మారిన జశ్వంత్ సిన్హా.. గత వారం దేశీ విమాన సేవల బలోపేతంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. -
మరింత బ్లాక్మనీ బయటికొస్తుంది
♦ వేగంగా దర్యాప్తు నిర్వహిస్తాం: జయంత్ సిన్హా ♦ నల్లధనం వెల్లడిపై నేడు వివిధ వర్గాలతో జైట్లీ భేటీ న్యూఢిల్లీ: విదేశాల్లో దాచి ఉంచిన నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు పనామా పత్రాలతో సహా వివిధ మార్గాల్లో తెలిసిన సమాచారం ఆధారంగా వేగవంతమైన దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్సిన్హా చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, మరిన్ని నల్లధనం కలుగుల సమాచారం బయటకు వస్తుందని చెప్పారాయన. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సిన్హా ఈ అంశంపై మాట్లాడుతూ... ‘‘హెచ్ఎస్బీసీ, ఐసీఐజే పత్రాల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా విదేశీ బ్యాంకుల్లో దాచి ఉంచిన రూ.13వేల కోట్ల రూపాయల నల్లధనం వివరాలను ఐటీ శాఖ ఇప్పటికే సేకరించింది. ఇక దేశీయంగా దాచి పెట్టుకున్న నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఆ తర్వాత జరిమానాలు విధిస్తాం’’ అని చెప్పారు. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రధాని మోదీ సైతం సూచించారు. ఇదే చివరి అవకాశమని, దీన్ని కోల్పోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కూడా. ⇒ బ్రెగ్జిత్తో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు: బ్రెగ్జిట్పై ఓ ప్రశ్నకు సిన్హా స్పందిస్తూ... ‘‘ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటానికి రెండు మూడేళ్ల సమయం పడుతుంది. తగిన సర్దుబాటు చేసుకునేందుకు, మార్పులను అర్థం చేసుకునేందుకు తగినంత సమయం ఉంది’’ అన్నారు. మరోవైపు, దేశీయంగా దాగి ఉన్న నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంపై (ఐడీఎస్) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ మంగళవారం వివిధ వాణిజ్య సంఘాలు, చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏ), ఇతర వృత్తి నిపుణులతో సమావేశమవుతారు. నిబంధనల గురించి వారికున్న సందేహాలు తీరుస్తారు. ⇒ సెప్టెంబర్ 30 వరకూ అవకాశం: స్వచ్చందంగా నల్లధనం వివరాలు వెల్లడించేందుకు వీలుగా ‘ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) 2016’ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ చేపట్టింది. జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇందులో భాగంగా తమ రహస్య ఆస్తులు, నిధుల వివరాలు స్వచ్చందంగా వెల్లడించి వాటి మొత్తం విలువపై పన్ను, జరిమానా రూపంలో 45 శాతం మేర చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలకూ ఐడీఎస్.. పాన్ తప్పనిసరి నల్లధనం వెల్లడికి ప్రభుత్వం కల్పించిన ఏకైక అవకాశం ‘ఐడీఎస్’ విషయంలో తలెత్తే పలు సందేహాలకు స్పష్టతనిస్తూ ఆదాయపన్ను శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. మే నెలలో 14 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగా... తాజాగా మరో 11 సందేహాలకు స్పష్టతనిచ్చింది. దీని ప్రకారం... స్వచ్చందంగా నల్లధనం గురించి సమాచారం బయటకు వెల్లడించే వారు తమ పాన్ నంబర్ ను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారు నిబంధనల మేరకు పాన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యక్ష పన్నులకు పాన్ నంబర్ ప్రత్యేక గుర్తింపు అని, ప్రయోజనాలు, మినహాయింపులు పొందాలన్నా ఇది తప్పనిసరి అని పేర్కొంది. దేశంలో నివసించే వారితోపాటు ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ)లు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, ఐటీ శాఖ ఎవరి విషయంలోనైనా దాడులు నిర్వహించి, సెక్షన్ 153ఏ కింద నోటీసులు జారీ చేస్తే అటువంటి వారు ఈ పథకానికి అర్హులు కారు. పన్ను వర్తించే ఆదాయ శ్లాబ్లో ఉండి రిటర్నులు దాఖలు చేయనందుకు సమన్లు అందుకుని, తదుపరి చర్యల విషయంలో ఎలాంటి నోటీసులు జారీ కాకుండా ఉంటే అటువంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఒక కంపెనీ మరో కంపెనీలో విలీనమైనా లేదా పరిమిత బాధ్యతతో కూడిన భాగస్వామ్యం కుదుర్చుకున్నా (ఎల్ఎల్పీ)... విలీనం చేసుకున్న కంపెనీ పేరుమీద లేదా ఎల్ఎల్పీ పేరు మీద అయినా ఆస్తులు వెల్లడించవచ్చు. -
అంతా మన మంచికే..!
అటు పరిపాలకుల నుంచి ఉన్నత అధికారుల వరకూ దాదాపు ఒకేఒక్క అభిప్రాయాన్ని వ్యక్తం అవుతోంది. తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నా... దీర్ఘకాలంలో బ్రెగ్జిట్ భారత్కు లాభించే అంశమేనన్నది వీరి వాదన. వీటిని ఒక్కసారి పరిశీలిస్తే... స్థిరత్వం కొనసాగుతుంది పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. లిక్విడిటీ విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా భారత్ తగిన చర్యలను తీసుకుం టుంది. ప్రస్తుతం ఒడిదుడుకులున్నా... సమీప కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలోనే కొనసాగుతుందని మేం విశ్వసిస్తున్నాం. - జయంత్ సిన్హా, ఆర్థికశాఖ సహాయమంత్రి కలిసి వచ్చే అంశమే అనిశ్చితి సమయాల్లో పెట్టుబడుల అవకాశాలకు భారత్ వేదికగా మారబోతోంది. బ్రెగ్జిట్ భారత్కు పూర్తిగా సానుకూల అంశమే. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడం లాభిస్తుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచకపోవటమూ సానుకూలమే. - అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు భవిష్యత్ బాగుంటుంది బ్రెగ్జిట్ ప్రభావం తక్షణం ఇతర అన్ని దేశాల్లానే భారత్పైనా పడుతుంది. అయితే పెట్టుబడులకు చక్కటి ప్రాం తంగా భారత్ కొనసాగుతుంది. దీర్ఘకాలంలో వ్యూహాత్మకంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్లు భారత్కు చక్కటి మార్కెట్ను సృష్టించే అవకాశం ఉంది. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ఎగుమతులకు దెబ్బే... భారత్ ఎగుమతులపై తాజా పరిణామాలు ప్రతికూలత చూపిస్తాయి. కరెన్సీ ఒడిదుడుకులు చాలా ముఖ్యాంశం. బ్రిటన్ పౌండ్, యూరోలు బలహీనపడతాయి. దీంతో ఆయా దేశాల ప్రొడక్టులతో విదేశాలకు విపరీతమైన పోటీ పెరుగుతుంది. అయితే ఆ రెండు ప్రాంతాలతో భారత్ వాణిజ్యంపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. - భారత ఎగుమతి సంఘాల సమాఖ్య భారత్-బ్రిటన్ బంధం పటిష్టం తాజా పరిణామం భారత్, బ్రిటన్ బంధం మరింత పటిష్టమవడానికి దారితీస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. తాజా బ్రిటన్ పరిణామాలు పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల దృష్టి వర్ధమాన దేశాలకు ప్రత్యేకించి భారత్వైపు మళ్లేట్లు చేస్తుంది. - జీపీ హిందూజా, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ -
మొండిబకాయిల సమస్య ఆందోళనకరం
♦ కేంద్ర మంత్రి జయంత్సిన్హా ♦ రుణ నాణ్యతా సమీక్షలు తరచూ జరగాలని సూచన ముంబై: బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య ఆందోళనకరంగా ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్సిన్హా పేర్కొన్నారు. రుణ నాణ్యతకు సంబంధించిన సమీక్ష (ఏక్యూఆర్)లు ఒక్కసారితో సరిపెట్టకుండా తరచూ జరపాలని సైతం ఆయన సూచించారు. అనుమానాస్పద రుణాలను వెలికితీయడానికి గడచిన డిసెంబర్లో ఆర్బీఐ రుణ నాణ్యతా సమీక్షలు జరిపింది. ఇందుకు సంబంధించి 130 అకౌంట్లను ఖరారు చేసింది. కంపెనీలు పనిచేస్తున్నా లేకున్నా... ఏ పరిస్థితుల్లో ఉన్నా సంబంధిత అకౌంట్లు అన్నింటినీ మొండిబకాయిల జాబితాలో చేర్చాలని రెగ్యులేటర్ సూచించింది. దీనితో భారీగా అదనపు ప్రొవిజన్ కేటాయింపులతో బ్యాంకింగ్ రంగం లాభాలు ఒక్కసారిగా భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.70,000 కోట్ల మేర నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ తరహా సమీక్షలు తరచూ చేయాలన్నది తన సూచనని జయంత్ సిన్హా ఇక్కడ మంగళవారం క్రిసిల్ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎన్పీఏ ఫండ్ ఏర్పాటు కసరత్తు... సమస్య పరిష్కారంపై సిన్హా మాట్లాడుతూ, మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో ఒక ఫండ్ను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
పెద్ద బ్యాంకులుగా మిగిలేవి పదే!
♦ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయం ♦ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయంత్ సిన్హా వ్యాఖ్య బెంగళూరు: భారత్లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీనం, పెద్ద బ్యాంకుల ఏర్పాటుపై ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్సిన్హా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మొండిబకాయిల సమస్య పరిష్కారం తక్షణ ప్రాధాన్యతగా పేర్కొన్న ఆయన... తదుపరి బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై కేంద్రం దృష్టి సారిస్తుం దన్నారు. చివరకు పోటీపడే పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 నుంచి పదే ఉంటాయని అన్నారు. మిగిలినవి ‘డిఫరెన్షియేటెడ్’ (నిర్దిష్ట కార్యకలాపాలు నిర్వహించే) బ్యాంకులుగా మిగులుతాయని వివరించారు. ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థల ఏర్పాటు అవసరమన్నారు. ‘‘ప్రస్తుతం 27 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. మొండిబకాయిల సమస్య పరిష్కారం అయిన తర్వాత, కేవలం 8 నుంచి 10 పోటీ పూర్వక బ్యాంకులే ఉంటాయని నేను భావిస్తున్నాను. వీటిలో కొన్ని ప్రపంచ స్థాయి బ్యాంకులుగా అవతరించే వీలుంది. మరికొన్ని డిఫెరెన్షియేటెడ్ బ్యాంకులుగా కొనసాగుతాయి’’ అని అన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్సిన్హా లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు మొదలయ్యాయి. కేంద్రప్రభుత్వం, దాని మిత్రపక్షం టీడీపీ వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లాలో ఆయా ప్రభుత్వాల దిష్టిబొమ్మలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అనంతరం రోడ్డుపై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే కేంద్రప్రభుత్వానికి టీడీపీ మద్ధతు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. -
'తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురి చేసింది'
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యలు తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురి చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి అన్నారు. గురువారం విశాఖపట్నంలో కొయ్య ప్రసాద్రెడ్డి విలేకర్లలో మాట్లాడుతూ... ఈ వార్తతో తెలుగు ప్రజలంతా బాధాతప్త హృదయాలతో ఉన్నారని చెప్పారు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాలకింద తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీ మేకపాట రాజమోహనరెడ్డి సారథ్యంలో శుక్రవారం రైల్వేమంత్రి సురేష్ ప్రభును కలిసి రైల్వేజోన్పై ఒత్తిడి తీసుకొస్తామని కొయ్య ప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు. -
హోదా ఆశకు సమాధి
ఏపీపై తేల్చేసిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా నిబంధనేదీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్సిన్హా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ నిర్లిప్త వైఖరిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటం, హోదా కోసం విపక్ష వైఎస్సార్సీపీ తన వంతు కృషి కొనసాగిస్తుండటంతో.. ప్రజల దృష్టి మరల్చేందుకు, హోదా కోసం తామూ పోరాటం చేస్తున్నామని కలర్ ఇచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పుడో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత నెల 25న జయంత్ సిన్హా లేఖ రాస్తే.. పదిరోజుల తర్వాత ఆ లేఖను బయటపెట్టారు. బుధవారం లోక్సభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తుందనే ఏకైక కారణంతో, తామూ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పుకునేందుకు టీ డీపీ ఈ హడావుడి చేసింది. అయితే రాష్ట్రాలకు ‘హోదా’ మంజూరు విషయంలో ఇప్పటివరకు ఉన్న విధానాన్ని మార్చే ఆలోచన లేదని కేంద్ర మంత్రి కుండబద్ధలు కొట్టారు. డిసెంబర్ 21, 2015న లోక్సభ జీరో అవర్లో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. దానికి బదులుగా కేంద్రమంత్రి రాసిన లేఖను బుధవారం ఆయన విడుదల చేశారు. లేఖలోని సారాంశం ఇదీ.. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014పై రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న చర్చ జరుగుతున్న సమయంలో అప్పటి ప్రధాని కొన్ని అంశాలను ప్రస్తావించారు. 13 జిల్లాలతో కూడిన ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ను ఐదేళ్ల పాటు వర్తింపజేస్తామన్నారు. కానీ విభజన చట్టంలో ప్రత్యేక కేటగిరీ హోదా కట్టబెట్టాలని ఎలాంటి నిబంధన పొందుపరచలేదు. అలాగే రెవెన్యూ లోటు భర్తీకి వీలుగా నిధులు ఇవ్వాలని గానీ, ఆ మేరకు ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుందని గానీ చట్టంలో పొందుపరచలేదు. అయితే విభజన అనంతరం తొలి ఏడాది ఏపీకి ప్రత్యేక సాయం కింద రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 46(2) సెక్షన్ను పొందుపరిచారు. దీనికి అనుగుణంగా, ఏపీ అభివృద్ధికి మద్దతుగా 6,403 కోట్ల ప్రత్యే క సాయం కేంద్రం అందించింది. 2014-15లో రూ.4,403 కోట్లు, 2015-16లో రూ 2,000 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చాం. ఇందులో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 2,803 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.700 కోట్లు, నూతన రాజధానికి రూ. 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 850 కోట్లు ఇచ్చాం. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. అనేక మార్గాల్లో నిధులు: ఆ విధంగా ఏపీకి వివిధ మార్గాల ద్వారా.. అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూపంలో, 14వ ఆర్థిక సంఘం గ్రాంట్ల రూపంలో, రాష్ట్ర ప్రణాళిక పథకాల్లో కేంద్ర సాయంగా, కేంద్ర ప్రాయోజిత పథకాలు తదితర రూపాల్లో నిధులు అందుకుంటోంది. ఏపీ ప్రభుత్వ 2016-17 బడ్జెట్ ప్రకారం 2016-17లో రూ.51,487 కోట్ల కేంద్ర సాయం అందుకోబోతోంది. ఇందులో రూ.26,850 కోట్ల మేర సెంట్రల్ గ్రాంట్లు, 24,637 కోట్ల మేర కేంద్ర పన్నులు ఉన్నాయి. 2015-16 సవరించిన అంచనాల ప్రకారం ఈ రెండు పద్దుల మొత్తం 39,616 కోట్లుగా ఉంది. ఇందులో కేంద్ర పన్నుల వాటా రూ.21,894 కోట్లు. 2014-15 కంటే ఈ మొత్తం 30 శాతం అధికంగా ఉంది..’ అని జయంత్ సిన్హా పేర్కొన్నారు. పిల్లి మొగ్గలే పుట్టిముంచాయి: ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట మాట్లాడటం ద్వారా చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేందుకు కారణమయ్యారు. మరోవైపు ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు వివరించటంతో పాటు దాని సాధనకు అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీకి అడుగడుగునా అడ్డంకులు కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో లోపం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్న ఆందోళన, ఆవేదనతో గత ఏడాది ఆగస్టులోనే ఐదుగురు ఆత్మహత్య, ఆత్మాహుతులకు పాల్పడ్డారు. ఇవేవీ బాబును కదిలించలేక పోగా రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళంలోకి నెట్టేశారు. హోదా తప్పక వస్తుందని టీడీపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి అంటే.. హోదా రాదని, ఆ విషయం సీఎంకూ తెలుసునని ఆ పార్టీకే చెందిన ఎంపీ ఒకరు అంటారు. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో టీడీపీ, బీజేపీలు హామీ ఇచ్చాయి. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి రాగనే హోదా అంశాన్ని అటకెక్కించారు. ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారు. హోదా ఇవ్వడం లేదంటూనే కేంద్ర ప్రభుత్వంలో తన మంత్రులను కొనసాగించడం చంద్రబాబు చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. హోదాపై బాబు ఎప్పుడేమన్నారు ► రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఐదేళ్లే ఇస్తామన్నారు. 15 ఏళ్లు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నా. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే రెండు మూడేళ్లు పడుతుంది. ఐదేళ్లే ఇస్తే పరిశ్రమలు ప్రారంభమయ్యే లోపు హోదా పోతే అభివృద్ధి ఆగిపోతుంది. అందువల్ల 15 ఏళ్లు ఇవ్వాలని కోరుతున్నా. ► ప్రత్యేక హోదా ఇస్తే.. అదొక సంజీవని కింద అన్నీ అయిపోతాయని అంటున్నారు. ఏమొస్తాయండి..?. రెండే వస్తాయి. ఆర్థిక ప్యాకేజీ (ఈఏపీ), సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ప్రత్యేక హోదా బదులు ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారనుకో.. ఇంకా నీకు బాధేముంది. నేను కాదనను కదా? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?. ► ప్రత్యేక హోదానే మొత్తం అయిపోతుంది. స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గమైపోలేదే? -
'ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు'
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. ఇప్పట్లో అలాంటి అవకాశం ఏమీ లేదని పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన ఏమీ లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ పార్లమెంటులో ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైన సాయం అందిస్తామని, నీతి ఆయోగ్ సిఫార్సులకు అనుగుణంగా ఆ రాష్ట్రానికి నిధులు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం రూ. 12,806 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2014-15లో రూ. 4,403 కోట్లు, 2015-16లో రూ. 2 వేల కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ద్రవ్యలోటు భర్తీ కింద రూ. 2,803 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.700 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ. 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 850 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. అసలు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలోనే లేదని జయంత్ సిన్హా వ్యాఖ్యానించారు. -
చావుబాకీలు రూ. 8 లక్షల కోట్లపైనే!
దేశంలోని అన్ని రకాల బ్యాంకులకు ఉన్న చావుబాకీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల పైమాటేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. బ్యాంకులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తగినన్ని నిధులు సమకూరుస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మనకున్న మొత్తం వ్యవస్థలో 11.25 శాతం ఈ చావుబాకీలేనని, అయితే ఈ సమస్యను తగిన విధంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో రూ. 25వేల కోట్లను కేటాయించారు. ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో రూ. 25వేల కోట్ల చొప్పున, ఆ తర్వాత 2017-18, 2018-19 సంవత్సరాల్లో రూ. 20 వేల కోట్ల చొప్పున కేటాయిస్తామని జయంత్ సిన్హా చెప్పారు. -
బడ్జెట్ ప్రింటింగ్ షురూ..!!
♦ సాంప్రదాయక ‘హల్వా’ రుచులతో ఆరంభం ♦ బాధ్యతల్లో దాదాపు 100 మంది అధికారులు ♦ బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా వారంతా ఇక అక్కడే... న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్ రుచి ఎలా ఉంటుందో గానీ... ఆర్థిక శాఖలో మాత్రం తియ్యని హల్వా తయారయింది. ఈ హల్వాను రుచి చూడటానికి నార్తబ్లాక్ బేస్మెంట్లో... మంత్రి అరుణ్ జైట్లీ సహా ఆర్థిక శాఖకు చెందిన కీలక అధికారులంతా శుక్రవారం హాజరయ్యారు. సహాయ మంత్రి జయంత్ సిన్హా, ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, కార్యదర్శి రతన్ వాటెల్, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, పెట్టుబడుల ఉపసంహరణ విభాగం కార్యదర్శి నీరజ్ గుప్తా, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి అంజులీ దుగ్గల్, బడ్జెట్ రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకరికొకరు హల్వాను తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంతో... బడ్జెట్లో చివరి మెట్టయిన ముద్రణ కార్యక్రమం మొదలైనట్లే. నార్త్బ్లాక్లోనే ఉన్న ప్రింటింగ్ ప్రెస్లో ఈ ముద్రణ మొదలవుతుంది. ఈ నెల 29న పార్లమెంట్లో 2016-17 సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టేదాకా... దీన్లో పాల్గొన్న కీలక అధికారులంతా నార్త్బ్లాక్కే పరిమితమవుతారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ కాగా, తొలి మధ్యంతర బడ్జెట్ను కలుపుకుంటే మూడవది. బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ హల్వా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులందరికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తుల్ని ఫోన్లో లేదా ఈ-మెయిల్ ద్వారా సంప్రదించే అవకాశం ఉండదు. మరీ అత్యవసరమైన విషయమైతే ఉన్నతాధికారుల సమక్షంలో వారికి తెలియజేయటం, వారితో మాట్లాడించటం వంటివి చేస్తారు. 100 మందికిపైగా అధికారులు ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అంత గోప్యత ఎందుకు? ఏటా బడ్జెట్లో కీలక నిర్ణయాలుంటాయి. దీంతో స్టాక్మార్కెట్లు, పలు వ్యాపారాలు ప్రభావితమవుతాయి. అందుకే బడ్జెట్ను ఎంతో పకడ్బందీగా, గోప్యంగా తయారు చేస్తారు. ఎందుకంటే ఇది ముందే బయటకు వెల్లడైతే ఆయా వర్గాలు ముందే అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్బ్లాక్లోని ఆర్థికశాఖ కార్యాలయం నుంచి వెళ్లే ఫోన్లన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేస్తారు. ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక జామర్లు ఏర్పాటుచేస్తారు. ఈ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పెద్ద ఎక్స్రే స్కానర్ను ఏర్పాటుచేసి, దానిని కంప్యూటర్తో అనుసంధానిస్తారు. ఈ పరికరాల వల్ల ఏ చిన్న వస్తువు తీసుకువెళ్తున్నా ఇట్టే తెలిసిపోతుంది. అలాగే బడ్జెట్ను ముద్రించే సమయంలో ఆర్థికశాఖ కార్యదర్శి... ప్రధానితోను, ఆర్థిక మంత్రితోను సమన్వయం చేస్తూ సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ముద్రణ సమయంలో అనునిత్యం ఐబీ అధికారులు, ఢిల్లీ పోలీసులు కునుకులేకుండా కాపలాకాస్తుంటారు. మధ్య మధ్యలో సెక్యూరిటీని పరీక్షించేందుకు ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని గనుక సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. -
ఏడాదికి రూ. 75 వేల కోట్లు
2014-15లో పెట్రోల్, డీజిల్పై పన్ను వసూళ్లు న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై రెవెన్యూ, కస్టమ్స్ తదితర పన్నుల ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 75,441 కోట్ల భారీ ఆదాయం వచ్చింది. ఇది 2012-13లో వచ్చిన ఆదాయం(రూ.46,926 కోట్లు) కంటే 60 శాతం ఎక్కువ. ఈ మొత్తం రాష్ట్రాలు విధించే వ్యాట్ పన్నుకు అదనం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లోక్సభకు ఈ వివరాలు తెలిపారు. గత ఏడాది 2 కోట్ల కేసుల పరిష్కారం: సుప్రీం కోర్టుతోపాటు దేశంలోని వివిధ కోర్టులు గత ఏడాది 2 కోట్ల కేసులను పరిష్కరించాయని, ఇంకా 3 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని న్యాయ మంత్రి సదానంద గౌడ రాజ్యసభకు వెల్లడించారు. ఆ నర్సులు అనుమతి తీసుకోవాలి: ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్(ఈసీఆర్) అవసరమున్న ఖతర్, కువైట్ వంటి 18 దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్లే నర్సులు ఇమిగ్రేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గత మూడేళ్లలో 24 వేల వరకట్న మరణాలు: గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 24,771 వరకట్న మరణాలు నమోదయ్యాయని మంత్రి మేనకా గాంధీ తెలిపారు. రైళ్లలో అత్యవసర వైద్యానికి 138: రైలు ప్రయాణికులు అత్యవసర వైద్యానికి సెల్ఫోన్ల నుంచి 138 నంబర్కు చేయొచ్చని, లేకపోతే టికెట్ కలెక్టర్కు చెప్పొచ్చని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. నిర్వాసితుల్లో మహారాష్ట్ర టాప్ : డ్యామ్ నిర్మాణాల వల్ల నిర్వాసితులయ్యే వారి సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. అక్కడ 7.13 లక్షల మంది నిర్వాసితులయ్యారని మంత్రి సన్వర్లాల్ జాట్ వెల్లడించారు. తర్వాతి స్థానాల్లో అవిభక్త ఆంధప్రదేశ్ (4,64,675 మంది), కర్ణాటక(4,10,104 మంది) ఉన్నట్లు వెల్లడించారు. -
ఇతర బ్యాంకుల మెషీన్ల్లలోనూ క్యాష్ డిపాజిట్కు ఆర్బీఐ అనుమతి!
కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సాక్షి, న్యూఢిల్లీ : ఏటీఎంల నెట్వర్క్ అయిన జాతీయ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్)లో భాగంగా ఇంటర్ ఆపరేబుల్ క్యాష్ డిపాజిట్ ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రతిపాదన చేసిందని, ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ద్వారా కొన్ని షరతులపై సూత్రప్రాయంగా ఆమోదం కూడా లభించిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఇంటర్ ఆపరేబుల్ క్యాష్ డిపాజిట్ కోసం చేసిన ప్రతిపాదనలపై లోక్సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఒక బ్యాంకు ఖాతాదారు ఇతర బ్యాంకుల క్యాష్ డిపాజిట్ మెషీన్ (సీడీఎంఎస్)లో జరిపే ఒక లావాదేవీకి రూ.49,999లు పరిమితి విధించినట్టు చెప్పారు. బ్యాంకుల్ని పటిష్టపరుస్తాం.. ప్రభుత్వరంగ బ్యాంకులను పటిష్టం చేయడంపై కేంద్రం దృష్టిని సారించిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. భారతీయ మహిళా బ్యాంకు సహా చిన్నతరహా బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే ప్రతిపాదనలపై ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గోకరాజు గంగరాజు, జ్యోతి ధృవే, భగవంత్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మరిన్ని అంశాలు... ⇒ ఒకప్పటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్సహా దాదాపు 14 సంస్థలపై కంపెనీల చట్ట నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ⇒ భారత్లో దాదాపు 8,354 విదేశీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఒక లిఖితపూర్వక సమాధానంలో మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. వీటిలో కొన్ని కంపెనీలకు గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా పన్ను బకాయిలు ఉన్నాయని, ఆయా కంపెనీలపై తగిన చర్యలు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతోందని ఆర్థికశాఖ సహాయమంతిర జయంత్ సిన్హా తెలిపారు. ⇒ కాగా మరో ప్రశ్నకు సిన్హా సమాధానం చెబుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధన మద్దతు కేంద్రం అందిస్తుందని వివరించారు. మార్కెట్ నుంచి సైతం నిధుల సమీకరణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ⇒ 2012 నుంచి రక్షణ రంగంలోకి దాదాపు 13 లక్షల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు రక్షణశాఖ సహాయమంత్రి రావు లలిత్జిత్ సింగ్ ఒక లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. -
పెట్రోల్, డీజిల్పై 50 శాతం పెరిగిన ఎక్సైజ్ వసూళ్లు
న్యూఢిల్లీ: పెట్రోల్, డిజిల్పై ఎక్సైజ్ సుంకాల వసూళ్లు గడచిన ఆర్థిక సంవత్సరం (2014-15)లో 50 శాతం పెరిగాయి. 2014-15లో ఈ సుంకాల వసూళ్ల మొత్తం రూ.74.5 కోట్లని లోక్సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. వేర్వేరుగా పెట్రోల్ విషయంలో ఈ మొత్తం రూ.22,424 కోట్ల నుంచి రూ.31,165 కోట్లకు ఎగసింది. డీజిల్కు సంబంధించి సుంకాల వసూళ్లు రూ. భారీగా రూ.27,146 కోట్ల నుంచి రూ.43,300 కోట్లకు పెరిగింది. ఆదాయాలను పెంచుకోవడంలో లక్ష్యంగా కేంద్రం పలు దఫాలు సుంకాలు పెంచడం దీనికి ప్రధాన కారణం. -
వడ్డీరేట్లు తగ్గుతాయి: కేంద్రం
న్యూఢిల్లీ: రుణ గ్రహీతలకు బ్యాంకులు వడ్డీ రేటును తప్పనిసరిగా తగ్గిస్తాయని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు తగ్గింపు నేపథ్యంలో సిన్హా ఈ ప్రకటన చేశారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని సైతం అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయానికి దోహదపడే పలు చర్యలను కేంద్రం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘బ్యాంకర్ల ప్రకటన మీరు చూసినట్లయితే, వడ్డీరేట్ల తగ్గింపు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తాయి. అయితే ఇందుకు వాటికి కొంత సమయం కావాలి. ఆర్థిక వ్యవస్థలో రాత్రికిరాత్రి ఏ పరిణామమూ చోటుచేసుకోదు. త్వరలో బ్యాంకుల రేట్ల కోత చోటుచేసుకుంటుంది’ అని జయంత్ అన్నారు. బుధవారంనాడు సిన్హా ఒక ప్రకటన చేస్తూ, ఆర్బీఐ రేట్లకోత నిర్ణయాన్ని స్వాగతించారు. ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు గణనీయంగా తగ్గుతాయనీ అన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే నిర్ణయంగా దీనిని పేర్కొన్నారు. -
ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిల విలువ ఇది... న్యూఢిల్లీ: గడచిన అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) ఏకంగా రూ. 1,06,170 కోట్ల మేర రుణాలను మొండి బకాయిల కింద రద్దు చేశాయి. పునర్వ్యవస్థీకరించిన రుణాల మొత్తం గడచిన మూడేళ్లలో రెట్టింపయ్యాయి. 2011-12లో రూ. 20,752 కోట్లుగా ఉన్న ఈ మొత్తం .. ఈ ఏడాది మార్చి నాటికి రూ. 44,447 కోట్ల స్థాయికి చేరింది. మొండి బకాయిలు పెరగడానికి ఆర్థిక వ్యవస్థ మందగమనం తదితర అంశాలు కారణమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం రాజ్యసభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, మార్చి 31 నాటి దాకా గణాంకాల ప్రకారం రూ. 25 లక్షలు పైగా బకాయిపడిన వారిలో 1,600 మందిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించినట్లు ఆయన వివరించారు. సమస్యను ముందుగానే గుర్తించేందుకు, సత్వరం దిద్దుబాటు..రికవరీకి చర్యలు తీసుకునేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణ వంటి విధానాలు, లోక్ అదాలత్ వంటి వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని సిన్హా పేర్కొన్నారు. అటు పోంజీ తరహా మోసపూరిత స్కీముల నిర్వాహకులను కఠినంగా శిక్షించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు సిన్హా తెలిపారు. సాధారణంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) లేదా ఉమ్మడి పెట్టుబడి పథకాలు(సీఐఎస్) రూపంలో ఇలాంటివి జరుగుతున్నట్లు ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో 55 కంపెనీలు సీఐఎస్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గుర్తించిందని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సొమ్ము వాపసు చేశాక, స్కీములను నిలిపివే యాలని 19 కేసుల్లో సెబీ తుది తీర్పునిచ్చింది. -
బీమా, బొగ్గు ఆర్డినెన్స్లకు రెడీ!
ప్రభుత్వం సంకేతాలు... నేడు కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్ ప్రతిపాదనలపై చర్చ! విపక్షాల ఆందోళనలతో బిల్లులను ప్రవేశపెట్టలేకపోవడమే కారణం.. న్యూఢిల్లీ: బీమా ఎఫ్డీఐలు, బొగ్గు రంగంలో సంస్కరణలను ఎలాగైనా అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా రాజ్యసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం లభించకపోవడం... పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది. అవసరమైతే ఆర్డినెన్స్ల ద్వారా ముందుకెళ్లాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ రెండు సంస్కరణలను అమలు చేసేందుకు వీలుగా ఆర్డినెన్స్లను తీసుకొచ్చే ప్రతిపాదనలపై అతి త్వరలోనే కేబినెట్ భేటీలో చర్చకు పెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సాధ్యమైనంతవరకూ బుధవారం(నేడు) ఈ సమావేశం జరిపే అవకాశాలున్నాయని కూడా ఆయా వర్గాల సమాచారం. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితి పెంపు విషయంలో అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యానించడం దీనికి బలం చేకూరుస్తోంది. ‘బీమా కంపెనీలకు విదేశీ దిగ్గజాల అనుభవం, నైపుణ్యాలు చాలా అవసరం. దేశ ప్రజలందరికీ బీమా ఉత్పత్తులు, సేవలను విస్తరించాలంటే భారీస్థాయిలో పెట్టుబడులు కూడా కావాలి. అందుకే ఈ బిల్లు విషయంలో సాధ్యమైనంతవరకూ విభిన్న ప్రత్యామ్నాలన్నింటినీ అన్వేషించాల్సిన అవసరం ఉంది’ అని సిన్హా పేర్కొన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. సభలో ప్రతిష్టంభన... దేశీ బీమా రంగంలో ఎఫ్డీఐల పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బీమా చట్టాల సవరణ బిల్లు-2008కి పార్లమెంట్ సెలక్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ) పెట్టుబడులు, ఎఫ్డీఐలు కలిసి మొత్తం పరిమితి(కాంపోజిట్ లిమిట్) 49 శాతానికి మించకూడదన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్కు కేంద్రం అంగీకరించింది. దీంతో కేబినెట్ కూడా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అయితే, మత మార్పిడులు, ఇతరత్రా అంశాలపై రాజ్యసభలో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఈ బిల్లును మోదీ సర్కారు ప్రవేశపెట్టలేకపోయింది. లోక్సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ.. ఎగువ సభలో తగిన మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు పాస్ కావాలంటే విపక్షాల మద్దతు తప్పనిసరి. ఇదిలాఉంటే.. బొగ్గు గనుల వేలం, పునఃకేటాయింపులకు సంబంధించిన బొగ్గు గనుల(ప్రత్యేక మార్గదర్శకాలు) బిల్లు-2014కు లోక్సభలో ఆమోదముద్ర లభించినప్పటికీ.. రాజ్య సభలో ప్రవేశ పెట్టడం కుదరలేదు. దీనికి కూడా సభలో నెలకొన్న ప్రతిష్టంభనే కారణం. ప్రతిపక్షాలు సృష్టించిన రాజకీయపరమైన దుమారమే రాజ్య సభ సమావేశాల్లో కీలక బిల్లులకు గండికొట్టాయని సిన్హా దుయ్యబట్టారు. బొగ్గు స్కామ్ నేపథ్యంలో 1993 నుంచి 2010 వరకూ జరిపిన 214 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీం కోర్టు తన తీర్పులో రద్దు చేయడం తెలిసిందే. దీంతో కేంద్రం వీటికి మళ్లీ వేలం వేయడం కోసం ఈ బొగ్గు బిల్లును రూపొందించింది. కాగా, వేలం ముసాయిదా నిబంధనల రూపకల్పనతోపాటు వీటిని కేంద్రం ఇప్పటికే ఖరారు కూడా చేసింది. వచ్చే ఫిబ్రవరిలో వేలానికి కూడా ప్రభత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే, దీనికి పార్లమెంటులో బొగ్గు బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారానైనా వేలానికి ఆటంకం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటులో విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా... బీమా, బొగ్గు సంస్కరణల విషయంలో వెనకడుగు వేయబోమని తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేయడం తెలిసిందే. -
ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి..
న్యూఢిల్లీ: ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం కట్టడిపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా సోమవారం పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2015-16లో దేశం 6 నుంచి 6.5 శ్రేణిలో వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే జయంత్ సిన్హా. వచ్చే రెండేళ్లలో రికవరీ: మూడీస్ ఇదిలావుండగా, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ లండన్లో తన త్రైమాసిక గ్లోబల్ మైక్రో అవుట్లుక్ను విడుదల చేసింది. వచ్చే రెండేళ్లలో భారత్ మంచి ఆర్థిక వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని ఈ నివేదిక వ్యక్తంచేసింది. అమెరికా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలు కూడా మెరుగుపడతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. మూడీస్ అంచనాల ప్రకారం 2014లో భారత్ వృద్ధి 5 శాతం. 2015లో మరింత పెరిగే అవకాశం ఉంది. రేటు తగ్గింపు అవకాశం: సిటీగ్రూప్: కాగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ తన పాలసీ రేటును ఒక శాతం వరకూ తగ్గించే అవకాశం ఉందని సిటీ బ్యాంక్ సోమవారం ఒక నివేదికలో తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి ఇందుకు దోహదపడే ప్రధానాంశమని సిటీగ్రూప్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ రోహినీ మల్కానీ పేర్కొన్నారు. -
హార్వర్డ్ నుంచి కేంద్ర కేబినెట్ దాకా....
తొలిసారిగా లోక్సభకు ఎన్నికైన బీజేపీ ఎంపీ జయంత్ సిన్హాను కేంద్ర మంత్రి వరించింది. 2014 ఎన్నికల్లో జార్ఖండ్ లోని హజారీబాగ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా కుమారుడైన జయంత్- పార్లమెంట్ నియమించిన రెండు కీలక కమిటీల్లోనూ సభ్యుడిగా ఉన్నారు. వాజపేయి హయాంలో తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జయంత్ రాజకీయ జీవితం ప్రారంభించారు. అనేక పథకాల రూపకల్పనలో తనవంతు సాయం అందించారు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు పూర్తి పేరు: జయంత్ సిన్హా జన్మదినం:1963 ఏప్రిల్ 21 జన్మస్థలం: గిరిదిహ్(జార్ఖండ్) వయసు: 51 తల్లిదండ్రులు: యశ్వంత్ సిన్హా, నీలిమా సిన్హా భార్య: పునీత కుమార్ సిన్హా పిల్లలు: కుమార్తె, కుమారుడు విద్యార్హత: ఐఐటీ(ఢిల్లీ), ఏంబీఏ(హార్వర్డ్ బిజినెస్ స్కూల్) పార్టీ: బీజేపీ రాష్ట్రం: జార్ఖండ్ నివాసం: హజారీబాగ్, ఢిల్లీ రాజకీయ జీవితం 1998-2002లో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు సహకారం 2014లో హజారీబాగ్ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నిక పార్లమెంట్ రెండు కమిటీల్లో సభ్యుడిగా నియామకం 2014 నంబర్ 9న కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం -
9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
-
9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
ఆదివారం మధ్యాహ్నం 1:30కి ముహూర్తం! గోవా సీఎం సహా 10 కొత్త ముఖాలకు చోటు శివసేనకు రెండు పదవులు ఖాయం టీడీపీకీ కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. కేంద్రంలో మే నెలలో అధికారం చేపట్టాక తొలిసారి చేపట్టనున్న ఈ పునర్వ్యవస్థీకరణలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సహా 10 కొత్త ముఖాలకు మోదీ తన కేబినెట్లో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు మంత్రుల శాఖల్లో మార్పుచేర్పులు చేయడంతోపాటు మిత్రపక్షాలైన టీడీపీ, శివసేనకు కూడా ఈ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులను మోదీ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేబినెట్ బెర్తుల కోసం శివసేన నుంచి ఇద్దరు ఎంపీల పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఇప్పటికే కోరినట్లు ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ఈ నెల 11 నుంచి మోదీ 10 రోజులపాటు మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల పర్యటనకు వెళ్తుండటం, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భూటాన్ పర్యటన ముగించుకొని శనివారం స్వదేశం చేరుకోనుండటంతో ఆదివారం మధ్యాహ్నం 1:30కి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మూహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా, హర్యానాకు చెందిన జాట్ నేత బీరేందర్సింగ్, హిమాచల్ప్రదేశ్కు చెందిన ఎంపీ అనురాగ్ ఠాకూర్, బీహార్కు చెందిన నేత గిరిరాజ్ సింగ్, రాజస్థాన్కు చెందిన కల్నల్ సోనారామ్ చౌధురి, గజేంద్రసింగ్ షెకావత్, మహారాష్ట్రకు చెందిన నేత హన్స్రాజ్ ఆహిర్ల పేర్లు మంత్రి పదవుల రేసులో వినిపిస్తున్నాయి. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన కొత్త సంస్థకు శివసేన నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభును అధిపతిగా నియమించి కేబినెట్ హోదా ఇవ్వొచ్చని తెలుస్తోంది. అలాగే ఆ పార్టీ నుంచి మరొకరికి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మంత్రి పదవి స్వీకరిస్తా: పారికర్ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు రక్షణశాఖను కేటాయించే అవకాశం ఉందన్న వార్తలపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఎట్టకేలకు మౌనం వీడారు. కేంద్రంలో బాధ్యత (మంత్రి పదవి) స్వీకరించేందుకు సిద్ధమేనని గురువారం పణజీలో ప్రకటించారు. ప్రధాని అప్పగించే ఏ బాధ్యతనైనా అంగీకరించాల్సిందిగా బీజేపీ చీఫ్ అమిత్ షా సూచించారని... అందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు పణజీలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. ‘‘రాష్ట్రం నుంచి కేంద్రానికి మారడం నాకు పెద్దగా ఇష్టంలేదు. ఎందుకంటే... గోవాపై నాకు అవ్యాజ ప్రేమ ఉంది. గోవాలో ఐదేళ్లపాటు పాలన సాగించాల్సిందిగా ప్రజలు తీర్పు ఇచ్చారు. పదవీకాలం పూర్తికాకుండా మధ్యలోనే వెళ్లడం సరికాదనేది నా భావన. కానీ దేశం నా సేవలు కోరుకుంటే ఆ బాధ్యత స్వీకరించాలని నా మనసు చెబుతోంది. అయితే గోవాకు నా సేవలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను అక్కడ ఉంటా’’ అని పారికర్ తెలిపారు. కాగా, పారికర్ శనివారం తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని... అదే రోజు ఆయన వారసుడి పేరును పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు ప్రకటించనుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అదే రోజు నూతన సీఎం ప్రమాణస్వీకారం కూడా ఉంటుందని చెప్పాయి. మనోహర్ పారికర్ వారసుడిగా గోవా సీఎం రేసులో ఆర్ఎస్ఎస్ మూలాలున్న ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్తోపాటు అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర ఆర్లేకర్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు బీజేపీ నేత ఒకరు చెప్పారు. -
10న కేంద్ర మంత్రివర్గ విస్తరణ?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గాన్ని ప్రధాని నరేంద్రమోడీ విస్తరిస్తున్నారనే వార్తలు దేశ రాజధానిలో జోరందుకున్నాయి. కేంద్రమంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాని మోడీ కలవనున్నారు. వచ్చే సోమవారం మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మనోహర్ పారికర్ తోపాటు, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జాట్ వర్గానికి చెందిన బిరేంద్ర సింగ్, మహారాష్ట్ర నుంచి హన్స్ రాజ్ ఆహిర్, బీహార్ కు చెందిన గిరిరాజ్ సింగ్, యశ్వంత్ సిన్హా కూతురు జయంత్ సిన్ఫాలకు కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకునే కనిపిస్తోంది. ఇప్పటికే మనోహర్ పారికర్ కు కేంద్ర రక్షణ శాఖ కట్టబెడుతున్నారంటూ వార్తలు బుధవారం మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
కేంద్ర రక్షణ మంత్రిగా మనోహర్ పారికర్?
-
కేంద్ర రక్షణ మంత్రిగా మనోహర్ పారికర్?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనకు ముందు కేంద్ర కేబినెట్ ను విస్తరించే అవకాశాలున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. గోవా సీఎం మనోహర్ పారికర్ ను రక్షణ మంత్రిగా నియమించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదనంగా రక్షణ శాఖను నిర్వహిస్తున్నారు. అనారోగ్యం కారణంగా రక్షణ శాఖను మరొకరికి కేటాయించాలని ఆయన కోరుతున్నారు. ఈనేపథ్యంలో పారికర్ ను రక్షణ మంత్రిగా నియమించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా, చంద్రపూర్ బీజేపీ ఎంపీ హన్స్రాజ్ అహిర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీలకు విస్తరణలో మంత్రి పదవులు దక్కే అవకాశముంది. సహాయ మంత్రులుగా ఉన్న ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ లకు కేబినెట్ ర్యాంకుకు ప్రమోషన్ దక్కే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ 12న మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 9-12 మధ్య కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముందని అంటున్నారు.